Thursday 26 November 2015

ప్రాంజలి ప్రభ - అష్టమోద్యాయ:- అక్షరబ్రహ్మయోగ: (Telugu Listen Magazine)

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - అష్టమోద్యాయ: 

సర్వేజనా సుఖినోభవంతు
అక్షరబ్రహ్మయోగ:
మొదట భగవద్గీతను వినుటకు
ఈ లింకును టిక్ చేయండి -తెలుగును రక్షించండి
http://vocaroo.com/i/s1H4t33f9jfR 

శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 1,2 శ్లోకాల భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు      


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 3వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు
http://vocaroo.com/i/s1ovjm2Fmiaq


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 4వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు

http://vocaroo.com/i/s1BlxfFfSGri


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 5వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు
  http://vocaroo.com/i/s1xwSoVQb8TN (25.17)

శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 6వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు
http://vocaroo.com/i/s15a3yYxT4ap


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 7 వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు
  http://vocaroo.com/i/s0tcL6MTWjwO


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 8 వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు
  http://vocaroo.com/i/s0DtGfKOC6nD
 

శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 9వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు
http://vocaroo.com/i/s1uwBFjVPPgH


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 10వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు 
http://vocaroo.com/i/s1vdhtk8leOg 


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 11వ  శ్లోక భావాల పరంపర వివరణ నాగొంతు ద్వారా మీరు వినగలరు
http://vocaroo.com/i/s1jfz56dtnHW


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 12 మరియు 13వ  శ్లోకాల  భావాల పరంపర వివరణ ను మీరువినగలరు
 
http://vocaroo.com/i/s1o6wKljNlyk 

శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 14 వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు

 http://vocaroo.com/i/s0ZcwrK07VOD 

శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 15 వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరురు

http://vocaroo.com/i/s0WKEBOEiKCN 


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 16వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరురు
http://vocaroo.com/i/s1Wd0isEwkFR


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 17వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు 
http://vocaroo.com/i/s01y7m6Skyix 


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 18 మరియు 19వ  శ్లోకాల  భావాల పరంపర వివరణ ను మీరువినగలరు

http://vocaroo.com/i/s05JF8VNofQ8


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 20 వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు 
http://vocaroo.com/i/s1KQoikOpk3S 


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 21వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు
http://vocaroo.com/i/s0wPJ6mIb4E7 


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 22వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు
http://vocaroo.com/i/s1SKMz0rlFsv  


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 23వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు
http://vocaroo.com/i/s0C1C4FgElcJ 


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 24వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు
http://vocaroo.com/i/s1X7LIWOQ3kK 


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 25వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు
http://vocaroo.com/i/s0RWit0iwThF 


శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 26వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు
http://vocaroo.com/i/s0jtLxrZrFaG  (5.48)


\రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 27వ  శ్లోక  భావాల పరంపర
http://vocaroo.com/i/s0dsRxVcBCMJ  

శ్రీ మ త్ భగవద్గీత  8వ అధ్యాయం గురించి 28వ  శ్లోక  భావాల పరంపర వివరణ ను మీరు వినగలరు
 
http://vocaroo.com/i/s1iEgpYEmDw3 

శిష్టత - మార్గ శిర మాసం



శిష్టత - మార్గ శిర మాసం వినేటి నుండి మార్గశిర మాసం ప్రారంభం
వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.
హేమంత ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయం గా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు. చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు.ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.
సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం లో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, మనం తీసుకొనే ఆహార పదార్దాల లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు.
మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది.
మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి.
మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.
మార్గశిర అష్టమి ని కాళభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.
మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వారా దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసం లో వచ్చే ద్వాదశి ని అఖండ ద్వాదశి అంటారు.
మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు.
మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీ ని నోరార పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.
కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు.మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకం గా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.




ధ్యానము

మానవుడు నిత్యమూ తన మనసులో స్మరించవలసింది - ధ్యానించవలసింది ఏమిటని ప్రశ్న. కళ్లు మూసినా తెరచినా కనిపించేది మనకీ ప్రపంచమే. కాబట్టి అందులో విషయాలే మనసుకు వస్తుంటాయి. వీటిని గుర్చే ఆలోచిస్తుంటాము. అందులోనూ మనకు కొన్ని ఇష్టమైనవైతే కొన్ని ఇష్టం లేనివి. ఇష్టం లేని వాటిని పరిహరిస్తూ ఇష్టమున్న వాటిని గురించే ధ్యానిస్తుంటాము. ఇదే సహజంగా ప్రతి మానవుడు చేస్తున్న పని. పగలంతా మెలుకువగా ఉన్నంత వరకూ ఇదే. రాత్రి స్వప్నంలోనే మనమేదీ ఆలోచించనిది. ఆలోచించకున్నా ఈ ఆలోచనల సంస్కారాలే అక్కడా పనిచేస్తూ మనలను వెంటాడుతుంటాయి. మొత్తంమీద ప్రాపంచిక విషయాలతోనే నిండి నిత్యమూ సతమతవుతూంటాయి మానవుడి మనోవ్యాపారలన్నీ.

