Friday 24 February 2017


శివానందలహరి



( శ్రీ శంకర భగవత్పాద విరచితము)

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు రచించిన స్తోత్ర గ్రంథాలలో " సౌందర్య లహరి", " శివానంద లహరి" ఒక ప్రత్యేక తను సంతరింౘు కొని మకుటం లేని శతకాలుగా కీర్తి శిఖరాలను అందు కున్నాయి. " సౌందర్య లహరి" శ్రీ విద్యా రహస్యాలతో శోభిల్లగా, " శివానందలహరి" పరబ్రహ్మ  భావనయే పరమేశ్వర భావనగా విరాజిల్లునట్టిది.

జగద్గురువు లు ఆదిశంకరులు అనుగ్రహించిన " శివానందలహరి" ఒక భక్తిరస సింధువు. శివాత్మకమైన ఆనంద పయోనిధిలో ని ఒక్కొక్క తరంగమొక్కొక్క శ్లోకము.

నేను పామరుణ్ణి అనుకొనే వాడు కూడా__ఈ శ్లోకాలను ,అందులోని భావాలను ౘదివి, పండితుడ య్యే అవకాశముంది. ౘదవడానికి  ప్రయత్నం చేయడమే మనపని. ఆ తరువాత అదే ౘది విస్తుంది.

దేవాది దేవుడైన పరమశివుడిని చేరుకోవాల్సిన అవసరాన్ని, అందుకు మార్గాన్నీ " శివానందలహరి" మనకు ౘూపిస్తుంది. దీన్ని ౘదువుదాం శివుని కృపాదృష్టికి పాత్రులవుదాం.

పూర్వము " సౌందర్య లహరి" ని అపూర్వంగా అపురూపంగా ఆదరించి నన్ను ప్రోత్సహించిన బంధుమిత్రులు ఈ " శివానందలహరి" ని కూడా ఆస్వాదిస్తారని , ఆశిస్తున్నాను.

విశ్వనాథుడైన పరమశివుడు ౘదువరులందరికీ అభీష్ట సిద్ధిని ప్రసాదింౘుగాక.
శివానందలహరి

1 వ శ్లోకం
(19_02_18)

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:

పూజ్యశ్రీ కరుణాంతరంగులైన శ్రీ శంకర భగవత్పాదులు పరమేశ్వరునికి నమస్కరింౘడంవల్ల, సమస్త పురుషార్థములు సిద్ధిస్తాయని తెలిసి, సంసార సాగరం నుండి తాము తరింౘడానికి, ఇతరులను తరింపచేయడానికి ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడానికి ప్రారంభిస్తూ, నిర్విఘ్నంగా గ్రంథం పూర్తి కావడానికి, పార్వతీ పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళమును చేస్తున్నారు.

"కలాభ్యాం ౘూడాలంకృత శశికలాభ్యామ్ నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్!!"

పదవిభాగం:

కలాభ్యాం - ౘూడాలంకృత శశికలాభ్యామ్ - నిజతపఃఫలాభ్యామ్ - భక్తేషు - ప్రకటితఫలాభ్యామ్ - భవతు - మే -  శివాభ్యామ్ -  అస్తోకత్రిభువన శివాభ్యామ్ - హృది -  పునర్భవాభ్యామ్ -  ఆనంద స్ఫురదనుభవాభ్యామ్ - నతిః - ఇయమ్.

తాత్పర్యం:

సకల విద్యాస్వరూపులునూ , సిగలపై అలంకరింౘుకొనిన చంద్రరేఖలు గలవారు నూ, ఒండొరుల తపస్సు నకు ఫలంగా దాంపత్యమును పొందిన వారు నూ, భక్తులకు అభీష్ట ఫలములను ఇౘ్చువారునూ ,, ముల్లోకములకూ అధికమైన మంగళములను ఇౘ్చువారునూ, ధ్యానము చేయువారల హృదయంలో మాటిమాటికీ సాక్షాత్కరింౘువారునూ, ఆనందంతో పాటు స్ఫురింౘు అనుభవం గలవారునూ, అయిన పార్వతీపరమేశ్వరుల కు నా నమస్కారములు అగుగాక !
( నమస్కరిస్తున్నాను).

వివరణ:

ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల నిద్దరినీ ఉద్దేశించి చేసిన ప్రార్థనా శ్లోకమిది. శివా శివులిద్దరూ ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు. "శివశ్శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం" అనగా శివుడు శక్తితో కలసి నపుడే, సృష్టికార్యానికి శక్తుడవుతాడని శంకరులు సౌందర్య లహరి లో
చెప్పియున్నారు. 
పార్వతీపరమేశ్వరుల వలెనే, లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు
సరస్వతీ చతుర్ముఖులు - వంటి జంటలనూ, వీరిని ఒకరిని విడిచి ఒకరిని ఉపాసింౘరాదు. భక్తులు పైవిషయాన్ని గమనింౘాలి.
--((**))--




Saturday 18 February 2017

తలపులు (నగణము ) పద్యాలు -1 ****

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ: 
తలపుల -తలుపుల  - పద్యాలు -1
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
చిత్రములు సేకరణ " పెంట్రిస్ట్ " అంతర్ జాలం 



కలువ కలవరము మదిని తొలచి మెళుకువ తొ
థళుకు బెళుకు తలపుల తపనల తమకముతొ
మరులు గొలుపు సుమధుర మధురిమ తలపుతొ
ఒకటిగ తనువులు కలవగ మనసుకు శుభములు  ... 1  




కరుణ దయ కనికరము నయనముల పిలుపుతొ
మనసు గెలుపు వరుసల తడి పొడి పలుకులతొ    
మగువకు మగణి పరుషముల సరసములతొ
తెగువ మరచి వగలు తలచి ఒక రొక రవుట  ....... 2



  



లతల తొడిమలు కదలిక వయసు ఉరకలుతొ 
వెతలు తొలగి నయనములు కదిలి పిలుపులతొ
సొగసుళు మురిపములు కలుసుకొను తరుణముతొ   
చిరు నగవు తలపు వలపు మెరుపు ఒకటవుట .... 3 

myka jelina - Google Search:


  4. విభవములు లొసఁగును శుభములు కలుగును నితొ

మనుగడకు మమతలకు మనసు కరుగును నితొ
నొటికి  రుచులు వయసుకు వలపులు అనుకువతొ
తగువు కనపడక  చుముకముతొ కలిసి కొనుట  


5. రుచులు అరటి పనస పలురకముల ఫలములె
తినవలె నని మనసు కలవరముతొ పలుకులె
కదళులు తినవలెనని మగువల గల గల లె
ఫల మిడుచుట కుదరక మగని పరుగు పరుగె  




6.ని వలన మిత్ర శత్రువులు కలియుట మనుగడకె
ని కొరకు ఉదయ సమయము అణువణువువణికె   
ని పనులకు వగచి మతియు మరచి అలుగుటకె
ని తనువు మరులు గొలుపుచు ఉరక పిలుపులకె



Cameron Stewart:
7. చిలక పలుకులు చిలక, తగు పత్రములు తినకె
తరచు జలము కురియుటయు, తడుపుట కొరకె    
పలు రకముల నడక లతొ, ఉడుకును  తెలపకె
చిరు నగవులతొ, మది తలపులు తెరచి అలకె   




8. మరువము కుసుమము కలియుట పరిమళమె
సహనము ఒడుపు తనము మెరియు పరిమళమె
మమత సమత మెలుకువ మగువకు పరిమళమె
అనుకువతొ సుఖము కొరకు మెలగవలయునులె


9. మమతగని చెడుగుడు వదలి మెలగ వలయుటె
గురువు గరపెడి చదువులను పఠనము చెయుటె
అభినయ కరతళము సిరుల అనుభవ మగుటె   
చిరు నగవులు అను దినమున మన కవసరమె






  10కలదు కలదు అనిన తగువు బిగువు కనుల తొ
వలదు వలదు అనిన మతి పరుగు ఉరకల తొ
కలదు కల అనిన కనబడదు కనికరము తొ   
వలదొ ఎల అనిన ఎడ తెరిపి జలము తలపె


11. జనకులు తెలిపిన ఘనమును వినయముగ వినె
అనుకరణ తలపులు కుదురుగ ననయము గనె
మమతతొ కుదురుగ ముదమున పదిల పరచునె     
జనకులు పలుకులు తనయుల వినుట విదితమె


12. చరితలు చదువుము, చదువు బలిమిని తెలుసుకొ   
సుగుణములు గనుము, గుణముల మనసు తెలుసుకొ 
తిరుగ వలదు జత పడుటకు, మదిలో మలచు కొ
మరువ వలదు జనకుల వెతలు, మనకు సుతులె


13. మనిషికి జప తపము నకు కొలువలుగ గుడిలె
ఒకరి కొకరు కలియుటకు యద పరిమళము లె
మితము పరిమితముగ నలుపు తెలుపు బ్రతుకులె
పగలు రెయి సహచరి సహనముతొ యదకథ లె  
   
  
14. మతి మతుల సతుల కధలు జదువ వలయునులె
చరితముల యిడుములు అనుభవముల కధలులె
వనిత బలిమి కలహములు తెలియని చెలిమిలె
ధనము వలన మది తలపు తరిగి పెరుగుట యె      


15. ఒడుదుడుకులు తెలిసికొను హిత మతి వలననె 
మనసున మమతను తెలుపు జనకుల  వలననె
నడతల పదిలము తెలుపు మగువల వలన నె
యతివల కెపుడు అణుకువ నటన అభినయన మె


16. మగువల మదిమెరుపు మనసు గెలిచు సహజమె
పడతుల పలుకు పలు రకముల పక పక లులె
గుణము తెలుసుకొని  సిరుల విలువ తెలపవలె
వరుడు దొరికితె వనితకు పరిణయము సబబె




17.నిజము అనృతము కలియుగ మనిషి కల పలుకె
జయము అపజయము మనుగడకు మలుపు పలుకె
పెరుగుట తిరుగుట విరుగుట వయసు ఉరకలె
వయసు పరుగులు ముసలితనము వరకు ఉరకె    




18. అహరహము సుఖము కొరకు సహనము వదలకు
వచన కళను దెలిపి రుచిగల కలలు కనుము
వయసుకు దడి మనసుకు దడ అనుకరణములె
జననము తరుణముతొ ఎదిగి కలియుట తొ ఒదుగు  


19. మగువ వలపుల మెరుపు మన మరుపు రుజువులె 
వనిత గలగల పలుకులె  రసిక రుసరుసలె
తరుణి  తనువు తపనలు మనసుకు గుసగుసలె
సహనము మనకు తెలుపు నిజాము కథలె




ADS


20. నిధుల నిలయము సుఖ సహనముల ఒడుపె
వధువు నడకలు అణువణువు వెలుగుల మయమె
ధనము తగువుల తలపులె తెలుపుట నిజము లె 
పగలు వణకు రెయి కులుకు విధి మలుపు ఒకటి



Excited to share this item from my #etsy shop: Musical souls(Radha Krishna)
21. ప్రతి సతి తన పతి గతి అతివల తొ తరగతి
ఇతి పతి మతి అనుమతి తొ తనువుల తరగతి
సతి పతి  అతివల తగువుల కుదిపె తరగతి
పరపతి తరిగి అదిపతి  కులపతి తరగతి

Buy Eternal Lovers - Radha Krishna Handmade Painting by HARIOM SINGH. Code:ART_1246_27544 - Paintings for Sale online in India.



22. మరులు గొలుపునది మది తలపు పరుగెడునది 
నయన మిది తనువు తపన మది సరిగమ లిది
నగవులిది మరులు గొనుపునిది తమ కము నిధి
ఒకపరి తదుపరి తప నిధి కల గొలుపు విధి     




23ప్రతి సతి తన పతి గతి అతివల తొ తరగతి
ఇతి పతి మతి అనుమతి తొ తనువుల తరగతి
సతి పతి  అతివల తగువుల కుదిపె తరగతి
పరపతి తరిగి అదిపతి  కులపతి తరగతి 
    



24.ధరణి ధగ ధగ భగభగ  మనిషి మనసు సెగ
తరుణి పక పక విక విక మగణి మనసు సెగ  
తహిని తనువ తహ తహ ప్రియుని మనసు సెగ
కమిని పలుకులు గజి బిజి వయసుకు పరుగు లె 




25. మనసున  ధగ ధగ భగ భగ చలి చెలి కొరకు  
వయసున కలవర బిగి బిగి చెలి చలి కొరకు 
తనువున  కల నిజ మడి ముడి బిగువుల కొరకు   
తలపున తడి పొడి తగువులులె తపన కొరకు 



kerala mural painting #Mural #Art #Painting #HandmadeArt #IndianArt


26. నరుల నగవులు నరముల కళ పలు చెరువులు 
కురుల మెరుపులు మది తలపు తెలుపు తలుపులు 
పరుల పలుకులు పదనిసలు సిరుల చినుకులు 
శిరుల కలకలము మదిలొ  మదన సరిగమలు   



--((***))--

Thursday 9 February 2017

1. ఆత్మానందం speach


1. ఆత్మానందం   

1. ఈ అత్యున్నతమైన ఆత్మ సదా మార్పు చెందే ప్రకృతి కంటే భిన్నమైనది. ఇది జ్ఞానసారము. పూర్తిగా ఈ భౌతిక ప్రపంచాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఎఱుక స్థితిలోనూ మరియు ఇతర స్థితులలోనూ అహం యొక్క ప్రభావమును బుద్ది, సాక్షిగా గమనించు చున్నది.

2.. మనస్సును అదుపులో ఉంచి బుద్ది స్వచ్ఛమై తన ఆత్మను తాను నేరుగా ఈ శరీరములోనే గుర్తించి సరిహద్దులేలేని సంసార మహాసముద్రమును దాటి, పుట్టుక, చావు లేని బ్రాహ్మిక స్థితిలో స్థిరపడుతుంది. అది తన అసలు స్థితిని తాను పొందుతుంది.

3. అజ్ఞానమనే బంధనాల నుండి విడివడి, పుట్టుక, చావులనే దుఃఖాలకు అతీతమై జీవాత్మ పరమాత్మను గుర్తిస్తుంది. అజ్ఞానము వలన, క్షయించే ఈ శరీరము నిజమని భావించి, అదే తానని భావిస్తూ, దానిని పోషిస్తూ, దానికి వివిధ అలంకారములు, సుగంధములు అలుముతూ దాని బంధనాలలో జ్ఞానేంద్రియాలకుచిక్కినట్లు అనగా పట్టుపురుగు తన చుట్టూ తానే గూడు కట్టుకొని అందులో బంది అయి, తన చావును తానే కొనితెచ్చుకొన్నట్లు జీవాత్మ చిక్కుకొన్నది.
 

4. ఏ వ్యక్తి అయితే అజ్ఞానమనే చీకటిలో మునిగి సరైన వస్తువును గుర్తించలేక మంచి, చెడు వ్యత్యాసమును గ్రహించలేక, తాడును పామని భ్రమించినట్లు అనేక ప్రమాదాలను ఎదుర్కొనుచున్నాడు. అందువలన ఈ విషయాన్ని గ్రహించాలి. మార్పు చెందే ఈ వస్తు విశేషములు నిజమని నమ్మి బంధనాలలో చిక్కుకొనుట జరుగుచున్నది.
 

5. ఆత్మ చుట్టూ వలయాలుగా ఆవరించి ఉన్న ఈ అధికమైన అజ్ఞాన ప్రభావములు ఆత్మను తెలుసుకొనుటకు దాని ప్రకాశమును గుర్తించుటకు అడ్డుగా ఉండి, ఆత్మ యొక్క ఔన్నత్యమును అనంత జ్ఞానమును గ్రహించలేక మరియు ఆత్మను మించినది వేరొకటి లేదని, అది విభజించుటకు వీలులేని శాశ్వత సత్యమని తెలుసుకొనలేకున్నారు. రాహువు సూర్యుని చుట్టివేసినప్పుడు సూర్య కిరణముల కాంతి అవ్యక్తమైనట్లు, రాహువు తొలగినపుడు సూర్య కాంతి ప్రజ్వరిల్లుతుంది కాదా! అట్లే అజ్ఞానము తొలగిన ఆత్మ వ్యక్తమవుతుంది.
 

