Tuesday 31 July 2018

Pranali Prabha(1-08-2018)

శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:

ఆనందం ఆరోగ్యం - ఆధ్యాత్మికం  

చాలా తక్కువ మందికే తెలుసు .....ఈ విషయం!! 
మన దేశం లో, డాక్టర్లు, 
నర్సులూ, 
ఆశా వర్కర్లె కాకుండా..... 
మన దేశంలో రోడ్లు, స్పీడ్ బ్రెకర్లూ కూడా, .... 
"గర్భవతులకు" సులభం గా ..... 
ప్రసవించడానికి దోహదపడుతున్నాయి!! 
"మేరా భారత్ మహాన్"

--((**))--


!! ఆత్మ నాశనము లేనిది !!

ఈ లెక్కలేంటో తెలుసుకోవు నువ్వు . 
ఎందుకంటే 
శ్మశానాల లెక్కలు ఎందుకులే అనుకుంటావు 
ఆఖరికి చావు అంటే ఏమిటో కూడా 
అవే అధికారాలు అవే అభిజాత్యాలు 
అవే ఆధిపత్యాలు వాటిపై మంతనాలు 
ఈ లెక్కలేంటో పట్టించుకోవు నువ్వు 
అంతేలే 
ఎన్ని ఊరితాళ్ళు చిటుక్కున తెగిపడ్డాయో
ఎన్ని పసుపు తాళ్ళు పుటుక్కన ఊడిపడ్డాయో
ఎన్ని అమ్మతనాల రోధించాయో 
ఎన్ని ర్యాగింగులు వేధించాయో 
ఈ లెక్కలేంటో తలుచుకోవు నువ్వు
నిజమేలే 
ఎన్ని బాల్యాలు చిధ్రమవుతున్నాయో 
ఎన్ని కన్యత్వాలు చిదిమిపోతున్నాయో 
ఎన్ని పురిటికందులు చెత్తకుప్పల్లో చితికిపోయాయో 
ఈ లెక్కలేంటో తెలుసుకోవు నువ్వు
ఎందుకంటే 
ఎలుగెత్తిచెప్పలేవు ఏడవలేవు ఎదిరించలేవు
రగిలి పగిలి మిగిలి పోవటం తప్ప 
నీకు అధికారం కట్టబెట్టే బలిపశువులు అవి 
కొక్కానికి వేలాడుతున్న రైతుముద్దలు అవి 
పేగుబంధం పట్టుకేడుస్తున్న తల్లుల కన్నీళ్లు అవి 
ఒళ్ళంతా పగుళ్లతో రక్తం ఒడుతున్న అభి”మానాలవి” 
దిక్కులు చూస్తున్న అభాగ్య అనాధలవి
అవును లెక్కలతో సంబంధం లేని 
ప్రజాస్వామ్యానివి నువ్వు
పడగలెత్తిన పన్నగానివి నువ్వు
కళ్లులేని కబోదివి నువ్వు 
పవిత్రాత్మవి నువ్వు 
నిజమే 
ఆత్మ నాశనము లేనిది 
ఆత్మను మనిషితనం చేదింపజాలదు
మానవత్వం దహింపజాలదు 
కారుణ్యం తడపజాలదు 
ఆత్మ నాశనము లేనిది

--((**))--

నేటి హాస్యం (ప్రాంజలి ప్రభ -8 )
దారిన పోతున్న ఒక అమ్మాయిని చూసి 
అబ్బాయి సంభాషణ 

"మీరు చాలా అందం గా వుంటారు".. 
"త్యాన్క్స్ అండీ!!" అంది  
"మీరు చాలా తెలివైఅన వారు .... 
"త్యాన్క్స్ అండీ!!" అంది  
"మీరు నిజం రాజకుమారి లాగా వుంటారు!!!" 
"త్యాన్క్స్ అండీ!!" ...ఇంతకీ మీరెమ్చెస్తూ వుంటారు? అంది  
"జోక్స్ వెస్తూ వుంటానండి!!" అన్నాడు 
ఐతే మీరు చాలా బాగున్నారు 
"త్యాన్క్స్ అండీ!!"
మీరు నాకోసం ఏమైనా ఖర్చు పెడతారు 
"త్యాన్క్స్ అండీ!!"
అయితే షాప్పింగ్ కు వెళదాం 
నో "త్యాన్క్స్ అండీ!!"
మీతో జోక్సు వేయనండి వస్తా .......
ఛీ యీ మొగోళ్లంతా ఇంతే ........   
 --((**))--
ప్రాంజలి ప్రభ నేటి హాస్యం -9  
రచయత: మల్లపగడ రామకృష్ణ 

భార్యాభర్తల ఛలోక్తి సంభాషణలు 

ఈ లైటర్ ఎంతసేపటికి వెలుగుట లేదు     
కోపం వద్దు ఎందుకంటే ఇది పాత బడ్డది 
కాస్త ఓపికతో ఒకటికి రెండు సార్లు కొడితే వెలుగుతుంది 
ఇదిగో ఇలా 
అబ్బా మీ చెయ్ తగిలితే చాలు వెలుగుతుంది 
ఈ రోజు వంట అంతా మిరే చేయండి 
తప్పుతుందా 
నిన్ను కట్టుకున్నప్పడి నుండి 
నేను చేసేది ఇదే గా 
కొత్తలో మిస్సెస్ గా ఉన్నా వే
ఇప్పుడు మిస్ స్ట్రెస్ గా మా రావే 
ఆమాత్రం లేకపోతే ఎంజాయ్ ఏముంటుంది 
ఒకరికొక్కరు స్ట్రెస్ 'ఏ'  కాదండిలోకం 
ఆ....   ఆ...   ఆ.. ఆ.. 
ముందు పని కానీయండి 
తారువాత "" ఆ "" అని నోరు తెరుద్దురు కానీ .....  
--((**))--
Image may contain: 1 person, smiling, text

JOKES
**********
ఒక పెద్దాయన పోలింగ్ బూత్ లో vote వేసి బయటకు వస్తూ poling agent ని ఇలా అడిగేడు : మా ఆవిడ వచ్చి vote వేసి వెళ్లిపోయిందా? 
Poling ఏజెంట్ list లో పేరు check చేసి ఇలా అన్నాడు : హా ! కొద్ది సేపటి క్రితం ఆవిడా ఇక్కడే ఉండెను. Vote వేసి వెళ్ళిపోయేరు !
పెద్దాయన : చాలా విచారం గా మొహం పెట్టి నేను కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది . ఆవిడని కలిసి వుండే వాడిని అని అన్నాడు !
ఏజెంట్ :ఏమి sir! Aunty మీరు ఒక దగ్గర కలిసి ఉండటం లేదా అని అన్నాడు !
Peddayana: మా ఆవిడ చనిపోయి 15 సంవత్సరాలు అయింది !కాని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన vote వేసి వెళ్ళి పోతున్నది అని అన్నాడు !😀😀
****

అత్తయ్య కొత్త కోడలితొ:
నీకు వంట చెయ్యడం రాదని తెలిసినప్పుడు కూడా నేను పెద్దగా బాధపడలేదమ్మా...
పాలు గిన్నె లో పోసి స్టవ్ sim లో పెట్టమని చెప్తే...
"Sim 1లోనా... Sim 2 లోనా అత్తయ్యా " అని నువ్వు అడిగావు చూడు అది మాత్రం భరించడం నా వల్ల కావట్లేదు...



*సాలగ్రామం ఎలా పుట్టింది.............?*
గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే|
సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ:||
శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:|
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:
శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:||
సాలగ్రామం అంటే తెలుసా.......? విష్ణు చిహ్నంగల శిలనే సాలగ్రామం అంటారు.
అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి.
ఆనది పేరు గండకీ.
చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!
గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది.
ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు.
గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది.
ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు.
ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.
ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు.
అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన…
ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది.
సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది.
అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది. ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.
గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది.
కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.
గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు.
ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే.
మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.
గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు.
ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీ కథ నిలిచిపోయింది!.

సీ॥కొనగోట కాటుకఁ । కొసరి కొసరి యింతి 
కనురెప్పలకు దిద్ది । కాంతు లద్ది 
దోరనవ్వును నవ్వి । నోరచూపును రువ్వి 
మూసి కందెఱలతో । బాస లాడు 
చెలికాని స్వరములై । తొలి సంధ్య వెలుగులై 
మధుర తోరణమయి । యెదురు చూచు 
ఇరుల పూ దోటలో । వరుని చే దోటలో 
అరమోడ్పు నయనాల । అరువు లిచ్చు 
ఆ॥చెలియల కనురెప్ప । తొలి రాయబారమై 
వచ్చి పలుక రించి । ముచ్చ టించు 
నర్సపురని వాస । నటరాజ ఘనమోక్ష 
విశ్వ కర్మ రక్ష । వినుర దీక్ష 

Monday 30 July 2018

Panjali prabha


రచనలలో వైజ్ఞానిక దృష్టి అవసరం 

సాహితీమిత్రులారా! 

“చంద్రుడు గుండ్రంగా ఎందుకు కనిపిస్తాడు” అని పిల్లలు అడిగితే తల్లిదండ్రులు ఏం చెపుతారు. 

“అమ్మా నేనెట్లా పుట్టాను?” అని అడిగితే తల్లి ఏం చెబుతుంది? 

పిల్లలు అనేక సందర్భాలలో అమాయకంగా తల్లిదండ్రులను అడుగుతూ పోతారు. వాటికి సమాధానం చెప్పలేనప్పుడు, నోరుమూసుకో అని గానీ, దేవుడిచ్చాడు అని గానీ, బుకాయిస్తే అది సమాధానం చెప్పినట్లు కాదు. తెలియనప్పుడు తెలుసుకుని చెపుతాను అంటే పోయేదేమీ లేదు. అది సరైన ధోరణి కూడా. అబద్ధాలు, అసత్యాలు కలిపి చెప్పి పిల్లలకు వక్రీకరించే ధోరణి చేయకూడదు. కానీ, చాలామంది తల్లిదండ్రులు ఈ తప్పులే చేస్తుంటారు. వారు చెప్పే విషయాలు పిల్లలకు గాఢంగా నాటుకుపోతాయి. అలాగే తల్లిదండ్రుల మాటలు, సమాజంలో ఇతరుల మాటలు, మూఢనమ్మకాలు, హత్తుకుపోతే పెద్దయిన తర్వాత సైన్సు చదువుకున్నా అవి పోవు. ఈ విషయమై సుప్రసిద్ధ రచయిత చలం తన బిడ్డల శిక్షణలో చాలా స్పష్టంగా వివరించారు. నేటి సైంటిస్టులు, కార్ల్ సేగన్, మైకల్ షర్మర్ వివరిస్తూ పిల్లలపై తెలియని దశలో చెప్పే విషయాల ప్రభావం ఎలా నాటుకపోతుందో తేటతెల్లం చేశారు. సైన్సులో ఒక విభాగంలో నిపుణుడైనంత మాత్రాన ఆ సైంటిస్టుకు మిగిలిన విషయాలలో స్పష్టత వున్నదని అనుకోరాదు. అందుకే ఒక విభాగంలో సైన్సు చదువుకున్న వ్యక్తి మూఢ నమ్మకాలను పాటిస్తే మనం ఆశ్చర్యపడక్కరలేదు. 

తెలుగులో వైజ్ఞానిక విషయాలు చక్కగా వివరిస్తూ లోగడ అనేక రచనలు వచ్చాయి. సుప్రసిద్ధులు అందుకు పూనుకున్నారు. డా. గాలి బాలసుందర రావు, మహీధర జగన్మోహన రావు, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, వసంతరావు వెంకటరావు నేడు దేవరాజ్ మహరాజు, నాగసూరి వేణుగోపాల్, వసునందన్ తదితరులు సైన్సును విడమరిచి సులభంగా అందిస్తున్నారు. రచయితలు అవి దృష్టిలో పెట్టుకుంటూ చెడగొట్టకుండా ఉండే ధోరణిలో రచనలు చేయవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక, మాథ్యమిక పాఠశాల స్థాయిలో వైజ్ఞానిక ధోరణి అలవరచి పెంపొందించడానికి పాఠ్య ప్రణాళిక తగనుగుణంగానే రూపొందించారు. 