అయితే ఈ ఆలోచనల వల్ల ఏమైనా సుఖమా శాంతా అని చూస్తే ఏదీ లేదు. లేదని పెద్దలు చెప్పటమే గాదు. ఆబాలగోపాలమూ అందరికీ అనుభవసిధ్ధమే. శాంతి సౌఖ్యాలకు నోచుకోనప్పుడీ ఆలోచనలెన్నిపెట్టుకొని ఏమి ప్రయోజనం. మానవుడెప్పుడూ కోరుకొనేది అవి రెండే గదా. మరి ఎలా సిధ్ధిస్తాయవి. దేనివల్ల సిధ్ధిస్తాయి. ప్రాపంచికం వల్ల కాదని ఎప్పుడన్నామో ఇక పారమార్ధికం వల్లనే కావాలది. ఇది ఈ ప్రాపంచక పదార్ధాలన్నింటినీ వ్యాపించిన ఒక మహాచైతన్యం. నిరాకారమైన దానివల్లనే ఈ ఆకారలన్నీ ఏర్పడుతున్నాయి. నిశ్చలమైన దాని వల్లనే ఇవన్నీ ఇలా చలిస్తున్నాయి. సర్వవ్యాపకమైన దాని భంగిమలే ఈ పరిమితమైన విశేషాలన్నీ. కాబట్టి దాన్ని గురించే ఎప్పుడూ మనం ధ్యానించవలసింది. ఆత్మ చైతన్యంతో సంబంధమే నిజమైన జీవితం మానవుడికి. అనాత్మ ప్రపంచ సాంగత్యమే మరణం. ఆత్మ ధ్యానంలో ఉన్న మానవుడు మిగతా మానవుల మధ్య మృతకళేబరాల మధ్య ఒక కాటి కాపరిలాగా జీవుస్తుంటాడని వాక్రుచ్చారు పెద్దలు.

అయితే ఏమిటీ ఆత్మ ధ్యానము. అది ఎలా చేయాలని ప్రశ్న. నాలుగు భూమికలున్నా యిందులో. మొదటిది నోటితో ఏదో జపిస్తూ కీర్తిస్తూ కూచోటం. ఇది నోటి వరకే. మనసు మీద పని చేయదు దాని ప్రభావం. మనసు ఏ భావమూ లేక స్తబ్ధంగానే ఉండిపోతుంది. అయితే ఎంతవరకంటే పిచ్చి పిచ్చి ప్రసంగాలతో కాలం వృధా పుచ్చక దైవప్రార్ధన చేస్తూ పోవటం కొంచెం మేలు. పోతే రెండవది నోటితో అనే దాని భావం మనసులో ప్రవేశించటం. అంటే శబ్దాన్ని దాటి అర్ధం దగ్గరికి వచ్చామన్నమాట. కాని అంతవరకే అది. మనసులో ప్రవేశించినా నిలకడగా ఉండదది. మెరుపులాగా వస్తూపోతూ ఉంటుంది. పోతే మూడవది పరమాత్మ రూపం బాగా మనసులో నాటుకొని కదలకుండా నిలచి ఉండటం. ఎంతగా నిలుస్తుందంటే మిగతా ప్రాపంచిక విషయాల మీదికి మరలా దాన్ని త్రిప్పాలంటే బలవంతంగానే త్రిప్పాల్సివస్తుంది. రెండవదానికిది కేవలం ప్రతి ద్వంద్వి అయిన భూమిక.

పోతే ఇక నాలుగవది ఆఖరిది ఏమంటే మనసులో భగవద్రూపాన్ని గూర్చిన ఆలోచన గాదు. భగవత్తత్వమే నిలచి ఉండాలి. ప్రపంచమూ - భగవంతుడూ - దాన్ని గూర్చిన ఆలోచనా - అన్నీ కలసి భగవత్స్వరూపంగానే అనుభవానికి రావాలి సాధకుడికి. అది కూడా తనకు భిన్నంగా కాక తన ఆత్మ స్వరూపంగానే సాక్షాత్కరించాలి. నేనొక ధ్యాతను - నాకొక ధ్యేయమైన పదార్ధముంది - దాన్ని గూర్చే ధ్యానిస్తున్నాననే భావమే ఉండదప్పుడు. ధ్యాతా నారాయణః ధ్యానం నారాయణః -- అన్నట్టు అంతా ఆత్మ స్వరూపమే. ఇదే ధ్యానానికి పరాకాష్ఠ.

   


ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు.
మనకు నవ్వుల కొరకు ఆమె ఈ విధంగా ముద్దు పేర్లతో
పిలిచిది.
అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన,
రెండవ అమ్మాయి పేరు చిరిగిన,
మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన,
నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...
ఇలా ఈ విధంగా ఆ తల్లి తన కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది.
ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.
అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’
అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’
తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!
అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే కూర్చుంటాను’’
తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’
అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే కూర్చుంటాను’’
అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు. కొద్దిసేపు తరువాత....
తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా.. పాలు తీసుకుంటారా?’’
అతిథి : ‘‘టీ’’
తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’
అతిథి : ‘‘వద్దు వద్దులెండి.. నేను పాలు తీసుకుంటాను’’
తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని రామ్మా’’
ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి పారిపోతాడు


బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?

పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.

ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యం ఉందా? అంటే విశ్లేషిస్తే పెద్దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

మరి పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయం ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. ఎందుకంటే ఉదయాన్నే ప్రక్రుతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని మనందరకూ తెలుసు.రాత్రంతా చెట్లు విడిచిన ఆక్సిజన్ వేకువన కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది.

మరి గృహిణులు ఎందుకు లేవాలి? ఇది అందరకు తెలిసినదే. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంటపనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు వారు రోజంతా. అటువంటి వారికీ ఒత్తిడి లేని జీవన విధానం, మానసిక , శారీరిక ఆరోగ్యం చాల అవసరం. బ్రాహ్మి ముహూర్తం లో లేవటం వలన మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, శారీరిక ఆరోగ్యం కూడా సమకూరుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏంటంటే, వేకువనే లేవడం వలన ఇంటి పనులు అన్ని ఒక పద్దతిగా ఆందోళన లేకుండా చేసుకోవడానికి వీలు అవుతుంది. గందరగోళం లేకుండా ఉంటుంది. పనులు ఒక క్రమశిక్షణతో జరుగుతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి హృదయం, మెదడు, ప్రశాంతంగా ఉంటాయి.

