Sunday 5 February 2017

Grammer


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

  We Aren’t Built to Live in the Moment 
విశ్వములో మానవుడు తాడు చూసి పాము అనుకోవచ్చు, కొమ్మ కదలిక శబ్దం ఎవరో పిలుస్తున్నారనవచ్చు, మెరుపును చూసి విద్యుత్ అనవచ్చు. ముత్యపు చిప్పను చూసి వెండి అనవచ్చు. చీకటిలో వేణు చూసి కొరివి దెయ్యమనవచ్చు,  ఏది ఏమైనా ప్రతి ఒక్కరు మాయా బ్రమకు లోనుకాక తప్పదు.      

ఈ విశ్వము ఉన్నతమైన బ్రహ్మమే అయి ఉన్నది. అదే నిజము. అది కాక వేరేది లేదు. అదే జ్ఞాన సారము. పవిత్రమైనది, కళంకములేనిది, మొదలు, అంతము లేనిది ఏమీ చేయనిది బ్రహ్మానంద స్థితి యొక్క అసలైన సారము. మాయ వలన సృష్టించబడిన అనేక పదార్థములలో మాయ వలన మార్పు తెచ్చినది అదియే విజ్ఞానము, శాశ్వతము, బాధలకు లోనుకానిది, ఎల్లపుడు ఉండేది, విభజింపబడనిది, కొలతలకు అందనిది, ఆకారము లేనిది వేరు చేయుటకు వీలు లేనిది, పేరు లేనిది, స్వయం ప్రకాశమైనది, నిర్వికారమైనది, స్థిరమైనది ఆ బ్రహ్మమే.

అమ్మ నీవు భయపడ నవసరంలేదు నా కాని తెలుసు నా జాగర్తలో నేను ఉన్నాను, నీవు భయపడ నవసరంలేదు అని అన్నది.

అప్పుడే అవి త్రాగి స్నేహితులతో శ్రావ్యా వాళ్ళ ఇంటికి వచ్చి  నాతో పాటు రా అని బలవంతం చేసాడు, అప్పడే తల్లి నీతో పంపను అని మోడిగేసింది. అది గమనించిన స్నేహితులు తల్లిని కట్టేశారు కూతురిని బలవంతంగా తీసుకోని పొదలిచారు, అది గమనించిన శ్రావ్య కత్తి పీట చేత పట్టి అందరిని బెదిరించి తల్లికి కట్లు విప్పి, ధైర్యం గా అందరిని ఎదిరించింది. అందరూ పారిపోయారు తల్లిని వెంట బెట్టుకొని ఇల్లు వదలి "రవి పై " పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.                     
చలపతిరావు తన అర్ధ బలంతో కొడుకుని విడిపించి యారా దేశాలకు పంపాలని నిర్ణయించుకున్నాడు. శ్రావ్య ను మరవలేకున్నాడని తెలుసుకొని,         .
                    
     
విశ్వము
213, 214. సమాధానము:- నీవు సరైన ప్రశ్నను అడిగినావు. నీవు మంచి, చెడులను తగినట్లు బేరీజు వేయుచున్నావు. దీని వలన అహం, మనస్సు, జ్ఞానేంద్రియాలు గాఢ నిద్రలో లేనప్పటకి, వాటిని ఆత్మ సాక్షిగా గ్రహిస్తుంది. కాని వాటికి అది అతీతముగా ఉంటుంది. నీవు అదే ఆత్మవు అని గ్రహించినవాడు తన యొక్క సునిసితమైన తెలివితేటలతో గ్రహిస్తాడు. సినిమాల్లో తెర మీద అనేక రకాలైన బొమ్మలు వస్తుంటాయి. కాని వాటికి కారణమైన అసలైన ప్రొజెక్టరు వేరే ఉన్నది. ప్రకృతిలో మారే ప్రతి వస్తువు వెనుక శాశ్వతమైన ఆత్మ ఉంటుంది. 215. ఏదైన ఒక విషయాన్ని తెలుసుకొనుటకు వేరొకటి తోడ్పడినపుడు దానికి తొడ్పడిన దానిని దర్శిస్తుంది. ఒక వస్తువును తెలుసుకొనుటకు ఏజెండు లేని ఎడల, దాని గురించి ఏమియూ తెలియదు.
216. ఆత్మ తనను తానే గుర్తించును. ఎందువలనంటే అదే దానిని గుర్తించగలిగినది. అందువలన జీవాత్మ ఒక్కటే నేరుగా పరమాత్మను దర్శించగలదు. మిగిలినవేవి దానిని దర్శించలేవు.
217. ఏదైతే అన్నింటిలో వ్యాపించి ఉన్నదో; మెలుకవలో, కలలో, గాఢ నిద్రలో;అది అంతర్గతముగా మనస్సుచేత తెలుసుకొనబడుతుంది. ఆ మనస్సు అనేక విధములైన అహం, బుద్ధి మొదలగు వాటిలో ప్రస్ఫుటమవుతుంది. అవన్నీ కూడా మార్పుల యొక్క వివిధ రూపాలే. మరియు అవి ఎఱుక, విజ్ఞానము, ఆనంద స్థితులు. వాటిని నీవు నీ ఆత్మ ద్వారా నీ హృదయములో దర్శించగలవు. ఆత్మ, బ్రహ్మము యొక్క మరొక పేరు. మన యొక్క అహం, బుద్ధి అనేవి మన యొక్క మానసిక స్థితులు. అవి ఆత్మ వలననే వ్యక్తీకరింపబడతాయి.
218. సూర్యుని ప్రతిబింబము కూజాలోని నీటిలో పడినపుడు మూర్ఖుడు అది నిజమైన సూర్యుడని తలచును. అదే విధముగా తెలివి తక్కువ వ్యక్తి మాయ వలన తాను చిత్తము యొక్క ప్రతిబింబముగా, బుద్ది చేత నిర్ణయింపబడుతుంది. అది ఒక219. జ్ఞాని అయిన వ్యక్తి తాను జాడీ నుండి నీటిని తొలగించి సూర్యుని ప్రతిబింబమును లేకుండా చేసి నిజమైన సూర్యుని దర్శించును. ఆ సూర్యుడు స్వయం ప్రకాశముతో ఆ మూడింటిని ప్రకాశింపజేస్తుంది. అది సర్వ స్వతంత్రమైనది.

మోదట ప్రేమించిన అమ్మాయి పల్లవి వద్దకు చేరాడు రామకృష్ణ
ఆమెను గట్టిగా అడుగగా నాదగ్గర కొచ్చి త్రాగి పడుకునేవాడు, నన్ను తాకను కూడా తాకడు అన్నది.
మరి ఎందుకు అతనితో ఉండుట, ఎదో రహస్యము ఉన్నది నిజం చెప్పు అని దబాయించాడు బ్రహ్మానందం.
నేను బ్రతుకు తెరువు కోసం ఇక్కడ కొచ్చాను, మొదట ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందా మనుకున్నాం, త్రాగుటకు బానిస అయినాడు, అది మానితేగాని పెళ్లి చూసుకో౦నని గట్టిగా చెప్పాను, అర్వాత చని పోయినట్లు తెలిసింది ఇనకన్నా నాకు ఏమి తెలియదని చెప్పింది.

ఒకే అంటూ నెంబర్ " టు " వద్దకు బయలు దేరుదాం అంటూ కదిలారు బ్రహ్మానందం, రామకృష్ణ

అది ఒక విశాల మైదానంలో ఉన్నభవనము, ఇంటి ముందు కుక్కలున్నవి జాగర్త అని బోర్డు చూసాడు బ్రహానందం

అప్పడే ఆఇంటిలో నుండి కారు రావటం గమనించారు, అనెం. నోట్ చేసుకొని దానివివరాలు తెలుసుకున్నారు.

అయినా గోడదూకి లోపలకు వెళ్లి కిటికీ నుండి చూడగా వారికీ గోడమీద రక్తపు మరకలు కనిపించాయి.

ఇక్కడే చంపేసి ఉంటారు ఎవరో అని నిర్ధానకు వచ్చారు, ఇక్కడ జరిగిన విషయాలు ఎలా తెలుసు కోవాలి అని ఆలోచిస్తున్నారు.       
            
అప్పుడే గెట్ మూస్తూ వాచ్ మాన్ ను చూసారు, వెంటనే క్రిందకు దూకి అతన్ని కలిశారు.

