Friday 31 March 2023

 



*శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-12*
*సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడుట*
సీత మనస్సు రాక్షస రాజైన రావణుడు క్రూరముగా పల్కిన మాటలకు బెదిరినదియై విలపించు చుండెను.
*నై వా౭స్తి దోషమ్ మమ నూనం అత్ర*
*వధ్యా౭హమ్ అస్యా ప్రియ దర్శన స్య*
*భావం న చా స్యా౭హ మ౭నుప్రదాతుమ్*
*అలం ద్విజో మన్త్రమ్ ఇవా౭ద్విజాయ* 5 28 5
*నూనం మ మా౭౦గా న్య౭చిరా ద౭నా౭౭ర్యః*
*శస్త్రైః శితై శ్ఛేత్స్యతి రాక్షసేన్ద్రః*
*తస్మి న్న౭నాగచ్ఛతి లోక నాథే*
*గర్భస్థ జన్తో రివ శల్య కృన్తః*                 5 28  6
ఈ భయంకరుడైన రాక్షసుడు ఎట్లయినను నన్ను సంహరించును కావున నేను ఆత్మహత్య చేసుకొనుటలో దోషము లేదు. శ్రీరాముడు రెండు నెలలలోపు రాకున్నచో గర్భములో యున్న బిడ్డ సుఖప్రసవం గాకున్నచో శల్యముతో చేధించునట్లు నన్ను ఈ రాక్షసుడు తప్పక మ్రుక్కలు చేయును. ఈ విధముగా సీత పరిపరి విధములుగా శ్రీరాముని తలచుకొని దుఃఖించుతూ ..
*శోకా౭భితప్తా బహుధా విచిన్త్య*
*సీతా౭థ వేణ్యుద్గ్రథనం గృహీత్వా*
*ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్రమ్*
*అహం గమిష్యామి యమ స్య మూలమ్* 5 28 18
 తన జడనే ఉరిగా వేసుకొని తనువును చాలించెదను అని నిర్ణయించుకొనెను. అప్పుడు మరల ఆమెకు పెక్కు శుభశకునములు కనబడినవి. అప్పుడు సీతకు ఆందోళన దూరమై మనస్తాపము శాంతించెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

Thursday 30 March 2023

***

 



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-11
త్రిజట స్వప్నము
సీతాదేవి ఆ రక్కసుల మాటలకు మిగుల పరితాపము చెందుచు ..

హా రామేతి చ దుఃఖా౭౭ర్తా పున ర్హా లక్ష్మణేతి చ
హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామినీ 5 25 11
 
లోక ప్రవాదః సత్యో౭యం పణ్డితైః సముదా౭౭హృతః
అకాలే దుర్లభో మృత్యుః స్త్రియా వా పురుష స్య వా      5 25 12           
 
య త్రా౭హ మేవం క్రూరాభీ రాక్షసీభి: ఇహా౭ర్దితా
 
జీవామి హీనా రామేణ ముహూర్తమ్ అపి దుఃఖితా         5 25 13
ధిగ్ అస్తు ఖలు మానుష్యం ధిగ్ అస్తు పర వశ్యతామ్
న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మ చ్ఛన్దేన జీవితమ్    5 25 20
 
సీతాదేవి రామా, లక్ష్మణా, కౌసల్యా, సుమిత్రా అనుచు దుఃఖించెను. స్త్రీ, పురుషులలో ఎవ్వరికైనను తాము కోరుకొన్నప్పుడే మరణము సంభవించదు అను ప్రాజ్ఞుల మాట సత్యము. ఇట్టి రాక్ష స్త్రీలచే బాధింపబడుతూ ఒక్క క్షణమైనను జీవించి యుండరాదు. మరల స్వస్థత తెచ్చుకొని నా జీవితము శ్రీరాముని అధీనములోనిది కావున ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశము లేదు[1].  ఈ విధముగా జానకి అధోముఖియై నిరంతరము కన్నీరు కార్చుచు విలపించుచుండెను. అప్పుడు ఆ రాక్షస స్త్రీలలోని త్రిజట తనకు కలిగిన స్వప్న వృత్తాంతము చెపుతూ శ్రీరాముని విజయము, రాక్షసుల వినాశనం సూచించింది అని చెపుతుంది.
 