బ్రాహ్మి ముహూర్తం లో లేవడం వలన ఇంకొక మేలు ఏమిటంటే, సూర్యుని లేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో డి విటమిన్ ఉంటుంది అని అందరికి తెలుసు, ఎముకల పటుత్వానికి ఇది ఎంతో అవసరం. ఇదివరకు మాములు ఇల్లు ఉన్నపుడు ఏదో ఒకవేపు నుంచి ఎండ ఇంట్లోకి వచ్చేది. ఈనాడు అంతా apartment culture కదా. కొన్ని ఇళ్ళల్లో సూర్యోదయం కనిపించదు. అటువంటివారికి డి విటమిన్ లోపం వచ్చే అవకాసం ఉంది. కొన్ని చర్మ వ్యాదులకు కూడా సూర్యరశ్మి మేలు చేస్తుంది. అటువంటి వారు ఉదయం , సాయంత్రం కొన్ని నిముషాలు సూర్య కిరణాలు తమకు సోకేటట్టుగా లేత ఎండలో నుంచోవడం ఎంతో మంచిది.

మనం తొందరగా లేస్తే, పిల్లలు కూడా మనలను చూసి లేవడం అలవాటు చేసుకుంటారు. వారికీ కూడా క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మన పూర్వులు ఏమి చెప్పినా, మన మంచికే చెప్పారు. వారు చెప్పిన సూత్రాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకు ఎప్పుడూ మేలే జరుగుతుంది.

* రాదా మాధవము (ఆ)


ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం     ఓం శ్రీ రాం

రాదా మాధవము (ఆ)

 
సర్వేజనా సుఖినోభవంతు
  (సేకరణ అంతర్జాల భాండాగారం )
రాదా మాధవము
మాధవ ఉవాచ:
మధుర పదముల తో నీ పలుకుల మాధుర్యమును వర్ణించనా?
అధరముల తీయదనము తేనెలొలుకు ముద్దుల అందించనా?
సఖీ! రాధా! అందించవే అందముల; వర్ణింప తరమా?
నాకు ఆ ప్రణయ సంగపు రసానందపు రుచులు?

బాహు లతల అల్లుకోవే నను
ఊహలను చేయవే నిజములు
నీ తనూ లత రచనా చమత్కృతి

ఆ విధాత ఊహల సుందర ప్రతి

రాయలేనే నీ విలాసముల పై కైతలు
మాయ చేయునే నీ లావణ్యముల కాంతులు
కతలు కావు పూవిలుకాడు కలిగించు వెతలు
ముద్దుల ముచ్చటల తేలి పొమ్మని అనంగుని ఆనతులు

అభిసారికవై రావే ఆ యమునా తటికి
పున్నమి వెన్నెలల రస కౌముదులు ప్రసరించుచు
ముదము మీర తమిదీర చేయుదమే
రస సంగరము; మనలో విజేతలెవరైన నేమి?

ప్రియా! రాధా! నా ప్రణయినీ! ముద్దుల రమణీ!
పండించు కొందము మన వలపుల తీపి తలపుల
మితిమీరిన కుతితో రతిలో నిపుణులమై
అనుభవింతము అద్వైతమును భరించలేని ఆనందముతో

II

రాగమున ఇమిడి పదములగును శ్రావ్యగీతములు

అనురాగమున ఒదిగి మనసులగును ఏకము

సఖీ! రాధా! పెదవులపై పెదవులాన్చి మధువులానుచు

రస వేణువూదెదను నీ తనువునే మురళిగా మార్చి
అధర సంస్పర్శమున తనువులూగగ రస కేళికై
మనసులు తొందర చేయ నీ చీర ముడులూడ
రాధా! ఇంకెందుకే ఈ ఆచ్ఛాదనలు చూసి నిమిరి
కుతి దీర నలిపి తరింతునే నీ గుబ్బ చన్నుల సొగసు
మదోన్మత్తతతో ఒకరినొకరము అల్లుకుని కసిదీర
కమనీయ చౌశీతి బంధముల పొర్లి అలసి సొలసి
తేలి తూలి జగతిని మరచి సలిపెదమే సలుపులు దీర
మమేకమునొంది తనువులు అంగములు కూడ అద్వైతమొన్దెదమె తమిదీర

అభిసారికవై రావే ఆ యమునా తటికి
పున్నమి వెన్నెలల రస కౌముదులు ప్రసరించుచు
ముదము మీర తమిదీర చేయుదమే
రస సంగరము; మనలో విజేతలెవరైన నేమి?

ప్రియా! రాధా! నా ప్రణయినీ! ముద్దుల రమణీ!
పండించు కొందము మన వలపుల తీపి తలపుల
మితిమీరిన కుతితో  రతిలో నిపుణులమై 
అనుభవింతము  అద్వైతమును భరించలేని ఆనందముతో
దయచేసి మీరు ఆనందము పొందటానికి ఈ క్రింద లైను ఆన్ చేయండి, విని ఆనందం పొందండి తెలుగును బ్రతికించండి


ప్రణయాద్వైతము

ప్రేమ నిండు చందమామ
ప్రేమికులు అది చిందించు వెన్నెలలు
ప్రేమించుట భోగమో, యోగమో
భువిని దివిని విరాజిల్లును ప్రణయమున

కలసిన మనసులు పాడు యుగళగీతము
కులుకు హృదయముల రసానందము
రాధయు కృష్ణుడును ప్రణయజీవుల మనోరాజీవములు
నిరంతర ప్రేరణములు నిగమాంత రాగములు నితాంత అనుబంధములు

ప్రణయమున మునిగి తేలు యువతీయువకులు
ప్రేయసీప్రియులు స్త్రీపురుషులు; రతీమన్మథులు ఊర్వసీపురూరవులు
పద్మావతీశ్రీనివాసులు మీనాక్షీసుందరేశ్వరులు ఆండాళ్ శ్రీరంగనాథులు      
రసానందహృదయాంతరంగులు శాంతానందయోగులు
ప్రణయము యోగము

ప్రేమను మనసులు ముడివడుట అద్వైతము
రాధామాధవరతిచరితమితి- బోధావహం శ్రుతిభూషణం

//ప// రాధామాధవరతిచరితమితి-
బోధావహం శ్రుతిభూషణం ||

//చ// గహనే ద్వావపి గత్వా గత్వా రహసి రతిం ప్రేరయతి సతి |
విహరతస్తదా విలసంతౌ విహతగృహాశౌ వివశౌ తౌ ||

//చ// లజ్జాశబల విలాసలీలయా కజ్జలనయన వికారేణ |
హృజ్జావ్యవహృత(హిత) హృదయా రతి స్సజ్జా సంభ్రమచపలా జాతా ||

//చ// పురతో యాంతం పురుషం వకుళైః కురంటకైర్వా కుటజైర్వా |
పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా- గిరం వినాపి వికిరతి ముదమ్ ||

//చ// హరి సురభూరుహ మారోహతీవ స్వ చరణేన కటిం సంవేష్ట్య |
పరిరంభణ సంపాదితపులకై స్సరుచిర్జాతా సుమలతికేవ ||

//చ// విధుముఖదర్శన విగళితలజ్జా- త్వధరబింబఫలమాస్వాద్య
మధురోపాయనమార్గేణ కుచౌ నిధివద్దత్వా నిత్యసుఖమితా ||

//చ// సురుచిరకేతక సుమదళ నఖరై- ర్వర చిబుకం సా పరివర్త్య
తరుణిమ సింధౌ తదీయదృగ్జల- చరయుగళం సంసక్తం చకార ||

//చ// వచన విలాసైర్వశీకృత్య తం నిచులకుంజ మానితదేశే |
ప్రచురసైకతే పల్లవశయనే- రచిత రతికళా రాగేణాస ||

//చ// అభినవకల్యాణాంచితరూపా- వభినివేశ సంయతచిత్తౌ |
బభూవతు స్తత్పరౌ వేంకట విభునా సా తద్విధినా స తయా ||

//చ// సచ లజ్జావీక్షణో భవతి తం కచభర గంధం ఘ్రాపయతి |
నచలతిచేన్మానవతీ తథాపి కుచసంగాదనుకూలయతి ||

//చ// అవనతశిరసాప్యతి సుభగం వివిధాలాపైర్వివశయతి |
ప్రవిమల కరరుహరచన విలాసై ర్భువనపతిం తం భూషయతి ||

//చ// లతాగృహమేళనం నవసై కతవైభవ సౌఖ్యం దృష్ట్వా |
తతస్తతశ్చరస్తౌ కేళీ- వ్రతచర్యాం తాం వాంఛంతౌ ||

//చ// వనకుసుమ విశదవరవాసనయా- ఘనసారరజోగంధైశ్చ |
జనయతి పవనే సపది వికారం- వనితా పురుషౌ జనితాశౌ ||

//చ// ఏవం విచరన్ హేలా విముఖ- శ్రీవేంకటగిరి దేవోయమ్ |
పావనరాధాపరిరంభసుఖ- శ్రీ వైభవసుస్థిరో భవతి ||

ముఖ్యపదాల అర్ధం:
రతిచరితమ్: సంభోగ చరిత్ర
బోధావహం: బోధన చేయదగినది (చెప్పదగినది)
శ్రుతిభూషణం: చెవులకి అలంకారమైనది (వినుటకు ఆనందాన్ని కలిగించేది)

గహనే: అడవి యందు, గుహ యందు
ద్వావపి: ఇద్దరూ కూడా
గత్వా, గత్వా: వెళ్ళి, వెళ్ళి
రహసి: రహస్యముగా
సతి: రాధ
రతిం ప్రేరయతి: మదనుణ్ణి ప్రేరేపిస్తున్నది
విహరతః: విహరిస్తూ
తదా: అప్పుడు
విలసంతౌ: ప్రకాశమానమైన ఇద్దరూ
విహతగృహాశౌ: ఇళ్ళను వదిలిపెట్టి
తౌ: వారిరువురూ
వివశౌ: వివశులై పరవశంతో ఉన్నారు.

లజ్జాశబల: ఎక్కువ సిగ్గుతో కూడిన రాధ
విలాసలీలయా: మాధవుని శృంగార చేష్టల చేత
కజ్జలనయన: నల్లని కాటుక వంటి కన్నుల
వికారేణ: వికారము చేత (అంటే, ఆమె నల్లని కన్నులు శృంగారవాంఛల చేత, మాధనువుని పై సిగ్గువలన ఎర్రబడ్దాయని కవి భావన)
హృజ్జావ్యవహృత: హృత్+జ+అవ్యవహిత= హృదయమునందు పుట్టిన మన్మధుడు సమీపించిన
హృదయా: మనస్సు చేత
రతి స్సజ్జా: రతికి సిద్ధమై
సంభ్రమ: తొందరపడుతూ
చపల: నిలువలేకుండుట
జాతా: అయినది

పురతో యాంతం పురుషం: ముందు నడుస్తున్న మాధవుని
వకుళైః: పొగడచెట్టు పూల చేత
కురంటకై:= పచ్చ పెద్దగోటంట పువ్వులు చేత (Yellow amarnath)
కుటజైర్వా: కొండమల్లె పూవుల చేత ( A tree called Echites antidysenterica. అంకుడుచెట్టు)
పశ్చాల్లగ్నా: వెనుకగా వస్తూ
పరమం ప్రహరతి: బాగుగా కొడుతున్నది (ప్రహరము: Striking)
గిరం వినాపి: మాటలు లేకుండగనే
వికిరతి: అనుభవించుచున్నది
ముదమ్: సంతోషాన్ని

హరి: విష్ణువు, కృష్ణుడు
సురభూరుహ: దేవలోకంలో మొలచిన మొక్క-పారిజాతం
ఆరోహతీవ: ఎక్కేదానివలే
స్వ చరణేన: తన పాదములచే
కటిం: నడుమును
సంవేష్ట్య: చుట్టివేసి having wrapped around
పరిరంభణ సంపాదిత: ఆలింగనాల వల్ల వచ్చిన
పులకై:= పులకలచేత
సరుచి:+జాతా: అత్యంత ఆనందము పొందినది (great delight in)
సుమలతికేవ: పువ్వులతీగవలే

విధుముఖదర్శన: చంద్రముఖము వంటి కృష్ణుని దర్శనముతో
విగళితలజ్జాత్: సిగ్గును వదిలిపెట్టినదై
అధరబింబఫలమ్+ఆస్వాద్య: గుండ్రని ముఖములో ఎర్రని పండువలే ఉన్న క్రింది పెదవిని ఆస్వాదించి
మధుర+ఉపాయనమార్గేణ: తియ్యని ఎదురు బహుమతులు ఇచ్చే మార్గంలో
కుచౌ నిధివద్దత్వా: స్తన నిధులను సమర్పించి
నిత్యసుఖమితా: నిరంతర సుఖాన్ని పొందుతున్నది

సురుచిరకేతక: అందమైన మొగలిపువ్వుల
సుమదళ నఖరైః= పువ్వు రేకుల వంటి గోళ్ళచేత
వర చిబుకం: వరుని గెడ్డమును
సా: ఆమె
పరివర్త్య: చుట్టూ తిప్పి
తరుణిమ సింధౌ: ఆడతనమనే సముద్రములో
తదీయ: అతనియొక్క
దృక్+జలచరయుగళం= కన్నులనే చేపల జంటను
సం+సక్తం: బాగుగా తిరిగేట్టు
చకార: చేసెను

వచన విలాసై:=విలాసమైన మాటలతో
వశీకృత్య: వశము చేసికొని
తం: అతనిని (కృష్ణుని)
నిచుల: ఎర్రగన్నేరుThe red Oleander tree.
కుంజ: పొదరిల్లు A thicket, a bower, or arbour.
మానితదేశే: గౌరవింపబడిన ప్రదేశములో
ప్రచురసైకతే: పెద్దవైన ఇసుక తిన్నెలయందు
పల్లవశయనే: చిగురు పడకల మీద
రతికళా: సంభోగ కళల
రాగేణ: రాగములచే
సా+రచిత: ఆమె ఆయని తనువుపై రచన చేసినది

అభినవకల్యాణ: కొత్తగా పెళ్ళైనట్టుగా
అంచితరూప+అభిన(ని?)వేశ= అందమైన రూపాలు కలిగి, గొప్ప శ్రద్ధ, పట్టుదల కలిగినవారై Ardour, zeal, enthusiasm, earnestness
సంయతచిత్తౌ: మనస్సును నిగ్రహించుకుంటూ
వేంకట విభునా: వేంకట విభుని యందు
తయా: ఆమె చేత
స: అతడు
తద్విధినా: ఆ రతివిధానాలలో
తత్పరౌ బభూవతు: రతిక్రీడా తత్పరతను పొందియున్నారు.

సచ= అతడు కూడా
లజ్జావీక్షణః= సిగ్గుతోకూడిన చూపులవాడు
భవతి= అగుచున్నాడు/అయ్యాడు
తం= అతని చేత
కచభర గంధం= జుట్టుకు స్వత:సిద్ధముగా ఉన్న వాసనను
ఘ్రాపయతి= ఆఘ్రాణింపచేస్తున్నది
అచలతిచేత్: కదలకపోతూంటే
తత్+మానవతీ= ఆ సిగ్గు కలిగిన ఆడది
తథాపి= అప్పుడు
కుచసంగాత్= ఆమె స్తనాలు ఆయనకు తగిలేలా
అనుకూలయతి= అనుకూలముగా ఉంచినది

అవనతశిరసాపి=వంచుకున్న శిరస్సైనప్పటికీ
అతి సుభగం=అత్యంత సంతోషాన్ని పొందుతూ
వివిధ+ఆలాపైః=అనేక రకములైన అరుపులకు
వశయతి= వశురాలైయున్నది
ప్రవిమల కరరుహరచన=తెల్లని చేతుల్లోంచి పుట్టిన రచనల
విలాసైః=విలాసములచే
భువనపతిం=ఈ భువనానికి పతియైన
తం=శ్రీకృష్ణుని
భూషయతి=ఆభరణమైనది

లతాగృహమేళనం=లతలచే చుట్టబడిన ఇళ్ళ సమూహాలను
సైకతవైభవ = ఇసుక తిన్నెల వైభవాలను
నవ సౌఖ్యం = కొత్త సమాగమ విధానాలను
దృష్ట్వా=చూచి
తతః= అటుపిమ్మట
తతశ్చర= అక్కడ చరించే
తౌ= వారు (ఆ జంటలు)
కేళీ వ్రతచర్యాం=రతికేళీ వ్రతాన్ని
తాం= వారు
వాంఛంతౌ=కోరుకుంటున్నారు

వనకుసుమ= అడవి పూల
విశదవరవాసనయా=విస్తృతమైన వాసనలచేత
ఘనసారరజః+గంధైశ్చ=కర్పూరపు రజము మరియు గంధముల చేత
జనయతి=జనించబడిన
పవనే=గాలియందు, గాలివలన
వనితా=స్త్రీలకు
పురుషౌ=పురుషులకు
సపది వికారం=శృంగారభరిత భావాలు
జనితాశౌ= జనియించుచున్నవి

ఏవం=ఈ విధముగా
విచరన్=విహరించుచూ
హేలా విముఖ= ఇటువంటి ఆనందాలకు విముఖుడై
శ్రీవేంకటగిరి దేవః= వేంకటేశ్వరుడైన
అయమ్=ఈతడు
పావనరాధాపరిరంభసుఖ=పావని ఐన రాధాదేవి ఇచ్చిన సుఖములను చుట్టుకుని
శ్రీ వైభవ=లక్ష్మీ వైభవముతో
సుస్థిరః భవతి=బాగుగా స్థిరమై ఉన్నాడు.

భావం: అన్నమాచార్యుల భావనా సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిన ఒక అల ఈ సంస్కృత శృంగార సంకీర్తన. ఈ సంకీర్తనలో రాధాదేవి, శ్రీకృష్ణుని శృంగారక్రీడని కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఈ అమృతం -తాగగలిగినవారికి తా గగలిగినంత, ఈ ఆనందం- అనుభవించగలిగినవారికి అనుభవించగలిగేటంత..

//ప// ఇది రాధామాధవుల రతిచరిత్ర. చెప్పదగినది, వినడానికి చెవులకు ఆనందాన్ని కలిగించేది.

//చ// రాధామాధవులిద్దరూ కూడా ఇళ్ళను వదిలిపెట్టి, విహరిస్తూ, వెళ్ళి వెళ్ళి ఒక రహస్య ప్రదేశానికి చేరుకుని, వశం తప్పి రతిక్రీడకి సిద్ధం అవుతున్నారు.

//చ//మాధవుని శృంగార చేష్టల చేత, రాధ నల్లని కాటుక వంటి కన్నులు సిగ్గుతో ఎర్రబడినవి. మన్మధుడు బలంగా ఆవహించిన మనస్సుతో రాధ రతికి సిద్ధమై, తొందరపడుతూ, నిలువలేకుండా అయినది.

//చ// రాధ, తన ముందు నడుస్తున్న మాధవుని పొగడచెట్టు పూల చేత, పచ్చ పెద్దగోటంట పువ్వులు చేత, కొండమల్లె పూవుల చేత, వెనుకగా వస్తూ బాగుగా కొడుతున్నది. (ప్రియునిలో రతి ఆసక్తిని పెంచే పని కాబోలు) శ్రీవారు తిరిగి వెనుకకు చూడగనే, సిగ్గు చూపులు చూస్తూ, మాటలు లేకుండగనే లోలోపల సంతోషాన్ని అనుభవించుచున్నది.

//చ// పారిజాత చెట్టుని ఎక్కేదానివలే కృష్ణుని నడుముపైకెక్కి రెండు పాదములచే నడుమును చుట్టువేసినది. పువ్వులతీగ చెట్టును చుట్టేసినట్టు, ఆలింగనాల వల్ల వచ్చిన పులకలచేత రాధ అత్యంత ఆనందము పొందినది.

//చ// చంద్రముఖము వంటి కృష్ణుని దర్శనముతో సిగ్గును వదిలిపెట్టినదై, గుండ్రని ముఖములో ఎర్రని పండువలే ప్రకాశిస్తూన్న శ్రీవారి క్రింది పెదవిని ముద్దాడి, ఆస్వాదించి, తియ్యని ఎదురు బహుమతులు ఇచ్చే మార్గంలో, ఆమె నిండుకుండల్లాంటి స్తన నిధులను ఆయనకు చుంబన, చూషణలకు సమర్పించి, నిరంతర సుఖాన్ని పొందుతున్నది.

//చ// రాధ తనయొక్క అందమైన మొగలిపువ్వుల రేకుల వంటి గోళ్ళచేత కృష్ణుని గెడ్డమును తిప్పుతూ ఆమె శరీరంలో అణువణువూ చూపించి, ఆమె ఆడతనమనే అందాల సముద్రములో అతని కన్నులు అనే చేపల జంటను బాగుగా తిరిగేట్టు చేసింది. [శ్రీవారికి తన దేహాన్నంతా చూపించిందని- కవి భావన]

//చ// విలాసమైన శృంగార మాటలతో శ్రీకృష్ణుని వశము చేసికొని, ఎర్రగన్నేరు పొదలు అలుముకున్న అందమైన ప్రదేశములో, పెద్దవైన యమునా నదీ తీరప్రాంత ఇసుక తిన్నెలయందు, లేత చిగురుటాకులు పరచిన పడకల మీద, సంభోగ కళల రాగములచే ఆయన తనువుపై రచన చేసినది. [రతి తీవ్రమైన సమయంలో ఏర్పరచే గోళ్ళ గిచ్చుళ్ళు, పంటి గిచ్చుళ్ళు తో శ్రీవారి శరీరంపై గాట్లు పెట్టిందని-కవి భావన]

//చ// కొత్తగా పెళ్ళైన జంటలా అందమైన రూపాలు కలిగి, రతి యజ్ఞంలో గొప్ప శ్రద్ధ, పట్టుదల కలిగినవారై, మనస్సును నిగ్రహించుకుంటూ, రాధ వేంకటేశ్వరుని యందు, ఆతడు రాధయందు అనేక రతివిధానాలలో రతిక్రీడాలో పూర్తిగా నిమగ్నులైయున్నారు.

//చ// ఆమె శృంగారచేష్టలకి, మాటలకి అతడు కూడా సిగ్గుతోకూడిన చూపులవాడు అయ్యాడు. ఆయన సిగ్గుని పోగొట్టడానికి రాధ అతని చేత ఆమె జుట్టుకు స్వత:సిద్ధముగా ఉన్న గంధం వాసనను ఆఘ్రాణింపచేస్తున్నది. [స్త్రీ కేశములు కామ ప్రేరేపితములు. కేశవునిలో మరింత కామాసక్తిని పెంచడానికి రాధ తన కేశములను వాసన చూపించిందని- కవి భావన]. కానీ, అంతకీ అతను రతికి ముందుకు రాకపోవడంతో, సిగ్గు పడుతూనే ఆమె తన స్తనాలను ఆయనకు తగిలేలా అనుకూలముగా ఉంచినది.

//చ// సిగ్గుతో తలవంచుకున్నప్పటికీ, అత్యంత సంతోషాన్ని పొందుతూ, సుఖం వల్ల వచ్చే అనేక రకములైన అరుపులను అరుస్తూ, ఆయనకు వశురాలైయున్నది. తెల్లని చేతుల్లోంచి పుట్టిన రచనల విలాసములచే ఈ భువనానికి పతియైన శ్రీకృష్ణునికి ఆభరణమైనది [ఆమె రెండు చేతులో శ్రీవారి మెడను చుట్టేశాయని- కవిభావన].

//చ// లతలచే చుట్టబడిన ఇళ్ళ సమూహాలను (గన్నేరు పూలపొద లు), తెల్లని ఇసుక తిన్నెల వైభవాలను, రాధామాధవుల కొత్త సమాగమ విధానాలను చూచి, అక్కడ చరించే మిగిలిన జంటలు రతికేళీ వ్రతాన్ని తామూ చేయాలని కోరుకుంటున్నారు.

//చ// అడవి పూల విస్తృతమైన సువాసనలచేత, కర్పూరపు పొడి మరియు గంధముల చేత జనించబడిన గాలివలన, స్త్రీలకు పురుషులకు శృంగారభరిత భావాలు జనియించుచున్నవి.

//చ// ఈ విధముగా ద్వాపరయుగాన రాధాదేవితో విహరించుచూ, కలియుగంలో ఇటువంటి ఆనందాలకు విముఖుడై వేంకటేశ్వరుడైన ఈతడు, పావని ఐన రాధాదేవి ఇచ్చిన సుఖములను చుట్టుకుని, లక్ష్మీ వైభవముతో, వేంకటాచలముపై బాగుగా స్థిరమై ఉన్నాడు.

--((*))--

వందే వాసుదేవం శ్రీపతిం - బృందారకాధీశ వందిత పదాబ్జం

ప// వందే వాసుదేవం శ్రీపతిం
బృందారకాధీశ వందిత పదాబ్జం

చ// ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-
చందనాంకిత లసత్-చారు దేహం
మందార మాలికామకుట సంశోభితం
కందర్పజనక మరవిందనాభం

చ// ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనం
నిగమాదిసేవితం నిజరూపశేషప-
న్నగరాజ శాయినం ఘననివాసం

చ// కరిపురనాథసంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగతకరాబ్జం
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరు వేంకటాచలాధీశం భజే

ముఖ్యపదార్ధం:
వందే: నమస్కరించుచున్నాను
వాసుదేవం: వసుదేవ సుతుని
శ్రీపతిం: లక్ష్మీదేవి పతిని
బృందారకాధీశ: బృందారక+అధీశ= దేవతలకి అధీశుడు (ఇంద్రుడు)

వందిత: పూజింపబడే
పదాబ్జం: పద్మముల వంటి పాదాలు గలిగిన వానిని
ఇందీవరశ్యామం: నీటిలోపుట్టిన నల్లని కలువ వంటి దేహము కలిగిన వానిని
ఇందిరా: రమ యొక్క

కుచతటీ: కుచ, తటము= స్తనద్వయము
చందనాంకిత: చందనముచే అలంకరింపబడిన
లసత్= ప్రకాశమానమైన
చారు దేహం: అందమైన శరీరము

మందార మాలికా: మందారమాలలచే
మకుట సంశోభితం: చక్కగా ప్రకాశించుచున్న కిరీటము గలిగిన
కందర్పజనకం: మన్మధుని తండ్రిని
అరవిందనాభం: పద్మము బొడ్డుయందు కలవానిని

ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం: హృదయమునందు ధగధగ మంటూ మెరుస్తూన్న కౌస్తుభమణిని ధరించిన
ఖగ రాజ వాహనం= ఖ+గం= ఆకాశములో సంచరించు పక్షులకు రాజు (గరుత్మంతుడు)
కమలనయనం= కమలనేత్రుని
నిగమాదిసేవితం= వేదాలచే సేవింపబడువానిని

నిజరూపశేషపన్నగరాజ శాయినం ఘననివాసం= సర్పరాజుపై శయనిస్తూ నివాసముగా చేసుకున్న వానిని
కరిపురనాథసంరక్షణే తత్పరం= ధర్మరాజుని (రాజ్యాన్ని) నిరంతరము సంరక్షించుటకు ఉద్యుక్తుడైన వానిని
కరిరాజవరద: గజేంద్రుని రక్షించిన వాడు
సంగతకరాబ్జం= శరణుకోరిన వారికి స్నేహహస్తాన్ని అందించే పద్మముల వంటి చేతులు కలిగిన వాడు

సరసీరుహాననం= సరసీరుహ+ఆననమ్= సరస్సుయందు జనించిన (పద్మము) వంటి ముహము కలిగిన వానిని
చక్రవిభ్రాజితం= చేతియందు చక్రముచే ప్రకాశించు వానిని
తిరు వేంకటాచలాధీశం= తిరువేంకటాచలాధిపుని
భజే= భజించుచున్నాను
భావం:
వాసుదేవునికి నమస్కరించుచున్నాను. బృందారకాధీశుని (ఇంద్రుని) చే పూజింపబడిన పాదములను కలవానికి నేను నమస్కరించుచున్నాను.

నల్ల కలువ వంటి దేహకాంతి గలవానికి, చందనము పూసుకున్న రమ యొక్క స్తనద్వయము వెలుగులో ప్రకాశించుచున్నవానిని, మందారమాలలను ధరించిన వానిని, ధగధగ మెరుస్తూన్న కిరీటము గల వానిని, మన్మధుని తండ్రిని, బొడ్డు యందు పద్మము కలవానికి నేను వందనము చేయుచున్నాను.

హృదయము నందు మెరుస్తూన్న కౌస్తుభమణిని ధరించిన వానిని, గరుడపక్షి వాహనముగా గలవానిని, పద్మనేత్రుని, వేదాలచే కొనియాడబడువానిని, సర్పరాజుపై పవ్వళించేవానికి నేను వందనము చేయుచున్నాను.

ధర్మరాజునకు సహాయము చేయుటకు నిరంతరం ఉద్యుక్తుడైనవానిని, కరిరాజుని రక్షించిన వానికి, శరణుకోరిన వారికి స్నేహహస్తము అందించు పద్మము వంటి చేతులు కలవానిని, పద్మము వంటి ముఖము కలవానికి, చేతియందు చక్రముచే ప్రకాశించువాడు ఐన తిరువేంకటాచలాధిపునికి వం

దనము చేయుచున్నాను.

ఈ కీర్తన అమ్మ సుబ్బలక్ష్మి గారి గాత్రంలో మరింత మధురంగా ఒదిగిపోయింది. భావము చదివాము కదా ఆ కీర్తన అమ్మ సుస్వరంలో విందాము.


ఘంటసాల గారి ఈ పాట ఈ నాటికీ యవ్వనమే !..
.
శ్రీ కొనకళ్ళవె౦కటరత్న౦గారి బ‍‍‍౦గారిమామపాటలను౦డి
రావోయిబ౦గారి మామా
రావోయిబ౦గారి మామా
నీతోటి రహస్యమొకటున్నదోయీ
ప౦టకాలువప్రక్క‌
జ౦టగానిలుచు౦టె
నీడల్లోమనయీడు
జోడుతెలిశొస్తాది
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ
ఈవెన్నెలసొల‌పు
ఈతెమ్మెరలవలపు
రాత్రిమన సుఖకేళి
ర౦గరి౦చాలోయి
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ
నీళ్ళతూరలవెన్క
నిలుచున్నపాటనే
జల‌జలల్ విని,గు౦డె
ఝల్లుమ౦టున్నాది
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ



ప్రాంజలి ప్రభ - పురాణ విశిష్ట ప్రభ-(భూకై లాస్)

ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - పురాణ విశిష్ట ప్రభ

పుణ్య క్షేత్రాలు 
* హోబిలం నరసింహస్వామి
* ఆత్మలింగ క్షేత్రం!  (భూకై లాస్)  


హోబిలం నరసింహస్వామి

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి 65 కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

ఎగువ అహోబిల రాజ గోపురం స్థలపురాణం:: ఇందుగల డందు లేడని సందేహము వలదని, హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది. ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్ల తోచీల్చి సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు —-

“అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః !
నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః !!”

అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం” అహోబలం “అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం , అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం. హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపం తో నరసింహుడు అరణ్యం లో గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని భావించబడుతోంది.

ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం::

వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.

రాజగోపుర దృశ్యం::

నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను నరసింహ రూపుని గా దర్శన మీయ వేడుకున్నాడు. ఆనాడు గరుడునికి స్వామి సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.

“జ్వాలాహోబిల మాలోల క్రోండ గరంజ్ భార్గవ !
యోగానంద చత్రవట పావన నవమూర్తయః !!”

జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అను తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడ వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.

ఆలయప్రత్యేకత :

శ్రీ భార్గవ నరసింహ స్వామి : దిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే” అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు. అందువలన ఈ అక్షయ తీర్థాన్నే”భార్గవ తీర్థమని” కూడ పిలుస్తారు.

శ్రీ యోగానంద నరసింహ స్వామి : వీరు దిగువ అహోబిలానికి తూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు. స్వామి ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నికగన్నది. కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.

శ్రీ ఛత్రవట నరసింహస్వామి : ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .

శ్రీ అహోబిల నరసింహస్వామి : నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు మతిమాంద్యాలు, ఈ  స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.

శ్రీ వరాహ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే క్రోడ నరసింహ స్వామి అని కూడ పిలుస్తారు.

శ్రీ మాలోల నరసింహస్వామి : ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.

శ్రీ జ్వాలా నరసింహస్వామి: ఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “ అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి, చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం “అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.

శ్రీ పావన నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి ఉన్నాడు. నవ ఆల యాల్లో ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీ కరంజ నరసింహస్వామి : ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని చెపుతారు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి: ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు గల సంబంధాన్ని కూడ భక్తులు విశ్లేషించుకుంటున్నారు.

చారిత్రకప్రాధాన్యం :

దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది. ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతులతో నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువుతీరి కనువిందు చేస్తాయి.

ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైట కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం : ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.

“ఉగ్ర వీరః మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖః !
నృసింహః భీషణఃభద్రంమృత్యుమృత్యః నమామ్యహః !!”

అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు

ప్రహ్లాదమెట్టు: ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి మధ్య లోని ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం దర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిలమఠం: ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.

ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ప్రత్యేక ఉత్సవాలు: ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది


హోబిలం నరసింహస్వామి 
ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని ...


--((**))--


ఆత్మలింగ క్షేత్రం!

 (భూకై లాస్)  


మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది. 


పురాణ కథ 

ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. 


అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. 


రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు. 


ఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందట. 


పురాతన ప్రాశస్త్యం 

దక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట. 

కోటితీర్థం 


గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది. 

మహాబలేశ్వరాలయం 


పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. 


తామ్రగౌరీ ఆలయం 

మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది. 


మహాగణపతి ఆలయం 

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది. 

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి. 
గోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్‌కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది. 
గోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు 


ధారేశ్వర ఆలయం 

ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది. 


గుణవంతేశ్వర ఆలయం 

ఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది. 


మురుడేశ్వర ఆలయం 

పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది. 


--((**))--