బ్రహ్మానందం ఒక ఫోటో చూపించి ఈయనెవరో తెలుసా అని అడిగాడు వాచ్ మెన్ ని

ఇతను మాఅమ్మగారికి బాగా తెలిసిన వాడు

నీకు తెలిసినవి చెపుతావా

నేను చెప్ప కూడదు మరొకరిని అడగండి అని గబా గబా లోపలకు నడిచాడు.
ఆగు అంటూ గట్టి శబ్దం వినబడింది, చెపుతావా పోలీసులద్వారా చెప్పించాలో ఆలోచించుకో
ఇంతకు మీరెవరు
ఎవరన్నది చెపితేకాని చెప్పవా అంటూ గద్దించాడు బ్రహ్మా నందం         


               
 


నిరుద్యోగి ప్రయాణం -8

మాధవ్ ఏదో పరధ్యానంగా నడుస్తున్నాడు, వెనకాల పోలీస్ విజిల్సు వినబడుతున్నాయి, వేగంగా ఒక కారు వచ్చి మాధవ్ దగ్గర ఆగింది, దానిలో నుంచి ఒకరు దిగి మాధవ్ కు ఒక కవరు ఇచ్చి గబా గబా కారు ఎక్కి వేగంగా నడిపారు, ఒక పోలీస్ వ్యాన్ వేగంగా వెంబడించింది, వేరొక పోలీస్ వ్యాన్ మాధవ్ దగ్గిర ఆగింది, ఆకవరులో ఏముంది అంటూ లాక్కొని వ్యాన్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

పోలీస్ లు మాధవ్ ని బందిఖానాలో ఉంచి వచ్చిన వారికీ నీకు ఏమి సంభందము, అని లాఠీతో కొట్టటం మె దలు పెట్టారు, భాధను భరిస్తూ నోరు విప్పి ఏమి చెప్పలేదు. ఇన్ స్పెక్టర్ వచ్చి అడిగినా నాకు తెలవదు అని మాత్రమే చెప్పాడు మాధవ్.

చూడండి మీరు తప్పు చేస్తున్నారు, నేను నిరపరాధిని నాకు వారికి ఎటువంటి సంబంధము లేదు. పంచజ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో భౌతిక పరిజ్ఞానమును పొందాలి;  నోరు, చేతులు, కాళ్ళు మొదలగు కర్మేంద్రియములతో వాటి వాటి ధర్మానుసారము అవి పనిచేసేవిధముగా ప్రవర్తించాలి. వాని అనుకరించే మనం శిక్ష విధించాలి, పెద్దవారి ప్రోద్బలము వళ్ళో, ఉద్యోగ ఉన్నతి కోసమో, ఉద్యోగ ధర్మము విస్మరించి కూడదు అన్నాడు.

కోపంతో పోలీస్ అధికారి గట్టి మోదీ, ఇతని తరఫు ఎవరున్నారో అన్ని వివరాలు సేకరించండి, జాగర్తగా  కాపాలా కాయండి అని బయటకు వెళ్ళాడు పోలీస్ అధికారి.  


మిణుఁగురుపురుగులు గనఁబడు సమయములో నన్ను బంధించుట ఫలితము ఎవ్వరికి, పురుగుల వెలుగు ఎవ్వరికి పనికిరాదు, దూరము నుంచి చూసిన వారికి ఆనందము కలిగించు, వేరొకరి ఆనందం కోసం మరొకరిని బంధించుట సమంజసమా ?.     

క్షణమఁట నిలఁబడ వినఁబడెఁ జెవులకు, ధ్వనులవి యింపుగ నేవో  ముదమై, వీణాధరి వేవో?  కనీసం అర్ధం చేసుకొనే మనసున్న పిచ్చికుక్కలకు చిక్కిన కోడిపిల్ల బ్రతుకు నాది మారుట ఎందుకు ?.    

ఉనికిని తెలిపిన ధర్మము తప్పిన వారికి నిజము గ్రహించు శక్తి ఉండదు, వీరికి మంచి భావాలు ఉండ  వు , కృప దయ మచ్చు తునకన కాన రాదు ఎందుకు ? 

కనులలో ఉన్న మెరుపును గుర్తించలేరు, ఎదో అనుకోని ఎదో చేసి కేసులు కావాలని,  నిజాయితిని నిరూపించు కోవాలని తాపత్రయంతో తెలియని తప్పులు చేయుట  ఎందుకు? 




మాధవ్ మాటలు అర్ధం కాక చెవులు మూసుకున్నారు


అప్పడే పోలీస్ అధికారి వెంటనే వచ్చి అసలు నేరస్తుడు దొరికాడు, ఇతన్ని విడుదల చేయండి అన్నాడు.

మాధవ్ నెమ్మదిగా నన్ను భంధించినందుకు భాధ పడుట లేదు, అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెపుతారా అని అడిగాడు.

పోలీస్ అధికారి చెప్పఁటం మొదలు పెట్టాడు.     

నీకిచ్చిన కవరులో మత్తు మందు ఉన్నది, అందుకే మేము నిన్ను అరెష్టు చేసాము. అసలు కారణం తరువాత తెలిసింది.
 


 

        






 


ఉండవు గుటిలో ఉండేది చిలక గోరింకలే అన్నాడు 

No automatic alt text available. • విశ్వనాథ్‌కునా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడాచెప్పవా ఇక్కడా



  
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

మనసులో ముసుగు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 
గురువుni ఎందుకు సేవించాలి ?
2. మానవ జన్మ

1. మొదటి శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ''గురువే ప్రత్యక్ష దైవ'' మన్నట్లు తన గురువైన గోవిందా చార్యుల వారిని దైవముగా స్తుతించినారు.

2. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మానవులలో పురుషజన్మ ఉన్నతమైనది. అందులోనూ వైదిక మతములో బ్రహ్మ జ్ఞానము గొప్పది. బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మల భేదమును గ్రహించుట, బ్రహ్మమును తెలుసుకొనుట అరుదైన విషయము. అట్లాంటి మానవుడు ముక్తిని పొందాలంటే 100 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది.

3. భగవంతుని కృపతో మానవునిగా జన్మించుట, జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయుట మరియు అందుకు సద్గురువు యొక్క రక్షణ అను మూడు ముఖ్య విషయములు అవసరము.
 

4. పురుషునిగా లభించిన మానవ జన్మ ద్వారా వేదవిజ్ఞానమును పొందిన మనిషి జన్మ రాహిత్యానికి కృషి చేయకుండా, ఆత్మహత్య సదృశమైన లౌకికానందములో చిక్కుకొనుట అనుచితము.
 

5. మనిషి తనకు లభించిన పురుష మానవ జన్మను జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయకుండుట ఎంత తెలివి తక్కువ తనము.
 

6. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అను సత్యాన్ని గ్రహించకుండా ప్రపంచమున్నంత కాలము 432 మిలియన్ల సంవత్సరములు యగ్నయాగాదులు చేసి, దేవతలను తృప్తి పరచినను జన్మ రాహిత్య స్థితి లభించదు. 

7. సంపదలు, వేదాల పఠనము, యగ్నయాగాదులు మొదలగు వాటి వలన పరమాత్మను పొందలేము. జన్మ రాహిత్యము లభించదు.


8. అందువలన మానవుడు జన్మ రాహిత్య స్థితికై కృషి చేయవలెను. జ్ఞానియై మనిషి భౌతిక వస్తు సముదాయము వలన పొందే లౌకిక సుఖాలకై ప్రాకులాడకుండా తన మనస్సును సత్యమువైపు మరల్చవలెను.

9. వ్యక్తి జ్ఞానేంద్రియాలపై అదుపును పొంది భౌతిక వస్తు సుఖాలకు అతీతుడై యోగారూఢ స్థితిని పొందినపుడు పుట్టుక, చావు; మంచి, చెడు అను స్థితులను అధిగమించి విచక్షణతో కూడిన జీవితాన్ని పొందగలడు.

10. జ్ఞాని అయిన విద్యావంతుడు ఆత్మను పొందే మార్గమును ఎన్నుకొని మంచి, చెడులకు అతీతుడై భౌతిక బంధనాలైన పుట్టుక, చావుల నుండి విముక్తిని పొందుటకై సాధన చేయవలెను.
 

11. యజ్ఞ, యాగాల వలన మనస్సు స్వచ్ఛమవుతుంది. కాని సత్యాన్ని తెలుసుకొనలేము. కేవలము నిత్యానిత్య వివేకము ద్వారానే పరమాత్మను పొందగలము. కర్మలు 10 లక్షలు చేసినను సత్యాన్ని గ్రహించలేము.
 

12. తాడును చూసి పామని భ్రమించి భయభీతులు చెందువాడు మనస్సులో తగినట్లు విచారణ చేసిన అది పాము కాదు తాడని గ్రహించగలడు.
 

13. సత్యాసత్య జ్ఞానాన్ని పొందిన జ్ఞానులతో సంభాషణ ద్వారా మాత్రమే సత్యము అవగతమగును. ఇతరత్రా నదీ జలాలలో స్నానాలు, దేవతలకు పూజలు, సమర్పణలు మరియు ప్రాణాయామము ద్వారా ప్రాణ శక్తిని అదుపుచేసినను సత్యము అవగతము కాదు.
 