చన్ద్ర సూర్యౌ మయా దృష్టా పాణిభ్యాం పరిమార్జతీ
తత స్తాభ్యాం కుమారాభ్యామ్ ఆస్థితః స గజోత్తమః       5.27.16
 
సీతయా చ విశాలా౭క్ష్యా ల౦కాయా ఉపరి స్థితః
పాణ్డు రర్షభ యుక్తేన రథే నా౭ష్ట యుజా స్వయమ్        5.27.17
 
ఆ స్వప్నములో ఏనుగు అంబారీపై శ్రీరామునితో గూడి సీత ఊరేగుచుండగా, సీత తన పతి యొడినుండి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుట చూచితిని. (ఆదిత్య మండలం వాతు, చంద్రమండలం మేవ వా| స్వప్నే గృహ్ణతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్మహాత్|| ఆరోహణం గోవృషకుంజరాణాం ప్రాసాదశైలాగ్ర నానస్పతీనాం| స్వప్నమున సూర్యమండలముగాని, చంద్రమండలముగాని తన చేతులతో స్పృశించిన మహారాజ్యము ప్రాప్తించును. ధ్రువమండలము, శైలాగ్రమునకు చేరుకొనుట, గజారోహణము తప్పకుండ సంపదలు కల్గును). త్రాగుచు, యెర్రని  వస్త్రములు ధరించి, నూనె పూయబడిన దేహముతో గన్నేరు దండలు దాల్చి   పుష్పకముపై నుండి రావణుడు పడిపోవుటను స్వప్నములో గాంచితిని. (బలి పశువు మెడలో గన్నేరు దండలు అలంకరించుట ఆచారము). శ్రీరాముడు దివ్యమైన పుష్పక విమానమును ఎక్కి ఉత్తర దిశకు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లెను. (ఈ విషయము అనంతరము శ్రీరాముడు అయోధ్యకు రాజుకాగలడని సూచిస్తున్నది).రావణుడు శిరోముండనం గావించుకుని, నల్లని వస్త్రములు ధరించి, నూనె త్రాగుచు, పిచ్చివాడివలె గాడిదలు కట్టిన రథముపై దక్షిణ దిశకు వెడలెను. రావణుని సుతులు, కుంభకర్ణుడు నూనె పూసిన దేహములతో దక్షిణ దిశకు వెడలిరి. ఒక్క విభీషణుడు మాత్రము దివ్య గజమును అధిరోహించి ఆకాశమునందు యుండెను. ఈ విధముగా త్రిజట తన స్వప్న వృత్తాంతమును తెలిపి రాక్షస స్త్రీలతో సీత యెడల జాగరూకతతో, మర్యాదగా మెలుగుడు, ఆమెను శరణు వేడుడు అని చెప్పింది. అంత సీతకు శుభశకునములు కంబడినవి.
శ్రీరామ జయరామ జయజయ రామ
 
[1] మానవ జన్మను ఇచ్చినది భగవంతుడు, కావున ఇది భగవధీనమైనది. కావున జీవితమును త్యజించుటకు  ఎవ్వరికిని అధికారములేదు కావున ఎవ్వరును ఆత్మహత్యకు పాల్పడరాదు.

Tuesday 28 March 2023

sri Ramanavami .. 30-03

 



 "మిత్రులకు శ్రేయోభలాషులకు sri ramanavami  శుభాకాంక్షలు"
 
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-10
రావణుడు అశోక వాటికకు వచ్చుట
మంగళకరమైన చతుర్వాద్య ధ్వనులచే వేకువనే మేల్కొన్న ప్రతాపశాలియైన రావణుడు కామ వికారముచే సీతాదేవిని చూచుటకు అశోక వనమున ప్రవేశించెను. అప్పుడు హనుమ ఆకుల మధ్య నక్కి పరికించి చూచుచుండెను. అప్పుడు సీతాదేవి తొడలతో ఉదరమును, బాహువులతో వక్షస్థలమును కప్పుకొని (ముడుచుకొని) ఏడ్చుతూ కూర్చొనెను. 
 
(ఆచ్ఛా ద్యోదర మూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ, ఉపవిష్టా విశాలా౭క్షీ రుదన్తీ వరవర్ణినీ). వైవాహికో విధిః స్త్రీణాం ఔపనాయనికః స్మృతః అను స్మృతి వాక్యమును అనుసరించి స్త్రీలకు వివాహము పునర్జన్మ. వివాహ సంస్కార ఫలితముగా సీత ఇక్ష్వాకు వంశమున మెట్టినది. 
 
రావణుడు సీతను చూచి "సీతా నీవు భయపడనవసరము లేదు. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా, ఏవం చైత ద౭కామాం చ న త్వాం స్ప్రక్ష్యామి మైథిలి కామం కామః శరీరే మే యథా కామం ప్రవర్తతామ్ బలాత్కారముగా పరస్త్రీలను పొందుట రాక్షసులమైన మాకు స్వధర్మము. 
 