6. ఆత్మ అనాత్మల భేదములు గుర్తించలేక సాధకుడు ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమును తెలుసుకొనలేక, తన శరీరమే ఆత్మ అని భావించు చున్నాడు. ఆత్మ స్వచ్ఛమైన ప్రకాశముతో ప్రజ్వరిల్లుతున్నప్పటికి అజ్ఞానము వలన గుర్తించలేకున్నాడు. అట్టి స్థితిలో రాజస గుణము యొక్క గొప్ప శక్తి ఆత్మకు అడ్డుగా ఉన్న కామ క్రోధాలను జయించవలసి ఉంటుంది.
 

7. వికృతి చెందిన తెలివితేటలు తన సొంత జ్ఞానమును అజ్ఞానమనే సొర చేప మ్రింగివేయగా, బుద్ధి యొక్క వివిధ చేష్టలు అనేక జన్మలు ఎత్తుటకు కారణమవుచున్నవి. వాటి వలన మంచి, చెడు జన్మలెత్తి తత్‌ ఫలితాలను అనుభవించవలసి వచ్చుచున్నది. ఎత్తు పల్లములనే సంసార బంధనాలలో చిక్కి, చావు, పుట్టుకలనే జన్మ పరంపరలకు లోను కావల్సి వచ్చుచున్నది. జ్ఞానేంద్రియాల అనుభూతులకు లొంగి అందులో మునిగి తేలుతూ సుఖదుఃఖాలకు లోనగుచున్నారు.
 

8. సూర్య కిరణముల వలన తయారైన మేఘ సముహములు సూర్యుని కప్పివేసినట్లు, ఆత్మ వలన తయారైన అహము సత్యమైన ఆత్మను కప్పివేసి తానే వ్యక్తమవుతున్నది.
 

9. మేఘములతో కూడిన ఆకాశం సూర్యుని కప్పివేసినట్లు, తీవ్రమైన చల్లని గాలులు విస్తరించి ఇబ్బందులు కలుగజేసినట్లు, ఆత్మ లోతైన అజ్ఞానముచే మరుగునపడి యున్నది. అందువలన భయంకరమైన అజ్ఞానము వలన ఆత్మశక్తి వ్యక్తము కాకపోవుటచే తెలివి తక్కువ వ్యక్తి అనేకములైన దుష్ఫలితములను పేదుర్కొని దుఃఖించవలసి వచ్చుచున్నది. 

10. ఆవరణ, విక్షేపము వలన మనిషి బంధనాలలో చిక్కుకొని దాని ఫలితముగా తన శరీరమును ఆత్మగా భావించి చావు, పుట్టుకలనే అనేక జన్మలు ఎత్త వలసి వస్తుంది.


 11. సంసారమనే వృక్షమునకు అజ్ఞానమనే విత్తనము, తాను శరీరమనే భావన వలన మొలకెత్తి, బంధనాలనే చిగురుటాకులు, నీటి వలన పెంపొంది, శరీరమనే బోదె ప్రాణాధార శక్తితో కూడిన కొమ్మలు, వాటి భాగాలైన మొగ్గలు, సువాసనలు వెదజల్లే పుష్పాలు మొదలగు దుఃఖాలను అనుభవిస్తూ వాటి ఫలితాలైన పండ్లను అనుభవించుటకు ఆ వ్యక్తి ఆత్మ పక్షివలె వాలుతుంది.

12. అనాత్మ యొక్క ఈ బంధనాలలో అజ్ఞానము వలన స్వయంగా చిక్కుకొని, మొదలు చివరలేని సంసార బంధనాలను అనుభవిస్తూ దుఃఖాలనే రైలు ప్రయాణములో పుట్టుక, చావుల రోగములతో వేగుచుండవలెను.
 
13. ఈ రకమైన బంధనాలను గాలి, అగ్ని, ఆయుధాలు మరియు లక్షల కొలది జన్మలు కూడ నాశనము చేయలేవు. కేవలము ఆశ్యర్యకరమైన విజ్ఞానమనే ఖడ్గముతో మంచి, చెడులను వేరుచేసి దైవము యొక్క దయతో నశింపజేయవలెను.
 
14. ఎవరైతే పట్టుదలతో, భక్తిభావముతో సృతుల ఆధారముతో స్థిరత్వాన్ని సాధించి, స్వధర్మాన్ని పాటిస్తూ స్వచ్ఛమైన మనస్సును పెంపొందించు కుంటాడో అలాంటి స్వచ్ఛమైన మనస్సు కలిగిన వ్యక్తి మాత్రమే అత్యున్నతమైన ఆత్మను తెలుసుకొనగలడు. అపుడే సంసార దుఃఖాలను కూకటి వేళ్ళతో సహా నశింపజేయగలడు.
 
15. పంచకోశాలతో కప్పివేయబడిన ఈ భౌతిక శరీరము మరియు దాని అంగములు ఆత్మ యొక్క శక్తి వలననే ఉత్పత్తి అయినవి. ఎలానంటే చెరువులోని నీరు తుంగలతో నిండిఉన్నట్లు.
 
16. తుంగను తొలగించినప్పుడు చెరువులోని నీరు స్వచ్ఛముగా ఉండి దప్పిక తీర్చుకొనుటకు అనువుగా నుండి ఆనందాన్ని కలిగిస్తవి. ఏవిధమైన అడ్డంకి ఉండదు. అలానే ఆత్మ చుట్టూ ఆవరించి ఉన్న అడ్డంకులను తొలగించిన స్వచ్ఛమైన ఆత్మ వ్యక్తమగును.
 
17. ఎపుడైతే పంచకోశములు తొలగిపోతాయో అపుడు మనిషి యొక్క ఆత్మ వ్యక్తమవుతుంది. స్వచ్ఛమైన అనంతమైన ఏవిధమైన అడ్డంకులు లేని బ్రహ్మానంద స్థితి హృదయములో ఏర్పడుతుంది.
 
18. బంధాలను తొలగించుకోవాలంటే తెలివి గల వ్యక్తి ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించగలగాలి. అప్పుడు మాత్రమే తన ఆత్మను తెలుసుకోగలుగుతాడు. అపుడు పొందిన ఆత్మ జ్ఞానము వలన నిరంతర ఆనందము లభించును.
 
19. అన్ని విధములైన జ్ఞానేంద్రియాలను తెలుసుకొన్నప్పుడు వాటి అవగాహన కలిగినప్పుడు, తన అధీనములోని అంతర్గత ఆత్మవాటికి అతీతముగా ఉండి, వాటిని నిస్తేజము చేసినపుడే ఆత్మ విముక్తి చెంది దానికి అడ్డుగా ఉన్న పంచకోశములు ఆత్మలో లీనమై ఆత్మతో సమానమవుతాయి.

--((**))--

2. శరీరము ( శరీరా నందం )

1. మన శరీరము ఆహార సేవనము వలన ఉత్పత్తి అయినది. అది భౌతిక పదార్థములతో కప్పబడినది. ఈ శరీరము ఆహారముతో జీవించి, ఆహారము సేవించనిచో నశిస్తుంది. ఇది చర్మము, మాంసము, ఎముకలు మరియు వ్యర్థములతో నిండి ఎప్పటికీ స్వచ్ఛతను పొందలేదు. ఆత్మను తెలుసుకొనలేదు.

2. ఈ శరీరము జన్మించక ముందు లేదు. మరణించిన తరువాత కూడా లేదు. కేవలము కొద్ది కాలము మాత్రమే జీవించి ఉంటుంది. అది ఎల్లప్పుడు మార్పుచెందుతూ అస్థిరముగా ఉంటుంది. ఇది సామాన్యమైనది కాదు. ఎల్లప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ఇది ఇంద్రియాలతో నిండిన ఒక పింగాణి జాడి వంటింది. అలాంటిది ఎలా ఆత్మ స్థితిని కలిగి ఉంటుంది. మార్పులు అన్ని శరీర భాగాలలో కన్పిస్తుంటవి.
 
3. ఈ శరీరము కాళ్ళు, చేతులు మొదలగు అంగములతో కూడి ఉన్నది. ఇది ఆత్మ కాదు. ఎవరైతే ఈ శరీరములోని ఒకటిరెండు భాగాలు లేనప్పటికి అతడు జీవించి ఉంటాడు, అతని ఇతరశరీర భాగాలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ శరీరము ఇతరుల పాలనలో నడుచుట వలన అది ఆత్మ కాదు. ఆత్మయే అన్నింటిని పరిపాలించేది.
 
4. ఆత్మ నిజమైన సత్యము కావున అవి శరీరము కంటే వేరైనది. దాని గుణాలు, దాని పనులు, దాని స్థితులు అనేవి దాని సాక్షి స్థితికి ఉదాహరణ.
 
5. ఈ శరీరము ఎములు, మాంసము మరియు వ్యర్ధములతో నిండి పూర్తిగా అపవిత్రమైనది. కాని స్వయం స్థితమైన ఆత్మ అన్ని తానే అయి ఈ శరీరము కంటే భిన్నమైనది.
 
6. మూర్ఖుడైన మనిషి తాను శరీరముగానే భావించి, చర్మము, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు మరియు కల్మషాలతో నిండి ఉన్నాడు. కాని మంచి, చెడుల భేదముల గ్రహించిన వ్యక్తి తాను శరీరము కాదు ఆత్మనని తెలుసుకొని, కేవలము తానే సత్యమని ఈ శరీరమునకు వేరుగా ఉన్నానని తెలుసుకొనును.
 
7. మూర్ఖుడైన వ్యక్తి తాను శరీరమని తలచగా, పుస్తక జ్ఞానము కలిగిన వాడు తాను శరీరము మరియు ఆత్మ యొక్క సంమ్మేళనమని భావించగా, యోగి తాను మంచి, చెడులకు భేదముల

--((**))--
 
3. మనస్సు

1. ఈ మానసికమైన పొర అనేకమైన కోరికలతో నిండి పంచ జ్ఞానేంద్రియాలకు అనుగుణంగా నడుచుకుంటూ యజ్ఞయాగాదులతో ఈ భౌతిక ప్రపంచ సృష్టికి కారణమవుతుంది.

2. మనస్సుకు భయట ఏవిధమైన అజ్ఞానము లేదు. మనస్సే అజ్ఞానమునకు కారణము. ఇది బంధనాలకు మూలము. ఎపుడైతే మనోనాశమగుతుందో, అపుడు సాధన ద్వారా, క్రమశిక్షణ ద్వారా ఆత్మ సౌందర్యాన్ని స్థిర పర్చిన అదే విముక్తి అని చెప్పబడింది. నిర్వికల్ప సమాధి స్థితి అపుడు ఏర్పడుతుంది.

3. మనము కలలు కనేటపుడు, బాహ్య ప్రపంచముతో ఏవిధమైన సంబంధము ఉండదు. మనస్సే ఈ ప్రపంచ సృష్టికి కారణమవుతుంది. అనుభవము, అనుభవించేవాడు, అనుభవించబడేది అన్నీ ఒక్కటే. మెలుకువలో కూడా అదే స్థితి నెలకొని ఉంటుంది. అందువలన ఈ విశ్వమంతా మనస్సు యొక్క వ్యక్తీకరణమే.
 

4. కలలులేని నిద్రలో మనస్సు పనిచేయనందు వలన నిద్రించుచున్న వ్యక్తి ఏమి అనుభవించుట లేదు. అందువలన మనిషి యొక్క అనుభవాలు, అనుభూతులన్ని మనస్సు యొక్క సృష్టి మాత్రమే. ఏవిధమైన వస్తువు యొక్క సత్యతలేదు.

5. మేఘాలు గాలుల వలననే వస్తుంటాయి, పోతుంటాయి. అదే విధముగా మనిషికి బంధనాలు మనస్సు వలననే ఏర్పడతాయి. మరియు ఆ బంధనాలు మనస్సు వలననే వదలిపోతాయి.
 

6. ఈ మనస్సు మొదట మనిషిని శరీరమునకు బందీని చేసి క్రమముగా జ్ఞానేంద్రియాలు, మనస్సు యొక్క వశమై తద్వారా బందిపబడతాయి. ఎలానంటే ఒక జంతువు దొరికినపుడు వేటగాడు దానిని తాడుతో బందించినట్లు. తరువాత ఆత్మ మనస్సు ద్వారా జ్ఞానేంద్రియాలను, వస్తుసముదాయమును విషపూరితమని తెలియజేసి వాటిని బంధనాల నుండి విడుదల అవుతుంది.
 

7. అందువలన మనస్సే బంధనాలకు విముక్తికి కారణమవుతుంది. రాజస గుణాలకు కళంకము ఏర్పడినపుడు అవి బంధనాలకు కారణమవుతాయి. రాజస, తామస గుణాలను పవిత్ర మార్గాలకు మళ్ళించినపుడు అవి విముక్తికి దారిచూపుతాయి.
 

8. ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించి అజ్ఞాన కర్మలను వదలివేసిన మనస్సు విముక్తికి దారి చూపుతుంది. అందువలన తెలివైన సాధకుడు విముక్తిని సాధించిన తరువాత ఆత్మ, అనాత్మలను శక్తివంతము చేయాలి. అనగా వాటి జ్ఞానాన్ని పొందాలి.
 

9. ఇంద్రియ సుఖాలనే అరణ్యములో పయనించేటపుడు మనస్సను పులి చెలరేగుతుంది. అందువలన తెలివి గల వ్యక్తులు ఎవరైతే విముక్తిని కోరుచున్నారో వారు ఆ కోరికలనే అరణ్య మార్గములో ప్రవేశించరాదు.
 

10. మనస్సు ఎల్లప్పుడు ఇంద్రియాలకు వశమై తత్‌ సంబంధ వస్తు సముదాయమును, భౌతిక మరియు సూక్ష్మ ప్రపంచములో; కుల, మత, జాతులకు సంబంధించిన విశేషములను ఉత్పత్తి చేస్తుంది.
 
11. జీవుని మోసగించి దానికి స్వచ్ఛమైన జ్ఞానము లేనందువలన, ఆ జీవుని మనస్సు శారీరక, ఇంద్రియ, ప్రాణ సంబంధమైన బంధనాలలో బంధించి సంచరిస్తూ 'నేను', 'నాది' అన్న అహంభావముతో వివిధములైన లౌకిక, ఆనందాల మధ్య సంచరించుచూ వాటి మంచి, చెడు ఫలితములను అనుభవింపజేస్తూంది.

12. కేవలము మనస్సు మాత్రమే మనిషి యొక్క బంధనాలకు, చెడువంచనలకు, మార్పులు చెందుటకు కారణమగుచున్నది. దాని వలననే దుఃఖాలకు, పుట్టుక, చావులకు కారణ మగుచున్నది. ఇవన్నీ రాజస, తామస గుణాల ప్రభావమేనని అందువలన మంచి, చెడుల వివేకము నశిస్తుందని గమనించాలి.
 
13. అందువలన యోగులు రహస్యాలు దాచి మనస్సును అవిద్యగా వర్ణించిరి. అందువలనే ఈ ప్రపంచము గాలిలోని మేఘాల వలె ఊగు చున్నది.
 
14. ఆ కారణముగానే సాధకుడు విముక్తి పొందిన తరువాత జాగ్రత్తగా తన మనస్సును పవిత్రము చేసుకోవాలి. ఎపుడైతే మనస్సు పవిత్రమవుతుందో విముక్తి తేలిక అవుతుంది. అరచేతిలోని అరటి పండు వలె.
 
15. విముక్తి కొరకు ఏకీకృతమైన భక్తితో బంధనాలనే వేళ్ళను, జ్ఞానేంద్రియాలకు చెందిన భోగ వస్తువులను సమూలముగా తొలగించి వేయుటకు, నిజమైన బ్రహ్మ జ్ఞానము పై నమ్మకముతో నిరంతరము క్రమము తప్పకుండా సత్సంగములలో పాల్గొంటూ రాజసిక స్వభావ లక్షణాలను తొలగించుకోవాలి.
 