14. శాస్త్ర పరిజ్ఞానముతో సత్యాసత్య వివేకము పొంది, శాస్త్ర చర్చలలో ప్రశ్నించుట, వాదనలలో ప్రావీణ్యం పొందిన వాడే విజయాన్ని పొందగలడు. సమయము, ప్రదేశము మరియు ఇతరత్రా ఏవైన, కేవలము అందుకు సహాయకారులు మాత్రమే.


15. సాధకుడు ఆత్మ జ్ఞానము పొంది, వివేకముతో దయాసముద్రుడు, బ్రహ్మజ్ఞానమును పొందిన సద్గురువును ఆశ్రయించవలెను.

16. ఆత్మ జ్ఞానము పొందాలంటే సాధకుడు 14వ శ్లోకములో చెప్పినట్లు శాస్త్ర పరిజ్ఞానము పొంది, శాస్త్ర చర్చలలో విస్తారముగా పాల్గొనగల్గి ఉండవలెను.

17. ఏ వ్యక్తి సత్యాసత్య జ్ఞానమును పొంది అనిత్య స్థితులకు అతీతముగా మనస్సును మళ్ళించి ప్రశాంతతను పొంది, సత్వగుణ ప్రధానుడై జన్మ రాహిత్య స్థితికై ఆపేక్ష గల్గినవాడే బ్రహ్మన్ని గూర్చి తెలుసుకొనగలడు.

18. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు యోగులు నాల్గు విధములైన మార్గములను ప్రతిపాదించిరి. అలా కానిచో విజయమును సాధించలేరు.
 

19. మొదటిది సత్యాసత్యాలకు మధ్య తేడాను తెలుసుకొనుట. రెండవది తన కర్మల ద్వారా తాను పొందు ప్రతి ఫలముల ఎడ తిరస్కార భావము. మూడవది ప్రశాంతత, విశ్రాంతి. నాల్గవది విముక్తి ఎడల తీవ్ర ఆకాంక్ష.
 

20. మానసికంగా దృఢ నిశ్చయంతో బ్రహ్మము యొక్క సత్యాన్ని, ప్రపంచము యొక్క అసత్యాన్ని గూర్చిన నిర్ణయము. అందుకు సత్యాసత్యములను గ్రహించుటలో విచక్షణా శక్తి కల్గి యుండవలెను

       జన్మ రాహిత్యానికి, భక్తికి చేయు ప్రయత్నాలు అత్యున్నత స్థానమును ఆక్రమిస్తాయి. భక్తి అనేది ద్వైత సిద్దాంతము ప్రకారము ఒక దివ్యాత్మ మీద ప్రేమను వ్యక్తము చేస్తున్నప్పటికి, అద్వైత సిద్ధాంతము ప్రకారము పరమాత్మ ఒక్కడే. పూజింపదగినవాడు. ఈ రెండు వేరుగా చెప్పబడినప్పటికి, పరమాత్మ అంశయైన దివ్యాత్మకు, పరమాత్మకు ఎక్కువ భేదము లేదని, అవి దాదాపు సమానమని చెప్పవచ్చు.

       కొన్ని ఇతర సిద్ధాంతముల వారు స్వయం ఆత్మయే నిజమైన సత్యమని చెప్పు చుండిరి. నిజానికి మనమే స్వయం ఆత్మల మైనప్పటికి ఆజ్ఞానము వలన మన ఆత్మను మనము తెలుసు కొన లేకున్నాము. అందువలన మనము నిజమైన ఆత్మ తత్వమును గ్రహించుటకు బంధనాల నుండి, అజ్ఞానము నుండి విముక్తి పొందుటకు ఆత్మ జ్ఞానము పొందిన గురువును ఆశ్రయించాలి.

       మనం ఎంచుకొనే గురువు వేద జ్ఞానము కలిగి, తనకు తాను బ్రహ్మములో సదా చరించువాడై, కోరికలను త్యజించినవాడై, పరిశుద్దుడై, భౌతిక ప్రపంచము యొక్క కర్మల నుండి విడివడినవాడై ఉండవలెను. మరియు ప్రశాంత చిత్తుడై కోరికలను దగ్దము చేసినవాడై, దయా సముద్రుడై ఉండవలెను. అందరిని ప్రేమించువాడై ఉండవలెను.
   
       అట్టి గురువును భక్తితో పూజింపవలెను, సేవించవలెను. వినయ విధేయతలతో తన సందేహములకు సమాధానము పొందవలెను.

        హే ప్రభూ! దయాసాగరా! నిన్ను నమ్మినవారిని బ్రోచే నీకివే నా వందనములు. నన్ను రక్షింపుము చావు పుట్టుకలతో కూడిన సంసార బంధనముల నుండి విముక్తి కలిగించుము. మీ దయా దృష్టిని నాపై ప్రసరింపజేసి నీ యొక్క కరుణామృతమును నాపై కురిపించుము.

        ప్రపంచములోని సంసారమనే మహారణ్యములో, దావాలనములో చిక్కుకొని మరణించే చావు నుండి మమ్ములను రక్షించుము ప్రభూ! మేము గత జన్మలలో చేసిన పాపకర్మల వలన, ఇప్పుడు మేము అనుభవించుచున్న భయంకరమైన తుఫాను గాలులవంటి సంసార బాధల నుండి విముక్తి పొందుటకై మాకు మీరే దిక్కు ప్రభూ!

          కొన్ని ఉన్నతమైన ఆత్మలు ప్రశాంత స్థితిలో ఔన్నత్యము సాధించి తాము ఇతరుల ఉన్నతికి, వసంత ఋతువులో ప్రకృతి ప్రతిస్పందించినట్లు, వారు తాము భయంకరమైన పుట్టుక, చావుల నుండి విముక్తి చెంది, ఇతరుల ఉద్దరణ కొరకు నిస్వార్ధముగా తోడ్పడుచుండురు.

          ఉన్నత స్థితిని పొందిన జ్ఞానులు తమ స్వభావాన్ని అనుసరించి స్వార్ధ రహితులై ఇతరుల కష్టాలను తొలగించుటకు కృషిని చేయుచుందురు. ఉదాహరణకు చంద్రుడు ఎవరు కోరకుండానే భూమి యొక్క ఉన్నతికి సూర్యకిరణాలను మళ్ళించి తన చల్లని కిరణాలతో ప్రకృతికి తోడ్పడుట జరుగుచున్నది.
     
         ఓ ప్రభూ! మీ యొక్క అమృత వాక్కుల ద్వారా మాలో బ్రహ్మ జ్ఞానము యొక్క మాధుర్యమును నింపి, చల్లని మీ యొక్క వాక్కు అనే అమృత భాండము నుండి అమృతమును కురిపించి, మా చెవులకు వీనులవిందును కలిగించిన, మా యొక్క ప్రాపంచిక విషయ వాంఛలు అడవిలోని దావాలనమువలె దగ్దమవుతాయి. చల్లని నీ దయా దృష్టిని మాపై ప్రసరింప జేయవలసినదిగా కోరుచున్నాము.

40. ఈ ప్రాపంచిక విషయ వాసనలనే మహాసముద్రమును దాటుటకు ఏ విధమైన మార్గాలను అనుసరించిన నా భవిష్యత్తు సాఫీగా జరుగుతుందో నాకు తెలియుటలేదు. నన్ను రక్షించుటకు, నా దుఃఖాలను అంతము చేయుటకు ప్రభూ మీరు నాకు ఏ విధముగా తోడ్పడగలరు.

41. సాధకుడు ఈ విధముగా తన మార్గదర్శకుని ప్రార్ధించినప్పుడు, ఈ ప్రపంచమనే అడవిలోని దావాలనము అడవిని దహించినట్లు, ఆ సాధువు తన మృదువైన కృపాదృష్టిని దయతో సాధకునిపై ప్రసరింపజేసి అతని భయాన్ని దుఃఖాన్ని తొలగించగల్గుతాడు.

42. ఏ సాధకునికి గురువు తన రక్షణ కవచాన్ని అందించాడో అతడు జనన, మరణ, దుఃఖాల నుండి విముక్తిని పొంది, గురువు యొక్క శాస్త్ర విహితమైన సూచనలు ఆమోదిస్తూ, పవిత్రమైన మనస్సుతో ప్రశాంత స్థితిని పొందుటకు గురువు అతనికి దయతో సత్యబోధ చేయగల్గుతాడు.
 

43. జ్ఞాని అయిన ఓ సాధకుడా! భయపడకు నీకు చావులేదు ఈ సంసారసాగరమును దాటుటకు యోగులు మార్గమును చూపించినారు. అదే మార్గమును నేను నీకు చూపించెదను.
 

44. ఈ ప్రాపంచిక దుఃఖముల నుండి విముక్తిని పొందుటకు ఒక బంగారు బాట కలదు. ఆ మార్గమును అనుసరించిన నీవు సంసారసాగరమును సులువుగా దాటి ముక్తిని పొందగలవు.
 

