Sunday 21 May 2023

 


చదివింది గురుకులం 

అభ్యసిస్తే అభ్యాసకులం 


బోధిస్తే బోధకులం

వృత్తిరీత్యా అధ్యాపకులం


పత్రికల పాఠకులం

నేర్పించే శిక్షకులం


కొందరితో ఉంటే సామాజీకులం

అందరితో ఉంటే అనేకులం


ఫలానోల్ల కుటుంభీకులం

ఆ వంశ సంబంధీకులం


మేం ధనముంటే దనికులం 

లేకుంటే బీదకులం


దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం

నమ్మకుంటే నాస్తికులం


మేమే..


నాగరికత నేర్పిన నాగరికులం

జాతకాలు నమ్మే అమాయకులం


మూఢత్వంపోని మూర్ఖులం..!

మేమే మేమే.. సమానత్వ సాధకులం


మతాలను గౌరవించే లౌకికులం

ఎల్లలు లేని దేశ ప్రేమికులం..


మేమే..


కష్టపడే కర్షకులం

నిరంతర శ్రామికులం


పరిశ్రమించే పారిశ్రామికులం

కర్మాగారాల్లోని కార్మికులం


నిజాలు చెప్తే వాస్తవికులం

చెప్పకుంటే అపద్దీకులం


మేమవుతాం కొందరికి పూర్వీకులం

మరికొందరికి సమకాలికులం


ప్రస్తుత వర్తమానికులం

కొందరికి స్ఫూర్తిదాయకులం 


మరికొందరికి మార్గదర్శకులం

 మేం మార్పు కోరే పరివర్తకులం


వినూత్న ఔత్సాహికులం

కొత్త కొత్త ప్రయోగకులం 


సరికొత్త ఆవిష్కర్తకులం

వ్యాపారాలు చేసే వర్తకులం


సంస్థల,సంఘాల వ్యవస్థాపకులం

మేం పరిపాలిస్తే పాలకులం


పాలించబడితే ఎలీకులం

వంచిస్తే వంఛకులం


పంచుకుంటే భాగస్వామికులం

మొత్తానికి బాల్యంలో చిగురుటాకులం


కుర్రతనంలో బాకులం

యవ్వనంలో చాకులం


మధ్య వయస్సులో మేకులం

చరమాంకంలో రేకులం


రాలిపోయే ఆకులం 

విదేశాల్లో మేము ఒకే దేశకులం


పక్క రాష్ట్రాల్లో మేము ఒకే ప్రాంతీకులం

పరబాషల వారికాడ ఒకే భాషకులం


ఒకే భాష వారికాడ ఫలానా యాసకులం

మొత్తానికి అవుతాం ఈ దేశంలో ఏదో ఒకకులం


 నిత్యం కులం పేరుతో తిట్టుకుంటాం,

కొట్టుకుంటాం , కానీ బేధాలెన్ని ఉన్నా,

నిలబెట్టుకుంటాం మా దేశాన్ని ,


 ఎందుకంటే ........ !

మేమే భరత జాతి వంశీకులం..

భావి భారత రథసారథికులం...


భావుకతకు 

****

నేటి బ్రహ్మజ్ఞానము .. ప్రాంజలి ప్రభ .. 111

సేకరణ రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

 

అవమానాలు, దూషణలు, అహంకారాన్ని గాయపరచక మానవు. అయితే ఈ రెండూ జ్ఞాని దృష్టిలో, దూషించేవాని మనస్సులో కదిలే రెండు రకాల భావనా వీచికలు మాత్రమే! 


సంతోషంతో నిండిన మనస్సులోంచి పొగడ్తల వంటి మంచి శబ్దాలు వస్తాయి. క్రోధ విచారాలతో ఈర్ష్యతో నిండిన మనస్సు నుండి తిట్లు అవమానాలు ఉదయిస్తాయి.

 వస్తుతః రెండూ కూడా మనోవికార జనిత భావాలే! భావనాధారంగా ఆత్మ చైతన్యంగా తన్ను తాను తెలుసుకున్న జ్ఞాని భావాల క్రీడ అని శాంతంగా సమదృష్టితో వీక్షిస్తాడు.

 సాధారణంగా మనలోని అహంకారమే బుద్ధితో తాదాత్మ్యం చెంది ఎదుటివారి మాటల అర్థాన్ని గ్రహించి సంతోష విచారాలను అనుభవిస్తూ ఉంటుంది.

 ఆత్మతత్త్వాన్ని అర్థం చేసుకుని అహంకారపు మాయను జయించిన ధీరుని, మానావమానాలు ఏం చెయ్యగలవు? రెండూ అదే చైతన్యంలో ఉద్భవించి నర్తించి నమస్కార సూచకమైన మౌనంతో పాదాభివందనం చేసి అదృశ్యమయిపోతాయి.

ఒకసారి బుద్ధభగవానుడు బజారులో నుండి శిష్యసమేతంగా వస్తూ ఉన్నాడు. ఒకవ్యక్తి 

ఆయనను సమీపించి దూషించి అవమానించడం మొదలు పెట్టాడు. అన్నిటినీ శాంతంగా వింటూ భగవానుడు నిలబడ్డాడు. 

అవన్నీ పూర్తయిన తరువాత ఆదే శాంతంతో ఆయన ముందుకు సాగబోతుంటే ఆయన శిష్యుడు అపరిమితమైన ఆవేశంతో 'స్వామీ ఆ నీచునికి బుద్ధి చెప్పి వస్తాను అనుజ్ఞ " నీయండి, దైవస్వరూపులయిన మిమ్మల్ని అన్ని మాటలన్న అతడు క్షమార్హుడు కాడు" అన్నాడు. అందుకాయన చిరునవ్వుతో "వత్సా! అతడన్న మాటలన్నిటిని నేను విన్నాను కాని, స్వీకరించలేదు. 

అందుకే నేనతనికి తిరిగి యివ్వవలసిందేదీ లేదు. ఒకవేళ నీవు స్వీకరించి ఉంటే తప్పకుండా వెళ్ళి బదులు తీర్చి రా నాయనా' అన్నారట. బుద్ధితో సాధించగలిగిన పూర్ణత్వం ఇదే. దీనినే సమబుద్ధి అంటారు.

ఆత్మజ్ఞానికి తన చైతన్యమే భావనా తరంగాలుగా సర్వత్రా నర్తిస్తూందనే సత్యం సర్వదా స్ఫురిస్తూనే ఉంటుంది. చూడబడే, గుర్తింపబడే సర్వమూ తన నర్తనలే అని అతడికి స్పష్టంగా తెలుసు. 

అహంకారంలేని కారణంగా, మనో బుద్ధులతో తాదాత్మ్యం చెంది, సంఘటనలను యిష్టాయిష్టాల దృష్టితో చూడడు. మానఅవమానాలతనికి సమానమే. దేనిపైనా అతనికి ఆకర్షణా వికర్షణా ఉండవు. 

సర్వత్రా, సర్వదా, సర్వ సంఘటనలలోనూ, చైతన్యమయిన తానే భావనా తరంగాలుగా నర్తించడాన్ని గుర్తిస్తూ మౌనసమయ మాధురీపూర్ణ మానసంతో శాంతుడై ఉంటాడు!

ప్రతి స్ఫురణము లేక స్పందన లేక కంపమునకు హేతువు అగు మహాశక్తి మాయ- దైవము.

ప్రతి చలనము నకు  కావలసిన చలన శక్తి- దైవము.  ప్రతి తేజమును  వీక్షించు  చూపు  అనే కాంతి లక్ష్మి- దైవము.   ప్రతి మాటలోని  శబ్ధబ్రహ్మము-దైవము.

ప్రతి హృదయములోని జాగరూకమైన ప్రాణము- దైవము.  ప్రతి శిరస్సు అందలి 

ధ్యానము- దైవము.  ప్రతి చూపు లో ప్రకాశము- దైవము ప్రతి మూలాధార చక్రమున 

జ్వలించునది-దైవము.

***

శీర్షిక:-నాకు నేనే -- ప్రాంజలి  ప్రభ  (వ్యాసం)  --1  

*********

నిలదీసే తత్వాన్ని నిద్రపుచ్చకు, రాజీపడే తత్వాన్నిచేరనీకు, నిజాన్ని నిర్భయంగా తెలుపుట మరువకు, దేశ భక్తి , మాతృభాష రక్షణ, నరనరానికి ఎక్కించుకొన్నాక, తల్లి లేరు తండ్రి బంధువులు అసలే లేక, బాధ్యత క న్నా భయమే తోడు రానీక, చేయనెంచ దలచినది నిర్భయంగా, నిస్వార్ధంగా, నిర్ణయ పరంగా, హృదయం ఒక యంత్రంగా, విద్యుత్తై ఆయుధంగా, కనబడని గాలిలాగా దూసుకు పోయే ఇంధనంగా సేవలకై నిత్య ప్రయత్నం.           

దేహమంతా ఆవహించి చిన్ని గుండెలో తిష్టేసింది ఆ ఉదయాన..!!

తప్పు చేయకున్నా, తప్పించుకునే దారులు వెతకకున్నా, వెతుకులాటలో  వ్యక్తిత్వం చూపే హృదయమున్నా, రుధిరం చిందించకుండా, సమయం వ్యర్ధ అవ్వకుండా,  దొడ్డి దారి లోకి దూర కుండా, నిర్మలమైన మనస్సుతో, నవ్వులమ్మ మొగం చూపిస్తూ, సర్వం నిగ్రహించె 

హృదయాంతరంగాన. తిష్టేసింది ఆ ఉదయాన..!!. 

నిత్యం నీళ్ళు పోసి పెంచిన సహజత్వం పూలమొక్కల వంటి ఎదుగుతున్న యువక వర్ధమాన శక్తి, వాడిపోయే వారికి చేయుట నిచ్చే శక్తి, మొగ్గలుగానే రాలిపో కుండా పులా పరిమాళాలను అందించేవిధముగా  వికాసం కల్పించే శక్తి యువరక్తం, వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు,       

నడవడిక రాజమార్గాన.తిష్టేసింది ఆ ఉదయాన..!!.

నేరమొకడు చేసి శిక్షను  వేరొకరి కేసిన, నోరు మెదపని ప్రజానీకం చుస్తే ఏమనాలో నాకు మాత్రం తెలియలేదు, ఇటువంటి పిరికి బందల మనస్సు మార్చాలని నా ప్రయత్నం,     

ఆలవాలమై ఆలనాపాలనా లో అబద్రతా భావ ఆనవాళ్లు అడుగడుగునా ధనమదం, అధికార జులం, రక్షక భటుల అగమ్య గోచరం, మార్పు రావాలని  తిష్టేసింది ఆ ఉదయాన..!!.

మొలకెత్తి  నిలకడ తత్వం లేని మానవత్వం, పెరిగి పోతున్నా న్యాయ వాద రాజనీతి చదరంగం ఆటలు వెల్లువ ప్రజలకు నిదుర కరువైంది, ఆకలి మొదలైంది, మందుల మోసం ఎగసి పడుతున్నది, నకిలీ విత్తనాలు బాజారులో అమ్ముడవుతున్న పట్టించుకోని ప్రభుత్వాలు, కేవలము సంపాదన, సంపాదనా గుప్పెడు అన్నాని కోసం కోట్లు దాచటం తిష్టేసింది ఆ ఉదయాన..!!.         

నన్ను నేను హింసించుకుంటు అనారోగ్యాన్ని ఆహ్వానించక, ధైర్యాన్ని ఊపిరిగా వివరించి, స ర్వే జనా సుఖినోభవంతు అంటూ నిలకడ లేని నా ప్రయాణం సాగిస్తూ, మనశ్శాంతి  ఎక్కడ ఎక్కడ అంటూ ధర్మాన్ని రక్షించ దలిచాను మనసా, వాచా, కర్మణా, నిరీక్షనా జీవితం తిష్టేసింది ఆ ఉదయాన..!!. 

మనఃపూర్వక  భావవ్యక్తీకరణ మౌనం వహించక భాషలో  అసహనం అపసృతులు తాండవించకుండా, మనసుకు బుద్ధి కి మద్య వైరుధ్యాల యుద్ధాలు సహజమైన, దాని భావాల్ని ఉత్తేజ పరచడానికి నిర్విరామ కృషిగా నిత్యం చేస్తూనే వున్నాక సత్యం ఎక్కడ లోన ఈ లోకానా తిష్టేసింది ఆ ఉదయాన..!!.  

చేతకాని తనమో, కాదు కాదు చేవలేని తనమో అన్న మాటలకూ తలఒగ్గకుండా ప్రశ్నించలేని  అస్తిత్వాన్ని కోల్పోక స్థిరత్వాన్ని నిలపడానికి శ్రావ్య శక్తులను ప్రజ్వలింప చేయ గలను, నిస్సహాయుడను కాను ఒక్కడినే అయినా తోడు రాక పోయినా ఎంత మంది ఉన్న గమ్యాన్ని మార్చను, ఆలోచనలను ఆచరణకు త్రికరసిద్ధిగా ప్రయాణాలు సాగె వారికీ చే యూత నివ్వ గలను అదే నా లక్ష్యం , నా ధ్యేయం, నా కర్మలు చేయు మర్మం,  తిష్టేసింది ఆ ఉదయాన..!!.  

అస్తవ్యస్తంగా మారిన జీవనశైలిలో స్థిరత్వం శిధిలమై పోకుండా,   అంతరంగమంతా ఆత్మ తత్వంగా ప్రశ్నలే ప్రశ్నలు జవాబులు తెలియపరుస్తూ హృదయాంతరాలలో జీవిస్తూ,  

జవాబు దారి తనాన్ని అందరికి అందిస్తూ,  ఎడారి చేసిన మార్గాన్ని పరిశీలించి పునర్ నిర్మిస్తూ 

రాజీ ధోరణిలో  నన్ను నేను కోల్పోక జీవశ్చవంగా కనిపించక నిర్ణయాలన్ని ఆ భగవంతుడు చేయిస్తున్నాడని భవిస్తూ నలుగురికి సేవలు చేస్తూ ఆ హనుమంతుడ్ని ప్రార్ధిస్తూ నాగమ్యం పూల బాటగా మార్చుకోవాలని ఈ ప్రయత్నం అందుకే తెలుగును రక్షించు కుందా, పరభా షను తరిమేద్దాం ఓం శ్రీ రామ  శ్రీ మాత్రే నమః  తిష్టేసింది యీ ఉదయాన..!!.       

*******

  🌷శుభమస్తు🌷        🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏


సూనున్ శాంతగుణప్రధాను నతి సంశుద్ధాంచితజ్ఞాను న
జ్ఞానారణ్య కృశాను నంజలిపుటీ సంభ్రాజమానున్ సదా
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద నా
ధీనున్ ధిక్కరణంబుజేసి పలికెన్ దేవాహితుం డుగ్రతన్.

భావము:- ఆ ప్రహ్లాదుడు మహాశాంతమూర్తి, గొప్ప గుణవంతుడూ; బహు పరిశుద్ధమైన జ్ఞానం అనే సంపదకు గనిలాంటి వాడు; అజ్ఞానం అనే అరణ్యానికి అగ్నిలాంటివాడు; నిరంతరం చేతులు జోడించి మనసులో పరంధాముని పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండేవాడు; అటువంటి సకల సద్గుణ సంశీలుడిని కన్న కొడుకును ధిక్కరించి, కోపించి; విబుధవిరోధి యైన హిరణ్యకశిపుడు ఇలా విరుచుకుపడ్డాడు.

   ఏనాడైనను వినయము
   మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ 
   బూనకు మసమ్మతయు బహు
   మానమునను బొందు మిదియె మతము కుమారా!

ఓ కుమారా! ఎన్నడునూ వినయ స్వభావమును వీడరాదు. ఈర్ష్యా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు. పేదవారి కోపం పెదవికి చేటు అనే నానుడిని మన
స్సునందుంచుకొని మెలగుము.అట్లు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలబ్బును. సన్మానాలు జరుగును.

దినముం చిత్తములో సువర్ణముఖరీ తీరప్రదే శామ్రకా
నన, మధ్యోపరివేది కాగ్రమున, నానందంబునం పంకజా
సననిష్ట నిన్ను జూడగన్న నదివోసౌఖ్యంబు లక్ష్మీ విలా
సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీ కాళహస్తీశ్వరా! 