16. మానసిక కవచము ఉన్నతమైన ఆత్మ కాదు. ఎందువలనంటే దానికి మొదలు, అంతము కలదు. మార్పులకు అవకాశముకలదు. అది బాధ, నొప్పులతో కూడిన వస్తువు. దానిని జ్ఞానముతో కూడిన వస్తు సముదాయముతో పోల్చరాదు.

--((**))--

4. బుద్ది

1. నిర్ణయ శక్తితో కూడిన బుద్ది దాని యొక్క అహం మరియు జ్ఞానేంద్రియాలు అనగా విజ్ఞానమయ కోశము తమతమ గుణాలను వ్యక్తము చేస్తూ సాధకునిలో మార్పు తెచ్చుటకు తోడ్పడుతుంది.

2. ఈ విజ్ఞానమయ కోశము చిత్తము యొక్క ప్రతిస్పందన వలన ఏర్పడినది. ప్రకృతి యొక్క మార్పులు జ్ఞాన ప్రభావము వలన ఏర్పడుతుంటాయి. అవి పూర్తిగా శరీరము వాటి అంగములకు అనుగుణముగా రూపొందుతాయి.

3. జీవి యొక్క అహంభావము వలన మొదలు, చివరి లేని ఈ భౌతిక ప్రపంచము యొక్క క్రియలు రూపొందుతాయి. అందుకు అహం యొక్క గత జన్మల కోరికలను అనుసరించి మంచి, చెడుల అనుభవములు వాటి ఫలితములతో కూడి ఉంటుంది.

4.  జీవుడు వివిధ జన్మలు ఎత్తుట వలన అవి రూపొందుతాయి. ఈ విజ్ఞానమయ కోశము ఎఱుకతో కూడిన కలలు, ఇతర స్థితులు, అనుభవాలు, ఆనందాలు, దుఃఖాలు ఇవన్నీ అలానే దర్శనమవుతుంటాయి. 

5. బుద్ది ఎల్లప్పుడు శరీరమునకు చెందిన పనులు, విధులు అన్నియూ తనవి గానే పొరపాటు పడుతుంది. విజ్ఞానమయ కోశము అతి ప్రకాశవంతమై ఆత్మకు అతి చేరువుగా ఉండి తానే ఆత్మ అను భావముతో భ్రమలో ఉంటుంది. అందువలన అది అత్యంత మోసముతో కూడిన ఆత్మ భావన.
 
6. స్వయంగా అత్యంత ప్రకాశవంతమైన ఆత్మ హృదయములో అది స్వచ్ఛమైన విజ్ఞానము కలిగి ప్రాణములో ప్రకాశిస్తుంది. అది నిర్వికారమైనప్పటికి దాని కారణముగానే అనుభవాలు మరియు దాని అత్యంత ప్రభావము వలన విజ్ఞానమయ కోశము రూపొందుతుంది.
 
7. జీవించి ఉన్న ప్రతి జీవి యొక్క ఆత్మ బుద్ది యొక్క కొన్ని పరిమితులకు లోబడి తప్పుగా తనను తాను ఈ ప్రపంచములో వేరుగా భావిస్తుంది. మట్టి కుండ మట్టితో తయారైనప్పటికి తాను మట్టి కంటే వేరుగా భావిస్తుంది.
 
8. దివ్యాత్మతో సంబంధము వలన తాము దానితో సమానముగా భావించి, అది ప్రకృతి సిద్దముగా స్వచ్ఛమైనప్పటికి తాను ఉన్నతమైన ఆత్మవలె ప్రకాశిస్తుంది. మార్పు చెందని అగ్ని వివిధ మార్పులు చెందుతూ ఇనుమును అగ్నిగా ఎర్రగా ఎలా మారుస్తుందో అలానే.
 
9. మాయ వలన కాని ఇతర కారణముల వలన ఉన్నతమైన ఆత్మ తననుతాను జీవాత్మగా భావిస్తుంది. ఈ భావనకు మొదలుగాని, చివరగాని లేదు. దీనికి అంతము లేదు. అది జీవాత్మగా పిలువబడుతుంది.

--((**))--

5. విముక్తి

1. జీవుడు తనను తాను శాశ్వతమైన ఆత్మగా భావిస్తుంటాడు. అట్లైన జీవాత్మకు విముక్తి ఎలా లభిస్తుంది. ఈ విషయాన్ని వివరించవలసినదిగా పరమ గురువులను కోరుచున్నాను.

2. గురువు సమాదానము చెప్పుచున్నాడు:- నీ ప్రశ్న సక్రమముగా ఉన్నది. జ్ఞానివైన నీవు శ్రద్దగా వినవలసినది. మాయ వలన ఏర్పడిన ఊహలు నిజమని నమ్మరాదు.

3. మాయకు ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. ఆత్మ దేనికి బంధింపబడదు, ఏ పని చేయదు. దానికి ఏ ఆకారము లేదు. ఈ ప్రపంచముతో ఎట్టి సంబంధము లేదు. ఆకాశానికి నీలి రంగు ఉన్నట్లు మనం భావిస్తూ ఉంటాము. నిజానికి దానికి ఏ రంగు లేదు. మనస్సుకు మాత్రమే హద్దులున్నాయి. కాని పూర్ణాత్మకు ఎట్టి హద్దులు లేవు.
 

4. ఆత్మ జీవత్వమునకు సాక్షిగా ఏ విధమైన లక్షణాలు, కర్మలు అంటనట్టి తన జ్ఞానము ద్వారా అర్ధము చేసుకొనగలదు. బుద్ధి, మాయలో చిక్కుకొని నిజము కాని ఈ శరీరమును ఆత్మగా
భావించును. ఎపుడైతే మాయ తొలగిపోతుందో అపుడు తన భావన సరైనది కాదని గ్రహిస్తుంది.
 

5. మాయ ఉన్నంత వరకు ఈ శరీరమును ఆత్మగా భావించి, తరువాత భ్రమ తొలగిన తరువాత ఆత్మ వ్యక్తమవుతుంది. తాడును పాముగా భ్రమించి, తరువాత ఆ భ్రమ తొలగిపోయినపుడు పాము మాయమవుతుంది.


6. అవిధ్య ప్రభావము వలన దాని ఫలితములు తెలియకున్నవి. అయితే జ్ఞానము పొందిన తరువాత అవిధ్య ఫలితములన్నియూ గ్రహించి వాటికి మొదలు లేనప్పటికి అవి మాయతో సహ మాయమైయిపోతాయని తెలుస్తుంది. ఎలానంటే కలలు, మెలుకువ తరువాత మాయమైనట్లు. అందువలన ఈ విశ్వము, దానికి మొదలు లేనప్పటికి అది శాశ్వతము కాదు. అది లేనిదే అవుతుంది.

7. లేని ప్రపంచము, దానికి మొదలులేనప్పటికి, దానికి ఎప్పుడో ఒకప్పుడు అంతమున్నదని తెలుస్తుంది. అందువలన జీవత్వమును ఆత్మ అని భావించినపుడు దానికి సంబంధము బుద్ధితో జతపర్చబడినది. ఉదా: ఎర్రని పుష్పము ప్రక్కన క్రిష్టల్‌ ఉంచినప్పడు ఆ ఎర్ర దనము క్రిష్టల్‌లో ప్రతిబింబిస్తుంది కదా! అలానే ఆత్మ ప్రకృతిలో నిండి ఉన్నప్పటికి, బుద్ది, ప్రకృతి సదా మారుతున్నప్పటికి ఆత్మలో మార్పు ఉండదు.
 

 --(())--

6. సరైన జ్ఞానము
1. సరైన జ్ఞానము పొందినప్పడు బుద్ది, ఆత్మ ఒక్కటే అను తప్పుడు భావము తొలగిపోతుంది. వేరు మార్గము లేదు. సృతుల ప్రకారము సరైన జ్ఞానముతో తన యొక్క జీవాత్మను తాను తెలుసుకొన్నప్పుడే తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు.


2. మనం చెప్పుకొనే విజ్ఞానమయకోశమనే పొర ఎప్పటికి ఆత్మ కాదు. ఎందువలనంటే అది ఎల్లప్పుడు మారుతుంటుంది. అది పరిమితమైనది. అది గుణములతో, అజ్ఞానముతో కూడి ఉన్నది. అది ఎల్లప్పుడు ఉండేది కాదు. అసత్యమైన విషయాలు సత్యమైన ఆత్మతో పోల్చరాదు. 207. ఆనందమయ కోశము అసత్యమైన మార్పులతో కూడి, ఆత్మిక భావమును ప్రతిబింబిస్తుంది. దాని ప్రభావము వలన సుఖాను భూతులను పొందుచున్నది. సుషుప్తిలో ఆనందము, విశ్రాంతి పొంది, అది ఆనందమయ కోశముగా చెప్పబడినది. కాని అది ఆత్మ స్థితి కాదు. ఆనందమయ కోశములో ఆనందముతో కూడి అది మనము కోరకుండానే వివిధ పనుల ఫలితముగా చేకూరుతుంది. ప్రతి జీవి అలాంటి ఆనందమును ఎట్టి ప్రయత్నము లేకుండానే పొందుట జరుగుతుంది.
 

3. గాఢ నిద్రలో ఆనందమయ కోశము తన యొక్క పూర్తి ఎఱుకలో ఉంటుంది. కలలో మరియు ఎఱుక స్థితిలో అది సందర్భాను సారముగా జ్ఞానేంద్రియాల ప్రభావముతో ఎఱుక స్థితిలోనూ, కలలో జ్ఞాపకాల ప్రభావముతోనూ ఉంటుంది.
 

4. ఈ ఆనందమయ కోశము పరమాత్మ కాదు. అది మార్పులతో కూడి ఉన్నది. ప్రకృతి అనుసరించి గతములో చేసిన మంచి పనుల ఫలితముగా అది ఏర్పడుతుంది. దానికి ఇతర కోశముల ప్రభావము కూడా జత పడుతుంది.
 

5. ఎపుడైతే పంచకోశముల ప్రభావము; అది కాదు, అది కాదు అనే విచారణలో తొలగిపోతుందో, చివరకు మిగిలేది ఏదైతే ఉందో దాన్ని దర్శించిన అదే అనంత జ్ఞానముతో కూడిన ఆత్మ.211. ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ, తనకు తాను పంచకోశములతో అతీతమై, స్థూల, సూక్ష్మ కారణ శరీరములను దర్శిస్తూ సాక్షిగా ఉండి నిజమైన, మార్పు లేని స్థితిలో నిరంతరానందమును పొందుతూ ఉంటుంది. జ్ఞాని అదే తన ఆత్మ అని గ్రహించును.
 

6. శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు:- ఈ ఐదు కోశములు విచారణ ద్వారా అసత్యములని తెలుసుకొని వాటిని తొలగించుకొన్నప్పుడు, నాకేమి గోచరించటలేదు. అందువలన గురువు గారు, ఈ విశ్వములో అంతా శూన్యము ఏమి కనిపించుటలేదు మరి అపుడు మిగిలింది ఏది? జ్ఞాని తన ఆత్మను ఎలా తెలుసుకొనగలడు?


7. విశ్వము

1. సమాధానము:- నీవు సరైన ప్రశ్నను అడిగినావు. నీవు మంచి, చెడులను తగినట్లు బేరీజు వేయుచున్నావు. దీని వలన అహం, మనస్సు, జ్ఞానేంద్రియాలు గాఢ నిద్రలో లేనప్పటకి, వాటిని ఆత్మ సాక్షిగా గ్రహిస్తుంది. కాని వాటికి అది అతీతముగా ఉంటుంది. నీవు అదే ఆత్మవు అని గ్రహించినవాడు తన యొక్క సునిసితమైన తెలివితేటలతో గ్రహిస్తాడు. సినిమాల్లో తెర మీద అనేక రకాలైన బొమ్మలు వస్తుంటాయి. కాని వాటికి కారణమైన అసలైన ప్రొజెక్టరు వేరే ఉన్నది. ప్రకృతిలో మారే ప్రతి వస్తువు వెనుక శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. 215. ఏదైన ఒక విషయాన్ని తెలుసుకొనుటకు వేరొకటి తోడ్పడినపుడు దానికి తొడ్పడిన దానిని దర్శిస్తుంది. ఒక వస్తువును తెలుసుకొనుటకు ఏజెండు లేని ఎడల, దాని గురించి ఏమియూ తెలియదు.
 

2. ఆత్మ తనను తానే గుర్తించును. ఎందువలనంటే అదే దానిని గుర్తించగలిగినది. అందువలన జీవాత్మ ఒక్కటే నేరుగా పరమాత్మను దర్శించగలదు. మిగిలినవేవి దానిని దర్శించలేవు.
 

3. ఏదైతే అన్నింటిలో వ్యాపించి ఉన్నదో; మెలుకవలో, కలలో, గాఢ నిద్రలో;అది అంతర్గతముగా మనస్సుచేత తెలుసుకొనబడుతుంది. ఆ మనస్సు అనేక విధములైన అహం, బుద్ధి మొదలగు వాటిలో ప్రస్ఫుటమవుతుంది. అవన్నీ కూడా మార్పుల యొక్క వివిధ రూపాలే. మరియు అవి ఎఱుక, విజ్ఞానము, ఆనంద స్థితులు. వాటిని నీవు నీ ఆత్మ ద్వారా నీ హృదయములో దర్శించగలవు. ఆత్మ, బ్రహ్మము యొక్క మరొక పేరు. మన యొక్క అహం, బుద్ధి అనేవి మన యొక్క మానసిక స్థితులు. అవి ఆత్మ వలననే వ్యక్తీకరింపబడతాయి.
 

4. సూర్యుని ప్రతిబింబము కూజాలోని నీటిలో పడినపుడు మూర్ఖుడు అది నిజమైన సూర్యుడని తలచును. అదే విధముగా తెలివి తక్కువ వ్యక్తి మాయ వలన తాను చిత్తము యొక్క ప్రతిబింబముగా, బుద్ది చేత నిర్ణయింపబడుతుంది. అది ఒక

5. జ్ఞాని అయిన వ్యక్తి తాను జాడీ నుండి నీటిని తొలగించి సూర్యుని ప్రతిబింబమును లేకుండా చేసి నిజమైన సూర్యుని దర్శించును. ఆ సూర్యుడు స్వయం ప్రకాశముతో ఆ మూడింటిని ప్రకాశింపజేస్తుంది. అది సర్వ స్వతంత్రమైనది.
బ్రహ్మము

6. బుద్ది చిత్తము యొక్క ప్రతిబింబ మగుటచే అది శరీరమును వదలి ఆత్మను దర్శించును. ఆత్మయే అసలైన జ్ఞాన స్థితి. అదే అన్నింటి యొక్క సృష్టికి మూల కారణము. అది బుద్ది యొక్క అంతర్భాగములో విశ్రాంతి తీసుకుంటుంది. అసలైన స్థిరమైనది. అన్నింటిలో ప్రతిఫలించేది, దానికి లోపల, బయట అనేది ఏది లేదు. అదే ఆత్మతో సమానమైనది. అదే బ్రహ్మము. ఎవరైతే ఈ ఆత్మ స్వభావమును పూర్తిగా గ్రహిస్తారో, వారు పాపాలకు, కళంకాలకు, చావుకు, విచారానికి దూరమై బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. స్వయం ప్రకాశముతో తాను ఎవరికి భయపడడు. సాధకుడు విముక్తిని సాధించిన తరువాత, బంధనాల నుండి విముక్తుడై తన ఆత్మ స్థితి యొక్క సత్యాన్ని తెలుసుకొనగలుగుతాడు. 

7. తనకు తాను బ్రహ్మముతో సమానమని గుర్తించిన తరువాత, విముక్తిని సాధించి, అన్ని సంసార బంధనాల నుండి విడుదల పొందిన జ్ఞాని బ్రహ్మాన్ని చేరగలడు. ఆ బ్రహ్మమే రెండవది ఏమిలేని అసలైన బ్రహ్మానంద స్థితి. 224. ఒక సారి బ్రహ్మాన్ని తెలుసుకొన్న తరువాత ఎవరు తిరిగి మార్పులతో కూడిన ప్రపంచానికి రారు. అందువలన ప్రతి ఒక్కరు పూర్తిగా తాను బ్రహ్మముతో సమానమని తెలుసుకోవాలి. 


