Monday 27 August 2018

ప్రాంజలి ప్రభ (telugu పత్రిక) -8 - 201 8



తరుణ - స/న/న/భ/న/జ/న/స IIU IIII IIU IIII IIU IIII IIU 
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా 
ఆరాధ్య ప్రేమ లీలా 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనువాడు మనసు మమతాను జపము ఎగసే నయనము గదరా    
వనజాక్షుని గన మనసే కరిగెను   ప్రణయస్వరములు కదిలెన్  
తనువంత పులకిత సుతామధురము ఎగసే పయనము గదరా 
మనసాయె మగువ పిలుపే మదిపులకితమయ్యెమరులు గొలిపెన్      

వినవేల మనసు దినమంత కరుణ ఎగసే తరుణము గదరా   
కనులందు వెదకె సిరులందు వెదకె తనువే తమకము గదరా
కనులార పిలుపు కనువిందు తలపు కలకాదు జపము గదరా 
వినుమిప్పుడెహరి ననుజేరుమువడి కనిచెప్పుము పలుకధలన్        

వెదికే కన్నులకు చూపుఉండదు  
ప్రేమించే మనసుకు దారితెల్వదు 
ప్రేమకు చీకటి వెల్తురు అనేది లేదు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--
పది నిముషాలు

సాహితీమిత్రులారా!

తరుణ - 

ఆధారము - కల్పితము 
స్ఫూర్తి - త్యాగరాజ కృతి "కరుణాజలధి దాశరథి" యందలి అనుపల్లవి - తరుణారుణనిభచరణాఽసురమదహరణా శ్రితజనశరణాఽద్భుతగుణ

తరుణ - స/న/న/భ/న/జ/న/స IIU IIII IIU IIII IIU IIII IIU 
24 సంకృతి 8322556

ఎనిమిది మాత్రల (2+6, 4+$, 6+2) విఱుపుతో, ప్రాస యతితో -

వనజాక్షుని గన - మనసే కరగెను - ప్రణయ స్వరములు కదలెన్ 
దినయామినులను - విన గీతికలను - జిన కోరిక మది మెదలెన్ 
కను మూయఁగ నవ - దనిశ మ్మిట హృది - వనరెన్ విరహపు వెతలన్ 
విను మిప్పుడె హరి - నను జేరుము వడి - కని చెప్పుము బలు కతలన్

5,3 మాత్రల విఱుపుతో, ప్రాసయతి -

వినవేల మనసు - నిను వేగఁ బిలిచె - దినమెల్ల గడచెఁ గదరా 
కనులిందు వెదకెఁ - దనువెల్లఁ గదలెఁ - బ్రణయాన హృదిని వ్యధరా 
వినువీథి నడుమ - వనజారి వెలిఁగెఁ - దనరారె గగన తలమే 
కనరార త్వరగ - ఘననీల వపువు - నునుకాంతి ప్రణయ ఫలమే

మొదటి రెండు పాదములలో 5,3; చివరి రెండు పాదములలో ఎనిమిది మాత్రల విఱుపు, అక్షరసామ్య యతి -

దయఁ జూప నిదియె - తరుణమ్ము గదర - దరిసించ నగునొ వరదా 
భయమయ్యె హృదిని - భరియించ నవదు - భగవంత వెతయు వలరా 
పయనమ్మున గడు - వయినమ్ముగ నొక - పథమొక్కటి గన నగునా 
జయమంగళముగ - జగమం దలరెడు - సరసా నిను గన నగునా

ఖండగతిలో IIUI IIIII UIII - IIIU IIIII IU అక్షరసామ్య యతితో -

అరుణమ్ము గగనమున నెందు గన - నరుసమై పులుఁగులట జనెన్ 
తరుణమ్ము సుమధురము సాయమున - త్వరగ రమ్మరుణ రవిఁ గనన్ 
కిరణాల నుదయశశి చీఁకటిని - గెలుచు వెన్నెలల వెలుఁగుతో 
సరసాల నుడుల నొక గీతికను - సరిగఁ బాడుమిఁక యెలుఁగుతో

ఆఱు మాత్రలు IIUII IIIIU - IIIIII UIIII IIU అక్షరసామ్య యతితో -

విరబూసిన యలరులతోఁ - బ్రియతమ కిఁక నిచ్చెద సరములుగా 
స్వరసింధువు తరఁగలతో - సరసిజముఖి ముంచెద స్వరములుగా 
నరవిందపు టరుణిమతో - నలరి వెలిఁగె నాకస మొక నదిగా 
దరుణమ్మిది హరుసముతోఁ - ద్వరగ మురియఁ గైతల చిఱు గదిగా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


హరిః ಓమ్ 

8) శ్లోకము 

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః ప్రజాపతిః ! 
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః !! 

ఈ పవిత్ర శ్లోకమునందు శ్రీహరి పదివిధములగు మంగళనామములతో గానము చేయబడు ౘున్నాడు. 

64) ఈశానః ఓం ఈశానాయనమః 

సర్వమునూ శాశింౘువాడు ఈయన భయము వలననే సూర్యాగ్నిచంద్రులునూ వాయువు మున్నగు నవి తమతమ నిత్యకార్యక్రమములలో మిగుల జాగ్రత్తగా ప్రవర్తింౘు ౘుందురు గావున " ఈశానః" అని శ్రీహరి కీర్తనీయుడగుౘున్నాడు. 

65). ప్రాణదః ఓంప్రాణదాయనమః 

1). ప్రాణులకు చైతన్యమును ప్రసాదింౘు వాడు 

2). కాలుని రూపమున ప్రాణులను సంహరింౘువాడు. 

3). ప్రాణులను శోధింౘువాడు 

4) ప్రాణులను ఛేదింౘువాడు. 

సంస్కృతభాషలో "దః" అనునది "ఇచ్చుట" అనియును, నాశనము చేయుటయును అను రెండు విధములగు అర్థములను సూచింౘును. కనుక ప్రాణ+దః = ప్రాణశక్తిని ఇచ్చువాడు అనియును 
ప్రాణ+దః = పారాణులను నశింపచేయువాడనియును కూడా అర్థమేయగును. భగవానుడు సర్వశక్తిమంతుడని ఈనామము సూచింౘును. ఖండింౘువాడును అతడే, రక్షించి పోషింౘు వాడునూ అతడేయను భావమును ఈనామము సూచింౘుటచేత శ్రీహరి "ప్రాణదః" అను నామముచే గీర్తనీయుడు. 

66) ప్రాణః ఓం ప్రాణాయనమః 

ఉౘ్ఛ్వాసనిశ్వాసములను కల్గింౘు వాడు. ప్రాణులకు ప్రాణమై యున్నవాడని బృహదారణ్య కోపనిషత్తు తెలుపుౘున్నది. 
(ప్రాణస్య ప్రాణః). ఈ శ్రుతివాక్యము ననుసరించి ప్రాణః అనగా క్షేత్రజ్ఞుడు లేక పరమాత్మయని చెప్పబడును.
 --((**))--
హరిః ಓమ్

8) శ్లోకము

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః ప్రజాపతిః !
భూగర్భో మాధవో మధుసూదనః !!

ఈ పవిత్ర శ్లోకమునందు శ్రీహరి పదివిధములగు మంగళ నామములతో గానము చేయబడు ౘున్నాడు.

67) జ్యేష్ఠః ఓం జ్యేష్ఠాయనమః

అన్నిటికంటే మిక్కిలి పెద్దవాడు అని భావార్థము.

68) శ్రేష్ఠః ఓం శ్రేష్ఠాయనమః

అన్నిటికంటే మిక్కిలి ప్రశంశనీయుడు అని అర్థము.

69) ప్రజాపతిః ఓం ప్రజాపతయేనమః

ప్రజలకు అధిపతి. ప్రజలనగా సంతానమని యర్థము. కాన ప్రజాపతియనగా "పరమపితా" వాత్సల్యస్వరూపుడగు తండ్రి. " పితా√హమస్య జగతః" అను గీతావాక్యము స్మరణీయము (అ_9_17).

70) హిరణ్యగర్భః ఓంహిరణ్యగర్భాయనమః

విశ్వరూపమగు హిరణ్యమును గర్భమునందు ధరించినవాడగుటచే హిరణ్యగర్భుడగును. బ్రహ్మాండ స్వరూప మయిన హిరణ్మయాండమునందు వ్యాపించి ఉన్న సృష్టికర్త యగు బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడగును. అట్టి వానికి ఆత్మయై యున్నందున శ్రీహరి " హిరణ్యగర్భః" అని పిలువ బడును.

71) భూగర్భః ఓం భూగర్భాయనమః

భూమినంతనూ తన గర్భమునందు ధరించినవాడగుటచే శ్రీహరి " భూగర్భః " అని కీర్తనీయుడు.
--((**))--

Sunday 26 August 2018

Pranjali Prabha (telugu paatrika) -8-2018

ఓంశ్రీ రామ్  -  శ్రీ మాత్రేనమ: - శ్రీ  కృష్ణాయనమ:

ఆనందం - అనారోగ్యం - ఆధ్యాత్మికం 


 సుధా వృష్టి 

సాహితీమిత్రులారా! 
క్రీస్తుశకం 1828 ప్రాంతాలు. సర్వధారి నామ సంవత్సరం. 

శ్రావణం అయిపోయింది. భాద్రపదమూ సగపడింది. ఎక్కడా తడిగాలి పొడ కూడా లేదు. అప్పుడే సూర్యుడు బాగా నెత్తి మీదికి వచ్చేశాడు, అంతటి ఆకాశం లో ఆయనొక్కడే. మొగమాటానికి కూడా ఒక్క మబ్బు పింజ లేదు. 

ఆ పూటకి అక్కడి గంజికేంద్రాన్ని మూశాక, ఒక్కొక్క మెట్టే ఎక్కి వెళుతున్నాడు ఎట్టయాపురం ప్రభువు. ఆపూట ఎక్కడా నిలుచోబుద్ధి కావటం లేదు. సరాసరి మూడంతస్తులూ ఎక్కి చంద్రశాల అనబడే మేడ మీది ఆరుబయటికి వెళ్ళి ఆగాడు. తలెత్తి ఒక్కడే ఆ ఎర్రటి ఎండలోకి చూస్తూ కొద్ది ఘడియల సేపు. 

వెళ్ళి నిలదీయాలని ఉంది – అంతకన్నా దేవతలకు దగ్గరగా ఎట్లా వెళ్ళటం? 

“ఏమిటి చేయాలి ???” 

ఆయన శ్రీ జగవీర రామ వెంకటేశ్వర ఎట్టప్ప నాయకర్. గద్దె ఎక్కి దాదాపు పదేళ్ళవుతోంది. మొదట మొదట గమనించుకోలేదుగాని ఆ ఏటికాయేడు రాజ్యం లో దుర్భిక్షం పెరుగుతూనే ఉంది. తాను చేసిన తప్పేమా అని మనసు కెలకబారుతూ ఉంది. చుట్టుపక్కలి రాజ్యాలన్నీ బాగానే ఉన్నట్లున్నాయి – ఒక్క మనియాచ్చి సంస్థానం తప్ప. కాకపోతే అక్కడ మరీ ఇంత గండకత్తెర లేదు. 

వరుణయాగాలను ప్రతియేటా జరిపిస్తూనే ఉన్నాడు. ఫలితం అంతంతే. నాలుగు చినుకులు రాలిపోయేవి. 
ఆ ఏడు మరిక ఏమి చేసేందుకూ ధనం లేదు. 

తండ్రి పోగు చేసినదంతా ఆవాళ్టివరకూ ఖర్చు పెట్టి గడుపుకొచ్చాడు. తన ప్రజలు – అంటే తన సంతతి , జనమంతా . ఒక్కడి డొక్క మాడినా ఆ పూటకి ముద్ద ఎత్తలేని మెత్తని వాడు ప్రభువు. ఎంత పెద్ద బొక్కసమైతే మటుకు ఎన్నేళ్ళు పోషిస్తుంది ఇంతమందినీ ? ధాన్యం అమ్మేవారు ఇక్కడి అవసరం కనిపెట్టి చెట్టెక్కి కూచుంటున్నారు. ఇక అంతఃపురపు జవహరీ మిగిలింది – అప్రతిష్ట రాకుండా దాన్ని ఊరు దాటి అమ్మిస్తే ఈ ఏడు గడుస్తుందేమో. 

రాణివాసపు నగకట్టు అంతా పెద్దరాణీ గారి అధీనం లో ఉంటుంది – అంత చెయ్యెత్తు మనిషీ వంగిపోయి వెళ్ళాడు తల్లి దగ్గరికి. ఆవిడ ఎనభయి ఏళ్ళు దాటుతున్న వృద్ధ . తెల్లని జరీ చీరె లో , తిలకం లేని నుదుట తీర్చిన విభూతి తో మెడలో రుద్రాక్ష తావళాలతో సాధారణ వితంతువు వలె ఉన్నది కాని రాజ చిహ్నాలేమీ ఒంటి మీద లేవు. 

ఒక్కచూపుతోనే గ్రహించి అక్కడ ఉన్నవారినందరినీ పంపించివేసింది. 

” నాయన గారూ ! మా దగ్గరి వస్తువులూ నిండుకున్నాయండీ. ఆరు మాసాలైంది ” 

ప్రభువు మరీ కుంచించుకుపోయాడు. తెలియనివ్వకుండానే ఆదుకుందన్నమాట అమ్మ. 

” చిన్న రాణి గారి వస్తువులు ” – అడగలేక అడిగాడు. 

ఆ ఇంట మెట్టిన మహాలక్ష్మి సొత్తు అది, తాకేందుకు తమకు అధికారం లేనిది. కాని - 

లోపల అందెల సవ్వడి వినబడింది. పల్చటి తెర వెనకన గాజుల చేతులు నిలువునా దూసి ఇచ్చాయి. 

కాశ్మీరపు శాలువ లో మూటగట్టి తెచ్చి ముందు పెట్టింది పెద్ద రాణి కమలాంబికా దేవి. 

ప్రభువు అందుకోలేకపోయినాడు. పుక్కిలింతలు గా దుఃఖం. 

కొడుకు శిరస్సు మీద చేయి వేసి నిలిచింది తల్లి. రాజ కుటుంబాలలో ఎన్నడో గాని జరగని చర్య అది. ఆ క్షణాన బరువులన్నీ మరచి ఆయనా పిల్లవాడయినాడు- అడిగాడు . 

” మీరు ఎరగరా నాయనా ? ” 

ఊహూ. ఎరగడు కద. 

” అంతా గుస గుసగా అనుకుంటూనే ఉంటున్నారు కాదా అప్పటినుండీ ? ” 

” ఎప్పటి నుండి అమ్మా ? ” – గౌరవ వాచకాన్ని మరచాడు. 

” మీ తండ్రి గారు ‘ ద్రోహి ‘ అయినప్పటినుంచీ ” – ఒక్క ఊపున చెప్పివేసి కూలబడిపోయింది. 

*** 

ద్రోహం. 

అవును. విన్నాడు. 

ఆ అలజళ్ళలో – ముప్ఫై ఏళ్ళు వస్తూ ఉండిన తనను , పసివాడివలే మేనమామల ఇంటికి , తిరువారూరు పంపివేశాడు తండ్రి. ఆయన బ్రతికి ఉన్నంతవరకూ ఎదురు చెప్పే ప్రశ్నే లేదు. 

కట్టబ్రహ్మన్న తన కన్న ఏడాదే పెద్దవాడు, కాని ఎంతో పెద్ద గుండెవాడు. 

చూస్తే ధైర్యం పుట్టేటట్లుండేవాడు . 

బంధుత్వం లేదు గాని బ్రహ్మన్న తండ్రి ని చిన్నాయనా అని పిలవటం అలవాటు. ఆయనా అంతే. పెద్ద నవ్వు తో ఎత్తుకొని బుజాన ఎక్కించుకొనేవాడు. ఏ మాత్రమూ రాచరికపు బిగింపులు లేకుండేవి. 

” ఎక్కడ తెలుస్తాయి మర్యాదలు ” అని చాటున ఈసడించేవాడు తన తండ్రి. ఎప్పుడో ఎన్నో తరాల నాడు కట్ట బ్రహ్మన్న పూర్వుడు రాజ సేవకుడట. బిడ్డలు లేని రాజు అతన్ని దత్తత చేసుకొని పట్టం కట్టాడట. తాము, ఎట్టయాపురం పాలకులు కాక మునుపు విజయనగర రాజబంధువులట . చంద్రగిరి నుండి వచ్చి సరాసరి ప్రభువులైనారట. 
అందుకని తండ్రికి ఆ లోకువ. కానీ , కట్టబ్రహ్మన్న సంస్థానం పాంచాలంకురిచి లోనే జనం ఎక్కువ సుఖం గా ఉండేవారు – తనకు తెలుసు. 

సొంత దర్జా ఉండిన తెలుగు పాలెగాళ్ళు తామంతా. ఆర్కాటు నవాబు కు 
పేరుకు సామంతులు . అప్పుడప్పుడు ఉడుగర లు పంపుతుండేవారు. నవాబు ది అసలే ఖర్చు చెయ్యి. తెల్లవాడు మరిన్ని సరదాలు మప్పాడు. ఎంత డబ్బూ ఆ విలాసాలకు చాలక తెల్లవాడి దగ్గర అప్పు చేశాడు .తీర్చలేక పాలెగాళ్ళ దగ్గర శిస్తు వసూలు చేసుకొమ్మన్నాడు. తెల్లవాడికి కావలసింది సరిగ్గా అదే. 

బ్రహ్మన్న ఆవాళ ఎట్టయాపురం వచ్చాడు. విశాలమైన కన్నుల నిండుగా ఎర్రని జీరలు. అంత కోపంగా అతన్ని ఎన్నడూ చూడలేదు. 

” పెదనాయనా , ఇది ఎక్కడి తీరువా ? వాడెవడు ? ఎక్కడివాడు ? ఈ నేల వాడిది కాదు, నీరు వాడు ఇవ్వలేదు, నారు పోయలేదు, కోత కోయ లేదు, కుప్ప నూర్చలేదు – శిస్తు దేనికి కట్టాలి ? ” 

తన తండ్రి చెవిన పెట్టనేలేదు. కడితే ఏం పోతుందనేశాడు. 

బ్రహ్మన్న ఆ శిస్తును చాలా అన్యాయపు లెక్కన్నాడు. అది అంతతో ఆగదన్నాడు. తల్లిని తాకట్టు పెట్టరాదన్నాడు 
.తెల్లవాడికి పాపం పుణ్యం ఉండవన్నాడు. 

తండ్రి సరేలెమ్మన్నాడు- కాని మాట తప్పాడు. 

ఆ తరువాత చాలా జరిగిపోయినాయి. తాను నోరెత్తి అడిగాడని ఊరు దాటించి పంపారు. భార్య నీలోత్పలాంబ మేనమామ కూతురే. తిరువారూరు శివుడు త్యాగరాజ స్వామి అర్థాంగి పేరు ఆమె కి పెట్టారు. 
అక్కడే , ఒక్కతే విడిగా కొలువున్న అమ్మవారు కమలాంబికా దేవిది తన తల్లి పేరు. 

ఇక్కడ తన తండ్రి కలెక్టర్ జాక్ సన్ కు మహా దగ్గరి చుట్టమైనాడు. ఆ పైన వచ్చిన అధికారు లందరికీ విశ్వాసపాత్రుడైనాడు. సైన్యాన్ని అరువిచ్చాడు. బ్రహ్మన్న గుట్టుమట్టులన్నీ తెలిసినవాడుగా వాటిని బయటపెట్టి – చేయగలిగినదంతా చేశాడు. 

ఆఖరికి, యుద్ధం లో ఓడిన బ్రహ్మన్న తిరుకాలంపురం అడవులలో ఆశ్రయం పొంది ఉంటే – పుదుక్కోట రాజా అతని ఆచూకీ ఇచ్చాడు. ఆ పాపం మటుకు తన తండ్రిది కాదు. 

కాని – బ్రహ్మన్నను ఉరితీసినాక పాంచాలం కురిచి కోట ను నేలమట్టం చేసి అక్కడ ఆముదాలు విత్తించినవారు తన తండ్రి బంటు లేనట . ఆ రాజ్యాన్ని విడగొట్టి తమకూ మనియాచ్చి వారికీ చెరి సగం పంచాడు తెల్లవాడు. ఎట్టయాపురం ప్రభువు ను రాజు నుంచి దిగజార్చి జమిందారు ను చేసిపెట్టాడు. 

తండ్రి మరణించినాక గాని ఎట్టయాపురానికి వచ్చే అవకాశం రాలేదు. వయసు దాటుతుండగా , వచ్చి సరాసరి ప్రభువయినాడు. ఇవాళ్టికి అశక్తుడు కూడా అయినాడు. 

ఆ ఘాతుకానికే ఫలితమా ? 

పరిహారం ?? 

*** 

నాలుగు మెతుకులు తిన్నాననిపించుకొని, నడుము వాల్చినా విశ్రాంతి లేక అటూ ఇటూ మెసలి మెసలి , చీకటి పడుతూండగా – ప్రదోష అర్చన కు అమ్మవారి గుడికి బయల్దేరాడు. నూలు ధోవతి కట్టుకొని నూలుదే ఉత్తరీయాన్ని పైన కప్పుకొని , ఒక్కడే- కాలినడకన . ఆభరణాలు ధరించటం మానివేసి చాలాకాలమయింది. 

దర్శనమయినాక వెంటనే దేవిడీ కి వెళ్ళాలనిపించక రంగమంటపం మెట్ల మీద కూర్చుండిపోయాడు. ఎన్ని ఆమడల అవతల ఎక్కడ వాన కురుస్తోందోగాని – కొంచెం కొంచెం గా చల్లగాలి తిరిగింది . తెమ్మెరలు ఏవో వింత నాదాలనూ మోసుకు తెచ్చాయి. ధ్వని ని అనుసరిస్తూ వెళితే – ప్రాకారానికి చేరబడి కూర్చుని ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రవాడు. ఆ మ్రోగించే వాద్యమేదో – ఎప్పుడూ చూడనిది. 

తొలినాటి నుంచి వంశస్థులందరూ సంగీత సారస్వతాల లో ఏ మాత్రమో అభిరుచి ఉన్నవారే , తానూ ఎరుగును – కొంత. కేదార గౌళ నా అది ? 

గాలితోబాటు గా ఎవరిదో దయ వచ్చి తాకినట్లయింది. క్షమిస్తున్నారా ? 

కుర్రవాడు గొంతు విప్పి పాడుతున్నాడు. ” నీలోత్పలాంబికాయై నమస్తే ” 

ఏమి ప్రతిభ , ఎంత నిండు ! 

అతనికీ తనకూ ఒళ్ళు తెలిసేప్పటికి ఎంత కాలమయిందో ! 

ప్రభువు తానే వెళ్ళి పలకరించాడు. కుర్రవాడి లో అమాయకత్వమూ జ్ఞానమూ సమం గా ఉన్నట్లున్నాయి. పేరు వడివేలు పిళ్ళై అట. ఆ వాద్యాన్ని వయొలిన్ అంటారట. తెల్లవాళ్ళు తెచ్చినదట. తన గురువు గారు దాన్ని మన్నిస్తారట. గురువుగారి తమ్ముడు అందులో నిధి అట. గురువు గారి మాట చెబుతూంటే అతనికి ఒళ్ళూ పై తెలియలేదు. తనకూ తన అన్నలు ముగ్గురికీ ఆయన గురువేనట. ఆయన పాట తప్ప మరొకటి తాను పాడడట. ఆయన అపర కార్తికేయుడట. అమ్మవారు పిలిస్తే పలుకుతుందట.మహావైణికుడూ వాగ్గేయకారుడూ మాత్రమే కాదు – వేదం చదువుకున్నాడట. కౌముది ఆయన మునివేళ్ళ పైన ఆడుతుందట. మంత్ర తంత్ర జ్యోతిష్య శాస్త్రాలలో పారం ముట్టిన వాడట. 

” ఏ ఊరు నాయనా వారిది ? ” 

” ఆయనకొక ఊరెక్కడుందయ్యా ? పైరు పచ్చలకు కాపు గదా సుబ్రహ్మణ్యుడు – ఈయనా అంతే. ఒక చోట నిలవడు , తిరుగాడుతూనే ఉంటాడు. వాళ్ళ అమ్మ చెబుతుంటుంది గా , ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ” 

ప్రభువు కు కొంత నిరాశ. 

కుర్రవాడిని దగ్గర ఉంచుకొని దినమ్మూ అతని పాటలు వినాలనిపించింది. వాటిలోని కారుణ్యాన్ని దోసిళ్ళతో ఎత్తి తాగుతుండాలనిపించింది.కాని ఆ ఊరటను పొందే హక్కు తనకు లేదని కూడా అనిపించింది. 
ఏమీ అనకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. 

వెన్నెలకు మాత్రం కరువు లేదు కదా రాజ్యం లో. ఆ రాత్రి చంద్రశాలలో కూర్చున్నప్పుడు అప్రయత్నం గా ఆ కీర్తనే నోట్లో ఆడింది ప్రభువుకు. మనసుకు హాయనిపించింది. ‘ నీలోత్పలాంబికాయై ‘ అని , నమస్తే అని అనలేక దీర్ఘం తీసుకుంటున్నాడు పైకే. అప్పుడే అక్కడికి అడుగు పెడుతూన్న రాణి నీలోత్పలాంబ , ఆ నడివయస్సులో బిడియ పడింది. 

*** 

శాంతంగా తెల్లవారింది. రాజ పురోహితుడు ఎవరినో వెంటబెట్టుకొని దర్శనానికి వచ్చాడని వర్తమానం. 
కొలువుకూటం లోకి ప్రమథులు దిగి వచ్చారని తోచింది ప్రభువు కు . 
ఆయన బాలస్వామి దీక్షితులు , వెంట కొందరు శిష్యులు. వాళ్ళ అన్నగారు ముత్తు కుమారస్వామి దీక్షితులు , ఇంకొక తమ్ముడితో కలిసి సంచారం చేస్తున్నారట. ఎట్టయాపురం లో కొన్నాళ్ళు ఆగాలని సంకల్పించారట. సాయంత్రానికి చేరుకుంటారట. 
ఆ వెనకాల నిలుచుని బెదురు చూపులు చూస్తూ నిన్నటి కుర్రవాడు కనిపించాడు . 
ఓహో . వీరేనన్నమాట. 

*** 

పదహారేళ్ళ వయసు లో మదరాసు కోట లో తెల్లవాళ్ళ సంగీతం విన్నాడు ముత్తుస్వామి. ఐరిష్ బాండ్ ల సెల్టిక్ సంగీతం అది. ఒక తెల్ల దొరగారు అడిగాడు , వాటికి సాహిత్యం కూర్చగలవా అని. కూర్చాడు- తెలుగు లోనూ సంస్కృతం లోనూ. ఆ వరసలను మృదువు చేసి శుద్ధి చేశాడు. జగదంబ తనలో నింపిన శబ్ద శక్తి ని వాటిలో నిక్షేపించటమయిందని తర్వాత గురువుగారు చిదంబరనాథ యోగి చెప్పారు. ఆయన వెంట వెళ్ళి ఏడేళ్ళు వారణాసి లో ఉన్నాడు. తురుష్కుల ధ్వనులు కలగలిసిన ఔత్తరాహ సంగీతాన్ని వెంటతెచ్చి పుటం పెట్టి కర్ణాటకం తో అతికాడు. నూట యాభై కి పైన దేవాలయాలు తిరిగి పేరు పేరునా కీర్తనలు కట్టి పాడి దేవతలకు పులికాపు పెట్టి స్నపన చేయించి సాంబ్రాణి ధూపం వేశాడు. వాగర్థాల తో స్వరాన్ని సమన్వయించిన ఆ మంత్రమాలికలు వెలికి వచ్చేందుకు తన నొక ఉపాధి గా అమ్మ పంపిందనే స్ఫురణ అన్ని వేళలా ఉంటుండేది. నాలుగు నాళ్ళు ఒక చోట ఆగకుండా యాభై మూడేళ్ళ జీవనం. ఇక్కడికి రావాలి, బహుశా ఇక్కడే ఆగాలి – కొంతకాలం. 
అమ్మ పిలుచుకునే దాకా. 

*** 

ఎట్టయాపురపు రాజ్యం పొలిమేరల్లోకి వస్తూనే ఆవరించి ఉన్న ధూమమేదో అగుపించింది దీక్షితులకు. నేల ఎండి బీటలు విచ్చింది. ఎక్కడా పచ్చని చిగురన్నది లేదు. పశువుల డొక్కలు ఎండిపోయినాయి. జనాల మొహాలలో కళ లేదు. 

పాతకాలు ఎన్నో చోట్ల, ఎంతమంది వల్లనో జరుగుతుంటాయి. ఏ కారణం చేతనో అది ఈ చోట ముద్ద కట్టుకుపోయి ఉంది. ఏమో, ఇక్కడిది వ్రణమై ఛిన్నం కావలసి ఉందేమో – ఆరోగ్యం రావలసి ఉందేమో. 

ప్రభువు మొహం చూస్తూనే దీక్షితులు ద్రవించిపోయాడు. నాయకర్ ప్రవృత్తి కళ్ళకు కట్టింది. ఈ జీవుడు ఉత్తముడు. ఉన్నతుడు. అందుకు ఇదంతా. 

దీక్షితులను చూ స్తే ప్రభువుకు ప్రాణాలు లేచివచ్చాయి. అమాంతం సాగిలపడ్డాడు. 

మాటలు లేని సంభాషణ కొనసాగింది. 

మర్నాడు ఉదయమే, శ్రీ చక్రార్చన అవుతూనే పాంచాలంకురిచి కి బయల్దేరారు. దేవిడీ నేలకూలినచోటి ఆముదాలబీడులో – దీక్షితులు ఏవో ప్రక్రియలు చేశాడు. 

” ఇక్కడ అమ్మవారికి గుడి కట్టండి నాయకా ” 

ఆలయం నిర్మించటం మాటలా- అన్నమే లేక పస్తులుంటుంటే ? 

దీక్షితులు నవ్వాడు, గ్రహించినట్లుగా. ఏమీ అనలేదు. 

పాపపు సొత్తు క్షయమయింది. ఇది కొత్త మొదలు. 

*** 

ఆ సాయంత్రం ఎట్టయాపురం కోవెలలో. 
సాయంకాలపు పూజావిధి అయింది. 

ఆ మూలన, కదంబ వృక్షం కింద కూర్చొని- 
దీక్షితులు గళం సవరించుకున్నాడు. 

స గ మ ప ని స 
స ని ప మ గ స. 

ఆలాపన. 

చంద్రకాంత శిలలు కరిగినట్లు 
చల్ల చల్లని ఏరుగా సాగినట్లు 
గండు కోయిలలు పదివేలు కూసినట్లు 
నారికేళాలలో సలిలం ఊరినట్లు - 

మబ్బులు పట్టినట్లు. మెరుపులు మెరిసినట్లు. ఆకాశం ప్రేమగా ఉరిమినట్లు. 
మట్టి పరిమళం ముక్కుకు సోకినట్లు. 

” ఆనందామృతాకర్షిణీ…. 
సలిలం వర్షయ వర్షయ వర్షయ …” 

అమృతం . 

వాన. ఎంతెంత కాలానికో వాన. ఊళ్ళన్నీ తడిపిన వాన. గూళ్ళలోకి చిమ్మిన వాన. 
ఆగలేదు. కురుస్తూనే ఉంది. 
ఆ రోజుకి చాలించాక మర్నాడు, ఆ మర్నాడు. 
తర్వాత వారానికి రెండుసార్లు. 
సమంగా , సాధువై, స్వాదువై వాన కురిసింది. 
నెలకు మూడు తడవులుగా ఆ చోట కురుస్తూనే ఉంది. 

*** 

[కర్ణాటక సంగీత త్రయం లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఆ తర్వాత ఎట్టయాపురం లోనే ఉండిపోయాడు. 1835 లో దేహాన్ని వీడాడు. ఆయన సమాధి అక్కడ ఉంది. 

జగవీర రామ వెంకటేశ్వర ఎట్టప్ప నాయకర్ ఆ తర్వాత మరొక నాలుగేళ్ళు బ్రతికాడు. 

రాజ్యం సుభిక్షమైంది. 

ఒక్క మరక - ఎట్టప్పన్ అన్న మాట తమిళం లో ద్రోహి కి పర్యాయ పదమై ఉండిపోయింది. 

కాని ఆ వంశం లో మరి తొమ్మిది తరాల వారు ప్రభువులైనారు. సంగీతానికి సేవ చేశారు. 

అప్పుడు కురిసిన పుణ్యం ఆ నేలకి ఇంకా మిగిలింది. 

భరతమాతకు ఘనపుత్రుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి 1882 లో ఎట్టయాపురంలో జన్మించాడు. ] 
--------------------------------------------------------- 
రచన - మైథిలి అబ్బరాజు, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో 

వరో ఎవరో అత గాడు 
ఓరగ చూచాడు 
సుందర వదనపు సోగ్గాడు 
సరసకు రమ్మని పిలిచాడు! 

మనసును దోచిన మొనగాడు 
మదిలో కోరిక.....రగిలించాడు 
పున్నమి వెన్నెల నెల రేడు 
పూవుల తోటకు రమ్మన్నాడు! 

నెమలి పింఛమె తలపై వుండగ 
నల్లని వాడు.. బలే అల్లరివాడు 
వెన్నను తాకిన పెదవుల తడితో 
తీయగ మురళీ వాయించాడు! 

ముచ్చటగ మాటలు చెబుతు 
ముద్దులు యిమ్మని.. కోరాడు 
ప్రేమతొ ఆతని... కౌగిలి చేరగ 
కలలో నవ్వుతు కనపడి నాడు! 



హరిః ಓమ్ 

7) శ్లోకము 

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ! 
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం !! 

ఈ శ్లోకము నందు పరమాత్మ తొమ్మిది పుణ్యనామములతో స్తవనీయుడగుౘున్నాడు. 

57) కృష్ణః ఓం కృష్ణాయనమః 

పవిత్రమగు మంగళనామముగా భక్తులు నిరంతరమునూ గానము చేయు దివ్యనామ మిది. 

1) " కృష్ణస్తు భగవాన్ స్వయమ్ " శ్రీకృష్ణుడు సర్వకళా పరిపూర్ణుడగు భగవంతుడని భాగవత వాక్యము. 

2) కురుక్షేత్ర రణరంగంలో పార్థుని నిమిత్త మాత్రునిగా నుంౘు కొని అద్భుతమగు గీతోపదేశమును చేసిన కారణమున శ్రీకృష్ణుడు జగద్గురువయ్యెను. భారతీయులకు మాత్రమే కాకుండా ఖండ ఖండాంతర పుణ్యసీమ కెల్లా విశ్వమునకెల్లా గీతోపదేశము శిరోధార్యమై యున్నందున శ్రీకృష్ణుడు విశ్వగురువు. 

3) కృష్ణునకు ఒక్క ప్రణామము చేసినంత మాత్రముచేతనే దశాశ్వమేథయాగఫలము ప్రాప్తింౘునని భారతము వచింౘును. కృష్ణస్మరణము కోటిజన్మకృత పాపహరణమని శాస్త్రవాక్యము. 

4) " కృష్ " అనగా నిరతిశయమైన (Infinite) అని అర్థము. "నః " అనగా ఆనందము (Bliss) అనగా సచ్చిదానంద స్వరూపుడు (Infinite Bliss). 

5) సర్వమునూ ఆకర్షింౘువాడగుట చేత " కృష్ణు " డన 
బరగెననియూ మరియొక అర్థముగలదు. 

6) శ్యామసుందరుడగు కృష్ణుఁడు మానవకోటికి దివ్య వాగ్దానములు, అభయప్రదానములు గావించినాడు. " యోగ క్షేమం వహామ్యహం , నీయొక్క యోగక్షేమములను వహింౘు వాడను నేను 
నివసిష్య " మామేకం శరణవ్రజ " నన్నే శరణుబొందుము. నిన్ను సకల పాపములనుండి విముక్తుని చేసెదను. (అ_18_66) 

" మచ్చిత్తః సర్వదుర్గాణి _ తరిష్యసి " నీ మనస్సు ను నాకర్పించిన సకల దుఃఖములనుండియు దాటిపోగలవు. (అ_18_55) 
" మయ్యేవ మనఆధత్స్వ నివసిష్యసిమయ్యేవ " నాయందే మనస్సునుంౘుము _ నన్నేపొందెదవు. (అ 12_8) మన్మనాభవ_ మామేవైష్యసి " నీమనస్సు నాయందుంచిన నన్నేపొందెదవు. 
(అ 18_65). ఈ రీతిగా విశ్వమానవకోటికి ఎన్నియోరీతుల వాగ్దానములు, ప్రమాణములు గావించిన కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మయేకదా.అందుచే ఈ స్తవరాజము నందు దేవకీనందనుడు 
అధిష్ఠాన దివ్యదేవతగా తెలుపబడెను. 

58) లోహితాక్షః ఓం లోహితాక్షాయనమః 

" ఎఱ్ఱని నేత్రములు గలవాడు" అని భావము. ఎరుపు రజోగుణము ను సూచింౘును. ఎఱ్ఱని నేత్రములు క్రోధమును సూచింౘును. భగవంతుడు ప్రేమస్వరూపుడే యయ్యును, తన 
కుమారులు అక్రమమార్గములలో,ధర్మవిరుద్ధముగా ప్రవర్తింౘు నపుడు వారిని సరిదిద్దుటకు క్రోధపూరితుడగుౘుండును. కనుక శ్రీహరి లోహితాక్షుడనబడు ౘున్నాడు. దుష్టులపట్లనూ, దుర్మార్గుల పట్లనూ ఆయన కోపమువహింౘును. మానవులందరూ పరమేశ్వ రానుగ్రహమును పొందవలయునన్నచో వారు తప్పక ధర్మమార్గాన శాస్త్రం చెప్పిన చొప్పున నడౘుకొనవలెనని ఈ నామము యొక్క ప్రబోధము. అట్టి ధర్మప్రవర్తకులకే భగవదనుగ్రహము లభింౘును. 
దుర్మార్గులు ఆయన యొక్క లోహితాక్షములకు గుఱియై దుఃఖ భాజనులగుదురు.
 --((**))--

Friday 24 August 2018

Pranjali Prabha (telugu పత్రిక ) - 8 -2 0 1 8






ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
అఆనడం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 


*!!!శుభ శుభోదయం 
శ్రావణ శనివారం శుభాకాంక్షలు!!!* 

అభయ హస్త గోవిందా 
అక్షయ వరదా గోవిందా 
శంఖ చక్రధర గోవిందా 
సారంగ గదాధర గోవిందా 
గోవిందా హరి గోవిందా 
గోకుల నందన గోవిందా🕉🕉🕉 

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 
ఆగష్టు 25, 2018 
శనివారం (స్థిరవాసరే ) 
శ్రీ విళంబి నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు 
శ్రావణమాసం శుక్ల పక్షం 
తిధి : చతర్థశి మ2.18 
తదుపరి పౌర్ణమి 
నక్షత్రం :శ్రవణం ఉ10.12 తదుపరి ధనిష్ఠ 
యోగం : శోభన రా9.26 
తదుపరి అతిగండ 
కరణం :వణిజ మ2.18 
తదుపరి భద్ర/విష్ఠి తె3.14 
సూర్యరాశి : సింహం 
చంద్రరాశి : మకరం 
సూర్యోదయం : 5.47 
సూర్యాస్తమయం : 6.18 
రాహుకాలం:ఉ9.00 - 10.30 
యమగండం/కేతుకాలం: మ1.30 - 3.00 
వర్జ్యం : మ2.37 - 4.23 
దుర్ముహూర్తం:ఉ5.48 - 7.28 
అమృతకాలం:రా1.12 - 2.58 
వరాహ జయంతి 
శుభమస్తు🙏🏻

శ్లో === ఋణం చయాచ్నా వృద్దత్వం జారచోర దరిద్రతా | 
రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టః ప్రకీర్తితాః || 

భావము === అప్పులపాలగుట, యాచనము, ముసలితనము, జారత్వము కలిగి యుండుట, దొమ్గాగుట, దరిద్రుదగుట, రోగము, ఒకరు తినగా మిగిలిన భోజనము తినుట యను నీ ఎనిమిదింటిని అష్టకష్టులందురు.

--((**))--

శ్లో === అమృతం సద్గుణా భార్యా అమృతం బాల భాషితమ్ |
అమృతం రాజసమ్మాన మమృతం మాన భోజనమ్ ||

భావము === సుగుణములు గల భార్య, పిల్లలపలుకులు, రాజుల గౌరవము , మిత భోజనము[లేక ఆదరనతో పెట్టిన హోజనము ] అమ్రుతముతో సమానమని భావము.
--((**))--

వందనాలర్పింతు.. 
ద్విపద (చతుష్పదలుగా) 
రచయత: సుప్రభ

చేదుకోవమ్మరో శ్రీ లక్ష్మి మమ్ము 
ఆదుకోవమ్మరో హరిపత్ని దయను 
పాదుకొల్పుక యుండు పద్మాక్షి వెలసి 
శ్రీదవై నిత్యమ్ము గృహమందు మెఱసి 

పూజించుకొందుమే పూలతో నిన్ను 
రాజిల్లవే వచ్చి రంగుగా రమణి 
నాకాధిపతి వోలె నయముగాఁ బొగడ 
లేకుండెనని పల్కు క్లేశమీబోకు 

పూలు, పండ్లే గాని ముదముగా నీయ 
మేలైనవింకేవి మెచ్చి తేలేను 
ఆలపింతును కొన్ని యల్లి పద్యాల 
వాలు భక్తిని నీకు, వనరుహాలయకు 

అందాల తల్లివై యతివేగ రమ్ము 
గంధమాల్యాదులన్ గానుకల్ సేసి 
యందించి హారతుల్ హర్షిణీ నీకు 
విందు సేసెద నమ్మ వీలైన యటుల 

స్థిరనివాసము సల్పి చెలువుగా నింట 
మురిపించుమోయమ్మ మురవైరి రాణి 
హరితోడ నీవింట నతిశయించంగ 
మఱి కోరనేముండు మాకైన నింక 

అష్టలక్ష్ముల రీతినందగించంగ 
నిష్టమై మాయింట యిందిరా దేవి 
కష్టనష్టాలింక కనుపించఁ గలవ 
దృష్టికెచ్చటనైన, దిగులు గూర్చంగ 

కరుణించుమా వచ్చి కందర్పజనని 
సిరులిచ్చు మాతల్లి శ్రీమహాలక్ష్మి 
వరలక్ష్మివై కోరు భాగ్యాల నిమ్ము 
మెఱుగైన భక్తియున్ మేటి జ్ఞానమును 

వందనాలర్పింతు వైష్ణవీ నీకు 
చిందించి చిరునవ్వు చెలిమితో రమ్ము 
అందించి యనువుగా నర్థించు సిరుల 
నందుకో నాపూజలనయమ్ము మురిసి 
--((**))--

🙏 శ్రీ లలితా సహస్ర నామములు
రోజుకు ఒక శ్లోకం నేర్చుకుందాం
శ్లోకం - 42 🙏
------------------------------
భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా|
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ ||42||

89) భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా - నిజమైన భక్తికి ప్రీతిచెందునది. భక్తికి దారిచూపిoచునది. భక్తికి వశమగునది. అన్ని భయములను దూరము చేయునది.

90)శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ - శివుని తలపులలో వుండేది. బ్రహ్మ శారదలచే కోలువబడునది. ఈశ్వరుని ప్రియురాలైన శర్వాణి భక్తులకు సుఖశాంతులని యిచ్చునది
.
గజల్ . 

వియోగాల విషాదాల.. విరాగమే మధువు కదా..! 
వినోదాల విశేషాల..విలాసమే మధువు కదా..! 

నీలినీలి మేఘమాల..ఏమి కురియగలదు ఇపుడు.. 
సరసరాగ మౌనపుష్ప..పరాగమే మధువు కదా..! 

కలువపూల నేలువాడు..నెలరాజే నిజం.. 
నెలవంకతో సరోవరపు..విరహమే మధువు కదా..! 

చిరునవ్వుల మెఱుపుతీవ..ఎఱుకవీడి లేదు.. 
కులాసాల కలహంసల..ఒయారమే మధువు కదా..! 

సంధ్యారుణ తిలకమేదొ..పంచు గగనసీమ.. 
అల్లుకున్న చైతన్యపు..పరిమళమే మధువు కదా..! 

మరి మాధవ గజలింటికి..ఆహ్వానం ఏల.. 
అభావమౌ అక్షరాల..ప్రకాశమే మధువు కదా..!

--((**))--

🙏 సౌందర్యలహరి - శ్లోకం 8 🙏
***************************
సుధాసింధోర్మధ్యే సురవిట-పివాటీ-పరివృతే
మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |
శివకారే మంచే పరమశివ-పర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద-లహరీమ్ || 8 ||

తాత్పర్యము :- తల్లీ ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, కల్పవృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై, మంగళరూపమైన పాన్పుపై, నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులు మాత్రం సేవిస్తున్నారు.
(అందరికీ సామాన్యంగా అమ్మని సేవించుకొనే భాగ్యం కలగదని భావం)

కొలను – మొదటి భాగం(అనువాదకథ) 

సాహితీమిత్రులారా! 
ఆంగ్లం నుండి అనువదించిన కథను ఆస్వాదించండి- 

ఏపియా పట్టణంలోని మెట్రోపోల్ హోటలుకు యజమాని అయిన చాప్లిన్ నన్ను లాసన్ కు పరిచయం చేసినప్పుడు, లాసన్ పట్ల ప్రత్యేకమైన ధ్యాసను పెట్టలేదు నేను. అప్పుడు మేము హోటల్ లాంజ్ లో కూచుని కాక్టెయిల్ తాగుతున్నాము. ఆ ద్వీపానికి సంబంధించిన విషయాలమీద లోకాభిరామాయణం కొనసాగుతుంటే, వినోదం నిండిన ఉల్లాసంతో దాన్ని వినసాగాను. 

చాప్లిన్ తన సంభాషణ ద్వారా నాకు ఉత్సాహాన్నీ ఆనందాన్నీ కలిగించాడు. అతడొక మైనింగ్ ఇంజినీరు. తను సాధించిన వృత్తిపరమైన విజయాలకు అంతగా విలువ లేని ప్రాంతంలో స్థిరపడటాన్ని అతని ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చునేమో. ఆయన చాలా తెలివిగల మైనింగ్ ఇంజినీర్ అని చెప్పుకుంటారు అక్కడి వాళ్లందరూ. అతడు చిన్నగా వుంటాడు. శరీరం లావుగా కాకుండా సన్నగా కాకుండా మధ్యరకంగా వుంటుంది. వెంట్రుకలు నల్లగానే వుంటాయి. కాని, తలమీద మాత్రం అక్కడక్కడ జుట్టు నెరిసిపోయి కొంత పలుచగా వుంటుంది. మీసాలు చిన్నగా, కొంచెం కొక్కిరిబిక్కిరిగా ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎండ తగలడం చేతా, మద్యం తాగడం చేతా అతని ముఖం బాగా ఎరుపు రంగును కలిగి వుంటుంది. ఆ హోటలు పేరులో అట్టహాసం ఉన్నా దాని భవనం కేవలం రెండంతస్తులదే. దాన్ని అతని నలభై ఐదేళ్ల భార్య చక్కని అజమాయిషీతో పర్యవేక్షిస్తుంటుంది. సన్నగా పొడవుగా ఉండే ఆమె, ఆస్ట్రేలియా దేశస్థురాలు. చాప్లిన్ తరచుగా ఉద్రేకంతో, నిషాలో, భార్యపట్ల భయంతో ఉంటాడు. ఆ ద్వీపానికి కొత్తగా వచ్చినవారు కొద్ది రోజులు కాగానే చాప్లిన్ కూ అతని భార్యకూ మధ్య జరిగే కుటుంబ కలహాల గురించి వింటారు. భర్తను ఎప్పుడూ తన స్వాధీనంలో ఉంచుకోవటం కోసం ఆమె తన పిడికిలినీ పాదాన్నీ ఉపయోగిస్తుంది. అప్పుడప్పుడు భర్త బాగా తాగి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే, ఆమె అతణ్ని ఇరవై నాలుగు గంటలపాటు గదిలో బంధించడం, మరునాడు అతడు వరండాలో దీనాతిదీనంగా భార్యతో వేడుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్లకు అది వినపడటం మామూలే. 

చాప్లిన్ ఒక వింతైన, ఆసక్తికరమైన మనిషి. తన జీవితంలో చాలా ఎత్తుపల్లాలతో కూడిన వైవిధ్యం ఉందని చెప్తుంటాడతడు. అది నిజమో అబద్ధమో తెలియదు కాని, అతడు చెప్పేది వినాలనిపిస్తుంది. ఒకసారి అట్లా చెప్తున్నప్పుడు మధ్యలో లాసన్ రావటం నాకు అంతరాయం అనిపించి లోలోపలే విసుక్కున్నాను. చాప్లిన్ అప్పటికే బాగా తాగి వున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. నాకు ఇష్టం లేకున్నా అతని బలవంతం మీద మరో పెగ్గును తాగటానికి ఒప్పుకున్నాను నేను. చాప్లిన్ మెదడులో అప్పటికే మందకొడితనం ఆవహించిందని గ్రహించాను. మర్యాద ప్రకారం, ఆనవాయితీ ప్రకారం తరువాతి రౌండులో మద్యానికి నేనే ఆర్డరివ్వాలి, నాకిష్టం ఉన్నా లేకపోయినా. అప్పుడు చాప్లిన్ లో వదరుబోతుతనం ప్రవేశిస్తుంది. తర్వాత అతని భార్య చూపులు కోపంతో నిండిపోవటం ఖాయం. 

చాప్లిన్ ఆకారంలో లాగే లాసన్ ఆకారంలో కూడా ఎటువంటి ఆకర్షణా లేదు. అతడు కూడా సన్నగా చిన్నగా వుంటాడు. ముఖం కోలగా, చుబుకం చిన్నగా, ముక్కు పెద్దగా, కనుబొమల వెంట్రుకలు నల్లగా దట్టంగా వుంటాయి. ఈ ఆకార విశేషాలన్నీ అతని రూపానికి ఒక రకమైన వింత తరహాను ఆపాదించాయి. అతని కళ్లు చాలా నల్లగా పెద్దగా ఉంటాయి. ఆయన ఉల్లాసంగా కనిపిస్తాడు కాని, అది నిజమైన ఉల్లాసం కాదనిపిస్తుంది నాకు. అది ప్రపంచాన్ని మోసగించటం కోసం పైపైన అతడు ధరించే ముసుగు. అది అతనిలోని అల్పత్వాన్ని దాస్తున్నదనిపించింది. అతడు ఆహ్లాదంగా కనిపించినప్పటికీ, ఎందుకో కాని ఆ మనిషిలో కపటత్వం ఉందనుకునేవాణ్ని. తన బొంగురు కంఠంతో చాలా మాట్లాడేవాడు. చాప్లిన్, లాసన్ ఇద్దరూ తమ మందుపార్టీల గురించి చెప్పుకోవడంలో ఒకరినొకరు మించిపోతారు. ఇంగ్లిష్ క్లబ్ లో బాగా తాగిన రాత్రుల గురించీ, విపరీతంగా విస్కీ తాగుతూ వేటాడటం గురించీ, సిడ్నీకి వెళ్లినప్పుడు ఆ నగరంలో కాలు మోపిన దగ్గర్నుంచి తిరిగివచ్చే దాకా పూర్తిగా నిషాలో ఉండటం గురించీ వాళ్లు చెప్పుకునే ముచ్చట్లు అందరి నోళ్లలో గాథలుగా మారిపోయి ఇద్దర్నీ తాగుబోతులుగా మిగిల్చాయి. నాలుగు పెగ్గులు తాగింతర్వాత ఇద్దరికీ నిషా ఎక్కింది. కాని, ఇద్దరి తీరుల మధ్య చాలా భేదం వుంది. చాప్లిన్లో మొరటుతనం, నీచత్వం కనిపించగా, లాసన్ లో నిషా ఉన్నా సభ్యత కనిపించింది. 

ఆఖరుకు లాసన్ కొంచెం తూలుతూ కుర్చీలోంచి లేచి, “నేను ఇంటికి వెళ్తున్నాను. సాయంత్రం మళ్లీ కలుస్తాను” అన్నాడు. 
“మీ ఇంటావిడ బాగుందా?” అని అడిగాడు చాప్లిన్. 

“ఆఁ”, అని వెళ్లిపోయాడు లాసన్. ఆ ఏకాక్షర సమాధానం కొంచెం వింతగా అనిపించడంతో నేను తలెత్తి చూశాను. 

“మంచివాడు. నిజానికి చాలా మంచివాళ్లలో ఒకడు. కాని, పాపం బాగా తాగుతాడు. అతని మీద జాలి కలుగుతుంది” అన్నాడు చాప్లిన్, ఎటువంటి ఉద్వేగాన్నీ కనబరచకుండా. 

చాప్లిన్ చేసిన ఈ వ్యాఖ్యలో కొంత హాస్యం లేకపోలేదు. తర్వాత మళ్లీ, “తాగిన మత్తులో వున్నప్పుడు లాసన్ ఎదుటివాడితో పోట్లాడాలనుకుంటాడు” అన్నాడు చాప్లిన్. 

“అతడు తరచుగా నిషాలో వుంటాడా?” అని అడిగాను. 

“విపరీతంగా. వారంలో మూడునాలుగు రోజులు చిత్తుగా తాగుతాడు. అతడట్లా మారటానికి ఈ ద్వీపమే కాక ఎతెల్ కూడా కారణం” 

“ఎతెల్ ఎవరు?” 

“ఆమె అతని భార్య. రెండు జాతుల మిశ్రమంగా పుట్టింది. ముసలి బ్రెవాల్డ్ కూతురు. భర్త ఆమెను తీసుకు పోయాడు కాని, అక్కడి పరిస్థితిని ఆమె తట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ భార్యాభర్తలిద్దరూ కలిసి వుంటున్నారు. ఏదో వొకరోజు తాగుడు మూలంగా కాకపోయినా మరే ఇతర కారణం చేత ఐనా ఉరేసుకుని చస్తాడు లాసన్. అతడు మంచివాడే కాని, తాగినప్పుడు మాత్రం భరించలేనంత అరాచకత్వం నిండుతుంది అతన్లో” అని చప్పుడు వచ్చేలా త్రేన్పు తీశాడు చాప్లిన్. 

తర్వాత, “నేను పైకి వెళ్లి షవర్ కింద స్నానం చేస్తాను. ఆ చివరి పెగ్గును నేను తాగకుండా వుండాల్సింది. ఎప్పుడూ ఆ ఆఖరి పెగ్గే మనను బోల్తా కొట్టిస్తుంది” అన్నాడు. పైన వున్న స్నానాల గదిలోకి పోవాలని నిశ్చయించుకున్న అతడు కొంచెం సంశయిస్తూ మెట్లవైపు చూశాడు. తర్వాత అసహజమైన గాంభీర్యంతో లేచి నిలబడ్డాడు. మళ్లీ, “లాసన్ తో స్నేహం చేస్తే లాభమే. అతడు చాలా పుస్తకాల్ని చదివాడు. నిషాలో లేనప్పుడు ఎంత నెమ్మదిగా వుంటాడో! తల్చుకుంటే అది ఆశ్చర్యంగా వుంటుంది. చాలా తెలివైనవాడు కూడా. అట్లాంటి వాళ్లతో మాట్లాడితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది” అన్నాడు. 

ఈ విధంగా లాసన్ గురించిన దాదాపు మొత్తం కథను కొన్ని వాక్యాల్లో నాకు చెప్పాడు చాప్లిన్. 

సాయంత్రం నేను సముద్రతీరం వెంట వాహ్యాళికి పోయి హోటలుకు తిరిగివచ్చి చూస్తే, అక్కడ లాసన్ కనిపించాడు. ఏ ఉద్వేగమూ లేని కళ్లతో లాంజ్ లోని పేముకుర్చీలో బాగా లోపలికి కూరుకుపోయినట్టుగా కూర్చుని వున్నాడు. మధ్యాహ్నం నుండి మద్యం తాగుతూనే వున్నట్టు అనిపించింది అతని వాలకం చూస్తే. అతనిలో మందకొడితనం కనిపించింది. చూపుల్లో వ్యాకులతా, ప్రతీకారభావంతో కూడిన కోపమూ ఉన్నాయని గ్రహించాను. ఒక్క క్షణం నా మీద దృష్టిని నిలిపాడతడు. కాని, నన్నతను గుర్తు పట్టినట్టు లేదు. అక్కడ పక్కనే డోమినో అనే పాచికల ఆట ఆడుతున్న ఇద్దరుముగ్గురు పురుషులు అతణ్ని చూడనట్టుగా తమ పనిలో మునిగిపోయారు. అతని వాలకంలోని ఆ సాదాసీదాతనమే అందుకు కారణం. నేను కూడా వాళ్లతో కలిసి ఆ ఆట ఆడటం మొదలు పెట్టాను. 

“మీరు చాలా కలుపుగోలు మనిషి” అన్నాడు నా పక్కన వచ్చి కూచున్న లాసన్ అకస్మాత్తుగా. 

అతడు కుర్చీలోంచి లేచి, వంగిన మోకాళ్లతో కొంచెం కుంటుతున్నట్టుగా తలుపువైపు నడిచాడు. మా ఆటా, ఆ వాతావరణం అతనికి హాస్యాస్పదంగా కనించాయా అనిపించింది. లాసన్ అక్కణ్నుంచి కదలగానే, ఆటాడుతున్నవారిలో ఒకడు కిసుక్కున నవ్వి “ఇవ్వాళ్ల బాగా తాగి వున్నాడు ఆయన” అన్నాడు. 

మరొకడు, “తాగి కూడా అతనిలాగా నింపాదిగా ఉండలేకపోతే అసలు తాగకపోవడమే మంచిదనిపిస్తుంది” అన్నాడు. 

ఆ నిర్భాగ్యుడు నిజానికి ఒకరకంగా ప్రేమ నిండిన వాడిలాగానే ఉన్నాడనీ, కాని విషాదాన్ని తలపింపజేయడానికి అవసరమైన దీనత్వమూ భయమూ అతని జీవితంలో ఉన్నాయనీ ఎవరూహిస్తారు? 

తర్వాత రెండుమూడు రోజుల వరకు లాసన్ కనపడలేదు. 

ఒకరోజు సాయంత్రం వేళ నేను హోటల్ మొదటి అంతస్తులోని వరండాలో కూచుని వున్నాను. అక్కణ్నుంచి హోటల్ ముందరి వీధి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు లాసన్ వచ్చి నా పక్కన వున్న కుర్చీలో కూర్చున్నాడు. అతనిలో నిషా వంటిది ఎంతమాత్రం లేదు, చాలా నెమ్మదితనం వుంది. యధాలాపంగా నాతో యేదో అన్నాడతడు. నేను కొంచెం ఉపేక్షతో జవాబిచ్చేసరికి సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగా నవ్వుతూ “మొన్న నేను విపరీతంగా తాగి నిషాలో వున్నాను” అన్నాడు. 

నేను జవాబివ్వలేదు. నిజానికి అనటానికి ఏమీ లేదు కూడా. చుట్ట తాగుతున్న నేను దోమల్ని తరమటం కోసం పొగను నోటితో చుట్టూ ఊదాను. అక్కడి స్థానిక కూలీలు పని ముగించుకుని హోటలు ముందరి రోడ్డు మీదుగా తమ యిళ్లకు తిరిగి వెళ్తుండటం చూశాను. వాళ్లు పెద్దపెద్ద అంగలతో మెల్లగా, జాగ్రత్తగా, హుందాగా నడుస్తున్నారు. చెప్పులు లేని పాదాలతో వాళ్లు నడుస్తుంటే వింతైన శబ్దం వస్తోంది. వాళ్ల వెంట్రుకలు సాధారణంగా మెలితిరిగి కాని, వంపు లేకుండా కాని నల్లగా ఉంటాయి. అప్పుడు మాత్రం వాళ్ల వెంట్రుకలు తెల్లని పొడితో నిండి ఒక అసాధారణమైన ప్రత్యేకతను కనబరుస్తున్నాయి. వాళ్లు దృఢమైన శరీరాలతో పొడవుగా ఉన్నారు. వాళ్ల తర్వాత సాల్మన్ ద్వీపానికి చెందిన కాంట్రాక్టు కూలీల గుంపొకటి పాటలు పాడుకుంటూ వెళ్లింది. వాళ్లు బొగ్గులాంటి కారు నలుపుతో, ఎర్రరంగు వేసుకున్న వెంట్రుకల్తో, పెద్దపెద్ద తలలు కలిగిన సమోవా ద్వీపవాసులకన్న పొట్టిగా, చిన్నగా ఉన్నారు. మధ్యమధ్య తెల్ల జాతీయులు తమ గుర్రపు బగ్గీల్లో రోడ్డు మీదుగా పోవటమో లేక హోటలు ప్రాంగణంలోకి రావటమో చేస్తున్నారు. ఎదురుగా వున్న ప్రశాంతమైన సముద్రపు నీళ్లలో నిలిచి వున్న రెండుమూడు ఓడలు తమ సొగసును కనబరుస్తున్నాయి. 

“ఇట్లాంటి ప్రదేశంలో ఫుల్లుగా తాగటం తప్ప చేయటానికి పనేమి ఉంటుందో తెలియదు నాకు” అన్నాడు ఆఖరుకు లాసన్. 
ఏదో అనాలి కదా అనుకుని “సమోవా ద్వీపం మీకు నచ్చలేదా?” అన్నాను. 

“ఈ ద్వీపం అందంగానే వుంటుంది” అన్నాడతడు. 

ఆ వాక్యం సమోవా ద్వీపపు అద్భుతమైన అందాన్ని వర్ణించడానికి ఎంతమాత్రం సరిపోలేదనిపించింది. నేను నవ్వి అతనివైపు తిరిగాను. అతని కళ్లలో భరించలేనంత ఆవేదన కనిపించింది. వాటిలో అనంతమైన విషాదపు లోతులున్నాయి. అటువంటి భావోద్వేగాన్ని అతడు చూపగలడని నేను అసలే ఊహించలేదు. కాని, అతని ముఖంలోని ఆ భావం వెంటనే మాయమై అతడు నవ్వాడు. ఆ నవ్వు సాదాసీదాగా, కొంచెం అమాయకంగా వుంది. దాన్తో అతని ముఖకవళిక మారింది. దాని మూలంగా నాలో అతని పట్ల మొదటిసారిగా కొంత విముఖత ఏర్పడింది. 

“నేనిక్కడికి వచ్చిన కొత్తలో ఊరంతా తిరిగేవాణ్ని” అని ఒక్క క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు లాసన్. తర్వాత మళ్లీ, “మూడు సంవత్సరాల పాటు ఈ ద్వీపాన్ని వదిలి దూరంగా ఉన్నాను. కాని, తర్వాత తిరిగివచ్చాను” అన్నాడు. ఆ పైన కొంచెం తటపటాయించి “మళ్లీ ఇక్కడికే రావాలని నా భార్య పట్టుబట్టింది. ఆమె ఇక్కడే పుట్టిందని మీకు తెలుసు కదా” అన్నాడు. 

“ఔను, తెలుసు” అన్నాను. 

అతడు మళ్లీ మౌనం వహించాడు. తర్వాత రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ గురించి ఏదో వ్యాఖ్య చేశాడు. “మీరు వైలిమాకు వెళ్లారా?” అని అడిగాడు. ఏదోవిధంగా నాతో కలుపుగోలుగా వుండాలని ప్రత్నం చేస్తున్నాడతడు. స్టీవెన్సన్ పుస్తకాల గురించి మాట్లాడాడు. తర్వాత సంభాషణ లండన్ నగరం మీదికి మళ్లింది. 

“అక్కడి కావెంట్ గార్డెన్స్ ఇంకా అట్లానే ఉత్తేజకరంగా ఉన్నాయనుకుంటాను. ఆ సంగీత నాటకాలను నేనిక్కడ యెంతగానో మిస్సవుతున్నాను. ట్రిస్టాన్ అండ్ ఐలోడ్ అనే నాటకాన్ని చూశారా మీరు?” అని అడిగాడు. 

ఆ ప్రశ్నకు జవాబు తనకెంతో ముఖ్యమైనది అన్నట్టుగా అడిగాడు. “చూశాను” అని నేను ముక్తసరిగా చెప్పగానే సంతోషాన్ని కనబరిచాడు. వాగ్నర్ సంగీతం గురించి మాట్లాడాడు. ఒక సంగీతపరుడిలా కాక, మామూలు మనిషిలా మాట్లాడాడు. వాగ్నర్ సంగీతం ద్వారా ఒక రకమైన మానసిక తృప్తిని పొందాననీ, కాని దాన్ని వివరించలేననీ అన్నాడు. 

“నాకు అంతగా డబ్బూ అదృష్టమూ లేవు కాని, బేర్సూత్ నిజంగా చూడాల్సిన ప్రదేశం. కాని, అది కావెంట్ గార్డెన్సంత బాగా ఉండదనుకోండి. ఆ సంగీత నాటకశాలలో అద్భుతమైన తళతళల వెలుతురూ, మెడకింది దాకా దుస్తుల్ని ధరించిన స్త్రీలూ, ఇంకా ఆ శ్రావ్యమైన సంగీతమూ ఎంతో బాగుంటాయి. వాక్యూర్స్ నాటకంలోని మొదటి అంకం చాలా బాగుంటుంది కదా. ఇక ట్రిస్టాన్ నాటకంలోని చివరి ఘట్టమైతే అద్భుతం. ఆహా, ఎంత దివ్యంగా ఉంటుందో!” అన్నాడు. 

ఈ మాటలు చెప్తుంటే అతని కళ్లలో మెరుపు కనిపించింది. ముఖం దీప్తితో వెలిగిపోయి, అతడు అంతకుముందు కనిపించిన మనిషి కాదనిపించింది. తెల్లని చెక్కిళ్లు ఎరుపు రంగును పులుముకున్నాయి. అంతకు ముందు అతని గొంతు బొంగురుగా, కొంచెం వికృతంగా ఉండిన సంగతి మరచిపోయాను. కొంత ఆకర్షణీయంగా కూడా కనపడ్డాడతడు. 

“దేవుని తోడు, ఈ రాత్రి లండన్లో ఉండాలనిపిస్తోంది నాకు. అక్కడి పాల్ మాల్ రెస్టారెంట్ మీకు తెలుసు కదా. అందులోకి నేను చాలా సార్లు పోయేవాణ్ని. ఇక పికాడిలీ సర్కస్ దగ్గర దుకాణాలన్నీ వెలుగుతో నిండిపోయి, అక్కడ జనంతాలూకు రద్దీతో యెంతో కోలాహలంగా వుంటుంది. అక్కడ నిల్చుని ఒక్క క్షణం కూడా తెరిపి లేకుండా వచ్చే పోయే బస్సులనూ టాక్సీలనూ చూస్తుంటే ఆనందంతో దిమ్మ తిరిగిపోతుంది. భగవంతుని గురించీ, చేరింగ్ క్రాస్ గురించీ రాయబడిన ఆ పంక్తులు గుర్తున్నాయా మీకు?” అని అడిగాడు లాసన్. నాకు చెప్పరానంత ఆశ్చర్యం కలిగింది. 

“థామ్సన్ రాసిన పంక్తులా?” అని అడిగాను. తర్వాత ఆ పంక్తుల్ని చదివాను ఇలా - 

‘అంతులేని విషాదం నిన్ను ఆవరించినప్పుడు 
అప్పుడు - 
స్వర్గానికీ చేరింగ్ క్రాస్ కూ మధ్య వున్న జనాల జేకబ్ నిచ్చెన 
ఆ ప్రజాసమూహం వెల్తురుతో తళతళా మెరుస్తుంది’ 

లాసన్ చిన్నగా నిట్టూర్చాడు. 

“దహౌండ్ ఆఫ్ హెవెన్ చదివాను నేను. అది బాగుంది” అన్నాడు. 

“సాధారణంగా అందరూ అట్లానే అంటారు” అని గొణిగాను. 

“ఇక్కడ పుస్తకాలు చదివేవాళ్లెవరూ కనపడరు. చదవటం అనేది అట్టహాసం అనుకుంటారు వీళ్లు” 

అతని ముఖంలో బెంగ నిండిన చూపు కనపడింది. నా దగ్గరికి రావాలని అతడెందుకనుకున్నాడో ఊహించాను. తాను కోల్పోయిన ప్రపంచాన్ని, మళ్లీ అనుభవించలేని జీవితాన్ని నాకూ తనకూ మధ్య వున్న లంకెగా భావించాడు. ఎందుకంటే అప్పటికి కొంత కాలం క్రితమే నేను లండన్లో ఉండి వచ్చాను. అందుకు గాను నాపట్ల సంభ్రమం నిండిన ఆశ్చర్యం, అసూయా కలిగాయి అతనికి. ఐదు నిమిషాల వరకు అతడు ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఉద్రేకం నిండిన తీవ్రతతో “నేనిక్కడ విసిగిపోయాను, బాగా విసిగిపోయాను” అన్నాడు. ఆ మాటలకు నేను చలించిపోయాను. 

“అయితే మరి నువ్వెందుకు ఇక్కణ్నుంచి వెళ్లిపోవు?” అని అడిగాను. 

“నా ఊపిరితిత్తులకు చిన్న వ్యాధి వచ్చింది. ఇంగ్లండులోని చలికాలాన్ని నేనిప్పుడు తట్టుకోలేను” 

ఆ సమయంలో మరొక వ్యక్తి ఆ వరండాలోకి రావడంతో లాసన్ మళ్లీ మౌనంలోకి కూరుకుపోయాడు. 

“ఇది మందు తాగాల్సిన సమయం. ఎవరు నాతో కలిసి కొంచెం విస్కీ తాగుతారు? నువ్వేమంటావు లాసన్?” అన్నాడు అప్పుడే వచ్చిన వ్యక్తి. 

లాసన్ వేరే లోకంలోంచి బయటికి వచ్చినట్టనిపించాడు. అతడు కుర్చీలోంచి లేచి, “కింద వున్న బార్లోకి పోదాం పద” అన్నాడు. వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. 

లాసన్ పట్ల నాకు సానుభూతి భావం కలిగింది. అతడంటే ఆసక్తి, కలవరం ఏర్పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత నేనతని భార్యను కలిశాను. వాళ్ల పెళ్లి జరిగి ఐదారేళ్లు కావస్తుందని తెలిసింది. కాని, ఆమె యింకా చాలా చిన్న వయసున్న స్త్రీలాగా కనిపించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. లాసన్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు పదహారేళ్లకన్న యెక్కువ లేదు. 
అప్పుడామె అద్భుతమైన అందంతో వెలిగిపోయేది. చామనచాయతో, చిన్నచిన్న చేతులతో, పాదాలతో, తీగలాంటి అతి సన్నని శరీరంతో చాలా ముద్దొచ్చేది. మిశ్రమ జాతికి చెందిన స్త్రీలు సాధారణంగా లావుగా, మోటుగా వుంటారు. కాని, లాసన్ భార్యలోని కోమలత్వం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ సౌకుమార్యాన్ని చూస్తుంటే ఊపిరి తీసుకోవడం మానేసి నోరు తెరుస్తాము. చాలా నాగరికంగా కనిపించే ఆమె అటువంటి ప్రాంతంలో ఉండటం ఆశ్చర్యకరమే. మూడవ నెపోలియన్ దర్బారులోని అందాల రాశులు గుర్తుకొస్తారు ఆమెను చూస్తే. ఫ్రాకు, హ్యాటు ధరించే ఆమెలో ఆధునికత స్పష్టంగా కనిపిస్తుంది. లాసన్ ఆమెను మొదటిసారిగా చూసినప్పుడు ఆమెలో కళ్లు మిరుమిట్లు గొలిపే అందం, మనోహరత్వం ఉండివుంటాయి. 

లాసన్ ఈ మధ్యనే సమోవా ద్వీపంలోని ఒక బ్యాంకులో మేనేజరుగా పని చేయడానికి ఇంగ్లండు నుండి వచ్చాడు. అది వేసవి కాలపు ప్రారంభం. అతడు హోటల్లో ఒక గదిలో ఉంటున్నాడు. వచ్చిన కొత్తలో వెంటనే అక్కడి మనుషులందరితో పరిచయం చేసుకున్నాడు. ఆ ద్వీపపు వాతావరణం హాయిగా వుంటుంది. అక్కడి జీవితంలో నెమ్మదితనం ఉండటం ఒక విశేషం. ఆ హోటల్లోని లాంజ్ లో తీరికగా, బద్ధకంగా సాగే పిచ్చాపాటీ అన్నా, సాయంత్రాల్లో కొందరు వ్యక్తులు ఇంగ్లిష్ క్లబ్ లో ఆడే బిలియర్డ్స్ ఆటను చూడటమన్నా అతనికి యెంతో ఇష్టం. సముద్రతీరం వెంబడి పొడవుగా వ్యాపించి వున్న ఏపియా పట్టణాన్నీ, అక్కడి బంగళాలనూ, పక్కనే వున్న గ్రామ వాతావరణాన్నీ అతడు ఇష్టపడతాడు. వారాంతపు రోజుల్లో ఊరిబయట కొండల మీద రైతుల ఫామ్ హౌజులకు పోయి, ఒకటిరెండు రాత్రులు అక్కడ గడిపి వస్తాడు లాసన్. ఇంగ్లండులో వున్నప్పుడు తీరిక, స్వేచ్ఛ అన్నవి తెలియవు అతనికి. సమోవా ద్వీపంలో పుష్కలంగా సోకే సూర్యరశ్మి అతణ్ని ముగ్ధుణ్ని చేసింది. ఊరిబయటి పొదల మధ్యలోంచి పోతున్నప్పుడు చుట్టుపక్కల వున్న ప్రకృతి అందాన్ని చూసి అతని తల ఆనంద పారవశ్యంతో ఊగుతుంది. ఆ ద్వీపంలోని భూమి వర్ణించలేనంత సారవంతమైనది. ఒకదానితో మరొకటి పెనవేసుకున్న రకరకాల వింతవింత చెట్లతో, నేల నిండా దట్టంగా పరచుకున్న చిన్నచిన్న మొక్కలతో తీగలతో అడవి స్వచ్ఛంగా, మనోహరంగా ఉంటుంది. అవన్నీ అగోచరత్వంతో కూడి, హృదయాన్ని కదిలించి ఇబ్బంది పెట్టే దృశ్యాలు. 

ఇంకా ఉంది… 
----------------------------------------------------------- 
ఆంగ్ల మూలం: The Pool - సోమర్సెట్ మామ్ 
అనువాదం: ఎలనాగ 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో 
----------------------------------------------------------- 

- ఏ.వి.రమణరాజు


జంధ్యాల పౌర్ణమి/ రాఖీ పండుగ [ రక్షాభందన్ ] -8-2 0 1 8

ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆధ్యాత్మికం - ఆరోగ్యం


రాఖీ పండుగ [ రక్షాభందన్ ] 
************************ 
ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణపూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అని పిలుస్తూ ఉంటారు. జంధ్యాలు ధరించే వారందరూ ఈరోజున నూతన జంధ్యాలు ధరిస్తారు. 

ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్ధులకు వేదపఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే; ఆ వృత్తి చెయ్యడం ఈ రోజునుండే ప్రారంభిస్తారు. ఆ విధంగా వీరు ఈరోజు వేదాలన్నింటిని ప్రారంభ ఋక్కును, చివరి ఋక్కును పఠిస్తారు. కాలక్రమంలో ఈ రోజు "రక్షాబంధన్ లేక రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందసాగింది. ఈ రక్షాబంధనము ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ భార్య - భర్తకు, సోదరి - సోదరునకు యుద్ధానికి వెళ్ళే వీరునకు విజయప్రాప్తి కోసం ఈ రక్షాబంధనన కడుతూఉంటారు. 

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః| 
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల|| 

శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. ఈ - రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే! ఈ గాథ మనకు మంచి ప్రామాణిక మవుతుంది. 

పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధము సాగింది. ఆ యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి' లో తలదాచుకుంటాడు. అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగ ఆచారమైనది. 

ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే భార్య - భర్తకు, సోదరి - సోదరులకు కట్టే రఖీద్వారా వారి వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మర్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ 'రాఖీ' విశిష్టత. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వార్కి నూతన వస్త్రాలు చిరుకానుకలు సమర్పించి, అందరు కలసి చక్కని విందు సేవిస్తారు. 

విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగాలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వార్కి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావముతో, రక్షణ పొందేవారు. ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీపాదుషాకు' రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట భగినీ హస్తభోజనంచేసి, కానుకలు సమర్పించినట్లు గాధలు ఉన్నాయి. 

అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ, మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అమితానందంతో జరుపుకుని మన చక్కని భారతీయ సంప్ర!దాయ విలువలను కాపాడుదాం!! 
…… @ గురూజీ .


ప్రియమైన సోదరి, సోదరులందరకూ 
రక్షాబంధన్ శుభాకాంక్షలు 
ప్రియమైన అక్కా,చెల్లెలకు,అన్న తమ్ములకు 
రక్ష బంధన్ శుభాకాంక్షలు.
మమతల మాగాణిలో పూసిన పువ్వులం
స్నేహ అనురాగాలు నింపుకున్న నవ్వులం
అనురాగాలకి ప్రతికలం అనుబంధానికి
ప్రతిరూపాలము అయన అన్న,చెల్లలం, అక్కా
తమ్ములం పున్నాగ వనంలో పూచిన పువ్వులం.
ఎన్నాళ్ళైన ఎన్నెళ్ళైనా చెరిగిపోని, చెదరిపోని
అనురాగ,స్నేహ బంధాలు మన పున్నాగ వన
బంధాలు.అందరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు.
ముఖ పుస్తక పున్నాగ వన మిత్రులకు


గజల్ 2415. 

నీ వాంఛా గగనాలను..కాల్చేదే జ్ఞానమోయ్..! 
ఆశయాలు కిరీటాలు..వీడేదే జ్ఞానమోయ్..! 

ఆనందం వేరేగా..లేదన్నది తెలిసిందా.. 
పరుగులన్ని కులాసాగ..నిలిపేదే జ్ఞానమోయ్..! 

పండుగలో పబ్బాలో..లోకువేగ బొబ్బట్లకు.. 
ఆత్మీయత పండించగ..చూసేదే జ్ఞానమోయ్..! 

విత్తుముందొ చెట్టుముందొ..ఎందుకటా గొడవిప్పుడు.. 
గోర్వెచ్చని శ్వాసగుట్టు..తెలిపేదే జ్ఞానమోయ్..! 

ఈ మాటల సోయగాల..రాజ్యమేలు ముచ్చటేమి.. 
మౌనమనే తోటలోన..చేర్చేదే జ్ఞానమోయ్..! 

మానవుడే మాధవుడై..విశ్రాంతిగ ఉండాలిక.. 
చెలిమికలిమి పెంచి తోడు..ఉండేదే జ్ఞానమోయ్..!

--((**))--

Image may contain: text
సుప్రియ - స/న/జ IIUI III UI 
అధిక్షేప ప్రేమ లీల 
రచయతలు మల్లాప్రగడ రామకృష్ణ 

నవ నాగరికము నాంది, మనసే మగువకు నాంది 
- తనువే తమకము నాంది, వలపే వరుసకు నాంది 

రంగువే మమతకు నాంది, వరుసే వలపుకు నాంది 
- మెరుపే చినుకుకు నాంది, జిగురే అతుకుకు నాంది

వికసించు లతకు నాంది, పరికించు వయసు నాంది 
- అరుపే అలకుకు నాంది, రగిలే సెగలు పగ నాంది      

విరహం పరువము నాంది, వయసే వలపుకు నాంది   
- తపనే కలతకు నాంది, పలుకే మనసుకు నాంది 

నాంది అనగా ప్రారంభం 
నాంది అనగా పునాది 
నాంది అనగా మొదలు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--
   
No automatic alt text available.
అరుదెంచెగ 'నెలరాజు' 
వికసించెను 'కలువమ్ము' 
పరికించెలె 'విరజాజి' 
'పురినే'.. విరిసె 'మ.. యూరి ' 
'మనసే'.. మురిసెను జూడ 
'పిలుపే'.. విను మనసార ! 

వినిపించన 'మది'.. నీకై 
అనిపించులె 'యది'.. నీదై 
'రగిలే' సెగలను 'గూడి' 
'తగిలే' విరహపు 'వేడి' 
'మనసే' తలచెను 'వేడి' 
'తనువే' పిలిచెను 'జోడి' 

అరుదెంచెగ 'నెలరాజు' 
వికసించెను 'కలువమ్ము' 
'మనసే' మురిసెను 'జూడ' 
'పిలుపే' విను మనసార ! 

'వయసే' వలపుగ 'మారె' 
'వలపే' సలపులు 'రేపె' 
'మరుడే' మరులను 'దూసె' 
'చెలుడే' సరసకు 'రాడె' 

అరుదెంచెగ 'నెలరాజు' 
వికసించెను 'కలువమ్ము' 
'మనసే' మురిసెను 'జూడ' 
'పిలుపే' విను మనసార ! 

Image may contain: 1 person, sitting, eating and child
         
అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆలోచన ముందు ఆవేశం అధికం 
- అయినా ఆలోచింపచేస్తుంది శాశ్వితం  

నిరుత్సాహము ముందు ఉత్సాహం అధికం 
- అయినా నిరుత్సాహమే శాశ్వితం   

చిరునవ్వుల ముందు ప్రేమానందం అధికం 
- అయినా చిరునవ్వులు శాశ్వితం  

స్త్రీ చూపుల ముందు పరిమళం అధికం 
- అయినా చూపుల్లో చిక్కే  శాశ్వితం  

శృంగారము  ముందు మధువు అధికం 
- అయినా స్త్రీ శృంగారమే శాశ్వితం 

పరిమళం  ముందు స్నేహమే అధికం 
- అయినా పరిమళమే శాశ్వితం 

ఆశయము ముందు మౌనమే అధికం 
- అయినా ఆశయమే శాశ్వితం

సంసారము ముందు సంపదే అధికం 
- అయినా సంసారమే శాశ్వితం     

ఏది ఏమైనా కాలాన్ని వ్యర్థం 
చేయక నడిచే వాడే శాశ్వితం  
ప్రేమించి ప్రేమింపబడేవాడే శాశ్వితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  
--((**))--

Image may contain: 2 people, people smiling, text
హరిః ಓమ్ 

7) శ్లోకము 

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ! 
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం !! 

ఈ శ్లోకము నందు పరమాత్మ తొమ్మిది పుణ్యనామములతో 
స్తవనీయుడగుౘున్నాడు. 

57) కృష్ణః ఓం కృష్ణాయనమః 


పవిత్రమగు మంగళనామముగా భక్తులు నిరంతరమునూ 
గానము చేయు దివ్యనామ మిది. 

1) " కృష్ణస్తు భగవాన్ స్వయమ్ " శ్రీకృష్ణుడు సర్వకళా పరిపూర్ణుడగు భగవంతుడని భాగవత వాక్యము. 

2) కురుక్షేత్ర రణరంగంలో పార్థుని నిమిత్త మాత్రునిగా నుంౘు కొని అద్భుతమగు గీతోపదేశమును చేసిన కారణమున శ్రీకృష్ణుడు జగద్గురువయ్యెను. భారతీయులకు మాత్రమే కాకుండా ఖండ ఖండాంతర పుణ్యసీమ కెల్లా విశ్వమునకెల్లా గీతోపదేశము శిరోధార్యమై యున్నందున శ్రీకృష్ణుడు విశ్వగురువు. 

3) కృష్ణునకు ఒక్క ప్రణామము చేసినంత మాత్రముచేతనే దశాశ్వమేథయాగఫలము ప్రాప్తింౘునని భారతము వచింౘును. కృష్ణస్మరణము కోటిజన్మకృత పాపహరణమని శాస్త్రవాక్యము. 

4) " కృష్ " అనగా నిరతిశయమైన (Infinite) అని అర్థము. 
"నః " అనగా ఆనందము (Bliss) అనగా సచ్చిదానంద స్వరూపుడు (Infinite Bliss). 

5) సర్వమునూ ఆకర్షింౘువాడగుట చేత " కృష్ణు " డన బరగెననియూ మరియొక అర్థముగలదు. 

6) శ్యామసుందరుడగు కృష్ణుఁడు మానవకోటికి దివ్య వాగ్దానములు, అభయప్రదానములు గావించినాడు. " యోగ క్షేమం వహామ్యహం , నీయొక్క యోగక్షేమములను వహింౘు వాడను నేను 
నివసిష్య " మామేకం శరణవ్రజ " నన్నే శరణుబొందుము. నిన్ను సకల పాపములనుండి విముక్తుని చేసెదను. (అ_18_66) 

" మచ్చిత్తః సర్వదుర్గాణి _ తరిష్యసి " నీ మనస్సు ను నాకర్పించిన సకల దుఃఖములనుండియు దాటిపోగలవు. (అ_18_55) 

" మయ్యేవ మనఆధత్స్వ నివసిష్యసిమయ్యేవ " నాయందే  మనస్సునుంౘుము _ నన్నేపొందెదవు. (అ 12_8) మన్మనాభవ_ 

మామేవైష్యసి " నీమనస్సు నాయందుంచిన నన్నేపొందెదవు. (అ 18_65). ఈ రీతిగా విశ్వమానవకోటికి ఎన్నియోరీతుల వాగ్దానములు, ప్రమాణములు గావించిన కృష్ణుడు సాక్షాత్తు 
పరమాత్మయేకదా.అందుచే ఈ స్తవరాజము నందు దేవకీనందనుడు అధిష్ఠాన దివ్యదేవతగా తెలుపబడెను. 

58) లోహితాక్షః ఓం లోహితాక్షాయనమః 

" ఎఱ్ఱని నేత్రములు గలవాడు" అని భావము. ఎరుపు  రజోగుణము ను సూచింౘును. ఎఱ్ఱని నేత్రములు క్రోధమును సూచింౘును. భగవంతుడు ప్రేమస్వరూపుడే యయ్యును, తన 
కుమారులు అక్రమమార్గములలో,ధర్మవిరుద్ధముగా ప్రవర్తింౘు నపుడు వారిని సరిదిద్దుటకు క్రోధపూరితుడగుౘుండును. కనుక శ్రీహరి లోహితాక్షుడనబడు ౘున్నాడు. దుష్టులపట్లనూ, దుర్మార్గుల పట్లనూ ఆయన కోపమువహింౘును. మానవులందరూ పరమేశ్వరానుగ్రహమును పొందవలయునన్నచో వారు తప్పక ధర్మమార్గాన శాస్త్రం చెప్పిన చొప్పున నడౘుకొనవలెనని ఈ నామము యొక్క ప్రబోధము. అట్టి ధర్మప్రవర్తకులకే భగవదనుగ్రహము లభింౘును. 
దుర్మార్గులు ఆయన యొక్క లోహితాక్షములకు గుఱియై దుఃఖ భాజనులగుదురు.
--((**))--


బాధించే మచ్చ ముందు..గాయమెంత అసలు..! 
తిరిగిరాని క్షణం ముందు..శోకమెంత అసలు..!

చిరునవ్వుకు సరితూగే..మల్లెమొగ్గ ఏది..
పరిమళించు చెలిమి ముందు..స్వర్గమెంత అసలు..!

విరహానికి మధువుతోటి..అనుబంధం మెండు.. 
అందమైన మనసు ముందు..గగనమెంత అసలు..!

నాటకాన శృతిమించిన..అయోమయం మిగులు..
మౌనమైన తలపు ముందు..సంద్రమెంత అసలు..!

చెలి అందెల సవ్వడులే..గుండెలయల తోడు..
మెఱుపుపూల వానముందు..పవనమెంత అసలు..!

ఓ మాధవ ఆరాధన..గీతమేదొ పొంగె..
ఉప్పొంగే గజలు ముందు..కవనమెంత అసలు..!


ఒకరోజు ధర్మరాజు పొద్దున్నుంచీ దానాలు చేస్తూ వున్నాడు .సాయింత్రం అయేసరికి అలసిపోయి ఇవాల్టికి యింక చాలించేస్తాము అన్నాడు భీముడితో.అలా అనుకుంటుండగా ఒకతను దానం కోసం వచ్చి తనబిడ్డ పెళ్లి చేయాలను కుంటున్నాను.కొంత ధనం కావాలి అని అడిగాడు.అప్పుడు ధర్మరాజు అయ్యా!యివ్వాల్టికి సమయముఅయిపొయింది రేపు రండి.యిస్తాను అన్నాడు.ఈ మాట విని భీముడు పక్కుమని నవ్వాడు.ధర్మరాజు భీమా ఎందుకు అలా నవ్వు తున్నావు? అని అడిగాడు.అన్నా!మంచి పని ని వాయిదా వేయకూడదు.రేపటికి నీవు బతికి వుంటావని హామీ ఏమిటి?అతను బతికి వుంటాడో లేదో చెప్పగలవా?దానం చెయ్యాలని అనిపించినప్పుడే చెయ్యాలి.వాయిదా వెయ్యకూడదు,ఎవరికి తెలుసు రేపటికి నీ మనసు మారిపోవచ్చు.యివ్వటానికి నీదగ్గర ఏమీ లేకపోవచ్చు. అంటూ ఈ క్రింది పద్యము చెప్తాడు.

భోజనాత్ త్పూర్వ భాగే చ భోజనాత్ పరత స్తథా 
క్షణే క్షణే మతిర్భిన్నా ధర్మస్య త్వరితా గతి:
అర్థము:--భోజనం చేయక ముందు వున్న బుద్ధి భోజనం చేసి సుఖంగా కూర్చున్నప్పుడు వుండదు. మానవుల చిత్తప్రవృత్తులు క్షణ క్షణానికి మారుతుంటాయి. కావున ధర్మకార్య మేదైనా సరే చేయబుద్ధి పుట్టిన వెంటనే చేసెయ్యాలి. లేకుంటే బుద్ధి మారిపోయే ప్రమాదం వుంది.అప్పుడు ధర్మరాజు సిగ్గుపడి ఆ యాచకునికి కావలిసినంత ధనం యిచ్చి పంపివేశాడు.
--((**))--

తిరుపతిలోని నా ప్రసంగం లోని కొన్ని భాగాలు. 2  

మనం ఇళ్ళలో విష్ణుసహస్రనామ స్తోత్రపారాయణ చేసుకుంటూ వుంటాము. ఐతే పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని గబగబా చదివేస్తాము కాని స్వామి వారి నామాలయొక్క అర్థాలు మనకు తెలియవు. అలాకాక మనం అర్థాలు తెలుసుకుని పారాయణ చేస్తే మరింత ఉపయోగం వుంటుంది కదా? మనకీ ఓహో, మనం చదువుతున్న నామాలకు అర్థాలు ఇవా అని ఒకరకమైన సంతృప్తి కలుగుతుంది కదా? అందుకనే నేను ఈ రోజు విష్ణుసహస్రనామాలలోని నామాల యొక్క అర్థాలు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. 
అసలు ఈ విష్ణుమూర్తి ఎవరండీ? ఎందుకు మనం ఆయనను ధ్యానించాలి? అందువలన మనకు ఏమిటి ఉపయోగం? 
ఆవికారాయ శుధ్ధాయ నిత్యాయ పరమాత్మనే| సదైక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే || పుట్టుక, చావు వంటి వికారములు లేని వాడు, పరిశుధ్ధుడు, ఎల్లప్పుడు వుండేవాడు, పరమాత్మ, మార్పు నొందని ఆకారము గలవాడు. సర్వసమర్థుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి నమస్కారం. 
యస్య స్మరణ మాత్రేణ జన్మసంసార బంధనాత్, విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే| ఏ పరంధాముడిని తలచినంతనే పునరపి జననం, పునరపి మరణం - జనన మరణాలు, సంసార బంధనాలనుండి జీవుడు విముక్తిని పొందుతాడో, ఆయనే శ్రీమన్నారాయణుడు. 
ఐతే ఈ విష్ణుసహస్రం ఎవరు ఎందుకు ఉపదేశించ వలసి వచ్చింది? మనకు నాలుగు యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది. త్రేతాయుగంలో మూడుపాదాలమీద, ద్వాపరయుగంలో రెండు పాదాల మీద నడుస్తే, కలియుగంలో మాత్రం ఒక్క పాదం మీదే ధర్మం నడుస్తోంది. కృతయుగంలో మానవులు వేలకొద్దీ సంవత్సరాలు జీవించారు. కానీ కాలక్రమేణ కలియుగం వచ్చేసరికి వారి ఆయుః ప్రమాణం వంద సంవత్సరాలకు పరిమితమై పోయింది. కృతయుగంలో తపస్సు ద్వారా మోక్షం లభించేది. ఋషులు, మునులు వేలకొద్దీ సంవత్సరాలు తపస్సు చేసి మోక్షాన్ని పొందగలిగే వారు. త్రేతాయుగంలో యజ్జాల ద్వారా మోక్షం లభించేది. అందుకే దశరథమహారాజు పుత్రకామేష్టి యాగం చేసి పుత్రులను పొందాడు. ద్వాపరయుగంలో వ్రతాల ద్వారామోక్షం లభించేది. సత్యభామ భర్తను వశంలో పెట్టుకునే నిమిత్తం వ్రతమాచరించింది. శ్రీకృష్ణతులాభారం మీకు అందరికీ తెలిసున్నదే. కానీ కలియుగంలో అంత ఓపికగా జపతపాదులు, యజ్జయాగాలు, వ్రతాలు చేసే అవకాశం వుండదని, పైగా మనుష్యుల జీవనప్రమాణం అల్పమైపోయిందని, జనులకు సులభంగా మోక్షం లభించే మార్గం తెలియజేయడానికి, శ్రీకృష్ణనిర్యాణం జరిగి ద్వాపరయుగాంతం కాబోతున్న తరుణంలో ఆ శ్రీమన్నారాయణుడే భీష్ముని ద్వారా ధర్మరాజుకు విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని బోధింపజేశాడు. అంతేకాదు, స్వఛ్ఛందమరణం పొందుతున్న, అంపశయ్య మీద వున్న భీష్మునిచేత నారాయణుని వేయినామాలతో కీర్తింపజేసి, ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు. కలౌ నామస్మర ణాన్ ముక్తిః. కలియుగంలో మోక్షం పొందడానికి నామస్మరణే ధన్యోపాయమ్. అందుకని కలియుగంలో ముక్తి లభించడానికి సులువైన మార్గం నామస్మరణే. అయితే విష్ణుసహస్రనామ స్తోత్రపారాయణే ఎందుకు చెయ్యాలి? 
ఇటువంటి సందేహమే ధర్మరాజుకున్నూ కలిగింది. ఆయన భీష్మపితామహుణ్ణి సమీపించి ఇలా అడిగాడు, 'కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్, స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవాశ్శుభమ్? తాతా! ఈ లోకంలో ప్రధానమైన దేవుడెవరు? మనుష్యులు ముఖ్యంగా పొందదగిన స్థానమేది? మానవులు ఏ పరమాత్మను స్తోత్రం చేయడం వల్లను, పూజించడం వల్లను శుభాలను పొందగలరు? 
"కోధర్మస్సర్వ ధర్మాణాం భవతః పరమో మతః, కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్?" అన్ని ధర్మాలలోకి నీకు ఏ ధర్మము మిక్కిలి ఇష్టమైనది? మానవుడు ఏ మంత్రజపం చెయ్యడం వల్ల ఈ పుట్టడం, మరణించడం, తిరిగి పుట్టడం, తిరిగి మరణించడం అనే సంసార బంధం నించి తప్పుకోగలడు?



శ్రీగురుభ్యో నమః 
జంధ్యాల పౌర్ణమి 

శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.ముహూర్తంతో పనిలేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. 

య జ్ఞో ప వీ త ము 

యజ్ఞధృతం ఉపవీతం - యజ్ఞోపవీతం లేక యజ్ఞసూత్రమనియు నందురు. బౌధాయనః|| కౌషంసౌత్రం, త్రిస్తివ్రృతం, యఘ్నోపవీతమానామేః| మనుః - కార్పాసముపవీతంస్యాత్‌. 

కార్పాసముపవీతం, షట్తస్తుత్రివృతం, బ్రాహ్మణస్య అను థర్మశాస్త్రకారుల వచనముల ననుసరించి, ప్రత్తితో వడికిన దారములు మూడు పొరలతో చేర్చి నొక్కపోగువలె మూడు పోగులుకు మూడు మూడులతొమ్మిది పోగులుండులాగున యజ్ఞోపవీతము ధరింపదగినది. 

యజ్ఞోపవీతం కుర్వీతసూత్రాణినవతన్తవః ఏ కేనగ్రంధినాతన్తుస్తిగ్రుణోధనా. 

యనురీతిని తొమ్మిది పోగులతో చేర్చిన మూడుపోగులను "బ్రహ్మముడి' యనుపేర నొకముడి వేయదగినది. ""ఏకోగ్రంధిరీతి, నానాత్వ నిషేధార్థం'' యనురీతిని యొ కేముడి యుండదగినది. ఇట్టి నవతన్తు నామకయజ్ఞోపవీతథారణార్థమై గర్భాష్ఠమేబ్దే బ్రాహ్మణస్యోపనయనంశస్తం'' అను ధర్మాన్ని పురష్కరించుకొని యేడవ వర్షముననే యుపనయనము బ్రాహ్మణ బాలునకు చేయుట యుత్తమము. 

షోడశవర్షాణాం ఉపనయనాంగయప్రతీయతే 
పతితా యస్యసావిత్రీదశవర్షాణింపంచచా, 

అనురీతిని పదు నేడు సంవత్సరములు కాగానే సావిత్రీ పతితుడగును, గాన పదునారు సంవత్సరములలోపుగనే బ్రాహ్మణ బాలున కుపనయనము చేయుట ముఖ్యము. 

""బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే'' యను తైత్తిరీయారణ్యకమున యజ్ఞొవీతము బ్రాహ్మణునకు ముఖ్యాతిముఖ్యమని వచింపబడియున్నది, 

నవతన్తు యజ్ఞోపవీతమునకు అధిపతులు 

ఓంకారః ప్రథమస్తన్తుః 
ద్వితీయోగ్నిస్తధైవచ 
తృతీయోభగదైవత్యః 
చతుర్థస్సోమదైవతః 
పంచమః పితృదైవత్యః 
షష్ఠశ్చెవప్రజాపతి ః 
సప్త మోవిష్ణుదైవత్యః 
దర్మశ్చాష్టమఏవచ 
నవమః సర్వదైవత్యః 

ఇత్యే తేనవతన్తవః. 

"వినాయచ్ఛిఖయాకర్మ, వినాయజ్ఞోపరీతతః| 
రాక్షసం తద్ధి విజ్ఞేయం, సమస్తాన్నిష్నలాఃక్రియాః 

అను ధర్మము ప్రకారము, శిఖ లేకపోయిననూ, యజ్ఞోపవీతము లేకున్ననూ, వైదికకార్యము లాచరించినచో నిష్పలములే గాన, శిఖా యజ్ఞొపవీతములు సంధ్యావందనమునకుగూడ ముఖ్యమనియే గ్రహింపదగినది. 

నాభేరూర్థ్వ మనాయుష్యం| అధోనాభేస్త పక్షయః| 
తస్మాన్నాభిసమం కుర్యాత్‌, ఉపవీతం విచక్షణఇతి. 

యను రీతిని యజ్ఞొపవీతము నాభికి సమంగా పొడవుండదగినదిగాని, నాభి కూర్థముగానున్నచో ఆయుస్సు క్షీణించును, నాభికి క్రిందనుండినచో చేసిన జపాది తపస్సు నశించును గాన నాభి సమంగా యజ్ఞొపవీతమున్నది లేనిది గమనించి నాభి సమంగా నొనర్చుకొని సంధ్యావందనాది కర్మలాచరింపదగినది. 

"స్తనాదూర్థ్వం, అథోనాభేఃనకర్తవ్యంకదాచనా'' అనురీతిని నాభికి పైకినుండరాదు, నాభికి క్రిందికి నుండరాదు. నాభి సమంగానుండుటయే శ్రేయము. 

శిఖా యజ్ఞొపవీతము లెప్పటికి ధరించియే యుండవలయును గాని, అవసరమగుతరిని యుంచుకొని మిగతా సమయములలో తీసివేయరాదు. ఇందుకు ప్రమాణంగా ధర్మశాస్త్రకారిట్లు వచింతురు. 

కాయస్థమేవతత్కార్యం, ఉత్థాప్యంనకదాచన| 
సదోపవీతినాభావ్యం, సదాబద్ధశిఖేనచ|| 

ఎప్పటికి శరీరముననే థరించియుండదగిది. శిఖను ముడివేసియే నుంచదగినది. ఉతవీతిగనే యజ్ఞోపవీతము థరించియుండదగినది. ఈరీతిని శిఖా యజ్ఞోపవీతములు థరించి యుపనయన ప్రభృతి గాయత్రీ యనుష్ఠానమున కుపక్రమింపదగియున్నది. 

మౌంజీబంధదినే తిష్టేత్‌ సావిత్రీమభ్యసన్‌ గురోః 
సూర్యేస్తశిఖరం ప్రాప్తే సాయం సంధ్యాం సమభ్యసేత్‌. 

ఉపనయనమున వెంటనే నిలచియే సాయంకాలమువరకు సావిత్రీయుపాసనము (గాయత్రీజపము) చేయుచండవలయును. సూర్యాస్తమయమగుతరిని సాయంసంధ్యా వందనము చేయదగినది. 

ఉపనయన వటువు సంధ్యావందనమువలెనే మరునాటినుంచి బ్రహ్మయజ్ఞముగూడా నాచరింపవలయును. వేదాద్యయనమే ప్రారంభించలేదు గాదా? బ్రహ్మయజ్ఞమెట్లు చేయడమను సందియముగలుగవచ్చును. అందులకు ధర్మకారుల సమాధానము పరికించునది. 

ఆరభేత్‌ బ్రహ్మయజ్ఞన్తు, మధ్యాహ్నెతు పరేహని మరుదినము మథ్యాహ్నమునుంచి బ్రహ్మయజ్ఞముగూడా చేయవలయును. 

అను పాకృత వేదస్య, బ్రహ్మయజ్ఞః కథంషవేత్‌| 
వేదస్థానేతు గాయత్రీ గద్యతేన్యత్స మంభవేత్‌|| 

వేదము రాకపోయిననూ వేదస్ధానమున గాయత్రీ మంత్రమే పఠింపదగినది 

వేద మథ్యాపయేత్‌ ఏనం, శౌచాచారాంశ్చ శిక్షయేత్‌ || 

ఉపనయనము చేసిన వటువునకు వేదము నేర్పించవలయును. శౌచాచారాదులలో బాగా శిక్ష యిప్పించవలయును. 

దివా సంధ్యాసుకర్ణన్థః బ్రహ్మసూత్రః ఉదఙ్ముఖః 
కుర్యా న్మూత్ర పురీషేవా రాత్రౌచేద్దక్షిణాముఖః|| 

ఉపనయన వటువు శౌ చా చా ర ము లు తప్పక పాటించడము నేర్వదగియున్నది గాన, పగలుగాని సంధ్యాకాలములలోగాని మూత్ర పురీషములు విడువదగినచో, యజ్ఞొపవీతము కుడి చెవునకు చుట్టుకొని ఉత్తరముఖముగ కూర్చొని మూత్ర పురీషాదులు వదలదగినది. 

రాత్రికాలమున మూత్ర పురీషాదులు వదలవలసివచ్చినచో యజ్ఞోపవీతము చెవునకు (కుడిచెవుకు) చుట్టుకొని దక్షిణాభి ముఖముగకూర్చొని విడువదగినది, 

మధు మాంసాం జనోచ్ఛిష్టశుక్తం, స్త్రీప్రాణిహింసనం, 
భాస్కరాలోకనా శ్లీల పరివాదాది వర్జయేత్‌ 

మధు మాంసములు తినరాదు, ఎంగిలి తినరాదు. నిష్ఠురమైన మాటలు పలుక రాదు. (శుక్తం-నిష్ఠుర వాక్యం) స్త్రీలను తదితప్రాణి లోకమును బాధించరాదు, సూర్యుని చూడ రాదు. అశ్లీలమైన పలుకులు పలుక రాదు కొట్లాడరాదు. ఈ నియమములు బ్రహ్మచారి (ఉపనయనమైన బాలునకు బ్రహ్మచారి యని పేరు) తప్పక యాచరింపదగినది. ఈ నియమములు విధిగ పాటించుచు సంథ్యావందనము చేయుచు వేదాధ్యయనము చేయుట ముఖ్యము. 
🌷🌷🌷అంతాశివసంకల్పం🌷🌷🌷