45. వేదాంత విజ్ఞానమును చిలికిన బ్రహ్మాన్ని తెలుసుకొనే అత్యున్నత జ్ఞానమును పొందగలవు. అది ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల నుండి విముక్తి పొందుటకు తోడ్పడగలదు. 46. సాధకుడు సృతులలో చెప్పినట్లు సంసార బంధముల నుండి విముక్తి కొరకు నమ్మకము, భక్తి మరియు ధ్యాన మార్గమును అవలంబించవలసి ఉండును.
 

47. పుట్టుక చావులనే చక్ర భ్రమణముల నుండి విముక్తి పొందాలంటే, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి సాధకుడు అనాత్మ బంధనాల నుండి విడివడాలి. అందుకు జ్ఞానాగ్నిని ఆత్మ, అనాత్మ విచక్షణ జ్ఞానము ద్వారా రగిల్చి, అజ్ఞానమును కూకటి వేళ్ళతో దహించివేయవలెను.

48. శిష్యుడు గురువుగారిని ఈ విధముగా ప్రశ్నించును. దయయుంచి నేను అడిగే ఈ క్రింది ప్రశ్నకు సమాధానమును తమ నోటి ద్వారా వినాలని కోరుచున్నాను.

49. బంధనమనగా నేమి? అది ఎలా ఆత్మను పట్టి ఉంచింది? అది ఎలా కొనసాగుతుంది? ఎవరైన దాని నుండి ఎలా విముక్తి పొందగలరు? అనాత్మ అంటే ఏమిటి? ఉన్నతమైన ఆత్మ ఎవరు? ఆత్మ అనాత్మల భేదమును ఎలా తెలుసుకొనగలము? ఈ విషయములన్నింటిని వివరించవలసినదిగా కోరుచున్నాము.

50. గురువు ఈ విధముగా సమాధానము చెప్పుచున్నాడు.
ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు భగవంతుడు నిన్ను దీవించుగాక! నీవు జీవితములో ఉన్నత స్థితిని చేరుకున్నావు. నీ కుటుంబమును పవిత్ర పర్చినావు. అజ్ఞాన బంధనాల నుండి విడివడి బ్రహ్మత్వమును పొందియున్నావు.
 

51. ఒక తండ్రి తన కుటింబీకులందరిని అప్పుల బంధనాల నుండి విముక్తి కలిగించుగాక. కాని తనను తాను తన బంధనాల నుండి విముక్తి పొందియుండలేదు.
 

52. ఇతరులు తన నెత్తిన మోపిన బరువు బాధ్యతలను ఇతరులే దింపివేయవలెను. కాని వ్యక్తి తనకు తానే కల్పించుకున్న ఆకలి వంటి బాధలను తనకుతానే తొలగించకొనవలెను.
 

53. ఒక రోగి తనకు తగిన ఆహారమును, మందును తాను తీసుకొన్నప్పుడు రోగము పూర్తిగా తగ్గుతుంది. కాని ఇతరుల కృషి వలన కాదు.
 

54. వస్తువుల యొక్క నిజమైన స్వభావమును ముందుగా వ్యక్తి తనకు తాను తన దృష్టి ద్వారా వివరముగా చూసి గ్రహించాలి గాని ఇతర పండితులు చెప్పినప్పటికి అర్థము కాదు. చంద్రుడు ఎలా ఉంటాడు అనేది తన కండ్ల ద్వారా చూసి తెలుసుకోవాలి. ఇతరులు ఎలా తెలియచెప్పగలరు.
 

55. అజ్ఞానము, కోరికలు, కర్మల లాంటి వాటిని వ్యక్తి స్వయముగా తనకు తాను తొలగించుకోవాలి గాని, 100 కోట్ల జన్మలెత్తినను ఎవరు తొలగించలేరు. అజ్ఞానము వలన కోరికలు, కోరికల వలన కర్మలు, కర్మల వలన పాపపుణ్యములు తప్పవు. ఇవన్నీ పోవాలంటే వాటి యొక్క జ్ఞానాన్ని పొందాలి.
 

56. హఠయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము మరియు జ్ఞాన యోగముల ద్వారా బ్రహ్మమును పొందలేము. కేవలము బ్రహ్మమునకు తనకు భేదము లేదని స్వయముగా తెలుసుకొన్నప్పుడే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. పై యోగాలను యాంత్రికముగా అనుసరించిన బ్రహ్మమును పొందలేమని బంధనాల నుండి విముక్తి లభించదని అద్వైత సిద్ధాంతము తెలుపుచున్నది. సాంఖ్యయోగములో పురుష, ప్రకృతిలోని భేదమును స్వయముగా గ్రహించినప్పుడే విషయముల నుండి విముక్తి లభిస్తుంది. ప్రకృతిలో ఉన్న పురుష మామూలుగా వ్యక్తము కాదు. కాని పనులన్ని ప్రకృతిలోనే జరుగుచున్నవి. పురుష లేకుండా ప్రకృతి లేదు. ప్రకృతి పురుష నుండి స్వేచ్ఛను పొందియున్నది. ఇంకను సాంఖ్య యోగము వివిధ ఆత్మలను గూర్చి నమ్ముచున్నది. సాంఖ్య యోగానికి వేదాంత సిద్ధాంతాలకు ఇదే ముఖ్య భేదము. విషయ వాంఛలకు సంబంధించిన యజ్ఞాయాగాదుల వలన స్వర్గ సుఖాలు పొందవచ్చు గాని బ్రహ్మాన్ని చేరలేము. బ్రహ్మాన్ని పొందాలంటే బ్రహ్మాన్ని దర్శించుటయే మార్గము.
 

57. గిటారు వాయిద్యాలు, శృతులు కొద్ది మందికి సంతోషాన్ని కలిగించగలవే గాని ఆధ్యాత్మిక ఔన్నత్యానికి తోడ్పడవు.
 

58. వాక్చాతుర్యముతో కూడిన ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక గ్రంధాలలోని విషయ పరిజ్ఞానము వ్యక్తీకరించుట అనునవి కేవలము వ్యక్తిగతమైన ఆనందానికి తోడ్పడునే గాని వాటి వలన ఏ విధమైన సాంసారిక బంధనాల నుండి విముక్తి లభించదు.

59. అత్యున్నత బ్రహ్మ జ్ఞానమును పొందిన వానికి శాస్త్ర పఠనము వలన ప్రయోజనము లేదు. అలానే శాస్త్ర పఠనము ద్వారా ఎట్టి ఔనత్యమును పొందలేము.


60. శాస్త్రాలలోని వివిధ పదాలు కిక్కిరిసిన అరణ్యము లాంటివి. అందులో చిక్కుకొనిన బయటపడుట చాలా కష్టము. వాటి వలన మనస్సు వికలమగును. అందువలన తెలివి కలిగినవారు ప్రీతితో నిజమైన ఆత్మ స్వభావమును గ్రహించుట అవసరము.

61. అజ్ఞానమనే నాగుపాముచే కాటు వేయబడిన వ్యక్తికి బ్రహ్మజ్ఞానాన్ని పొందుటయే సరైన వైద్యము. అందుకు వేదాలు, శాస్త్రాలలోని మంత్రాల ద్వారా వైద్యము చేయాలి.
 

62. కేవలము మందు పేరు పదేపదే ఉచ్చరించుట వలన రోగము తగ్గదు. ఆ మందును సేవించవలసి ఉంటుంది. అలానే బ్రహ్మమును స్వయముగా తెలుసుకొనుట ద్వారానే వ్యక్తి బ్రహ్మాన్ని పొందగలడు. బ్రహ్మము, బ్రహ్మము అని పదేపదే ఉచ్చరించుట వలన బ్రహ్మ జ్ఞానము లభించదు. 63. బ్రహ్మము, తాను ఒక్కటే అను జ్ఞానము స్వయముగా సమాధి స్థితి ద్వారా పొందకుండా, అలానే తానే చిదాత్మను అని గ్రహించకుండా, బ్రహ్మము వేరు తాము వేరు అని ద్వంద్వ భావముతో ఉన్నప్పుడు అది అజ్ఞానమని పిలవబడుతుంది. ఆ అజ్ఞానమే తన యొక్క చెడు పనులకు కారణమని గ్రహించాలి. అది తొలగినప్పుడే ముక్తి. కేవలము బ్రహ్మము, బ్రహ్మము అని ఎన్ని సార్లు ఉచ్చరించినను బ్రహ్మాన్ని పొందలేముకదా!

64. ఒక రాజు తన చుట్టూ ఉన్న శత్రువులను జయించకుండా తానే చుట్టుప్రక్కల గొప్పవాడినని, తానే చెప్పుకొనినందువలన అతడు చక్రవర్తి కాలేడు.
 