8. బ్రహ్మమే ఉన్నది. అదే జ్ఞానము. అదే శాశ్వతము, స్వచ్ఛమైనది. అత్యున్నతమైనది. తనను తాను వ్యక్తీకరించుకొన్న స్థిరమైనది. కనిపించని ఆనంద స్థితి. అది జీవాత్మ కంటే వేరైనది కాదు. లోపల, బయట ఉండేది అదే. అది ఎల్లప్పుడు విజయాన్ని సాధించేది. 


9. అత్యున్నతమైన ఈ బ్రహ్మము ఒక్కటే నిజమైనది. వేరేది ఏది లేదు. ఆత్మ ఒక్కటే ఉన్నది. ముఖ్యముగా స్వతంత్రమైన ఏ ఇతర తత్వము, సత్యము గ్రహించిన తరువాత ఈ ఉన్నత సత్యానికి మించేది ఏది లేదు అని గ్రహిస్తుంది. 


10. ఈ విశ్వమంతా అజ్ఞానము వలన వివిధ ఆకారాలలో కనిపిస్తుంది. అదంతా బ్రహ్మము మాత్రమే. దానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో ఉంటుంది. మానవ పరిమితులకు లోనుకాదు.
 

11. ఒక జాడి మట్టితో చేయబడినప్పటికి మట్టి కంటే వేరు కాదు. ఎక్కడైన, ఎప్పుడైన అది మట్టి కంటే వేరు కాదు. అపుడు దానిని పాత్ర అని ఎందుకు పిలవాలి. అది కేవలము భావనతో పెట్టిన పేరు మాత్రమే.

--(())--

8. మాయ


1. మాయకు లోనైన వ్యక్తి పొరపాటున బ్రహ్మమును బ్రహ్మమని భ్రమించిన అది బ్రహ్మమే అవుతుంది. వెండి ముత్యపు చిప్ప రంగునే కలిగి ఉంటుంది. అది బ్రహ్మమును విశ్వముగా భావించుట వంటిది. విశ్వమనేది కేవలము పేరు మాత్రమే.

2. ఏది ఏవిధముగా పలికినప్పటికి ఈ విశ్వము ఉన్నతమైన బ్రహ్మమే అయి ఉన్నది. అదే నిజము. అది కాక వేరేది లేదు. అదే జ్ఞాన సారము. పవిత్రమైనది, కళంకములేనిది, మొదలు, అంతము లేనిది ఏమీ చేయనిది బ్రహ్మానంద స్థితి యొక్క అసలైన సారము. మాయ వలన సృష్టించబడిన అనేక పదార్థములలో మాయ వలన మార్పు తెచ్చినది అదియే విజ్ఞానము, శాశ్వతము, బాధలకు లోనుకానిది, ఎల్లపుడు ఉండేది, విభజింపబడనిది, కొలతలకు అందనిది, ఆకారము లేనిది వేరు చేయుటకు వీలు లేనిది, పేరు లేనిది, స్వయం ప్రకాశమైనది, నిర్వికారమైనది, స్థిరమైనది ఆ బ్రహ్మమే.239. పండితులైన వారు బ్రహ్మము యొక్క పూర్తి సత్యమును మరియు బ్రహ్మానికి దానిని తెలుసుకొనే వారికి, తెలుసుకొనే దానికి, తెలిసినది అనే భేదము లేదు. అది స్థిరమైనది. ఉన్నతమైన జ్ఞానానికి సారభూతమైనది. 

3. దానిని విసరివేయటానికి, తీసుకొనుటకు వీలులేనిది. ఎందువలనంటే అది పదార్థము కాదు. మనస్సుకు, మాటలకు అందనిది. కొలుచుటకు వీలు లేనిది. మొదలు, చివర లేనిది. అదే మొత్తమైనది. అదే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ. అది కీర్తి ప్రతిష్టలకు అందనిది.



4. ఆ విధముగా సృతుల ప్రకారము ''తత్వమసి'' అదే నీవు అనే మాట మరల మరల బ్రహ్మానికి వర్తింపజేస్తూంది. అదే, జీవుడు, ఈశ్వరులకు భేదము లేదిని తెలుపుతుంది. జీవేశ్వరుల సంబంధము భాష పరముగా కాకుండా అవి ఒక్కటే అయినప్పటికి వ్యతిరేకముగా చెప్పబడుచున్నది. ఎలా అంటే సూర్యుడు దాని ప్రకాశము లేక వెచ్చదనము వలె. అలానే రాజు సేవకుడు. బావి సముద్రము, మేరుపర్వతము అణువు వలె రెండు ఒక్కటే అయినప్పటికి వేరువేరుగా పిలువబడుచున్నది.

5. పైన తెల్పిన రెండింటి మధ్య భేదమును వ్యక్తము చేయుట అనేది నిజము కాదు. ఈశ్వరుని గూర్చి చెప్పిన ఈ విషయము మహత్తుకు చెందినది. మిగిలిన జీవము అనగా వ్యక్తి ఆత్మ ఐదు పొరలతో నిర్మింపబడినది. ఇది మాయ యొక్క ఫలితమే. 244. ఈ రెండింటిని (జీవేశ్వరుడు) తొలగించినపుడు ఆ రెండు లేవు. మిగిలింది బ్రహ్మమే. రాజుకు గుర్తింపు రాజ్యము. కవచాలను తొలగించినపుడు రాజు లేడు సైనికుడు లేడు. మిగిలినది మనిషి మాత్రమే. అలానే ఈశ్వరునిలోని విజ్ఞానమును మరియు జీవునిలోని అజ్ఞానము తొలగించిన మిగిలినది బ్రహ్మమే. అదే రెండింటి యొక్క మూలము. 

6. వేదములలోని పదాలైన ఇపుడు, అపుడు అనేవి బ్రహ్మములో ద్వంద్వాన్ని పలుకుచున్నవి. సాధకుడు జ్ఞానము పొంది ఆ రెండింటి భేదమును తొలగించినపుడు ఆ రెండు ఒక్కటే అని తెలుస్తుంది.


7. వేదములలోని పదాలైన ఇపుడు, అపుడు అనేవి బ్రహ్మములో ద్వంద్వాన్ని పలుకుచున్నవి. సాధకుడు జ్ఞానము పొంది ఆ రెండింటి భేదమును తొలగించినపుడు ఆ రెండు ఒక్కటే అని తెలుస్తుంది. 

8. సూక్ష్మము విస్తారమైన ఈ విశ్వము కేవలము ఊహ మాత్రమే. అది నిజము కాదు. పూర్తిగా ఈ వస్తు ప్రపంచమును తొలగించినపుడు (అందుకు విచక్షణతో కూడిన జ్ఞానము పొందాలి). జీవేశ్వర భేదము తొలగి రెండు ఒక్కటే అను భావము స్థిరపడుతుంది.

9. అందువలన ఈశ్వరుడు, జీవుడు అను మాటలను సందర్భాను సారముగా వర్తింపచేయాలి. అపుడే వాటి భావమును అర్థము చేసుకొనగలము. కేవలము పూర్తిగా తిరస్కరించుట, లేక పూర్తిగా అంగీకరించుట సరికాదు. వాటి నిజమైన స్థితులను సకారణముగా విచారించి తెలుసుకోవాలి.

 10. 'ఇదే ఆ దేవ దత్తుడు' అనే వాక్యములో రెండింటి ఏకత్వము చెప్పబడింది. అందులోని వేరు భావనలు తొలగింపబడినవి. ఈ వాక్యము 'అదే నీవు' అనే వాక్యానికి సరిపోతుంది. ఇందులో రెండింటి భేదము తొలగిపోయి జీవేశ్వరులు ఒక్కటే అని చెప్పబడినది. రెండింటిని గూర్చిన పూర్తి అవగాహన, చిత్‌ అనేది పరమాత్మకు చెందిన జ్ఞానమని తెలియబడుతుంది. ఈ విధముగా వందల కొలది గ్రంధములలో జీవ బ్రహ్మల ఏకత్వమును గూర్చి చెప్పబడినది.

11. ఆత్మ కానిదానిని తొలగించుచూ పోయిన; నేతి, నేతి దాని ప్రకారము మిగిలిన ఆత్మను తెలుసుకొన్నపుడు అది ఆత్మ అని గ్రహించి ఆలోచనలకు, ఆకాశానికి అతీతముగా ఉన్నపుడు శరీరమే తాను అను భావనను తొలగించుకొని నీవు ఆత్మ అని తెలుసుకొన గలుగుతావు.

12. మట్టి యొక్క అనేక మార్పుల తరువాత ఒక జాడిని తయారు చేసినపుడు, అది నిజానికి మట్టి మాత్రమే అని తెలుసుకొనగలము. దానికి జాడి అని పేరు పెట్టినాము. అలానే విశ్వమంతా బ్రహ్మము వలన రూపొందినది తెలుసుకొన్నపుడు అది బ్రహ్మము కాని వేరు కాదనుట సత్యము. ఎందువలనంటే బ్రహ్మము కాకుండా వేరేది ఈ విశ్వములో లేదని, అదే సత్యమని మనము గ్రహించగలము. అందువలన నీవు నిజానికి పవిత్రమైన,స్వచ్ఛమైన, ఉన్నతమైన బ్రహ్మానివి మాత్రమే వేరు కాదని గ్రహించాలి.
 

13. మనం కలల్లో చూసే ప్రదేశం, సమయము, వస్తువులు తెలుసుకొనేవాడు మొదలగునవన్నియూ అసత్యములే, అదే విధముగా మనము ఎఱుక స్థితిలో అనుభవించే ఈ ప్రపంచము అంతా ఆ వ్యక్తి యొక్క అజ్ఞాన ఫలితమే. ఎందువలనంటే ఈ శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహం అనునవి కూడా అసత్యములే. అందువలన నీవు పవిత్రమైన, స్వచ్ఛమైన, ఉన్నతన బ్రహ్మానివే కాని రెండవది ఏదీ కాదని గ్రహించాలి.
 

14. ఏదైతే తప్పుగా భావించటం జరుగుతుందో, ఒక వస్తువులో నిజమైనది ఏది అని తెలుసుకొనినపుడు, అది ఒక మూల పదార్థమని దానికి వేరుగా ఏమి కాదని అర్థమవుతుంది. మార్పులతో కూడిన కలలో ఒకటి కనిపించి మాయమవుతుందో అది మెలుకల స్థితిలో ఆ వస్తువు లేనిదే అని, అది తన ఆత్మ కంటే వేరు కాదని తెలుస్తుంది.
 

15. కుల, మతాలకు, కుటుంబము, వంశము అలానే పేరు, ఆకారము, ఎక్కువ, తక్కువ, మార్పు చెందే ఆకాశము, సమయము, మనం గ్రహించే వస్తు సముదాయము అయిన దంతయూ బ్రహ్మమే అయి ఉన్నది. అట్టి బ్రహ్మమును గూర్చి నీవు నీ మనస్సులో ధ్యానించుము. 255. అత్యున్నతమైన ఆ బ్రహ్మము మాటకు అందనిది. అయితే అది స్వచ్ఛమైన దివ్య దృష్టికి పూర్తి జ్ఞానము వలన మాత్రమే తెలుసుకొన బడుతుంది. ఆది అంతము అనేది లేని సత్యము.

--(())--  
 


Sunday 5 February 2017

Grammer


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

  We Aren’t Built to Live in the Moment 
విశ్వములో మానవుడు తాడు చూసి పాము అనుకోవచ్చు, కొమ్మ కదలిక శబ్దం ఎవరో పిలుస్తున్నారనవచ్చు, మెరుపును చూసి విద్యుత్ అనవచ్చు. ముత్యపు చిప్పను చూసి వెండి అనవచ్చు. చీకటిలో వేణు చూసి కొరివి దెయ్యమనవచ్చు,  ఏది ఏమైనా ప్రతి ఒక్కరు మాయా బ్రమకు లోనుకాక తప్పదు.      

ఈ విశ్వము ఉన్నతమైన బ్రహ్మమే అయి ఉన్నది. అదే నిజము. అది కాక వేరేది లేదు. అదే జ్ఞాన సారము. పవిత్రమైనది, కళంకములేనిది, మొదలు, అంతము లేనిది ఏమీ చేయనిది బ్రహ్మానంద స్థితి యొక్క అసలైన సారము. మాయ వలన సృష్టించబడిన అనేక పదార్థములలో మాయ వలన మార్పు తెచ్చినది అదియే విజ్ఞానము, శాశ్వతము, బాధలకు లోనుకానిది, ఎల్లపుడు ఉండేది, విభజింపబడనిది, కొలతలకు అందనిది, ఆకారము లేనిది వేరు చేయుటకు వీలు లేనిది, పేరు లేనిది, స్వయం ప్రకాశమైనది, నిర్వికారమైనది, స్థిరమైనది ఆ బ్రహ్మమే.

అమ్మ నీవు భయపడ నవసరంలేదు నా కాని తెలుసు నా జాగర్తలో నేను ఉన్నాను, నీవు భయపడ నవసరంలేదు అని అన్నది.

అప్పుడే అవి త్రాగి స్నేహితులతో శ్రావ్యా వాళ్ళ ఇంటికి వచ్చి  నాతో పాటు రా అని బలవంతం చేసాడు, అప్పడే తల్లి నీతో పంపను అని మోడిగేసింది. అది గమనించిన స్నేహితులు తల్లిని కట్టేశారు కూతురిని బలవంతంగా తీసుకోని పొదలిచారు, అది గమనించిన శ్రావ్య కత్తి పీట చేత పట్టి అందరిని బెదిరించి తల్లికి కట్లు విప్పి, ధైర్యం గా అందరిని ఎదిరించింది. అందరూ పారిపోయారు తల్లిని వెంట బెట్టుకొని ఇల్లు వదలి "రవి పై " పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.                     
చలపతిరావు తన అర్ధ బలంతో కొడుకుని విడిపించి యారా దేశాలకు పంపాలని నిర్ణయించుకున్నాడు. శ్రావ్య ను మరవలేకున్నాడని తెలుసుకొని,         .
                    
     
విశ్వము
213, 214. సమాధానము:- నీవు సరైన ప్రశ్నను అడిగినావు. నీవు మంచి, చెడులను తగినట్లు బేరీజు వేయుచున్నావు. దీని వలన అహం, మనస్సు, జ్ఞానేంద్రియాలు గాఢ నిద్రలో లేనప్పటకి, వాటిని ఆత్మ సాక్షిగా గ్రహిస్తుంది. కాని వాటికి అది అతీతముగా ఉంటుంది. నీవు అదే ఆత్మవు అని గ్రహించినవాడు తన యొక్క సునిసితమైన తెలివితేటలతో గ్రహిస్తాడు. సినిమాల్లో తెర మీద అనేక రకాలైన బొమ్మలు వస్తుంటాయి. కాని వాటికి కారణమైన అసలైన ప్రొజెక్టరు వేరే ఉన్నది. ప్రకృతిలో మారే ప్రతి వస్తువు వెనుక శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. 215. ఏదైన ఒక విషయాన్ని తెలుసుకొనుటకు వేరొకటి తోడ్పడినపుడు దానికి తొడ్పడిన దానిని దర్శిస్తుంది. ఒక వస్తువును తెలుసుకొనుటకు ఏజెండు లేని ఎడల, దాని గురించి ఏమియూ తెలియదు.
216. ఆత్మ తనను తానే గుర్తించును. ఎందువలనంటే అదే దానిని గుర్తించగలిగినది. అందువలన జీవాత్మ ఒక్కటే నేరుగా పరమాత్మను దర్శించగలదు. మిగిలినవేవి దానిని దర్శించలేవు.
217. ఏదైతే అన్నింటిలో వ్యాపించి ఉన్నదో; మెలుకవలో, కలలో, గాఢ నిద్రలో;అది అంతర్గతముగా మనస్సుచేత తెలుసుకొనబడుతుంది. ఆ మనస్సు అనేక విధములైన అహం, బుద్ధి మొదలగు వాటిలో ప్రస్ఫుటమవుతుంది. అవన్నీ కూడా మార్పుల యొక్క వివిధ రూపాలే. మరియు అవి ఎఱుక, విజ్ఞానము, ఆనంద స్థితులు. వాటిని నీవు నీ ఆత్మ ద్వారా నీ హృదయములో దర్శించగలవు. ఆత్మ, బ్రహ్మము యొక్క మరొక పేరు. మన యొక్క అహం, బుద్ధి అనేవి మన యొక్క మానసిక స్థితులు. అవి ఆత్మ వలననే వ్యక్తీకరింపబడతాయి.
218. సూర్యుని ప్రతిబింబము కూజాలోని నీటిలో పడినపుడు మూర్ఖుడు అది నిజమైన సూర్యుడని తలచును. అదే విధముగా తెలివి తక్కువ వ్యక్తి మాయ వలన తాను చిత్తము యొక్క ప్రతిబింబముగా, బుద్ది చేత నిర్ణయింపబడుతుంది. అది ఒక219. జ్ఞాని అయిన వ్యక్తి తాను జాడీ నుండి నీటిని తొలగించి సూర్యుని ప్రతిబింబమును లేకుండా చేసి నిజమైన సూర్యుని దర్శించును. ఆ సూర్యుడు స్వయం ప్రకాశముతో ఆ మూడింటిని ప్రకాశింపజేస్తుంది. అది సర్వ స్వతంత్రమైనది.