తా:-  శంకరా! సువర్ణముఖీ నదీతీరం దగ్గరి మామిడితోటలోని రాతిఅరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న నిన్ను, ప్రతిరోజూ మనసులో చూడగలిగితే, అదే ఆనందం, అదే సౌఖ్యంగానీ చంచలస్వభావం గల లక్ష్మీదేవి చూపు నటనలు (ఒకసారి అనుగ్రహించుట, ఒకసారి తిరస్కరించుట అను భిన్న భావములు) సౌఖ్యం కలిగించునా?

కనబడెడు సూర్యచంద్రుల 
నిను,నన్నున్, సర్వజగము, నేర్పున సృజియిం 
చిన పరమేశ్వరుడొక్కరు ,
డనయము కలడని యెఱుంగుమయ్య; కుమారా!

ఆస్థా స్వాస్థ్యే యది స్యాతాం మేధయా కింప్రయోజనం
తే ఉభే యది స్యాతాం  మేధయా కింప్రయోజనం

ఆసక్తి, ఆరోగ్యము యివి రెండూ వున్నచో ఎక్కువ తెలివితేట లక్కరలేదు. అవి రెండూ లేనట్లయితే తెలివితేటలు ఎంతవున్నా    ప్రయోజనము లేదు. అనగా 
ఆసక్తివుండి,ఆరోగ్యము వుండి పట్టుదలతో ప్రయత్నించిన చో ఎట్టి కార్యమైననూ నెరవేర్చగలరని భావము.

అప్పు దీయ రోత హరిహరాదుల కైన
మొప్పె తోడ మైత్రి మొదలె రోత 
తప్పుబలుక రోత తాకట్టిడిన రోత 
విశ్వదాభిరామ వినురవేమ !

   తా:-- అప్పు చేయడం హరిహరాదుల కైనా పనికిరాదు.రోత కలిగించును. చెడ్డవాడితో స్నేహము కూడా అంతే, తప్పుడు మాటలు మాట్లాడుట, సొమ్ము తాకట్టు పెట్టుట మొదలైనవన్నీ చేయరాదు.

శారద నీరద వర్ణా
సారసభవ చక్రపాణి శంకరవినుతా
కీర మనోహర హస్తా
భారతి! నీ పాదపద్మ భజన మొనర్తున్

*పాలించవే నన్ను పద్మసంభవు రాణి  బహుశాస్త్ర పుస్తకపాణి వాణి
కరుణించవే నన్ను గలహంస గామినీ కోరి మ్రొక్కెద నీకు గీరవాణి
రక్షించవేనన్ను రాజబింబాననా దయ గావవే సర్వధవళ వర్ణ
మన్నించి నీవు నా మదిలోన నుండవే మాధవు కోడలా మదను వదినె

   నిన్ను నెప్పుడు సేవింతు నీలవేణి
   నన్ను గృపజూడు మెప్పుడు నళిన నేత్రి
   భారతీదేవి నా జిహ్వ బాయకుండు
   శరణులోకైక వినుతాంబ శారదాంబ

పెట్టక కీర్తి రాదు వలపింపక యింతికి యింపు లేదు తా
దిట్టక వాదులేదు కడుధీరత వైరుల సంగరంబులో
కొట్టక వాడ లేదు కొడుకొక్కడు పుట్టక ముక్తి రాదయా
పట్టపు రాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ

పట్టుచుఁదండ్రి యత్యథమువర్తనుఁడైననుగాని వానికిం
బుట్టిన పుత్రకుండ తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుఁడౌ
నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయు గొంచెము దానబుట్టునా
చెట్టు మహోన్నతత్వమును జెందదే శాఖలనిండి భాస్కరా!

తాత్పర్యం: భాస్కరా! మర్రిచెట్టు విత్తనము చిన్నదైననూ దాని నుండి పెరిగిన వృక్షము శాఖోపశాఖలుగా మహావృక్షమగును. అలాగే తండ్రి నీచప్రవర్తన గలవాడైననూ వానికి పుట్టిన కుమారుడు తన పూర్వపుణ్యాన గొప్పవాడుగా కావచ్చని భావం.

వేద మూల మిదం జ్ఞానం  
భార్యా మూల మిదం గృహం 
కృషి మూల మిదం ధాన్యం 
ధన మూల మిదం జగత్ 

అర్థము:-జ్ఞానానికి మూలము వేదము, గృహానికి మూలము భార్య, కృషి (వ్యవసాయము)కి మూలము ధాన్యము, ఈ జగత్తుకు మూలము ధనము.

పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం 
ఉపదేశో  హి మూర్ఖాణాం  ప్రకోపాయ న శాంతయే 

అర్థము:-- పాముకు పాలు ఎంత పోసిననూ అది దాని కోరలలోని విషము వృద్ధి చెందును. అట్లే మూర్ఖునకు మంచిని బోధించ ప్రయత్నము చేసినచో వాని కోపము,కక్ష పెరుగునే కానీ మంచి దారికి రాడు.

***
వివాహ సంభంద విచిత్రాలు - ఇనప బెండకాయ?

పెళ్లి చూపులలో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. చూడబోతే వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడట్లే వున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగులు. పెద్ద జీతాలు. 

ఎన్ని అనుకున్నాకన్యాదానం చేయవలసింది పిల్ల తండ్రి కాబట్టి అందరం అనగా ఆయన పిల్లతో సహా,  అందరం ఆయన వంక చూసాము. 

అయన అప్పటికే వీర గంభీర ముద్రలోకి ప్రవేశించి వున్నాడు.

"అబ్బాయితో కొంచెం మాట్లాడేది వుంది" అని అభిప్రాయం వ్యక్తం చేసాడు. 

అలాగే మాటాడండి అని పిల్లాడి తల్లి అన్నది.  

ఇక్కడ కాదు, అలా డాబా మీదకు వెళ్లి మాటాడుకుంటాం అని అయన పిల్లవాడిని తీసుకొని డాబా మీదకు వెళ్ళాడు. 

ఇదో కొత్త పోకడ కాబోసు అని మేము సరిపెట్టుకున్నాము.  

వారు అరగంట తరువాత కిందకి తిరిగి వచ్చారు. 

సంభందం - భజ గోవిందం అయిందని మాలో ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యింది. అందరం నిరుత్సాహంతో బయట పడ్డాము. ఉత్సాహం కోసం లిమ్కా లు తాగాము. 

నేను ఇరువురికి బాగా పరిచయం వున్నా వాడిని, పైగా ఈ సంభందం ఇక్కడి వరకు తెచ్చిన వాడిని కూడా. ఆయనది నాదీ ఒకే ఆఫీస్ కూడాను. 

మీరు ఏమి మాట్లాడుకున్నారు అని  పిల్లవాడిని ఎంతో అడిగి కూడా సంభందం ఎందుకు బెడిసింది కనుక్కోలేక పోయాము. 

వాళ్ళు చివరి ప్రయత్నంగా నాతో "విషయం ఏమిటో తెలుసుకుందాము. ఇకముందట జాగర్త పడవచ్చు. మీరు అడిగి తెలుసుకొని రండి" అని నన్ను బ్రతిమాలారు. 

ఆ బ్రతిమిలాటకు లొంగి కొంతా, ఏమిటో తెలుసు కుంటే ఎందుకైనా మంచిది అని కొంతా అలోచించి నేను పిల్ల తండ్రిని ఆయన తీరికగా వున్నప్పుడు మా ఆఫీసులోనే కదలేసాను. 

అయన పేరు పురుషోత్తమ దాస్ రూప్ చెందు జ్ఞ్యానేంద్రు. పేరు ఎట్లావున్నాగాని అయన, అచ్చం మనవాడే. 

పురుషోత్తం దాసు గారు ఇలా అన్నాడు.  

"పిల్ల వాడు  చదువుకి సంబంధించని ఎన్నో పుస్తకాలు చదివినట్లు తెలుసుకున్నాను. లోకజ్ఞనం, సొంత తెలివి, మనో వికాసం  కోసం ఆ బుక్స్ చదివాడుట. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకం కూడా లేని   లైబ్రరీ ఇంట్లో ఉందట. మీరు భగవత్ గీత చదివారా అని అడిగితే,అది ఆధ్యాత్మిక గ్రంధం కాదు జ్ఞ్యాన భాండం" అని దాని గొప్పని  గురించి మాట్లాడాడు. అతడి మనసు బాగా వికాసం చెంది వుంది. మేము అల్లుడి  మర్యాదలు చేసినపుడు పొంగిపోయి మాఇంట్లో బోర్లా పడే మనిషి కాదు. అల్లాగే మేము అతని మీద నిరసన వ్యక్తం చేయటానికి అని అతన్ని చిన్న చూపు చూస్తే, కుంగి పోయి మా దారికి వచ్చే మంచి  మనిషి కూడా కాదు. దేనికైనా ఉక్కు కడ్డీలా స్థిరంగా వుండే మనిషి అనిపించింది. అతని ముందు ఎవరి పప్పులూ ఉడకవు. ఫదిమంది ఫ్రెండ్స్ సర్కిల్ కి ఇతడే నాయకుడట. ఆఫీసులో కూడా సొంత నిర్ణయాలను తీసుకొని ఆ  నిర్ణయాలను చక్కగా  అమలు పరుచుకో గలుగుతాడుట! అంటే కొండను ధీ కొట్టే అంత  సాహసం వున్నవాడు. ముక్కుసూటి మనిషి అని తెలుస్తోంది. తల్లి తండ్రులంటే భక్తీ వినయం వున్నాయి. పిల్లాడికి జ్ఞ్యానం మరీ ఎక్కువగా వుంది. పెళ్లి తరువాత తల్లి తండ్రులని ఎలా చూడాలి వాళ్ళని ఏమి చేయాలి అన్నది కూడా ప్లానింగ్ చేసి పెట్టుకున్నాడు. 

"ఇల్లాంటి ఆదర్శ పురుషుడికి నా పిల్లనిస్తే నాకేమి ప్రయోజనం? అల్లుడు అంటే అట్టు మీద ఉల్లి పాయలాగా, పులుసులోకి ముక్కలాగా, చెట్టునున్న చిక్కుడు కాయలాగా, కొమ్మకున్న కరేపాకు రెమ్మ లాగా, మనం ఏమనుకుంటే దానికి పనికొచ్చ్చేట్లు ఉండాలి. ఏపని చెపితే ఆ పని గురించి తర్కించకుండా ప్రతి పనికి "వూ" కొట్టేవాడై  ఉండాలి. వాళ్లకు పెళ్లి కావాల్సిన పిల్లాడిని పెంచే విధానం తెలీదు. పిల్లాడిని మంచి వ్యక్తిత్వంతో, స్థిరమైన సొంత భావాలతో పెంచారు. అలా సొంత వ్యక్తిత్వం వున్న అబ్బాయి అంటే ఇనప బెండకాయ లాంటి వాడు. మాకు పెళ్లి పులుసులోకి పనికి రాడు" అని తేల్చి చెప్పాడు. 

ఇది చదివి సంతోషించిన వారు సంతోషించగా, స్వర్గీయులు శ్రీ  కొడవటి గంటి కుటుంబరావు గారని ఒక ప్రముఖ రచయిత, ఇది చదివి స్వర్గంలో కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయనకు నా క్షమాపణలు.
***

Friday 19 May 2023

 


01*తెలుగు చిత్రం, భళారే విచిత్రం!* 
_వారణాసి సుధాకర్_

చిత్తూరు నాగయ్య గారి కాలంనాటి సినిమాల్లో దేశభక్తి, దైవభక్తి లాంటివి చూపించడం పెద్ద సక్సెస్ ఫార్ములా కాబట్టి, మొదటి రీలులోనే అయిదారు చరణాల భక్తి పాట పాడి, యింటిల్లిపాదీ కలిసి,  దేవుడి పూజచేసి, మనందరికీ హారతి చూపించి, ప్రసాదం మాత్రం...వాళ్ళే తినేసేవాళ్ళు.

తరవాత రీళ్ళలో నాగయ్య గారి సంగీత విభావరి మస్టు. హీరోయిన్లు..నాటి దేశ, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, అప్పటి సమాజ కట్టుబాట్ల కి తలవంచి, వీలయినంత వరకు, తలుపు చాటు నుంచి చూపులతోనే శృంగారం ఒలికించేవాళ్ళు. విలన్లు కూడా...క్రూర చూపుల బాణాలే సంధించేవాళ్ళు తప్ప, హీరోయిన్లని ముట్టుకునేవాళ్ళు కాదు.

మధ్య మధ్యలో గాంధీ - నెహ్రూ లను, మన జాతీయ జెండాని దేశభక్తి  చిహ్నంగా చూపిస్తే, మేవందరం చప్పట్లు కొట్టేసేవాళ్ళం. అదంతా....ఒక పాతరాతి యుగం !

తరవాత్తరవాత, రామాయణ, భారత భాగవతాల్లాంటివి చూపిస్తే, అన్ని తరగతుల వాళ్ళూ వస్తారని, నేల క్లాసు పామరులు, బాల్కనీ క్లాసు పండితులూ కూడా చూస్తారని, కాస్త వాక్సుద్ధి, స్ఫురద్రూపం ఉన్నవాళ్ళని ఏరి - కోరి తీసుకొచ్చి పెట్టి, వాళ్ళ తడాఖా చూపిస్తే, వాటిని ఒకటికి పది సార్లు చూసి, మా తడాఖా మేం చూపించేవాళ్ళం.

మాయాబజార్ సినిమాని, ఎన్నోసార్లు మేము చూసిన డబ్బులతోనే, విజయా వాళ్ళు, మెడ్రాసు లో 'విజయ హాస్పిటల్' కట్టుకున్నారని చెప్పుకునేవాళ్ళం !
అంతకు ముందు యింట్లో ముసలమ్మలు చెప్పిన భారత - రామాయణ పురాణ పాత్రల్ని ఊహించుకుని,ఫోటోలకి దణ్ణం పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పురాణ పాత్రల్ని పేద్ధ తెర మీద మూడుగంటల పాటు చూసి, చూసి, ఎన్టీ వోడికే దణ్ణం పెట్టడం అలవాటైపోయి, కాంతారావుగా పుట్టిన నారదుడు, నిజంగానే మేఘాల మధ్యలోంచి తేలివచ్చి, పాట పాడుతున్నాడనుకుని, ఆయనక్కూడా ఓ దణ్ణం పడేసేవాళ్ళం.

మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మెడ్రాసు వెళ్ళి వచ్చినట్టు తెలిస్తే, 'సినిమా వాళ్ళు ఎవరైనా కనపడ్డారా?' అని కుశల ప్రశ్నగా అడిగేవాళ్ళం. ఎందుకంటే, మెడ్రాసు వీధుల్లోను, మెడ్రాసు సెంట్రల్ స్టేషన్ చుట్టూరా తిరిగేది వాళ్ళే కదా అని మా ఉద్దేశం.

సినిమా వాళ్ళని చూసిన వాళ్ళు....
'ఎంత పుణ్యం చేసుకుని పుట్టారో ' అని తెగ ముచ్చట పడిపోయేవాళ్ళం. ఇంక ఆపురూపమైన సినిమా వాళ్ళు ఎప్పుడైనా  కనపడినా, వాళ్ళని మనం ముట్టుకున్నా, యింటికి వచ్చాక కూడా ఆ పులకరింత తగ్గేది కాదు. పదేళ్ళపాటు అందర్నీ పిలిచి మరీ చెప్పుకునేవాళ్ళం.

క్లాసు పుస్తకాల్లో సతీ అరుంధతి, సతీ సుమతి, సతీ అనసూయ వగైరాల కధలు చదివీ...చదివీ...
మగాళ్ళకి వర్తించని 'సతీ' బిరుదుల కోసం,  'వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా, వీళ్ళు వాళ్ళనే ఆరాధిస్తూ, అన్ని కష్టాలు పడ్డం ఎందుకో ' అని మనసులో రహస్యంగా అనుకుంటుంటే, సతీ సావిత్రి, సతీ జమున, సతీ అంజలి లాంటి సినిమాలు తీసి, మా అనుమానాలు నివృత్తి చేశారు. యధాశక్తి వాటినీ పోషించాం. (బహుశా ఇప్పుడెవడూ అలాంటి సినిమాలు తీసే సాహసం చెయ్యడు.)