పిల్లల్ని చెడగొట్టాలని తల్లిదండ్రులెవరూ భావించరు. తాము చెప్పేదంతా వారి మంచికేనని కథలూ గాథలూ నూరిపోస్తారు. అవన్నీ నిజమేనని పిల్లలు నమ్ముతారు. ఎంత సైన్సు చదువుకున్నా చిన్నప్పటి నమ్మకాలు, ఈర్ష్యా ద్వేషాలు, కులాలు, మతాలు, ప్రాంతీయ తత్త్వాలు, రంగు భేదాలు తొలగిపోవడంలేదు. కనుక పాఠాలలో చిన్నప్పటి నుండీ వైజ్ఞానిక విషయాలు ఆకర్షణీయంగా చెప్పటం వలన ఈ దోషం చాలా వరకు తొలగిపోతుంది. నిపుణుడైన శాస్త్రజ్ఞుడు ఇతర విభాగాలలో జరిగేవాటితో సమన్వయీకరణ చేస్తే రాగద్వేషాతీతంగా పాఠాలు పిల్లలకు అందించవచ్చు. కార్ల్ సేగన్, ఐజక్ అసిమోవ్, రిచర్డ్ డాకిన్స్, ఎ.బి.షా., నైల్ డి గ్రాస్, బ్రైన్ గ్రీన్, రచనల నుండి ఈ విషయాలు గ్రహించవచ్చు. పాఠ్యగ్రంథాలు తయారు చేసేటప్పుడు వీటిని సిలబస్ లో ప్రవేశపెడితే అనూహ్య సత్ఫలితాలు లభిస్తాయి. 

బి.వి. నరసింహారావు బాలబంధుగా ఈ విషయాలని ఆడిపాడీ చూపెట్టారు. ఆయన రచనలు నేడు లభిస్తున్నవి. వాటిని అమెరికాలోనూ ఆంధ్ర ప్రదేశ్ లోనూ తెలంగాణా లోనూ ఉపాధ్యాయులు స్వీకరించి అనుసరిస్తే చక్కని పరిణామాలు వస్తాయి. ఆధునిక పునర్వికాసానికి ఈ ధోరణులు అవసరం. స్త్రీ రచయితలలో నవలలు, కథలు, నాటికలు, కవితలు నేడు విపరీతంగా వెలువరిస్తున్నారు. వారు కూడా వైజ్ఞానిక ధోరణులను స్వీకరిస్తే సమాజంపై ఇంకా గాఢమైన ప్రభావాన్ని చూపెట్టగలరు. ప్రాచీన కథలు, గాథలు తిరిగి రాసేటప్పుడు పాఠాలలో చేర్చేటప్పుడు అవి కథలని, యథాతథంగా జరిగినట్లు నమ్మరాదని స్పష్టం చెయ్యాలి. 

వైజ్ఞానిక ధోరణిలో గొప్ప సుగుణం ఏమంటే ప్రపంచంలో ఎక్కడ ఎవరు కనుగొన్నా అది అందరికీ అందించటం, ఆ విషయంలో ఎలాంటి అరమరికలు లేకపోవడం చెప్పుకోదగిన అంశం. అందువలన వైజ్ఞానిక ధోరణి అనేది పిల్లల స్థాయి నుండి అలవరచాలి. అమెరికా సైన్సు, అమలాపురం సైన్సు, అదిలాబాదు సైన్సు అని వుండదు. ఎక్కడ ఎవరు కనుగొన్నా అందరికీ అందించటం, అంటరానితనాన్ని పాటించకపోవడం, కుల మత దేశ సంకుచిత తత్వాలను దూరంగా పెట్టి అందరికీ విజ్ఞానాన్ని విప్పార చేయటం సైన్సు సుగుణం. అదే ధోరణి రచయితలు, రచయిత్రులు బాగా వ్యాపింప చేయాలి. 
---------------------------------------------------------- 
రచన - ఇన్నయ్య నరిశెట్టి, మధురవాణి త్రైమాసిక పత్రిక సౌజన్యంతో 
---------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు
 

వృక్షో రక్షతి !రక్షిత: ! " 

ఇదే విషయాన్ని అలనాటి పోతన మహా కవి ఒక్క చక్కని నాలుగు లైన్ల పద్యంలో ఎంత భావాన్ని ఎంత అందంగా చెప్పాడో చూడండి!

గోపికా వస్త్రాపహరణ ఘట్టం సందర్భంలో,బృందావనాన్ని దాటుతూ,కృష్ణుడు మొదలైన గోప బాలురు వేసవి తాపాన్ని భరించలేక ఒక చెట్టు క్రిందకి చేరారు.వాళ్ళు తిన్నగా ఉండక వృక్షం తమకు గొడుగులాగా రక్షణ నిస్తున్న ఆ చెట్టు యొక్క ఉపయోగాలను ఈ క్రింది ఒక్క పద్యంలో ఏకరేవు పెట్టారు.ఆ అద్భుతమైన పద్యమిది. 
"అపకారంబులు సేయవెవ్వరికి, నేకాంతంబులందుండు, 
నా తప,శీతానిల, వర్ష,వారణములై ,త్వగ్గంధ, నిర్యాస, భ 
స్మ, పలాశాగ్ర, మరంద,మూల,కుసుమ,చ్చాయా, ఫలశ్రేణి,చే, నుపకారంబులు సేయు,నర్ధులకు నీ యుర్వీజనుల్! కంటిరే ? " 

(భాగ.దశమ.850ప) 

ఈ చెట్లను చూడండి!ఇవి ఎవ్వరికీ కీడు చెయ్యవు.ఎవరి జోలికీ రాకుండా 
ఏకాంతంగా ఉంటాయి . ఎండ, వాన, గాలి,మంచుల బారి నుండి ఆశ్రితులను కాపాడుతాయి.అడిగిన వారికల్లా తమ బెరడు, గంధం,జిగురు,బూడిద,చివురుటాకులు,తేనె,వేళ్ళు,పూలు, నీడలు,పండ్లు ఇచ్చిమేలు చేస్తాయి అంటూ కృష్ణుడంతటి వాడే పొగిడాడు. 
అలాంటి చెట్లను నేడు మనం ఎం చేస్తున్నాం?నరికేసి కాంక్రీటారణ్యాలను నిర్మించుకుంటున్నాం.అవి లేనిదే,మానవుని మనుగడే లేదనే విషయం తెలిసి కూడా మానవుడు అరణ్యాలను నరుకుతున్నాడు మనం ఒక్కక్కడు ఒక్కక్క మొక్క నాటితే,మన 
పర్యావరణ పరిరక్షణ మన చేతులోఉంటుంది.మన చేతల్లో ఉంటుంది.అందుకే అన్నారుపెద్దలు 
"వృక్షో రక్షతి రక్షిత:"
--((**))--
శివ ధ్యాన శ్లోకాలు !....(2) 

"ధ్యాయేద్దేవం సుస్మితం స్యన్దనస్థం దేవ్యాసార్థం తేజసాదీప్యమానం, 
ఇష్విష్యాసాలంకృతాభ్యాం కరాభ్యాం శూరాకారం స్తూయమానం సురాద్యైః" 

చిఱునగవులవాడును, దేవితోగూడ రథముమీద నున్నవాడును, 
తేజస్సుచే ప్రకాశించుచున్నవాడును, 
బాణముచేతను ధనస్సుచేతను అలంకృతమైన హస్తములచే నొప్పినవాడును, శూరునిరూపము గలవాడును, దేవతలు మొదలగువారిచే స్తుతింపబడుచున్నవాడు 
అగు దేవుని ధ్యానించుచున్నాను. 

దేవత: శంభువు 


ఋషి: ఆత్రేయుడు


Sunday 29 July 2018

Pranjali Prabha (30-07-2018)

ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం  


అధిక్షేప ప్రేమలీల 
రచయత :  మల్లాప్రగడ రామకృష్ణ     

విరివై వెన్నలవై వికాస పథివైవిధ్వనివై 
- అలుకై వెన్నముద్దై సీమంత సిరివై సంభరమై      

పలుకై సన్నితమై సుమాల బరువై సుందరివై 
- కులకై కన్నుకొట్టై ఆనంద మేరుపై ముంబరమై 

చినుకై సుందరమై విశాల పరువై జీవకలై       
- తనువై దగ్గరకై తరించి తపనై మేఘములై  

సిరులై మంగళమై శుభాల కలలై దేవతలై 
- పిలుపై సంగమమై నవాంక పనులై సమ్మతులై    

నమ్రత, వినమ్రత కలసి 
జ్ఞానము విజ్ఞాము కలసి 
భయము సంతోషము కలిసే 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


తేది : 30, జూలై 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(నిన్న తెల్లవారుజాము 4 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 40 ని॥ వరకు)
నక్షత్రం : ధనిష్ట
(నిన్న తెల్లవారుజాము 3 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 32 ని॥ వరకు)
యోగము : సౌభాగ్యము
కరణం : గరజ
వర్జ్యం :
(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 31 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 17 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం :
(ఉదయం 12 గం॥ 47 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 14 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
గుళికకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : కుంభము
ఇది కలయని నేననుకోన ..కలనైన ఇది నిజమౌన.. 
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని ..కలదో? లేదో? అనుకోనా.. 

చిత్రం : సింహాసనం 
సంగీతం బప్పిలహరి 
గానం : రాజ్ సీతారాం, సుశీల 

ఇది కలయని నేననుకోన .. 
కలనైన ఇది నిజమౌన.. 
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. 
కలదో? లేదో? అనుకోనా.. (2) 

నీ ఊహల ఊయలలోన .. ఉర్వసినై ఊగిపోన 
నీ అడుగుల సవ్వడిలోన సిరిమువ్వై నిలిచిపోన (2) 
నీ కంటిపాపలోన నా నీడ చూసుకోన 
నీ నీడ కలువలలోన నూరేళ్ళు ఉండిపోన 

ఇది కలయని నేననుకోన .. 
కలనైన ఇది నిజమౌన.. 
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. 
కలదో? లేదో? అనుకోనా.. 

నీ జీవన గమనంలోన జానికినై నడచిరాన 
నీ మయూరి నడకలలోన లయ నేనై కలసిపోన 
నీ సిగ్గుల బుగ్గలలోన ఆ కెంపులు నే దోచుకోన 
నను దోచిన నీ దొరతనము నాలోనే దాచుకోన ..(2) 

ఇది కలయని నేననుకోన .. 
కలనైన ఇది నిజమౌన.. 
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. 
కలదో? లేదో? అనుకోనా 

https://www.youtube.com/watch?v=UJhJQCayFCc
Simhasanam Movies || Idhi Kala Ani Video Song || Krishna, Jayaprada, Radha
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...
మధూషిణి (part-2) 
****************************************** 
నేనత్తయ్యా మధూషిణిని రాఘవరావు గారి కూతురుని అన్నది. ఉద్వేగంతో ఆవిడ కళ్ళు చెమర్చాయి. తమాయించుకొని "ఎందుకొచ్చావ్ ఇక్కడికి ?" అన్నదామె. వెంటనే మధూషిణి అదేమిటత్తయ్యా నా అత్తారింటికి నే రాకూడదా అన్నది. జానకమ్మ దుఃఖం నిండిన స్వరంతో "మీ నాన్నేమీ అనలేదా నువ్విటు వస్తుంటే? అసలు మేమిక్కడున్నట్టు నీకెలా తెలుసు?" అన్నది. నేనిక్కడికి వస్తున్నట్టు నాన్నకు తెలీదు. " అమ్మ మీ గురించి అంతా చెప్పింది అన్నది " మధూషిణి. 

మధూషిణి వాళ్ళ నాన్న రాఘవరావుకు ఒక్కగానొక్క చెల్లెలు జానకి. ఆమెకి గొప్పింటి అబ్బాయిని భర్తగా తీసుకురావాలని రాఘవరావుకు కోరికుండేది. అనుకోకుండా జానకమ్మ జగన్నాథంను ప్రేమించి పెళ్ళి చేసుకొని రావటంతో రాఘవరావు షాక్ కి గురి అయ్యాడు. ఆ కోపంలో ఈ రోజు నుంచి నాకు చెల్లెలు లేదనుకుంటాను నీ మెుహం నాకు చూపించకు అని ఇంట్లోంచి పంపించేశాడు. అది జరిగిన విషయం. 
మధూషిణి తల్లి కూడా జానకిని ప్రేమగా చూసుకునేది. ఆ తర్వాత జానకి,జగన్నాథం ను పెళ్ళి చేస్కోవటంలో ఆమెకేమి తప్పు కనిపించలేదు. ప్రతీరోజు ఆమెని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే మధూషిణిని సమానంగా జానకిని చూసుకుందావిడ. జానకి గురించి రోజూ తల్లి చెప్తూ ఉంటే మధూషిణికి తన అత్తయ్యను ఒకసారి కలవాలనిపించింది. సమ్మర్ క్యాంప్ వంకతో ఆ ఊరొచ్చింది. 

జానకి అనునయంగా మధూషిణి చేయి పట్టుకొని " ఎప్పుడనగా తిన్నావో వెళ్ళి స్నానం చేసిరామ్మా వడ్డిస్తాను" అన్నది. అతి తక్కువ సమయంలో ఆ ఇంట్లో బాగా కలిసిపోయింది మధూషిణి. అత్తయ్య,మావయ్య చూపించే ప్రేమానురాగాలు చూస్తుంటే అసలు వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళాలనే లేదు తనకి. ఒక రోజు నిండుగా పండువెన్నెల కురుస్తుండగా చంద్రునికి తానేమీ తీసిపోనన్నట్టుగా అందంగా తెల్లని పరికిణిలో మెరుస్తోందామె. వీణాపాణియై చక్రవాకరాగం ఆలపిస్తుంది. అది కొంచెం విషాదమిళితం. ఎక్కువమందికి నచ్చదు కూడానూ. కానీ మధూషిణి అలా లీనమైపోతూ వీణపై వేళ్ళు కనపడనంత వేగంగా ఆలపిస్తుంటే చూసేవారు ఎవరైనా మంత్రముగ్ధులు అవాల్సిందే. నిర్మలమైన వదనం , ఆమె రాగంలో లీనమై వాయిస్తుంటే తల లయబద్ధంగా ఊగుతోంది. ఆమె చెవికున్న జుంకీ రాగానికి అనుగుణంగా నాట్యమాడుతున్నట్టుంది. అప్పుడే పట్నం నుంచి వచ్చిన ఆనంద్ ఆ దృశ్యం చూస్తూ స్థాణువై నిలబడిపోయాడు. అదంతా ఒక కలగా అనిపిస్తుందతనికి. ఏదో అలజడి అవటంతో ఆపి తలుపువైపుకి తిరిగి చూసింది మధూషిణి. తను సరిగ్గా ఊహించగలిగింది అతను తన బావేనని. అనుకోకుండా అతను అక్కడ కనిపించేసరికి ఆమెకి నోట మాట రాలేదు. "నమస్కారం" అని మర్యాదపూర్వకంగా పలకరించి చెంగున అత్తయ్య దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నిలుచుంది. జానకి ఆనంద్ ని చూసి సంతోషంతో "ఒరేయ్ ఎప్పుడొచ్చావురా వస్తున్నట్టు కబురు చేస్తే నాన్నగారు స్టేషన్ కి వచ్చేవారు కదా" అన్నది. " ఫరవాలేదమ్మా నాన్నగారికెందుకు ఇబ్బందనీ..అది సరే.. ఈ అమ్మాయి ఎవరు?" అనడిగాడు ఆనంద్. జరిగినదంతా చెప్పింది జానకి. 


|| నీడ || 

ఓ అభిజ్ఞా... 

ఈ పిలుపేంటి పిలగాడా అని మాత్రం అనుకోకేం. నీడ నీడతో ఇలాగే మాట్లాడాలి. నిజం చెప్పు! నీకు నా దగ్గరి తనపు స్పర్శ తెలియటం లేదూ. నీ మనసులో గోరువెచ్చని మమతల్లో దాగున్న నన్ను దూరంగా ఉన్నానంటూ ఆక్షేపించటం నీకు మాత్రమే చెల్లింది. నీకు నాతో జగడాలు ఆడటం ఇష్టమని తెలుసు కానీ ఇన్ని అభాంఢాలా? అన్యాయం కదా. ఒక్కసారి లో లోపల తడుముకుని చూడు. ఆ మనసు పరిమళంలో అదే స్వచ్ఛత అదే సువాసన అదే పరవశం మరి అది నేను కానా. 

నువ్వంటున్నావే విసిరిన మాటలు అని… అవి విసిరిన మాటలు కాదోయ్... అరవిరిసిన హృదయ సుమాలు! కాబట్టే మౌనం కోటి రకాలుగా మాటలాడుతుంది. నా నిశ్శబ్దపు హోరూ, నీ మౌనాల జోరూ… ఈ రెండూ మనల్ని ఇంకా ఇంకా దగ్గరే చేస్తాయి కానీ ఎప్పటికీ దూరాన్ని పెంచలేవులే. నీ ఏకాంతం నీకెలా ఉంటుందనుకున్నావ్ నన్ను ఊహలకి వెళ్లాడదీసాక? 

ఎందుకీ విరామాలంటూ వగపులేల? కొన్ని విరామాలు… వరాల ఆరామాలు ! విరామంలో వరమేంటి అంటే ఏమని చెప్పను నేను? సమయం మొత్తాన్ని తలపులకి అల్లేసిన సడిలో మామూలుగా కన్నా ఇంకా దగ్గరైనతనం చెప్పటం లేదూ అదెంత వరమో..! 

నువ్వనుకున్నట్లు మౌనమెప్పుడూ అందమైన గాజు పువ్వు మాత్రమే కాదురా… అది ఘనీభవించిన సజీవ పరిమళం. స్థితి ఏదైతేనేం దాని అలజడి తీరు మాత్రం ఎప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది. నీకు తెలియనిది కాదనుకో… అయినా సరే మరో సారి చదివి చూడు మౌనం రాస్తున్న మనఃప్రతిని. నల్లని నీడలో… రంగు రంగుల వర్ణాలో… ఎలా అనిపించినా అవి పరిచయించేది మాత్రం నిన్నుగా రాసుకున్న నా ఊసుల లిపినే. 

నీడగా ఉండటం అంటే నిన్ను కాచుకోవటం అన్న మాటేగా… సమయాన్ని బట్టి తగ్గుతూ పెరుగుతూ రూపుని దాటేసిన రక్షా కవచమది. నీ హృదయ స్పందనలు వినిపించనంత దూరం అంటే నాకు తెలిసింది ఒక్కటే… అదే మరణం. 

ఏదేదో ఊహించు కుంటున్నావ్ గానీ నిజంగా నీకు తెలియదా చెప్పు? నిన్ను తలుచుకుంటే నా గుండె నిండుగా పరిమళించే తొలకరి చినుకు చీల్చే మట్టి వాసన, నీ పిలుపు వింటే చాలు పిల్లగాలిపై మనసు పడ్డ పైరులా పరవశం… ఒక్కొక్క అనుభూతీ ఒక్కోలా నిన్ను నాలో నింపేసాక నాకు నేను అతిధినయ్యానని ! 

గెలిపించేదీ నువ్వే... ఓడించేది నువ్వే... దిగులు పెట్టించేది నువ్వు… ధైర్యమిచ్చేది నువ్వే… బెదిరించేది నువ్వే... ఆదరించేది నువ్వే... 

ఎప్పటికీ నా నీడగా నన్నంటి ఉన్న నా తోడుగా నీకు నేనున్నానని తెలుపుకునే తలపుల తాయిలమిది. 

అనుకోకుండా తారసపడ్డా… నిశ్శబ్దంగా చేరువైనా… జత కలసిన అడుగులు ఒకటికి ఒకటి రెండుగా… రెండిటి తపమూ ఒకటిగా... బంధం అల్లుకుపోయాక జతలంటూ ఏమీ ఉండవు ఏకమైన మనో శబ్దం తప్ప. 

నీ 
“తోడూ నీడ”


కోకిల..కోకిల. 
కోకిలా కొక్కొకోకిలా కూతలా రసగీతలా 
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా 
నీ పాటతో మరు పూదోటలో మదిరేపింది మారాపిలా 
I love you 
ఒరేయ్ నువ్వు కాదురా I Love You నేనురా 
I Love you I Love You 
I Love you I Love You 
I Love you I Love You 
జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాట వింటే 
ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే 
చుక్కమ్మ కోపం చి పొ ముద్దొచ్చే రూపం వదులు 
కన్నులో తాపం వెన్నెల్లో దీపం 
హోయ్ నాలోనీ లల్లాయికే నీకింక జిల్లాయిలే 
లయలేమో హోయలేమో ప్రియభామా కధలేమో 
కోకిలా కొక్కొకోకిలా కూతలా రసగీతలా 
నీ పాటతో మరు పూదోటలో మదిరేపింది మారాపిలా 
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా 
I Love you I Love You 
I Love you I Love You 
I Love you I Love You 
కొమ్మాపండే కొమ్మాపండే రెమ్మాపండే రెమ్మాపండే 
కొమ్మాపండే రెమ్మాపండే కొరుక్కుతింటావా 
కొమ్మాపండే రెమ్మాపండే కొరుక్కుతింటావా 
బుగ్గాపండే బుగ్గాపండే సిగ్గుపండే సిగ్గుపండే 
బుగ్గాపండే సిగ్గుపండే కొనుక్కుపోతావా 
బుగ్గాపండే సిగ్గుపండే కొనుక్కుపోతావా 
కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలిసోకీ 
ఈచైత్ర మాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే 
పైటమ్మ జారీ ప్రాణాలు తోడే వయ్యారమంతా వర్ణాలు పాడే 
జాలీగా నా జావళీ హాలీడే పూజావడీ 
ఇక చాలు సరసాలు కుదిరేనూ మురిపాలూ 
కోకిలా కొక్కొకోకిలా కూక్కుకూ కూతలా రసగీతలా 
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా 
నీ పాటతో మరు పూదోటలో మదిరేపింది మారాపిలా 
I Love you I Love You 
I Love you I Love You 
I Love you I Love You 

https://www.youtube.com/watch?v=YnLda2qgNyo
Kokila Title Song From Kokila Movie
Watch Kokila Video Song from Kokila Movie,
--((**))--
వారసత్వం 

ఎంత వారసత్వంగా వచ్చినా, కొత్తగా వ్యాపార పగ్గాలు చేపట్టాలనుకునేవాడికి తరాలుగా తాము చేస్తున్న వ్యాపారం గురించి పూర్తి అవగాహన ఉండాలి. 
తన ఉత్పత్తికెక్కడ మంచి గిరాకి ఉంది, తన ఉత్పత్తికి పోటీదారులెవరు, ఎంత గట్టిపోటి ఉంది, పోటీని ఎలా అధిగమించాలి, 
రాబోయె కాలంలో అవసరాలకనుగుణంగా తన ఉత్పత్తిని ఎలా ఎప్పుడు మార్చుకోవాలి, 
తదనుగుణమైన ప్రణాలికలేమిటీ, ఎవరి సహాయం తీసుకోవాలి, 
ఆర్ధిక, ఉత్పాదక, మానవవనురుల, మార్కెటింగ్ విభాగాలలో 
ఎవరి అర్హతేమిటీ, ఎవరి సామర్ధ్యమేమిటి, ఎవరి నైపుణ్యమేమిటి తెలుసుకుని ఎవరిని ఎక్కడ నియమించాలో అక్కడ ఆయా స్థానాల్లో అప్పుడు నియమించాలి. 
ఇన్ని తెలిసినవాడే వారసత్వంతో పనిలేకుండా ఒక మంచి వ్యాపారవేత్తగా రాణించగలడు..తన పూర్వీకులు స్థాపించిన సంస్థను మరిన్ని ఎత్తులకు తీసుకుపోగలడు. 
ఇవేమి లేకుండా కేవలం వారసుడన్న ఒక్క అర్హతతో తెచ్చి అందలమెక్కిస్తే ఆ సంస్థ దివాళా తీయటానికి ఎంతో సమయం పట్టదు.. 
ఏ అనుభవం లేకుండా కేవలం వారసుడైన అధ్యక్షుడికన్నా, ఆ సంస్థలో దశాబ్దాల తరబడి పనిచేసే ఒక చప్రాసి మేలు. వాడిని నమ్ముకుంటే మంచి ఫలితాలుంటాయి. 
భోగాలకి, రోగాలకి వారసత్వం పనికొస్తుందేమో గాని, అర్హతలు, నైపుణ్యానికి కాదు.
--((**))--
స్పర్శించే అక్షరాన్నై.................... 
అధిక్షేప ప్రేమ లీల
నిత్యం 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

నిత్యం స్పృశించే తనువు తాపానికి
 - మది మోస్తున్న తపన కారణాలెన్నో 

నిత్యం తపించే జ్ఞాపకాల గురుతుకి
 -  భారమై మోస్తున్న హృదయ సలుపులెన్నో  

నిత్యం శాసించే బలవంతపు బ్రతుకుకి
 - తనువు మోస్తున్న బాధతో నెప్పులెన్నో 

నిత్యం కలత కల్లోలాన్ని తొలగించటానికి
 - మనస్సును ఓదార్చిన సందర్భాలెన్నో 

నిత్యం మదిలో జరిగే మౌన పోరాటానికి
 -  విప్పలేని ఘర్షణ మాటలలో మర్మాలెన్నో 

నిత్యం కోరికలు కన్నీటిగా మారటానికి 
-  ఒప్పక భందాన్ని హత్తుకున్నా క్షణాలెన్నో   

నిత్యం నూతన ఉరవడి పోరాటానికి 
- తలపుల తప్పఁటడుగులు ఉలికిపాటులెన్నో 

నిత్యం అన్వేషణ కొత్త కొత్త మార్గానికి
- మార్పు, నేర్పు, ఓర్పుతో సత్యాన్వేషణాలెన్నో 

స్త్రీ అనగా నిత్యం పూచే పుష్పం 
ఉపయోగించే విధానాన్నిబట్టి 
పెరిగేదే గౌరవం అదే జీవితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  
--((**))--

గాయకులు, కళాకారులు ఎక్కువైనారు. 
పోటీ ప్రపంచం. 
తమ గుర్తింపుకై ప్రాకులాట.. 
ఏ కీర్తనో, అష్టకమో ఇంతకుముందే ఉన్న రాగంలో పాడితేనో, మళ్ళీ అదే రాగం కూర్చితేనో గుర్తింపురాక పోగా విమర్శిస్తారు.. 
కొత్తదనం పేరుతో అక్షరాలని విరిచేసి, మధ్య మధ్య కొన్ని అరుపులు చేర్చి పాడేస్తున్నారు.. 
నోటికొచ్చినదే అయినా, బాగా విన్నదే అయినా అదేమిటో అర్థం చేసుకోవటానికి కాస్త ఎక్కువే కష్టపడాల్సి వస్తున్నది..
--((**))--

ఆపదలో ప్రాణాన్ని రక్షించువాడు నేటి కవిత 
ప్రాంజలి ప్రభ.కం 

ఆదుకొనేవాడు ఆరాధ్యుడు
కృషి వలుడు మధ్యముడు
స్వార్ధ పరుడు అధముడు
హింస పరుడు షండుడు

ప్రాణానికి ప్రాణం ఇచ్చువాడు
ఆపదలో ఆదు కొనేవాడు
కష్టసుఖాల్లో పంచుకొనేవాడు
మంచి మాటపంచెవాడు స్నేహితుడు

ఎవరు చెప్పిన వినని వాడు మూర్ఖుడు
లోకజ్ఞానం తెలియని వాడు అమాయకుడు
వివేకం చూపలేని వాడు అవివేకుడు
విచక్షణా హీనుడు దౌర్భాగ్యుడు

ప్రేమను గౌరవించేవాడు ప్రేమికుడు
భార్యను గౌరవించేవాడు తన్మయుడు
మాటను గౌరవించేవాడు శిష్యుడు
విద్యను భోధించేవాడు భోధకుడు

అధిక్షేప లీల 
ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

సమయానికి ఆదుకొనేవాడు ఉత్తముడు 
- నిరంతరం కృషి వలుడు మధ్యముడు

ఉంది లేదని స్వార్ధ పరుడు అధముడు
- స్త్రీ, పిల్లలను హింస పరుడు షండుడు

స్నేహానికి ప్రాణం ఇచ్చువాడు ఆరాధ్యుడు 
- ఆపదలో ఆదుకొనేవాడు స్నేహితుడు 

నిత్యం కష్టసుఖాల్లో పంచుకొనేవాడు మొగుడు  
- నిత్యం మంచి మాటచెప్పేవాడు ధర్మపరుడు 

ఎవరు చెప్పిన వినని వాడు మూర్ఖుడు
- లోకజ్ఞానం తెలియని వాడు అమాయకుడు

నిత్యం వివేకం చూపలేని వాడు అవివేకుడు
- అందరిపై విచక్షణా హీనుడు దౌర్భాగ్యుడు

నిత్యం ప్రేమను గౌరవించేవాడు ప్రేమికుడు
- నిత్యం భార్యను గౌరవించేవాడు తన్మయుడు

గురువు మాటను గౌరవించేవాడు శిష్యుడు
- వయసుకు విద్యను భోధించేవాడు భోధకుడు

కాలాన్ని బట్టి మంచిని గ్రహించి
ధర్మం, న్యాయం, సత్యం అనుకరిచేవాడే  
నిజమైన మానవుడు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--
జ్ఞాన కంద గుళికలు (పొద్దు)   

పొద్దు వాలగానే లోకాన్ని
చీకటిలో వదిలి వెళ్ళేవాడు " రవి"
తాను చీకటిలో ఉన్నా
లోకానికి జ్ఞానాన్ని పంచేవాడు " కవి"

పొద్దు వాలగానే మత్తు 
సద్దు చేయక సాగు చక చక సూర్యుడు
వద్దన్నా కమ్ము యామిని
మద్దత గా నేనున్నాను వెన్నల జాబిల్లి 

దీప వెలుగులు కమ్ము 
గొప్పలు చెప్పుట మాని గూటికి చేరు శ్రీ వారు 
తప్పులు చేయుట మానే 
ఇప్పటి పిల్లల సుఖం కోసం కలిసే శ్రీమతి 

కన్ను తెరిస్తే చూడలేనిది
మన్ను ను కమ్ము కొని నీడలా మారే చీకటి
వెన్ను తట్టి వచ్చు వెలుగు 
నన్ను నా తోటి వారును ఆదుకొను లక్ష్మి      
-((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
మా రోజుల్లో ,... 
"గులాబి పువ్వు" ఇస్తే చాలు.... 
ప్రేమ లో పడిపోయేవారు!! 

మరి...ఈ రోజుల్లో?? 
"ఆపిల్" ఇస్తే కానీ ప్రేమించడం లెదు!! 
....."ఆపిల్" అంటె పండు కాదండి బాబూ!! 
...."ఆపిల్" ఫోన్!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
ఎందుకో, మరి!! 
ఇయ్యాల , పుట్టలో పాలు పొస్తొంటె ...... 
చాలా మంది గుర్తుకు వచ్చారు!! 
సరదాగా తీసుకొవాలండొయ్!... 
మీరు అస్సలు సీరియస్ అవ్వకూడదు!!!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
1.పెళ్లి కాని వాడు.... 
"పెళ్లి చేసుకున్నాడు ఎంత లక్కీ నో" అనుకుంటాడు !! 

2.పెళ్లి అయినాడు, ' 
"బ్యాచులర్ ఎంత లక్కీ నో'' అనుకుంటాడు!! 

తేడా ఏమిటంటే గురువు గారూ.... 

మొదటి వాడు .....హొటల్ లో భోజనం చేస్తున్నప్పుడు అనుకుంటాడు!! 
రెండొ వాడు....ఇంట్లొ భుజనం చేస్తునప్పుడు అనుకుంటాడు!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
"ప్రభాషితాలు"" 
ఒక అమ్మాయిని ప్రేమించారు!! 
అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడు వదిలేస్తుందో (అదే ...బ్రేక్ అప్) మీకు ఒకటే టెన్షన్!! 
ఎం ఖంగారు పడకండి... 
సింపుల్.చిట్కా వుంది....... 
మీ గర్ల్ ఫ్రెండు దగ్గర అప్పు చెయ్యండి..!! 
మిమ్మల్ని వదిలితే వొట్టు!!
--((**))-- 
సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
ఆ మధ్య... 
"నాకు అబ్బాయి నచ్చలేదు డాడీ!!..... 
సినెమా హీరో లా వుండాలని చెప్పానుగా??!!" 
ఈ మధ్య... 
"అబ్బాయి కనీసం సీరియల్లో హీరో లా కూడా లేడు!!... 
నాకు నచ్చలేదు, డాడీ!!
--((**))--
ఇల్లు చక్కబెట్టుకుందాం 
***************************** 
ఇల్లు ఎంత పెద్దదన్నా కావచ్చు 
ద్వారం అదే తలుపు చిన్నగానే వుంటుంది. 
అదే తలుపుకి వేసే తాళం తలుపుకన్నా చిన్నదిగా వుంటుంది 
మరి తాళం చెవి తాళం కప్పకన్నా చిన్నగా వుంటుంది 
- అలాగే ఒక మంచి ఆలోచనతో అది చిన్నదైనా సరే ఇంటినే భద్రపరిచేటంతటి మహత్తరమైనపుడు ఆలోచించకుండా అమలు చెయ్యండి. 
దొంగలుపడి దోచుకున్నాక ఏమనుకుని ఎవరిననుకుని లాభం లేదు.
--((**))--
మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా... 

చిత్రం : కలిసివుంటే కలదు సుఖం 
సంగీతం : మాస్టర్ వేణు 
గీత రచయిత : ఆరుద్ర 
నేపధ్యగానం : పి. సుశీల 

మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా 
మీ దేహములో చిరు లోపములున్నా ప్రేమ కరువౌనా 

సింహము కాల్ళు చిక్కుపడిననూ శౌర్యము కొరవడునా -2 
చేతలు మాటలు ఒకటే అయితే త్యాగము కరువగునా 
త్యాగము కరువగునా - మేలిమి 

కాళ్ళే లేని కమ్మని చమ్ద్రుడు నిరతము పయనించునే - 2 
కరములు చాపే కలువను చేరి ముదము కలిగించునే 
ముదము కలిగించునే - మేలిమి 

పతి పదసేవా భాగ్యము నేనే సతతము నోచితినీ -2 
మీ చల్లని మదిలో సౌఖ్యములొసగే స్వర్గము చూచితిని 
స్వర్గము చూచితిని - మేలిమి 

https://www.youtube.com/watch?v=Rj1KRoMTzIg
Kalasi Vunte Kaladu Sukham - Telugu Songs - Melimi Bangaru - NTR - Savitri
Watch NTR Savitri's Kalasi Vunte Kaladu Sukham Telugu Old Movie Song With HD Quality Music - Master ...
--((**))--

--((**))-- 
రమ్మనె వనభోజనం.. కమ్మని వనభోజనం! 
------------------------------------------- 
(కార్తిక వనభోజన గేయం) 
సాకీ: 
పుణ్య కార్తికమందు కలుసుకొందామంటు.. 
ప్రేమతో పిలచింది పూల వనము.. 
భక్తి, శ్రద్ధల తోటి కలిసి తిందామంటు 
ఆహ్వానమందించె ఊరి జనము.. 
ఐకమత్యము కూడి, ఆధ్యాత్మికత తోడి 
జగతి నడచెడి ధర్మమార్గమెరిగి 
కలుసుకొందము రండి మిత్రులారా... 
కలుసుకొందము రండి మిత్రులారా... 

పల్లవి: రమ్మనె వనభోజనం.. కమ్మని వనభోజనం! 
కార్తిక మాసములో -పవిత్ర పంక్తి భోజనం! 

చరణం-1: సాంప్రదాయమొలుకు లక్ష్మి-దామోదర పూజలు! 
ఆధ్యాత్మిక పరిమళాల అలరు భక్తి సేవలు! 
ఉసిరి చెట్టు నీడన ప్రకృతితో సహజీవనం! 
పల్లెతల్లి ఒడిలో పరవశపు విందుభోజనం! 

చరణం-2: ఆట పాటలతొ సందడి చేసే పసి పాపలు 
ఆత్మీయత పంచు బంధు మిత్రుల చిరునవ్వులు 
ఆశీస్సులనిచ్చే పెద్దల మాటల మూటలు, 
కలిపి- తీపి గురుతుగ మిగిలేటి విందుభోజనం! 

చరణం-3: బ్రతుకునిచ్చు ప్రకృతిమాతకు చేసే వందనం 
భేదభావములనెరుగని మానవీయ సంగమం 
మన సంస్కృతి ఘనప్రతీక కార్తిక సమ్మేళనం 
ఇది తెలిసిన నాడే నిజమైన విందుభోజనం! 
-------------------------------------------------------------- 
విజ్ఞప్తి: 
ఈ గేయం నచ్చిన వారు, ఇతరులకు షేర్ చేయగలరు. Sound Cloud website లో స్వీయగానం తో అప్ లోడ్ చేయడం జరిగింది. విని మీ అభిప్రాయం తెలియజేయగలరు. 
సాంప్రదాయబద్ధమైన వనభోజనాలతో – సంస్కృతిని పరిరక్షించే అందరికీ వందనాలతో..... 
రచన: నూజిళ్ళ శ్రీనివాస్, రాజమహేంద్రవరం (94408 36041) 
https://soundcloud.com/noojillasrinivas/vanabhojanam-song-noojilla-srinivas
Vanabhojanam Song- Noojilla Srinivas
soundcloud.com

 చిరునగవు చిన్నది
మరువమాలతో మనసునే దోచేస్తున్నది
పరువములో ఉన్నది
కురులువిప్పి కులుకు దామా అన్నచిన్నది
తరుణి నీకు తగదు
తరతమ భేదాలు చూడ వెందుకు
కరములతో కవ్వించకు
నరములు లాగెట్టు మురిపాలెందుకు
చిరునవ్వెందుకు నన్ను చూ
సీ రుసరుస లెందుకు రసిక రాజశ్రీ
వరూధిని నేను ప్రవరా
తరుణిని తపనలు తగ్గించుటకు రా రా
ప్రమతో ఇద్దరు కలసి
ప్రేమను బ్రతికించాలని ఆలోచనతో
శ్రమలేకుండా సుఖానికి
తమకంతో, మత్తుతో తన్మయత్వం పొందెన్

   

సరదాగా తీసుకొవాలండొయ్!...మరి!! 
భర్త కి 2 అండర్వేర్ లు కొన్నది "సతీ లీలావతి".... 
రెండూ ఒకే రంగువి !! 
"రెండూ ఒకే రంగువి ఎందుకు కొన్నావ్??? 
చూసెవాళ్లు నేను అసలు.... 
అండర్వేర్ మార్చుకోనేమో అనుకుంటారు!!" అన్నాడు "తింగరి" భర్త!! 
"ఓహో!!....ఎవరో "వాళ్లు"!!" అంది "సతీ లీలావతి" గుడ్లెర్ర చెస్తూ!!
--((**))--

షికారి(కథ) 

సాహితీమిత్రులారా! 
ఈ కథ చదవండి- 

గప్పుడు పొద్దుగూకి నాలుగొట్టిండ్రు కావచ్చు. నేను గప్పుడే బడి కాడ్నించి అచ్చిన. బాపు కుక్కి మంచంల కూకోని ఏందొ ఆలోచన జేత్తండు. అమ్మ అంటింట్ల యేదొ సగవెడ్తంది. శాయ్ వెడ్తున్నదో ఏందొ, గిన్నెల సప్పుడు గలగల ఇనవడ్తంది. ఇంట్ల ఎవ్వలు లేరు, మే దప్ప. అన్నలు పట్నంల సదువుకుంటున్నరు. అక్కలు పెండ్లిల్లు చేసుకోని అత్తగారింటి కాడ ఉంటున్నరు. పండ్గకో పబ్బానికో అత్తరు. గప్పుడు ఇల్లంత కలకల లాడ్తది. 

నేను అంటింట్లకు అరుగు మీదికీ కోడ్రిగానోలె అటూ ఇటూ తిర్గుతన్న. నా మన్సంత ఇంటి ముందటి బజార్లనె ఉన్నది. ఎప్పుడు నా దోస్తులు రామడు , రవిగాడు, రాయేశడు అత్తరా – ఎప్పుడు ఆల్లతోని శిర్రగోనె, పెండల బుర్రి , గోటీలు, బొంగురాలు ఆడ్దామా అని గడె గడెకు పెద్దర్వాజ కాడికి బొయ్, బజార్లకు తొంగి సూత్తన్న. 

గింతట్ల అమ్మ రొండు జేతుల, రొండు కోపులల్ల శాయ్ దీస్కోని అచ్చి, బాపుకోటి నాకోటిచ్చింది. నాకిచ్చిందాంట్ల శాయ్ సగమే వుంది. ‘నాకు నిండ గావాలె! నాకు నిండ గావాలె!’ అని నేను మంకు పట్టు పట్టిన. 

అమ్మ ” ఏందిర పోరడ! ఎంతగనం దాగుతవ్ శాయ్ !” అని తిట్టుకుంటనె లోపల్కి బొయ్, కేతిరి దెచ్చి, నా కోపు నిండ శాయ్ నింపింది. 

ఇగ మేం శాయ్ దాగుడు షురు జేసినం. మా బాపు శాయ్ సాసర్ల వోస్కొని, ఒకటే జుర్రుతాండు. గా సప్పుడు బజార్ల కినిపిత్తంది. 
గింతట్ల బాపు శాయ్ దాగి, అమ్మను పిల్శి, “రాత్రికి కూరేం వండుతున్నవే” అని అడ్గిండు. 

” కూర పాడుగాను! ఏం కూర గాలవడ్డది! కూరగాయలు గిన్నెన్ని సూత లేవు.” అని అన్నది. 

బాపు మంచంల కెల్లి లేశి, దండెం మీదున్న శెల్ల నందుకోని తల్కాయకు రుమాల్ చుట్టుకుండు. సక్కగ అర్గు మీది అర్రలకు బోయిండు. మూలకు ఆనిచ్చున్న తుపాకి నందుకున్నడు. గిదంత నేన్ జూత్తనే ఉన్న. 

” ఇగొ! నేన్ షికారికి బోతన్న. పిట్టలొ శాపలొ కొట్టుకోని అత్త. నేనచ్చెటాల్లకు నువ్ అల్లమెల్లిపాయ రోట్లె దంచి పెట్టుకొ! ” అని అంకుంట తోలు శెప్పులు దొడుక్కున్నడు. 

” బాపు! బాపు! నేన్ గూడత్త ” అని నేనంగనె, అమ్మ ” నువ్వెంద్కురా పోరడా! గాడ్కి! పురుగూ బూశీ ఉంటయ్! ” అన్నది. 
నేను ” లే ! నేం గూడ బోత ” అని జిద్దు జేశిన. 

గప్పుడు బాపు నా దిక్కు ఓపారి జూశి, ” గట్లనే పా! ” అన్నడు. నా శేతికి వో చిన్న సంచిచ్చిండు. అండ్లేముంటయో నాక్ దెల్సు. శెర్రాలు, తుపాకి మందు, గంద్కం పూలు ఉంటయ్. ఇగ నేను ఊశిపోతున్న నెక్కర్ను నడుం మీద్కి అనుకుంట, పెరట్ల వడి బాపెంక ఉర్కుడు వెట్న. గీ తుపాకి మాకెట్లచ్చిందో జరంత జెప్త ఇనుండ్రి . దానెంక ఓ కతుంది. 

బాపు వైద్గుడు. అలొపతి ఆర్వేదం అన్ని గల్పి కొడ్తడు. ఎంతొ మందికి వైద్గం జేశిండు. ఇంక జేత్తండు. నేను పుట్టక ముందు అనుకుంట – రజాకార్ల లొల్లుల్ల, బాపు తను మందు జేశిన తాసిల్దారు నడిగి వో తుపాకి సంపాయించిండట ఎందుకైనా మంచిదని! గదే గిది. దీనికి లైసెన్సు సూత ఉంది. 
రజాకార్ల లొల్లి అయిపోయినంక మా బాపు షికార్కి బొయ్, పిట్టలను, కుందేల్లను, యేదులను కొట్క తెచ్చుడు మొదలు వెట్టిండు. ఇంతకు ముందు నేను బాపుతోటి మూన్నాల్గు సార్లు షికారికి బోయిన. 

బాపు తుపాకి బుజం మీద వెట్కొని, పెద్ద పెద్ద అడ్గులేస్కుంట పోతుండు. నేను యెంక సంచి వట్కోని ఉర్కుతున్న. తొవ్వల ఎవలెవలొ బాపుని మందలిత్తండ్రు. కొండ పోశడు గనవడి, ” ఏం పంతులు ! షికారికి వోతుండ్రా ? ” అని అడిగిండు. 
“అవ్ర పోశిగ ! అవ్ను గని శెర్ల శాపలేమన్న వున్నాయిర ?” అని బాపు వాడ్ని అడ్గిండు. 

” ఆ! శెర్లున్నయ్ ! గా లక్కోల్ల బాయిల సూత గింత గింత మొట్టలు వున్నయ్. పొయ్ రండ్రి ” అనుకుంట కొండ పోశడు ఎల్లిపోయిండు.

మే మడ్లల్ల వడి, యీదులల్ల వడి పోతున్నం. 

గింతట్ల బాపు, నడ్శేటోడల్ల ఒక్క మల్క ఆగి, ” అరేయ్ ! నువ్వెప్పుడన్న రొండు తల్కాయల పామును జూశినవారా ? ” అని అడ్గిండు. 
” లే! సూల్లేదు ” అన్న 
” అయ్తె సూడు . గదె రొండు తల్కాయల పాము ” అన్నడు బాపు. 

శాంతాడు పెట్టు దూరంల నల్లగ, దొడ్డుగ పండ్కోని వుంది పాము గెట్టు మీన. దాని తల్కాయెదొ! తోకేదొ! తెల్తలేదు. రొండేపుల ఒక్క తీర్గనే ఉన్నది. దాంకి ఇసముండది. కర్సినా మనిసి సావడు. దగ్గర్కి వొయ్ సూశిన. ” ఇగ వా! ” అనంగనె మల్ల నడ్సుడు వెట్టిన. 

నేన్ తల్కాయ లేపి ఒక్కపారి మొగుల్దిక్కుకు జూశిన. గువ్వలు, గోరెంకలు, కొంగలు, పాయిరాలు గూల్లల్లకు తిర్గి అత్తన్నయ్. శెట్ల నిండ ఆల్తన్నయ్. ” కీ! కీ! ” అని ఒక్కటె సప్పుడు. 

బాపు నడ్శేటోడల్ల మల్ల ఒక్క మల్క ఆగిండు. నేం సూత టక్కున ఆగిన. బాపు సప్పుడు జెయ్యకుంట, యీదులను సాటు జేసుకుంట, సాటు జేసుకుంట ఒక యీత మట్ట మీన తుపాకిని ఆనిచ్చి, కొమ్మల్ల గూసున్న గువ్వలకు సూటి వెట్టిండు. నేను దమ్మాప్కోని, బాపుని, తుపాకిని, గువ్వల్ను రెప్ప కొట్టకుండ సూత్తన్న. 

గింతట్ల బాపు ‘ ధన్ ‘ మన్నడు. గువ్వల్రొండు తపతప గొట్టుకుంట న్యాల మీన వడ్డై. నేనటు దిక్కు ఉర్కిన. నాకన్న మొదలె బాపు గువ్వల్ని దొర్కవట్టి , సంచిల ఏశిండు. వో ఈతాకు దెంపి సంచి మూతికి గట్టిక కట్టు గట్టిండు. సంచి నాకిచ్చిండు “పట్టుకోర” అని . నేన్ గట్లనె జేశిన. 

బాపు తుపాకిని మల్ల లోడు జేశిండు. ఇగ మేం మెల్లెమెల్లెగ లక్కోల్ల బాయి కాడ్కి బోయినం. అది పెద్ద మోట బాయి. అండ్ల సగం వడ లీల్లున్నయ్. ఇగ బాయి గడ్డ మీన కూసోని బాపు, లీల్ల దిక్కు సూసుడు వెట్టిండు. గింతట్ల వో బొమ్మె శాప లీల్ల మీన కచ్చి, గాలి దీస్కోని మల్ల లీల్లల్ల మునిగింది. ఒక్కొక్క శాప కిలో బరువు ఉంటది గావచ్చు. 

” సూత్తున్నావుర! ” అని అన్నడు బాపు. 

” సూత్తన్న బాపు! సూత్తన్న ! ” అని నేనన్న. 

బాపు దోతి, అంగి ఇడ్శి పారేశి, చిన్నపంచను గట్టుకున్నడు. తుపాకి లీల్లల్లకు సూటి వెట్టి కూసున్నడు. 

గింతట్ల ఇంకో బొమ్మె శాప మెల్లెగ లీల్ల మీన కచ్చింది. బాపు ‘ధన్ ‘ మన్నడు. శాప ఉడ్కు లీల్లు మింగి , క్యాల్ దప్పి తెల్ల బొత్తేస్కోని లీల్ల మీన ఎల్లెల్కల వడ్డది. బాపు తుపాకి ఆడ వారేశి, బాయిల దునికిండు. యీత కొట్టుకుంట బొయ్ శాపను దొర్కిచ్చుకున్నడు. మెల్లగ గడ్డపొంట, గడ్డపొంట దరి వట్టుకోని ఎక్కుకుంట మల్ల గడ్డ మీన కచ్చి శాపను సంచి లేశి బట్టలు దొడుక్కున్నడు. 

ఇగ మేం ఆడ్నుండి శింతామని శెర్వు కాడ్కి బోయినం. శెర్ల జిల్మలు మస్తుగున్నయ్. లీల్లల సగం మునిగిన తుమ్మ శెట్ల మీన కీ!కీ! అనుకుంట ఎక్కడ్నుంచో అచ్చి ఆల్తన్నయ్. శెట్టు కొమ్మలల్ల ఆటి గూల్లు గనవడ్తున్నయ్. గూల్లల్ల ఆటి పిల్లలు కీసు కీసు మని ఒకటే ఒర్రుతున్నయ్. బాపు మల్ల ఓ జిల్మకు సూటి వెట్టి ‘ ధన్ ‘ మన్నడు. అది కీ!కీ! అని రెక్కలు కొట్టుకుంట లీల్లల్ల వడ్డది. మిగిల్న జిల్మలన్ని ‘కెకెకె!’ అనుకుంట గాల్లెకు లేశినయ్. 

“దాన్ని తెత్తావుర !” అని బాపు నాతోని అనంగనె, నేను గట్లనె! అని అంగిడ్శి ఆడ వారేశి, నెక్కరు తోటె లీల్లల్ల దునికిన. యీత గొట్టుకుంట జిల్మ కాడ్కి వోతున్న. గింతట్ల ఒక్కపాలి నా కాల్లకేదొ సుట్టుకున్నట్టు అయింది. పానం గజ్జు మన్నది. ” నీరు గట్టెలా!? ఇంకేమన్న పాములా!?” లీల్లల్ల కాల్లు గట్టిగ కొట్టినాకొద్ది ఇంక కాల్లకు సుట్టుకుంటంది. కాల్లు గొట్టకుంటెనేమొ మునిగిపోతనాయె! ముంగల వోదమన్న యెంకకు అద్దామన్న నా వల్లైతలేదు. ఇగెట్ల! “అరె! గిది నాసు గావచ్చు ” అని గప్పుడు నాకనిపిచ్చింది. బాపు శెర్వు ఒడ్డు కాడ నిలవడి నన్నే సూత్తండు ,గని లీల్లల్ల నా కాల్లకేమైతందో గాయినకు సమజైతలేదు. ఇగ నేను ” ఓ బాపు! నా కాల్లకు నాసు సుట్టుకున్నదే ! ” అని లగాయించి ఒర్రిన. బాపు పరేశాన్ అయిపోయిండు. కొంచెం సోంచాయించి, ” అరెయ్! నీ ముంగల గడ్డున్నది సూడు! ఎట్లన్న ఆడ్కి బొయ్ గడ్డ మీన ఎక్కి కూకో!” అన్నడు. 

నాకు కడ్పులకెల్లి సలి వెట్టుడు మొదలైంది. పండ్లు టక టక కొట్టుకుంటున్నయ్. ఇగ ఎట్లనో ఉగ్గబట్టుకోని మెల్లమెల్లగ కాల్జేతులాడిచ్చుకుంట శెత్తోని నాసును తీశేసుకుంట, గడ్డకాడికి బోయి, గడ్డ మీనకు ఎక్కి కూకున్న. బాపు మల్ల ” గట్ల గట్ల గడ్డెంబడి లీల్లు తక్కువున్న జాగలకెల్లి యీడ్కి రా!రా! ” అని కీక వెట్టిండు. 
నేను బయపడుకుంట బయపడుకుంట గట్లనే మెల్లగ ఒడ్డు మీద్కి అచ్చి పడ్డ. బాపిచ్చిన శిన్నపంచెతోటి పెయ్ దుడ్సుకోని అంగి దొడ్కున్న. ఇగ మేం జిల్మను మర్శిపోయి ఇంటి మొకం బట్టినం. తొవ్వల బాపు ఒక్క మాట మాట్లాడలె! ఇంటి కచ్చినం. గప్పట్కే మా యమ్మ పెరట్ల నిలవడి పొయ్యినోల్లు ఇంకత్తలేరేంది” అని ఎదురు సూత్తంది. 

నేను లోపల్కి బొయ్, సంచి కింద దులిపిన. రొండు గువ్వలు,శాప తపుక్కున న్యాల మీన వడ్డయ్. ఇంక వాటి పానం పూర బోలె – గుడ్డి దీపం ఎల్గుల అటీటు మెసుల్తున్నయ్. 
అమ్మ ” ఆ! షికారి బాగనె చేస్కచ్చిండ్రు!” అనుకుంట నాదగ్గరి కచ్చి ” ఏందిర పోరడ ! నీ నెత్తి లాగు తడ్శినయ్ ! ” అన్నది.నేను జర్గిన కతంత జెప్పిన. 

ఇగ మా యమ్మ అందుకున్నది ” నీ షికారి పాడుగాను! ఎన్ని మల్కల జెప్పిన! పిట్టల్ని కొట్టద్దయ్యా! వాటి పిల్లలు అగాదం అయిపోతయ్ – గా పాపం మనకు సుట్టుకుంటది! అని. నువ్వింటవా! నీ శెటం నువ్వేనాయె! అట్టిగ పోరడు సచ్చిపోతుండె గద! ” అని బాపును తిట్టుకుంట , నన్ను మండుతున్న పొయ్ కాడ్కి దీస్కపొయ్ దాని ముంగల ఎచ్చగ కూకోవెట్టింది. తువ్వాలు దీస్కచ్చి నెత్తి దుడ్శింది. ” పొలగాడు బయపడ్డట్టున్నడు !” అని అనుకుంట జీడి గింజ తోటి జిష్టి దీసి దాన్ని పొయ్యి లేశింది. 
మా బాపు సప్పుడు జేత్తలేడు. ఊ! అంటలేడు, ఆ! అంటలేడు. మంచంల కూకోని ఎటో సూత్తండు. 


గీ కతయ్యి నాల్గు నెల్లయింది. బాపు మల్ల ఇగ షికారికి బోలె. ఏమనుకున్నడొ ఏమొ! వోనాడు తుపాకిని దీస్కోని కర్నారం బోయి, దాన్ని సర్కారుకు దఖల్ జేశి అచ్చిండు. నేను బడి కాడ్నుంచి గప్పుడే అచ్చిన. బజార్ల పోరగాండ్లు ఆడుకుంటున్న సప్పుడు ఇనవడ్తంది. గిర్న ఉర్కిపొయ్ ఇగ ఆల్లతోటి గల్సిన. 
---------------------------------------------------------- 
రచన - నాగరాజు రవీందర్, వాకిలి సాహిత్య పత్రిక 
---------------------------------------------------------- 

- ఏ.వి.రమణరాజు




Saturday 28 July 2018

Pranjali pabha (29-07-2018)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:


ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

‌సౌందర్య లహరి
(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)

ప్రక్షిప్త శ్లోకము __1

( సౌందర్య లహరి స్తోత్రం లో మూడు శ్లోకాలు ప్రక్షిప్త శ్లోకాలు గా 
ప్రచారంలో ఉన్నాయి)

"సమానీతః పద్భ్యాం _ మణిముకురతా మమ్బరమణిః
భయాదన్తర్బద్ద _ స్తిమిత కిరణ శ్రేణి మసృణః !
దధాతి త్వద్వక్త్రం _ ప్రతిఫలిత మశ్రాన్త వికచం
నిరాతంకం చంద్రాన్నిజ హృదయ పంకేరుహ మివ !!

ఈ శ్లోకం లో శ్రీదేవి ముఖ ప్రతిబింబ మహిమ ను స్తుతించారు.

అమ్మా! భగవతీ!ఆకాశానికి మణివంటివాడైన సూర్యుడు నీ పాదసేవ
కుడుగానూ , నీవు పాదములుం చే మణిదర్పణం గానూ ఏర్పడినవాడై
యున్నాడు. అమిత ప్రకాశ వంతమైన నీ ముఖాన్ని ౘూసి , అతడు భయపడి
తన వేయి సూర్యకిరణాలను పైకి ప్రసరింౘ నీ యకుండా తన లోనే అణౘు
కుంటున్నాడు. నీ కిరీటమందున్న చంద్రుడి చేత, తన హృదయంలో ని తామర
( నీ ముఖ ప్రతిబింబ ము ) ముడుౘుకొనకుండా వికాసము పొంది వెలుగు
ౘుండగా _ దానిని ధరిస్తున్నాడు.

సూర్యుడు శ్రీదేవి ముఖ పద్మాన్ని ధ్యానిస్తూ దేవీ పాదసేవను చేస్తున్నాడని
భావము. సూర్యుడు దేవీ పాదపీఠ రూపమైన మణిదర్పణముగా స్వీకరింప
బడ్డాడు. ఆ దర్పణంలో ప్రతిబింబించిన శ్రీదేవి ముఖ పద్మము, వికసించిన
సూర్యుని హృదయ పద్మము వలె ఉన్నది.

ఓం సర్వజ్ఞాయైనమః
ఓం సాంద్రకరుణాయైనమః
ఓం సమానాధికవర్జితాయైనమః
--((**))--


అధిక్షేప ప్రేమ లీల
అమ్మ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

కన్నుల నిండుగ వెలుగులు నింపి
 -కంటిలో కన్నీరు చూసిన కరిగిపోయేది అమ్మ

సతతము మమతల వెన్నెలను నింపి
 - చీకటిలోకష్టాన్ని తెల్పలేక బాధపడేది అమ్మ 

స్తన్యాలద్వారా పాలతో కడుపు నింపి
 - నిరంతరమూ పిల్లలకోసం తపించేది అమ్మ       

బాధను తెలపక బిడ్డలకు రకాన్నినింపి
 - ఎన్నడూ వీడని ఛాయవలె ఉండేది అమ్మ 

విషం చిమ్మేవారికి కూడా అమృతాన్ని నింపి
 - కాల ధర్మాలను తెలియ పరిచేది అమ్మ 

కష్టాలలో కూడా అందరిలో సంతోషాన్ని నింపి
 - ఆల్సట చూపక శక్తిని ధారపోసేది అమ్మ 

క్లిష్ట పరిస్థితిలో బిడ్డలకు మనోధైర్యాన్ని నింపి
 - మానవత్వాన్ని బ్రతికింప చేసేది అమ్మ  

భర్తకు సహకరించి బిడ్డలకు దీర్గాయువు నింపి
 - నిర్మలమైన మనస్సుతో కరుణించేది అమ్మ 

బిడ్డలపై దృష్టి ఉంచి, ఏకాగ్రత చూపి 
నిద్రను త్యాగమముచేసి, సంరక్షణ 
కోసం అమేషా తపించేది అమ్మ  
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

ఏమి చిత్రకల్పనయా విధాతా! 
సత్తు చిత్తు రాతలతో 
అయినావే మా నేత! ~ ఏమి ~ 

ఆ గాలిని ప్రాణముగా మాజీవుల కిచ్చావు 
ఈ భూమిని దుక్కి జేసి బువ్వ బుక్కమన్నావు 
ఆ గాలే చెలరేగితే గూడు చెదరిపోయేనే! 
ఈ నేల గుండెవిడితే బ్రతుకు సమాధయ్యేనే! ~ ఏమి ~ 

ఆ నీటిని జీవధారగా జేసి మనమంటివి 
ఈ నిప్పును దివ్వె జేసి వెలుగు నింపుకోమంటివి 
నీటిముంపు ముంచుకొస్తే కన్నీరే మా బ్రతుకు 
నిప్పురవ్వ భగ్గుమంటే బూడిదేరా మా తనువు ~ ఏమి ~ 

శూన్యమైన ఆకసాన నీటిమబ్బులుంచావు 
మబ్బుకరుగు వేళలలో మెరుపుతో మురిపిస్తావు 
ఆ గగనమే కదను తొక్కి పిడుగురాశి కురిపిస్తే 
పుడమితల్లి సంతానం పుడకలపాలే కదరా! ~ ఏమి ~ 

కలువలోన తలదాచి కూసునుంటే ఎట్లాగని 
సోమనాధుడడిగాడు బదులేదిరా బ్రహ్మన్నా? 
బూది కాని బుద్ధినిచ్చు నీ రాణిని భూమికంపి 
బూది కాని బుద్ధినిచ్చు ఆ వాణిని భూమికంపి 
సాయపడితినంటివా? స్వచ్ఛమైన నేతవురా! 

చిత్రచిత్ర కల్పనల విధాతా! 
సవరించని చట్టమురా నీవు వ్రాయు నొసటిరాత! 
--((**))--

నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము 
శ్లో === హినజాతిం స్త్రియం మోహా దుద్వహన్తో ద్విజాతయః 
కులాన్యేవ నయం త్యాషు స సన్తానాని శూద్రతాం ||
భావము === బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, వీరు కామోద్రకమున తక్కువ జాతి వారితో గూడి సంతతిని పోమ్దినచో వారి మొదటి కులము నశించి శూద్ర త్వము సిద్దించును. కావిన వీరు తక్కువ జాతి స్త్రీలతో కలియుఅతగాని, పెండ్లి చేసుకొనుట గాని శాస్త్రసంమతముగాదని భావము.
--((**))--


అధిక్షేప పేమలీల
జోల 
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ 
    
మనసూ మమత మారదు సుధామనో రమా 
- నిను జూడ మన సూఁగె  నిముసాన నృత్యమై           

తనువూ తపన మారదు సుఖాల సౌఖ్యమే   
- నిను జూడ తను వూఁగె - నిముసాన గీతమై

వలపూ వయసు మారదు వరాల మార్గమే   
- నిను జూడ నగె నింగి నెలవంక కాంతిగా

పసుపూ తెలుపు మారదు మనోరమా రమా     
- నిను జూడ బిలిచేను నిశి తార శాంతిగా 

పరువమ్ము మనకోసము సితార ఉంచగా 
- హరుసమ్ము మదిలోన ననుభూతి దల్చఁగా 

మరుమల్లి నవ నాడిరగిలే వయస్సె గా   
విరితోట హృదయాన ప్రియ నిన్ను దాఁకఁగా 

కనులందు కనువిందు సమరాశి ఉండగా      
- వరుసమ్ము క్షణమౌను - వదనమ్ము జూడఁగా 

నవరాగ మధు గారు మధు యంచు బిల్వగా   
- సరసాల సుధ గారు సకి యంచు బిల్వఁగా 

శ్రుతితోడ జత జేరి - ప్రియ గీతి బాడఁగా 
క్షితి మ్రోఁగె స్వర రాగ - శివ మంగళమ్ముగా 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

నత్కీరుడు… నిబద్ధతా 

సాహితీమిత్రులారా! 
శ్రీ కాళహస్తి మాహాత్మ్యంలో ధూర్జటి, నత్కీరోపాఖ్యానం ఆలంబనగా చేసుకొని … ఈ నాటికీ వర్తించే ఒక విషయంమీద అతని అభిప్రాయాన్ని వెలిబుచ్చేడని నేను భావిస్తున్నాను. 

స్థూలంగా కథ ఇది: 

పూర్వం దక్షిణదేశాన్ని పాండ్య రాజు పరిపాలించేవాడు. ఆ రాజుదగ్గర వంశపారంపర్యంగా వచ్చిన సరస్వతీదత్తమైన ఒక “శంఖపీఠం” ఉంది. దాని ప్రత్యేకత… దాని మీద కవులైనవారు ఎవరైనా కూర్చుంటే మరొక్కరు కూచుందికి అవకాశం కల్పిస్తుంది. అలా కల్పించలేదంటే, కూచున్న వ్యక్తి కవి కాదన్నట్టే లెఖ్ఖ. అటువంటి శంఖపీఠంపై కూర్చున్న అతని ఆస్థాన కవులలో అగ్రగణ్యుడు నత్కీరుడు. 

ఒకసారి ఆ రాజ్యంలో “ధాత కరువు” వంటి చెప్పలేని క్షామం వస్తుంది. వర్షాలు లేక, తిండిలేక ఆ రాజ్యంలోని ప్రజలు అల్లల్లాడుతుంటారు. ఆ రాజ్యంలో ఒక గ్రామంలోని ప్రజలందరూ వలస పోతుంటే, అక్కడ ఒక శివాలయంలోని పూజారి కూడా దేవునికి నమస్కరించి “స్వామీ! నీ సంగతి నువ్వు చూసుకో. కరువు తీరేక మళ్ళీ వచ్చి నీ సేవ చేసుకుంటాను” అంటాడు. దానికి శివుడు, “నేను నీ కొక పద్యం రాసిస్తాను. నువ్వు మహారాజు దగ్గరకి పోయి ఆ పద్యం చూపించు. నీకు వెయ్యి మాడలు బహుమానంగా ఇస్తాడు. ఈ కరువు తీరేదాకా పనికొస్తుంది. ఈ లోపున మంచి వర్షాలు పడి పరిస్థితి మామూలు స్థితికి వస్తుంది,” అని చెప్పి పంపిస్తాడు. 

రాజసభలో పద్యం వినిపించగానే నత్కీరుడు ఫక్కున నవ్వుతూ ఆ పద్యంలో “సింధు రాజకన్య కేశములు సహజ గంధము కలిగి ఉన్నాయన్న” మాటకు ఆక్షేపణ చెబుతూ, “ఇది తప్పు. ఇలా చెప్పకూడదు. ఆది కవిత్వ సంప్రదాయాలకి అనుగుణంగా లేదు. ఇలా రాయవచ్చునా” అని అనగానే, ఆ పూజారి చిన్నబుచ్చుకుని, మహానుభావులారా. ఈ పద్యం నేను రాసింది కాదు. ఈ మహారాజు మీద పరమేశ్వరుడు రాసి ఇచ్చేడు. ఇందులోని తప్పొప్పులు నిర్ణయించగలశక్తి నాకు లేదు నన్ను క్షమించండి” అని వెనుతిరుగుతాడు. 

వెనక్కి తిరిగి వచ్చిన పూజారిని ఈశ్వరుడు “ఏమయింది? ఉట్టి చేతులతో వచ్చేవు?” అని అడిగితే, ఈశ్వరుడి రాసిన పద్యాన్ని తిరిగి అప్పగిస్తూ, “స్వామీ, నిన్ను నమ్ముకుని రాజసభకి వెళితే, నిండు సభలో నా పరువు పోయింది. ఇంక ఏమిటి చెప్పమంటావు? అయినా, ప్రపంచంలో, ఎవరికైనా తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం వల్ల రాజగౌరవం దక్కుతుంది గాని పక్కవాళ్ళ జ్ఞానం వల్ల సమ్మానం రాదు గదా. నత్కీరుడివల్ల నేను పడ్డ దుఃఖము కరువుతో పడ్డ బాధకంటే అతీతమైనది. అయినా, నా అదృష్టం ఇలా ఉంటుండగా చివరకి నిన్నూ, నత్కీరుణ్ణీ నిందించి ఏమి లాభం? బిక్షమెత్తుకునైనా ఎలాగో ఒకలాగ ప్రాణం నిలబెట్టుకుని కరువు తీరేక మీ సేవ చేసుకుందికి వస్తాను. నాకు శలవు ఇప్పించండి,” అని వేడుకుంటాడు. 

దానికి శివుడు మనసు కరిగి, ” ఏమిటీ! నత్కీరుడు పద్యం తప్పుపట్టేడా? ఏదీ పద చూద్దాం ఆ తప్పేమిటో” అని పూజారిని తీసుకుని రాజ సభకు వెళ్ళి, 

“ఈ మహారాజు మీద నేను సాహిత్యసురభిళంగా పద్యం చెప్పి పంపిస్తే, ఎవడో నత్కీరుడట అసూయతో ఏదో తప్పుపట్టాలిగదా అని తప్పు పట్టేడట. ఏమిటి ఆ తప్పు? లక్షణమా? అలంకారమా? పదబంధమా? రసమా? ఎక్కడ తప్పుందో చెప్పమనండి?” అని నిలదీస్తాడు. 

దానికి నత్కీరుడు మునపటిలాగే తప్పు ఎత్తి చూపిస్తూ, “లోకంలో ఎక్కడైనా జుత్తుకి సహజమైన సువాసన ఉంటుందా? అలా ఉంటుందని అంటే ఎవ్వరైనా నవ్వరా?” అని సమాధానం చెబుతాడు. 

దానికి ఈశ్వరుడు ఈ మాత్రం తెలీదా అన్నట్టు, “నీకు తెలీదేమో!జుత్తుకి సహజమైన సువాసన లేకపోవడమేమిటి? పార్వతీ దేవి జుత్తుకి సహజమైన సువాసన ఉంది. తెలుసా?” అని ఉదాహరణ చూపించి సమర్థించుకోబోతాడు. 

అప్పుడు నత్కీరుడు,”పార్వతీ దేవికి ఉంటే ఉండొచ్చు. అంతమాత్రం చేత భూమి మీద స్త్రీలందరి జుత్తూ సహజ సువాసన ఉంటుందని చెప్పకూడదు. కోపం తగ్గు. దేవలోకంలో ఉన్న వస్తువులు భూమి మీద ప్రత్యక్ష ప్రమాణాలు కావుగదా.” అంటాడు. 