మోదట ప్రేమించిన అమ్మాయి పల్లవి వద్దకు చేరాడు రామకృష్ణ
ఆమెను గట్టిగా అడుగగా నాదగ్గర కొచ్చి త్రాగి పడుకునేవాడు, నన్ను తాకను కూడా తాకడు అన్నది.
మరి ఎందుకు అతనితో ఉండుట, ఎదో రహస్యము ఉన్నది నిజం చెప్పు అని దబాయించాడు బ్రహ్మానందం.
నేను బ్రతుకు తెరువు కోసం ఇక్కడ కొచ్చాను, మొదట ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందా మనుకున్నాం, త్రాగుటకు బానిస అయినాడు, అది మానితేగాని పెళ్లి చూసుకో౦నని గట్టిగా చెప్పాను, అర్వాత చని పోయినట్లు తెలిసింది ఇనకన్నా నాకు ఏమి తెలియదని చెప్పింది.

ఒకే అంటూ నెంబర్ " టు " వద్దకు బయలు దేరుదాం అంటూ కదిలారు బ్రహ్మానందం, రామకృష్ణ

అది ఒక విశాల మైదానంలో ఉన్నభవనము, ఇంటి ముందు కుక్కలున్నవి జాగర్త అని బోర్డు చూసాడు బ్రహానందం

అప్పడే ఆఇంటిలో నుండి కారు రావటం గమనించారు, అనెం. నోట్ చేసుకొని దానివివరాలు తెలుసుకున్నారు.

అయినా గోడదూకి లోపలకు వెళ్లి కిటికీ నుండి చూడగా వారికీ గోడమీద రక్తపు మరకలు కనిపించాయి.

ఇక్కడే చంపేసి ఉంటారు ఎవరో అని నిర్ధానకు వచ్చారు, ఇక్కడ జరిగిన విషయాలు ఎలా తెలుసు కోవాలి అని ఆలోచిస్తున్నారు.       
            
అప్పుడే గెట్ మూస్తూ వాచ్ మాన్ ను చూసారు, వెంటనే క్రిందకు దూకి అతన్ని కలిశారు.

బ్రహ్మానందం ఒక ఫోటో చూపించి ఈయనెవరో తెలుసా అని అడిగాడు వాచ్ మెన్ ని

ఇతను మాఅమ్మగారికి బాగా తెలిసిన వాడు

నీకు తెలిసినవి చెపుతావా

నేను చెప్ప కూడదు మరొకరిని అడగండి అని గబా గబా లోపలకు నడిచాడు.
ఆగు అంటూ గట్టి శబ్దం వినబడింది, చెపుతావా పోలీసులద్వారా చెప్పించాలో ఆలోచించుకో
ఇంతకు మీరెవరు
ఎవరన్నది చెపితేకాని చెప్పవా అంటూ గద్దించాడు బ్రహ్మా నందం         


               
 


నిరుద్యోగి ప్రయాణం -8

మాధవ్ ఏదో పరధ్యానంగా నడుస్తున్నాడు, వెనకాల పోలీస్ విజిల్సు వినబడుతున్నాయి, వేగంగా ఒక కారు వచ్చి మాధవ్ దగ్గర ఆగింది, దానిలో నుంచి ఒకరు దిగి మాధవ్ కు ఒక కవరు ఇచ్చి గబా గబా కారు ఎక్కి వేగంగా నడిపారు, ఒక పోలీస్ వ్యాన్ వేగంగా వెంబడించింది, వేరొక పోలీస్ వ్యాన్ మాధవ్ దగ్గిర ఆగింది, ఆకవరులో ఏముంది అంటూ లాక్కొని వ్యాన్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

పోలీస్ లు మాధవ్ ని బందిఖానాలో ఉంచి వచ్చిన వారికీ నీకు ఏమి సంభందము, అని లాఠీతో కొట్టటం మె దలు పెట్టారు, భాధను భరిస్తూ నోరు విప్పి ఏమి చెప్పలేదు. ఇన్ స్పెక్టర్ వచ్చి అడిగినా నాకు తెలవదు అని మాత్రమే చెప్పాడు మాధవ్.

చూడండి మీరు తప్పు చేస్తున్నారు, నేను నిరపరాధిని నాకు వారికి ఎటువంటి సంబంధము లేదు. పంచజ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో భౌతిక పరిజ్ఞానమును పొందాలి;  నోరు, చేతులు, కాళ్ళు మొదలగు కర్మేంద్రియములతో వాటి వాటి ధర్మానుసారము అవి పనిచేసేవిధముగా ప్రవర్తించాలి. వాని అనుకరించే మనం శిక్ష విధించాలి, పెద్దవారి ప్రోద్బలము వళ్ళో, ఉద్యోగ ఉన్నతి కోసమో, ఉద్యోగ ధర్మము విస్మరించి కూడదు అన్నాడు.

కోపంతో పోలీస్ అధికారి గట్టి మోదీ, ఇతని తరఫు ఎవరున్నారో అన్ని వివరాలు సేకరించండి, జాగర్తగా  కాపాలా కాయండి అని బయటకు వెళ్ళాడు పోలీస్ అధికారి.  


మిణుఁగురుపురుగులు గనఁబడు సమయములో నన్ను బంధించుట ఫలితము ఎవ్వరికి, పురుగుల వెలుగు ఎవ్వరికి పనికిరాదు, దూరము నుంచి చూసిన వారికి ఆనందము కలిగించు, వేరొకరి ఆనందం కోసం మరొకరిని బంధించుట సమంజసమా ?.     

క్షణమఁట నిలఁబడ వినఁబడెఁ జెవులకు, ధ్వనులవి యింపుగ నేవో  ముదమై, వీణాధరి వేవో?  కనీసం అర్ధం చేసుకొనే మనసున్న పిచ్చికుక్కలకు చిక్కిన కోడిపిల్ల బ్రతుకు నాది మారుట ఎందుకు ?.    

ఉనికిని తెలిపిన ధర్మము తప్పిన వారికి నిజము గ్రహించు శక్తి ఉండదు, వీరికి మంచి భావాలు ఉండ  వు , కృప దయ మచ్చు తునకన కాన రాదు ఎందుకు ? 

కనులలో ఉన్న మెరుపును గుర్తించలేరు, ఎదో అనుకోని ఎదో చేసి కేసులు కావాలని,  నిజాయితిని నిరూపించు కోవాలని తాపత్రయంతో తెలియని తప్పులు చేయుట  ఎందుకు? 




మాధవ్ మాటలు అర్ధం కాక చెవులు మూసుకున్నారు


అప్పడే పోలీస్ అధికారి వెంటనే వచ్చి అసలు నేరస్తుడు దొరికాడు, ఇతన్ని విడుదల చేయండి అన్నాడు.

మాధవ్ నెమ్మదిగా నన్ను భంధించినందుకు భాధ పడుట లేదు, అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెపుతారా అని అడిగాడు.

పోలీస్ అధికారి చెప్పఁటం మొదలు పెట్టాడు.     

నీకిచ్చిన కవరులో మత్తు మందు ఉన్నది, అందుకే మేము నిన్ను అరెష్టు చేసాము. అసలు కారణం తరువాత తెలిసింది.
 


 

        






 


ఉండవు గుటిలో ఉండేది చిలక గోరింకలే అన్నాడు 

No automatic alt text available. • విశ్వనాథ్‌కునా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడాచెప్పవా ఇక్కడా



  
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

మనసులో ముసుగు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 
గురువుni ఎందుకు సేవించాలి ?
2. మానవ జన్మ

1. మొదటి శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ''గురువే ప్రత్యక్ష దైవ'' మన్నట్లు తన గురువైన గోవిందా చార్యుల వారిని దైవముగా స్తుతించినారు.

2. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మానవులలో పురుషజన్మ ఉన్నతమైనది. అందులోనూ వైదిక మతములో బ్రహ్మ జ్ఞానము గొప్పది. బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మల భేదమును గ్రహించుట, బ్రహ్మమును తెలుసుకొనుట అరుదైన విషయము. అట్లాంటి మానవుడు ముక్తిని పొందాలంటే 100 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది.

3. భగవంతుని కృపతో మానవునిగా జన్మించుట, జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయుట మరియు అందుకు సద్గురువు యొక్క రక్షణ అను మూడు ముఖ్య విషయములు అవసరము.
 

4. పురుషునిగా లభించిన మానవ జన్మ ద్వారా వేదవిజ్ఞానమును పొందిన మనిషి జన్మ రాహిత్యానికి కృషి చేయకుండా, ఆత్మహత్య సదృశమైన లౌకికానందములో చిక్కుకొనుట అనుచితము.
 

5. మనిషి తనకు లభించిన పురుష మానవ జన్మను జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయకుండుట ఎంత తెలివి తక్కువ తనము.
 

6. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అను సత్యాన్ని గ్రహించకుండా ప్రపంచమున్నంత కాలము 432 మిలియన్ల సంవత్సరములు యగ్నయాగాదులు చేసి, దేవతలను తృప్తి పరచినను జన్మ రాహిత్య స్థితి లభించదు. 

7. సంపదలు, వేదాల పఠనము, యగ్నయాగాదులు మొదలగు వాటి వలన పరమాత్మను పొందలేము. జన్మ రాహిత్యము లభించదు.


8. అందువలన మానవుడు జన్మ రాహిత్య స్థితికై కృషి చేయవలెను. జ్ఞానియై మనిషి భౌతిక వస్తు సముదాయము వలన పొందే లౌకిక సుఖాలకై ప్రాకులాడకుండా తన మనస్సును సత్యమువైపు మరల్చవలెను.

9. వ్యక్తి జ్ఞానేంద్రియాలపై అదుపును పొంది భౌతిక వస్తు సుఖాలకు అతీతుడై యోగారూఢ స్థితిని పొందినపుడు పుట్టుక, చావు; మంచి, చెడు అను స్థితులను అధిగమించి విచక్షణతో కూడిన జీవితాన్ని పొందగలడు.

10. జ్ఞాని అయిన విద్యావంతుడు ఆత్మను పొందే మార్గమును ఎన్నుకొని మంచి, చెడులకు అతీతుడై భౌతిక బంధనాలైన పుట్టుక, చావుల నుండి విముక్తిని పొందుటకై సాధన చేయవలెను.
 

11. యజ్ఞ, యాగాల వలన మనస్సు స్వచ్ఛమవుతుంది. కాని సత్యాన్ని తెలుసుకొనలేము. కేవలము నిత్యానిత్య వివేకము ద్వారానే పరమాత్మను పొందగలము. కర్మలు 10 లక్షలు చేసినను సత్యాన్ని గ్రహించలేము.
 

12. తాడును చూసి పామని భ్రమించి భయభీతులు చెందువాడు మనస్సులో తగినట్లు విచారణ చేసిన అది పాము కాదు తాడని గ్రహించగలడు.
 

13. సత్యాసత్య జ్ఞానాన్ని పొందిన జ్ఞానులతో సంభాషణ ద్వారా మాత్రమే సత్యము అవగతమగును. ఇతరత్రా నదీ జలాలలో స్నానాలు, దేవతలకు పూజలు, సమర్పణలు మరియు ప్రాణాయామము ద్వారా ప్రాణ శక్తిని అదుపుచేసినను సత్యము అవగతము కాదు.
 

14. శాస్త్ర పరిజ్ఞానముతో సత్యాసత్య వివేకము పొంది, శాస్త్ర చర్చలలో ప్రశ్నించుట, వాదనలలో ప్రావీణ్యం పొందిన వాడే విజయాన్ని పొందగలడు. సమయము, ప్రదేశము మరియు ఇతరత్రా ఏవైన, కేవలము అందుకు సహాయకారులు మాత్రమే.


15. సాధకుడు ఆత్మ జ్ఞానము పొంది, వివేకముతో దయాసముద్రుడు, బ్రహ్మజ్ఞానమును పొందిన సద్గురువును ఆశ్రయించవలెను.

16. ఆత్మ జ్ఞానము పొందాలంటే సాధకుడు 14వ శ్లోకములో చెప్పినట్లు శాస్త్ర పరిజ్ఞానము పొంది, శాస్త్ర చర్చలలో విస్తారముగా పాల్గొనగల్గి ఉండవలెను.

17. ఏ వ్యక్తి సత్యాసత్య జ్ఞానమును పొంది అనిత్య స్థితులకు అతీతముగా మనస్సును మళ్ళించి ప్రశాంతతను పొంది, సత్వగుణ ప్రధానుడై జన్మ రాహిత్య స్థితికై ఆపేక్ష గల్గినవాడే బ్రహ్మన్ని గూర్చి తెలుసుకొనగలడు.

18. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు యోగులు నాల్గు విధములైన మార్గములను ప్రతిపాదించిరి. అలా కానిచో విజయమును సాధించలేరు.
 

19. మొదటిది సత్యాసత్యాలకు మధ్య తేడాను తెలుసుకొనుట. రెండవది తన కర్మల ద్వారా తాను పొందు ప్రతి ఫలముల ఎడ తిరస్కార భావము. మూడవది ప్రశాంతత, విశ్రాంతి. నాల్గవది విముక్తి ఎడల తీవ్ర ఆకాంక్ష.
 

20. మానసికంగా దృఢ నిశ్చయంతో బ్రహ్మము యొక్క సత్యాన్ని, ప్రపంచము యొక్క అసత్యాన్ని గూర్చిన నిర్ణయము. అందుకు సత్యాసత్యములను గ్రహించుటలో విచక్షణా శక్తి కల్గి యుండవలెను

       జన్మ రాహిత్యానికి, భక్తికి చేయు ప్రయత్నాలు అత్యున్నత స్థానమును ఆక్రమిస్తాయి. భక్తి అనేది ద్వైత సిద్దాంతము ప్రకారము ఒక దివ్యాత్మ మీద ప్రేమను వ్యక్తము చేస్తున్నప్పటికి, అద్వైత సిద్ధాంతము ప్రకారము పరమాత్మ ఒక్కడే. పూజింపదగినవాడు. ఈ రెండు వేరుగా చెప్పబడినప్పటికి, పరమాత్మ అంశయైన దివ్యాత్మకు, పరమాత్మకు ఎక్కువ భేదము లేదని, అవి దాదాపు సమానమని చెప్పవచ్చు.

       కొన్ని ఇతర సిద్ధాంతముల వారు స్వయం ఆత్మయే నిజమైన సత్యమని చెప్పు చుండిరి. నిజానికి మనమే స్వయం ఆత్మల మైనప్పటికి ఆజ్ఞానము వలన మన ఆత్మను మనము తెలుసు కొన లేకున్నాము. అందువలన మనము నిజమైన ఆత్మ తత్వమును గ్రహించుటకు బంధనాల నుండి, అజ్ఞానము నుండి విముక్తి పొందుటకు ఆత్మ జ్ఞానము పొందిన గురువును ఆశ్రయించాలి.

       మనం ఎంచుకొనే గురువు వేద జ్ఞానము కలిగి, తనకు తాను బ్రహ్మములో సదా చరించువాడై, కోరికలను త్యజించినవాడై, పరిశుద్దుడై, భౌతిక ప్రపంచము యొక్క కర్మల నుండి విడివడినవాడై ఉండవలెను. మరియు ప్రశాంత చిత్తుడై కోరికలను దగ్దము చేసినవాడై, దయా సముద్రుడై ఉండవలెను. అందరిని ప్రేమించువాడై ఉండవలెను.
   
       అట్టి గురువును భక్తితో పూజింపవలెను, సేవించవలెను. వినయ విధేయతలతో తన సందేహములకు సమాధానము పొందవలెను.

        హే ప్రభూ! దయాసాగరా! నిన్ను నమ్మినవారిని బ్రోచే నీకివే నా వందనములు. నన్ను రక్షింపుము చావు పుట్టుకలతో కూడిన సంసార బంధనముల నుండి విముక్తి కలిగించుము. మీ దయా దృష్టిని నాపై ప్రసరింపజేసి నీ యొక్క కరుణామృతమును నాపై కురిపించుము.

        ప్రపంచములోని సంసారమనే మహారణ్యములో, దావాలనములో చిక్కుకొని మరణించే చావు నుండి మమ్ములను రక్షించుము ప్రభూ! మేము గత జన్మలలో చేసిన పాపకర్మల వలన, ఇప్పుడు మేము అనుభవించుచున్న భయంకరమైన తుఫాను గాలులవంటి సంసార బాధల నుండి విముక్తి పొందుటకై మాకు మీరే దిక్కు ప్రభూ!

          కొన్ని ఉన్నతమైన ఆత్మలు ప్రశాంత స్థితిలో ఔన్నత్యము సాధించి తాము ఇతరుల ఉన్నతికి, వసంత ఋతువులో ప్రకృతి ప్రతిస్పందించినట్లు, వారు తాము భయంకరమైన పుట్టుక, చావుల నుండి విముక్తి చెంది, ఇతరుల ఉద్దరణ కొరకు నిస్వార్ధముగా తోడ్పడుచుండురు.

          ఉన్నత స్థితిని పొందిన జ్ఞానులు తమ స్వభావాన్ని అనుసరించి స్వార్ధ రహితులై ఇతరుల కష్టాలను తొలగించుటకు కృషిని చేయుచుందురు. ఉదాహరణకు చంద్రుడు ఎవరు కోరకుండానే భూమి యొక్క ఉన్నతికి సూర్యకిరణాలను మళ్ళించి తన చల్లని కిరణాలతో ప్రకృతికి తోడ్పడుట జరుగుచున్నది.
     
         ఓ ప్రభూ! మీ యొక్క అమృత వాక్కుల ద్వారా మాలో బ్రహ్మ జ్ఞానము యొక్క మాధుర్యమును నింపి, చల్లని మీ యొక్క వాక్కు అనే అమృత భాండము నుండి అమృతమును కురిపించి, మా చెవులకు వీనులవిందును కలిగించిన, మా యొక్క ప్రాపంచిక విషయ వాంఛలు అడవిలోని దావాలనమువలె దగ్దమవుతాయి. చల్లని నీ దయా దృష్టిని మాపై ప్రసరింప జేయవలసినదిగా కోరుచున్నాము.

40. ఈ ప్రాపంచిక విషయ వాసనలనే మహాసముద్రమును దాటుటకు ఏ విధమైన మార్గాలను అనుసరించిన నా భవిష్యత్తు సాఫీగా జరుగుతుందో నాకు తెలియుటలేదు. నన్ను రక్షించుటకు, నా దుఃఖాలను అంతము చేయుటకు ప్రభూ మీరు నాకు ఏ విధముగా తోడ్పడగలరు.

41. సాధకుడు ఈ విధముగా తన మార్గదర్శకుని ప్రార్ధించినప్పుడు, ఈ ప్రపంచమనే అడవిలోని దావాలనము అడవిని దహించినట్లు, ఆ సాధువు తన మృదువైన కృపాదృష్టిని దయతో సాధకునిపై ప్రసరింపజేసి అతని భయాన్ని దుఃఖాన్ని తొలగించగల్గుతాడు.

42. ఏ సాధకునికి గురువు తన రక్షణ కవచాన్ని అందించాడో అతడు జనన, మరణ, దుఃఖాల నుండి విముక్తిని పొంది, గురువు యొక్క శాస్త్ర విహితమైన సూచనలు ఆమోదిస్తూ, పవిత్రమైన మనస్సుతో ప్రశాంత స్థితిని పొందుటకు గురువు అతనికి దయతో సత్యబోధ చేయగల్గుతాడు.
 

43. జ్ఞాని అయిన ఓ సాధకుడా! భయపడకు నీకు చావులేదు ఈ సంసారసాగరమును దాటుటకు యోగులు మార్గమును చూపించినారు. అదే మార్గమును నేను నీకు చూపించెదను.
 

44. ఈ ప్రాపంచిక దుఃఖముల నుండి విముక్తిని పొందుటకు ఒక బంగారు బాట కలదు. ఆ మార్గమును అనుసరించిన నీవు సంసారసాగరమును సులువుగా దాటి ముక్తిని పొందగలవు.
 

45. వేదాంత విజ్ఞానమును చిలికిన బ్రహ్మాన్ని తెలుసుకొనే అత్యున్నత జ్ఞానమును పొందగలవు. అది ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల నుండి విముక్తి పొందుటకు తోడ్పడగలదు. 46. సాధకుడు సృతులలో చెప్పినట్లు సంసార బంధముల నుండి విముక్తి కొరకు నమ్మకము, భక్తి మరియు ధ్యాన మార్గమును అవలంబించవలసి ఉండును.
 

47. పుట్టుక చావులనే చక్ర భ్రమణముల నుండి విముక్తి పొందాలంటే, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి సాధకుడు అనాత్మ బంధనాల నుండి విడివడాలి. అందుకు జ్ఞానాగ్నిని ఆత్మ, అనాత్మ విచక్షణ జ్ఞానము ద్వారా రగిల్చి, అజ్ఞానమును కూకటి వేళ్ళతో దహించివేయవలెను.

48. శిష్యుడు గురువుగారిని ఈ విధముగా ప్రశ్నించును. దయయుంచి నేను అడిగే ఈ క్రింది ప్రశ్నకు సమాధానమును తమ నోటి ద్వారా వినాలని కోరుచున్నాను.

49. బంధనమనగా నేమి? అది ఎలా ఆత్మను పట్టి ఉంచింది? అది ఎలా కొనసాగుతుంది? ఎవరైన దాని నుండి ఎలా విముక్తి పొందగలరు? అనాత్మ అంటే ఏమిటి? ఉన్నతమైన ఆత్మ ఎవరు? ఆత్మ అనాత్మల భేదమును ఎలా తెలుసుకొనగలము? ఈ విషయములన్నింటిని వివరించవలసినదిగా కోరుచున్నాము.

50. గురువు ఈ విధముగా సమాధానము చెప్పుచున్నాడు.
ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు భగవంతుడు నిన్ను దీవించుగాక! నీవు జీవితములో ఉన్నత స్థితిని చేరుకున్నావు. నీ కుటుంబమును పవిత్ర పర్చినావు. అజ్ఞాన బంధనాల నుండి విడివడి బ్రహ్మత్వమును పొందియున్నావు.
 

51. ఒక తండ్రి తన కుటింబీకులందరిని అప్పుల బంధనాల నుండి విముక్తి కలిగించుగాక. కాని తనను తాను తన బంధనాల నుండి విముక్తి పొందియుండలేదు.
 

52. ఇతరులు తన నెత్తిన మోపిన బరువు బాధ్యతలను ఇతరులే దింపివేయవలెను. కాని వ్యక్తి తనకు తానే కల్పించుకున్న ఆకలి వంటి బాధలను తనకుతానే తొలగించకొనవలెను.
 

53. ఒక రోగి తనకు తగిన ఆహారమును, మందును తాను తీసుకొన్నప్పుడు రోగము పూర్తిగా తగ్గుతుంది. కాని ఇతరుల కృషి వలన కాదు.
 

54. వస్తువుల యొక్క నిజమైన స్వభావమును ముందుగా వ్యక్తి తనకు తాను తన దృష్టి ద్వారా వివరముగా చూసి గ్రహించాలి గాని ఇతర పండితులు చెప్పినప్పటికి అర్థము కాదు. చంద్రుడు ఎలా ఉంటాడు అనేది తన కండ్ల ద్వారా చూసి తెలుసుకోవాలి. ఇతరులు ఎలా తెలియచెప్పగలరు.
 

55. అజ్ఞానము, కోరికలు, కర్మల లాంటి వాటిని వ్యక్తి స్వయముగా తనకు తాను తొలగించుకోవాలి గాని, 100 కోట్ల జన్మలెత్తినను ఎవరు తొలగించలేరు. అజ్ఞానము వలన కోరికలు, కోరికల వలన కర్మలు, కర్మల వలన పాపపుణ్యములు తప్పవు. ఇవన్నీ పోవాలంటే వాటి యొక్క జ్ఞానాన్ని పొందాలి.
 

56. హఠయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము మరియు జ్ఞాన యోగముల ద్వారా బ్రహ్మమును పొందలేము. కేవలము బ్రహ్మమునకు తనకు భేదము లేదని స్వయముగా తెలుసుకొన్నప్పుడే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. పై యోగాలను యాంత్రికముగా అనుసరించిన బ్రహ్మమును పొందలేమని బంధనాల నుండి విముక్తి లభించదని అద్వైత సిద్ధాంతము తెలుపుచున్నది. సాంఖ్యయోగములో పురుష, ప్రకృతిలోని భేదమును స్వయముగా గ్రహించినప్పుడే విషయముల నుండి విముక్తి లభిస్తుంది. ప్రకృతిలో ఉన్న పురుష మామూలుగా వ్యక్తము కాదు. కాని పనులన్ని ప్రకృతిలోనే జరుగుచున్నవి. పురుష లేకుండా ప్రకృతి లేదు. ప్రకృతి పురుష నుండి స్వేచ్ఛను పొందియున్నది. ఇంకను సాంఖ్య యోగము వివిధ ఆత్మలను గూర్చి నమ్ముచున్నది. సాంఖ్య యోగానికి వేదాంత సిద్ధాంతాలకు ఇదే ముఖ్య భేదము. విషయ వాంఛలకు సంబంధించిన యజ్ఞాయాగాదుల వలన స్వర్గ సుఖాలు పొందవచ్చు గాని బ్రహ్మాన్ని చేరలేము. బ్రహ్మాన్ని పొందాలంటే బ్రహ్మాన్ని దర్శించుటయే మార్గము.
 

57. గిటారు వాయిద్యాలు, శృతులు కొద్ది మందికి సంతోషాన్ని కలిగించగలవే గాని ఆధ్యాత్మిక ఔన్నత్యానికి తోడ్పడవు.
 

58. వాక్చాతుర్యముతో కూడిన ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక గ్రంధాలలోని విషయ పరిజ్ఞానము వ్యక్తీకరించుట అనునవి కేవలము వ్యక్తిగతమైన ఆనందానికి తోడ్పడునే గాని వాటి వలన ఏ విధమైన సాంసారిక బంధనాల నుండి విముక్తి లభించదు.

59. అత్యున్నత బ్రహ్మ జ్ఞానమును పొందిన వానికి శాస్త్ర పఠనము వలన ప్రయోజనము లేదు. అలానే శాస్త్ర పఠనము ద్వారా ఎట్టి ఔనత్యమును పొందలేము.


60. శాస్త్రాలలోని వివిధ పదాలు కిక్కిరిసిన అరణ్యము లాంటివి. అందులో చిక్కుకొనిన బయటపడుట చాలా కష్టము. వాటి వలన మనస్సు వికలమగును. అందువలన తెలివి కలిగినవారు ప్రీతితో నిజమైన ఆత్మ స్వభావమును గ్రహించుట అవసరము.

61. అజ్ఞానమనే నాగుపాముచే కాటు వేయబడిన వ్యక్తికి బ్రహ్మజ్ఞానాన్ని పొందుటయే సరైన వైద్యము. అందుకు వేదాలు, శాస్త్రాలలోని మంత్రాల ద్వారా వైద్యము చేయాలి.
 

62. కేవలము మందు పేరు పదేపదే ఉచ్చరించుట వలన రోగము తగ్గదు. ఆ మందును సేవించవలసి ఉంటుంది. అలానే బ్రహ్మమును స్వయముగా తెలుసుకొనుట ద్వారానే వ్యక్తి బ్రహ్మాన్ని పొందగలడు. బ్రహ్మము, బ్రహ్మము అని పదేపదే ఉచ్చరించుట వలన బ్రహ్మ జ్ఞానము లభించదు. 63. బ్రహ్మము, తాను ఒక్కటే అను జ్ఞానము స్వయముగా సమాధి స్థితి ద్వారా పొందకుండా, అలానే తానే చిదాత్మను అని గ్రహించకుండా, బ్రహ్మము వేరు తాము వేరు అని ద్వంద్వ భావముతో ఉన్నప్పుడు అది అజ్ఞానమని పిలవబడుతుంది. ఆ అజ్ఞానమే తన యొక్క చెడు పనులకు కారణమని గ్రహించాలి. అది తొలగినప్పుడే ముక్తి. కేవలము బ్రహ్మము, బ్రహ్మము అని ఎన్ని సార్లు ఉచ్చరించినను బ్రహ్మాన్ని పొందలేముకదా!

64. ఒక రాజు తన చుట్టూ ఉన్న శత్రువులను జయించకుండా తానే చుట్టుప్రక్కల గొప్పవాడినని, తానే చెప్పుకొనినందువలన అతడు చక్రవర్తి కాలేడు.
 

65. భూగర్భములో ఉన్న ధనాగారము వెలికితీయాలంటే, తగిన వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల ద్వారా త్రవ్వకాలు జరిపి అడ్డుగా ఉన్న రాళ్ళను, మట్టిని తొలగించి ఆ ధనాగారాన్ని పొందినప్పుడే ఫలితము. అలా కాకుండా బయట నుండి ధనాగారము, ధనాగారము అని పలుమార్లు పలికినా అది బయటపడదు. అలానే ఆత్మ జ్ఞానము పొందాలంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న మాయ మరియు దాని ప్రభావాలను తొలగించకుండా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క సూచనల ప్రకారము సాధన, ధ్యాన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది. కేవలము అసంబద్దమైన వాదనల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము.

66. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్దతుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమరల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.
 

67. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్న (49వ శ్లోకము) చాలా గొప్పది. శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్న రహస్యమయమైన జ్ఞాన సౌందర్యాన్ని వెలికి తీసేదిగా ఉన్నది. తద్వారా జ్ఞానార్ధులు విముక్తి మార్గమును తెలుసుకొనగలరు.
 

68. ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పుచున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు.

7. బంధనాలు

69. సంసార బంధనాల నుండి విముక్తి పొందుటకు మొదటి మెట్టు:- నశించే ఈ ప్రాపంచిక సుఖ దుఃఖములకు రోసి ప్రశాంత స్థితిని పొంది, తనను తాను అదుపులో ఉంచుకుని, సహనముతో శాస్త్రానుసారముగా అన్ని విధములైన యజ్ఞయాగాదుల వంటి కర్మల నుండి విముక్తి పొందవలెను.

70. గురువు యొక్క బోధనలు విని తదనుగుణంగా దీర్ఘమైన అడ్డంకులు లేని ధ్యానములో నిమగ్నమై సత్యాన్ని తెలుసుకోవాలి. అపుడు జ్ఞానవంతుడైన సాధకుడు నిర్వికల్ప సమాధి స్థితికి చేరి, నిర్వాణ స్థితి యొక్క ఆనందమును ఈ జీవితములోనే పొందగలడు. నిర్వికల్ప సమాధి స్థితిలో సాధకుడు, చేసేవానికి, చేయబడినదానికి భేదములేదని అంతా ఒక్కటే అని, మానసిక స్థితులన్ని తొలగిపోగా తాను ఆత్మలో కలసిపోవును. అదే అత్యున్నత ఎఱుక స్థితి. అట్టి స్థితిని సాధకుడు ఇతర సంబంధాలతో అతీతంగా మాటలకు అందని రీతిలో చేరగలడు. అది అవ్యక్తమైన ఆనంద స్థితి అని, అదే స్వచ్ఛమైన ఎఱుక స్థితి అని, నిర్వాణమని చెప్పబడినది.
 

71. నేను ఇప్పుడు, నీవు ఏమి తెలుసుకోవలసి ఉన్నదో చెప్పుచున్నాను. నీవు ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించవలెను. జాగ్రత్తగా విని నీవేమి చేయాలో నిర్ణయించుకొనుము.
 

72. సప్త ధాతువులతో కూడిన ఈ శరీరము అనగా చర్మము, చర్మము పై ఉన్న పొర, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ మరియు శరీర భాగాలైన కాళ్ళు, ఊరువులు, చాతి, చేతులు, వీపు మరియు తల, వీటన్నింటితో ఈ శరీరము నిర్మింపబడినది.
 

73. మాయా నిర్మితమై 'నేను' 'నాది' అని పిలువబడుతూ ఈ శరీరము మొత్తము యోగులచే వర్ణింపబడినది. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి అనునవి మూల భూతములు. ఈ మూల భూతములచే శరీరము రూపొందినది.

8. పంచభూతాలు
74. పంచభూతాలతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రతి భూతము రెండు భాగాలైన, ఒక భాగములో ఆ భూతము యొక్క సగ భాగము, మిగిలిన సగము మిగిలిన నాల్గు భాగములలోని ఎనిమిదవ భాగములతో కూడి ఉన్నది. ప్రతి భూతములో ఐదు భూతాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు భూమిలో పదార్థము సగము, మిగిలిన సగము మిగిలిన నాలుగు భూతములతో కూడినవి. ఈ స్థూల శరీరము ఐదు భూతములతో పైన తెల్పినట్లు రూపొంది స్థూలమైనది. ఈ స్థూల శరీరము ఐదు తన్మాత్రలతో కూడినది. భూమి యొక్క తన్మాత్ర వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి శబ్దము. ఈ ఐదు తన్మాత్రల ద్వారా జీవాత్మ తత్‌సంబంధమైన ఆనందాలను,దుఃఖాలను పొందుచున్నది.
 

75. ఎవరైతే ఈ జ్ఞానేంద్రియములకు చెందిన వస్తు సముదాయములతో చిక్కుకుని ఉన్నారో వారు పిచ్చివారు. వారు జన్మ, మరణ, దుఃఖముల నుండి బయటపడలేరు. వారిలో మంచి పనులు చేసిన వారు దివ్యాత్మలుగా స్వర్గ సుఖాలను అనుభవించి మరల మానవ జన్మ ఎత్తవలసి వస్తుంది. చెడు పనులు చేసిన వారు నరకములో దుఃఖాలను అనుభవించి చెట్లు, చేమలుగా జన్మించి మరల మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది. 76. లేడి, ఏనుగు, చిమట, చేప మరియు నల్ల తుమ్మెదలు పంచతన్మాత్రలు అయిన వాసన, రుచి, కాంతి, స్పర్శ, శబ్దాలకు వశమై వాటి ప్రాణాలు కొల్పోయినప్పుడు; వాటి వాటి గుణాలకు అనుగుణంగా తిరిగి జన్మలు పొందుతాయి. అలానే మనిషి కూడా ఈ పంచతన్మాత్రులకు బందీ అయి తదనుసారముగా జన్మలు, కర్మలు, అనుభవించు చుండును.
 

77. త్రాసు పాము విషము కంటే పంచతన్నాత్రల వలన పొందే చెడు ఫలితములు ఇంకా ప్రమాదకమైనవి. పాము విషము అది తీసుకొన్నప్పుడే ప్రభావము చూపుతుంది. కాని పంచతన్నాత్రల వలన వాటిని చూసిన, తాకిన వాటి ఫలితముంటుంది.
 

78. జ్ఞానేంద్రియాల భయంకరమైన ఉచ్చు నుండి స్వేచ్ఛను పొంది, అతి కష్టముతో వాటిని వదిలించుకున్నవారే చావు పుట్టుకల నుండి విముక్తి పొందగలరు. ఇతరులు ఎవరు షట్‌ శాస్త్రముల జ్ఞానము పొందినప్పటికి ముక్తిని పొందలేరు.
 

79. దురాశతో ఉచ్చులో చిక్కుకున్న సొరచేప ఉచ్చు నుండి విడివడినట్లు, సాధకులు విముక్తిని పొందినప్పటికి వైరాగ్యము పొందనిచో సంసార సాగరము నుండి విడుదల పొందలేరు. మరియు వారు బ్రహ్మ జ్ఞానమును పొందనచో మధ్యలోనే సంసారసాగరములో మునిగిపోవలసి ఉంటుంది.
 

80. సొరచేప వంటి ఇంద్రియాలను వైరాగ్యమనే ఖడ్గముతో ఖండించినప్పుడే, అన్ని అడ్డంకులను తొలగించుకొని సంసారసాగరము దాటగలరు.
 

81. చావు ఒక్కటే మూఢుడైన వానిని అతని యొక్క ఇంద్రియ సుఖాలనుండి బయటపడవేయగలదు. అలానే జ్ఞానవంతుడైన తగిన గురువు యొక్క సూచనలకు అనుగుణంగా తాను సత్యాసత్యముల అవగాహన పొంది తన లక్ష్యమును సాధించవలెను.

క్ష్యమును సాధించవలెను.

82. నిజంగా నీవు విముక్తికై కోరుచున్నటైన, విషయ సుఖాలను, విషాన్ని దూరంగా ఉంచినట్లు ఉంచి, అమృతము వంటి సద్గుణాలను జాగ్రత్తగా అలవాటు చేసుకొని; తృప్తి, ప్రేమ, క్షమా గుణము, ముక్కుకు సూటిగా నడుచుకొనుట మరియు తనకు తాను అదుపులో ఉంచుకొనుట అను సద్గుణాలను పెంపొందించుకొనవలెను.

83. ఎవరైతే తాము ఎప్పుడూ అనుభవించే భౌతిక వాంఛలను పక్కన పెట్టి, అజ్ఞాన బంధనాల నుండి విముక్తులై మరల వాటి జోలికి పోనప్పటికి, శరీరముపై మోహముతో దానిని పోషించి ఇతరుల ఆనందానికై తోడ్పడిన చివరకు ఆత్మహత్య చేసుకొని కుక్కలకు రాబందులకు ఆహారమవుతారు. అనగా శరీరము పై మోహాన్ని తొలగించుకోవాలి.84. ఎవరైతే ఆత్మను తెలుసుకోవాలని కోరుకుంటారో వారు తమ శరీర పోషణకు ప్రాధాన్యమిచ్చిన అట్టి వ్యక్తి కొయ్యదుంగ అనుకొని మొసలిని పట్టుకుని నదిని దాటినట్లు ఉంటుంది. అనగా తన వినాశనానికి తానే కారకుడవుతాడు.
 

85. అందువలన విముక్తి పొందిన సాధకుడు దేహాభిమానము కలిగి ఉన్న, లేక దేహమే తానని భావించిన అది బయంకరమైన చావుతో సమానము. ఎవరైతే పూర్తిగా శారీరక వ్యామోహమును జయిస్తాడో అతడే పూర్తిగా స్వేచ్ఛను పొందగలడు.
 

86. ఘోరమైన చావును జయించాలంటే శరీరమే తానను భావన, భార్య, పిల్లలు మొదలగు భౌతిక బంధనాలను జయించి ఉన్నతమైన దైవ స్థితిని పొందాలి.

86. ఘోరమైన చావును జయించాలంటే శరీరమే తానను భావన, భార్య, పిల్లలు మొదలగు భౌతిక బంధనాలను జయించి ఉన్నతమైన దైవ స్థితిని పొందాలి.

87. ఈ శరీరము మొత్తము నికృష్టమైనది. ఎందువలనంటే అది చర్మము, మాంసము, రక్తము, నరాలు, క్రొవ్వు, మజ్జ, ఎముకలు, వీర్యములతోనూ మరియు ఇతరమైన అసహ్యకరమైన పదార్థములతో నిండివున్నది.

88. ఈ శరీరము తమ యొక్క గత జన్మల కర్మ విశేషములతో, పంచభూతముల పంచీకరణతో తయారై ఆత్మకు ప్రపంచానుభూతులను కల్గించుటకు ఏర్పడిది. అదే ఈ శరీరము యొక్క నిర్మాణము.

89. జీవాత్మ తాను ఈ శరీరమును ఆవాసముగా పొంది, తాను వేరైనప్పటికి, ప్రాపంచిక వస్తు సముధాయమును, మాలలు, సుగంధ ద్రవ్యాలు మొదలగు వాటితో శరీరము యొక్క బాహ్య అంగముల ద్వారా అనుభవించు చున్నది. అందువలన ఈ శరీరము మెలుకవ స్థితిలో ఆత్మకు ఒక ఆట వస్తువుగా ఉపయోగపడుచున్నది.
 

90. ఈ భౌతిక శరీరము ఆత్మకు ఒక నివాస స్థానము. ఏలానంటే గృహానికి గృహ యజమాని వలె తాను ఈ ప్రాపంచిక వ్యవహారాలన్ని ఈ ఇంటి నుండే కొనసాగించినట్లు.
 

91. ఈ భౌతిక శరీరము పుట్టుక, పెరుగుదల, చావు అను వివిధ స్థితులతో; కుల, మత, భేదాలతో; రోగాలు వాటి నివారణ చర్యలు; దైవ పూజలు, అవమానాలు, గౌరవాలతో జీవిస్తున్నది.
 

92. పంచజ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో భౌతిక పరిజ్ఞానమును పొంది; నోరు, చేతులు, కాళ్ళు మొదలగు కర్మేంద్రియములతో వాటి వాటి ధర్మానుసారము అవి పనిచేయుచున్నవి.

 
అంతఃకరణాలు
93,94. అంతఃకరణ చతుష్టయములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనునవి వాటి పనులవి చేయుచున్నవి. మనస్సు వస్తు పరిజ్ఞానము పొందగా, బుద్ది సత్యాసత్యములను గ్రహించగాఅహంకారము శరీరము తానే అను భావముతో తానే స్వయం ఆత్మగా భావిస్తుంది. చిత్తము తనకు నచ్చిన వస్తు విశేషములను గుర్తిస్తుంది.

95. ప్రాణ శక్తి తాను ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అను ఐదు భాగములుగా తమతమ పనులను అనుసరించి విభజింపబడుతుంది. ఎలా అంటే బంగారముతో వివిధ ఆభరణములు తయారు చేయబడినట్లు. అలానే నీరు ప్రవాహముగా, నురుగుగా మారునట్లు.
 

96. ఐదు కర్మేంద్రియాల పనులైన వాక్కు మొదలగు కర్మల వలన జ్ఞానమును వినుట ద్వారా, తినుట, చేయుట ద్వారా పొందుచున్నవి. ఐదు ప్రాణములు, ఐదు భూతాలు వాటి వాటి చర్యలు బుద్ధిని ఉపయోగించి తన కోర్కెలను జీవాత్మ తీర్చుకొనుచున్నది.
 

97. ఈ స్థూల శరీరాన్ని లింగ శరీరమని, అది పంచభూతాలతో తయారైనదని ఈ భూతములు విడిపోవుటాలు, కలయికలు అను విధానము ద్వారా పంచతన్మాత్రులుగా రూపొంది ఈ శరీరము గత జన్మలలో పొందిన అనుభవాలను, అనుభూతులను పొందుటకు తోడ్పడుచున్నది. అజ్ఞానము వలన అనంతమైన క్రియలు వాటి ఫలితములను జీవాత్మ అనుభవించుచున్నది.

 98,99. కలలు జీవాత్మ యొక్క ప్రత్యేకమైన స్థితి మెలుకవ స్థితికి భిన్నముగా ఇది ప్రకాశించుచున్నది. కలలలో బుద్ధి లేక మనస్సు వివిధ పాత్రలను జీవాత్మకు సాక్షిగా పోషిస్తూ మెలుకవ స్థితుల యొక్క జ్ఞాపకాలకు అనుగుణముగా జీవాత్మ అనుభవించుచున్నది. అదే సమయములో ఆత్మ ప్రకాశమును గ్రహించి బుద్ధి అన్ని విషయాలను నడింపించు చున్నది. ఆత్మ బుద్ధి యొక్క చేష్టలకు అతీతముగా సాక్షిగా గమనించుచున్నది. ఎన్ని కర్మలు చేసినను వాటి ఫలితములు ఆత్మకు అంటవు.

100. ఈ స్థూల శరీరము ఆత్మ యొక్క అన్ని కార్యాలకు పరికరముగా తోడ్పడుచున్నది. ఆత్మ పరిపూర్ణ జ్ఞానముతో ఏ విధముగా అయితే వడ్రంగి; భాడిత, సుత్తి, మొదలగు పరికరములతో పనిచేసినట్లు ఆత్మ పనిచేయుచున్నది.

101. కండ్లు బలహీనముగా, గుడ్డిగ లేక చురుగ్గా ఉన్నప్పటికి అలానే చెవి; మూగగా చెముడు కలిగి ఉన్నప్పటికి, అన్ని తెలిసిన ఆత్మకు ఆ చెవిటి తనము, గుడ్డి తనము ఉండవు, అంటవు.

102. శ్వాస తీసుకొనుట, వదులుట, ఆవలింతలు, తుమ్ములు, శ్వాస బిగబెట్టుట శరీరమును వదులుట అనునవి ప్రాణము యొక్క వివిధ పనులు. మిగిలినవి దప్పిక, ఆకలి అనునవి ప్రాణ శక్తి యొక్క ఇతర పనులు.
 

103. పంచ జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు మొదలగువాని వెనుక మనస్సు పనిచేస్తున్నది. అలానే శరీరములోని వివిధ భాగములు ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
 

104. అహం అనునది శరీరమే తాను అను భావముతో, తానే అన్ని చేస్తూ అనుభవిస్తున్నానని, సత్వ, రజో, తమో గుణాలకు అనుగుణంగా వ్యవహారము నడుపుచున్నది.
 

105. జ్ఞానేంద్రియాలకు అనుకూలముగా పనులు జరిగినప్పుడు సంతోషమును, వ్యతిరేకముగా ఉన్న దుఃఖాలను అహం అనుభవిస్తూ ఉంటుంది. ఈ దూషణ, భూషణాలు అనునవి అహం యొక్క లక్షణాలు. సదా ఆనందములో ఉండే ఆత్మకు సంబంధము లేదు.
 

106. జ్ఞానేంద్రియాలు కేవలము ఆనందానుభూతులను ఆత్మ యొక్క ప్రభావముచే అనుభవించుచున్నవి. అవి స్వతంత్రముగా వ్యవహరించలేవు. ఎందువలనంటే ఆత్మ స్వభావము అన్నింటిని ప్రేమించుటయే. అందుకే ఆత్మ ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటుంది. దుఃఖాలకు లోనుకాదు.
 

107. గాఢ నిద్రలో మనము ఆత్మానందాన్ని జ్ఞానేంద్రియాలకు సంబంధము లేకుండానే అనుభవించుచున్నాము. ఈ విషయము సృతులలో వివరముగా చెప్పబడినది.

మాయ

108. అవిధ్య లేక మాయ అనునది పరమాత్మ యొక్క వ్యక్తీకరణమే. సత్వ, రజో, తమో గుణాల సమత్వ స్థితి బ్రహ్మము. సమత్వ స్థితి లోపించినప్పుడు మాయ వ్యక్తమవుతుంది. విశ్వ సృష్టికి కారణమైన ఈ మాయ త్రిగుణాతీత స్థితిలో లేదు. త్రిగుణములు సమత్వ స్థితిని కోల్పోయినప్పుడే సృష్టి ఏర్పడినది. అదే ప్రకృతి.

109. మాయ అనేది వ్యక్తము కాదు. అవ్యక్తము కాదు. లేక రెండు లక్షణాలు ఉన్నదికాదు, లేనిదికాదు. లేక కొన్ని లక్షణాలు విడివిడిగా లేక కలసి ఉన్నట్లు భావించ రాదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని మాటలతో వర్ణించలేము.
 