మలి దశలో...మూడు గంటల పాటు మనల్ని అలరించడానికి, హీరోయిన్ చేత ఒక సుశీల బ్రాండు పాటతో, పూజ.. లేక వ్రతం చేయించి, ఆవిడ ఇంట్లో అందర్నీ నిద్ర లేపి, ప్రసాదం పంపిణీ చేశాక, మడి బట్టలు మార్చుకుని, రకరకాల చీరలతో... కొన్ని డ్యూయెట్ లు హీరోతో పాడగా, వాటిలో బాగున్న ఒక పాటని విషాద యోగంలో ఏడుస్తూ మళ్ళీ పాడించి, ఆ కొంపలో ఉన్న ఎవళ్ళో ఒకళ్ళని చంపితే తప్ప, కధ రక్తి కట్టదని, అప్పటి దాకా దగ్గుతోనే సరిపెడుతున్న తల్లిదో, తండ్రిదో, లేక వయసుకి మించిన ముది కబుర్లు చెప్పి, ముద్దులొలికించిన పిల్లదో... మరణం కళ్ళారా చూపించి, అంతిమ సంస్కారాలు ఎలా చెయ్యాలో మనకి నేర్పించి,'ఆ నలుగుర్నీ' పురమాయించి, వీలయితే, ఘంటసాల చేత, "అమ్మా...వెళ్ళిపోతున్నావా... తిరిగి రాని లోకాలకు, పది మాసాలూ మోశావే... పది వారాలు బాధ పడీ...పోతున్నావా...." లాంటి ఏడుపు పాట ఒకటి పాడించి, 'అక్కడిదాకా' మనల్ని కూడా తీసుకెళ్ళి, కపాలమోక్షం చేయించేవాళ్ళు (మనకే) !

కాస్త కన్నూ - ముక్కూ - పళ్ళ వరస బావున్నవాళ్ళనే హీరో - హీరోయిన్ లుగా చూపించే వాళ్ళు.
హీరోయిన్ ఎంత ఒళ్ళు చేస్తే...మనకి అంత తృప్తి !
35 మి.మీ ల తెర మీద సూర్యకాంతం, భానుమతి, సావిత్రి, దేవిక, యస్.వరలక్ష్మి, జీ.వరలక్ష్మి, లాంటి  మన ఘనమైన హీరోయిన్ లు... మన హీరో పక్కన నుంచుంటే, ఆ క్కని...రమణారెడ్డికి తప్ప మరెవరికీ చోటు ఉండేది కాదు !

అందుకే...కెమేరా మాన్ లు, తమ కెమెరాలు కిందకి చూడకుండా గట్టిగా పట్టుకుని,... హీరోయిన్ ల మొహం మీదకి మాత్రమే తమ ధ్యాస, గురి పెట్టి, మిగిలిన పాత్రలు, పాత్రధారులు కూడా కనపడ్డానికి, తెలివిగా తమ కెమేరాలను గిర గిరా చుట్టూ తిప్పేవారు !

నాగయ్య గారికి తండ్రి -  తాత పాత్రలకు ప్రమోషన్ యిచ్చి, గుమ్మడిని ముసలి పాత్రలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి, యస్వీయార్ ని 'ఆల్ ఇన్ వన్' గా వాడుకుంటూ, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అ, రాజబాబు వగైరాల చేత మనకి కిత కితలు పెట్టిస్తూ, సినిమా నడిపించేవాళ్ళు.

తెరపై నిండుగా మన హీరో - హీరోయిన్ లు అనవసరంగా ఎక్కువగా డాన్స్ లు అవీ చేసి,
అలిసిపోయి, చిక్కిపోకుండా, పొలం గట్టుమీదో, పూల తోటలోనో స్థిమితంగా చేతులు పట్టుక్కూచుని, ఘంటసాల, సుశీలల చేత పాడించుకున్న చక్కని పాటలకి పెదాలు కదిపేవారు. "ఒక పూల బాణం...తగిలింది మదిలో" అని వాళ్ళు నర్మ గర్బంగా చెబితే, వాళ్ళ భావం మనకి అర్ధమయి, అదే బాణం... మనక్కూడా తగిలేది.

కధ మధ్యలో...ఆ కుళ్ళు బుద్ధి, గయ్యాళి సూర్యకాంతమ్మో, నక్కజిత్తుల రమణారెడ్డో...ఏదో కిరి కిరి చేసి, వాళ్ళిద్దరి మధ్యా పుల్ల పెట్టేవాళ్ళు. కధ అలా మలుపు తిరిగితేనే...మనకీ తుత్తి ! 
వాళ్ళ ప్రేమ పెళ్ళిదాకా వెడుతుందో..లేదో... ఏమైపోతుందో అని, జుట్టు పీక్కుంటూ, గోళ్ళు కొరుక్కునేవాళ్ళం. సున్నిత మనస్కులు అయితే...కన్నీళ్ళపర్యంతం అయేవాళ్ళం కూడా..
హాల్లో కర్చీఫులు పిండేసేవాళ్ళూ ఉండేవాళ్ళు !

సరిగ్గా అప్పుడే ఒక స్తంభం వెనకాల నుంచి, ముందు పొగ వచ్చేది...వెనకాల.. తన కళ్ళలోనే 
హీరోయిన్ పట్ల తనకి ఉన్న మోజు, హీరో పట్ల ఉన్న అసూయ, ఏక కాలం లోనే చూపిస్తూ, రాజనాల / నాగభూషణం / ప్రభాకర రెడ్డి / కైకాల దిగేవాడు. పక్కనే...కళ్ళజోడు ముక్కుమీద నుంచి కిందకి జారిపోయినా...అల్లు దుర్భిణీలు వేస్తూనే ఉండేవాడు.
 
ఆ పక్కన రేలంగి - గిరిజ, పద్మనాభం - గీతాంజలి, రాజబాబు - రమాప్రభ, ప్రేమించు కుంటూనే, హీరో - హీరోయిన్ లని కలపడానికి వేషాలు మారుస్తూ తంటాలు పడుతుండే వాళ్ళు.
గుమ్మడి, నాగయ్య, ఎన్ని భర్తృహరి సుభాషితాలు చెప్పినా, హీరో - హీరోయిన్ లు వినరుగా ?

అక్కినేని అయితే, ఎంతసేపు చూసినా, తన కాలర్ తనే పట్టుకుని, చూపుడు వేలు చూపిస్తూ,
"లతా...నువ్వు నన్ను అపార్ధం చేసుకుంటున్నావ్" అంటాడేగానీ...అసలు అపార్ధం విషయం చెప్పడే !
ఈలోగా మనమే అక్కడికి వెళ్ళి, ఆ అసలు విషయం  చెప్పేయాలని, మనకి ఆరాటం !
ఈ అపార్ధాల సదవకాశం చూసుకుని, ఫ్లైట్లో జగ్గయ్య ఫుల్ సూట్ లో దిగి, హీరోయిన్ ని లగ్గమాడేసి, హనీమూన్ వెళ్ళిపోయేవాడు. 

నాగేశ్వర్రావు మాంఛి పంచీ, లాల్చీ, శాలువా కొనుక్కుని, వస్తూ వస్తూ దారిలో రెండు వేట్ - 69 లు పురమాయించి, తన తరఫున ఘంటసాలని దగ్గమనేవాడు. ఎన్టీఆర్  అయితే, రక రకాల వేషాలు మార్చి- మార్చి,  చివరాఖరికి తన సమ ఉజ్జీ..రాజనాలని / విలన్ ని కొండచివరికి తీసుకెళ్ళి, బాగా సర్ఫ్, సోడా, సున్నం పెట్టి ఉతుకుతుంటే, ఉడతా భక్తి గా, పక్కనే, రాజబాబు / పద్మనాభం విలన్ అనుచరుల్ని, అల్లూ ని కామెడీగా కొట్టేవాళ్ళు. చివరికి హీరో...చితికిపోయిన విలన్ని మెడ పట్టుకుని అక్కణ్ణించి ఒక్క తోపు తోస్తే...అప్పటికే అక్కడ గ్రూప్ ఫోటో కోసం రడీ గా ఉన్న మొత్తం జనాల మధ్య వచ్చి పడేవాడు.

సూర్యకాంతం మంచిదైపోయి, వాళ్ళల్లో కలిసిపోతే, అప్పటిదాకా బయట, వీధి అరుగుమీద పడుక్కుని, బీడీలు కాల్చుకుంటున్న పోలీసులు వచ్చి, విలన్ కి బేడీలు వేసి, రెండు డైలాగ్ లు చెప్పి, హీరో ని అభినందించి, జీపులో తుర్రుమనేవారు. హీరోయిన్, అపార్ధం చేసుకున్నందుకు హీరోకి సారీ చెప్పేస్తే, హీరో - హీరోయిన్లు... నాగయ్య / గుమ్మడి వాళ్ళకోసమే తెప్పించి ఉంచిన పూలదండలు మార్చేసుకుని, మనందరికీ దణ్ణం పెట్టి, నవ్వితే, రేలంగి / పద్మనాభం / రాజబాబు కూడా రెండు దండలు తెచ్చుకుని, వాళ్ళ వాళ్ళ ఇలాకాలతో 
ఒక ఇంటి వాళ్ళు అయిపోయేవాళ్ళు. ఇంటికి వెళ్ళే దాకా మనం ఆనందంగా నవ్వుకుందుకు వీలుగా, కమేడియన్ చివర్లో ఒక జోకు కూడా వేసేవాడు. మనం కూడా...తృప్తి పడి, ఇంటిదారి పట్టేవాళ్ళం.

టీవీ లు యింకా మన దాకా రాని రోజుల్లో...
ఆ పాత, కొత్త సినిమా మాటలు - పాటలే తల్చుకుంటూ, యవ్వన వీణలు మోగించాం.

ఏ డైరెక్టర్ అయినా తన చేత కామెడీ చేయిస్తే, లక్ష యిస్తానని, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు, శోభన్ బాబు పాతికేళ్ళు ఎదురు చూసి, చూసి, ఎవడూ ముందుకు రాకపోయేసరికి, 
తన సహజ ధోరణిలోనే, భ్రుకుటి ముడి వేసి, ఆ లక్షతో మెడ్రాసు లో స్థలం కొనేసుకున్నాడు.
మన ఆంధ్రా జేమ్స్ బాండ్ కృష్ణ అయితే, నుంచున్న చోట నుంచి కదలకుండా, యిరవై మందిని ఎలా చితక్కొట్టాలో కనిపెట్టాడు. "మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమ"లతో 
స్టెప్పులు కూడా వేశాడు. ఈలోగా 'రవివర్మకే అందని ఒకే ఒక అందం' జయచిత్ర లాంటి సజీవ శిల్పాలు కూడా వచ్చి,  మనని అలరించి, తల్లులుగా ప్రమోషన్ కొట్టేశారు.

ఆ "జయ" సీరీస్ లో...సుధలు, ప్రదలు, లక్ష్మిలు, మాలినిలు వచ్చి, 'అరేసుకోబోయి... పారేసుకున్నవన్నీ...ఏరేసుకుని', వెళ్ళిపోయారు. కొందరైతే, యిప్పటికీ.. అప్పుడప్పుడు కనిపిస్తుంటే...
గుర్తుపట్టలేక, "ఈవిడెవర్రా...ఎక్కడో చూశాను..."
అని పక్కవాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటున్నాం.   ⬇️

మధ్యలో అప్పుడప్పుడు వచ్చి, నిలబడ్డవాళ్ళు, పడిపోయినవాళ్ళు, పతనమై - పోయినవాళ్ళు, ఎగిరెగిరిపడ్డవాళ్ళు, ఎగిరిపోయిన వాళ్ళు, హీరోలు, హీరోయిన్లు, హాస్యనటులు, విలన్లు, కొంతమంది వచ్చినా, వాళ్ళనీ కొంతకాలం పోషించి, కొంతమంది నటించిన సినిమా పేర్లు, చివరికి వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయాం.

మధ్యలో కొంతకాలం, కన్నడ రాష్ట్రం నుంచి, విఠలుడనే ఆచార్యుడు వచ్చి, నారదుడనే 
కాంతారావు ని కిడ్నాప్ చేసి, కొత్తరకం లెగ్గింగ్ లు తొడిగి, పొట్టి చొక్కాలు కుట్టించి, చేతికి ఒక కత్తి తగిలించేటప్పటికి, మన నారద కాంతారావు, వెనకా - ముందూ చూసుకోకుండా, ఆ కత్తినే పట్టుకుని వేలాడ్డం మొదలెట్టాడు.

'ఇదేదో బాగుందే' అనుకున్నారో, ఏమో, రాజనాల కల్లయ్య అండ్ కో కూడా అలాంటి 
లెగ్గింగులే కుట్టించేసుకుని, కత్తులు కొనేసుకుని, కాంతారావుని కొట్టడానికి గుర్రాలమీద వచ్చేశారు. వాళ్ళకోసం... రాజశ్రీ అనే నిత్య రాకుమారి, నేల విడిచి - సాము కాకుండా, గాలిలో డాన్సులు చెయ్యడం మొదలెట్టింది. కొన్నాళ్ళు మన యన్టీ. కృష్ణుడు - రామారావు కూడా...
లెగ్గింగ్ ల మోజులో పడి, మరింత పొట్టి చొక్కాలు కుట్టించుకుని, కత్తి ఝళిపించాడు. ఇక్కడ కూడా పాపం, రాజనాల ని, కైకాల ని ఉతక్కుండా వదల్లేదు !

మనం పెంచి, పోషించిన అదొక ప్రత్యేక అధ్యాయం.

 ⬇️

ఏఎన్నార్, ఎన్టీఆర్, తాము రిటైర్ అవ్వకముందే, ముందు జాగ్రత్త పడి, తమ వారసుల్ని రిక్రూట్ చేసేసి,  తమ బిరుదుల్ని, ఫాన్స్ ని కూడా వారసత్వ హక్కుగా వాళ్ళకి యిచ్చేశారు.
ఆ వారసులు, వాళ్ళతో పాటే సినిమాల్లోకి వచ్చి,  ఎదిగిన వాళ్ళూ కలిసి, ఐకమత్యంగా 
హీరో లక్షణాలనే మార్చేశారు. హీరో ఏం చదివాడు, ఏ ఉజ్జోగం చేస్తున్నాడు ? 
అని మనం అడక్కుండా, రిక్షా లాక్కున్నా, ఆటో నడుపుకున్నా, మూటలు మోసుకున్నా,
'ఏంజేశావన్నది కాదు, అన్నయ్యా... పదిమందిని చితక్కొట్టామా, లేదా అన్నదే పాయింటు' అని 
ట్రెండు మార్చి పడేశారు. వీళ్ళు తమ తమ డ్యూటీల్లో ఉండగా, లోపల ఖాకీ నిక్కరు, పైన లుంగీకట్టి, ఎర్రటి పువ్వుల చొక్కాలు, రంగు బనీన్లు వేసి, రఫ్ గా కనపడ్డానికి గెడ్డం గీయకుండా, 
నోట్లో వంకరగా పెట్టి బీడీలు కాల్చినా..కండలు చూపించి, కోటీశ్వరుడి కూతుర్నే ప్రేమించి, ప్రేమింపజేసుకుని, డ్యూయెట్లు పాడుకుందుకు, ఊటీ, సిమ్లా, యూరోప్ లాంటి చలి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మాత్రం...ఖరీదైన సూటు - కోటు, నల్ల కళ్ళద్దాలు బయటికి తీసేవారు.
వీళ్ళ దగ్గిర యింకో ప్రత్యేకత ఉంది. ఒకే గుద్దుతో...
గాలిలో గింగిర్లు కొట్టేట్టు, ముప్ఫయ్ మందిని లేపెయ్యడం, ఇద్దరు - ముగ్గురు హీరోయిన్లు వెంటపడుతున్నా, అందరితోనూ స్టెప్పులు వేసి,చివరికి ఎక్కువ డబ్బులు తీసుకున్న హీరోయిన్ కే మెళ్ళో దండ వెయ్యడం !

పాపం, పాత హీరోలకి, ఒకళ్ళిద్దరు మాత్రమే హాస్యగాళ్ళు ఉంటే....వీళ్ళకి, టోకుగా మాట్టాడి, బ్రమ్మానందం నాయకత్వంలో, ఒక గ్యాంగునే తీసుకొచ్చారు. వాళ్ళందరూ మనల్ని నవ్వించాలి కాబట్టి, ఒక్కొక్కళ్ళు...ఒక్కొక్క ప్రాంతీయ యాస పట్టుకుని, నవ్వు తెప్పించే డైలాగులు పంచుకుంటారన్నట్టు !

ఈ తరం హీరోలు... ఒకప్పటి నాట్య తారల్ని మించిపోయి, తమ వెనకాల ఒక యాభైమందిని పోషిస్తూ, స్టెప్పులు వేస్తూ, వాళ్ళచేత కూడా వేయిస్తూ, హీరోయిన్లని ప్రేమించడం మొదలెట్టారు. వెనకాల కనీసం యాభైమంది ఉంటే తప్ప, వీళ్ళకి హీరోయిన్ ని ప్రేమించే మూడు రాదు.... మనకీ అంతే !

ఇన్ని తరాల సినిమా వాళ్ళని పోషించి, పోషించి, మనం శోషించిపోయి, ఇంక యిప్పుడు వచ్చే సినిమా వాళ్ళని పోషించలేక, కాళ్ళు ఎత్తేసి, టీ పోయ్ మీద పెట్టుకుని, 
ఆ పాత సినిమాలనే టీవీల్లో చూస్తూ... 
మధ్య మధ్యలో ఓ కునుకు లాగేస్తున్నాం. టీవీ నడుస్తుంటేనే...నిద్ర వస్తోంది !
"మేం తీసే సినిమాలు మీకోసం కాదు, మీ మనవల కోసం, మీరు వస్తే.. రండి, పోతే..పొండి" అని తీసేవాళ్ళు చెప్పేశాక, ఒకప్పటి సినిమాకి మహారాజ పోషకులమైన మనకి, .... 
మన ఏకైక వినోద సాధనం...
సినిమా హాలు వైవు వెళ్ళి ఎన్నాళ్ళయిందో కూడా గుర్తు లేదు !
****
02. తెల్లవారింది..

నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి... 

కానీ బద్దకంగా అనిపించింది. మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు...

ఆయన చనిపోయి రెండేళ్లు అయింది... 

కొడుకు కూతురు అమెరికాలో స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు వచ్చేయమంటారు...

కానీ నాకే ఇష్టం లేదు ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను..

కాఫీ తాగాలి అనిపించింది కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు 

కాఫీ మానేశాను..

కాఫీ త్రాగడం ఎప్పటి అలవాటో!

చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను బ్రష్ చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను...

కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది వయసు పాతిక ఉంటుంది.

అందంగా...

ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.

        నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది,.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.     ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

కానీ గుర్తు రాలేదు.,మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో

విష్ చేసింది.

       అలా వారం గడిచింది ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!

నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.

      ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.

      నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను. అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.,తన మాటకు నేను నవ్వేసాను..నేను నవ్వి చాలా కాలం అయింది.,ఆ విషయం మనసు గుర్తు చేసింది.

      " నీ పేరు?" అని అడిగాను"స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.,నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు గుండెలో సంతోషం పొంగింది.     మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి ఉత్తేజంగా అనిపించేది.

   ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను. స్వప్న సరేనంది ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.

     "నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.

"అయింది ఒక బాబు...పాప" అంది స్వప్న మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను మావారు పోయినందుకు సంతాపం తెలియ పరిచింది.

      కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను. 

"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.

"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.

      "ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి..,తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు ఇష్టం అయినవి చేసి పెట్టి ఉంటారు..,

ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు తినండి" అన్నది.,

ఆ తరువాత మేం వెళ్ళిపోయాము. 

        ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.,చాలా కాలం తరువాత నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.

ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.

     మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది..,మాటల్లో జీవితం నిరాసక్తత

గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.

    నెల తరువాత ఒక రోజు    " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను

మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.

      సాయంత్రం నాలుగు గంటలకు  వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.

నాకు సంతోషం అనిపించింది.

     తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసి ఉంచాను..,

చెప్పినట్లు సరిగ్గా నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.

వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ  తెచ్చింది.

       "ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.

        స్వప్న సోఫాలో కూర్చుంది కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా

 తీసుకోవడం లేదు" అన్నాను.

        తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది..,ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను..

చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది..

  అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..

బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది..,అందుకు కొంచెం

మైండ్ సెట్ మార్చుకోవాలి" అన్నది.

         కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.

   తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"

అన్నాను..,తను రెండు అగరొత్తులు  తీసి వెలిగించింది.,క్షణంలో గది పరిమళ భరితం

అయింది అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు

మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.

       " ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో

బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.

         స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు 

మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"

అన్నది."అలానే" అన్నాను.

          గదిలో అలుముకున్న అగరొత్తుల  పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను గుర్తు చేస్తూనే ఉంది.      మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే బాగుంది అనిపించింది..,

చాలా కాలం తరువాత ప్రభాత సమయంలో  ఉత్సాహంగా అనిపించింది...

     వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.

     స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను క్రమేపీ దానితో

అనుబంధం పెరిగింది..,ప్రతి రోజూ దాన్ని శ్రద్ధగా పరిశీలించ సాగాను మొగ్గ తొడగడం...

పువ్వు విచ్చడం పరిమళం అద్భుతం అనిపించ సాగింది.

      మావారు ఉన్నప్పుడు పూల కుండీలు ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు ఇప్పుడు ఇది నాకు సరి కొత్త అనుభవం.     మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం  పంచుకుంది.

              ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.,ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను., అలా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.

      "ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.

రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.తన భావం గ్రహించి" సరే" అన్నాను.          అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...

దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.

      ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...

అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...

నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను. నాలోని మార్పుకు స్వప్నే కారణం.

      ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.బాగా చదువుతారు.,కానీ వీళ్ళమ్మ వీళ్ళను

చదివించలేక పోతున్నది..అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.

మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది..

నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాను...

వాళ్లకు సహాయం చేయడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది.

      పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు,స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.

" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది. "ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.

నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి

చాలా కాలం అయింది..,వేయగలనో! లేదో!" అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.

ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్

తెచ్చి ఇచ్చింది.       దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.

        ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను. పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.,ఆ విషయం స్వప్నకి చెప్పాను.

       ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.

     " పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.

      ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్ మార్చింది .నా అభినందనలు తెలియ జేయి" అన్నది.

        కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు

వెళ్ళింది.,ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ  అందమైన ఫ్రేమ్ లో

కనిపించి కనువిందు చేసింది.,నాకు మనసులో  గర్వంగా అనిపించింది.        స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను

పరిచయం చేసింది.,నేను సోఫాలో  కూర్చున్నాను.,స్వప్న కాఫీ తేవడానికి లోనికి

వెళ్ళింది.        స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..

" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.,అంతలో

స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు 

అక్కడినుంచి వెళ్లి పోయారు.

      అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు ఆ పాప అనాధ.,స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది అంతే కాదు...

మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.,అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.

అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని

చెప్పింది.      అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే

ఎంత పరిపక్వత అనుకున్నాను.,కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.

    స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా? చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ. నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"

అన్నాను.

          ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం

బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.

నా దగ్గర బాగానే డబ్బు ఉంది.,నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో

నిర్ణయం తీసుకున్నాను.,అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.

       కొద్ది కాలానికి మా వారి పేరు మీద  ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.,దానికి సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.

      ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు...సంతోషంగా...

ఉత్సాహంగా అనిపిస్తున్నది...

ఒకప్పుడు సమయం గడవని నాకు..,

ఇప్పుడు సమయం చాలడం లేదు.    వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే

ఇచ్చాను!! 

Note≈ ఒంటరిగా ఉంటే అన్ని కోల్పోయినట్టు కాదు... మనస్సుకు నచ్చినట్టు ఉండటం తప్పు కాదు....

***

03. "తాతా, యిది ..మాంఛి హిట్టు సినిమా, నువ్వు తప్పకుండా చూడాలి" అని యీ కుర్రకారు టీవీ ముందు కూచోపెట్టి, ఆ రెండు మూడు రిమోట్ల లో ఏవేవో బటన్లు నొక్కి, చూపిస్తుంటే, ఆ తెర మీద... వాళ్ళు ఏమి మాట్టాడుతున్నారో... ఎందుకు మాట్టాడుతున్నారో... పాడే పాట ఏమిటో...ఎవరు రాశారో... ఎవరు పాడుతున్నారో...అది ఏ భాషో తెలియక మనం బాధ పడుతుంటే...వీళ్ళు, వాళ్ళతోపాటు స్టెప్పులు వేస్తున్నారు ! క్రిందటేడు...కొరోనా పుట్టేముందు పుట్టిన కొత్త మనవడు కూడా చప్పట్లు కొడుతూ, కూచునే స్టెప్పులు వేసేస్తున్నాడు ! "అదేంట్రా...మన ఏరియా స్వచ్ఛ భారత్ కార్మికుడు...సినిమాల్లో కూడా వేస్తున్నాడా ?" అన్నాను, పొరపాటున.... ముగ్గురు మనవలు గయ్యి మని లేచారు ! "అతను ఎవరనుకున్నావ్ ? మా అభిమాన హీరో... అతనికి చైనాలో కూడా అభిమానులు ఉన్నారు, తెలుసా ?" అన్నారు. "సినిమా వాళ్ళంటే... కళ్ళూ - ముక్కూ - మూతీ బాగుండాలి కదురా... వీడికి ఒక్కటీ బాలేదేం ?" అన్నాను ఆపుకోలేక... 'సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని విమర్శిస్తే, కావలసిన వాళ్ళతోనే సత్సంబంధాలు తెగిపోయేట్టున్నాయ్', అనుకుని, యింకా మాట్టాడితే నాతో మాటలు కూడా మానేస్తారనిపించింది. 'సరే..మరి అంతంత కండలు పెంచిన వాడు, ఆ బఖ్ఖ గా ఉన్న వాడినెందుకు, ఎత్తి - కుదేస్తున్నాడు, వాడేంతప్పు చేశాడని ?" అన్నాను. మళ్ళీ... గయ్యి మన్నారు. 'వాడు' కాదు...తాతా... 'ఆవిడ' ! అల్ ఇండియా ఫేమ్, హీరోయిన్... బొంబాయి నుంచి కోటి రూపాయలు యిచ్చి తీసుకొచ్చారు. వాళ్ళు త్వరలో ప్రేమించుకోబోతున్నారు! ముందు అలాగే ఏడిపించి, ఎత్తుకుపోయాక, ఆవిడకి ప్రేమ పుడుతుందన్నమాట ! మీతరం వాళ్ళకి అర్ధం కాదులే !" అన్నారు. నాకు మనసు పాడయిపోయి, 'మిగతాది...మీరు చూడండి, నేనెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకోవాలి" అని లేవబోయాను. "అయ్యో, తాతగారూ...అసలు కథ యిప్పుడే మొదలవుతుంది, ఆ హీరోయిన్... ఆ హీరోని చంపేసి, రెండో హీరోతో అమెరికా వెళ్ళి చేసే సాహస కృత్యాలు చూసి తీరాలి" అన్నాడు, పెద్ద మనవడు... ఎక్సయిటెడ్ గా...ఊగిపోతూ... "ఏంటీ...హీరోయిన్ - హీరోని చంపేస్తుందా? మా నాయనే..." అని అక్కడినుంచి వాకౌట్ చేశాను. 😷

04. గోదావరి జిల్లా కామెడీ సంఘటన. శ్రీనివాస్ తన బెస్ట్ ఫ్రెండ్ వెంకట్ పెళ్ళికి రెండు రోజులు ముందుగా హైదరాబాద్ నుండి బయల్దేరి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఊరికి వెళ్ళాడు. శ్రీనివాస్ తన ఫ్రెండ్ వెంకట్ వాళ్ళ ఇంటి గుమ్మంలో అడుగు పెట్టగానే శ్రీనివాస్ ని చూసి వెంకట్ తల్లి "రా బాబూ రా. బావున్నావా? ఇంతకీ దేనికొచ్చావ్?" అనడిగింది. శ్రీనివాస్ కి "దేనికొచ్చావ్?" అన్న ప్రశ్న ఎందుకడిగారో అర్ధం కాలేదు. కొంపదీసి పెళ్ళి ఈ నెల కాదా అనుకొని కాళ్ళు కడుక్కోవడానికెళ్ళాడు. అంతలో టవల్ తీసుకొచ్చిన వెంకట్ చెల్లెలు శ్రీనివాస్ ని "అన్నయ్యా బావున్నావా? దేనికొచ్చావ్?" అని అడిగింది. మళ్ళీ "దేనికొచ్చావ్?" అనే ప్రశ్న. శ్రీనివాస్ కి "పెళ్ళి తేదీ తనేమన్నా తప్పుచూసాడా ఏంటీ, ఎందుకొచ్చావ్ ఎందుకొచ్చావ్" అని అడుగుతున్నారు" అని అనుమానం పెద్దదైంది. పెళ్ళి తేదీ ఎప్పుడు అని అడిగితే ఏమనుకొంటారో అని మొహమాటంతో అడగలేదు. కాళ్ళు కడుక్కొని ఇంటిలోపలకి వెళ్ళగానే అక్కడ వాలు కుర్చీలో కూర్చున్న వెంకట్ తండ్రి శ్రీనివాస్ ని "బాబూ బాగున్నావా? దేనికొచ్చావ్?" అనడిగాడు. శ్రీనివాస్ "ఏంటీ ఇంట్లో అందరూ దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే ప్రశ్న. కొంపదీసి పెళ్ళిగాని కేన్సిల్ అయ్యిందా ఏంటీ". అదేమాట అడుగుదామా అనుకొని ఫ్రెండ్ వచ్చాక వాడినే అడుగుదాం అని బయటకెళ్ళిన ఫ్రెండ్ వెంకట్ రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన వెంకట్ శ్రీనివాస్ ని చూస్తూనే "ఏరా శ్రీను ఎంతసేపైంది వచ్చి? దేనికొచ్చావ్?" అన్నాడు. శ్రీనివాస్ కి సహనం సన్నగిల్లింది. ఫ్రెండ్ ని పక్కకు తీసుకెళ్ళి ఏంట్రా పెళ్ళికి పిలిచి ఇప్పుడు ఇంట్లో అందరూ "దేనికొచ్చావ్? దేనికొచ్చావ్? అని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు. పెళ్ళి కేన్సిల్ అయ్యిందా ఏంటీ?" అని అడిగాడు. వెంకట్ నవ్వాపుకొంటూ అరేయ్ "దేనికొచ్చావ్? అంటే గోదావరోళ్ళ అర్ధం ఏ బండెక్కి వచ్చావ్? బస్సుకా, రైలుకా? తెలుసుకోవడానికి" అని చెప్పగానే శ్రీనివాస్ కి విషయం అర్ధమై నవ్వుకొన్నాడు. 😂😀 సో... గోదావరోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు "దేనికొచ్చావ్?" అనడిగితే కంగారుపడిపోకండి సుమీ! 😀🤣😅👍

5 *ఆవకాయ మీదొట్టు ..ఈ వ్యాసం నేను రాయలేదు సుమా 🤗*

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం

 ఆవకాయలో ఎరుపు--- "రవి"

ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"

ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"

ఆవకాయలో వేసే పసుపు,మెంతులు--- "గురువు"

మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"

మామిడిలో పులుపు---"శుక్రుడు"

ఆవకాయ తినగానే కలిగే , అలౌకికానందం---"కేతువు"

తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"

ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"


ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,

సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.😛😜😆😄


 శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!

〰〰〰〰〰〰

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:

చెక్కందురు, డిప్పందురు,

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.

డొక్కందురు, మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!

〰〰〰〰〰〰

ఆవకాయ ఉపయోగాలు:

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


ఇందువలదందు బాగని

సందేహము వలదు;

ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!

〰〰〰〰〰〰

ఆవకాయ అవతరణ: “చప్పటి దుంపలు తినుచును, తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

ముక్కోటి దేవులందరు మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!

చారెరుగనివాడును, గోదారిన తా నొక్కమారు తడవని వాడున్, కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగువాడు  కాడోయ్!!!

*ఆవకాయ అభిమానులకు అంకితం*   *మీ శ్రేయోభిలాషి*

 ఓసారి ఒక నర్తకీమణి శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానానికి వెళ్ళి మహారాజా నేను ఎనిమిది భాషల్లో పాడుతూ నృత్యం చెయ్యగలను. అయితే అంతా అయ్యాక అందులో నా మాతృ భాష ఏదో సరిగ్గా చెప్పగల వారెవరైనా ఉన్నారేమో చూద్దాం అందిట. 

సరేనని ప్రభువులు ఆమె కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రహ్మాండమైన ఆ కార్యక్రమం తరవాత ఆ నర్తకీమణి ఒక ఉచితాసనం మీద సేద తీరుతుండగా, రాయల వారు ముందుగా అష్టదిగ్గజాలను అడిగారుట. అప్పుడు  పెద్దన్నగారు పెదవి విరిచారుట.  తిమ్మన గారు కిమ్మన లేదుట.  

యథాప్రకారం రాయల వారు తెనాలి రామకృష్ణునికి సైగ చేయగా, వారు లేచి సాలోచనగా ఆ నర్తకీమణి ముందు నుంచి నడిచి వెళుతూ, ఆమె బొటన వేలు మీద కాలేసి కసిక్కున తొక్కారుట! అప్పడా నర్తకీమణి "యూ బ్రూట్, కాంట్ యూ సీ వాట్ యూ ఆర్ డూయింగ్?" అని కోపగి౦చుకుందిట. 

యథా ప్రకారం రాయల వారు "ఏమి రామకృష్ణా! ఏమిటిది?" అని గద్దించారుట. 

అప్పుడు రామకృష్ణుడు "మన్నించండి మహారాజా, ఈ నర్తకీమణి అచ్చమైన తెలుగమ్మాయి. ఆ విషయం తెలుసుకోడానికే ఇలా చెయ్యవలసొచ్చింది" అన్నాట్ట. అపుడా నర్తకి "ఆయ్, నిజవేఁనండి! అయ్ బాబోయ్, ఎలా కనిపెట్టీసార౦డీ" అందిట! అపుడు సభనుద్దేశించి రామకృష్ణుడు "ఎవరైనా ఏదైనా హఠాత్ సంఘటన జరిగినా, దెబ్బ తగిలినా, ఆశ్చర్యాన్ని, బాధని వారి మాతృ భాషలో వ్యక్తం చేస్తారు. కానీ అటువంటి సమయంలో కూడా ఇంగ్లీషులో మాట్లాడేవారు తెలుగువారే!

😋

6 *శ్రీ వేంకటేశ్వర స్వామి అంటే..!!*

                          

వేం - పాపము

కట - తీసేయడం

శ్వరుడు - కర్మ తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం

త్రేతా యుగం - శ్రీరాముడుగా,

ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,

కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.

కృత యుగం లో - వృషా చలం,

త్రేతా యుగం లో - అంజనా చలం

తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. 

యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

"శ్రీవేంకటేశ్వరస్వామి మాట్లాడేవారా?"

అవును, శ్రీవారు మాట్లాడేవారు. ఒకానొకప్పుడు 'తొండమాను చక్రవర్తి' చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడటం మానేసారు. 

  

 పూర్వం "కూర్ముడు" అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ, తాను తిరిగి వచ్చే వరకూ తన భార్యాపిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పాడు. 

ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలుగచేసి, భద్రతకై తాళం వేసి ఉంచాడు. తర్వాత ఆ విషయం మరిచిపోయాడు. ఆ భవనంలోనివారు ఆహారం చాలక లోపలే మరణించారు. ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. 

ఆ విషయమే మరచిన తొండమానుడు, భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి, వేంకటాచలానికి పరుగెత్తి వెళ్ళి, శ్రీనివాసుని పాదాలపై పడి శరణువేడాడు. 

అప్పుడు  శ్రీవేంకటేశ్వరుడు "నీకు బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇకముందు ఎవరికి ప్రత్యక్షంగా కనిపించను.ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను" అంటూ శపధం చేసి, ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు.


అప్పుడు బ్రహ్మాదిదేవతలు "బలహీనులు, అల్పాయుష్కులైన మానవులను ఉద్దరించడానికై కలియుగాంతము వరకూ ఈ వేంకటాచలంపై ఉండవలసింది" అని ప్రార్ధించారు. 

అప్పుడు శ్రీనివాసుడు "దివ్యమూర్తిగా దర్శనమిస్తాను. కానీ ఎవరితోనూ మాట్లాడను. అందరి కోరికలూ తీరుస్తాను" అంటూ "కన్యామాసం, శ్రవణానక్షత్రం" రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. 

తొండమానుడు ఆలయగోపురాదులు నిర్మించాడు.   

 బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి, ఇవి కలియుగాంతం వరకూ వేలుగుతూంటాయని చెప్పాడు. తరువాత పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించాడు. 


అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిపొందాయి.

"భగవంతుడి నామాన్ని జపిద్దాం,

 భగవంతుడిని చేరుకుందాం. 

సేకరణ:

🌹🙏🏻ఓం నమో వేంకటేశాయ🌹🙏🏻

7 *దేవుడే భోజనం పంపిస్తాడు*

                  ➖➖➖✍️


_-[స్వామి_వివేకానంద జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన..]-_

*ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది.* 

*వివేకానందుడు సన్యసించారు, కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.      భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.*

*వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగి  స్వామీజీతో అతడిలా అన్నాడు…*

*“ఓ స్వామీ! చూడు... చూడు... నేనెంత మంచి భోజనం చేస్తున్నానో..   నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా...? ఏ సంపాదనా లేకుండా దేవుడు... దేవుడూ... అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు.    అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప..!” అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు.* 

*స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.*

*అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...*

*ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు,   “మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల                     శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.*

*స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే.. పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే,  ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే..!”*

*”శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు!  అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.”*

*”నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు.* 

*స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది.     ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో... అదే అభయ హస్తమిది.*

*ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు.*

*తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.*

*ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే, ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో...!*

*అందరికీ తెలిసేలా మన భారతీయ ధర్మాన్ని వ్యాప్తిచెయ్యాలి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏




భార్య భర్తలు శృంగారం లో పాల్గొంటు సరదా ముచ్చట్లు

అంత్యానుప్రాస లో 2012 లో నేను  యధాతధముగా పొందు పరుస్తున్నాను  patrt.1

 అదేపనిగా  కొంగు జార్చి నన్ను ఇబ్బంది  పెట్టకు

క్రిందా పైన ఆశ  తీర్చు కోవాలని   తొందర పెట్టకు

 నీలో ఉన్న గుట్టు విప్పాలని నన్ను  భయపెట్టకు

 వద్దన్నా నీ కొవ్వు కరిగిస్తా నాతో పందెంపెట్టుకోకు 

నిగనిగ లాడే నీవళ్ళును చూస్తే, నాకు గుచ్చు కుంటాయి ముళ్ళు

పాలపొంగులపైట జారినప్పుడుచూస్తే, నన్ను కలవరపెడతాయి కళ్ళు

బొడ్డు  క్రింద జార్చిన  చీరను చూస్తే, నాకు కావాలని  పించె  కౌగిళ్ళు

పెదాల కదలికన మూతి విరుపును చూస్తే, తప్పకతెప్పించాలి వేవిళ్ళు     

 తొంగి తొంగి చూడమాకు నాకు అసలే సిగ్గు ఎక్కువ

 ఉడికించి, ఉడికించి ముద్దు పెడితే మక్కువ ఎక్కువ

  అంది అందకుండా తిరిగితే మనసుకు కోరిక ఎక్కువ

 ముంత మసాల కొరకు మనసు లాగుతుంది ఎక్కువ    

****


 నీకు వయసుంది నాకు వయసుంది మనిద్దరిమద్య అడ్డేముంది

 నీలొ ఉన్న వేడిని చల్లార్చే తెల్లని మంచు గొట్టము నావద్ద ఉంది  

 నీ పెదాలలో నాదగ్గర ఉన్న అమృతము కురి పించాలని  వుంది

 నాపై కోపించక, నన్ను కణికరించు నీ అందాన్నిదోచాలని ఉంది

                                                                             

జానా బెత్త గౌను వేసుకొన్న    పెద్ద పాప

బిత్తరచూపులతో మత్తులోకిదించె   పాప

పరువాలను పదిలముగా పంచె     పాప

అరటి పండు కావాలి అంటున్న పెద్దపాప  


తెల్లటి చీర, బంగారపు చేతిలో పాల గ్లాసు చూస్తూవుంటె 

మత్తు చూపులాతో, మేలి ముసుగుతో నడుస్తూ వుంటె 

కాలి అందెల శబ్దాలు, గాజుల శబ్దం గుండెనుతాకుతుంటె                          

ఆగలేక అమాంతం బంతులందు కోవాలని ఎగురుతుఉంటె                            




భార్య భర్తలు శృంగారం లో పాల్గొంటు సరదా ముచ్చట్లు

అంత్యానుప్రాస లో 2012 లో నేను  యధాతధముగా పొందు పరుస్తున్నాను 

                   

 1 అదేపనిగా  కొంగు జార్చి నన్ను ఇబ్బంది  పెట్టకు

      క్రిందా పైన ఆశ  తీర్చు కోవాలని   తొందర పెట్టకు

      నీలో ఉన్న గుట్టు విప్పాలని నన్ను  భయపెట్టకు

      వద్దన్నా నీ కొవ్వు కరిగిస్తా నాతో పందెంపెట్టుకోకు 


2. నిగనిగ లాడే నీవళ్ళును చూస్తే, నాకు గుచ్చు కుంటాయి ముళ్ళు

పాలపొంగుల పైట జారినప్పుడు చూస్తే, నన్ను కలవరపెడతాయి కళ్ళు

బొడ్డు  క్రింద జార్చిన  చీరను చూస్తే,   నాకు కావాలని  పించె  కౌగిళ్ళు

పెదాల కదలికను మూతి విరుపును చూస్తే, తప్పక తెప్పించాలి వేవిళ్ళు     

      3.     తొంగి తొంగి చూడమాకు నాకు అసలే సిగ్గు ఎక్కువ

        ఉడికించి, ఉడికించి ముద్దు పెడితే మక్కువ ఎక్కువ

        అంది అందకుండా తిరిగితే మనసుకు కోరిక ఎక్కువ

        ముంత మసాల కొరకు మనసు లాగుతుంది ఎక్కువ    

      ***                                              

 4.    నీకు వయసుంది నాకు వయసుంది మనిద్దరిమద్య అడ్డేముంది

        నీలొ ఉన్న వేడిని చల్లార్చే తెల్లని మంచు గొట్టము నావద్ద ఉంది  

        నీ పెదాలలో నాదగ్గర ఉన్న అమృతము కురి పించాలని  వుంది

        నాపై కోపించక, నన్ను కణికరించు నీ అందాన్నిదోచాలని ఉంది

                                                                               

5.    జానా బెత్త గౌను వేసుకొన్న    పెద్ద పాప

       బిత్తరచూపులతో మత్తులోకిదించె   పాప

       పరువాలను పదిలముగా పంచె     పాప

       అరటి పండు కావాలి అంటున్న పెద్దపాప  


6.   తెల్లటి చీర, బంగారపు చేతిలో పాల గ్లాసు చూస్తూవుంటె 

      మత్తు చూపులాతో, మేలి ముసుగుతో నడుస్తూ వుంటె 

      కాలి అందెల శబ్దాలు, గాజుల శబ్దం గుండెనుతాకుతుంటె                          

     ఆగలేక అమాంతం బంతులందు కోవాలని ఎగురుతుఉంటె                            

                                              

7    ఆదిలో హంసపాదు రాకుండగా అధరామృతము అందుకో

       ఆద మరచి నిద్రించక నీకోసం  దాచుకున్నవన్నీ దోచుకో

       సిగ్గుతో చీరవిడిస్తే , అందాలను చూస్తూ లోట్ట లేయకా జుర్రుకో

       కాలం మరచి  తేరిపారి చూడకు  స్వర్గలోక సుఖాలందుకో  





8.    పట్టుదలకు పోకు, పరువాలను భందీ చేయకు

       పట్టిందల్ల బంగారము అని నమ్మి మోస  పోకు

       నీవు అనుకున్నది సాధించేదాక పట్టు విడువకు

       ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధించాలని  మరువకు  


9.    బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికి రారు

       చేప కన్నుల చిన్నది చాటుకు రమ్మంటే రాని వారెవరు

       పున్నమి వెన్నెలలో కలయక జరాగాలని కోరనివరెవరు

       ఆకు వక్క సున్నం వేసిన తాంబూలం రుచిచూడనివరెవరు 

****

10.  నన్ను అదేపనిగా గిల్లి గిల్లి గిలి గింతలు పెట్టమాకు

       గమ్మత్తులు, కలవరిమ్తలేనా తట్టి తట్టి లెపు  ఆకు

       ముందు వెనుకా ఉండదు ఈ పనికి చీకటిలో పాకు

       దమ్ము, సొమ్ము  అంతా  నాకు చూపు ఈపూటకు  


11.  కేవలం పుస్తకాల పురుగు కారాదు

       ప్రకృతిలో పంచే సుఖం మరువరాదు

       మదిలో పరువాల పందిరిని వదలరాదు

       అందాల సుందరి చూపులకు లొంగరాదు


12.  మౌనం   అంగీకార  సూచకం

       మనసులోని  కోర్కల ఫలితం 

       మమతల  కలయక వలయం

       శృంగారం ఇరువురి అంగీకారం                                                          

                                                              

13.  శరీర మాద్యం ఖలు ధర్మసాధనం

       ఆరోగ్యం అందరికీ  దివ్య   ఔషధం 

       యవ్వనం సుఖం పురుష లక్షణం

       సుఖాలను అందుకోవటమే స్త్రీ లక్షణం  

                                                                                     



14.  తెలుతూ తెలుతూ సాగాలి సముద్ర యాత్ర

        సాగుతూ సాగుతూ పల్లానికి  నీటి   యాత్ర 

        సుఖిస్తూ సుఖపెడ్తూ చేయాలి ప్రేమ యాత్ర

        ఆడుతూ పాడుతూ సాగించు జీవన యాత్ర                                                     



15.  సుఖించి సుఖమును పంచి  బ్రతికించు

        వరించి  వలపును   పంచి  మురిపించు

        తెగించి యముడునే ఎదిరించి బ్రతికించు   

        ప్రేమించి  ప్రేమను పంచి సంతోషపరుచు                                                        



16.  తినద్దు చద్ది.  తాపమని వేదించ వద్దు

        పరువం సద్దు, కెవ్వుమని అర  వద్దు

        సంపద పద్దు, సరస సంతోషాల హద్దు

        ఒకరు ముద్దు, ఇద్దరు కలవాలి హద్దు  

                                                                                   



17.  గుచ్చి గుచ్చి చూడమాకు నాకు గుండె దడ

        కోరికతో రెచ్చ కొట్టమాకు ఉంటాను తలగడ

        ఆశగా ఉంది వద్దనమాకు పొంగులపైపావడ

        రుచి చూడాలని ఉంది నాకు పెరుగు ఆవడ                                                     



18.   ఇంద్రి యాన నయనం   ప్రధానం

         తీర్ధంబున తులసి నీళ్ళు నయం

         తెగించిన  వాడికి  తెడ్డె      లింగం

         విచ్చుకున్న పద్మం మరీ అందం

                                                          


                                             

19.  కక్ష      ఎందుకు  పోటీ     జగాన

        క్రోధ  మెందుకు   నేటి  యుగాన

        ద్వేష   మెందుకు   సాటి స్త్రీ  పైన

        పంతమెందుకు ప్రేమ మందిరాన      

                                                      



20.  మంచిని పెంచు చెడును త్రుంచు

        సుఖమును పంచు ద:ఖాన్ని త్రుంచు

        శుభమును పెంచు అశుభమును త్రుంచు

        ప్రేమను పంచి  అహంకారాన్ని తగ్గించు

                                                       



21.  గూట్లో  దీపం వెలిగించు నోట్లో  ముద్దను దించు

        ఒంట్లో శక్తిని పెంపొందించి ఈ  మత్తును  దించు  

        మనసుకు ఉతేజ పరుచు ఇది కొత్త అని పించు

        అలవాటుగా మారి ఇంకా ఇంకా కావాలని పించు  

                             

22.      మాట కటువు మనసు వెన్న

            నీటి  బుడగను పట్ట లేమన్న

            ఒట్టితీసి గట్టు మీద పెట్టమన్న

            కలియుటకు  పంతం  వద్దన్న


                                                      


23.     అవన్నీ వట్టి ఊక దంపుడు కబుర్లు

          ఇద్దరిమద్య ఏమీలేదు వట్టి పుకార్లు

          ఇద్దరం కలసి తిరిగాం  వట్టి  షికార్లు      

          కేవలం ముద్దుకే వచ్చాయి చక్కర్లు     

                                                                                                                                                            



 24.  సూదిలో దారం ఎక్కిచ్చాలి రా బావ

        మల్లె పూలు సద్ది సరి చేసుకో  బావ 

        సూది కదిలించను దారం ఎక్కించు బావ

        సందులో పని కుదిరిందనక పెట్టు బావ 

                              


  25. కలలు కనగానె సరిపోదు మనసు అర్ధం చేసుకో

       మనసులోని కోర్కలను  తీర్చే మార్గం చూసుకో

       పట్టుచీర,నెక్లెస్, మల్లెపూలు నీవు తెచ్చావనుకో

       నీ సంతోషము కొరకు నా సర్వస్వము   దోచుకో  

                                                      


   

26.  శ్రుతిమించి  రాగాను పడి ఇబ్బంది పెట్టమాకు

        కళ్ళు గగుర్పాటు తెచ్చే పనులు చేయ  మాకు

        ఇప్పుడే మొగ్గ విచ్చిన పువ్వును అని మరువకు

        పువ్వును నలిపై, ఇక్కడ  కోచ్చాక   సిగ్గు పడకు 

                               


 

27.   స్త్రీ బ్రతుకు గతించిన కాల స్మ్రుతులతో

        స్త్రీ బ్రతుకు భవిషత్ గురించి ఆలోచనలతో

        స్త్రీ బ్రతుకు వర్తమానంలో ఆశ, నిరాశలతో

        స్త్రీ బ్రతుకు కల్పవల్లిగా మరే జీవితాశయంతో                                                        



28.   అదృశ్యంగా కదులుతూ కదిలించే గాలి శక్తి   

        నడుస్తూ ప్రాణులకు దాహం దీరుస్తూ నీటి శక్తి

        ఉన్నచోట తన ఉనికిని తెలియ పరిచే అగ్నిశక్తి

        కోపం తగ్గించి, తాపాన్ని చల్లార్చే భార్యామణి శక్తి                                                       



29.   నీ చేతులు తాకితే నా మది తెలిపొయె   

         నీ కవ్వింతలకు నా గుండె బరువాయె 

         నీ చూపుకు మన్మదబాణాలు తగిలాయె

         నీ మాటతో నాగుండె పరుగెత్తే గుఱ్ఱమాయె 

                                                       


30.    చెయ్యొద్దు    చెలి నా  జీవితాన్ని ఒక ఆటగా

         నవ్వొద్దు   కోమలి  నా    భావానికి   తోడుగా

         కొట్టద్దు కామిని   శక్తి  లేద్దన్న ఒక్క మాటగా

         నీవు తిట్టద్దు నాకన్నా నీకు డబ్బు కావాలిగా                                                         



 31.        నా హృదయంలో ఉంది నీ రూపు

              నీవు ఎందుకు చూస్తావు ప్రక్కవైపు

              మరువ  లేను నీవు పంచిన వలపు

              నీకు ఏదికావాలన్నా ఇస్తాను తెలుపు

                                                     



  32.       నీ బుగ్గలు బూరెలై పొంగుతూ   వుంటే

              నీ ఊరువులు ఒకటై ఉరకలు వేస్తుంటే  

              నీ పిరుదుల కదలికలు మతి పోతుంటే

              నిన్ను చూస్తూ ఉంటే నాకలనిజమైనట్టే 

                                                       



 33.      జాలిగుండె లేని పాషాణంగా మారావు మమత

            ఎందుకు నామీద తాపం, కశి, కక్ష, కోపం, ఎవగింత

            సహచర్యం నోచుకోలేని ఈ బ్రతుకెందుకు మమత 

            ఏ మన్న మరువలేను నీవు ఉంటావు నామనసంత 

                                                     


34.  నీ  చిరునవ్వుతో యుద్ధాలు      ఆప     వచ్చు

       నీ   చిరునవ్వులు శత్రువుపై సంధించ   వచ్చు

       నీ   చిరునవ్వుతో కుటుంబకలహం తీర్చవచ్చు

       నీ   చిరునవ్వుతో భర్తను   బుట్టలో వేయవచ్చు                                                     



 35.   అరచేతిలో  వైకుంఠం  అని   చెప్పమాకు

         ఆర్భాటాలతో  ఎగిరెగిరి  క్రింద పడమాకు

         ఆశల వలయంలో చక్కి అవమానపడకు     

         ఉన్న దానిని సుఖపెట్టి హాయిగా బ్రతుకు 

                                                                               


36.    పెళ్ళనేది    నూరెళ్ళ       పంట

          ఇరువురు కలసి  బ్రతకా లంట

          ఇది సుఖ-దుఖాల పల్లకి నంట 

          పరువాలు దోచే సమయమంట                                                       



37.    రవి కాంచని చోట కవి ఊహలు గాంచు

          మమతలు లేనిచోట మనసు   గాంచు

          వయసు పెరిగే చోట  వలపు    గాంచు

          పతివ్రత ఉన్న చోట  సుఖం     గాంచు   

                                                                                 


38.        గడబిడ పడక దడ  దడ లడించక

             జడ తలగడగా పడక అడ్డు  తడక

             నడక తడబడక ఛడమడా లాడక

             ఢమ ఢమ లాడించి ఢంకా  తట్టక                                                                



 39.       సిగ్గు ఎగ్గు లేక తగ్గు తగ్గు అంటూ ముగ్గులోకి లాగకు

             ఛెంగు ఛెంగు అంటూ గ్గుర్ గ్గుర్  అంటూ గోడుగేత్తకు

             గుగ్గిలం లా భగ్గు భగ్గు మంటు తొంగి తొంగి చూడకు

             దగ్గు తగ్గించి దగ్గర చేరి ధగ ధగ మెరుపు  ఆడించకు                                                         





  40.      కొంగు జార్చక  కోక విడువక కొంగలా ఒంటికాలుపై ఉండక   

             కోకో అంటూ ఆడక కొక్కొరకో కొక్కొరకో అని కోడిలా అరవక

             కోడె దూడలా పరుగులు పెట్టక, కోడె త్రాచులా బుసలుకొట్టక

             కోరి కోరి కోరుకున్న మొగుడి కోరికను కలలో కుడా  తీర్చక  

                                                                                  


41.        తట్టి తట్టి గట్టిగా పట్టి పట్టి చేయకు రట్టు

             ఒట్టు ఒట్టు నాగుట్టు పై పెట్టు తీసి పెట్టు

             పట్టు చీర కట్టు విప్పి పట్టాలి  ఒక పట్టు 

             చేయి, కాలు, నడుం, పట్టి ఉడుం పట్టు                                                

 42.       విరక్తి చెందక, చలోక్తులతో కట్టించాలి రక్తి

             యుక్తి యుక్తి అంటు  కలవాలని   లోకోక్తి

             మడికట్టుకోని కూర్చోక పెంచుకోవాలి శక్తి

             ఇరువురిశక్తి కలసి ఏర్పడుతుంది కొత్తశక్తి    


                                                                                  

43.             పొంగే   కెరటం  తీరం  వైపు   పరుగు

                  మకరందం కోసం  తుమ్మెద  పరుగు

                  తుంటరి పెదవి   జంట కోసం పరుగు 

                  ఉడుకు తగ్గుటకు స్నానానికి పరుగు                                                      




44,             ద్వేషించడం మాని,  ప్రేమించడం నేర్చుకో

                  జీవ హింస  మాని,  పోషించటం  నేర్చుకో

                 భార్య సలహాచి, బ్రతుకు   నేర్చుకో                                            

                             ఇరువురు ఒకటే ఆత్మగా బ్రతుకు దిద్దుకో

                                                        



45.              ప్రేమాయణం ముదిరిన పాకం లాంటిది

                   ఆత్మార్పణం పిరికి వాని పని  లాంటిది

                   శోభనం విద్య  నాసనానికి       పునాది 

                  సంసారం  కత్తి మీద  సాము   లాంటిది                                                      


         

46.               పువ్వుకు తావి లాగ ఉండాలి

                    భార్యను భర్త రక్షిస్తూ ఉండాలి

                    విమానంకు  రెక్కలు ఉండాలి

                    ప్రేమకు ఓర్పు సహనం ఉండాలి   

                                                     



 47.        కంచే చేను  మేస్తే  కాపు  ఏమి   చేసేది లేదే 

              పెళ్ళాం వీధిని పడితే మొగుడేమి  చేసేది  లేదే

              మెగుడు మొగాడు కాకపొతే పెళ్ళాం ఏమీ చేసేదిలేదే

              డబ్బుతో సుఖం కన్నా రోగం వస్తుందని తెలియందికాదే

                                                     



 48.         చేయాలను కున్నది చేయి,  చెప్పాలను కున్నది చెప్పు

              తినాలను కున్నది తిను,     త్రాగాలనుకున్నది త్రాగు

              ఆడాలనుకున్నది ఆడు, కలవాలనుకున్నపుడు కలువు

              తెలియని మాటలు విను, పెళ్ళాం మాటలు విని మసలుకో 

                                                       


  

49.         మద్దెల వాయించే టప్పుడు చేతిలో పట్టు ఉండాలి

              వీణ  వాయించే టప్పుడు వేళ్ళ గోళ్ళు ఉండాలి

              ఫ్లూటు వాయించే టప్పుడు రంద్రాలపై వెళ్ళు కదలాలి

              భార్య భర్తలు సుఖపడే టప్పుడు వాళ్ళంతా కదలాలి              

           


50.                నీ కళ్ళతో చూడు  నాకళ్ళల్లో  నీళ్ళు కనబడుతాయ

              నా కాళ్ళు చూడు   పాదాల బీటలు   కనబడుతాయ

              నా సళ్ళను చూడు  నీకొరకు బరువెక్కి కనబడుతాయ

              నా బంగారపు వళ్ళు చూడు నీకు మతి పోగొడు తుంది       

                                                                         


51.         ఇచ్చే వాడుంటే చచ్చేవాడు లేచివస్తాడు

              చచ్చినోడికి  వచ్చిందే    కట్నమన్నాడు

              తాత ఐన 16ఎల్ల పడచుతో పెళ్ళన్నాడు

              ఆడదంటే  ప్రతిఒక్కరికి   లోకువన్నాడు                                                           



 52.        మోసేవాడికి   తెలుస్తుంది      బరువెంతో

               తవ్వే   వాడికి   తెలుస్తుంది      లోతెంతో

               రోగానికి తెలియదు   డాక్టార్  విలువెంతో 

               పిల్లలను పెమ్చేటప్పుడు తల్లిపడే భాదెంతో 

                                                       


53.      రచ్చ రచ్చ చేయకు రమణి రమ్యమైన ఈ రోజున

             రవ్వల గొలుసుకు రణ రంగం  చేయకు ఈరోజున

             రుస రుస లాడకు ఈద్దరి ఆశలు ఫలించే ఈ రోజున

             సంతోష సంబరముగా జరుపు కోవాలి ఈపెళ్లి రోజున                                                             


 

 54.        మనస్సును   ఊహల్లోకి   విహరింప   చేసే ముద్దుగుమ్మ

             మగతను మాయం చేసి   ఉల్లాస   పరిచే    ముద్దుగుమ్మ

             మాయ మర్మం తెలియని పరువాన్నిపంచే ముద్దుగుమ్మ

             ముద్దు మీద ముద్దు పెట్టి సుఖాన్ని పంచే  ముద్దుగుమ్మ

                                                     



55.          కళ్ళజోడు పెట్టుకొని తడిమి    తడిమి చూస్తా  వెందుకు

               చల్లకు వచ్చి ముంత దాచి  పిరికి వాడివయ్యా వెందుకు

               వళ్ళంతా గుల్ల గుల్ల చేసి   కోర్కను తీర్చు కో   వెందుకు

               ఏ  పని చేయక ఊరకే  డబ్బు లిచ్చి   పోతా     వెందుకు                                                    



 56.         మొగ మొహం ఎరుగని పరువంలో  ఉన్న పిల్లనంది

                పస ఉంటే  ఈ క్షణమున పరువాన్ని దోచుకోమన్నది

                ఇద్దరు ఏకమై ఒకటవ్వాలని యవ్వన కోరిక తెలిపినది        

               పిల్లగుట్టుతెలిసిందినాబల్లగట్టుఎగిసిపడుతున్నది 

            

                                                                     


 57.      చూసి   చూసీ   కళ్ళు   కాయలు  కాసాయ  

            సూర్య  వేడికి    రోళ్ళు   పగల    కున్నాయ

            కోపంపెరిగితే     వళ్ళు  వేడి సెగలయినాయ 

            నడుస్తూపోతే మైళ్ళు తగ్గి గమ్యంచేరి  నావా       

                                                    



  58.     చదువుకున్న వాని కంటే చాకలి మేలు

            ఉంచు కున్న దాని కంటే ఉన్నదే మేలు

            నుదుట  వ్రాసిన  సుఖ-దుఖాలే  మేలు

            శక్తి ఉన్నప్పుడే దేవుని కొలువుట మేలు 

                                                    



 59      వేడి సెగకు పొంగే పాలను నీటిచుక్కతో చల్లార్చు

           గగనంలో మేఘం పొంగును మెరుపు   చల్లార్చు

           మమతల పొంగును శాంతి సౌభాగ్యాలు చల్లార్చు

           వయసు పొంగును ముద్దు మురిపమే   చల్లార్చు

                                                    




60.     శంఖంలో  పోస్తే  గాని తీర్ధం కాదు

          పుష్పవతి ఐతే గాని  పెళ్ళి  కాదు   

          అనుభవం ఐతే  గాని నిజం తెలియదు

          పెళ్ళి ఐతే గాని సుఖం అంటే తెలియదు 

                                                   



61.      విధి తప్పింప ఎవరి తరమూ కాదు

           కళ్ళలో కన్నీరు ఆపడం తరము కాదు 

           పరిమళాన్ని ఆపడం ఎవరి తరము కాదు

           ఆడవాళ్ళ మధ్య తగాదా తీర్చుట కుదరదు                                

                                                                              



62.             భర్త వేరొకరితో ఉంటే భార్య కన్నులు నిప్పులు కురుస్తాయి

                  వినకూడని మాటలు వింటే వళ్ళంతా మంటలు మండుతాయి 

                  భార్య భర్త కోరిక తీర్చకపొతే కోపంతో కళ్ళువేడి సెగలవు తాయి

                  అగ్గిమీద గుగ్గిలంలా అరిచేవాడికి శాంతివచనాలు తలకెక్కుతాయ                                                                        

63.       సుజనుడిలా నడుచు సుజనుడిని

            పశువు వోలే  ప్రవర్తించు    పాపిని

            మందుకు బానిసైన       మూర్ఖున్ని

            కామాన్ని జయించలేని కాముకుడ్ని 

                                                      



64.       మల్లెలు  జడన దురిమిన నొక మగువను చూస్తె

            కళ్ళలో కాంతి, చెక్కిళ్ళులో  మేరుపును   చూస్తె        

            చెంతకుపొయి నవ్వుతూ కోర్కను తెలియ పరిస్తె   

            ముందు లోకం చూడు తరువాత నీ కోరిక  చెల్లిస్తా                                                                           


                                   

65.        సొమ్ము పిల్లలు  లేక పోతె దమ్ము ఉండదు

             దమ్ము లేకపోతె మంది మార్బలం ఉండదు

             మందిమార్బలం లేకపోతె పరువు ఉండదు

             పరువు లేకపోతె  రజకీయ పదవి  ఉండదు

                                                     



66.        పడ్డ వారెవరు చెడ్డ వారు కాదు

             ఆడది తిరిగినంత మాత్రాన  చెడ్డది కాదు  

             మగాడు తిరగనంత మాత్రాన చెడ్డవాడు కాదు

             బ్రతుకుకోసం వళ్ళు అమ్ముకొనే వారుచెడ్డవారుకాదు

                                                       


 

67.        పంచభక్ష పరవాన్నాలు  తిన్న వారికి  తిన్నంత

             వైడూర్యాలు అందుకున్నవార్కి అందుకున్నంత   

             బంగారపునగలు కావలసినవారికి కావలసినంత

             సొమ్ము  తనది కానప్పుడు   పంచుతారు ఊరంత  

                                                     



            



68.        బంగారంలా కోర్కలు ఖరీదయ్యాయి

             సుఖమైన బ్రతుక్కు కస్టా లోచ్చాయి

             పొగడిన నోటితోనే తిట్లు కూడపడ్డాయి

             తప్పుచేసిన బొత్తిగా కంటికి కరువయ్యారు    


                                                      






69.         మనుష్యుల నడవడి బట్టి మనం మారాలి

              గొప్పలు చెప్పే  వారిని  దూరంగా ఉంచాలి

              ఎదురు మాట్లాడేవారుంటె మనమే తగ్గాలి  

              ఇరువురుకలసి ఒక్క మాటమీద నడవాలి

                                                     



70.         తహతహ లాడకు తపన తగ్గిమ్చేదాక ఓపిక పట్టు

              తమకంతో, కోపంతో  ఉండకు ఏదో తప్పు చేసినట్టు

              తామర పువ్వునుచూసి ముద్దివ్వాలనిపించి నట్టు

              తన్మయత్వంతో నీకు తనువూ అరిపిస్తా నీపై ఒట్టు         

                                                     



71.          కొత్త     కాపురంలో కుడి  కాలుతో  పెట్టాలి   అడుగు

              కోరుకున్న మొగుడే కదాఅని వేయకు తప్పటడుగు

              అత్త,ఆడపడచులవద్ద జాగ్రత్తగా వెయ్యాలి ప్రతిఅడుగు

              భర్తను మొహమాట పడకుండా కావలసింది అడుగు     

                                                                                



72.              వెచ్చదనం మమతలకు మూలధనం

                   పైరు పచ్చదనం అందరికి మూలధనం

                   తల్లి ప్రేమ అందరికి పంచే సమాన ధనం

                   అక్రమ సంపాదన స్తిరంగా ఉండని ధనం    

                                                       


 

73.              మల్లికా మౌనమేల ఈ వేళ  

                   మనసును దోచిన   ఈ వేళ 

                   ఆశలు తీరుస్తున్న  ఈ వేళ

                   వలపు పంచుతానన్న ఈ వేళ 

                                                     







74.       కావలసింది కమ్మని కబుర్లు కాదు పని చేయగల స్త్రీ

            అందరూ  చూడాల్సింది రూపం కాదు గుణం గల స్త్రీ   

            వంపు సొంపులు గల స్త్రీ కన్నా కావాలి ఓర్పుగల స్త్రీ

            ఆకర్షించి చక్కని మాటలు పలికే తీర్పు నేర్పు గల స్త్రీ

                                                   




75.          నీ వింత  తిని   ఎవరికైన   కొంత పెట్టు

               ఆరోగ్యముగా ఉండి  భర్తను సుఖ పెట్టు

               భార్యాభర్తలు కలసిఉంటే ప్రగతికి మెట్టు

               దేవుణ్ణిపూజిస్తె మనశాంతి ఉండును ఒట్టు 

                                                    


            

76.          వద్దన్న వదలకుండ నా వెనుకే తిరుగుతారు మా వారు

               ఎంత చేసిన ఏదోతగ్గించానని మొత్తుకుంటారు మావారు 

               నేనొక యంత్రాన్ని, యంత్రంలా చూస్తారు ఇంట్లో అందరు

               సందిస్తే చాలు నన్ను ములగ చెట్టు ఎక్కిస్తారు మావారు     

                                                                                



77.          ముసురుకున్న ముసలి తనాన్ని మరిచే విధముగా

               విజ్ఞానాన్ని విస్తరింపచేసుకొని జ్ఞానభోధలు చేయాగా

               ఆజ్ఞానులను, జ్ఞానులుగా మార్చుటకు ప్రయత్నించగా

               60లోఉన్న 20లోఉన్న వారివలె మావంతు కృషిచేయగా    

                                                                               



 78.         తలార స్నానముచేసుకొని, జుట్టు ఆర బెట్టుకొని

               ముఖమునకు పౌడర్ వ్రాసుకొని, బొట్టు పెట్టుకొని

               అద్దంలో అందాన్ని చూసి నవ్వుకొని,చేలికాడేడని

               నాలో వేడిని తగ్గించే మగాడేడని కోరే మధురవాణిని                                                                                 


            

 79.       చేప పిల్లలకు నీటిలో ఈత ఎవరు నేర్పారు

             పక్షలు గాలిలో  ఎగరమని ఎవరు చెప్పారు

             జంతువులును చంపి ఎవరు తినమన్నారు

             చదువులేని స్త్రీకి  శృంగారం ఎవరు నేర్పారు 

                                                     


  

 80.       చిలువలు   వలువలు   చేసి   చెప్పారు

             అదిగో గుడ్డు అంటే ఇదిగో పిల్ల అంటారు

             గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిమ్చిం   దంటారు   

             కోరిక ఉంటే వయసుతో పని లేదంటారు 

                                                      


  

 81.         విధి తప్పింప   ఎవరి   తరమూ      కాదు

               మనస్సును మేపిమ్చుట  కష్టము  కాదు

               సుఖము ఇంతని చెప్పుట సాద్యము కాదు

               యవ్వనము ఎప్పుడు స్తిరముగా ఉండదు     

                                                      


  

 82.         లోకం తీరే  అంత,  లోకం పోకడే  అంత

               పాపం లోకం అంత, దీపం వెలు   గంత   

               చేసేది చాలకొంత, చేయాల్సింది మరింత

               స్త్రీ సుఖం కొంత, ఇరువురికి ఫలితం మరింత 

 83.       ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్ట  లేడు

             అనువుగాని చోట అధికుల  మనలేడు   

             డబ్బు లేనివాడు  డుబ్బుకు కొరగాడు

             ప్రేమించ లేనివాడు భర్తగా  పనికిరాడు 

 84.       చెడ్డ కొడుకుండచ్చు కాని  చెడ్డ  తల్లి   ఉండదు

             చెడ్డ మొగుడుండచ్చు కాని చెడ్డ భార్య ఉండదు

             మనసు మంచిది కావచ్చు కాని చేసే పనే ఉండదు 

             భర్త శాంతంగాఉండచ్చు భర్యమాత్రం శాంతంగా ఉండదు

85.         అందరికోసం ఒక్కరు,   ఒక్కరి  కోసం    అందరు

              పూజ చేసేది ఒక్కరు, చేయించుకొనే  వారెందరు

              అదృష్టం పట్టేది ఒక్కరు, అనుభవిమ్చేవారెందరు  

              పెళ్లి చేసుకొనేది ఇద్దరు,    చేయించే    వారెందరు 

86.         తనదాకా వస్తేగాని తత్త్వం భోద పడదు

              పెళ్ళైతే గాని  మనసు  కుదట   పడదు

              ఇద్దరు కలిస్తేగాని        ఆదృష్టం పట్టదు 

              కోరిక కలిగితే వయసుతో పని   పడదు  

 87.      ఆడువారి పనులకు మాటలకూ  అర్ధాలే వేరులే

            మగవారి మాటలకు రాలును    మణి  రత్నాలే

            పిల్లల నవ్వులకు రాలును ముత్యాలు మూటలే

            మనం పూజించాలి  శ్రీ వేంకటేశ్వరుని    పాదాలే

88.       నీకు సాద్యం కానివన్నీ అసాద్యం అనకు

            గర్భం రాలేదనకు ప్రయత్నం   మానకు

            త్రుప్తిపడితే అంతా సుఖమని మరువకు

            పనిచేయటమే నీవంతు ఫలితం ఆశించకు      

89.         నక్కలు బొక్కలు    వెదుకును

             కుక్కలు చెప్పులు    వెదుకును

              సతులు పతులును వెదుకును

              ప్రేమలు బ్రతుకుని గట్టెంకించును

 90.        వేషదారి మాటనెపుడు విశ్వశింప రాదు

              మాటకారి నెపుడు నమ్మి మొసపోరాదు

              తెలివైన వాడు మౌనముగా ఉండ  రాదు

              మనసున్నవాడి  మాటలు మరువరాదు

  91.       అన్నదానం జాములో నరగి పోవు

              వస్త్ర దానం ఏడాది లో చిరిగి  పోవు

              గృహదానం కొన్నేళ్ళకు కూలిపొవు

              ప్రేమ దానం జగతిలో  నిలిచి  పోవు

 92.       తెలుగు భాషను వెలుగుగా విశద పరిచి

             పాడు కొమ్మని పద్యములు  పరవశించి

             తెలుగుభాష గొప్ప జగతికి తెలియపరిచి

             తెలుగువారి గొప్పను ప్రపంచములో విస్తరించు 

93.    మంచిని కోరి మంటను పంచనివాడు భంధువు

         హితం కోరి యక్ష ప్రశ్నలు వేయనీవాడు హితువు

         సాన్నిహిత్యం కోరి ప్రాణానికిప్రాణమైన స్నేహితుడవు

         సమస్త ప్రాణులకు మేలు చేసే  సన్నిహితుడవు

94.    సూర్యకిరణ స్పర్సతో పద్మం  వికసిస్తుంది  

         చంద్రకిరణ  స్పర్సతో  కలువ  వికసిస్తుంది

         మేఘం గాలి  స్పర్సతో వర్షం  కురిపిస్తుంది

         పరువంలో ఉన్నపడచు సర్వం అర్పిస్తుంది             

95.    బొంగరంలా కళ్ళు తిప్పుతున్నావు

         ఉంగరంలా జుట్టు పెంచుతున్నావు

         బొడ్డు క్రిందకు చీర కడు  తున్నావు   

         బొడ్డును చూపక  మత్తెకిస్తున్నావు 

96.    పగడాల పెదవులతో మమ్ము పడగోడు  తున్నావు

         మల్లెపూల కురులతో మమ్ము మైమరి పిస్తున్నావు

         మేడపై బట్టలారేస్తూ నవ్వుతూ నన్ను పిలుస్తున్నావు

         నా కలలోకి వచ్చి చిలిపి చేష్టలతో భాధ పెడుతున్నావు     

97.    తీయని ముచ్చట లెన్నో చెప్పి ఆలోచనలో దింపావు

         పెదాలను అంది అందించ  కుండా  జాగార్త పడినావు

         మబ్బులు అంచులు దాక నా మనసును లాగినావు

         నాకు పెళ్ళి కుదిరింది నా బ్రతుకులోకి రాకు అన్నావు  

 98.        ఎండా వానలు వాటి ఇష్టం ప్రకారం వస్తాయి

              జీవితములో సుఖ దుఖాలు వెంబ డిస్తాయి

              భందాలు వద్దనుకున్న అవసరమవుతాయి

              ప్రేమపక్షులు మోజు తగ్గాక గూటికే చేరుతాయి 

99.         శాంతి సహజీవనం సర్వులకు   మేలు  

              అచ్చి వచ్చిన స్తలం అడు  గైన   చాలు

              నిత్యం సుఖం పంచే భార్య ఉంటే చాలు

              ఎదురు ప్రశ్న వేయని భర్త ఉంటే చాలు         

100.            గుండెలో  గాయం చేసింది నీ  మాయ   ప్రేమ

                   పువ్వు   సోకగా   నా   సోకు  కందించే   ప్రేమ

                   కన్నీటి ధారలతో మేని పులకరింతలతో  ప్రేమ

                   మనుషులేరగని మాయను కమ్మిన వెర్రి ప్రేమ

 101            తాగట్ట బట్ట లేదు,  ఇంకొకరికి ఇస్తారుట                   

  .         సూర్యకిరణాలను పట్టుకొని ఇంధనంగా మార్చాలనుకున్నా

              కిరణాలవల్ల వచ్చే కలువపూలపై ప్రయోగాలు చేయాలనుకున్నా

              కిరణాలతో క్రిమికిటకాలను కాలుష్యాన్ని తరిమేయాలనుకున్నా

              నీటిని ఆవిరిగామార్చి, కృత్రిమ మేఘాలును సృష్టించాలనుకొన్నా     

    .         ఎవరెంత ఎగతాళి చేసిన నా బ్రతుకింతేనని చెప్పాలనుకున్నా

              అమ్మ నాన్నలకు సేవలు చేస్తూ  రుణపడి ఉండాలనుకున్నా

              అనారోగ్యులను ఆరోగ్యులుగామార్చుకు నావంతు కృషి చేస్తున్నా

              చేతనైనంత సహయము చేస్తూ,  స్త్రీలను గౌరవిస్తూ బ్రతుకుతున్నా    

                                                                                 




1*తండ్రి ఆశీర్వాద బలం.* ప్రాణం విడిచే ముందు ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “బాబూ, నేను ఏ సంపదను ఇవ్వలేకపోయాను. గానీ జీవితాంతం ఎల్లప్పుడూ నిజాయితీగా, నా వ్యాపారంలో ఉన్నాను. ఆ నిజాయితీ బలంతో నీకు ఆశీర్వదిస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది ! " అని కుమారుడి తలపై చేయివేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుదిశ్వాస విడిచాడు. ధరమ్ పాల్ భక్తితో తన తండ్రి అంత్య క్రియలు పూర్తి చేశాడు. ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ తోపుడు బండిపై స్వీట్ వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజుల లోనే తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు. సరుకుల నాణ్యత వలన క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది. మూడేళ్ళకు నగరంలోని ఐశ్వర్యవంతులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను పూర్తిగా విశ్వసించాడు. తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ, ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక స్నేహితుడు అతనితో “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని వెనుకగా గేలి చేసినా పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు. మరికొన్ని సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. *నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్ కుతూహలపడ్డాడు*. ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు. *ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,* ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు. భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే. తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు. జాంజిబార్ లో ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారిపై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. వారంతా భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. ఎవరని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. సుల్తాన్ కి ఎదురుపడి ధరమ్ పాల్ నమస్కరించి "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." సుల్తాన్ అతనితో తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు. సుల్తాన్‌తో వినయంతో వందలాది మంది సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని అడిగాడు. సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు. ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”. అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు. " లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. “ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక మీరు ఏం సంపాదిస్తారు? ” ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.” సుల్తాన్ ఇలా అడిగాడు, “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, *“మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు"*, అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు. ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి, ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది. సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. “ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” . అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు." సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు. కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు. *తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.* వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ. *ఈ ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.* అనుభూతి - నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి నేను కృతజ్ఞుడను మీ విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ *ప్రవర్తన- పరివర్తన* ➖➖➖✍️ 2 *ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు.* *ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి.* *అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి.* *ఎందుకంటే…* *దీనివల్ల చాలా లాభాలున్నాయి.* *నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది, కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తుంది.. అనిచెప్పటంలో తిరుగు లేదు. ఎంత ధ్యానం చేసినా, యోగా, వ్యాయామం.. చేసినా దానిని సరిచేయలేవు.* *దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి.* *రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది. మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. ఎంత పూజ చేసినా ఉపయోగం ఉండదు. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం.* *నేడు చాలామంది తనలోని మంచిని వదిలేసి ఎదుటివారిలో చెడుని చూస్తున్నారు-చూపిస్తున్నారు. తామే నీతి మంతులము, సచ్చీలురము .. ఎదుటివారు అందరూ సత్ప్రవర్తన లేనివారే అని భ్రమ పడుతుంటారు, కానీ వారే సమాజానికి ఉపయోగం లేనివారు .* *దీనివలన ఎదుటివారికి చెందవలసిన అశుభపరిణామాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని వీరు అనుభవిస్తున్నారు.* *దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. వీరు కూడా అంతే... చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది?* *ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది.* *ఉదయం లేవగానే ‘ఈ లోకం లో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి!’ అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి.* *ఇలా చేస్తే...* *మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు.* *మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.* *మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.* *అంతేకాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి వారికి చెందవలసిన చెడు ను మీరు అనుభవించకండి...* *పుట్టుకతో ఎవరూ దుర్మార్గులు కాదు, పాపాత్ములుకాదు. ప్రతివారిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. కానీ మన దురదృష్టమేమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటంలేదు.* *దీనివల్ల అలాంటివారిపై దుష్ప్రభావం ఎక్కువగా ఉండి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. జీవితాలు, ఆరోగ్యం, మనశ్శాంతి పోగొట్టుకుంటున్నారు.. విరోధులను పెంచుకుంటున్నారు, బావిలో కప్పలు లాగా జీవిస్తున్నారు...* *దయచేసి అంతా క్షమాగుణం కలిగి, ఎదుటివారిలోగల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచిగురించిమాత్రమే చెబుదాం!* మీ విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ ✍️


03. 🌿ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
🌿ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. 
🌿స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..
🌿దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...
🌿ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా. 
🌿ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి. 
🌿అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు. 
🌿మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..
🌿అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.  
🌿ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. 
🌿అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.  
🌿గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి, 
🌿కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.  
🌿ఈ కర్రల్లో  మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి. 
🌿ఏకదండి:- 🌿🌿🌿 
🌿ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. 
🌿అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు. 
🌿అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. 
🌿అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే  సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. 
🌿వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన  కర్ర ఉంటుంది.
🌿ద్విదండి:- 🌿🌿🌿 
🌿రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.  
🌿ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు. 
🌿వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. 
🌿జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం. 
🌿జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.
🌿త్రిదండి:- 🌿🌿🌿 
🌿మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు. 
🌿ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. 
🌿వీరిది రామానుజాచార్యుల పరంపర. 
🌿శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు. 
🌿జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, 
🌿జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, 
🌿నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై, 
🌿మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, 
🌿వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.
🌿ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ, స్వస్తి
🌷🌷🌷

 04. అంతా రామ మయం ...
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా
వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ
భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు
కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .
విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా
వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !
తిరుగులేని మాటకు - రామబాణం 
సకల సుఖశాంతులకు - రామరాజ్యం .
ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన
ఆజానుబాహుడి పోలికకు - రాముడు
అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 
రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .
ఆదర్శ దాంపత్యానికి సీతారాములు
గొప్ప కొడుకు - రాముడు
అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు
గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .
మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).
మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).
సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు . రామాయణం పలుకుబళ్లు
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే . ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది ...

చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం . జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ . ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం
కబళించే చేతులు , చేష్టలు కబంధ హస్తాలు . వికారంగా ఉంటే - శూర్పణఖ చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ). పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు. మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర పెద్ద ఇల్లు లంకంత ఇల్లు . ఎంగిలిచేసి పెడితే - శబరి ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే . 
పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే.
సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని యుద్ధమంటే రామరావణ యుద్ధమే .
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం ).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు అది ఒక జీవన విధానం
 శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే 
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
***
5. దేవదాసుని కథ:
పూర్వం పాటలీపుత్రనగరంలో గొప్ప ధనిక వంశంలో పుట్టిన దేవదాసుడనే వర్తకుని పుత్రుడున్నాడు. అతడు పౌండ్రవర్ధనమనే నగరంలోని ఒక సంపన్న వణిజుని పుత్రికను పెండ్లాడాడు. తండ్రి మరణింపగా అతడు క్రమంగా వ్యసనపరుడై జూదంలో తనకున్న సంపదనంతా పోగొట్టుకున్నాడు. దరిద్రంతో బాధపడే తన కుమార్తెను తండ్రి పుట్టింటికి తీసుకొని వెళ్లాడు. కొంతకాలానకాతడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వ్యాపారం చేసి ధనవంతుడు కావాలనుకొని మామగారిని కొంత ధనమడగటానికని పౌండ్రవర్ధన నగరానికి వెళ్లాడు. కాని అతనికి అభిమానం అడ్డువచ్చింది. స్వజనం దగ్గర చేయిచాపటం అభిమానవంతులకు మరణంతో సమానం( ''వరంహి మానినో మృత్యుర్న దైన్యం స్వజనాగ్రత: ''3-5-22) అని అనుకున్నాడు. అందుకని ఆరాత్రి ఒక అంగడికేగి అక్కడ ముడుచుకొని కూర్చున్నాడు. ఇంతలో ఒక వణిగ్యువకుడు అంగడి గదిలోనికి వెళ్లటం ఆతనిని అనుసరించి మరో స్త్రీ వెళ్లటమాతడు గమనించాడు. ఆ యువతి తన భార్యగా గుర్తించాడు. వారి కలయిక పూర్తియైన తరువాత ఆమె ఆ యువకునితో ఏదో చెప్పటాన్ని గదిబయటినుండే దేవదాసుడు చెవియొగ్గి వినసాగాడు. ఆమె నీకొక రహస్యం చెపుతానంటూ ఆ ఉపపతితో '' నాభర్త ముత్తాత వీరవర్మ మాయింటి ముంగిట్లో నాలుగుమూలల వరహాలు నింపిన నాలుగు కడవలను పూడ్చి పెట్టాడని-ఈ రహస్యాన్నాతడు తనభార్యకే చెప్పాడని-ఆమె తనకోడలుకు చెప్పగా-అమె కూడా ఈ రహస్యాన్ని తనకోడలుకు చెప్పగా- మాఅత్త నాకు చెప్పిందని-ఈ రహస్యం కేవలం ఆడువారి మధ్యనే ఉందని- నీవు పాటలీపుత్రానికి పోయి నా భర్తనుండి ఆ ఇంటిని కొని ఆవరహాల కడవలను తెచ్చుకోమని చెప్పింది. ఈ మాటలు విన్న దేవదాసుడు వెంటనే పాటలీపుత్రానికి వెళ్లి తన యింటి నలుమూలల నున్న వరహాలకుండలను బయటకు తీసికొన్నాడు. ఇంతలో తన భార్యాకాముకుడైన ఆయువకుడక్కడకు వచ్చి ఆయింటిని విస్తారధనమిచ్చి దేవదాసుని వద్దనుండి కొన్నాడు. దేవదాసు మామగారి నగరానికి వెళ్లి అక్కడ వేరుగృహంలో ఉండి భార్యను రప్పించుకున్నాడు. ఆదుష్టయువకుడు వరహాలకడవలను పొందలేక తిరిగి వచ్చి నీయిల్లు నీవు తీసుకొని నాడబ్బు నాకీయమని తగాదా పడసాగాడు. దేవదాసుడు దీనికొప్పుకొనక రాజుగారి వద్దకీవివాదాన్ని తీసుకొని వెళ్లాడు. రాజునకు  జరిగినదంతా చెప్పాడు . రాజు పరభార్యాకాముకుడైన ఆ వక్రబుద్ధి  యువకునకు సర్వస్వ దండన విధించాడు. దేవదాసు మరో యువతిని వివాహమాడి వ్యాపారం చేసుకొంటూ ధనవంతుడయ్యాడు. ఈ విధంగా ధర్మార్జితమైన లక్ష్మి వంశమున్నంతవరకు చెడిపోక ఉంటుంది. ఇతరములైనవి జలమునందు పడిన మంచుకణాల్లాగా నశిస్తాయి.( '' ఇత్థం ధర్మార్జితా లక్ష్మీరాసంతత్యనపాయినీ/ఇతరాతు జలపాత తుషార కణ నశ్వరీ'' 3-5-50 ) కథాసరిత్సాగరం-మూడవదియైన లావాణక లంబకం-ఐదవ తరంగం).
***

6🌻। శివ విహారము  - 6 🌻

దేవతలకు ఇష్టుడగు విష్ణువు నాతో, మరియు దేవతలతో గూడి అచటకు వెళ్లి శంకరుని చూచు కోరికతో ఆయన నివాసమునకు వెళ్లెను (49)। అచట శివుడు కానరాలేదు। దేవతలతో గూడియున్న విష్ణువు ఆశ్చర్యమును పొందెను। ఆయన వినయముతో అచట నున్న శివగణములను ఇట్లు ప్రశ్నించెను (50)।

విష్ణువు ఇట్లు పలికెను--

ఓ శంకర గణములారా! సర్వేశ్వరుడగు శివుడు ఎచటకు వెళ్లినాడు? దుఃఖితులమగు మాకు దయగలవారై ప్రీతితో ఈ విషయమును చెప్పుడు (51)।

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఆ శంకర గణములు దేవతలతో గూడియున్న లక్ష్మీపతి యొక్క ఆ మాటలను విని ప్రీతితో ఇట్లు నుడివిరి (52)।

శివగణములు ఇట్లు పలికిరి-

హే విష్ణో! శివుని ప్రీతి కొరకై మేము సత్యమును పలికెదము। బ్రహ్మతో, దేవతలతో గూడి వృత్తాంతమునంతనూ వినుము (53)। సర్వేశ్వరుడు, అనేక లీలాపండితుడు అగు మహాదేవుడు మమ్ములనిక్కడ ఉంచి ఆనందముతో పార్వతి ఇంటికి వెళ్లినాడు (54) ఓ లక్ష్మీపతీ! ఆ ఇంటిలోపల మహేశ్వరుడు ఏమి చేయుచున్నాడో మేము ఎరుంగము। అనేక సంవత్సరములు గడిచినవి (55)।

బ్రహ్మ ఇట్లు పలికెను--

ఓ మునిశ్రేష్ఠా! వారి ఈ మాటను విని ఆ విష్ణువు నాతో, మరియు దేవతలతో కూడి మిక్కిలి విస్మితుడై శివుని ద్వారము వద్దకు వెళ్లెను (56)। ఓ మునీ! నాతో దేవతలతో కలిసి దేవతలకు ఇష్టుడగా ఆ విష్ణువు అచటకు వెళ్లి బిగ్గరగా ఆర్తితో కూడిన కంఠముతో పిలిచెను (57)। 

సశేషం।।।।

ప్రాంజలి ప్రభ 
7. అతి ముఖ్య సమాచారం ( కరోనా )

ఇంట్లో పెద్దవారికీ.. స్మార్ట్ ఫోన్ లేనివారికీ.. మీతో ఉండే చదువలేని 
వారి కీ వివరంగా చెప్పండి...ఎందుకంటే, కరోనా వారికి వస్తే, 
మీకూ వచ్చినట్టే..

మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ తోటి వారిని జాగృతం చేయండి..

👉చైనా వాళ్ళు జనవరి 23 నుంచి ఇంట్లో కూర్చుని lockdown లో ఉంటే నిన్న మొదటి సారి..60 రోజుల తరువాత, కొత్త cases రాకుండా ఆగాయి. దీనిని బట్టి మనం ఎన్ని రోజులు - ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి బాగా ఆలోచించండి🙏🏻

👉మాకు ఏమి కాదులే అని అనుకుంటే పొరపాటే.
ఒకసారి india లో పాకింది అంటే, కనీసం 1 కోటి మంది చనిపోతారు.

👉వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది. దయచేసి You Tube వెధవల మాటలు నమ్మకండి.

👉దయచేసి ఇంట్లో ఉండండి. చదువుకోని  వాళ్ళకి దీని importance చెప్పండి..
కొంత డబ్బు చేతిలో ఉంచుకోండి. ATMలు..బాంకుల పరిస్థితి ఏమిటో చెప్పలేము.
డబ్బు చాలా చాలా జాగ్రత్తగా వాడండి. తిండికి, మందులకీ తప్పితే అనవసరంగా దేనికి రూపాయి వృథా చేయవద్దు. సింపుల్ గా జీవించండి.

👉ఇటలీ లో 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటేనే అంత మంది చచ్చిపోయారు. India లో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్లో. మన హాస్పిటల్స్ లో
వసతులు అంతంత్ర మాత్రం..

👉మేము బాగున్నాం, మాకు ఎం కాదు, అని అనుకుంటే పొరపాటే. ఇది గాలిలో నుంచి కూడా వస్తుంది అని ఇవాళే WHO చెప్పింది.

👉ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గుతుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే. దయచేసి డాక్టర్స్ కి , నర్సులకి పని పెంచవద్దు.

👉ఎక్కడికి వెళ్లద్దు.  మీకు ఎవరిమీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళకి దూరంగా ఉండండి. ముఖ్యంగా, బయట అంతా తిరిగి ఇంట్లో ముసలివారిని బలి చేయకండి.

👉🏻ఇంటికి రాగానే బట్టలు డెట్టాల్ లో నానబెట్టండి. ఫ్రెష్ గా స్నానం చేసి
తరువాత ఇంట్లో మిగతావారిని కలవండి..బయటనుండి  ఇంట్లోకి వచ్చిన పది నిమిషాల్లో మీ స్నానం అయిపోవాలి.  

👉🏻దయచేసి ఎవరిదో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందనో పోయి కలవవద్దు.కావాలంటే, ఫోను contact list చూసి, ప్రతి ఒక్కరితో మాట్లాడు. 
నీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క నంబరుకీ ఈ సమాచారం పంపించు 🙏🏻
కరోనా గురించి మాట్లాడు. నీకు తెలిసిన సమాచారం వారికి తెలియజేయండి.

👉india వాళ్ళకి ఇమ్యూనిటీ  ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ,  వైరస్ చస్తుంది..ఇవన్నీ నిజాలు కావు. అది ఏ temperature లో అయిన వ్యాపిస్తుంది.

👉1918 లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశంలో 1 కోటి మంది చచ్చిపోయారు. అప్పుడు, 
రవాణా సదుపాయాలు, ప్రజల కదలిక ఇంత లేదు.అయినా కూడా అంతా వ్యాపించింది.

👉దయచేసి, మాకు india లో 300 కేసులు మాత్రమే ఉన్నారు.. 
తక్కువ తీవ్రత అని అనుకోకండి. 
1 వారంలోనే ఇటలీ, ఇరాన్ లలో  300 నుంచి 6000-7000 వరకు,  2 వారాలు లో 20,000 కు పెరిగిపోయాయి. ఇప్పుడు రోజుకు వందల మంది చనిపోతున్నారు.

🙌చేతులు శుభ్రంగా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు పాటు కడగాలి.

🥱🤭🤧 ఊరికే మొహం, ముక్కు, నోరు, కళ్ళు, తాకవద్దు. వీలయినంత ఇంట్లోనే ఉండండి.. దగ్గు, జలుబు ఉంటే అస్సలు ఎవరినీ తాకవద్దు ఏ ఇబ్బంది ఉన్నా,వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోండి.

👉🏻 మాస్క్ వేసుకొని..చేతులు కడుక్కుంటే..కరోనా రాదు అనే భ్రమలో ఉండకండి..
ఫుల్ బాడీ సూటులు వేసుకుని,అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న డాక్టర్లకు
కూడా ఇది వ్యాపించింది..మనుషులందరూ ఒకరికొకరు, వీలయినంత దూరంగా 
ఉండటం చాలా ముఖ్యం..

👉🏻 ఇంట్లో..పని ప్రదేశంలో అందరూ ఒకరికొకరు..
వీలయినంత దూరంగా ఉండండి. మీకు వైరస్ సోకిందన్న విషయం, మొదటి పది రోజులు మీకు కూడా తెలియదు(incubation period)..కానీ, ప్రక్కవారికి వ్యాప్తి చేస్తారు..

👉🏻ఎదుటి వారి ఫేస్ టు ఫేస్.. మొహం వంక చూస్తూ మాట్లాడకండి. వీలయినంత దూరంగా ఉండి, తలవంచుకొని మాట్లాడండి.. కంటికి కనపడకుండా, ఒకరి నోటి తుంపర్లు వేరొకరి మొహం మీదా..బట్టలమీద పడతాయి. తద్వారా, మీకూ వైరస్ 
సంక్రమిస్తుంది.

జాబిలి కన్న గొప్పదియు -  మల్లెల కన్న తెల్లదియు 
మీగడ  కన్న  మించినది - వెన్నెల కన్న చల్లనిది 

బిడ్డపై అమ్మ  ప్రేమయెరా - నే డు  ప్రేమను మింగే కరోనా వచ్చింది జాగ్రత్త   

--(())__