65. భూగర్భములో ఉన్న ధనాగారము వెలికితీయాలంటే, తగిన వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల ద్వారా త్రవ్వకాలు జరిపి అడ్డుగా ఉన్న రాళ్ళను, మట్టిని తొలగించి ఆ ధనాగారాన్ని పొందినప్పుడే ఫలితము. అలా కాకుండా బయట నుండి ధనాగారము, ధనాగారము అని పలుమార్లు పలికినా అది బయటపడదు. అలానే ఆత్మ జ్ఞానము పొందాలంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న మాయ మరియు దాని ప్రభావాలను తొలగించకుండా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క సూచనల ప్రకారము సాధన, ధ్యాన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది. కేవలము అసంబద్దమైన వాదనల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము.

66. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్దతుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమరల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.
 

67. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్న (49వ శ్లోకము) చాలా గొప్పది. శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్న రహస్యమయమైన జ్ఞాన సౌందర్యాన్ని వెలికి తీసేదిగా ఉన్నది. తద్వారా జ్ఞానార్ధులు విముక్తి మార్గమును తెలుసుకొనగలరు.
 

68. ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పుచున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు.

7. బంధనాలు

69. సంసార బంధనాల నుండి విముక్తి పొందుటకు మొదటి మెట్టు:- నశించే ఈ ప్రాపంచిక సుఖ దుఃఖములకు రోసి ప్రశాంత స్థితిని పొంది, తనను తాను అదుపులో ఉంచుకుని, సహనముతో శాస్త్రానుసారముగా అన్ని విధములైన యజ్ఞయాగాదుల వంటి కర్మల నుండి విముక్తి పొందవలెను.

70. గురువు యొక్క బోధనలు విని తదనుగుణంగా దీర్ఘమైన అడ్డంకులు లేని ధ్యానములో నిమగ్నమై సత్యాన్ని తెలుసుకోవాలి. అపుడు జ్ఞానవంతుడైన సాధకుడు నిర్వికల్ప సమాధి స్థితికి చేరి, నిర్వాణ స్థితి యొక్క ఆనందమును ఈ జీవితములోనే పొందగలడు. నిర్వికల్ప సమాధి స్థితిలో సాధకుడు, చేసేవానికి, చేయబడినదానికి భేదములేదని అంతా ఒక్కటే అని, మానసిక స్థితులన్ని తొలగిపోగా తాను ఆత్మలో కలసిపోవును. అదే అత్యున్నత ఎఱుక స్థితి. అట్టి స్థితిని సాధకుడు ఇతర సంబంధాలతో అతీతంగా మాటలకు అందని రీతిలో చేరగలడు. అది అవ్యక్తమైన ఆనంద స్థితి అని, అదే స్వచ్ఛమైన ఎఱుక స్థితి అని, నిర్వాణమని చెప్పబడినది.
 

71. నేను ఇప్పుడు, నీవు ఏమి తెలుసుకోవలసి ఉన్నదో చెప్పుచున్నాను. నీవు ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించవలెను. జాగ్రత్తగా విని నీవేమి చేయాలో నిర్ణయించుకొనుము.
 

72. సప్త ధాతువులతో కూడిన ఈ శరీరము అనగా చర్మము, చర్మము పై ఉన్న పొర, రక్తము, మాంసము, క్రొవ్వు, ఎముకలు, మజ్జ మరియు శరీర భాగాలైన కాళ్ళు, ఊరువులు, చాతి, చేతులు, వీపు మరియు తల, వీటన్నింటితో ఈ శరీరము నిర్మింపబడినది.
 

73. మాయా నిర్మితమై 'నేను' 'నాది' అని పిలువబడుతూ ఈ శరీరము మొత్తము యోగులచే వర్ణింపబడినది. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి అనునవి మూల భూతములు. ఈ మూల భూతములచే శరీరము రూపొందినది.

8. పంచభూతాలు
74. పంచభూతాలతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రతి భూతము రెండు భాగాలైన, ఒక భాగములో ఆ భూతము యొక్క సగ భాగము, మిగిలిన సగము మిగిలిన నాల్గు భాగములలోని ఎనిమిదవ భాగములతో కూడి ఉన్నది. ప్రతి భూతములో ఐదు భూతాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు భూమిలో పదార్థము సగము, మిగిలిన సగము మిగిలిన నాలుగు భూతములతో కూడినవి. ఈ స్థూల శరీరము ఐదు భూతములతో పైన తెల్పినట్లు రూపొంది స్థూలమైనది. ఈ స్థూల శరీరము ఐదు తన్మాత్రలతో కూడినది. భూమి యొక్క తన్మాత్ర వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి శబ్దము. ఈ ఐదు తన్మాత్రల ద్వారా జీవాత్మ తత్‌సంబంధమైన ఆనందాలను,దుఃఖాలను పొందుచున్నది.
 

75. ఎవరైతే ఈ జ్ఞానేంద్రియములకు చెందిన వస్తు సముదాయములతో చిక్కుకుని ఉన్నారో వారు పిచ్చివారు. వారు జన్మ, మరణ, దుఃఖముల నుండి బయటపడలేరు. వారిలో మంచి పనులు చేసిన వారు దివ్యాత్మలుగా స్వర్గ సుఖాలను అనుభవించి మరల మానవ జన్మ ఎత్తవలసి వస్తుంది. చెడు పనులు చేసిన వారు నరకములో దుఃఖాలను అనుభవించి చెట్లు, చేమలుగా జన్మించి మరల మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది. 76. లేడి, ఏనుగు, చిమట, చేప మరియు నల్ల తుమ్మెదలు పంచతన్మాత్రలు అయిన వాసన, రుచి, కాంతి, స్పర్శ, శబ్దాలకు వశమై వాటి ప్రాణాలు కొల్పోయినప్పుడు; వాటి వాటి గుణాలకు అనుగుణంగా తిరిగి జన్మలు పొందుతాయి. అలానే మనిషి కూడా ఈ పంచతన్మాత్రులకు బందీ అయి తదనుసారముగా జన్మలు, కర్మలు, అనుభవించు చుండును.
 

77. త్రాసు పాము విషము కంటే పంచతన్నాత్రల వలన పొందే చెడు ఫలితములు ఇంకా ప్రమాదకమైనవి. పాము విషము అది తీసుకొన్నప్పుడే ప్రభావము చూపుతుంది. కాని పంచతన్నాత్రల వలన వాటిని చూసిన, తాకిన వాటి ఫలితముంటుంది.
 

78. జ్ఞానేంద్రియాల భయంకరమైన ఉచ్చు నుండి స్వేచ్ఛను పొంది, అతి కష్టముతో వాటిని వదిలించుకున్నవారే చావు పుట్టుకల నుండి విముక్తి పొందగలరు. ఇతరులు ఎవరు షట్‌ శాస్త్రముల జ్ఞానము పొందినప్పటికి ముక్తిని పొందలేరు.
 

79. దురాశతో ఉచ్చులో చిక్కుకున్న సొరచేప ఉచ్చు నుండి విడివడినట్లు, సాధకులు విముక్తిని పొందినప్పటికి వైరాగ్యము పొందనిచో సంసార సాగరము నుండి విడుదల పొందలేరు. మరియు వారు బ్రహ్మ జ్ఞానమును పొందనచో మధ్యలోనే సంసారసాగరములో మునిగిపోవలసి ఉంటుంది.
 

80. సొరచేప వంటి ఇంద్రియాలను వైరాగ్యమనే ఖడ్గముతో ఖండించినప్పుడే, అన్ని అడ్డంకులను తొలగించుకొని సంసారసాగరము దాటగలరు.
 

81. చావు ఒక్కటే మూఢుడైన వానిని అతని యొక్క ఇంద్రియ సుఖాలనుండి బయటపడవేయగలదు. అలానే జ్ఞానవంతుడైన తగిన గురువు యొక్క సూచనలకు అనుగుణంగా తాను సత్యాసత్యముల అవగాహన పొంది తన లక్ష్యమును సాధించవలెను.

క్ష్యమును సాధించవలెను.

82. నిజంగా నీవు విముక్తికై కోరుచున్నటైన, విషయ సుఖాలను, విషాన్ని దూరంగా ఉంచినట్లు ఉంచి, అమృతము వంటి సద్గుణాలను జాగ్రత్తగా అలవాటు చేసుకొని; తృప్తి, ప్రేమ, క్షమా గుణము, ముక్కుకు సూటిగా నడుచుకొనుట మరియు తనకు తాను అదుపులో ఉంచుకొనుట అను సద్గుణాలను పెంపొందించుకొనవలెను.