110. మాయను జయించాలంటే కేవలము బ్రహ్మాన్ని తెలుసుకొని ఉండాలి. బ్రహ్మము లాంటిది వేరొకటి లేదు. ఎలా అంటే త్రాడును చూసి పాము అని భ్రమించి అది పాము కాదు తాడని గ్రహించినట్లు; దాని లక్షణాలైన సత్వ, రజో, తమో గుణాలు వానివాని స్వభావాన్ని బట్టి నిర్ణయించబడతాయి.
 

111. రాజస గుణములో నిక్షేపశక్తి అనగా తన యొక్క క్రొత్త ఆకారమును తెలుసుకొన్న వెంటనే వ్యక్తము చేయగలుగుతుందో అది ఆవరణములో బహిర్గతమవుతుంది. దీని నుండి కూడా మానసిక లక్షణములైన ఆకర్షణ, విచారము అనునవి నిరంతరముగా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.


అరిషడ్‌ వర్గాలు
112. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములను అరిషడ్‌ వర్గాలు రాజస లక్షణములు. వాటి ద్వారా వ్యక్తి యొక్క ప్రాపంచిక దృక్పదము వ్యక్తమవుతుంది. కావున రాజస గుణము బంధనానికి కారణమవుతుంది.

113. తామస గుణము యొక్క ముఖ్య లక్షణము బద్దకము, తమస్సు. వాటి వలన వస్తువుల యొక్క అసలైన లక్షణాలు గాక వేరుగా కనిపిస్తాయి. అందువలన మనిషి మరల మరల మార్పు చెందుతూ ఆయా లక్షణాలు వ్యక్తము చేస్తుంటాడు.

114. విద్యావంతులు, బుద్ధిమంతులైన వారు కూడా మరియు తెలివిగల స్థిరమైన ఆత్మ జ్ఞానము కలవారు కూడా తామస గుణానికి బందీలై, ఆత్మను గూర్చి ఎంత వివరించినను అర్థము చేసుకొనలేకున్నారు. వారు కేవలము భ్రమకు లోనై అదే నిజమని భావించి, ఆ భ్రమలకు బందీలై ఉన్నారు. ఆహా! ఎంత శక్తివంతమైనది ఈ బద్ధకముతో కూడిన తామస శక్తి.
 

115. తగిన నిర్ణయ శక్తి లేకపోయినా, లేక వ్యతిరేఖమైన నిర్ణయ శక్తి ఉన్నా అందుకు ఖచ్చితమైన నమ్మకము అవసరము. ఏ విధమైన అనుమానము ఉన్నా ఈ వ్యక్త శక్తి మరియు బహిర్గత శక్తి అంతము లేని కష్టాలను కలిగిస్తుంది.
 

116. తెలియని తనము, ఉత్సాహము లేకపోవుట, అలసట, నిద్ర, వ్యతిరేఖ భావన, జఢత్వము అనునవి తామస గుణములు. వీటికి బందీలైనవాడు దేనిని సాధించలేడు. కేవలము మత్తులో ఉండి, రాయివలె ఉండిపోతాడు

త్రిగుణాలు

117. సత్వ గుణము స్వచ్ఛమైన నీరు వంటిది. అయినప్పటికి అది రాజస, తామస గుణాలతో కలసినప్పుడు మార్పులకు లోనగును. సత్వ గుణములో ఆత్మ వ్యక్తమవుతుంది. అది ఎలా అంటే సూర్య కిరణము ప్రాపంచిక వస్తు సముదాయము పై వ్యక్తమైనట్లు.

118. ఇతర గుణములతో కూడిన సత్వ గుణము యమ, నియమాలు, గర్వము మొదలగునవి లేకపోయినప్పటికి; నమ్మకము, భక్తి, విముక్తికై కోరిక దైవిక లక్షణాలు మరియు అసత్యాలకు దూరముగా ఉండుట అను లక్షణాలు కలిగి ఉంటారు.

119. స్వచ్ఛమైన సత్వగుణము యొక్క లక్షణములు; సంతోషము, ఆత్మ దర్శనము, ఉన్నతమైన శాంతి, తృప్తి, ఆనందము మరియు దివ్యాత్మల ఎడల భక్తి మొదలగు వాటి వలన సాధకుడు అంతములేని ఆనందమును సదా అనుభవించుచుండును.
 

120. సత్వ, రజో, తమో గుణములతో కూడిన ఆత్మ యొక్క ఈ తాత్కాలిక శరీరముతో పోల్చిన స్వచ్ఛమైన సత్వ గుణము యొక్క లక్షణములు; గాడ నిద్ర దాని ప్రత్యేకత. ఆ స్థితిలో మనస్సు యొక్క అన్ని చర్యలు అంతమైపోవును.
 

121. గాడ నిద్రలో అన్నివిధములైన గత జ్ఞాపకాలు, ఆలోచనలు, అగిపోయి మనస్సు స్థిరత్వమును పొంది, మొలకెత్తని విత్తనము వలె స్థిరముగా ఉండును. దీనికి గుర్తు ఏమిటంటే ఆ స్థితిలో వ్యక్తి తనకు ఏమి తెలియని స్థితిలో ఉంటాడు.
 

\122. శరీర భాగాలు, ప్రాణశక్తి, మనస్సు, అహము మొదలగునవి అనేక మార్పులు చెంది జ్ఞానేంద్రియాలు, ఆనందము, విశ్రాంతి, భౌతిక వస్తు సముదాయాలు, విశ్వము అనునవి అన్నియూ అనాత్మ సంబంధమైనవిగా గుర్తించాలి.
 

123. మహత్వాకాశము నుండి భౌతిక వస్తు సముదాయము వరకు అన్ని మాయ యొక్క ఫలితమే. ఈ వస్తువులు మాయ వలన అసత్యములని, ఎడారిలోని మృగతృష్ణలని గ్రహించాలి

ఆత్మ స్వభావము
124. ప్రస్తుతము నేను నీకు నిజమైన ఆత్మ స్వభావమును గూర్చి చెప్పబోవుచున్నాను. దానిని తెలుసుకొన్న వ్యక్తి సాంసారిక బంధనాల నుండి విముక్తిని పొందగలుగుతాడు.

125. అహంకారము యొక్క పూర్తి ఎఱుక శాశ్వతమై సత్యమును తెలియజేస్తుంది. సత్వ, రజో, తమో గుణాలను దర్శించునపుడు అవి శరీరము యొక్క పంచకోశముల తత్వములను ఎఱుక పరుస్తాయి. అవి 1. అన్నమయ కోశము, 2. ప్రాణమయ కోశము, 3. మనోమయ కోశము, 4. విజ్ఞాన మయ కోశము, 5. ఆనందమయ కోశము. వీటిలో మొదటిది శరీరమునకు సంబంధించినది. తరువాత మూడు కోశములు సూక్ష్మ శరీరమునకు సంబంధించినవి. మరియు చివరిదైన ఆనందమయ కోశము కారణమయ శరీరమునకు చెందినది. ఆత్మ ఈ ఐదు కోశములకు వేరైనది.
 

126. ఎఱుక స్థితిలో జరుగుచున్న విషయములన్నియూ ఎదైతే తెలుసుకొంటుందో అదే కలలలోనూ, గాఢ నిద్రలోనూ తెలుసుకొంటుంది. అది ప్రస్తుత స్థితి యొక్క ఎఱుక మరియు మనస్సులేని స్థితి. దాని పనులు అహం యొక్క గత భావనలే. అదేమిటంటే .......
 

127. అది అన్నింటిని దర్శిస్తుంది. అది వివేకాన్ని ప్రభావితము చేస్తుంది. కాని అవేవి దానిని ప్రభావితము చేయలేవు.
 

128. అది విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అయితే దానిని వ్యాపింపచేసేది ఏదీ లేదు. అది ప్రకాశిస్తుంది. ఈ విశ్వమంతా దాని వలన ప్రకాశిస్తుంది.
 

129. దాని ప్రకాశము వలనే ఈ శరీరము దాని భాగములు, మనస్సు, విజ్ఞానము వాని యొక్క భూమండలాలు దానికి సేవకులుగా పనిచేస్తున్నాయి.
 

130. దాని వలననే ప్రతిది అహము నుండి శరీరము వరకు, జ్ఞానేంద్రియాలు, ఆనందము మొదలగునవి అన్నియూ స్వచ్ఛమైన పాత్రవలె ఉన్నది. ఆ పాత్రలో శాశ్వతమైన జ్ఞానము నిండి ఉన్నది.
 

131. ఆది ఆత్మ అయిన పురుష అనేది అంతర్గత ఆత్మ. దానిని పొందినపుడే స్థిరమైన ఆత్మావగాహనతో కూడిన అంతములేని ఆనందము లభిస్తుంది. అది ఎల్లప్పుడు అలానే ఉంటుంది. ఆ స్థితి ఎల్లప్పుడు ప్రతి విషయములోనూ ప్రతిస్పందిస్తుంది. దాని వలన ప్రాణ శక్తి శరీర భాగాలు తమతమ పనులు నిర్వహిస్తుంటాయి.
 

132. ఈ స్థూల శరీరములో సత్వగుణముతో కూడిన మనస్సుతో బుద్ధి అనే అంతఃకరణము యొక్క గతిలో, ఆకాశములో అవ్యక్తమైన ఆత్మ ప్రకాశముతో కూడిన వెలుగులో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఈ విశ్వం మొత్తాన్ని తన యొక్క స్వయం ప్రకాశముతో ప్రకాశింపజేస్తుంది.
 

133. సాక్షిగా ఉన్న ఆత్మ మనస్సు యొక్క మార్పులను, అహాన్ని మరియు శరీరములోని వివిధ అంగములు, ప్రాణ శక్తిని గమనిస్తూ వాటి ఆకారములను పొందుతూ; ఎలా అయితే ఇనుప గుండు అగ్నిని తనలో నింపుకుని మార్పులేక ఉంటుందో అలా వానిలో ఐక్యమై గమనిస్తూంది. కాని అది ఏమి చేయదు, దానిలో ఏ మార్పు రాదు.134. ఆత్మ ఎప్పుడు పుట్టదు, గిట్టదు, పెరగదు, తరగదు మరియు ఏ మార్పు చెందదు. శాశ్వతత్వము కలిగి ఉంటుంది. ఈ శరీరము నశించినప్పటికి ఆత్మకు చావులేదు. ఆకాశములోని ఘటము పగిలినప్పటికి అందులోని ఘటాకాశము విశ్వములో కలసినట్లు, ఈ ఆత్మ సర్వ స్వతంత్రము. అన్నింటిని అధిగమిస్తుంది, అన్నింటిలో ఉంటూ వాటికి అతీతముగా ఉంటుంది. 


మల్లాప్రగడ రామకృష్ణ కధలు -22

అపరాధి ?

                   

సాగిపో…

No automatic alt text available.



జ్ఞానయోగః 5 (అథ చతుర్థోధ్యాయః, శ్రీ భగవద్గీత)
తేటగీత పద్యాలు

అగ్ని కట్టెను బూడిద చేయు చుండు 
అగ్ని కామము పుట్టించి మనసు మార్చు 
అగ్ని మంచును కరిగించి తెలివి చూపు
జ్ఞాన అగ్ని కర్మములను భస్మ ముచెయు
     
జ్ఞాన మునకుమించిన విద్య లేనె లేదు
యోగ సిద్ధిచే జగతిలో జ్ఞాన మొందు
మనసు విద్యను పంచేటి సవ్య జ్ఞాని     
దాన ధర్మము సలిపితే కాల జ్ఞాని 

శాస్త్ర విజ్ఞాన మందును శ్రద్ధ ఉన్న
నిష్ఠ ఆధ్యాత్మిక సాధన యందు ఉన్న
ఇంద్రి యములను జయించి ధర్మ నిరతి   
శాంతి తొ మనిషి  జ్ఞానము పొందు చుండు 

చపల చిత్తుడు, అనుమాన మున్నా వాడు,
శ్రద్ధ రహితుడు, చోరుడు, కోప పరుడు,   
సౌఖ్యము కొరకు మోసము చెయు వాడు,
తల్లి తండ్రుల్ని దూషించు  జ్ఞాని కాడు   

యథైధాంసి సమిద్ధోగ్ని
ర్భస్మసాత్కురుతేర్జున,
జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి
భస్మసాత్కురుతే తథా.

అర్జునా! బాగుగ ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెల నేప్రకారము బూడిదగాజేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్తకర్మములను భస్మ మొనర్చివైచుచున్నది.

న హి జ్ఞానేన సదృశం
పవిత్ర మిహ విద్యతే, 
తత్స్వయం యోగసంసిద్ధః
కాలేనాత్మని విందతి.

ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది ఏదియును లేదు. అట్టి జ్ఞానమును (కర్మ) యోగస్థితిని బొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగ పొందుచున్నాడు .

శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం
తత్పరః సంయతేంద్రియః,
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి
మచిరేణాధిగచ్చతి.

(గురు, శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, (ఆధ్యాత్మిక సాధనలందు) తదేకనిష్ఠతో గూడినవాడును, ఇంద్రియములను లెస్సగా జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు పరమశాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.

అజ్ఞ శ్చాశ్రద్దధానశ్చ
సంశయాత్మా వినశ్యతి,
నాయం లోకోస్తి న పరో
న సుఖం సంశయాత్మనః.

జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకముగాని, పరలోకముగాని, సౌఖ్యముగాని లేవు.

యోగసన్మ్యస్త కర్మాణం
జ్ఞాన సంఛిన్న సంశయమ్‌,
ఆత్మవంతం న కర్మాణి
నిబధ్నంతి ధనంజయ.

ఓ అర్జునా! నిష్కామకర్మయోగముచే కర్మ ఫలములను త్యజించినవాడును, (లేక ఈశ్వరార్పణ మొనర్చినవాడును), జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు ఆత్మనిష్ఠుని (బ్రహ్మజ్ఞానిని) కర్మములు బంధింపనేరవు.

తస్మాదజ్ఞాన సంభూతం
హృత్థ్సం జ్ఞానాసినాత్మనః,
ఛిత్వైనం సంశయం యోగ
మాతిష్ఠోత్తిష్ఠ భారత.

ఓ అర్జునా! కాబట్టి నీయొక్క హృదయమున నున్నదియు, అజ్ఞానము వలన బుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమను ఖడ్గముచే చేదించివైచి నిష్కామకర్మయోగము నాచరించుము. లెమ్ము.



🌹 🌹 🌹 🌹 🌹

  నీ నవ్వు నన్ను పిలిచింది
నీ  నీడ  లాగ  ఉండమంది
నిన్ను చూసాక నాలోటు తీరింది
ఇన్నాళ్లు వేచిన ఫలితం దక్కింది
నాతో నడచిన అడుగులు గుర్తుం

ది
నిన్న మాటలు మరిచా రేపు గుర్తుకొస్తుంది
బరువుని పంచు కోవాటానికి  సమయమైంది
పంచు కొనేందుకు నీ ఉంటే సంతోషముంది

నల్లని నీ కనుపాపలో మెరుపుకనబడింది
నీ పెదవుల పిలుపు కలవర పెట్టింది
నీ హావభావాలకు నాకు మతి పోయింది
నడిరేయి వెన్నల కలవ మంటున్నది

నీ చిరునవ్వు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది
నీ సిగ్గు నా జీవితానికి తోలి కలయిక అవుతుంది
తనువూ మనసు చెరిసగము పంచు కోమంటున్నది
శుభమూహూర్తం నేడే  ఏకమవ్వ మంటున్నది





--((*))--



 ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన  పత్రిక 22/3-

మీకు మేలు అమ్మ వారికృప తొమన
మంద రముయు తల్లి వరలక్ష్మి పూజిద్దాం
సకల జనుల కొరకు ఆరాధిద్దాం మనం
సకల విద్య నేర్పు తల్లిని కొలుద్దాం         


     


































































*ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు(serial) పార్ట్ - .                 ........     

                                                                                                     











































baby animals:



Collective nouns:

Collective nouns for animals…: