Wednesday 28 September 2016

*శ్రమకు ఫలితం లేదు,

 ఓం శ్రీ రామ్  - ఓం శ్రీ కృష్ణ
సరేజానా సుఖినోభవంతు

*శ్రమకు ఫలితం లేదు,
శ్రమకు ఫలితం లేదు, తెలివి కీ పని లేదు
కళ్లప్పగించి చేసే పనినీ తెలుప లేనిది కవిత్వం కాలేదు  

పకృతి ఏమి శ్రమ పడుతుందని అంటున్నారు
సూర్య చంద్రులు ఏమి శ్రమ పడుతున్నారంటున్నారు
కాల చక్రం ఎలా తిరుతున్నదో చెప్పమంటున్నారు   
దేవుణ్ణి చూపమని వాదన చేసే వారున్నారు

కానీ కాలు కదపకుండా, నడుం వంగ కుండా
ఈ కలియుగంలో జీవనం నడుపుతున్నారంటున్నారు
ధన మదం తో,  శ్రమను దోచుకుంటూ కాయ కష్టాన్ని
విలువ ఇవ్వ కుండా, యంత్రములను ద్వారా
పనులు సాగింది శ్రామికుల, కర్షకుల పొట్ట కొట్టుతున్నారు

మట్టి విలువను పెంచే, ఇష్టా రాజ్యాన్ని పట్టించుకోలేరు
కడుపు కోత గుర్తించక కష్ట పెట్టే వారిని పట్టించు కోరు
కోటీశ్వరుని వదిలి, బీదవారిని ఏడిపిస్తున్నారు      
వితండ వాదులకు, స్వార్ధ పరులకు  అవకాశాలు
మెరుగు, కష్ట జీవులకు శ్రామికులకు కష్టాలు
కళ్ళల్లో సుడులుగా తిరుగు ఏమిటి ఈ లోకం      

ఎప్పుడు  పోవును  స్వార్ధపు పోరాటాలు
ఎప్పుడు పోవును  రాజకీయ కుతంత్రాలు
ఎప్పుడు పోవును మనుషుల మధ్య భేదాలు
ఎప్పుడు పోవును ధనికుని అహంకార మాటలు
 
శ్రమకు ఫలితం లేదు, తెలివి కీ పని లేదు
కళ్లప్పగించి చేసే పనినీ తెలుప లేనిది కవిత్వం కాలేదు 

--((*))-- 

నందా - షోడశి

ఈ వృత్తము వాగ్వల్లభలో పేర్కొనబడినది. ఇది కూడ షోడశి ప్రత్యేకతయే. ఇందులో పాదమునకు నాలుగు షణ్మాత్రలు. గానయోగ్యమైన వృత్తము ఇది. క్రింద నా ఉదాహరణములు -

నందా - త/య/స/భ/స/గ UUII UUII - UUII IIUU
16 అష్టి 15565

ఆనందపు టాకాశము - నందుంటిని వెలుఁగై నే
నానందపు టంభోనిధి - యందుంటిని మణియై నే
నానందపు టారామము - నందుంటిని విరియై నే
నానందపు టాకారము - నందుంటిని లలియై నేన్

నీవే గద నా పున్నెము - నీవెగద సిరి లాలీ
నీవేగద నా తారక - నీవేగద శశి లాలీ
నీవేగద నా డెందము - నీవేగద లలి లాలీ
నీవేగద నా సర్వము - నీవెగద వనమాలీ

ఏమో మది నీకై యిట - నిట్టుల్ బ్రియ తలపోసెన్
ఏమో హృది నీకై యిట - నిట్టుల్ బ్రియ చలియించెన్
బ్రేమమ్మన నిట్లుండునె - ప్రీతించఁగ నిటులౌనే
రా ముందుగ నా మానస - రాసమ్మున నటియించన్
 

Monday 26 September 2016

నీ ముఖ బింబాన్నిమరువ లేను

 ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ 

 

యత్నం నా యజ్ఞం 

మొసలి నోటనుబడ్డ కరిరాజు మొరలిడగ 
బిరాన పరగెత్తి బ్రోచావు, వరదుడవు! 
అరుపులే వినబడున? ఆర్తి కనబడదా? 
ఏమాయె నీ కరుణ? ఎందుకీ జాగరణ? 

ముదుసలిచ్చిన పండ్లు ముదమార తిన్నావు, 
యెదలోన చోటిచ్చి ఆదుకున్నావు! 
నా కర్మఫలములు ఇంక పండనే లేదు, 
పచ్చి కాయలు స్వామి, నీకెట్ల పెట్టమంటావు? 
పాదాల చెంతనే చిత్తాన్ని నాటాను, 
పందిరై నీవుంటే పరిపక్వమౌతాను, 
ఆత్మ అర్పణ చేసి సంతృప్తి పడతాను! 

ఊగు సాయము సేయు ఉడుతనే గమనించి 
ఆదరించానంటూ చేవ్రాలు ఇచ్చావే! 
నా లోన కదలిక కనిపంచదా స్వామి? 
రాత మార్చను రాకుంటివిదియేమి? 

అటుకులిచ్చిన వాడే ఆప్తుడని అంటే, 
అదేం కుదరదు, ఒప్పుకోను, నేనూ నీతో 
దాగుడుమూతలాడుతూ దారి తప్పాను! 
కాలం కళ్ళు కప్పి నీనుండి వేరుచేసింది, 
కలి చేతుల్లోకి కర్కశంగా విసిరివేసింది! 
దూరమై విలపిస్తున్నాను, 
చేరువవ్వాలని తపిస్తున్నాను! 

నాకు తెలిసిందొకటే వేదం, ఆర్తి నాదం! 
నాకు తెలిసిందోకటే మంత్రం, హరే రామ, హరే కృష్ణ! 

అర్థం చేసుకో తృష్ణ!



ఓంకారంబతి సుందరం
బదియె వేదోపాంగ సారంబుగా,
ప్రాకారంబులవే
దిశాంతములుగా రాజిల్ల మోదంబుగా,
శ్రీకారంబగుచున్
శుభాలనిడు నిశ్శేషా విశేషంబుగా,
ఆకారంబులు లేని
భావమగుటన్, ఆదివ్య మంత్రంబుగా!
29/9 నా పాట 

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 
నీ చిరు దరహాస మాటలను మరువ లేను

నా మదిలో నీ ఉనికిని విడువ లేదు
నీ దర్శన కోరే నా మనసు వేదన తగ్గ లేదు
నీ ఒక్క ఓదార్పు కోసం జీవిస్తున్నాను
నా బ్రతుకులో అనుక్షణం నీకోసం
అన్వేషణా, ఆరాధనా తప్పుట లేదు  

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 

నీ వెక్కడున్నావో తెలియని భ్రమలో ఉన్నాను
నీ కొరకు సందిగ్ద మనస్సుతో తిరుగు తున్నాను 
నీ కొరకు మరణ శాసనాన్ని ఆహ్వానిస్తున్నాను
నీ కొరకు ప్రేమ తపస్విగా మారి యున్నాను

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 

ఇప్పుడు నాకు పంచ భూతాలు ఆప్తులు
తరువులు నాకు దోస్తులు

చరిత్రలో అల్లన మెల్లన వలపులు
చల్లని వెచ్చని కలిపే హృదయం నీది
చీకటి వెన్నెలలో మరిపించే
రసిక రాసకేళి మనసు నీది
పులకించే కనులతో వెదికే
కలలు పండించే సహృదయం నీది

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 
ఈ మట్టిలో కలిసే లోపు నేను తెలిపే
నిజం తెలుసుకో, నాకోసం ఒక్క కన్నీటి
చుక్క రాల్చు, అంతకన్నా నేను
ఏమి కోరేదిలేదు, నేను వ్రాసిన
ప్రేమ సుఘందాని స్వీకరిస్తే చాలు   

నీ ముఖ బింబాన్నిమరువ లేను
నీ అమాయకపు చూపులు వదల లేను 


**ఎవరు, ఎవరన్నారు .. నాకు తెలివి లేదని

ఓం శ్రీ రామ్  - ఓం శ్రీ కృష్ణ 


28/9  నేటి నా పాట

నాన్నా నీకు ఏమీ తెలియదు అన్న మాటకు  

ఎవరు, ఎవరన్నారు ..  నాకు తెలివి లేదని
మంచి- చెడు మధ్య నలిగి పోతున్నాని
ఈ వయసులో పనికి రారన్న ...  వారితో 
అంటాను నన్ను ఉపయోగించు కోలేని
వారే ..  చాతకాని వా .... రని

విరక్తిలేదు మధువు త్రాగుతున్నా
ప్రపంచాన్ని చుట్టివచ్చే శక్తితో ఉన్నా 
కడలిని ఈదే ధైర్యంతో బ్రతుకుతున్నా
నా ఆలోచనలతో ప్రజలకు సేవలు చేస్తున్నా

ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని

కవితా శక్తితో సంతోషాన్నిఅందిస్తున్నా
పకృతి బట్టి కష్ట సుఖాలు హెచ్చరిస్తున్నా     
నాడిని బట్టి రోగులకు మందు లిస్తున్నా
సేవా పదంలో వయసును చూడక సేవ చేస్తున్నా

ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని

గాలిలా ప్రజలలో స్వాసగా ఉంటున్నా
తరువులా ఒంటరినై సహకరిస్తున్నా
మనసంతా ప్రేమ నింపుకొని జీవిస్తున్నా
స్త్రీలను అగౌరపరిచే వారిని ఎదిరిస్తున్నా

ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
మంచి చెడు మధ్య నలిగి పోతున్నాని
ఈ వయసులో పనికి రారన్న వారితో 
అంటాను నన్ను ఉపయోగించు కోలేని
వారే చాతకాని వారని
వారే చాతకాని వారని
వారే చాతకాని వారని
ఎవరు, ఎవరన్నారు నాకు తెలివి లేదని
--((*))--

Sunday 25 September 2016

కుంభవృష్టికి సహాయం చేద్దాం - సహకరించుదాం ***


ఓం శ్రీ రామ్      ఓం శ్రీ రామ్     ఓం శ్రీ రామ్ 

సర్వేజనాసుఖినోభవంతు
*కుంభవృష్టికి సహాయం చేద్దాం - సహకరించుదాం

కుంభవృష్టి హోరును - ఉరుము తున్న ప్రకృతిని
దారి ఎదో తెలుసుకోలేని ప్రాణిని - ఎవరు ఆపగలరు

నింగినందు ఒకవైపు మేఘ మాల - మరోవైపు కాంతి
రక్తం తో మరిగే ప్రాణిని - కవితా శక్తితో ఎవరు ఆపగలరు

వానను దోసిల్లతో పట్టు కుంటాం - నీటి ఉరవడిని ఆపలేం
ఉరుములు తో వచ్చే పిడుగు జారటం - ఎవరు ఆపగలరు

కారు చీకట్లో పొద్దు తెలియని స్థితిలో వానలో చిక్కన ప్రాణులను
కూకటి వేళ్ళతో లేచే చెట్లనుఁ, పక్షములను - ఎవరు ఆపగలరు

భారం బరువుగా మారినప్పుడు, హృదయం విరిగి నప్పుడు
బరువుని మోసే, శక్తి హృదయానికి - ఎవ్వరు ఇవ్వగలరు   
   
వాన చినుకు, అన్నం మెతుకు, మనిషి బతుకుకు తోడు రాక
నీరు నిప్పు నింగి గాలి నేల బాధపెట్టకుండా - ఎవ్వరు ఆపగలరు

మనసు మసక చీకటిలో చిక్కి వెలుగు కోసం వెంపర్లాడుతుంటే
వానలో ఆత్మీయత తోడు లేక ధీన స్థాయిని - ఎవరు ఆపగలరు   

పువ్వుల పరిమళాలు ఎడారికి - వెన్నెలంతా అడవికి మారినట్లు
మనిషి నోరువిప్పి పలికినా దిక్కులేని స్థితిని- ఎవరు ఆపగలరు  

యదార్ధం తెలుసుకున్న రాజకీయం - రాజీ పడి కన్నీరు కార్చుట
వాగ్దానాల ఒరవడిలో ధనాన్ని ఖర్చు చేయటం - ఎవరు ఆపగలరు

అందుకే నేను అంటాను చేయి చేయి కలుపుదాం - సహాయం చేద్దాం
మానవతా దృక్పధంతో వర్షాల్లో  చిక్కిన వారిని రక్షించి కాపాడుదాం

రక్షించే గుణాన్ని ఎవ్వరూ ఆపలేరు - స్నేహాన్ని ఎవ్వరూ ఆపలేరు
ప్రేమను పంచే, సహకరించే ఆర్ధిక వనరుల సహాయాన్ని ఆపలేరు

వానల్లో చిక్కిన వారికి  సహాయం చేయు లక్ష్యం ఎవరు ఆపలేరు


దయచేసి ఈ కవిత మీకు నచ్చి నట్లైతే ప్రేమతో "షేర్ చేసి "
వరదబాధితులకు సహాయ పడగలరని ఆశిస్తున్నాను 
 --((**))--

Friday 16 September 2016

* కార్తీకమాసంలో వెలుగు

 ఓం శ్రీ రామ్ - శ్ర మాత్రేనమ:
సర్వే జనాసుఖినోభవంతు


శ్లో|| న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్|
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్||

కార్తీక మాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరియైన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తీకమాసములో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు విశేషఫలప్రదములు.

అటువంటి కార్తీక మాసము పాడ్యమి (31-10-2016) మొదలు, అమావాస్య (29-11-2016) వరకు ముప్పైరోజులు "
కార్తీకమాసం అత్యంత విశేషవంతమైనది. శివకేశవులిద్దరికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలకన్నా విశిష్టమైన ఈ కార్తీకమాసం అధికఫలదాయకమైంది.

కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ కార్తీక మాస విశిష్టతను గూర్చి, వేద వ్యాసమహర్షి తన శిష్యుడైన సూతునికి, సూతముని శౌనకాది ఋషులకు తెల్పాడు.

పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి, అవసరమైన ద్రవ్యానికై వశిష్ఠమహర్షి, జనకమహారాజును అర్థించగా, జనకమహారాజు అందుకు అంగీకరించి, సంవత్సరంలోని సర్వమాసాల కంటే కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతుంటారు కదా! అయితే ఆ సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని తెలియజేయమంటాడు. అప్పుడు వశిష్ఠుడు విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఇట్టి జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తీకస్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవికాదు. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన ఆశ్వమేధ ఫలాన్ని పొందుతారని వివరిస్తాడు.

స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తీకమాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణ్యాలయంలోగానీ యధాశక్తి దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ, శివలింగసన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయని కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడుగునా చేసినవాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పది, పదకొండు అధ్యాయాలను పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారని, తులసీదళాలతో, తెలుపు లేక నలుపు గన్నేరుపూలతోగాని శ్రీమహావిష్ణు పూజను చేస్తారో, వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారని, కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, పద్దెనిమిది పురాణాలలో ఏదైనా సరే ప్రవచించితే సర్వకర్మబంధ విముక్తులవుతారని వశిష్ఠ వచనం. వేదశాస్త్ర పురాణాలన్నీ మనకు అనేక ధర్మసూక్ష్మాలను అందిస్తున్నాయి.

ఈ ధర్మసూత్రాల వలన మనకు కొన్ని సమయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ, స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తుంటాయి.
పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి.

కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్రదర్శనానంతరం భోజనం చేస్తూ - ఆ రోజంతా భగద్ద్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తీకపౌర్ణమినాడైనా నక్తములున్నా పుణ్యమే. కార్తీకమాసమంతా తెల్లవారు ఝాముననే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీకస్నానం.

కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తీకమాస వ్రతాన్ని తులాసంక్రమణదాదిగా గాని, శుద్ధపాఢ్యమి నుండి ప్రారంభించాలి. ఈ మాసంలో వస్త్రదానం, హిరణ్యదానం, సువర్ణదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు పొందడమే కాకుండా, తేజస్సు , యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి సౌభాగ్యాలు కలుగుతాయి.

ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.

ఈ కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టదాయకం.

జలంధరుని భార్యయైన బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తలసి వృక్షాలు అవిర్భవించాయి. సరస్వతి - ఉసిరి రూపము, లక్ష్మీ - మాలతి రూపము, గౌరి - తులసి రూపంగా వెలసినారు.

కార్తీకమాసం ద్వాదశి రోజున 'తులసి' వృక్షసన్నిధిలో దీపప్రజ్వలనం చేసి, "నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్యస్సద్వ సంపత్ప్రదాయినీ" అంటూ ధ్యానం చేస్తూ శక్తి శ్రద్ధలతో తులసిదేవిని పూజించాలి. "ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే - ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీమ్‌ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురుసర్వదా" అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి, ఉసిరి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది.

ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరిపూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తీకమాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని, కార్తీక మహాత్మ్యాన్ని వినినా - పారాయణ చేసినా, సకల పాపాలు నశించిపోతాయని శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీకమహాత్మ్యం ద్వారా తెలుస్తుంది. ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్దలతో హరిహరులను ఆరాధిస్త్రే సమస్త శుభాలు కలుగుతాయి.
కార్తీకమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజామున నదీతీరంలోగానీ, చెరువులు, కొలనులు, బావుల వద్ద గానీ స్నానం చేయాలి. స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయమః, ఓం ప్రభాకరాయమః, ఓం అచ్చుతాయమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆర్ఘ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి.

కార్తీకపౌర్ణమి:
కార్తీకపౌర్ణమి పవిత్రమైనది. ఆ రోజు చేసే స్నానం, దానం, హోమాల వలన అనంతమైన పుణ్యం వస్తుందంటారు. ఆ రోజు గంగాస్నానం చేసి సాయం సమయంలో దీపారాధన చేయాలి. ఆ రోజు చేసే దీపారాధన వలన పది యజ్ఞాలు చేసిన ప్రతిఫలం పొందవచ్చు. కార్తీకమాసంలో వ్రతం ఆచరించి సత్యనారాయణ కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావి చెట్టు, తులసిచెట్టు ఈ మూడింటో ఎక్కడో ఒక చోట దీపారాధన వెలిగించాలి. కాశీలో ఈ రీతిని దేవదీపావళీ రూపంలో జరుగుతుంటాయి. కార్తీక పౌర్ణమి చేసి జాగరణ చేస్తే కోరుకున్నవన్నీ నెరనేరతాయని చెబుతారు.

దీపారాధన:
పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాదారణంగా కృత్తిక సక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. తిధి కన్నా నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరుకూడా ఉంది. పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి.అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే పుణ్యమని అంటారు. దీప దానం చేయాలనుకునే వారు పత్తితో స్వయంగా వత్తులు చేసుకోవాలి. బియ్యంపిండి లేదా గోదుమపిండితో ప్రమిదలు చేసిన అందులో ఆవునెయ్యితో తాము చేసిన వత్తులు వేసి వెలిగించాలి. బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలలో శివునిని పూజించడంతో పాటు ఉపవాస వ్రతాలు చేస్తే మంచిది. ఈ నెలలో వచ్చే అమావాస్య నాడు దేవాలయాలలో రకరకాల దీపారాధనలతో అలంకరిస్తారు. ఎవరు ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం వస్తుందని ప్రతీతి. కార్తీకమాసంలో వెలిగించే దీపాలను దర్శించడం వలన మనుష్యులతో పాటు సమస్త జీవరాసులకు పునర్జన్మ ఉండదని పురాణాల్లో ఉంది. దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని నమ్ముతారు. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు నశిస్తాయంటారు.

దీపప్రాముఖ్యత:
భారతీయ సాంప్రదాయంలో దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించడం మన సాంప్రదాయంతో జ్ఞానానికి సాంకేతికంగా దీపాన్ని చెబుతారు. ఆలయాల్లోనే కాకుండా గృహాలలో కూడా నిత్యం దీపారాధాన చేయడం ఎంతో కాలంగా వస్తున్న ఆచారం. తొలిసంధ్య నుండి మలిసంధ్య వరకు ఏ ఇంటిలో దీపం వెలిగితే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. సృష్టి, స్థితి, లయల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాన్ని త్రిముర్తులకు ప్రతీకగా పేర్కొంటారు. దీపంలో కనిపించే నీలకాంతి విష్ణుమూర్తికి,తెల్లనికాంతి పరమశివుడికి, ఎరుపు బ్రహ్మదేవునికి అర్దంగా చెబుతారు. అలాగే దీపకాంతి విద్యా, ఐశ్వర్యాలను ప్రసాదించే సరస్వతి,లక్ష్మిదేవిలకు ప్రతీక. భగవంతునికి సమర్పించేషోడశోపచారాలతో దీప సమర్పణ ఒకటి. జ్యోతి స్వరూపంగా పిలువబడే దీపం సిద్దిశక్తులను ప్రసాదిస్తుందని చెప్తారు.

కార్తీక మాస ప్రాధాన్యత :
కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.

వనభోజనం: కార్తీకమాసం అంటేనే వనబోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీ మహావిష్ణువుని ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహపంక్తి బోజనాలు చేయాలి.

కార్తీకమాస వ్రతాలు:
అఖండమాస సౌభాగ్యవ్రతం గురించి ముందుగా తెలుసుకుందాం... వివాహితులు ఈ అఖండ సౌబాగ్యాలను చేస్తారు. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రునికి ఆద్యం ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కార్తీక చతుర్థశి నాడు చేసే ఈ వ్రతంలో స్త్రీలు శివపార్వతులను కార్తీకేయుని, గౌరీదేవిని పూజించాలి. పాండవులు వనవాసం చేసే రోజులలో అర్జనుడు ఇంద్రకీలాద్రిపై తపస్సుచేయడానికి వెళ్లాడు.ఎంతకాలమైనా తిరిగి రాలేదు. అర్జునుడు రాకపోవడానికి కారణాలు తెలిపాక ద్రౌపది ఎంతో బాధపడింది. అర్జనుడు తిరిగి రావాలంటే సౌభాగ్యవ్రతం చేయాలంటూ కృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతమహాత్యం, వ్రతవిధానం వివరించాడు.

గోవత్స ద్వాదశి ఉత్సవం:
ఈ మాసంలో వచ్చే కృష్ణ ద్వాదశిన గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజు వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేయాలి. రోజుమొత్తంమీద ఒక్క పూట భోజనం చేయాలి.

గోత్రి రాత్రి వ్రతం:
ఈ వ్రతాన్ని కార్తీక కృష్ణాత్రయోదశనుండి అమవాస్య వరకు చేస్తారు. గోవర్దునికి రెండు వైపులా రుక్ష్మిణి, సత్యభామలు, బాలచంద్రడు, యశోద తదితర ఫోటోలు పెట్టి పూజించి, తదుపరి గోమాతను పూజంచాలి. తెల్లవారుజామున లేచి స్నానంచేసి గాయిత్రి మంత్రంతో 110 పిడికిళ్లు నువ్వులను ఆహుతిఇచ్చి వ్రతాన్ని పూర్తిచేయాలి. కార్తీక మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుదభ్రిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియః శివః శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును.

ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్ధన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి.

విష్ణు సహస్రనామ పారాయణం:
తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుదభ్రిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతౄఎష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. కార్తి్తక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం.

గౌరీదేవిని పూజిస్తే :
ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనవి.

చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగకంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం.కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం.
--((*))--



కార్తిక పురాణం - 7 వ భాగం

వశిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీక మహాత్మ్యమును యింకా చెప్పదను సావధాన మనస్కుడవై వినుము. ఈమాసమందు ఎవడు పద్మములచేత పద్మములవంటి నేత్రములు గల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్యనివాసము చేయును. భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. మారేడు దళములతో సర్వ వ్యాపకుడయిన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. భక్తిో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లునశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టుక్రింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీకమాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువానియొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో గూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్ామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. హరికి అరటి స్తంభములతోగాని, పుష్పములతోగాని, మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుండును. ఒక్కమారయినను హరిముందు దండప్రణామమాచరించువారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు. హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరుతో కూడా వైకుంఠమునకు బోవుదురు. స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి చలితో వణుకువానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందును. విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. నల్లనివిగాని, తెల్లనివిగాని అవిశపువ్వులతో హరిని పూజించిన యెడల పదివేల యజ్ఞములు చేసిన ఫలము గలుగును. బృందావనమునందు ఆవుపేడతో అలికి ఐదు రంగులతోను, శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణుసన్ిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యముయొక్క గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడ శక్యముగాదు. పర్వతిధులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈనందాదీపము నశించిన యెడల వ్రతభ్రష్టుడగును. తిలలతోను, ధాన్యముతోను, అవిశపువ్వులతోను, కలిపిన నందాదీపమును కార్తీకాసమందు హరికి క్సమర్పించవలయును. నందా అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది. శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షము పొందుదురు. విష్ణ్వాలయమంటపమును భక్తితో అలంకరించువారు హరి మందిరమునకు వెళ్ళుదురు. హరిని మల్లెపువ్వులతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును. కార్తీకమాసమందు తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును. హరిసన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యముజేసినయెడల పూర్వజన్మ సంచితమైన పాతకములు గూడ నశించును. ఇతరులకు హరిపూజకొరకు మనోవాక్కాయములచేత సహాయముచేయువాడు స్వర్గమునుబొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదులచేత హరిని పూజించువాడు వైకుంఠమునుబొందును. ఈమాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు ఏడు జన్మములందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. సాయంకాలమందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమునుజేయువారు వైకుంఠమును జేరుదురు. సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంతకాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును. ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే సప్తమోధ్యాయస్సమాప్తః

 

Thursday 15 September 2016

*షోడశ నిత్యాదేవతా ఉపాసన


 ఓం శ్రీ  రామ్  - ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణాయనమ:
ప్రాంజలి ప్రభ- షోడశ నిత్యాదేవతా ఉపాసన

రదేవత అయిన శ్రీ లలితయే మహానిత్య. ఆ చైతన్యం నుండి వెలువడే కాలస్వరూప చైతన్య కిరణాలే పాడ్యమి మొదలు పౌర్ణమి మొదలు పౌర్ణమి లేక అమావాస్య వరకుగల తిథి దేవతలే నిత్యలు. కల్ప వాటికల మధ్య షడ్రుతువుల తమ తమ ప్రభలతో విలసించే చోట శక్తుల సమూహం మధ్యంలో సంగీత, నృత్య, వాద్యవిలాసాలు జరుగుతుండగా కోటి సూర్యప్రభలను వెదజల్లే సింహాసమందు లలితా మహా నిత్యాదేవి విరాజిల్లుతోంది. ఆమె నేత్రములు కారుణ్య పూరితములై అమృతం వెదజల్లుతున్నారు. ఆ తల్లి ముఖం మందహాసపూరితమైవుంది. ఆమె శరీరం నుండి వచ్చే ప్రకాశ కిరణాలు అమృత ప్రవాహస మానములు. ఆమె చూపులు సాధకులకు అత్యంత శ్రేయోదాయకాలై కోర్కెలను ఈడేర్చుతాయి. ఆమె వివి ధ రకాలుగా అలంకరించబడిన ఏనుగులు, గుఱ్ఱములు మొదలైన రాజమర్యాద చిహ్నాలతో పరివృతమై వుంది. లలితా పరమేశ్వరికి సమానమైన వస్త్రాలు, అభరణాలనే ధరించిన పదిహేనుగురు నిత్యలతో సేవిం పబడుతోంది. ఈ మహానిత్యాదేవి శ్రీచక్ర మధ్యనున్న త్రికోణమనందు విరాజిల్లుతోంది.

ఈ సర్వసిద్ధిప్రద చక్రమునకు వెలుపల కామేశ్వరి మొదలు చిత్రా తిథినిత్యా దేవతలచే సేవింపబడుతోంది. మహానిత్యాను పూజించితే ఇహలోక సౌఖ్యములు కలగడమే కాక మోక్ష సామ్రాజ్యం కూడా అతి సులభంగా లభిస్తుంది.

1. కామేశ్వరీ నిత్యా..


కామేశ్వరీ నిత్యాదేవత కోటి ఉదయ సూర్యల కాంతితో ప్రభవిల్లుతోంది. మాణిక్యరత్నాలు పొదిగిన కిరీ టం శిరస్సునందు ప్రకాశించగా, కంఠమునందు గ్రైవేయకము అనే కంఠాభరణం శోభిల్లుతోంది. నడుము న బంగారు వడ్డాణం, చేతులకు కంకణాలు, అంగుళీయకాలు శోభిల్లగా పాదములందు బంగారపు మట -టలు, చిరు గంటలు మ్రోయు మంజీరాలతో విలసిల్లుతోంది.

శరీరం అరుణ కాంతితో విరాజిల్లుతూ, శిరస్సున బాలచంద్రుడు శోభిల్లగా మందహాసంతో కరుణాపూరిత నేత్రాలతో దర్శనమిస్తోంది. చేతులలో ఇక్షు కోదండం పుష్పబాణములు, పాశాంకుశాలు, అమృతపూరిత రత్నకలశం, వరద హస్తం మొదలుగా గల ఆరు హస్తాలతో శోభిల్లుతోంది.

పూజా ఫలం:- ఈ దేవిని పూజించితే కుటుంబంలోని వారికి ఆయురారోగ్యం, మనస్సునందు శాంతి, రోగ రహితమైన శరీరం క్రమంగా లభిస్తుంది. ఈమె ఆరాధన ప్రత్యేకంగా మానవజాతికి అంతకూ ఆయురా రోగ్యప్రదం.

2. భగమాలినీ నిత్యా..


భగమాలినీ నిత్య షడ్భుజయై ఉత్పలం, పాశము, చెరుకువిల్లు ఎడమ హస్తమునందు, వికసించిన పద్మం, అంకుశం, పుష్పబాణాలు కుడిచేతులందు ప్రకాశిస్తాయి. అందమైన అరుణ దేహచ్ఛాయ కలిగి, మందహాస పూరితమైన వదనంలో మూడుకన్నులతో ప్రకాశిస్తుంది. పద్మాసనమందు ఆసీనురాలై శక్తు లతో పరివేష్టించబడి వుంది భగమాలిని.
పూజా ఫలం:- భగమాలినీ నిత్యాదేవిని పూజించితే శత్రుజయం, జనాకర్షణం కలుగుతాయి. ప్రత్యేకించి గర్భిణీ స్ర్తీల గర్భమును రక్షించి గర్భస్రావములను అరికట్టి, సుఖప్రసవం, సంతానప్రాప్తిని అను గ్రహిస్తుంది.

3. నిత్య క్లిన్నా


ఎర్రని కాంతి పుంజములు వెదజల్లే దేహకాంతిని ఇనుమడింపజేసే రక్తచందన లేపనంతో, చిరునవ్వులొలికే ముఖకాంతిని ఇనుమడింపజేసి మూడు కన్నులను కలిగి ఉంది. ఈ తల్లి ఫాల భాగము నందు చెమట బిందువులు, ప్రకాశించే ముత్యములవలె శోభిల్లుతున్నాయి. శిరస్సున నెలవంకను ధరించి ఉంది. చతుర్భుజగా పాశాంకుశములను ధరించి అభయముద్రను వహించి, అమృత కలశమును ధరించి దర్శనమిచ్చే ఈ తల్లి సకల భయహారిణి. ఈమె వికసించిన పంకజమునందు ఆసీనురాలై సర్వకామ ప్రపూరిణిగా, మదాలసగా దర్శనమిస్తోంది.
పూజా ఫలం:- ఈమె భక్తుల దాంపత్య జీవితమునందు ఆన్యోన్య అనురాగమును వర్థిల్లజేస్తూ, పరస్పరం మనోవాక్కాయముల యందు చిత్తశుద్ధిని ఏర్పరచి, కుటుంబ జీవితమునందు తల్లిదండ్రులు, సంతానం, భార్యభర్తలు మొదలైన వారిలో పరస్పర అనురాగమును, వాత్సల్యమును పెంపొందించి ఐకమత్యంతో కూడిన ఆదర్శవంతమైన కుటుంబమును వర్థిల్లజేస్తుంది.

4. భేరుండా నిత్యా


భేరండా నిత్యాదేవి మేలిమి బంగారు శరీర కాంతి కలిగి, త్రినేత్రాలతో మందహాసపూరితమైన సౌందర్యవంతమైన ముఖారవిందంతో భక్తులను అనుగ్రహిస్తుంది. సర్వాంగముల యందు మణి గణ భూషితములైన దివ్య ఆభరణాలను ధరించింది. పాశ, అంకుశములు, ధనుర్బాణములు, గద, త్రిశూలం, వజ్రాయుధం, డాలు ధరించిన అష్టభుజగా వెలుగొందుతోంది.
పూజా ఫలం:- భేరుండా దేవి భక్తులను అపమృత్యువు నుండి కాపాడి, విషం మొదలైన ప్రాణాపాయకరమైన ప్రమాదాల నుండి శరీరమును, ఆత్మను రక్షిస్తుంది.

5. వహ్ని వాసినీ నిత్యా


నిత్యనవయౌవన శాలియై మేలిమి బంగారు రంగు దేహకాంతిని వెదజల్లుతూ చిరునవ్వు కలిగి పద్మసన్నిభ వదనంతో, త్రినేత్రాలతో ప్రకాశిస్తోంది. పసిడి బంగారు కాంతి గల పట్టు వస్త్రాలను, మాణిక్యరత్నములు పొదిగిన ఆభరణాలు కలిగి, నలుదిశలా కాంతి పుంజాలతో విరాజిల్లుతోంది. ఆ తల్లి శరీర ప్రకాశం మణిఖచితములైన కంకణములచేత, నవరత్న ములు పొదిగిన వడ్డాణంతోను, ముత్యాల ఆభరణాలతోను విరాజిల్లుతోంది. ఎడమ చేతు లందు ఉత్పలం, బంగారపు కొమ్ము, పుష్పబాణం, దానిమ్మ ఫలం ధరించి యుండి, శక్తులచే ఆవరింపబడి ఉంది.

పూజా ఫలం:- ఈ వహ్నివాసినీ నిత్య అసమాన శరీరకాంతిని ప్రకాశింపచేస్తూ ముల్లో కాలలో సాటిలేనంత ఇహ సౌఖ్యములు ప్రసాదిస్తుంది.

6. మహావజ్రేశ్వరీ నిత్యా


మహావజ్రేశ్వరీ నిత్య త్రికోణం, షట్కోణం, పద్మదళాలు, భూపురం కల్గిన యంత్రము నందు బంగారు సింహాసనంపై విరాజిల్లుతోంది. చతుర్భుజములందు పాశ, అంకుశములు, ఇక్షుకోదండము, దానిమ్మపండు కల్గి త్రినేత్రాలతో శోభిల్లుతోంది. రక్తపుష్పమాలలు, రక్తవ స్త్రములను ధరించి నానాలంకారభూషితగా రాజిల్లుతోంది. సాధకులకు అనుగ్రహాన్ని ప్రసా దించే వీక్షణములు కల్గి, పద్మముఖంతో అలరారుతోంది.
ఫలశ్రుతి :- మహావజ్రేశ్వరీదేవి భక్తులను కష్టాలనుండి కాపాడి, అన్ని తాపములను నివారించే వజ్రం వలె భక్తులను అనుగ్రహిస్తోంది.

7. శివదూతీ నిత్యా
మండువేసవిలోని మధ్యాహ్నకాల చంఢభానుని కాంతివలె ప్రకాశిస్తూ త్రినేత్రయై ఉంది. రక్తవస్త్రం ధరించి సర్వాభరణ భూషితయై నవరత్న ప్రభాపుంజం వలె ప్రకాశిస్తోంది. చల్లని మందహాసంతో, వికసించిన మోము కల్గినదై ఋషులచే సంస్తూయమానమైంది. శివదూతీ నిత్యా వామహస్తమునందు పాశం, గద, డాలు, రత్న ఖచిత చషక పాత్రలను, దక్షిణ హస్తమందు అంకుశం, ఖడ్గం, కుఠారం, పద్మములను కల్గి ఉంది.
ఫలశ్రుతి :- భక్తుల అధర్మమును నాశనం చేసి ధర్మాచరణమును అభివృద్ధిపరుస్తూ, ఇష్టకామ్యములనిచ్చి అనుగ్రహిస్తుంది.

8. త్వరితా నిత్యా


త్వరితా నిత్యా శ్యామవర్ణపు అంగఛాయ కల్గి అతిశోభాయమానమైన యవ్వనంతో శోభిల్లుతూ, త్రినేత్ర యై, చతర్భుజాలతో, కరుణాపూరిత నేత్రాలతో, అత్యంత సుందరమైన పద్మవదనంతో రాజిల్లుతోంది. సర్వవర్ణాల వారిచే ఆరాధించబడే ఉగ్రరూపం కల్గి ఆకుపచ్చరంగు వస్తమ్రులు ధరించి ఉంది.

కర్ణములందు నాగములను తాటంకములుగా, భుజములందు జంటనాగములను భుజకీర్తులుగా, పాదములందు జంటనాగములను నూపురాలుగా, కటి ప్రదేశమున జంట నాగములను వడ్డాణంగా ధరించి, కిరీటం నందు నెమలి పింఛములను ధరించి, శోభాయమానమవుతోంది. గురువిందగింజల మాలలచే అలంకరిం చబడిన కుచమండలం కల్గినదై, చతుర్భజములందు పాశ, అంకుశ, వరద, అభయముద్రలతో శోభిల్లుతోంది.

ఫలశ్రుతి :- త్వరితా నిత్యా ఆరోగ్యమును, ధన సంపత్తిని, సుందరమైన శరీరకాంతిని, దీర్ఘాయుష్షును భక్తులకు ప్రసాదిస్తుంది. జీవితంలో సర్వతోముఖ అభివృద్ధిని కావించి సర్వవిధ విషరోగాల నుండి కాపాడుతుంది.

9. కులసుందరీ నిత్యా


కులసుందరీ నిత్యా ఆరుముఖాలతో ఎర్రని శరీరకాంతి కలిగి, ఎర్రని కాంతులు వెదజల్లే శక్తులచే సేవించబడుతూ రక్తవస్త్రాలు ధరించి, రక్తచందన లేపనయై, మూడుకన్నులు కలదై చల్లని చిరునవ్వుతో, ఎనలేని రత్నమణులచే కూర్చబడిన కిరీటముచే జ్వలిస్తోంది. తాటంకాలు, కేయూరాలు, ఉజ్వలమైన నూ పురాలు, రక్తవర్ణ పుష్పగుచ్ఛాలతో సుశోభితమైన వక్షస్థలం కలది. కారుణ్య ఆనందభరితమైన వదనం గల ది. అరుణాంబుజమునందు ఆసీనురాలై ఉంది. ద్వాదశ భుజయుక్తయై సర్వవాజ్మయ అధిష్టాత్రియై విల సిల్లుతోంది. పగడపుమాల, పద్మము, రత్నములచే పొదగబడిన బంగారు కమండలం, అమృత చషకం, దానిమ్మపండు, వ్యాఖ్యానముద్ర, పుస్తకం వికసించిన పద్మం, బంగారు ఘంటం, రత్నమాలా శంఖం, వరదముద్రలు 12 హస్తములందు శోభిల్లుతున్నాయి. దేవ, గంధర్వ, కిన్నెర, యక్ష, రాక్షస, దేవ ఋషులు, సిద్దులు, విద్యా ధరులచే స్తుతింపబడుతోంది.

ఫలశ్రుతి :- వాక్శుద్ధి కొరకు తెల్లని కాంతివంతమైన రూపం కల కులసుందరీ నిత్యాదేవిని ధ్యానించి, పూజించాలి. ఐశ్వర్య సిద్ధి కొరకు బంగారు రూపంకల దేవిని పూజించాలి. శత్రునివారణ, అపమృత్యు నివారణకు పొగరంగు కల దేవిని ధ్యానించాలి. వాదించే వారి వాగ్బంధనం కొరకు నల్లని రంగుగల కులసుందరీ నిత్యాదేవిని ఆరాధించాలి.

10. నిత్యా నిత్యా!


శ్రీ నిత్యా నిత్య ఉదయసూర్యుని కాంతితో విరాజిల్లు ముఖం కలది. మాణిక్యాలతో పొదగబడిన కిరీటం కలది. మాణిక్యపు రంగు వస్త్రాలు ధరించి ఉంటుంది. చిరునవ్వుతో ప్రకాశిస్తున్న ఆరుముఖాలు కలిగి, ప్రతీముఖం నందు త్రినేత్రములు, 12 భుజములు కలిగి ఉంది. వామహస్తమందు పాశం, రుద్రాక్షమాల, చెరుకువిల్లు, డాలు, త్రిశూలం, వరదహస్తం, దక్షిణ హస్తమందు అంకుశం, పుస్తకం, పుష్పబాణాలు, ఖ డ్గం, కపాలం, అభయహస్తములను కలిగి ఉంది. ఈ విధమైన ఆయుధాలతో సమస్త చరాచర ప్రాణికోటిని తమ తమ స్థానములందు (లేక శరీరములందు) స్థిరంగా ఉండేలా శాసిస్తుంది. తను సర్వాత్మికగా, సర్వ వ్యాపక చైతన్యశక్తియై ఉంది.

ఫలశ్రుతి :- నిత్యా నిత్య సాధకులకు శరీర దృఢత్మమును, ఆధ్యాత్మశక్తులను పెంపొందింపచేసి అణి మాది అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది.

11. శ్రీ నీలపతాక నిత్యా


ఇంద్రనీలపు శరీర కాంతిని కల్గి అయిదు ముఖాలతో ప్రతిముఖం నందు త్రినేత్రం కల్గినదై, మణులతో ప్రకాశించే కిరీటంతో విరాజిల్లుతోంది. రత్నకాంతులు వెదజల్లే దేహకాంతితో, చిరునవ్వు ముఖా లతో ప్రకాశిస్తోంది. ఎడమ చేతులందు పాశం, పతాకము, చర్మవేష్ఠం, శంఖం, చాపం, వరద హస్తములను కలిగి ఉంది. కుడి చేతులలో అంకుశం, శక్తి ఆయుధం, ఖడ్గం, బాణం, అభయ హ స్తములను కల్గి ఉంది. నీలపతాక నిత్య తన వలెనే ఆకారం, వర్ణం, వేషం, ఆభరణాలు ధరించిన శక్తి బృందములతో సమావిష్ఠమై ఉంది.

ఫలశ్రుతి :- పరీక్షలయందు ఉత్తీర్ణత, కోర్టు వ్యవహారాలలో విజయం సాధించడానికి నీలపతాక నిత్యను పూజించాలి.

12. శ్రీ విజయా నిత్యా
పది ముఖాలు, పది భుజాలు, ప్రతిముఖంనందు మూడు కళ్ళు, చంద్రరేఖలతో విలసిల్లే కిరీటం కలది. పీతాంబరం ధరించి సర్వాభరణ సంయుక్తయై ఉదయించే సూర్యబింబకాంతి కలి గి చిరునవ్వులొలికేది.

శంఖం, పాశం, డాలు, చాపం, కల్హార పుష్పాలను ఎడమవైపు హస్తము లందు, చక్రం, అంకుశం, ఖడ్గం, బాణం, దానిమ్మ ఫలాలను కుడివైపు హస్తాలందు కలిగి ఉంది. ఈ ఆయుధాలను ప్రయోగించే సమయంలో ఉగ్రరూపం ధరిస్తుంది. ఉపాసకులకు విజయా నిత్య సింహావాహినియై సౌమ్యంగా దర్శనమిస్తుంది.

యుద్ధాలందు పులి వాహనమును అధిరోహించి శక్తి పరివార సైన్యంతో దర్శనమిస్తుంది. పూజా సమయాలలో మిగిలిన అనుష్టాన సమయాల్లో సుఖాసీనయై దర్శనమిస్తుంది. శక్తులం దరూ విజయా నిత్యా వలెనే రూపాలు నిత్య సాధకులకు యుద్ధాలందు విజయాన్ని ఋణ విముక్తి ని, న్యాయస్థాన వ్యవహారములందు విజయాన్ని ఇస్తుంది.

ఫలశ్రుతి :- ఉపాసకులు ఎల్లపుడూ సౌమ్య ఆకారమునే పూజించాలి. ఉగ్రపూజలందు రుద్ర రూపం కలిగిన విజయానిత్యను సింహవాహినిగా, తన శక్తిసమూహములు పులుల మీద ఆసీనులయినట్లుగా పూజించితే అభివాంఛితాలు నెరవేరుతాయి.

13. సర్వమంగళా నిత్యా
బంగారపు శరీరకాంతిని కల్గి ముత్యాలు మొదలైన భూషణాలు ధరించి మాణిక్యాలతో పొదగ బడిన కిరీటమును ధరించి ఉంటుంది. దయతో కూడిన నేత్రాలు కలదై పద్మాసనం నందు ద్వి భుజగా అష్టదళం, షోడశదళములు చతుర్ద్వార సమన్వితమైన భూపురము కలయంత్రం నందు అధిష్టానమై ఉంది.

కుడి హస్తమందు దానిమ్మ పండును, వామ హస్తమందు భక్తులకు ప్రసాదిం చడానికి ధనపాత్రను కలిగింది. తన రూపం వలెనే భూషణాలను ధరించిన శక్తి సమూహం కల్గి 76 సంఖ్యకల్గిన సూర్య, చంద్ర గోళముల నుండి ఉద్భవించిన అక్షర శక్తులతో కూడా విరా జిల్లుతోంది.
ఫలశ్రుతి :- భక్తులకు ఇహసౌఖ్యములనిస్తుంది. భక్తులకు ప్రయాణములందు ఆటంకాలను తొలగించి, రక్షణ కల్గిస్తుంది.

14. జ్వాలామాలిని నిత్యా


శిఖలతో మండుతున్న అగ్నికి సమానమైన కాంతి కలిగి మాణిక్యాలతో పొదగబడిన ఉజ్వలమైన కిరీ టంతో శోభిల్లుతూ ఆరు ముఖములు, పన్నెండు భుజాలతో జ్వాలామాలినీ నిత్యా విలసిల్లుతోంది.పాశం, అంకుశం, ఖడ్గం, డాలు, బాణం, చాపం, గదా, త్రిశూలం, అగ్ని, వరద హస్తము, అభయ హస్తం, పద్మములను హస్తములందు ధరించి ఉంటుంది.
తనవలెనే ఆకార ఆభరణములను ధరించిన శక్తిపరివార సమన్వితయై, చిరునవ్వుతో ప్రకాశించే ముఖ పద్మాలతో, త్రినేత్రం కల్గి ఉంది.
ఫలశ్రుతి :- జ్వాలా మాలిని నిత్యాను పూజించే భక్తులకు ధనలాభం కలిగించి, ఇతరులపై విజయాన్ని సాధించే శక్తిని ప్రసాదించి, దాంపత్య సుఖాన్నిచ్చి, శత్రువిజయం ప్రసాదిస్తుంది.

15. శ్రీ చిత్రా నిత్యా
చిత్రా నిత్య ఉదయభానుని ప్రకాశం వంటి శరీరకాంతిని కల్గి, నవరత్న ఖచిత కిరీటమును ధరించి, త్రినేత్రయై, నానా చిత్ర వర్ణములు కల్గిన పట్టు వస్త్రాలు ధరించినదై, మందహాసపూరితమైన ముఖకమలం కలది. ఈ నిత్య సర్వానందమయిగా సదా భక్తులకు వాంఛితార్థములనిచ్చే నిత్యాగా ప్రకాశిస్తోంది. చతర్భు జములందు పాశ అంకుశాలు, అభయవరద ముద్రలతో విలసిల్లుతోంది.
ఫలశ్రుతి :- చిత్రా నిత్యాదేవి ఇహలోక సుఖములను ప్రసాదిస్తూ ఇతరులను తన పక్షమునకు ఆకర్షించే శక్తిని ప్రసాదించి, ఆకస్మికంగా నవనిధులను ప్రసాదిస్తుంది.
శక్తి స్వరూపిణి అయిన ఆ లలితాపరమేశ్వరి ఇన్ని రూపాలలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ తల్లి కరుణకు పాత్రులు కావడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సి ఉంది.


--((**))--

21-02-2020 *రుద్ర విధానేన శివ పూజా విధి:



ప్రాంజలి ప్రభ 
ఓంశ్రీ రామ్ -- ఓం శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

రుద్ర విధానేన శివ పూజా విధి:

రుద్ర విధానేన శివ పూజా విధి:

దీపారాధన
(ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి)

శ్లో॥ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‌
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ॥

శ్లో॥ దీపజ్యోతి పరబ్రహ్మ దీపోజ్యోతి జనార్ధన
దీపో హరతుమే పాపం దీపజ్యోతి ర్నమోస్తుతే ॥

దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు॥

ఘంటా నాదము
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||

గణపతి శ్లోకం

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ॥

మాతా పితృ ప్రార్థన
మాతా పితృ సమం దైవం, న దైవం పితృ మర్చయేత్
సర్వ తీర్థ ఫలం జ్ఞేయం మాతా వందన తత్సదా
॥ మాతృ దేవో భవ, పితృ దేవో భవ॥

శ్రీ గురు ధ్యానం
గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్లో॥ గురూనాం అగ్రజం శ్రేష్ఠం, గురు పాదం స్మరం హరిం
గురూనాం అర్చయేన్నిత్యం తస్మైశ్రీ గురవే నమః
॥ ఆచార్య దేవో భవ ॥

శ్లో॥ వేద శాస్త్రాని నిద్యుక్తం, దేవతార్చన హోమచ
షట్కర్మ ఉదయాన్నిత్యం బ్రాహ్మణయ్: వందనయ్ స్సదా
॥ అతిథి దేవో భవ ॥

శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా | యః స్మరేత్ పుండరీకాక్షం
స బాహ్యాభ్యంతర శ్శుచిః || పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః |
(3 సార్లు, శిరస్సు మీద నీళ్ళు జల్లుకోనవలెను)

ఆచమనం
1. ఓం కేశవాయ స్వాహా 2. ఓం నారాయణాయ స్వాహా 3. ఓం మాధవాయ స్వాహా
4. ఓం గోవిందాయ నమః 5. ఓం విష్ణవే నమః 6. ఓం మధుసూదనాయ
7. ఓం త్రివిక్రమాయ నమః 8. ఓం వామనాయ నమః 9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః 11. ఓం పద్మనాభాయ నమః 12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః 14. ఓం వాసుదేవాయ నమః 15. ఓం ప్రద్యు మ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః 17. ఓం పురుషోత్తమాయ నమః 18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః 20. ఓం అచ్యుతాయ నమః 21. ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః 23. ఓం హరయే నమః 24. ఓం శ్రీ కృష్ణాయ నమః

దైవ చింతన

శ్లో॥ యశ్శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళా
తయో స్సం స్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళమ్

శ్లో॥ లాభ స్తేషాం జయ స్తేషాం కుతస్తేషాం పరాభవః
యోశామిందీ వరశ్యామో హ్రుదయస్థో జనార్దనః

శ్లో॥ ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

శ్లో॥ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః

అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఆసన సంస్కారం

ఓం పృథివ్యాః । మేరుపృష్ట ఋషి: । కూర్మో దేవతా
సుతలం చందః । ఆసనే వినియోగః ॥ అనంతాసనాయ నమః ॥
(ఆసనం కింద అక్షతలు వేసి భూమిని స్పృశించి చక్కగా కూర్చొనవలెను)

భూతోచ్చాటన

ఉత్తిష్ఠంతు, భూత పిశాచా:, యే తే భూమిభారకాః యే తేషా మవిరోధేన
బ్రహ్మకర్మ సమారభే ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
(అక్షింతలు వాసన చూసి వెనక్కి వేయాలి)

ప్రాణాయామం

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యమ్
ఓం తత్స’ వితుర్వరే’’ణ్యం భర్గో ’ దేవస్య’ ధీమహి ధియో యో నః’ ప్రచోదయా’’త్
ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ బూర్భువస్సువరోం ॥

సంకల్పం
మామో పాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముధిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే మంగళ ముహూర్తే, శ్రీ మహా విష్ణో ఆజ్ఞయా ప్రవర్త మానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరో: ఆగ్నేయ దిగ్భాగే, చతుస్సాగర మధ్యే, సింహపురి నగరే, స్వగృహే (/వసతి గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్ర మానేన, మన్మథ నామ సంవత్సరే, ------ఆయనే, --- ఋతౌ, --- మాసే, --- పక్షే, --- తిథౌ, --- వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ

శ్రీమాన్ …. గోత్రః, … నామధేయః … ధర్మపత్నీ సమేతోహం, శ్రీమతః … గోత్రస్య…
నామధేయస్య, మమ ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహా కుటుంబానాం, క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్ర పౌత్రాభి వృధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, రాజ ముఖే, రాజ ద్వారే, సర్వదా సర్వ కార్యేషు దిగ్విజయ సిధ్యర్థం, మమ చింతిత మనోరథ ఫల సిధ్యర్థం, ఆత్మ సంస్కారార్థం, గాడబద్ధ కర్మ పాశ నివృత్యర్థం, మమ కాయిక, వాచిక, మానసిక, త్రైవర్ణిక అశేష పాప నివృత్తి ద్వారా, మామ జన్మభ్యాసాత్, జన్మ ప్రబృతి ఎతత్క్షణ పర్యంతం, మధ్య వర్తన కాలే బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు, మనోవాక్కా యేంద్రియ వ్యాపారై: రహసి ప్రకాశేచ జ్ఞానతః అజ్ఞానతశ్చ చిరకాలాభ్య స్థానాం, బహూనాం, బహు విధానాం, సర్వేషాం పాపానాముపశమనార్థం, అనేక జన్మ సహస్రేషు, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక దుఃఖత్రయ నివృత్యర్థం, కోటి సంఖ్యానాం, మత్కులోత్పన్నానాం, సర్వేషాం, పితృణాం, నరక లోకోత్తర ద్వారా శివ లోక నివాస సిధ్యర్థం, సకల అశుభ నివృత్యర్థం, సకల దారిద్ర్య నివృత్యర్థం, శ్రీ మహా లక్ష్మీ క్షేమ స్థైర్య సిధ్యర్థం, కైలాస లోక అనేక కాల నివాసనంతరం, శాశ్వత శివ పద అవాప్యర్థం, సకలాభీష్టప్రదాయక శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత శ్రీ మహాలింగ పరమ శివ దేవతా ప్రీత్యర్థం, మమగృహే రాజ్య లక్ష్మీ, జయ లక్ష్మీ, ధన లక్ష్మీ, ధాన్య లక్ష్మీ, సామ్రాజ్య లక్ష్మీ, మోక్ష లక్ష్మీ, ధైర్య లక్ష్మీ, విద్యా లక్ష్మీ సిధ్యర్థం, చతుష్షష్టి కళా విద్యా ప్రాప్యర్థం, భూత, ప్రేత, పిశాచ, కామినీ, మోహినీ, ఢాకిన్యాది ఉచ్చాటనార్థం, సర్వారిష్ట పరిహారార్థం, మమ శరీరే, వర్తమాన, వర్తిశ్యమాణ, నిదాన హేతుభూత పాప నివృత్తి ద్వారా సమస్తామయ నిబర్ హరణార్థం, నిరంతరం శివలోక నివాసార్థం, శ్రీ భవానీ సమేత శ్రీ మహా లింగ పరమ శివదేవతా ప్రీత్యర్ధం, అన్యోన్య సహాయేన, సద్యోజాత విధానేన, పురుష సూక్త పూర్వక, యావచ్చక్తి ధ్యానా ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే । ।

ఆదౌనిర్విఘ్నపరసమాప్త్యర్ధం శ్రీ మహా గణా ధిపతి పూజాం కరిష్యే, తదాంగా కలశారధానం కరిష్యే.

కలశారాధనము
(కలశము సంపూర్ణత్వానికి చిహ్నము. పూజారంభమున పాత్రను తీసుకొని దాని చుట్టూ పసుపు రాసి కుంకుమ తో బొట్లు పెట్టి, పవిత్రమైన నీటిని పోసి దానిలో గంధము, పూలు, అక్షతలు వేసి కుడి చేతితో కలశమును మూసి యుంచి మంత్రములు చెప్పవలెను)

తదంగ కలశారాధనం కరిష్యే ॥
శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆపోవా ఇదగమ్ సర్వం విశ్వాభూతాన్యాపః
ప్రాణావా ఆపః పశవః ఆపో న్నమాపో అమృతమాప
స్సమ్రాడాపో విరాడాప స్స్వరాడాపశ్చందాగ్o ష్యాపో జ్యోతిగ్o ష్యాపో
యజుగ్o ష్యాప స్సత్యమాప స్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపః ఓం

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కావేరి తుంగభద్రాచ కృషవేణి చ గౌతమి
భాగీరథీతి విఖ్యాతః పంచ గంగాః ప్రకీర్తితాః
(కలశము లోని ఉదకమును ప్రముఖ జీవనదుల లోని జలములుగా భావించి పూవుతో ఆ నీటిని పూజా ద్రవ్యముల మీద, దేవతా విగ్రహముల మీద, మన (తన) మీద జల్లుకొనవలెను)
శంఖ పూజ
తదంగ శంఖ పూజాం కరిష్యే ॥
కలశోదకేన శంఖమా పూర్య - శంఖం ప్రక్షాళ్య - పునః శంఖం పూరయిత్వా (కలశము లోని జలముచే శంఖము నింపి ఆ నీటితోనే శంఖమును కడగవలెను. తిరిగి వేరే ఉదకముతో శంఖమును నింపవలెను. క్రింది మంత్రములతో దేవతా ఆవాహనము చేయవలెను )
శంఖ మూలే (పీఠే) బ్రహ్మాణ మావాహయామి
శంఖ హృదయే ఆదిత్య మావాహయామి
శంఖ మధ్యే చంద్ర మావాహయామి
శంఖాగ్రే సరస్వతీం ఆవాహయామి
శంఖం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య
(శంఖమును పూజించి చేతిలో పట్టుకుని ఈ క్రింది శ్లోక త్రయం చదువవలెను )

శ్లో ॥ త్వం పూర్వా సాగరోత్పన్నో విష్ణువా విధ్రుతః కరే ।
సర్వదేవ హితార్థాయ పాంచజన్య నమోస్తుతే ॥

శ్లో॥ శంఖం చంద్రార్క దైవత్వం వారుణం చాధిదైవతం
పృష్టే ప్రజాపతిం విద్యా దగ్రే గంగాం సరస్వతీం ॥

శ్లో॥ పృథివ్యాం యాని తీర్థాని వాసుదేవస్య చాజ్ఞయా ।
శంఖే తిష్ఠంతి సర్వాణి తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ॥
అథ శంఖోదకేన పూజోప కరణ ద్రవ్యాణి దేవ మాత్మానం చ సంప్రోక్ష్య కించిదుదకమ్ కలశే నిక్షిప్త్య । శేష మీశాన్య దేశే విసృజ్య ॥
(జలము చేత పాత్రలను, దేవుని , తనను ప్రోక్షించుకుని కొంచెము కలశము నందు పోసి మిగిలిన జలమును ఈశాన్యము వైపు పడవేయవలెను)

పండ్రెండు మార్లు ప్రణవం చెప్తూ శంఖమును ఉదకము చేత నింపవలెను. తదుపరి గాయత్రీ మంత్రము చేత మూడుసార్లు అబిమంత్రించి దేవుని ఎదుట కూర్మ పీఠం నందు ఉత్తరాగ్రముగా శంఖమును ఉంచవలెను. ఈ క్రింది మంత్రము చెప్పవలెను )

ఓం పాంచజన్యాయ విద్మహే । పావమానాయ ధీమహి । తన్న శంఖః ప్రచోదయాత్ ॥

గణపతి పూజ

ఓం గణానా''మ్ త్వా గణ ప' తిగ్ మ్ హవామహే కవిం క’వీనమ్
ఉపమశ్ర’వస్తవమ్ । జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రాహ్మణ స్పత ఆ నః’ శ్శృణ్వన్నూతిభి’ స్సీదసాద’నమ్ ||

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి - ఆవాహయామి -
నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి - పాదయో - పాద్యం సమర్పయామి
హస్తయో అర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామి
(జలం చూపి పళ్ళెం లో విడువ వలెను)

శుద్దోదక స్నానమ్
ఓం ఆపో హి ష్ఠా మ’ యోభువః’ | తాన’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే
యోవ’శ్శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః’ | ఉశతీరి’వమాతరః’ |
తస్మా ఆరం’ గమామ వః | యస్యక్షయా’య జిన్వ’ధా | ఆపో’ జన య’థా చ నః |

శ్రీ మహా గణపతయే నమః స్నాపయామి, స్నానానంతరం శుద్దాచామనీయం
సమర్పయామి (జలం చూపి పళ్ళెం లో విడువ వలెను)

వస్త్ర్హమ్

అభివస్త్రాసువసనా న్యార్ షాభిధేనూ స్సుదుఘాః పూజమానః అభిచంద్రా
భార్తవేనో హిరణ్యభ్యశ్వాన్ రథినో దేవ సోమః
శ్రీ మహాగణాధి పతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురత్సాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః

శ్రీ మహా గణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం
గంధద్వారం దూరదర్షాం నిత్యపుష్టాం కరిషిణీం ఈశ్వారీగం సర్వ భూతానాం
తామి హోపహ్వయే శ్రియం. శ్రీ మహా గణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి

పుష్పం
ఆయనే తే పరయణే దూర్వా రోహంతు పుష్పిణీ: హ్రదాశ్చ పుండరీకాణి
సముద్రస్య గృహఇమే. శ్రీ మహా గణాధిపతయే నమః నానావిధ పుష్పాణి సమర్పయామి

(పూలతో పూజించ వలెను)
ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః,
ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,
ఓం మహాగణాదిపతియే నమః

నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి

ధూపమ్
వనస్పత్యుద్భ వైర్ధివైయ ర్ననాగంధై స్సుసంయుతః
అఘ్రేయ స్సర్వ దేవానాం ధూపోయం ప్రతి గ్రుహ్యతామ్
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

దీపమ్
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యో జీతం ప్రియం గృహాణ మంగళం
భక్త్య దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్య జ్యోతి ర్నమోస్తుతే

దీపం దర్శయామి .. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

నైవేధ్యమ్

ఓం భూర్భువ: స్వ:’ తత్స’ వితుర్వరే’’ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి! ధియో యో న:ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియోయోన ప్రచోదయాత్ । । సత్యంత్వర్తేన పరిషించామి
అమృతమస్తు అమృతోపస్తరణ మసి స్వాహా ॥

(పగలు అయితే స్త్యంత్వర్తేన పరిషంచామి అని చెప్పవలెను. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశంచామి అని చెప్పవలెను.)

శ్రీ మహా గణపతయే నమః నివేద్యం సమర్పయామి
ఓం ప్రాణా య స్వాహా, ఓం అపానయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా,
ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృ తాపి ధాన మసి, ఉత్తరాపో శనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళ యామి శుద్ధాచ మనీయం సమర్పయామి

తాంబూలమ్
శ్లో|| పూగీఫలైస్స కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతమ్. ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||.

మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి

మంత్ర పుష్పమ్

(పుష్పం, అక్షతలు తీసుకొని ఈ శ్లోకాన్ని పఠించాలి)

ఓం గణానా''మ్ త్వా గణ ప' తిగ్ మ్ హవామహే కవిం క’వీనమ్
ఉపమశ్ర’వస్తవమ్ । జ్యేష్ఠరాజం బ్రహ్మ'ణాం బ్రాహ్మణ స్పత ఆ నః’ శ్శృణ్వన్నూతిభి’ స్సీదసాద’నమ్ ||

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా ॥

తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి - తన్నో దంతి ప్రచోదయాత్
శ్రీ మహా గణపతయే నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి

(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)

పూజా సమర్పణం
మంత్రం హీనం క్రియాహీనం భక్తీ హీనం గణాధిప
యత్పూ జితం మయా దేవ పరిపూర్ణం తడస్తుతే
అనయాధ్యానావాహనాది షోడషాపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి స్సుప్రీతో సుప్రసన్న వరదో భవతు
ఉత్తరే కర్మణ్య విఘ్నస్త్వితి భవంతో బ్రువంతు.
ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు.
గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణమి.

సహస్రపరమాదేవి శతమూలా శాతాంకురా
సర్వగం హరతు మే పాపం దూర్వా దు స్స్వప్న నాశినీ

శ్రీ మహా గణాధి పతయే నమః యథాస్థాన ముద్వాసయామి

యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాస్తా నిధర్మణి ప్రథ మా న్యాసన్ తెహనాకం మహిమాన స్సంచ తే యత్ర పూర్వే సాధ్య స్స్మ్తి దేవాః (తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.)

రుద్రాభిషేకం ప్రారంభం
ఆచమనం
1. ఓం కేశవాయ స్వాహా 2. ఓం నారాయణాయ స్వాహా 3. ఓం మాధవాయ స్వాహా
4. ఓం గోవిందాయ నమః 5. ఓం విష్ణవే నమః 6. ఓం మధుసూదనాయ
7. ఓం త్రివిక్రమాయ నమః 8. ఓం వామనాయ నమః 9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః 11. ఓం పద్మనాభాయ నమః 12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః 14. ఓం వాసుదేవాయ నమః 15. ఓం ప్రద్యు మ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః 17. ఓం పురుషోత్తమాయ నమః 18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః 20. ఓం అచ్యుతాయ నమః 21. ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః 23. ఓం హరయే నమః 24. ఓం శ్రీ కృష్ణాయ నమః

ప్రాణామాయం
ఓం భూ:, ఓం భువః, ఓం సువః
ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్o సత్యమ్

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ ॥
ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోమ్ ॥

శివ సంకల్పం
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ । శ్రీ భవానీ శంకర దేవతా ముద్దిశ్య - శ్రీ భవాని శంకర దేవతా ప్రీత్యర్ధం ఏక రుద్ర నమక చమక సహిత రుద్రాభిషేకం కరిష్యే

ప్రాణ ప్రతిష్ట
మం ॥ అసువీతే పునరస్మాసు చక్షుహ్ పునః ప్రణామిహ నో దేహి భోగం జ్యోక్శ్ శ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయానస్వస్తి ఆమృతంవై ప్రాణా అమృత మావః ప్రాణేనేవ యధాస్థాన ముపహ్వయతే ॥

సాంగం సాయుధం సశక్తీ పత్నీ పుత్ర పరివార సమేతం శ్రీ భవాని శంకర స్వామి దేవతా స్థాపయామి పూజయామి

ధ్యానం

కైలాసే కమనీయ రత్నఖచితే కల్పద్రమూలే స్థితమ్
కర్పూర స్పటికేoదు సుందరతనుం కాత్యాయినీ సేవితం
గంగా తుంగ తరంగ రంజిత జటాభారం కృపాసాగరం
కంఠాలంకృత శేషభూషణ మహా మృత్యుంజయం భావయే

ఓం ఓం ఓం
ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మయ్ ఓంకారాయ నమో నమః । ।

ఓం నం
నమంతి మునయః సర్వే నమం త్యప్సర సాంగలాహ
నరాణాం ఆది దేవాయ నకారాయ నమో నమః । ।

ఓం మం
మహా తత్త్వం మహా దేవ ప్రియం జ్ఞాన ప్రదం పరం
మహా పాప హారం తస్మా మకారాయ నమో నమః । ।

ఓం శిం
శివం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం
మహా పాప హారం తస్మా శికారాయ నమో నమః । ।

ఓం వం
వాహనం వృషభోయస్యా వాసుఖీ కంఠ భూషణం
వామ శక్తి ధరం దేవం వకరాయ నమో నమః । ।

ఓం యం
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం
యం నిత్యం పరమానందం యకారాయ నమో నమః । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ధ్యానం సమర్పయామి
( నమస్కరించ వలెను )

ఆవాహనమ్
ఓం సద్యోజాతం ప్రపద్యామి - ఇతి ఆవాహనం
ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’|
నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ |

ఓం సహస్ర శీర్షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్, సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్ట దశాంగులం

శ్లో॥ ఆగచ్ఛ మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే
స్వభక్త సంరక్షణ కామధేనో ప్రసీద సర్వేశ్వర పార్వతీశ ॥

స్వాత్మ సంస్థ మజం శుద్ధం త్వా మద్య పరమేశ్వర అరణ్యామివ హవ్యానం మూర్తా వావాయహయా మహ్యమ్

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ఆవాహనమ్ సమర్పయామి ॥

(అని అక్షతలు దేవుని ఫై వేయవలెను)
ఆసనమ్
ఓం సద్యోజాతాయవై నమో నమః - ఇతి ఆసనమ్

యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ |
శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ

ఓం పురు’ష ఏవేదగ్‍మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
ఉతామృ’తత్వ స్యేశా’నః | యదన్నే’నాతిరోహ’తి ||

సర్వాంతర్యామిణే దేవ సర్వభీజ మయా శుభమ్
స్వాత్మస్దాయ పరంశుద్ధమానసం కల్పయమ్యహమ్ ॥

శ్లో। । భాస్వన్మౌక్తితోరణయ్ ర్మరకత స్తంభాయుతాలంక్రుతే
సౌధే ధూప సువాసితే మణిమయే మాణిక్య దీపాంచితే
బ్రహ్మేంద్రామర యోగిపుంగవగణైరానీత కల్పద్రుమై
శ్రీ మృత్యుంజయ । సుస్తిరో భవ విభో । మాణిక్య సింహసనే । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । దివ్య రత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి ॥
(అని అక్షతలు పూలు వేయవలెను)

పాద్యం
ఓం భవే భవే నాతి - ఇతి పాద్యం
ఓం యా తే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ |
తయా’ నస్తనువా శంత’మయా గిరి’శంతాభిచా’కశీహి |

ఏతావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’‍శ్చ పూరు’షః |
పాదో”‌உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||

శ్లో। । మందారమల్లీ కరవీరమాధవీ పున్నాగ నీలోత్పల పంకజాన్వితై:
కర్పూర పాటీరసివాసితై ర్జలై రాధత్స్య మృత్యుంజయ । పాద్యముత్తమమ్ ॥

యద్భక్తి లేశ సంపర్కాత్ పరమానంద సంభవః
తస్మైతే చరనాబ్జాయ పాద్యం శుద్ధాయ కల్పయే ||

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । పాదయో: పాద్యం సమర్పయామి ॥
(అని భగవంతుని ఫై నీరు ప్రోక్షణ చేయవలెను)

అర్ఘ్యమ్
ఓం భవే భవస్వమాం - ఇతి అర్ఘ్యమ్

ఓం యామిషుం’ గిరిశంత హస్తే”బిభర్ష్యస్త’వే |
శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్|

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”‌உస్యేహా‌உ‌உభ’వాత్పునః’ |
తతో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే అభి ||

శ్లో। । సుగంధ పుష్ప ప్రకరై స్సువాసితై ర్వియన్నదీశీతలవారిభి శ్శుభయ్: ।
త్రిలోకనాథార్థి హరార్ఘ్యమాదరాద్గృహాణ మృత్యుంజయ । సర్వవందిత । ।

తాపత్రయ హారం దివ్యం పరమానంద లక్షణమ్
తాపత్రయ వినుర్ముక్తం తవార్ఘ్యం కల్పయామ్యహమ్ ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । హస్తయో: అర్ఘ్యం సమర్పయామి ॥
(అని భగవంతుని ఫై నీరు ప్రోక్షణ చేయవలెను)

ఆచమనమ్
ఓం భవోద్భవాయ నమః - ఇతి ఆచమనీయం

శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి |
యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్

తస్మా”ద్విరాడ’జాయత | విరాజో అధి పూరు’షః |
స జాతో అత్య’రిచ్యత | పశ్చాద్-భూమిమథో’ పురః ||

శ్లో। । హిమాంబు వాసితై స్తోయయ్ శ్శీతలై రతిపావనయ్:
మృత్యుంజయ। మహాదేవ। శుధ్ధాచమన మాచర । ।

వేదనామాపి వేదాయ దేవానం దేవాతాత్మనీ ।
అచామం కల్పయా మీశ, శుద్ధానం శుద్ధి హేతువే ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ముఖే ఆచమనీయమ్ సమర్పయామి ॥
(అని భగవంతుని కి మూడు సార్లు నీళ్ళు చూపించి పళ్ళెం లో వదలవెలెను)

మధుపర్కం
శ్లో। । దధిగుడ సహితం మధు ప్రకీర్ణం సుఘ్రుత సమన్వితం ధేనుదుగ్ధయుక్తమ్ ।
శుభకర మధుపర్క మాహరత్వం త్రిణయన మృత్యుంజయ । లోకవంధ్య । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । మధుపర్కం సమర్పయామి ॥
(అని భగవంతునికి పెరుగు మరియు తేనె కలిపి చూపించి పళ్ళెం లో వదలవెలెను)

అనంతరం శుధ్ధాచమనీయం సమర్పయామి
పంచామృత స్నానం
శ్లో। । పంచాస్త్రశాస్త్రః పంచాస్య పంచ పాతక సంహర
పంచామృత స్నానమిదం కురు మృత్యుంజయ ప్రభో । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । పంచామృత స్నానం సమర్పయామి ॥
పాలు
ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృష్ణియం । భవా వాజస్య సంగధే । ।
ఇతి క్షీరేరస్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

క్షీర స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

2. పెరుగు
ఓం దధిక్రావ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రణ ఆయుగ్o షి తారిషత్ । ।
ఇతి ధధ్నా స్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

దధి స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

3. నెయ్యి
ఓం శుక్రమసి జ్యోతిరసి తేజో సి దేవో వః సవితోత్పునా ।
త్వచ్చిద్రేణ పవిత్రేణ సూర్యస్మ రశ్మిభి: । ।
ఇతి ఆజ్యేన స్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

ఆజ్య స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

4. తేనె
ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః । మాధ్వీర్నస్సంత్వోషధీ:
మధు నక్త ముతోషసి మధుమత్సార్థివగ్o రజః । మధు ద్యౌ రస్తు నః పితా ।
మధుమాం నో వనస్పతిర్మధుమాగ్o అస్తు సూర్యః । మాధ్వీర్గావో భవంతు నః । ।
ఇతి మధునా స్నపయామి । ।
ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।
మధు స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

5. పంచదార (చక్కెర)
ఓం స్వాధు: పవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే ।
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్o అదాభ్యః । ।

ఇతి శర్కరేణ స్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

శర్కర స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

6. కొబ్బరి నీళ్లు
యాః ఫలినీర్యా అఫలా అపుష్ఫా యాశ్చ పుష్పిణీ: ।
బృహస్పతి ప్రసూతా స్తానో మున్చన్త్వగ్oహసః । ।

ఇతి నారికేళ ఫలోదకేన స్నపయామి । ।

ఓం నమః శంభవే చ మయో భవేచ నమః శంకరాయచ ।
మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ । ।

నారికేళ ఫలోదకానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

పంచామృత స్నానానంతరం శుధ్దోదక స్నానం సమర్పయామి

ఓం ఆపోహిష్ట మయో భువ తాన ఊర్జే దధాతన
మహేరణాయ చక్షసే యోవశ్శివ తమో రస
తస్య భాజయ తేహన ఉశతీరవ మాతర
తస్మా అరంగ మామవ యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయ దాచనః
శుధ్దోదక స్నానం సమర్పయామి

గంధోదకం
అప్సరస్సు యోగంధో గంధర్వేషు చ యద్యశః ।
దైవో యో మానుషో గంధస్సమా గంధస్సురభిర్జుతాం ॥
ఇతి గంధోదక స్నానం సమర్పయామి

శుధ్దోదక స్నానం
ఓం వామదేవాయ నమః - ఇతి స్నానం

అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ |
అహీగ్’‍శ్చ సర్వాం”జంభయంత్సర్వా”శ్చ యాతుధాన్యః’ ।

యత్పురు’షేణ హవిషా” | దేవా యఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ఇధ్మశ్శరధ్ధవిః ||

జగత్రయఖ్యాత సమస్త తీర్థై: సమాహృతై: కల్మష హారిబిశ్చ ।
స్నానం సుతోయై స్సముదాచరత్వం మృత్యుంజయానంత గుణాభిరామ । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । అభిషేక స్నానం సమర్పయామి ॥
(నమక-చమక పఠిత్వా - అభిషేకం కుర్యాత్)

వస్త్రమ్
ఓం జ్యేష్టాయ నమః - ఇతి వస్త్రమ్

ఓం అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మంగళః’ |
యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే

సప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః సప్త సమిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం పశుమ్ ||

శ్లో। । నానా హేమ విచిత్రాణి చీన చీనాం బరాని చ ।
వివిధాని చ దివ్యాని మృత్యుంజయ సుదారాయ । ।

మాయా చిత్ర పటాచ్ఛన్న నిజ గుహ్యేరు తేజసే । నిరావరణ విజ్ఞాన వస్త్రంతే
కల్పయామ్యహమ్

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । వస్త్రయుగ్మం సమర్పయామి ॥
వస్త్రాంతే ఆచమనీయం సమర్పయామి । ।

యజ్ఞోపవీతమ్
ఓం శ్రేష్టాయ నమః - ఇతి యజ్ఞోపవీతమ్

అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః

తం యఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్’ | పురు’షం జాతమ’గ్రతః |
తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||

శ్లో। । విశుద్ద ముక్తా ఫల జాల రమ్యం మనోహరం కాంచన సూత్ర యుక్తమ్ ।
యజ్ఞోపవీతమ్ పరమం పవిత్ర మాధత్స్య మృత్యుంజయ మహాప్రభో । ।

యస్య శక్తి త్రయోణేదం సంప్రోతమఖిలం జగత్ । యజ్ఞ సూత్రయ తస్మైతే యజ్ఞ సూత్రం ప్రకల్పయే

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । యజ్ఞోపవీతమ్ సమర్పయామి ॥
యజ్ఞోపవీతాంతే ఆచమనీయం సమర్పయామి । ।

విభూతి (భస్మ విలేపనం)
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ।
ఉర్వారిక మివ బంధనాన్ మృత్యో ముక్షీయ మామృతాత్ । ।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । భస్మ విలేపనం సమర్పయామి ॥

ఆభరణం
ఓం రుద్రాయ నమః - ఇత్యాభరణాని

ఓం హిర”ణ్యరూపస్సహిర”ణ్య సంద్రుగపాన్న’పాత్సేదుహిర”ణ్య వర్ణః ।
హిరణ్యయో త్పరియోనె”ర్నిష’ద్యా । హిరణ్య దాద’దద్యన్నమస్మై ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । నానావిధ ఆభరణాని సమర్పయామి ॥

గంధమ్
ఓం కాలాయ నమః - ఇతి గంధమ్

నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” |
అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’|

తస్మా”ద్యఙ్ఞాత్-స’ర్వహుతః’ | సంభృ’తం పృషదాజ్యమ్ |
పశూగ్-స్తాగ్‍శ్చ’క్రే వాయవ్యాన్’ | ఆరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||

శ్లో। । శ్రీ గంధం ఘనసార కుంకుమ యుతం కస్తూరికా పూరితం
కాలేయేన హిమాంబునా విరచితం మందార సంవాసితమ్ ॥
దివ్యం దేవ మనోహరం మణిమయే పాత్రే సమారోపితం ।
సర్వాంగేషు విలేపయామి సతతం మృత్యుంజయ శ్రీ విభో ॥

పరమానన్ద సౌరబ్య పరిపూర్ణ దిగంతరమ్ గృహాణ పరమం గన్ధం కృపయా
పరమేశ్వర ।।

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । శ్రీ గంధం సమర్పయామి ॥

ఆభరణం (అక్షతాన్ )
ఓం కల వికరణాయ నమః - ఇతి అక్షతాన్

ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’యోర్జ్యామ్ |
యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప

తస్మా”ద్యఙ్ఞాత్స’ర్వహుతః’ | ఋచః సామా’ని జఙ్ఞిరే |
ఛందాగ్‍మ్’సి జఙ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మా’దజాయత ||

శ్లో। । అక్షతైర్ధవళై ర్దివ్యై స్స్మమ్యక్ తిల సమన్వితై:
మృత్యుంజయ మహదేవ పూజయామి వృషధ్వజ ॥

స్వభవ సుందరాంగాయ భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ఆభరణార్థం శ్వేత అక్షతాన్ సమర్పయామి ॥

ఓం నిధన పతయే నమః
ఓం నిధాన పతాంతికాయ నమః
ఓం ఊర్ధ్వాయ నమః
ఓం ఊర్ధ్వ లింగాయ నమః
ఓం హిరణ్యాయ నమః
ఓం హిరణ్య లింగాయ నమః
ఓం సువర్ణాయ నమః
ఓం సువర్ణ లింగాయ నమః
ఓం దివ్యాయ నమః
ఓం దివ్య లింగాయ నమః
ఓం భవాయ నమః
ఓం భవ లింగాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శర్వ లింగాయ నమః
ఓం శివాయ నమః
ఓం శివ లింగాయ నమః
ఓం జ్వలాయ నమః
ఓం జ్వల లింగాయ నమః
ఓం ఆత్మాయ నమః
ఓం ఆత్మ లింగాయ నమః
ఓం పరమాయ నమః
ఓం పరమ లింగాయ నమః

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । శ్వేత అక్షతాన్ సమర్పయామి ॥

హరిద్రా చూర్ణమ్
ఓం హరిరివ భోగై: పర్యేతి బాహుం జ్యాయా
హేతిం పరిబాధ మానః హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ ।
పుమాన్ పుమాం సం పరి పాతు విశ్వతః ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । హరిద్రా చూర్ణమ్ సమర్పయామి ॥

కుంకుమ విలేపనమ్
ఓం యాగుంగుర్యా సినీవాలీ యా రాకాయా సరస్వతీ ।
ఇంద్రాణీ మహ్వహుతయే వరుణానీం స్వస్తయే ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । కుంకుమ విలీపనం సమర్పయామి ॥

సుగంధ ద్రవ్యాణి
ఓం సుమంగలీరియం వధూ రిమాం సమేత పశ్యత ।
సౌభాగ్య మస్త్యయ్ దత్వా యాధాస్తం విపరేతన ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । సుగంధ ద్రవ్యాణి సమర్పయామి ॥

బిల్వపత్రం
ఓం నమో బిల్మినే చ కవచి నే చ
నమశ్రుతాయచ శ్రుత సేనాయచ ॥
శ్లో। । త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధమ్
త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । బిల్వ పత్రాణి సమర్పయామి ॥

(బిల్వాష్టకం పఠిత్వా)

పుష్పమ్
ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’యోర్జ్యామ్ |
యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప

తస్మాదశ్వా’ అజాయంత | యే కే చో’భయాద’తః |
గావో’ హ జఙ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అ’జావయః’ ||

శ్లో। । చంపక పంకజ పున్నాగయ్హి కున్దయ్హి కరవీర మల్లికా కుసుమైహి
విస్తారయ జటాజూటం మృత్యుంజయ పుండరీక నాయనాప్త ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । నానా విధ పరిమళ పత్రాణి సమర్పయామి ॥

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః (10)
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః (20)
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కౌమారయే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః (30)
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం క్తెలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః (40)
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వఙ్ఞాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యఙ్ఞమయాయ నమః (50)
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః (60)
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాధిపాయ నమః (70)
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః (80)
ఓం అహిర్భుథ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం స్వాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః (90)
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః (100)
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపపర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
దివ్య పాదుకే
శ్లో। । మాణిక్య పాదుకా ద్వంద్వౌ మౌనిహృత్పద్మ మందిరే ।
పాదౌ సత్పద్మ సుహ్రుదౌ కురు మృత్యుంజయ ప్రభో ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । దివ్య పాదుకే సమర్పయామి ॥

చామరం
శ్లో। । గజవదనస్కంద ధృతేనాతిస్వచ్చేన చామర యుగళేన ।
అచల కానన పద్మం మృత్యుంజయ భావయామి హ్రుత్పద్మే ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । చామర యుగళాభ్యం సమర్పయామి ॥

ఛత్రమ్
శ్లో। । ముక్తాత పత్రం శశి కోటి శుభ్రం శుభప్రదం త్వత్తనుకాంతి యుక్తమ్ ।
మాణిక్య సంస్థాపిత హేమదండం సురేశ మృత్యుంజయ తేర్పయామి ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ఛత్రం సమర్పయామి ॥

ధూపమ్
ఓం బలాయ నమః - ఇతి ధూపం

అవతత్యధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే |
నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః సుమనా’ భవ

యత్పురు’షం వ్య’దధుః | కతిథా వ్య’కల్పయన్ |
ముఖం కిమ’స్య కౌ బాహూ | కావూరూ పాదా’వుచ్యేతే ||

శ్లో। । కర్పూర చూర్ణయ్ కపిలాజ్య పూతై ర్దాస్యామి కాలేయ సమన్వితైశ్చ ।
సముధ్భవా న్పావన గంధ ధూపా న్మ్రుత్యుంజయా ఘ్రాపణమాచరామి ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । ధూప మాఘ్రా పయామి ॥

దీపమ్
ఓం బలప్రమథనాయ నమః - ఇతి దీపమ్

విజ్యం ధనుః’ కపర్దినోవిశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత |
అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషంగథిః

బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః |
ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

శ్లో। । వర్తిత్రయోపేత మఖండ దీప్త్యా తమోహరం బాహ్యమథాoతరంచ ।
సాజ్యం సమస్తా మరవర్గ హృద్యం సురేశ మృత్యుంజయ పశ్య దీపమ్ ॥

సుప్రకాశో మహా దీపః సర్వతస్తి మిరాపః । సబాహ్యోభ్యన్తర జ్యొతిహ్ దీపోయం
పరిగృహ్యతామ్ ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః । । దీపం దర్శయామి ॥
ధూప దీపా నంతరం శుధ్దాచమనీయం సమర్పయామి ॥

నైవేద్యం
ఓం సర్వ భూత దమనాయ నమః - ఇతి నైవేద్యం

యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’తే ధనుః’ |
తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ

చంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||

శ్లో। । రాజాన్నం మధురాన్వితాతి మృదులం మాణిక్య పాత్రేస్తితమ్ ।
హింగూ జీరక సన్మరీచి మిళితై శ్శాకయ్ రనేకయ్ శ్శుభయ్: ॥
పాకం సమ్యగపూప సూపసహితం సద్యోఘ్రుతే నాప్లుతమ్ ।
శ్రీ మృత్యుంజయ పార్వతీ ప్రియ విభో । సాపోశనం భుజ్యతాం ॥

అన్నం చతుర్విదంస్వాదుర సి: షడ్బి: సమన్వితమ్ భక్ష భోజ్య సమాయుక్తం ।
నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ॥

ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియోయోన ప్రచోదయాత్ । । సత్యంత్వర్తేన పరిషించామి (సాయం కాలం అయితే ఋతం తత్వేన పరిషించామి) - అమృతమస్తు అమృతోపస్తరణ మసి స్వాహా ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
హే మృత్యుంజయ ప్రభో । యథా సుఖం జుషద్వజం ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః - నైవేద్యం సమర్పయామి
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్ష్యాళయామి, పాదౌ ప్రక్ష్యాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం
ఓం మనోన్మనాయ నమః - ఇతి తాంబూలం
ఓం నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయధృష్ణవే” |
ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే

నాభ్యా’ ఆసీదంతరి’క్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమ’వర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా’ లోకాగ్మ్ అక’ల్పయన్ ||

శ్లో। । మౌక్తిక చూర్ణ సమేతై ర్ముగ మద ఘన సార వాసితయ్హి పూగయ్హి ।
పర్ణై స్స్వర్ణ సమానయ్ర్ మృత్యుంజయ తేర్పయామి తాంబూలం ॥
శ్రీ భవాని శంకర స్వామి నే నమః - తాంబూలం సమర్పయామి

నీరాజనం
ఓం అఘోరేభ్యో - ఇతి నీరాజనం
పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ |
అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్

వేదాహమే’తం పురు’షం మహాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’సస్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వా‌உభివదన్, యదా‌உ‌உస్తే” ||

శ్లో। । నీరాజనం నిర్మల దీప్తి మద్భి: దీపాంకురై రుజ్వల ముచ్చ్రితయ్స్చ ।
ఘంటా నినాదేన సమర్పయామి మృత్యుంజయాయ త్రిపురాంతకాయ ॥

చంద్రాది త్యౌచ ధరణి విద్యుదగ్నిస్త దైవచ త్వమేవ సర్వజ్యోతింషి
అర్తిక్యం ప్రతి గుహ్యతాం ॥ ఓం సామ్రాజ్యంచ విరాజంచాభి శ్రీర్యాచన గృహే ।
లక్ష్మీ రాష్ట్రస్యయాముఖే తయమాసగం సృజామసి ॥

శ్రీ భవాని శంకర స్వామి నే నమః - దివ్య మంగళ కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ॥

మంత్రపుష్పమ్
ఓం తత్పురుషాయ విద్మహే - ఇతి మంత్రపుష్పం

నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యంబకాయ’
త్రిపురాంతకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’
నీలకంఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’
సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’

ధాతా పురస్తాద్యము’దాజహార’ | శక్రః ప్రవిద్వాన్-ప్రదిశశ్చత’స్రః |
తమేవం విద్వానమృత’ ఇహ భ’వతి | నాన్యః పంథా అయ’నాయ విద్యతే ||

శ్లో। । పున్నాగ నీలోత్పల కుందజాతీ మందార మల్లీ కరవీర పంకజై:
పుష్పాంజలిం బిల్వదళయ్ స్తులస్యా మృత్యుంజయాంఘ్రౌ వినివేశయామి ॥

(నారాయణ సూక్తం , మహా మంత్రపుష్పం పఠిత్వా)
శ్రీ భవాని శంకర స్వామి నే నమః - మహా మంత్రపుష్పాంజలిo సమర్పయామి ॥

(చేతిలో ఉన్న పుష్పాక్షతలను దేవునిపై వేయవలెను)

ప్రదక్షిణ నమస్కారం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా
అన్యధా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర । ।

ఇతి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ॥

సాష్టాంగ నమస్కారం
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పదాభ్యం కరాభ్యం జనుభ్యం ప్రణామోస్తాంగ ముచ్యతే ॥

పునః పూజ
శ్రీ భవాని శంకర స్వామినే నమః - ఇతి పునః పూజాంచ కరిష్యే ॥

ఛత్రం ఆచ్చాదయామి , చామరం వీచయామి , నృత్యం దర్శయామి గీతం శ్రావ్యయామి, ఆందోళికా మారోహయామి, అశ్ర్వానారోహయామి గజానారోహయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి.
(అక్షతలు వేయవలెను)

పూజ సమర్పణమ్
శ్లో। । మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ ।
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ॥

భగవతః శ్రీ భవాని శంకర స్వామినః పూజాభిషేకాలన్కర నైవేద్య దీపారాధన కర్మ మధ్యే యత్కించిత్ మంత్ర లోపే, తంత్ర లోపే, క్రియా లోపే, శక్తి లోపే , భక్తి లోపే, కాల లోపే, నైవేద్యాది విహిత లోపే చసర్వం యథా ప్రోక్తం, యథా శాత్రానుష్టితం భగవత్ప్రీతికరం.

భూయాదితి మహాన్తో ను గృహ్ణంతు - తథాస్తు
సర్వే జనాః సుఖినోభవన్తు - తథాస్తు
సమస్త సంమంగళాని భవన్తు - తథాస్తు
రాజాధార్మికో విజయీ భవతు - తథాస్తు
దేశోయం నిరుపద్రవోస్తూ - తథాస్తు
సత్యాఏతా ఆశిషః సన్తు - తథాస్తు

అనయా శ్రీ మదాద్య శంకర భగవత్పాద విరచిత చతుశ్చత్వారిoశదుపచార పూర్వక సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ భవానీ శంకర దేవతా సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు ॥
(చేతిలో అక్షతలు నీరు వేసుకుని పళ్ళెములో విడువ వలెను)

ఊద్వాసనమ్
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్।
తేహనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః ॥

శ్రీ భవానీ శంకర స్వామి నే నమః యథా స్థానం ప్రవేశయామి - శోభనే పునరాగామనాయచ

విసర్గ బిందు మాత్రాణి పద పాద అక్షరాణిచ
న్యూనాని చాతిరిక్తాని క్షమస్య పరమేశ్వర
అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా ।
తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమా ॥

ఆవాహనం నజానామి
నజా నామి విసర్జనం
పూజం చైవ నజానామి
క్షమ్యతాం ప
రమేశ్వర ॥

మధ్యే మంత్ర తంత్ర స్వరవర్ణ ధ్యాననియమ న్యూనాతిరిక్త లోపదోష
ప్రాయశ్చిత్తార్థం అచ్యుత అనంత గోవింద మహామంత్ర జపం కరిష్యే । ।

అచ్యుతాయ నమః ।
అనంతాయ నమః ।
గోవిందాయ నమః ।

॥ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ॥