83. ఎవరైతే తాము ఎప్పుడూ అనుభవించే భౌతిక వాంఛలను పక్కన పెట్టి, అజ్ఞాన బంధనాల నుండి విముక్తులై మరల వాటి జోలికి పోనప్పటికి, శరీరముపై మోహముతో దానిని పోషించి ఇతరుల ఆనందానికై తోడ్పడిన చివరకు ఆత్మహత్య చేసుకొని కుక్కలకు రాబందులకు ఆహారమవుతారు. అనగా శరీరము పై మోహాన్ని తొలగించుకోవాలి.84. ఎవరైతే ఆత్మను తెలుసుకోవాలని కోరుకుంటారో వారు తమ శరీర పోషణకు ప్రాధాన్యమిచ్చిన అట్టి వ్యక్తి కొయ్యదుంగ అనుకొని మొసలిని పట్టుకుని నదిని దాటినట్లు ఉంటుంది. అనగా తన వినాశనానికి తానే కారకుడవుతాడు.
 

85. అందువలన విముక్తి పొందిన సాధకుడు దేహాభిమానము కలిగి ఉన్న, లేక దేహమే తానని భావించిన అది బయంకరమైన చావుతో సమానము. ఎవరైతే పూర్తిగా శారీరక వ్యామోహమును జయిస్తాడో అతడే పూర్తిగా స్వేచ్ఛను పొందగలడు.
 

86. ఘోరమైన చావును జయించాలంటే శరీరమే తానను భావన, భార్య, పిల్లలు మొదలగు భౌతిక బంధనాలను జయించి ఉన్నతమైన దైవ స్థితిని పొందాలి.

86. ఘోరమైన చావును జయించాలంటే శరీరమే తానను భావన, భార్య, పిల్లలు మొదలగు భౌతిక బంధనాలను జయించి ఉన్నతమైన దైవ స్థితిని పొందాలి.

87. ఈ శరీరము మొత్తము నికృష్టమైనది. ఎందువలనంటే అది చర్మము, మాంసము, రక్తము, నరాలు, క్రొవ్వు, మజ్జ, ఎముకలు, వీర్యములతోనూ మరియు ఇతరమైన అసహ్యకరమైన పదార్థములతో నిండివున్నది.

88. ఈ శరీరము తమ యొక్క గత జన్మల కర్మ విశేషములతో, పంచభూతముల పంచీకరణతో తయారై ఆత్మకు ప్రపంచానుభూతులను కల్గించుటకు ఏర్పడిది. అదే ఈ శరీరము యొక్క నిర్మాణము.

89. జీవాత్మ తాను ఈ శరీరమును ఆవాసముగా పొంది, తాను వేరైనప్పటికి, ప్రాపంచిక వస్తు సముధాయమును, మాలలు, సుగంధ ద్రవ్యాలు మొదలగు వాటితో శరీరము యొక్క బాహ్య అంగముల ద్వారా అనుభవించు చున్నది. అందువలన ఈ శరీరము మెలుకవ స్థితిలో ఆత్మకు ఒక ఆట వస్తువుగా ఉపయోగపడుచున్నది.
 

90. ఈ భౌతిక శరీరము ఆత్మకు ఒక నివాస స్థానము. ఏలానంటే గృహానికి గృహ యజమాని వలె తాను ఈ ప్రాపంచిక వ్యవహారాలన్ని ఈ ఇంటి నుండే కొనసాగించినట్లు.
 

91. ఈ భౌతిక శరీరము పుట్టుక, పెరుగుదల, చావు అను వివిధ స్థితులతో; కుల, మత, భేదాలతో; రోగాలు వాటి నివారణ చర్యలు; దైవ పూజలు, అవమానాలు, గౌరవాలతో జీవిస్తున్నది.
 

92. పంచజ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో భౌతిక పరిజ్ఞానమును పొంది; నోరు, చేతులు, కాళ్ళు మొదలగు కర్మేంద్రియములతో వాటి వాటి ధర్మానుసారము అవి పనిచేయుచున్నవి.

 
అంతఃకరణాలు
93,94. అంతఃకరణ చతుష్టయములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనునవి వాటి పనులవి చేయుచున్నవి. మనస్సు వస్తు పరిజ్ఞానము పొందగా, బుద్ది సత్యాసత్యములను గ్రహించగాఅహంకారము శరీరము తానే అను భావముతో తానే స్వయం ఆత్మగా భావిస్తుంది. చిత్తము తనకు నచ్చిన వస్తు విశేషములను గుర్తిస్తుంది.

95. ప్రాణ శక్తి తాను ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అను ఐదు భాగములుగా తమతమ పనులను అనుసరించి విభజింపబడుతుంది. ఎలా అంటే బంగారముతో వివిధ ఆభరణములు తయారు చేయబడినట్లు. అలానే నీరు ప్రవాహముగా, నురుగుగా మారునట్లు.
 

96. ఐదు కర్మేంద్రియాల పనులైన వాక్కు మొదలగు కర్మల వలన జ్ఞానమును వినుట ద్వారా, తినుట, చేయుట ద్వారా పొందుచున్నవి. ఐదు ప్రాణములు, ఐదు భూతాలు వాటి వాటి చర్యలు బుద్ధిని ఉపయోగించి తన కోర్కెలను జీవాత్మ తీర్చుకొనుచున్నది.
 

97. ఈ స్థూల శరీరాన్ని లింగ శరీరమని, అది పంచభూతాలతో తయారైనదని ఈ భూతములు విడిపోవుటాలు, కలయికలు అను విధానము ద్వారా పంచతన్మాత్రులుగా రూపొంది ఈ శరీరము గత జన్మలలో పొందిన అనుభవాలను, అనుభూతులను పొందుటకు తోడ్పడుచున్నది. అజ్ఞానము వలన అనంతమైన క్రియలు వాటి ఫలితములను జీవాత్మ అనుభవించుచున్నది.

 98,99. కలలు జీవాత్మ యొక్క ప్రత్యేకమైన స్థితి మెలుకవ స్థితికి భిన్నముగా ఇది ప్రకాశించుచున్నది. కలలలో బుద్ధి లేక మనస్సు వివిధ పాత్రలను జీవాత్మకు సాక్షిగా పోషిస్తూ మెలుకవ స్థితుల యొక్క జ్ఞాపకాలకు అనుగుణముగా జీవాత్మ అనుభవించుచున్నది. అదే సమయములో ఆత్మ ప్రకాశమును గ్రహించి బుద్ధి అన్ని విషయాలను నడింపించు చున్నది. ఆత్మ బుద్ధి యొక్క చేష్టలకు అతీతముగా సాక్షిగా గమనించుచున్నది. ఎన్ని కర్మలు చేసినను వాటి ఫలితములు ఆత్మకు అంటవు.

100. ఈ స్థూల శరీరము ఆత్మ యొక్క అన్ని కార్యాలకు పరికరముగా తోడ్పడుచున్నది. ఆత్మ పరిపూర్ణ జ్ఞానముతో ఏ విధముగా అయితే వడ్రంగి; భాడిత, సుత్తి, మొదలగు పరికరములతో పనిచేసినట్లు ఆత్మ పనిచేయుచున్నది.

101. కండ్లు బలహీనముగా, గుడ్డిగ లేక చురుగ్గా ఉన్నప్పటికి అలానే చెవి; మూగగా చెముడు కలిగి ఉన్నప్పటికి, అన్ని తెలిసిన ఆత్మకు ఆ చెవిటి తనము, గుడ్డి తనము ఉండవు, అంటవు.

102. శ్వాస తీసుకొనుట, వదులుట, ఆవలింతలు, తుమ్ములు, శ్వాస బిగబెట్టుట శరీరమును వదులుట అనునవి ప్రాణము యొక్క వివిధ పనులు. మిగిలినవి దప్పిక, ఆకలి అనునవి ప్రాణ శక్తి యొక్క ఇతర పనులు.
 

103. పంచ జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు మొదలగువాని వెనుక మనస్సు పనిచేస్తున్నది. అలానే శరీరములోని వివిధ భాగములు ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
 

104. అహం అనునది శరీరమే తాను అను భావముతో, తానే అన్ని చేస్తూ అనుభవిస్తున్నానని, సత్వ, రజో, తమో గుణాలకు అనుగుణంగా వ్యవహారము నడుపుచున్నది.
 

105. జ్ఞానేంద్రియాలకు అనుకూలముగా పనులు జరిగినప్పుడు సంతోషమును, వ్యతిరేకముగా ఉన్న దుఃఖాలను అహం అనుభవిస్తూ ఉంటుంది. ఈ దూషణ, భూషణాలు అనునవి అహం యొక్క లక్షణాలు. సదా ఆనందములో ఉండే ఆత్మకు సంబంధము లేదు.
 

106. జ్ఞానేంద్రియాలు కేవలము ఆనందానుభూతులను ఆత్మ యొక్క ప్రభావముచే అనుభవించుచున్నవి. అవి స్వతంత్రముగా వ్యవహరించలేవు. ఎందువలనంటే ఆత్మ స్వభావము అన్నింటిని ప్రేమించుటయే. అందుకే ఆత్మ ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటుంది. దుఃఖాలకు లోనుకాదు.
 

107. గాఢ నిద్రలో మనము ఆత్మానందాన్ని జ్ఞానేంద్రియాలకు సంబంధము లేకుండానే అనుభవించుచున్నాము. ఈ విషయము సృతులలో వివరముగా చెప్పబడినది.

మాయ

108. అవిధ్య లేక మాయ అనునది పరమాత్మ యొక్క వ్యక్తీకరణమే. సత్వ, రజో, తమో గుణాల సమత్వ స్థితి బ్రహ్మము. సమత్వ స్థితి లోపించినప్పుడు మాయ వ్యక్తమవుతుంది. విశ్వ సృష్టికి కారణమైన ఈ మాయ త్రిగుణాతీత స్థితిలో లేదు. త్రిగుణములు సమత్వ స్థితిని కోల్పోయినప్పుడే సృష్టి ఏర్పడినది. అదే ప్రకృతి.

109. మాయ అనేది వ్యక్తము కాదు. అవ్యక్తము కాదు. లేక రెండు లక్షణాలు ఉన్నదికాదు, లేనిదికాదు. లేక కొన్ని లక్షణాలు విడివిడిగా లేక కలసి ఉన్నట్లు భావించ రాదు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని మాటలతో వర్ణించలేము.
 

110. మాయను జయించాలంటే కేవలము బ్రహ్మాన్ని తెలుసుకొని ఉండాలి. బ్రహ్మము లాంటిది వేరొకటి లేదు. ఎలా అంటే త్రాడును చూసి పాము అని భ్రమించి అది పాము కాదు తాడని గ్రహించినట్లు; దాని లక్షణాలైన సత్వ, రజో, తమో గుణాలు వానివాని స్వభావాన్ని బట్టి నిర్ణయించబడతాయి.
 

111. రాజస గుణములో నిక్షేపశక్తి అనగా తన యొక్క క్రొత్త ఆకారమును తెలుసుకొన్న వెంటనే వ్యక్తము చేయగలుగుతుందో అది ఆవరణములో బహిర్గతమవుతుంది. దీని నుండి కూడా మానసిక లక్షణములైన ఆకర్షణ, విచారము అనునవి నిరంతరముగా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.


అరిషడ్‌ వర్గాలు
112. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములను అరిషడ్‌ వర్గాలు రాజస లక్షణములు. వాటి ద్వారా వ్యక్తి యొక్క ప్రాపంచిక దృక్పదము వ్యక్తమవుతుంది. కావున రాజస గుణము బంధనానికి కారణమవుతుంది.

113. తామస గుణము యొక్క ముఖ్య లక్షణము బద్దకము, తమస్సు. వాటి వలన వస్తువుల యొక్క అసలైన లక్షణాలు గాక వేరుగా కనిపిస్తాయి. అందువలన మనిషి మరల మరల మార్పు చెందుతూ ఆయా లక్షణాలు వ్యక్తము చేస్తుంటాడు.

114. విద్యావంతులు, బుద్ధిమంతులైన వారు కూడా మరియు తెలివిగల స్థిరమైన ఆత్మ జ్ఞానము కలవారు కూడా తామస గుణానికి బందీలై, ఆత్మను గూర్చి ఎంత వివరించినను అర్థము చేసుకొనలేకున్నారు. వారు కేవలము భ్రమకు లోనై అదే నిజమని భావించి, ఆ భ్రమలకు బందీలై ఉన్నారు. ఆహా! ఎంత శక్తివంతమైనది ఈ బద్ధకముతో కూడిన తామస శక్తి.
 

115. తగిన నిర్ణయ శక్తి లేకపోయినా, లేక వ్యతిరేఖమైన నిర్ణయ శక్తి ఉన్నా అందుకు ఖచ్చితమైన నమ్మకము అవసరము. ఏ విధమైన అనుమానము ఉన్నా ఈ వ్యక్త శక్తి మరియు బహిర్గత శక్తి అంతము లేని కష్టాలను కలిగిస్తుంది.
 

116. తెలియని తనము, ఉత్సాహము లేకపోవుట, అలసట, నిద్ర, వ్యతిరేఖ భావన, జఢత్వము అనునవి తామస గుణములు. వీటికి బందీలైనవాడు దేనిని సాధించలేడు. కేవలము మత్తులో ఉండి, రాయివలె ఉండిపోతాడు

త్రిగుణాలు

117. సత్వ గుణము స్వచ్ఛమైన నీరు వంటిది. అయినప్పటికి అది రాజస, తామస గుణాలతో కలసినప్పుడు మార్పులకు లోనగును. సత్వ గుణములో ఆత్మ వ్యక్తమవుతుంది. అది ఎలా అంటే సూర్య కిరణము ప్రాపంచిక వస్తు సముదాయము పై వ్యక్తమైనట్లు.

118. ఇతర గుణములతో కూడిన సత్వ గుణము యమ, నియమాలు, గర్వము మొదలగునవి లేకపోయినప్పటికి; నమ్మకము, భక్తి, విముక్తికై కోరిక దైవిక లక్షణాలు మరియు అసత్యాలకు దూరముగా ఉండుట అను లక్షణాలు కలిగి ఉంటారు.

119. స్వచ్ఛమైన సత్వగుణము యొక్క లక్షణములు; సంతోషము, ఆత్మ దర్శనము, ఉన్నతమైన శాంతి, తృప్తి, ఆనందము మరియు దివ్యాత్మల ఎడల భక్తి మొదలగు వాటి వలన సాధకుడు అంతములేని ఆనందమును సదా అనుభవించుచుండును.
 

120. సత్వ, రజో, తమో గుణములతో కూడిన ఆత్మ యొక్క ఈ తాత్కాలిక శరీరముతో పోల్చిన స్వచ్ఛమైన సత్వ గుణము యొక్క లక్షణములు; గాడ నిద్ర దాని ప్రత్యేకత. ఆ స్థితిలో మనస్సు యొక్క అన్ని చర్యలు అంతమైపోవును.
 

121. గాడ నిద్రలో అన్నివిధములైన గత జ్ఞాపకాలు, ఆలోచనలు, అగిపోయి మనస్సు స్థిరత్వమును పొంది, మొలకెత్తని విత్తనము వలె స్థిరముగా ఉండును. దీనికి గుర్తు ఏమిటంటే ఆ స్థితిలో వ్యక్తి తనకు ఏమి తెలియని స్థితిలో ఉంటాడు.
 

\122. శరీర భాగాలు, ప్రాణశక్తి, మనస్సు, అహము మొదలగునవి అనేక మార్పులు చెంది జ్ఞానేంద్రియాలు, ఆనందము, విశ్రాంతి, భౌతిక వస్తు సముదాయాలు, విశ్వము అనునవి అన్నియూ అనాత్మ సంబంధమైనవిగా గుర్తించాలి.
 

123. మహత్వాకాశము నుండి భౌతిక వస్తు సముదాయము వరకు అన్ని మాయ యొక్క ఫలితమే. ఈ వస్తువులు మాయ వలన అసత్యములని, ఎడారిలోని మృగతృష్ణలని గ్రహించాలి

ఆత్మ స్వభావము
124. ప్రస్తుతము నేను నీకు నిజమైన ఆత్మ స్వభావమును గూర్చి చెప్పబోవుచున్నాను. దానిని తెలుసుకొన్న వ్యక్తి సాంసారిక బంధనాల నుండి విముక్తిని పొందగలుగుతాడు.

125. అహంకారము యొక్క పూర్తి ఎఱుక శాశ్వతమై సత్యమును తెలియజేస్తుంది. సత్వ, రజో, తమో గుణాలను దర్శించునపుడు అవి శరీరము యొక్క పంచకోశముల తత్వములను ఎఱుక పరుస్తాయి. అవి 1. అన్నమయ కోశము, 2. ప్రాణమయ కోశము, 3. మనోమయ కోశము, 4. విజ్ఞాన మయ కోశము, 5. ఆనందమయ కోశము. వీటిలో మొదటిది శరీరమునకు సంబంధించినది. తరువాత మూడు కోశములు సూక్ష్మ శరీరమునకు సంబంధించినవి. మరియు చివరిదైన ఆనందమయ కోశము కారణమయ శరీరమునకు చెందినది. ఆత్మ ఈ ఐదు కోశములకు వేరైనది.
 

126. ఎఱుక స్థితిలో జరుగుచున్న విషయములన్నియూ ఎదైతే తెలుసుకొంటుందో అదే కలలలోనూ, గాఢ నిద్రలోనూ తెలుసుకొంటుంది. అది ప్రస్తుత స్థితి యొక్క ఎఱుక మరియు మనస్సులేని స్థితి. దాని పనులు అహం యొక్క గత భావనలే. అదేమిటంటే .......
 

127. అది అన్నింటిని దర్శిస్తుంది. అది వివేకాన్ని ప్రభావితము చేస్తుంది. కాని అవేవి దానిని ప్రభావితము చేయలేవు.
 

128. అది విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అయితే దానిని వ్యాపింపచేసేది ఏదీ లేదు. అది ప్రకాశిస్తుంది. ఈ విశ్వమంతా దాని వలన ప్రకాశిస్తుంది.
 

129. దాని ప్రకాశము వలనే ఈ శరీరము దాని భాగములు, మనస్సు, విజ్ఞానము వాని యొక్క భూమండలాలు దానికి సేవకులుగా పనిచేస్తున్నాయి.
 

130. దాని వలననే ప్రతిది అహము నుండి శరీరము వరకు, జ్ఞానేంద్రియాలు, ఆనందము మొదలగునవి అన్నియూ స్వచ్ఛమైన పాత్రవలె ఉన్నది. ఆ పాత్రలో శాశ్వతమైన జ్ఞానము నిండి ఉన్నది.
 

131. ఆది ఆత్మ అయిన పురుష అనేది అంతర్గత ఆత్మ. దానిని పొందినపుడే స్థిరమైన ఆత్మావగాహనతో కూడిన అంతములేని ఆనందము లభిస్తుంది. అది ఎల్లప్పుడు అలానే ఉంటుంది. ఆ స్థితి ఎల్లప్పుడు ప్రతి విషయములోనూ ప్రతిస్పందిస్తుంది. దాని వలన ప్రాణ శక్తి శరీర భాగాలు తమతమ పనులు నిర్వహిస్తుంటాయి.
 

132. ఈ స్థూల శరీరములో సత్వగుణముతో కూడిన మనస్సుతో బుద్ధి అనే అంతఃకరణము యొక్క గతిలో, ఆకాశములో అవ్యక్తమైన ఆత్మ ప్రకాశముతో కూడిన వెలుగులో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఈ విశ్వం మొత్తాన్ని తన యొక్క స్వయం ప్రకాశముతో ప్రకాశింపజేస్తుంది.
 

133. సాక్షిగా ఉన్న ఆత్మ మనస్సు యొక్క మార్పులను, అహాన్ని మరియు శరీరములోని వివిధ అంగములు, ప్రాణ శక్తిని గమనిస్తూ వాటి ఆకారములను పొందుతూ; ఎలా అయితే ఇనుప గుండు అగ్నిని తనలో నింపుకుని మార్పులేక ఉంటుందో అలా వానిలో ఐక్యమై గమనిస్తూంది. కాని అది ఏమి చేయదు, దానిలో ఏ మార్పు రాదు.134. ఆత్మ ఎప్పుడు పుట్టదు, గిట్టదు, పెరగదు, తరగదు మరియు ఏ మార్పు చెందదు. శాశ్వతత్వము కలిగి ఉంటుంది. ఈ శరీరము నశించినప్పటికి ఆత్మకు చావులేదు. ఆకాశములోని ఘటము పగిలినప్పటికి అందులోని ఘటాకాశము విశ్వములో కలసినట్లు, ఈ ఆత్మ సర్వ స్వతంత్రము. అన్నింటిని అధిగమిస్తుంది, అన్నింటిలో ఉంటూ వాటికి అతీతముగా ఉంటుంది. 


మల్లాప్రగడ రామకృష్ణ కధలు -22

అపరాధి ?

                   

సాగిపో…

No automatic alt text available.



జ్ఞానయోగః 5 (అథ చతుర్థోధ్యాయః, శ్రీ భగవద్గీత)
తేటగీత పద్యాలు

అగ్ని కట్టెను బూడిద చేయు చుండు 
అగ్ని కామము పుట్టించి మనసు మార్చు 
అగ్ని మంచును కరిగించి తెలివి చూపు
జ్ఞాన అగ్ని కర్మములను భస్మ ముచెయు
     
జ్ఞాన మునకుమించిన విద్య లేనె లేదు
యోగ సిద్ధిచే జగతిలో జ్ఞాన మొందు
మనసు విద్యను పంచేటి సవ్య జ్ఞాని     
దాన ధర్మము సలిపితే కాల జ్ఞాని 

శాస్త్ర విజ్ఞాన మందును శ్రద్ధ ఉన్న
నిష్ఠ ఆధ్యాత్మిక సాధన యందు ఉన్న
ఇంద్రి యములను జయించి ధర్మ నిరతి   
శాంతి తొ మనిషి  జ్ఞానము పొందు చుండు 

చపల చిత్తుడు, అనుమాన మున్నా వాడు,
శ్రద్ధ రహితుడు, చోరుడు, కోప పరుడు,   
సౌఖ్యము కొరకు మోసము చెయు వాడు,
తల్లి తండ్రుల్ని దూషించు  జ్ఞాని కాడు   

యథైధాంసి సమిద్ధోగ్ని
ర్భస్మసాత్కురుతేర్జున,
జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి
భస్మసాత్కురుతే తథా.

అర్జునా! బాగుగ ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెల నేప్రకారము బూడిదగాజేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్తకర్మములను భస్మ మొనర్చివైచుచున్నది.

న హి జ్ఞానేన సదృశం
పవిత్ర మిహ విద్యతే, 
తత్స్వయం యోగసంసిద్ధః
కాలేనాత్మని విందతి.

ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది ఏదియును లేదు. అట్టి జ్ఞానమును (కర్మ) యోగస్థితిని బొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగ పొందుచున్నాడు .

శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం
తత్పరః సంయతేంద్రియః,
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి
మచిరేణాధిగచ్చతి.

(గురు, శాస్త్రవాక్యములందు) శ్రద్ధగలవాడును, (ఆధ్యాత్మిక సాధనలందు) తదేకనిష్ఠతో గూడినవాడును, ఇంద్రియములను లెస్సగా జయించినవాడునగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును బొందినవాడై యతడు పరమశాంతిని శీఘ్రముగ బడయగల్గుచున్నాడు.

అజ్ఞ శ్చాశ్రద్దధానశ్చ
సంశయాత్మా వినశ్యతి,
నాయం లోకోస్తి న పరో
న సుఖం సంశయాత్మనః.

జ్ఞానము లేనివాడు, శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకముగాని, పరలోకముగాని, సౌఖ్యముగాని లేవు.

యోగసన్మ్యస్త కర్మాణం
జ్ఞాన సంఛిన్న సంశయమ్‌,
ఆత్మవంతం న కర్మాణి
నిబధ్నంతి ధనంజయ.

ఓ అర్జునా! నిష్కామకర్మయోగముచే కర్మ ఫలములను త్యజించినవాడును, (లేక ఈశ్వరార్పణ మొనర్చినవాడును), జ్ఞానముచే సంశయములు నివర్తించినవాడునగు ఆత్మనిష్ఠుని (బ్రహ్మజ్ఞానిని) కర్మములు బంధింపనేరవు.

తస్మాదజ్ఞాన సంభూతం
హృత్థ్సం జ్ఞానాసినాత్మనః,
ఛిత్వైనం సంశయం యోగ
మాతిష్ఠోత్తిష్ఠ భారత.

ఓ అర్జునా! కాబట్టి నీయొక్క హృదయమున నున్నదియు, అజ్ఞానము వలన బుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమను ఖడ్గముచే చేదించివైచి నిష్కామకర్మయోగము నాచరించుము. లెమ్ము.



🌹 🌹 🌹 🌹 🌹

  నీ నవ్వు నన్ను పిలిచింది
నీ  నీడ  లాగ  ఉండమంది
నిన్ను చూసాక నాలోటు తీరింది
ఇన్నాళ్లు వేచిన ఫలితం దక్కింది
నాతో నడచిన అడుగులు గుర్తుం

ది
నిన్న మాటలు మరిచా రేపు గుర్తుకొస్తుంది
బరువుని పంచు కోవాటానికి  సమయమైంది
పంచు కొనేందుకు నీ ఉంటే సంతోషముంది

నల్లని నీ కనుపాపలో మెరుపుకనబడింది
నీ పెదవుల పిలుపు కలవర పెట్టింది
నీ హావభావాలకు నాకు మతి పోయింది
నడిరేయి వెన్నల కలవ మంటున్నది

నీ చిరునవ్వు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది
నీ సిగ్గు నా జీవితానికి తోలి కలయిక అవుతుంది
తనువూ మనసు చెరిసగము పంచు కోమంటున్నది
శుభమూహూర్తం నేడే  ఏకమవ్వ మంటున్నది





--((*))--



 ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన  పత్రిక 22/3-

మీకు మేలు అమ్మ వారికృప తొమన
మంద రముయు తల్లి వరలక్ష్మి పూజిద్దాం
సకల జనుల కొరకు ఆరాధిద్దాం మనం
సకల విద్య నేర్పు తల్లిని కొలుద్దాం         


     


































































*ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు(serial) పార్ట్ - .                 ........     

                                                                                                     











































baby animals:



Collective nouns:

Collective nouns for animals…:

No comments:

Post a Comment