దానికి శివుడు అలిగి, పెంకిగా,”నే నెవ్వరో తెలుసునా” అన్నట్టు తన నుదిటిమీద కన్ను చూపిస్తూ ఒక హస్తవిక్షేపం చేస్తాడు. 

దానికి అంతకంటే పెంకిగా నత్కీరుడు “ఒక్క కన్నే కాదయ్యా.. నీ తలచుట్టూ కళ్ళున్నప్పటికీ, పద్యం తప్పుకాదని ఎవడూ అనడు. ఇక్కడ నీ మాయాప్రతాపాలు చెల్లవు,” అని అంటాడు. 

దానికి శివుడు రుద్రుడై “నువ్వు కుష్టురోగంతో బాధపడు, ఫో!” అని శపిస్తాడు. 

దానికి ఒక్కసారి తన హద్దులు తెలుసుకున్నవాడై, శివుడి పాదాలమీద పడి,”స్వామీ! పొరపాటయిపోయింది. పరమదయాళువివి నువ్వు. నాకు శాపవిమోచన మార్గాన్ని వివరించు,” అని వేడుకుంటాడు. 

అప్పుడు ఈశ్వరుడు శాంతించి, “కైలాస శిఖరాన్ని చూసినప్పుడు నీకు శాపవిముక్తి అవుతుంది,” అని అంతర్థానం అవుతాడు. 

జరిగినదానికి నత్కీరుడు విచారిస్తూ,”కవిత్వప్రమాణాలు కాపాడవలసిన భారాన్ని నేనెందుకు భుజాలకి ఎత్తుకున్నాను. ఈ శంఖపీఠంపై కూర్చున్న మిగతాకవులలాగే నేనూ నోరుమూసుకుని ఊరుకుంటే పోయేది గద. అనవసరంగా దేవునితో ఎందుకు వాదనకు దిగేను? ఈ కుష్టురోగాన్ని ఎలా భరించడం? ఎన్ని నదులు దాటాలి? ఎన్ని అడవులు తిరగాలి? ఎన్ని కొండలు ఎక్కాలి? ఎన్ని నిర్జనప్రదేశాల్లోంచి పోవాలి? ఇవన్ని దాటి నేను ఎప్పుడు కైలాస శిఖరం చూడగలుగుతాను? ఆ పేరు వినడం తప్ప ఎన్నడూ చూసి ఎరగనే” అని విచారిస్తూ ఉత్తరదిశగా బయలుదేరి వెళ్తాడు. 


శివుడు నత్కీరుణ్ణి నిలదీసిన ప్రశ్నల ద్వారా, మనకి కవిత్వానికి ఒక లక్షణం, అందులో కొన్ని అలంకారాలూ, పదబంధాలూ, ఉండడమే గాక, అది రసనిష్యందంగా ఉండాలని తెలుస్తుంది. నిజానికి కవిత్వం స్వీయానుభూతినో, శ్రుతపూర్వమైన అన్యుల అనుభూతినో, ప్రతిబింబిస్తూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నత్కీరుడి అధిక్షేపణ ద్వారా, మరొక సూక్ష్మవిషయం తెలుస్తోంది. కవులు తమ స్వీయానుభవాలని సాధారణీకరించేటపుడు, ఆ అనుభూతికి ఆలంబనమైన వస్తువు మరొకరి అనుభూతి పరిధిలో లేకపోవచ్చునన్న సత్యాన్ని గుర్తెరిగి ఉండాలి. వెనకటికి ఒక శ్రీమంతుడు “దానికేముంది, కోడుగుడ్డంత బంగారం ఎవరిదగ్గరైనా ఉంటుంది” అన్నాడట. అలాగ తన అనుభూతి అందరి అనుభూతిగా, ప్రతీదీ సామాన్యీకరించకూడదు. ఆ అనుభూతి ప్రకటన తీరు “Suspension of Disbelief” కి ఆస్కారం ఇవ్వకపోతే, కొత్తవస్తువుగురించి చెప్పినపుడు రసభంగమవుతుంది. 

ఈ నిబద్ధత ఒక్క సాహిత్యంలోనే కాదు, ప్రతివారికీ కొన్నికొన్ని విషయాలపట్ల తమకి తాము ఎన్నుకున్న నిబద్ధత ఉంటుంది. ఆ నిబద్ధతకి పరీక్షాసమయం వచ్చినపుడు నిరూపించుకోకపోతే అది కేవలం ఆదర్శంగా మిగిలిపోతుంది. ఆ సందర్భం మన యజమానితోనో, మన పై అధికారితోనో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో రావచ్చు. శివుడి పద్యంలోని తప్పుని ఎత్తిచూపకుండా శంఖపీఠిమీది ఇతరకవుల్లా “నాకెందుకు?” అని తప్పించుకోవడం సాహిత్యంపట్ల వాళ్ళ నిబద్ధత లేకపోవడాన్ని సూచించినట్టు, పరీక్షాసమయంలో మన ఆదర్శానికి దన్నుగా నిలబడకపోవడం మన నిబద్ధతా రాహిత్యాన్ని సూచిస్తుంది. అయితే తప్పుని ఎత్తి చూపించేటప్పుడు, వ్యక్తి తన పరిధుల్నీ, పరిమితుల్నీ మరిచిపోకూడదు. ఒక్కొక్కసారి, వాదనలో మనం గెలిచామన్న సంతోషం (లేదా అహంకారం) మనచేత కొన్ని దురుసు మాటలు మాటాడిస్తుంది. దానివల్ల కొన్ని అనర్థాలు ఎదురౌతాయి. అటువంటి బలహీనతలకు మనం లోనుకాకూడదు. వాదనలో గెలుపు వ్యక్తిమీద గెలుపు కాదు. ఆ సందర్భంలో గెలుపు అన్నివేళలా మన గెలిచినట్టు కాదు. వాదనలో విభేదం ఒక విషయంలో అభిప్రాయభేదం తప్ప వ్యక్తులతో విభేదం కాదు. ఈ సున్నితమైన విషయాలు చాలా స్పష్టంగా మనకి అవగాహన అయి ఉండాలి. 

మరొక్క విషయం, వాదనలో మనం ఓడిపోయినపుడు, చాలా ఉదాత్తంగా మన అపజయాన్ని అంగీకరించాలి తప్ప, శివుడిలా ఆ సందర్భానికి చెందని మన ప్రత్యేకతలూ, ప్రతాపాలూ చూపించకూడదు. అదే పని మన వాదో, ప్రతివాదో చేసినపుడు, అతను తన అపజయాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తించి, హుందాగా అక్కడితో ఆ వాదనని సమాప్తం చెయ్యాలి. లేకపోతే, సందర్భం గాడి తప్పుతుంది. We should allow the defendant to realize and digest his defeat; and, we should also know, that it takes time. We shall also behave the same way given our roles are reversed. 

కవిత్వం ద్వారా వ్యక్తిత్వాలని ఉదాత్తం చేసుకోలేకపోతే, కవులకీ సామాన్యులకీ తేడా ఏమిటి? 


(పద్యాలు చదవాలనుకుంటున్న వాళ్ళకి మచ్చుకి కొన్ని: 

దానికి నవ్వుచు నృపసభ 
లో నత్కీరుండు పలికె “లోకము నగదే 
పూనుకొని సహజ గంధము 
వేనలికిం గలదటన్న వేయి దెరగులన్!” 

“తప్పిది, చెప్పరాదు, కవితా సమయంబున కొప్పుగాదు, నీ 
విప్పగిదిన్ రచింప దగునే?” యన, విప్రుడు చిన్న వోయి, “నా 
కప్పరమేశ్వరుండు వసుధాధిపుపై రచియించి యిచ్చినా, 
డొప్పును దప్పు నేనెరుగ, నుత్తములార!” యటంచు గ్రమ్మరన్. 

వచ్చి పార్వతీసు వంక కనుంగొని 
అతని పద్య మతని కప్పగించి 
నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు 
చెడితి ఉన్నకథలు వేర చెప్పనేల? 

“తానెరిగిన విద్య నృపా 
స్థానములో నెరపంగ కీర్తి సమకూరుంగా 
కే నరునకు బరవిద్యా 
ధీనత భూపాల సభల దేజము గలదే?” 

“నీ మాట నమ్మి పోయిన 
నా మోసము జెప్పనేల? నత్కీరునిచే 
నే మాట పడ్డ దుఃఖము 
క్షామ వ్యధ కొలది గాదు, సద్భక్త నిధీ!” 

అని మరియు నిట్లనియె.. 
నా భాగ్యం బిటులుండగా దుది నిను నత్కీరునిం దూరగా 
నే భావ్యం? బిక జాలు, నిక్కరవుచే నిట్లైతి నెందైన గా 
నీ భైక్షంబున గుక్షి బ్రోచుకొని, దీనిం దీర్చి నేవత్తు, దే 
వా! భద్రంబగు నీకు, నన్ననుపవే?” యన్నం గృపా మూర్తియై. 

కట కట! యన్నత్కీరుం, 
డట! కవితయు దప్పు వట్టె నట! యటు పదమీ 
యెటువలెనో తెలిసెద?” నని, 
నిటలాక్షుడు వచ్చి కుంభినీపతి సభలోన్. 

ఈ రాజన్యునిమీద నే కవిత సాహిత్యస్ఫురన్మాధురీ 
చారుప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి న 
త్కీరుండూరక తప్పువట్టెనట యేదీ లక్షణంబో,అలం 
కారంబో,పదబంధమో రసమొ చక్కంజెప్పుడాతప్పనన్. 

అనవుడు, నా నత్కీరుడు 
మునుపటి వలె దప్పటన్న ముక్కంటియు వా 
ని కనియెన్, “గిరితనయా 
ఘన కచభారంబు సహజగంధం” బనుచున్. 

“అగజకు నైనం దగు, నిల 
మగువలకుం దగదు, మాను మత్సరమింకన్, 
గగన ప్రసూన వాదము 
జగతిం బ్రత్యక్షమునకు సరి యన దగునే?” 

“లూలామాలపు మాటలు 
చాలు” ననిన నలిగి, తన నిజంబగు రూపం 
బాలోన జూపవలె నని, 
నీలగ్రీవుండు నిటల నేత్రము జూపన్. 

“తల చుట్టువార గన్నులు 
గలిగిన బద్యంబు దప్పు గాదన వశమే 
వల దిచ్చట నీ మాయా 
విలసనములు పనికి రావు విడువు” మటన్నన్. 

శపియించెం బ్రతి భాషల 
గుపితుండై రుద్రుడతని “గుష్ఠ వ్యాధిం 
దపియింపు” మనుచు దానికి 
నపరిమిత భయమ్మునంది యతడిట్లనియెన్. 

“స్వామీ ద్రోహము జేసితిం, దెలుపవే శాపాంత ముద్యత్కృపా 
ధామా! నా” కనుచున్ బదాబ్జముల మీదం బడ్డం, ఆ భక్త ర 
క్షామందారుడు శాంతి బొంది యనియెం “గైలాస శైలంబు గం 
టే మానుం బద” మన్న, నందులకు దా డెందంబునం గుందుచున్. 

“ఈ కవితాభి మానము వహించితినేటికి? శంఖపీఠిపై 
నీ కవులున్నయట్లు వసియింపక దేవునితోడ నేల చా 
ర్వాక మొనర్చితిం? గడు భరంబగు కుష్ఠరుజా విషాద మే 
నే కరణిన్ ధరింతు? నిక నెన్నడు చూచెద వెండి గుబ్బలిన్?” 

ఎన్ని మహానదుల్, వనములెన్ని, గిరీంద్రము లెన్ని బోయవీ 
ళ్ళెన్ని, మృగంబులెన్ని, జనహీనములైన పథంబులెన్ని నే 
నిన్నియు దాటి ఏ కరణి ఈశ్వరు శైలము చూడబోయెదన్ 
కన్నదిగాది విన్నయది గాని సదాశివ ఏమి చేయుదున్. 
---------------------------------------------------------- 
రచన- నౌడూరి మూర్తి, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో 
--------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు