Monday 31 July 2023

daily story


పూజారి ఉపన్యాసం చెపుతున్నాడు 

 ప్రతిఒక్కరు  విచక్షణ జ్ఞానాన్ని సంపాదించాలి ఎవరో చెప్పారని చేశానని అనుట కాదు నీ  ఆత్మ సాక్షిగా నీ మనఃశాంతి నీతో ఉన్నవారికి శాంతి సౌఖ్యాలు కల్పించటమే మానవ జన్మకు సార్ధకం.    

తల్లితండ్రులపై పూర్తిగ భారము వైచి కర్తవ్యము నిర్వర్తింపని వాడు భ్రష్టుడగును. అట్టివానికి స్వశక్తి తగ్గును. నీపై నీవాధారపడుట పెంచుకొనుచు అత్యవసర విషయములనే తల్లితండ్రులకు  నివేదించుట నీ పెరుగుదలకు తోడ్పడును. తలితండ్రులేకదా ! అను మితిమీరిన విశ్వాసముతో బాధ్యతలను మరచుట అవివేకము. దీని వలన సాధారణ బాధ్యతలు కూడ నిర్వర్తించలేని స్థితి కలుగును. కనుక తల్లి తండ్రులను పురుషులైతే భార్యా సమేతముగా  నిరంతరమూ సేవలు చేయవలెను ఇది ఒక విధమైన ఋణము అటులనే కూతురైతే భర్తను ఒప్పించి తల్లి తండ్రులకు సేవచేయట సమంజసము, పిల్లలలకు పిల్లలు పెరుగుతుంటారు అయినను తాత బామ్మ,  అత్త మామ అంటూ పెద్దవారైన వారికి సేవలు చేయుట అందరి కర్తవ్యము.   

వేలు పట్టుకొని నడిపించుట ధీమంతులకు తగదు. నీకుగ నీవు నడువుము. కర్తవ్యములను, బాధ్యత లను నీకుగ నీవు మోయుము. కష్ట నష్టముల నోర్చుకొనుము. వేలు పట్టుకొని నడచువాడవు మహత్కార్యము లేమి చేయగలవు? ప్రతిదినము ప్రార్థన సమయమునందు నీకు వలసిన మానసిక సహాయము అందింపబడ గలదు. ధృతి గలిగి నీవే సమస్త బాధ్యతలను నిర్వర్తించుము. 

నిన్ను నిన్నుగ చూడగా - నన్ను నేనని తల్పగా   
నీవు నాకల దృష్టి గా  - నేను ప్రేమ సాక్షిగా 
నన్ను నీవని చెప్పగా   - కాల మాయకు చిక్కగా  
వాన నీటికి తడ్వగా    - ఎండ గాలికి మండగా
అగ్ని వాడక నీడగా    - రాజ కీయపు రంగుగా 
కాయ కష్టము నమ్మగా - మారు పల్కక చెప్పగా  
కారు చీకటి  కమ్మగా  - పాలు నిచ్చు బర్రెగా   
ఊలు నిచ్చిన గొర్రెగా - మేలు చేసెడి పెద్దగా 
వేలు ఖర్చులు చేయగా- రోజు లన్నియు ఒక్కగా    
దేని గూర్చియు ఆశగా  - సేవ చేసియు కోర్కగా   

ఇలా తడి పొడి మాటలు నిన్ను ఆవహిస్తాయి అయినా కార్వ్యము మరవకు అదే నేను కోరేది  
 IIU UUU IIU IIU 15/9

సమయానందంమ్మే సుఖసాగరమై 
సమ బాధా ప్రేమే సుఖరామయమై 
కమనీయంగా నే కరుణా లయమై 
రమయాలింగంమ్మే సమరాశయమై  

తన సమస్యలను తను స్ఫూర్తివంతముగ పరిష్కరించుకొను వానికి తల్లితండ్రుల సహాయము సద్గురువు సహాయము కూడ వెన్నంటి యుండగలదు. అర్జునుడు స్వయముగ యుద్ధము చేసినాడు. శ్రీకృష్ణుడు తోడ్పడినాడు. మిక్కుటముగ గురువుపై నాధారపడు వాడు ఏమియును చేయజాలడు.  

ఈరోజు మీరు బాగా చక్కగా చెప్పారు తల్లి తండ్రుల గురించి నాకు కొన్ని ప్రశ్నలు  వెయ్యాలని ఉంది 

అడుగూ స్త్రీ శక్తి కి ఎదురే లేదు అంత  తొద్దండి ఎదో నాకు ఆలోచన బట్టి అడుగుదామనికున్నా అంతే 

*ప్రశ్న :  ప్రజ్ఞానం అంటే ఏమిటి 
 : ప్రజ్ఞానం కేవలం జ్ఞానం అని తెలుసుకో, దానిలోనుండి వెడలేది విజ్ఞానం. అంటే సాపేక్ష జ్ఞానం, అంతర్దశ జ్ణానం, నిక్షిప్త జ్ణానం, దేహం,  ఆరోగ్యం,  సర్వాంతర్యామి జ్ణానం, మరియు సందర్భోచిత జ్ణానం

_*ప్రశ్న : విజ్ఞానదశలో సంవిత్ [విశ్వచైతన్యం] విదితమవుతుందా?

విశ్వ చైతన్యం మారుతూనే ఉంది. జీవపరిణామ ంం తగ్గిపోతుంది. స్త్రీ లు తగ్గుతున్నారు పురుషులు పెరుగు తున్నారు. గుప్తంగా ఉండే శృంగారం వీధిన వివరిస్తున్నది. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .  

_*ప్రశ్న : జగత్తులో విజ్ఞానం వల్ల  ప్రజ్ఞానం స్వయంగా భాసించదా? 

 ఎరుక అంతఃకరణ వల్ల ఇప్పుడూ ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది. మెలకువలో ఎరుక అనూనతమైతే నిద్రలో కూడా అట్లే ఉండవలె !*_

_*ఉదా : రాజు ఒకరు హాలులోకి వచ్చి కూర్చుండి వెళ్ళిపోయాడు. అతడు వంట ఇంటిలోకి వెళ్ళలేదు. ఆ కారణంగా రాజక్కడికి రాలేదనవచ్చునా ? ఎరుక జాగ్రత్తగా ఉంటే, నిద్రలోనూ ఉన్నదనే అనవలె !* మన ఆలోచనలు స్థిరముగా ఉండవు.

_*"లేదనే భావనే బాధ - బాధ లేని స్థితే ఆనందం !''*-

కనుక ఆనందం పరమానందం .. బ్రహ్మానందం ... ఆత్మానందం .. అందరికి ఉండాలి 

అదే ......  ....... .అదే ........  ...... 

--(())--

: *శుద్ధమనసు* *శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..!*

*మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత. సమ్యక్‌ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి. మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క నేనే. మూడు అవస్థలలో వున్న నేను అనే చైతన్యమే.*

*హృదయం వెన్న వలె ఉండాలి.  కాఠిన్యంతో కాకుండా.. కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి. సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి.  ఇది కాదు,ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి. శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి.జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు.ఎరుకతో ఉండాలి.*

*దేనికీ అంటక, దేనినీ అంటించు కొనక కాంతి కటకం వలె, తామరపత్రం మీద నీటి బిందువువలె, తెరమీద బొమ్మవలె ఉండాలి. అంతా బ్రహ్మమే అనుకో గలగటమే అసలైన ముక్తి!!*


అప్పుడే గుడి మెట్ల ఒక యువకుడు (యిలా అంటున్నాను )

దేశంలో సత్యం కనుమరుగై పోయింది... 

అసత్యం తాండవిస్తుంది, సత్యాన్ని వెంటబడి... వేటాడి తరిమి తరిమి కొట్టేశారు... 

దేవుడు నిద్రపోతున్నాడు సత్యం తిరగబడి... బోర్లా పడింది..అసత్యమనే ధన గర్వంతో, అధికార దర్పంతో, విదేశ భక్తితో సత్యాన్ని తొక్కి పడేస్తూ వస్తున్నారు...  

న్యాయస్తానాలు నత్తనడక, విచ్చల విడిగా లంచాల రాజ్య కాంక్ష నాయకుల అసత్యవాక్కులు, గొర్రెల లాగ మారె జనులు ఎప్పటికి మారినో ఎప్పుడు వచ్చునో సత్య ప్రపంచం 

(అప్పుడే పూజారి అడుగు పెడుతూ కంఠ సోష దేనికి, కాసేపు ఆగు స త్యంగా ప్రసాదం పెడతా)

అవునూ నీవు దేవుడికి కళ్ళు గప్పి సంపాయిస్తున్నావు, మాలాంటి వారికి ప్రసాదంతో సరిపెడుతున్నావు. జాతీయ మీడియా రాజ్యాంగ నాయకుల చేతిలో పరాజితురాలై బానిసత్వం లో మగ్గు తూ ఉంది ఎదురు తిరిగితే వచ్చి గొంతే నులిమేస్తున్నారు.  

ఓహ్... ఒకటేమిటి ?


పార్టీకో పత్రిక.... 

పార్టీ కో ఛానెల్... 

అవి వెదజల్లే వార్తలు చూస్తూ ఉంటే ...

సత్యానికే సంకెళ్ళు, నిజాలు దివాలా తీశాయి అబద్దాలు దారిన పడ్డాయి. అసత్యాలు... అబద్ధాలు రాజ్యమేలుతూ ఉన్నాయి. 

(అప్పుడే పూజరి అక్కడఉన్న వారికి ప్రసాదం పెట్టాడు, చదగోపురంతో దక్షణ నొక్కేసాడు)

అవును ఆంజనేయ నీఆవేదన కాని మనం స్నేహితులం, నేను గుళ్లోనున్నాను, నీవు లోకాన్ని చూస్తున్నావు అయినా మన నాయకులు మహాతటాకాలు సైతం అదృశ్యపు దిశనని పర్యావరణ వెత్తలు చెరువులపూడ్చివేసి నవనాగరిక సౌధాల నిర్మాణాలు ఇప్పుడు అనుమతిస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, చినుకుపడితే చిత్తుచిత్తు అవుతున్న ప్రతిష్టాత్మక జనవాసాలు దారి చూపలేని నోరు మెదపలేని ప్రభుత్వాలు, ప్రగతి పథాన్ని ప్రశ్నించె ప్రకృతి పరిచక్రం, నష్ట పరిహారమని నాయకుల భోజ్యం ఎవరితో చెప్పుకోగలం, న్యాయదేవత కళ్లు మూసినట్లు, మనం తెలియనివారులాగ నోరుమూసు కోవడమే ఇదే సత్యం, ఇదే నేటిన్యాయం, ఇదే ధర్మం అంటూ అరుచు కుంటూ వెళ్లి పొయ్యాడు .

అప్పుడే గుడిలో వృద్ధ దంపతులు వచ్చి కూర్చున్నారు పూజారి ఆకులో ప్రసాదము తెచ్చి ఇచ్చారు కుశల ప్రశ్నలు వేయగా దీనాతిదీనముగా క్లుప్తముగా పుత్రికాపుత్రులు ఇదరిద్దరు, 

పెళ్లి ఉద్యగవ్యవహారాలు వయసులో నెరవేర్చాము, ఉన్న శక్తి ఆస్థి పిల్లలకు ధారపోశాము, మనవళ్లను మోయలేక, పిల్లలవద్ద ఉండలేక కట్టుబట్టలతో ఇక్కడకొచ్చాము. 

అప్పుడే ఆంజనేయుడు అక్కడకొచ్చాడు ఏమిటి పిల్లలు మిమ్మల్ని చూడుటలేదా అన్నాడు   

పిల్లలు మంచివారే కానీ మారతాలు బాగుండలేదు అంతే అవునులే పిల్లల్ని ఏమి అనలేరు, వారిదగ్గర ఉండలేరు, బ్రతుకుకోసం మరలా జీవితమా మొదలుపెడతారు కదా 

అట్లాఅనకుబాబు ఎదో అప్పుడే కొన్ని కాగితాలు తెచ్చేడు ఆంజనేయుడు వీటిపై సంతకాలు పెట్టండి మిగతావి నేను చూసుకుంటా అందాక ఈగుడిలో నే ఉండండి గుడివానకాల గదులున్నాయి అక్కడ ఉండి వండుకుంటారో గుడి ప్రసాదం తింటారో మీయిష్టం అన్నాడు 

పూజారి అక్కడకొచ్చి ఆంజనేయ అప్పుడే అభయమిచ్చావే తప్ప దండి ఆదు కోవటమే తక్షణ కర్తవ్యం సంతకం దేనికి అన్నారు దేవాలయం కదండీ కొన్ని కారణాలు ఉంటాయి అందుకోసమే మిమ్మల్ని మోసం ఏమి చేయము నమ్మకమే మాధ్యాయం ఇక మీ ఇష్టం అన్నాడు పూజారి ఆంజనేయుడు సంతకాలు పెట్టించుకున్నాడు అసమయాన 


ఉ.వర్షపు నీరుపారు దల పాకము లా మురికై సువాసనే

హర్షపు కప్పవాక్కు లగు హారతి లా మెరిసేను నీటిలో

శీర్షపు ఆసనమ్ములగు చీమల రీ తిన దారిపట్టుటే 

కర్షక గోడు చూడకయు కాలము తీర్పుయు తెల్ప నాయకా


సీనియర్ సిటిజన్లు, పూర్తిగా నిర్లక్ష్యం  ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలి.  భారతదేశంలో సీనియర్ సిటిజన్‌గా ఉండటం నేరమా?*

   భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు 70 సంవత్సరాల తర్వాత వైద్య బీమాకు అర్హులు కారు, వారు EMIపై రుణం పొందరు.  డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు.  ఆర్థిక పనుల కోసం వారికి ఎలాంటి పని ఇవ్వరు.  కాబట్టి వారు ఇతరులపై ఆధారపడతారు.  అతను తన యవ్వనంలో అన్ని పన్నులు చెల్లించాడు.  ఇప్పుడు సీనియర్‌ సిటిజన్‌ ​​అయ్యాక కూడా పన్నులన్నీ కట్టాల్సిందే.  భారతదేశంలో సీనియర్ సిటిజన్ల కోసం ఏ పథకం లేదు.  రైల్వేలో 50 శాతం తగ్గింపు కూడా నిలిపివేయబడింది.  బాధాకరమైన విషయం ఏమిటంటే రాజకీయాల్లో సీనియర్ సిటిజన్ అంటే అది ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి కావచ్చు, వారు ప్రతిదీ పొందుతారు మరియు పెన్షన్ కూడా పొందుతారు, కాని మేము సీనియర్ సిటిజన్లు మన జీవితమంతా ప్రభుత్వానికి అనేక రకాల పన్నులు చెల్లిస్తున్నాము, ఇప్పటికీ పెన్షన్ లేదు.  వృద్ధాప్యంలో, వృద్ధాప్యంలో వారిని (కొన్ని కారణాల వల్ల) చూసుకోలేకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్తారో ఊహించండి?  ఇది భయంకరమైన మరియు బాధాకరమైన విషయం.  ఇంటి పెద్దలకు కోపం వస్తే అది ఎన్నికలపై ప్రభావం చూపుతుంది.  మరి దాని పర్యవసానాలను ప్రభుత్వమే భరించాలి.  సీనియర్ సిటిజన్లను ఎవరు చూసుకుంటారు?

   ప్రభుత్వాన్ని మార్చే శక్తి సీనియర్లకు ఉంది, వారిని బలహీనులని ఉపేక్షించకండి!  సీనియర్ సిటిజన్ల జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదు.  ప్రభుత్వం పునరుత్పాదక పథకాలకు చాలా డబ్బు ఖర్చు చేస్తుంది, కానీ సీనియర్ సిటిజన్లకు కూడా ఒక పథకం అవసరమని ఎప్పుడూ గుర్తించదు.  దీనికి విరుద్ధంగా, బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా సీనియర్ సిటిజన్ల ఆదాయం తగ్గుతోంది.  కుటుంబ పోషణ కష్టంగా ఉన్న కొద్దిపాటి పింఛను వస్తే దానికి కూడా ఆదాయపు పన్ను విధిస్తారు.

 భారతీయ సీనియర్ సిటిజన్‌గా ఉండటం ఇప్పుడు నేరంగా పరిగణించబడుతుంది.

అంటూ ఏమిటి యీలోకం తీరు అర్ధంకావటంలేదు 

. *కరోనా కరోనా వచ్చి ఏం చేసావ్ అని అడిగితే:


 ఢిల్లీ, హైద్రాబాదు  లాంటి ప్రదేశాల్లో కూడా కాలుష్యం తగ్గించాను.,  కుటుంబాలతో సమయం వెచ్చించేలా చేశాను. డబ్బు ఒక్కటే ప్రాధాన్యము అనుకొని పరిగెత్తే వాళ్ళకి బుద్ధి తెచ్చేలా చేశాను.  రోజు మందు లేకపోతే బతకలేను అనే వాళ్ళ చేత మందు లేకుండా ఉండేలా చేశాను.  డబ్బున్నా ఏమీ చేయలేని ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కల్పించాను.  వైద్య వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయో అందరికీ తెలిసేలా చేశాను.  ఎంత డబ్బు ఉన్నా మీకు నచ్చింది కావాల్సింది దొరకకపోతే ఆ బాధని ఎలా అధిగమించాలో నేర్పాను.  బతికుంటే చాలురా భగవంతుడా అనుకునేలా చేశాను. ఎన్ని కోపాలు తాపాలు ఉన్న బయటకు వెళ్ళలేక ఇంట్లో వాళ్లతోనే సర్దుకుపోయేలా చేశాను.  క్యాష్ తప్ప ఇంకేమీ అలవాటు లేని వాళ్ళ చేత ఆన్లైన్ పేమెంట్ అలవాటు చేశాను. యాక్సిడెంట్లు లేకుండా చేశాను..


 ఈ భూమి మనుషులకు మాత్రమే కాదు జంతు జీవరాశులకు కూడా అని వాటికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాను. ఎల్లప్పుడూ బిజీగా ఉండే వాళ్ళు నాకు "ఎప్పుడు ప్రశాంతత దొరుకుతుందా" అని ఏడ్చే వాళ్లకి ఇంట్లో ఖాళీగా ఉంటే ఎంత నరకం అని తెలిసేలా చేశాను.

మేము అగ్రరాజ్యాలమని విర్రవీగే వాళ్ళని పడుకునేలా చేశాను..

వైద్యం మీద కాకుండా రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టినందుకు బాధపడేలా చేశాను.

 "గవర్నమెంట్ హాస్పిటల్లను ఇప్పటిదాకా ఇలా ఎందుకు ఉంచారు" అని బాధపడేలా చేశాను.

 "డబ్బుతో అన్ని సుఖాలు ఇష్టాలు రావు సర్దుకుపోవడం లోనే వస్తుంది" అని ప్రతి ఒక్కరికి నేర్పాను.  "మనకెందుకు చావు వస్తుంది" అని ధీమాగా ఉన్న వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించేలా చేశాను..

 క్రమశిక్షణ అంటే ఏంటో తెలియని వాళ్లకు అది నేర్పాను   "ఇలాంటి సమయంలో కూడా సేవ చేసేవాళ్ళు ఉంటారు" అని సమాజానికి చూపించాను. లోకంలో మనిషి పుట్టుక అద్భుతం

 నవ్వుతూ బ్రతకాలి నలుగుర్ని నవ్విస్తూ బ్రతకాలి!


*అంతా మట్టే మట్టిలో పుట్టాము ! మట్టిలోకే పోతాము కదా!

ఒక్కసారి ఆలోచించండి దయచేసి.....



 * తెలుసుకోదగిన విషయం ..... పూజారి తనకు తోచిన కధలు తేలుతున్నాడు 

ఒక రోజొక గురువు గారు తన ఇద్దరు శిష్యుల్నీ పిలిచి, “ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి” అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి, ఒక శిష్యులకు ఇచ్చి, “ఎవరైనా అవసరం ఉన్న వాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్లు” అన్నారు. 

రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్లు’ అన్నారు.

ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచి వాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది.

ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేక పోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది.

మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ యగమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు?

ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే “విలువగలవైనా ..

లౌకిక విషయాలను, వస్తు సమాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే, జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమనీ , జ్ఞానాన్నీ పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే, మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది”. 

అట్లాగే పిల్లలపై ప్రేమ ఉండోచ్చు మొదటి వ్యక్తిలాగా బరువులను మోస్తే ఇవితమంతా బరువుతుంది, రెండోవ్యక్తిలా అందుకున్నదంతా పంచి సహాయము చే యుటె సుఖము.       

***


T  *తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయం :*


* తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంలో ఉంది. ఇది తిరుపతి పరిధిలోకి వస్తుంది. దీనిని అలమేలు మంగాపురమని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. తిరుపతి సమీప జలపాతాలు ! స్థలపురాణం త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.

* అభయముద్రలో అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ, రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి. విగ్రహాలు చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది 'తిరువెంగడ కూటం'గా ఉంది. ఇంతకు ముందు కాలంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఒకటుండేది. తరువాత ఆ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.

* భక్తుల విశ్వాసం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి. సేవలు, సంప్రదాయాలు అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు.

* ప్రతి సోమవారం 'అష్టదళ పదపద్మారాధన' జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. పూజలు శ్రావణమాసంలోను, మరి కొన్ని దినాలలో లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవాలు కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.

* ఉత్సవాలు ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రథ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది. ఇతర దర్శనీయ స్థలాలు అమ్మవారి ఆలయం వెనకాల ఉన్న కోనేరు, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం, పద్మావతి గార్డెన్, శ్రీరామ ఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజ స్వామి ఆలయం, శేష తీర్థం, ఆంజనేయస్వామి ఆలయం మొదలగునవి చూడదగ్గవి. 

*అలమేలు మంగాపురం ఎలా చేరుకోవాలి?*

1) తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుచానూరు ఆలయానికి లోకల్ బస్సులు, ఏ పీ ఎస్ ఆర్ టి సి బస్సులు మరియు ప్రవేట్ బస్సులు, జీపులు రెగ్యులర్ గా తిరుగుతుంటాయి.

 2) లోకల్ గా తిరిగే షేర్ ఆటోలలో ఎక్కి దేవస్థానం వరకు చేరుకోవచ్చు. వారు అడిగినంత డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. 

 3) తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా క్యాబ్ లేదా టాక్సీ మాట్లాడుకొని కూడా అలమేలు మంగాపురం చేరుకోవచ్చు.


*><><><><><><><><><><*

*సేకరణ :*


 pranjali prabha (1} 

* త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః|

సర్వస్మిన్నపి పశ్యాత్మానం  సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్||


నీలో, నాలో, వేరేచోట ఉన్న పరమాత్మ ఒక్కడే.అసహనంతో నాపై వ్యర్థంగా కోపించుచున్నావు.అంతటా పరమాత్మనే చూడుము. విభేదమును విడువుము.

****


Monday 17 July 2023

printied


                శ్రీ జగద్గురు  శంకర భాగవత్పాదులచే రచితమైన
                                                  కనకధారాస్తవము
ఆంధ్రపద్యానువాదకర్త: కీర్తిశేషులు శ్రీ అక్కిరాజు వేంకటేశ్వరశర్మగారు 
                        (ఆంధ్ర పద్య తాత్పర్య సహితము )

                                               పరిచయము                                          శ్రీ శంకర భగవత్పాదులు  బ్రహ్మ చర్యాశ్రమమునవలంబించి  మధుకర వృత్తితో జీవించుచు వేద వేదాంగాది విద్యల నభ్య్యసించు  చున్నకాలమది. ఆయన ఒకనాడు మధుకరమునకై  ఒక గృహము వాకిట నిలిచి "భవతి! భిక్షాందేహి" యని అనెను.  ఆ ఇల్లాలు నిరుపేద . మహాసాద్వి  తమ  పేదరికమునకు వగచుచు ఒక్క ఉసిరిక పండును భిక్షగా పెట్టి కన్నీరు కార్చేను.  శ్రీ శంకర దేశి కేంద్రుడు ఆశువుగా ఇరువదినాలుగు శ్లోకములతో శ్రీ మహాలక్ష్మిని స్తుతించెను.  ఆ దేవి ప్రత్యక్షమై శ్రీ శంకరులు కోరిన విధముగా బంగారు ఉసిరిక  పండ్లను  ఆ నిరుపెదరాలి  గృహమున వర్షముగా  కురిపించెను.    శ్రీ శంకర భగవత్పాదులు  ఆ లక్ష్మీదేవినిస్తుతించిన ఇరువదినాలుగు శ్లోకములకే  కనకధారాస్తవము (స్త్రోత్రము) అని పేరు .  దీనిని అనుదినము చదివిన వారికి సకల సంపదలు చేకూరును.  అనాదిగా అనుదినము అనేకమంది దీనిని చదువుతున్నారు,  భారతదేశము మరియు  ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు  మరియు   ప్రతిఒక్కరు చదివి ఆ లక్ష్మిదేవి కృపకు పాత్రులగుదురు.  

1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 
           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్.
 

2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ 
            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం
            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా
            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     
 

3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:
            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని
            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   
           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:
 

4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష
            మానందహేతు రధికం మురవిద్విషో పి
            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం
             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   
 

5.శ్లో.     అమీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం
             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం
             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:
 

6.శ్లో.      కాలాంబుదాళి  లలితితోరసి కైటభారే:
              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ
              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:
               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 


7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 
               హారావళీవ   హరినీలమఈ  
వినిభాతి
               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా
               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా: 

8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్
                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన
                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం
                మందాలసంచ  మకరాలయ కన్యకాయా:

9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా
                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే
                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:

10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  
               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే
               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం
               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:

11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి
              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి
              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  
              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:

12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 
              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై
              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై: 


13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై
                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై
                 నమోస్తు సోమామృత సోదరాయై
                  నమోస్తు నారాయణ వల్లభాయై

14.   శ్లో :   నమోస్తు హే
మాంబుజ పీటికాయై
                నమోస్తు భూమండల నాయి కా యై
                 నమోస్తు దేవాది సుపుజితాయై
                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :

15: శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై
                నమోస్తు విష్ణో రురసి స్థితాయై
                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై
                  నమోస్తు దామోదర  వల్లభాయై :

16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై
                నమోస్తు 
భూత్యై భువన ప్రసూ త్యై
                 నమోస్తు దేవాదిభి రర్చితాయై
                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :

17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని
                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని
                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  

18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:
                 సేవకస్య  సకలార్ద  సంపద:
                 సంతనోతి వచనాం గ  మానసై
                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  


19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే
                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే
                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే
                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం

20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట
                     స్రగ్వా హినీ  విమల 
చారు జల ప్లు తాంగీం
                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష
                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం

21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం
                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :
                     అవలోకయ
చారు మా  మకించ నానాం
                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:

22. 
శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే
                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం
                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం
                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం

23. 
శ్లో :       కమలాసన పాణినా లలాటే 
                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:
                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే
                   ధనిక 
 ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 


24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;
              వక్షస్థలం భర్త్రు గృహం మురారే
              కారుణ్యత: కల్పయా పద్మవాసే !
              లీలా  గృహం మే హ్రుదయార విందం

25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్
               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం
               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో
               భవంతి తే భువి బుధ భావితాశయా;      


....................................................................................................................................................

 1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 

           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్ 

ప:          ఇందిరా నంద కందలు నేకదంతు

              అఖిల పందారు మందారు నభయవరదు

              ప్రవిమలానంద సందో హ భందురుని ప్ర

              నటుల్ నర్పింతు భక్తి  విఘ్నంబు  తొలగ  

 ...........................................................................................................

2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతి

            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం

            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా

            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     

 

ప:   రంగగుమోగ్గలంబరగు రమ్యత మాలముపైకినేగు సా

       రంగి యనంగ వెన్నుని యురమ్మున నుండిన సారసాక్షి ఆ

       మంగళమూర్తి  నాపయి సమంచిత ముగ్ధ  కృపావలోకనా

       పొంగ  కటాక్ష లీలలను బర్వేడుగాక నిరంతరంబుగా


 తా:    మొగ్గలే  నగలు గాగల తమాల వృక్షమును ఆడు తుమ్మెద ఆశ్ర యించినట్లు, పులకలతో  నిండిన శ్రీ హరిపైకి ప్రసరించు నదియు  భక్తులకు సర్వసంపద లొసంగు  జాలు నట్టి మంగళ  

దేవతయైన  లక్ష్మీదేవి కరుణ తోడి కడగంటి చూపు నాకుమంగళముల నోసంగునుగాక .         

............................................................................................................. 

3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:

            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని

            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   

           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:  


ప:    చూచుచు  ప్రేమతోడ హరి సుందరరూపము,  శౌరి ప్రేమతో

        జూచినయంత సిగ్గుమెయి చూపుమరల్చుచు నుత్పలంబులో

        నేచు మరందముంగొనగ నేగెడి  భ్రుంగి విలాసలీలలన్

        దోచెడు భాగ్యలక్ష్మి కృపతోడుత  నన్నును జూచుగావుతన్   


 తా:      మక రందముకై నల్లగలువపైకి రాకపోకలు సాగించు ఆడు తుమ్మేద వలె శ్రీ మహావిష్ణువు మొగముపైకి ప్రేమతో సిగ్గుతో  మనోహరములగు చూపులను పరపుచు అయన 

చూచినంతనే  మాటికి సిగ్గుతో మరల్చునట్టి లక్ష్మీదేవి  చూపుల పరంపర నాకు సిరిసంపద లోసగునుగాక.

........................................................................................................

 4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష

            మానందహేతు రధికం మురవిద్విషో పి

            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం

             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   


 ప:     ఈ యగుజాలునట్టి దమరేం ద్రుని రాజ్యమునైనగని, నా

          రాయనమూర్తికెంతయు ముదావహమైనది, తమ్మిదుద్దుమే

          ల్చాయకు సాటివచ్చునది సారసవాసినిఐన లక్ష్మి  అ

          త్యాయత లోచనాంచల కటాక్షము నాపైబర్వుగావుతన్

 

తా:     దేవేంద్రుని రాజ్యమునైన ఈయగలదియును శ్రీ మహా  విష్ణువునకు ఆనందము  కలిగించునది    యును, తామర   దుద్దు పసిమి మిసిమి గలిగిన మేనిఛాయగల లక్ష్మీ దేవి

కరుణా కటాక్షము  నాపై సదా ప్రసరించు  గాక      

 .....................................................................................................

5.శ్లో.     అమిలితాక్ష మధిగమ్య ముదా ముకుందం

             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం

             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం

             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:  


ప:     అరమర లేని ప్రేమను ననంగుని మోహము మోడ్పుకన్నులన్

        గురియగుదన్నుజూచెడి ముకుందుని మోహమును గాంచి సిగ్గుచే

        మురిపెముగా మురారి నరమోడ్పు కనంగతోడ జూచు ఆ

        సిరి కరుణా కటాక్షములు శ్రీల నొసంగుత నాకు నెప్పుడున్


తా:   మన్మధుని ప్రేరణచేత అమందానందముతో, అరమోడ్పు  కన్నులతో రెప్ప వాల్చక తనవైపు చూచుచున్న మహావిష్ణువును  గాంచి సిగ్గుతో కమలములవంటి అరమోడ్పు  కన్నులతో  కంటి  పాప నోరగా జేసి పతివైపు చూచుచున్న పాలకడలి పట్టి లక్ష్మీ దేవి 

కటాక్షము నాకు సమస్తైశ్వరములు నోసగుగాక.  

............................................................................................................

6.శ్లో.      కాలంబుదాళి  లలితితోరసి కైటభారే:

              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ

              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:

               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 


ప :            నీలపయౌ ధరంబునను నిగ్గులుదేరు తటిల్లతాంగానం

                 బోలిమురారి వక్షమున మొదముతోడ వసించి కుర్మిమై

                 హేలగ సర్వలోకముల నేలుచు నుండెడి  కన్న  తల్లి  ప

                 ద్మాలయ  నాకోసంగుతను మంగళముల్ సతతంబుదారతన్


తా:           నల్లని మబ్బులో మెర యు చున్న మెరుపు తీగవలె  శ్రీ మహావిష్ణు హ్రుదయమున వసించుచు, సమస్త లోకములను  చల్లగా పాలించు కన్న తల్లి భ్రుగు నందనయగు  లక్ష్మీ  

 దేవి నాకు సమస్త శుభములు నొసంగును గాక             

........................................................................................................... 

7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 

               హారావళీవ   హరినీలమఈ  నిభాతి

               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా

               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా:   


ప:  అతులిత కౌస్తుభం బురమునందున దాల్చిన విష్ణు  వక్షమం

      దతి  రుచిరంబు నీల మణిహారము వోలె వెలుంగు నిందిరా

      సతి సవిలాస ముగ్ధ వికసన్నవకైరవ  లోచనాంచలా

      తత కమనీయదృక్కులు సతంబు శుభంబు లోసంగు గావుతన్


తా:  కౌస్తుభ రత్నాలంకృతమైన శ్రీ మహావిష్ణువు వక్షమునందు వసించేడి  లక్ష్మీ దేవి యో క్క ఇంద్ర నీల మణిహారము వలే విరాజిల్లు కరుణా తరంగితములైన కడగంటి చూపులు సదా నాపై  ప్రసరించు నుగాక.  

 .......................................................................................................

8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్

                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన

                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం

                మందాలసంచ  మకరాలయ కన్యకాయా: 

ప:  ఏయమప్రేమపూర్ణములు దృక్కులు విశ్వ ము నేల్లగావ, నా    

      యణమూర్తి కాదినిననంతముశక్తినొసంగేనట్టిఅ                                

      త్యాయత పద్మనేత్ర మకరాలయపుత్రి కటాక్షవీక్షణల్

      చేయుత  మంగళంబుల సశేషముగాను నిరంతరంబుగా


తా:  సంపూర్ణప్రేమ భరితములైన ఏ చూపులు సృష్ట్యా దిని శ్రీ మహావిష్ణువునకు విశ్వసంరక్షనకై అనంత శక్తి నొసంగెనో అట్టి  క్షీరసాగరతనయయగు లక్ష్మి దేవి కటాక్షవీక్షణములు నాపై 

       ప్రసరించును గాక.

...........................................................................................................  


9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా

                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే

                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం

                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:

ప:  కరుణా మారుత చోదితంబులతులే కల్యాణి దృక్పధముల్

      చిర కాలార్జిత పాపపుంజము వలె న్వేదంబు పోకార్చునో

      పరితప్తాకుల చాతకంబునగు నాపై నార్తి చల్లారగా

      కురియుమ్గాక దరిద్రతా జడిమ లేకుండా న్నిరుల్ సంపదల్


తా:  శ్రీ మహావిష్ణువు ప్రియసతియైన శ్రీ మహాలక్ష్మి కటాక్షవిక్షణ మనేడి  మేఘము దయయను మారుతముచేత ప్రేరితమై చిరకాలార్జిత పాప  రూపమగు చెమటను పోగొట్టి పేద చాతక  పక్షికూననగు నాపై కనక  వర్షమును తనివితీరా కురియునుగాక .  

..........................................................................................................

10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  

               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే

               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం

               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:  


ప:  అనయం బెవ్వడు పుణ్యకార్యముల జేయన్లేదో యవ్వానికిన్

      అనంఘంబైన మహేం ద్ర రాజ్యమును నీయంజాలునో  సత్క్రుషణ్

     కనకాభ్జోదర సోదరంబాగు తటిత్కామ్తి స్త్రకాసిమ్చు ఆ

     కనదబ్జాసన  లక్ష్మి  నాకిడు సనర్ఘంబైన భాగ్యంబులన్


తా:  ఎన్నడును ఎట్టి పుణ్యమును కుడ  చేసి యుమ్దరో అట్టి వారికి   సైతము దయతో దేవేంద్ర పదవినైన ఈయగల్గినదియును  పద్మములోని పసిడి కాంతులుగల మేనిచాయ గల లక్ష్మీ దేవి

       కటాక్ష వీక్షణము నాకు అనంత సంపదల నొసగును గాక.  

 ........................................................................................................

 11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి

              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి

              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  

              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:


ప:  వనజభవునకు సృష్టిలో వాణి  యనగా

      రక్షణము నందు శౌరికి రమ యనంగ

      ప్రళయవేళను శివునకు పార్వతి యన

      సాయపడు నిందిరకును సాస్టాంగ నతులు


తా:  లోకములను సృజించువేళ  బ్రహ్మాకు సరస్వతిగాను, లోక రక్షణ మందు నారాయణునకు లక్ష్మిగాను ప్రళయ కాలమున శంకరునకు  శాకంభరియనబడు  పార్వతిగాను సర్వవిధముల  సహకరించు ఆ పరాశక్తికి నమస్కారములు.    

...............................................................................................................................................................

12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై

               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 

              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై

              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై:


ప:  శుభ ఫలప్రద  యగునట్టి శ్రుతికి సతులు

      రమ్య గుణరత్న నిధిఐన రతికి సతులు

      స్వ ఛ శత పాత్ర  వాసినీ  శక్తి  సతులు

      పూజ్య పురుషోత్తముని పత్ని పుష్టి సతులు


తా:  యజ్ఞాది పుణ్యకార్యములకు కారణ భూతఇన వెదరూపిణికి   శ్రీలక్ష్మికి నమస్కారములు,  సద్గుణములకు సాగారమైన రతి  స్వరూపిణికి నమస్కారములు, నూరు రేకుల పద్మ మందు  

       వసించు శక్తి  స్వరూపిణికి నమస్కారములు.  పురుషోత్తముడగు విష్ణు దేవునకు పత్నిఐన  పుష్టి  స్వరూపిణికి నమస్కారములు.

...............................................................................................................................................

13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై

                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై

                 నమోస్తు సోమామృత సోదరాయై

                  నమోస్తు నారాయణ వల్లభాయై


ప:  సరసిజాత  సమాస్యయౌ సతికి నతులు

      క్షీరసాగారభవయైన సరికి నతులు

      తత సుధాకర సుధల సోదరికి నతులు

      సరసిజోదర పత్నికి సతము నతులు


తా:  కమలమువంటి మొగముగల లక్ష్మికి నమస్కారములు.  పాల  కడలి గారాబుపట్టియగు సిరికి నమస్కారములు.  చంద్రునకు  అమృతమునకు తోబుట్టువగు  లక్ష్మికి నమస్కారములు.  శ్రీ  మహావిష్ణువునకు ప్రియసతి ఐన  లక్ష్మీదేవికి నమస్కారములు. 

 ...........................................................................................................

14.   శ్లో :   నమోస్తు హేమామ్భుజ పీటికాయై

                నమోస్తు భూమండల నాయి కా యై

                 నమోస్తు దేవాది సుపుజితాయై

                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :


ప:  కనక పద్మ నివాసినీ  కమల నతులు

      రమ్య భుమండలంబెలు రాజ్ఞి నతులు

      వానవాదుల కరుణించు పద్మ నతులు

      శార్జ  పాణిప్రియా సరోజాన్య  నతులు  


తా:  స్వర్ణ పద్మ వాసినియగు లక్ష్మీదేవికి నమస్కారములు.  సమస్త  భుమండలమును పాలించు మహారాజ్నికి నమస్కారములు.  ఇంద్రాదేవతలను కరుణతో కాపాడు కన్నతల్లికి నమస్కారములు.   సార్జమను విల్లు గల శ్రీ మహావిష్ణువునకు ప్రియసతిఐన శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు.

.........................................................................................................15: 

15. శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై

                నమోస్తు విష్ణో రురసి స్థితాయై

                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై

                  నమోస్తు దామోదర  వల్లభాయై : 

ప:  భ్రుగుతనూభవ అలికులవేణి నతులు

      విష్ణువక్షోనివాసినీ వేలనతులు

      కమలవాసిని శ్రీ దేవి కమల నతులు

      నతిననాభుని వల్లభా నతులు నీకు


తా:  భ్రుగు మహర్షిపుత్రిఐన శ్రీదేవికి నమస్కారములు.  శ్రీ విష్ణు వక్షస్థల  నివాసినికి లక్ష్మికి నమస్కారములు.  కమలవాసినిఐనకమలకు నమస్కారములు.  నందసుతుడైన శ్రీ  కృష్ణునకు   రుక్మిణి  నామముతో పత్నిఐన శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు.      

........................................................................................................

 16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై

                నమోస్తు భూత్యై భువన ప్రసూ త్యై

                 నమోస్తు దేవాదిభి రర్చితాయై

                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :


 ప:  కాంతి రూపిణి  ఐన ఒకమల  నతులు

      అఖిల సంపత్ప్ర దాయి నీ  అంబ నతులు

      దేవముని గణపూజితా దేవి  నతులు

      నందన సుత వల్లభా పద్మన  న నతులు


తా:  పద్మములవంటి  కన్నులుగల కాంతరూపిణికి  నమస్కారములు.   లోకజననికి, ఐస్వర  రూపిణికి  నమస్కారములు,  ఇంద్రాది దేవతలు చేత పుజింప బడు శ్రీదేవికి నమస్కారములు. నందసుతుడగు శ్రీ కృష్ణునకు రుక్మిణి నామముతో సతిఐన లక్ష్మీదేవికి నమస్కారములు .     ...........................................................................................................

17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని

                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి

                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని

                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  


            ప:  సకల సంపత్క రంబులు  సారసాక్షి

                  విందు లఖిలేంద్రి  యమల ఆనందములకు

                  పాపహరములు సామ్రాజ  అ  భాగ్యదములు

                  పద్మ జనయిత్రి నీకిడు వందనములు


తా:  పద్మ పత్ర విశాలలోచనా మాతా నీకు చేయు  వందనములు , సకల  సంపద్ర్పదములు

 సకలెంద్రియములకు ఆమమ్దా అమందా నంద ముల విందు చేయును .  సర్వ పాపములను తొలగిమ్చును.  సామ్రాజ  వైభవమును  సైతము యీయ గలవు. తల్లి నీకు సదా వందన మొనర్చు భాగ్యము  నాకే  కలుగునుగాక  

............................................................................................................

18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:

                 సేవకస్య  సకలార్ద  సంపద:

                 సంతనోతి వచనాం గ  మానసై

                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  


ప:  సకల సంపద్ర దంబులు  జనని నీదు

      సాంద్ర  కరుణా కటాక్ష వీక్షణములమ్మ

      భక్తితో గొల్తు నీ పాద పద్మములను

      స్తుతి యో నార్చెద త్రికరణ  శుద్ధిగాను


తా:  ఎవరి కరుణా కటాక్ష వీక్షణము  భక్తితో సేవించు వారికి సమస్త  సంపదలోసంగునో అట్టి మహాలక్ష్మీ  శ్రీ హరి హృదయేశ్వరి  నిన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించెదను 

.................................................................................................................................................19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే

                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే

                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే

                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం 


ప :  కమలలోచన  జనయిత్రి  కమలహస్త

       ధవళతర గంధ  మాల్య  వస్త్రా మానోజ్న

       భగవతీ  హరివల్లభా భాగ్యదాత్రి

       కరుణతో  బ్రోవుమా మమ్ము కన్నతల్లి.


తా : కమలముల  కన్నులు గల తల్లీ,  కమలము కరమునందు  గల  జననీ,  తెల్లని పట్టు వస్త్రములను ధరించి, తెల్లని గంధమును  పూసికొని, తెల్లని పూలమాలలతో శో భిమ్చు లక్ష్మీ దేవి,   నారాయణ ప్రియసతీ, నన్ను అనుగ్రహింపుము.    

         ............................................................................................................

20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట

                     స్రగ్వా హినీ  విమల చారు జల ప్లు తాంగీం

                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష

                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం 


ప:  కనక కలశాల  నాకాశ  గంగ దెచ్చి

      తీ ర్ధ మాడింపగా నిన్ను దిగ్గజములు

      స్నాతవై  యోప్ప త్రైలోక్య జననీ  క్షీర

      వారాశి  పుత్రికా వందనములు


తా:  బంగారు కలశములతో నిర్మలమైన ఆకాశ గంగా నది  జలములను  తొండముతో దిగ్గజములు తెచ్చి స్నానము   చేయింపగా  నిర్మల  శరీరముతొ ప్రకాశించుచున్న తల్లీ, సమస్త 

       లోకములకు  ప్రభువైన నారాయాణుని ప్రియ పత్నీ  నమస్కారములు      .............................................................................................................

21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం

                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :

                     అవలోకయచారు మా  మకించ నానాం

                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:

             

ప: కమల కమలాక్షవల్ల్లభా కమలనయన

     కనుము కరుణా కటాక్ష వీక్షణముతోడ

     వరమ దారిద్ర్య  వంతులం బ్రథముడనగు

        నన్ను బ్రోవుము! దినునిగన్న తల్లీ !

                

                   పద్మదళములవంటి కన్నులు గల తల్లీ !  పద్మాక్షుడగు  నారాయణుని  ప్రేయసి!   నేను పరమ దరిద్రులలో ప్రథముడను, నీ  దయకు పాత్రుడ నగు నన్ను కరుణా వీక్షణముల తో కనుగొనుము  

.............................................................................................................

22. శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే

                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం

                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం

                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం 


ప::అమ్మ మారేడు వనములో  నలరు నరసి

     వేయి రేకుల తమ్మిలో వెలయు  దీవు

     కనక కమలము కరమున గలిగి పసిడి

     చాయ నొప్పెడి సిరి నమస్కారమమ్మ


            మారేడు వనములో గల తామర కొలనులో  వేయి  రేకుల పద్మ మందు సుఖముగా కూర్చుండి, పసిడి తామర పువ్వు కరమునందు దాలిచి మిసిమి గల మేని చాయతో నొప్పారు లక్ష్మీదేవీ  ! అమ్మ! నమస్కారము.         ...............................................................................................................,,,

23. శ్లో :       కమలాసన పాణినా లలాటే 

                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:

                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే

                   ధనిక  ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 

ప: నాదు  నుదుటను వ్రాసెను నలువ యిట్లు

     వరమ దారిద్ర్య  దు:ఖంబు పడయు మంచు

     కలిమి గలవారి వాకిట నిలువు మంచు

     బ్రహ్మ వ్రాతను తుడువు నీపదముతోడ


                    పరమ దరిద్రులలో ప్రథముడవై కలవారి వాకిళ్ళ ముందు నిల్చి బిచ్చమెత్తుకొనుమని బ్రహ్మదేవుడు  నా నుదుటిపై వ్రాసెను.  తల్లి నీవు ఆ బ్రహ్మవ్రాతను నీ  పాద పద్మముతో తుడిచి వేయుము 

.....................................................................................................................................................................

24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;

              వక్షస్థలం భర్త్రు గృహం మురారే

              కారుణ్యత: కల్పయా పద్మవాసే !

              లీలా  గృహం మే హ్రుదయార విందం


ప: ముద్దు గొల్పెడి తమ్మి  నీ పుట్టినిల్లు

     ఆ మహావిష్ణు హృదయమే అత్తయిల్లు

     కమలవాసిని! కొలు వుండు  కరుణతోడ

     ఎల్లవేళల నాదగు హ్రదయ పీట్టి 

 

                    తల్లీ శ్రీ మహాలక్ష్మి పద్మము నీకు పుట్టినిల్లు, శ్రీ మన్నరాయణుని హృదయమే నీకు మెట్టినిల్లు, ఓ పద్మాలయా కరుణతో నా హృదయారవిమ్దమును నీ  విలాస మందిరముగా చెసికొనుము. 

..............................................................................................................................................................

25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్

               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం

               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో

               భవంతి తే భువి బుధ భావితాశయా;      

ప:   ఎవరు స్తుతియింతురో వారలి స్తవమున

       మాన్య వేదాత్మ త్రిభువన మాత  రమను

       అతుల సంపద గల్గి గుణాధికులయి

       పండితుల మెప్పు గాంతురు వసుధయందు


                 ప్రతిదినము ఎవరు ఈ స్తుతులతో ముల్లోకములకు తల్లి ఐయిన లక్ష్మీదేవిని స్తుతిమ్తురో వారు గుణములచే నధికులగుచు అధిక ధనవంతులై  పండితుల మెప్పు గాంతురు

***

నా స్నేహితుడు కీర్తిశేషులు శ్రీ అక్కిరాజు వేంకటేశ్వరశర్మగారి     కుమారుడు "శ్రీధర్ " అందచేసిన శ్రీ జగద్గురు  శంకర భాగవత్పాదులచే రచితమైన కనకధారాస్తవము (ఆంధ్ర పద్య తాత్పర్య సహితము )
ఆన్ లైన్ లో ప్రతివక్కరు చదువుకొనుటకు, ముద్రణద్వార నలుగురు ఒక చోట కూర్చొని భక్తితో లక్ష్మీ దేవి కరుణా కటాక్షము, సమస్త శుభములు కలగాలని ఇందు పొందు పరుస్తున్నాను.
                         సర్వేజనా స్సుఖినోభవంతు                                                                                                విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