(మరి అయితే మానవ కాంతయైన సీత ధర్మములకు విలువ ఈయక పోవడంలో రావణుని నీచ ప్రవ్రుతిని తెలియజేస్తుంది. మన ధర్మము అనుసరిస్తూ పర ధర్మములను గౌరవించాలి. ప్రస్తుత కాలంలో ఇది పాటించబడుట లేదు. మిక్కిలి శోచనీయం) అయినను 
 
నేను కామాతురడను, కానీ బలాత్కారముగా నిన్ను తాకను. ఓ మైథిలీ! నీవు అనేకమైన దివ్యమైన సుగంధములు, వస్త్రములు ధరించి నన్ను చేరుము". ఈ విధముగా అనేక విధములుగా రావణుడు తన పరాక్రమమును చూపి, ప్రలోభములను పెట్టి సీతను తన వైపుకు త్రిప్పుకొనుటకు ప్రయత్నము చేసెను.
సీత రావణునికి హితవు పలుకుట
 
ఆ రాక్షసుని మాటలకు దుఃఖార్తియై, దీనురాలై శ్రీరాముని తలంచుతూ ఒక గడ్డి పరకను అడ్డుపెట్టుకొని ఇట్లు పలికెను. "నా నుండి మనసును మరల్చుకొని నీ వారిపై మనసును నిలుపుకొనుము. పాపము చేసినవాడు సిద్ధిని కాంక్షించుట ఎంత అయుక్తమో నీవు నన్ను 
కాంక్షించుట అంత అయుక్తము.
 
యథా తవ తథా౭న్యేషాం దారా రక్ష్యా నిశాచర 5.21.7
 
ఆత్మానమ్ ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతామ్
అకృతా౭౭త్మానమ్ ఆసాద్య రాజానమ్ అనయే రతమ్ 5.21.11
సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ
 
మిత్రమ్ ఔపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా        5.2119
వధం చా౭నిచ్ఛతా ఘోరం త్వయా౭సౌ పురుషర్షభః
 
విదితః స హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః                      5.2120
తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి
 
పరుని భార్యను అనుభవించవలెనని కోరిక కలిగినప్పుడు ఒక్కసారి తన విషయమున గూడ నా భార్యను వేరొకడు బలాత్కరించి చెరబట్టినచో ఎట్లుండును? ఆలోచించుకొనుము. ధృడ మనస్కుడు కాక పాపకార్యములను ఆచరించు రాజును పొందినచో ఎంతటి సమృద్ధములైన రాజ్యములు నశించక మానవు. లోకములో నిలకడ కావాలని కోరినచో రామునితో మైత్రి చేసికొనుము. ఘోరమైన చావు చావకుండుటకైనను రామునితో మైత్రి చేసికొనుము.  
రావణునకు సీతమ్మ చేసిన ఈ ఉపదేశము సంసారులకు అందరికి ఉపదేశమే. ఇట్లు పలికిన సీత వాక్కులను విని రావణుడు కోపముతో .. బ్రతిమాలుచున్న కొలది స్త్రీకి చులకన యగును. నీపై కల్గిన కామముచే నా కోపమును ఆపి వేయుచున్నది.
 
వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే
జనే తస్మిం స్త్వ౭నుక్రోశః స్నేహ శ్చ కిల జాయతే        5 .22 4
 
ఏ మనుజులపై కామము కలుగునో ఆ మనుజులు శిక్షింపదగిన వారైనను వారిపై దయా స్నేహములు కలుగును. నీవు నన్నాడిన పరుష వాక్యములకు నిన్ను క్రూరముగా సంహరింపవలసి యున్నది సీతా! నీకు సంవత్సరము గడువు ఒసగితిని. ఇంకా నీకు రెండు మాసములు మాత్రమే వ్యవధి యున్నది. అప్పటికి నీవు నన్ను అంగీకరింపనిచో నిన్ను  నాకు ప్రొద్దుటి భోజనమునకు వినియోగింతురు అని పరుషముగా మాట్లాడి వెడలిపోయెను. తరువాత రాక్షస స్త్రీలు, సీతకు నయానా, భయానా అనేక రకములుగా రావణుని పొందమని నచ్చచెప్పుటకు ప్రయత్నము చేసిరి. కానీ సీత వారి మాటలను నిరాకరించెను. అశోక వృక్షముపై యున్న హనుమ వీరి మాటలను నిశ్చలముగా వినెను.
 
శ్రీరామ జయరామ జయజయ రామ
 

Monday 27 March 2023



 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-7
రావణ అంతఃపురమున హనుమ ప్రవేశించుట
హనుమ లంకానగరములో అనేకమైన భవనములను, పతివ్రతలగు స్త్రీలు వారి భర్తలతో నిదురించుటను, ప్రియురాండ్రపై తమ హస్తములు వేసిన స్త్రీలను, అనేకమైన పరిశుద్ధ స్వభావులు, మహానుభావలు, సుప్రభావలు, కాంతిమతులు, లజ్జావతులు, ప్రియుల ఒడిలో కూర్చున్నవారు, బంగారు కాంతుల గలవారు, మేలిముసుగు లేనివారు ఇలా అనేకమైన స్త్రీలను చూచెను. తరువాత రావణ అంతఃపురములోను వారి మంత్రుల భవనములలోను సీతకై వెదికెను. కానీ ఎచ్చటను కానరాలేదు. ఇంతకు మునుపు తాను సీతను చూడలేదు కావున, హనుమ తన మనస్సున సీతాదేవి యొక్క ఊహాచిత్రమును నిర్మించుకొనెను. వాస్తవముగా పదునారు కళలతో గూడి చంద్రుని వలె భాసిల్లు సీతాదేవి, శ్రీరాముని ఎడబాటు వలన విదియ చంద్రుని వలె కాంతిహీనమై, ధూళిధూసరితమై, రావణుని వాగ్భాణముల గుర్తులు ఆమె ముఖ కవళికపై యుండును. అట్టి జానకిని ఎంత వెదికినను తరుణీమణులలో కానరాకుండెను. పిమ్మట హనుమ మేఘము వలె మహోన్నతమైన పుష్పక విమానమును దర్శించెను.
 
తత స్తదా బహు విధ భావితా౭౭త్మనః
కృతా౭౭త్మనో జనక సుతాం సువర్త్మనః
అపశ్యతో౭భవ ద౭తి దుఃఖితం మనః
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః  5 7 17
 
ఈ విధముగా అనేకవిధములుగా నిశిత బుద్ధితో ప్రయత్నమూ చేసినను సీత జాడ కాన రాకపోయేసరికి హనుమ మిగుల దుఃఖితుడు అయ్యెను. తరువాత నెమ్మదిగా రావణుని నిజ అంతఃపురమును చేరుకొన్నాడు. అందు రావణుడు అపహరించి తెచ్చిన కన్యలు, రావణుని పత్నులు, పానముచే అలసి యున్న స్త్రీ రత్నములు ఇలా అనేక మంది కనబడిరి. వారి మధ్య రావణుడు నక్షత్ర రాజు వలె యున్నాడు.
 

గౌరీం కనక వర్ణా౭౭భామ్ ఇష్టామ్ అన్తః పురేశ్వరీమ్
కపి ర్మన్దోదరీం తత్ర శయానాం చారు రూపిణీమ్  5.10.52
 
స తాం దృష్ట్వా మహాబాహు ర్భూషితాం మారుతా౭౭త్మజః
తర్కయా మాస సీతేతి రూప యౌవన సంపదా  5.10.53
 
హర్షేణ మహతా యుక్తో ననన్ద హరియూథపః
*ఆస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం
ననన్ద చిక్రీడ జగౌ జగామ*
 
స్తమ్భాన్ అరోహన్ నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్   5.10.54
 
అక్కడ శయ్యపై పరుండి బంగారు రంగును పోలిన స్త్రీ మూర్తిని (రావణుని పట్ట మహిషి అయిన మండోదరి) చూసి హనుమ సీతమ్మ అనుకొని భ్రమపడి కోతి చేష్టలు చేసెను. ఆనందముతో హనుమ జబ్బలు, తొడలు చరచుకొనెను. తోక ముద్దుపెట్టుకొనెను. పాటలు పాడెను. నృత్యము చేసెను. స్తంభములెక్కి దుమికెను. ఈ విధముగా సంతోషముతో పిల్లవాని చేష్టలు చేసెను. తరువాత బుద్ధిశాలియైన ఆ మహాకపి భర్తని ఎడబాసిన సీత ఇలా సర్వాలంకారణ భూషితయై నిదురించదు, ఈమె సీత కాదని వేరొక వనితయని  అని నిశ్చయమునకు వచ్చియుండెను. ఈ విధముగా అనేక మంది స్త్రీలను చూచినను సీత జాడ లేదు. ఈ విధముగా అనేకమైన భంగిమలలో స్త్రీలను చూచుటచే ధర్మ భంగమయ్యెనని ఒకింత చింతించెను. మరల తేరుకొని  …
 
మనో హి హేతుః సర్వేషామ్ ఇన్ద్రియాణాం ప్రవర్తనే
శుభా౭శుభా స్వ౭వస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్        5.11.41
 
మనస్సే కదా సర్వేంద్రియములను ప్రవర్తింపజేయుటలో కారణమైనది. కానీ నా మనస్సు నిలకడగా, ఎటువంటి వికారములు లోనుకాకుండా యున్నది. అయినను స్త్రీని వెతుకుటకు స్త్రీ సమూహములోనే వెతకాలి కదా! అనుకోని తాను ధర్మ భ్రష్టుడు కాలేదు అనుకొనెను. మరల ధైర్యము తెచ్చుకొని అనేకమైన లతాగృహములు మొదలుగాఁగలవి వెతుకుచుండెను.

అనిర్వేదః శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతం సర్వా౭ర్థేషు ప్రవర్తకః                5.11.10
 
కరోతి సఫలం జంతో:కర్మ య త్తత్ కరోతి సః
తస్మాత్ అనిర్వేద కృతం యత్నం  చేష్టే౭హ ముత్తమం 5.11.11
 
సర్వ విధముల అభివృద్ధికి నిర్వేదము లేకుండుటయే. ఉత్సాహము కలిగియుండుట ఐశ్వర్యమునకు మూలము. ఉత్సాహమే ఉత్తమ సుఖము. నిరుత్సాహవంతుడు కానివాడే అన్నిపనులను ఆరంభింపగలడు. కావున ఉత్సాహముతో మరల ఏయే ప్రదేశములలో శ్రద్ధ చూపలేదో ఆయా ప్రదేశములలో వెతుకుటకు హనుమ నిశ్చయించుకొనెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Sunday 26 March 2023

ప్రాంజలి ప్రభ..27/03

 



 



ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు 

ఎంతజీవకళవహించుచిత్రంబైన
జడముకాదెజీవజగతినద్దిప్రాంజలి 
సుగుణరహితుడైనసుందరునకుదాని
కించుకంతభేదమెన్నదరమె.

భా:-ఎంతగా జీవకళ ఉట్టి పడుతున్నా చిత్రం జడపదార్ధమైనట్టే... ఎంత అందంతో మెరిసిపోతున్నవాడైనా గుణంలేని వాడూ జడపదార్ధంతో సమానమే.

శ్లో:-అర్ధనాశం మనస్థాపం
గృహేదుశ్చరితానిచ
వంచంనం చావమానంచ
మతిమాన్ నప్రకాశతే.

భా:-బుధ్ధిమంతుడు...ధననష్టాన్ని,విచారాన్ని,ఇంట్లోజరిగినచెడను,తనకుజరిగినమోసాన్ని,అవమానాన్ని..ఇతరులకు చెప్పుకోడు.

--(())--
నేటి సూక్తులు

ప్రాంజలిప్రభ

సమ్మోహయంతి మదయంతి విడంబయంతి
నిర్భర్త్పయంతి రమయంతి విషాదయంతి
ఏతాః ప్రవిశ్య సదయం హృదయం నరాణాం
కిం నామ వామనయనా న సమాచరంతి

తాఃః నరుల సదయ హృదయము లందు చొరబారి సమ్మోహింప చేస్తున్నారు. మత్తు కలిగిస్తున్నారు. బ్రమింప జేస్తున్నారు , బెదిరిస్తున్నారు , ఆనందింప జేస్తున్నారు , ధుఖం కలిగిస్తున్నారు, ఒకటేమిటి ఏమిచేసిన ఓర్పతో చూడటమేగా 


51...* నేటి కథ *


*సత్యం పవిత్రమైనది, సత్యం సర్వజ్ఞం. సత్యం బలదాయకంగా ఉండాలి! జ్ఞానదాయకంగా ఉండాలి! జవసత్వదాయకమై ఉండాలి!*

*మనకు కావలసింది స్పందించే హృదయం ఆలోచించే మెదడు, పని చేసే బలిష్టమైన హస్తం కర్మ చేసే యోగ్యతను సంపాదించు.*


🕉🌞🌎🌙🌟🚩

*** *శ్రీగురుభ్యోనమః*

*మన సంప్రదాయమున కార్తీక మాసము, వృశ్చికరాశి అమితమగు పుణ్యకార్యములకు కేటాయింపబడినది. సూర్యుని వృశ్చికరాశి ప్రవేశము కార్తీక మాసముగా పరిగణింప బడుచున్నది. హడావిడి, అలజడి, డంబాచారము విసర్జించి, మౌనముగా మనలోని ఈశ్వరునితో అనుసంధానం చెంది సాధకుడు ముందుకు సాగవలెనని ఈ మాసము సందేశము ఇచ్చుచున్నది.*

*ఈ మాసములో శివానుగ్రహము అనూహ్యమైన రీతిలో అవతరిస్తూ ఉంటుంది. క్షరుడుగా తాను మరణించి, అక్షరుడుగా మేల్కొనే అద్భుతమగు మార్పు శివసంకల్పంగా జరుగును. శివలీల తన లీల కన్నా చాలా విశిష్టమైనదని మహావిష్ణువే పలికిన సందర్భములు పురాణములలో కలవు.*

***

*🌹. గీతోపనిషత్తు  - 75 🌹*

*🍀 13. కర్తవ్యాచరణము  - నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు.   జీవుని పేరుకూడ 'నేను'యే . నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు." ఇది అనునిత్యము ధ్యానము చేయుచు కర్మలాచరించు వానిని కూడ కర్మలు బంధింపవు. 🍀*

*📚. 4. జ్ఞానయోగము  - 14  📚*

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |

ఇతి మాం యో జానాతి కర్మభి ర స బధ్యతే || 14

“నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు" అని నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మములచే బంధింపబడడు. శ్రీకృష్ణుడు పలికిన ఈ వాక్యములో రెండు విధములగు అవగాహన గోచరించును. దైవము నిర్లిప్తుడని, కోరికల కతీతుడని, కావున అతడిచే నిర్వర్తింపబడుచున్న సృష్టి కర్మఫలము, అతనిని అంటదని ఒక అవగాహన. 

దైవము పేరు 'నేను'. జీవుని పేరుకూడ 'నేను'యే. జీవుడు కూడ పై తెలిపిన వాక్యమును మరల మరల జ్ఞాపకము చేసుకొనవచ్చును. అది యేమనగా “నాకు కర్మఫలము నందపేక్ష లేదు. నన్ను కర్మలంటవు." ఇది అనునిత్యము ధ్యానము చేయుచు కర్మలాచరించు వానిని కూడ కర్మలు బంధింపవు.

కోరిక యున్నచోట బంధముండును. కోరిక లేనిచోట బంధముండదు. కావున ఫలము కోరక, కర్తవ్య మాచరించుట కర్మబంధము నుండి బయల్పడుటకు మార్గము. ఇది గీత బోధించు ప్రధాన సూత్రము.

సశేషం....

***

*🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴* 

64. అధ్యాయము - 19

*🌻. సతీకల్యాణము - శివలీల -4 🌻*

విష్ణువు ఇట్లు పలికెను -

భూతనాథా! సృష్టికర్త, జగత్ర్పభువు అగు బ్రహ్మను సంహరించవద్దు. ఈతడీనాడు నిన్ను శరణు పొందుచున్నాడు. నీవు శరణాగత వత్సలుడవు (50). నేను నీకు మిక్కిలి ప్రియమగు భక్తుడను. నాకు భక్తరాజు అను కీర్తి గలదు. నీవు నా విన్నపమును మన్నించి నాపై దయను చూపుము (51). 

హే నాథా! నేను యుక్తి యుక్త మగు మరియొక్క మాటను చెప్పెదను. వినుము. మహేశ్వరా! నీవు నాపై దయచేసి నా మాటను మన్నింపుము (52). హే శంభో! ఈ నాల్గు మోముల బ్రహ్మ ప్రజలను సృష్టించుటకే ఆవిర్భవించినాడు. ఈయనను సంహరించినచో మరియొక సృష్టికర్త ఉండడు. మరియొక సృష్టికర్తను నీవిదివరలో సృష్టించలేదు (53).

హే నాథా! శివరూపములో నున్న నీ ఆజ్ఞచే మనము త్రిమూర్తులము సృష్టిస్థితిలయ కర్మలను మరల మరల చేయు చుందుము (54). 

హే శంభో! ఈ బ్రహ్మను సంహరించినచో, ఆ సృష్టికర్మను ఎవరు చేసెదరు? హే లయకర్తా! హే ప్రభో! కావున నీవు సృష్టి కర్త యగు ఈతనిని సంహరించవలదు (55). దక్షుని కుమార్తె యగు సతీదేవి రూపములో నున్న ఉమా దేవిని, హే ప్రభో! ఈతడే మంచి ఉపాయముతో నీకు భార్య అగునట్లు వ్యవస్థను చేసినాడు (56).

బ్రహ్మ ఇట్లు పలికెను -

దృఢమగు వ్రతము గల మహేశ్వరుడు విష్ణువు చేసిన ఈ విన్నపమును విని, వారందరికి వినపడునట్లుగా, ప్రత్యుత్తరమును ఇట్లు చెప్పెను (57).

మహేశ్వరుడిట్లు పలికెను -

హే దేవదేవా ! రమాపతీ ! విష్ణూ! నీవు నాకు ప్రాణములవలె ప్రియుడవు. వత్సా! నేనీతనిని సంహరింపబోగా నీవు నన్ను నివారించవద్దు. ఈతడు దుష్టుడు (58). పూర్వము నీవు చేసిన విన్నపమును నేను అంగీకరించితిని. దానిని ఇప్పుడు పూర్తిచెసెదను మహాపాపమును చేసినవాడు, దుష్టుడు, నాల్గు ముఖములు గలవాడు అగు ఈ బ్రహ్మను నేను సంహరించెదను (59). 

స్థావర జంగమాత్మకమగు సర్వప్రాణులను నేనే సృష్టించెదను. లేదా, నా శక్తిచే మరియొక సృష్టికర్తను నేను సృష్టించెదను (60). ఈ బ్రహ్మను సంహరించి, నేను చేసిన శపథమును పూర్తిచేసి, మరియొక సృష్టికర్తను సృజించెదను. ఓ లక్ష్మీ పతీ! నీవు నన్ను నివారించకుము (61).

బ్రహ్మ ఇట్లు పలికెను -

గిరీశుని ఈ మాటను విని, చిరునవ్వుతో ప్రకటమైన కరుణాహృదయము గల అచ్యుతుడు 'వద్దు' అని మరల పలుకుచూ, ఇట్లనెను (62).

అచ్యుతుడు ఇట్లు పలికెను -

పరమ పురుషుడవగు నీవు ప్రతిజ్ఞను చెల్లించు కొనుట యోగ్యమైన విషయమే. కాని, నీవు విచారించుము. హే ప్రభూ! ఈశ్వరా! తనను తాను వధించు కొనుట తగదు (63). 

సశేషం....

***

: *🌹. శివగీత  - 114  / The Siva-Gita - 114 🌹*

 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*

📚. ప్రసాద్ భరద్వాజ 


అధ్యాయము 15

*🌻. భక్తి యోగము - 3 🌻*

అన్యత్ర భూతాద్భ వ్యాచ్చ - యత్ప్ర వక్ష్యామి తచ్చ్రుణు,

వదంతి యత్పదం వేదా - శ్శాస్త్రాణి వివిదానిచ 11

సర్వోప నిషదాం సారం -దద్నో ఘ్రుత మినోద్ద్రుతమ్,

యదిచ్చంతో బ్రహ్మ చర్యం - చరంతి మున యస్సదా. 12

తత్తే పదం సంగ్రహేణ - బ్రవీ మ్యోమితి యత్పదమ్ ,

ఏత దేవాక్షరం బ్రహ్మ - ఏత దేవాక్షరం పరమ్ 13

ఏత దేవాక్షరం జ్ఞాత్వా -బ్రహ్మ లోకే మహీయతే,

ఏత దాలంబనం శ్రేష్ఠ - మేత దాలంబనం పరమ్ 14

ఛందసాం యస్తు దేనూనా - మృత భత్వేన చోదితః,

ఇదమే వావధి స్సేతు- రమృత స్యచ ధారణాత్ 15

ఎటువంటి పరమ పదమును కలుగ చేయు వస్తువు పెరుగు నుండి దీయబడిన వెన్నవలె సమస్త శాస్త్రముల చేతను  వేదములతోడను దీయబడినదో -ఏ వస్తువు కోరబడిన  దై మునులచేత బ్రహ్మచర్య మాచరించ బడు చుండెనో అట్టి దానిని నీకు సంక్షిప్తముగా వివరింతును.  

అదేమి టందువా ఓం కారము,  అదే నాశరహిత మగు పరబ్రహ్మము. దానిని తెలసి కొనియే బ్రహ్మలోకమును పొందుదురు.  ఇదే అక్షరము, ఇదే పరము. 

ఛందస్సు లనెడు గోవుల కేది ఋషభ స్థానము పొందెనో  (ప్రదానత్వ మనుట )అట్టిదే అక్షరము అవధి ( నియామకమనుట)  మోక్ష ధారణ వలన సంసార సాగరమునకు దీరము వంటి దగును ( అజ్ఞాన నాశకమై మోక్షమును ప్రాపిం చేయు ).

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹

*🌻. నారద మహర్షి  - 34 🌻*

240. “తనకు క్రోధం వస్తే తప్పనిసరిగా అవతలి వాడు నశిస్తాడు. అలా అనుకున్నప్పుడు క్రోధాన్ని దగ్గరికి రానివ్వకూడదు. క్షమ తప్ప ఇంకొకటి ఉండకూడదు. లేకపోతే అందులోంచి కర్మ పుడుతుంది. 

241. ఒకడు పాపం చేస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో పాపం చేసిన వాడికి ఏం జరగాలో అది శాసించబడే ఉంది, అలా జరగనే జరుగుతుంది. కనుక తాను శాంత స్వభావంతో ఉండాలి. జ్ఞానలక్షణం అదే. 

242. లేకపోతే ఒక కార్యం ఆచరించి, ఒక క్రోధం చేత ఒక దుఃఖానికి హేతువై ఒక కర్మ పుట్టి, ఆ కర్మకు ఫలం అనుభవించవలసి వస్తుంది” అని బోధించాడు నారదుడు. మహర్షులు, జ్ఞానులు ఎవరిని శపించినా, శిక్షించినా, తిట్టినా కొట్టినా అది వాళ్ళకు కల్యాణ హేతువే అవుతుంది. 

243. కృష్ణపరమాత్మ తన అవతారంలో 125 సంవత్సరములు జీవించి చేసిన పనులలో నూరోవంతు ఎవరైనా చేయాలంటే, నూరు జన్మలెత్తాలి. ఎన్ని పనులు చేసాడు! ఎన్ని పనులు ఎంత మందితో చేయించాడు! అదంతా కర్మకదా! కర్మకు ఫలం ఉండితీరాలి కదా ఎవరు చేసినా! 

244. కృష్ణుడు ఎన్ని జన్మలెత్తాలి ఆ కర్మఫలం కోసమని? అన్న ప్రశ్నలు కలుగకమానవు. ఆయన ఎన్ని కర్మలు చేసినప్పటికీ, నిస్సంగబుద్ధితో శుద్ధబ్రహ్మవస్తువైనటువంటి – తన స్వస్థితియందే ఉన్నాడు. 

245. బయట నిర్వర్తించిన కార్యములన్నీ కూడా మనసు, ఇంద్రియములు లోకకల్యాణం కోసమని చేసాయి. అంతేగాని, ఆయన యందు కర్తృత్వభావనే లేదు. కర్తృత్వభావన వల్ల కర్మ ఫలప్రదమవుతుంది. 

246. కర్మ స్వతహాగా జడమయినటువంటిది. భావనచేతనే-నేను పనిచేస్తున్నాననే భావనచేతనే-కర్మలోంచి ఫలం పుడుతుంది.

247. పూర్వం గాలవుడు అనే ముని నారదుని దగ్గరికి వచ్చి, “స్వామీ! జ్ఞానప్రవృత్తి ఎలా కలుగుతుంది? ఆశ్రమాచారాలైన గృహస్థధర్మం, సన్యాసము అనే వాటిలో ఏది మేలయినది? అనేక శాస్త్రాలు అనేకమార్గాలు చూపిస్తవికదా! శ్రేష్ఠమయిన ఒక్కమార్గం నాకు చెప్పు” అని అడిగాడు. 

248. అందుకు నారదుడు, “గాలవా! ఆశ్రమధర్మాలు నాలుగు ఉన్నాయని నువ్వు వినిఉన్నావు కదా! శాస్త్రాలలో ఆ ఆశ్రమధర్మాలు పైకి పరస్పరవిరుద్ధంగా కనబడతాయి. అందులోని ధర్మసూక్ష్మం సద్గురువును ఆశ్రయిస్తేనే తెలుస్తుంది. 

249. స్థూలంగా చూస్తే ఒక ధర్మానికి, మరొక ధర్మానికి వ్యతిరేకలక్షణం కనబడుతుంది. “గృహస్థధర్మంలో, ‘జాగ్రత్తగా ధనం సంపాదించుకుని దాచుకుని భార్యాపిల్లలను బాగా చూచుకో, అతిథి అభ్యాగతులకు పెట్టు’ అని అంటారు. సన్యాసాశ్రమంలో, ‘ధనంమాట ఎత్తవద్దు, ఆ మాట అసలు మనసులోకి రానీయకు’ అంటారు. 

250. అయితే ఈ ప్రకారంగా ఒకే వస్తువును గురించి వివిధ ధర్మాలు, ఆయా ఆశ్రమాల్నిబట్టి ఉంటాయి. అసలు ధర్మంయొక్క లక్షణం ఏమిటి? ఏది ఆచరిస్తే ఆ జీవాత్మకు క్షేమమో, ఆ జీవుడికి క్షేమకరమైన భవిష్యత్తు ఉంటుందో దాన్ని ధర్మము అంటాము.

సశేషం....

*🌻. మానసిక గోళము - మనోభువనము - 4 🌻*

*. సూక్ష్మ, మానసిక, గోళముల ద్వారా పొందుచున్న ఆధ్యాత్మిక ప్రగతి, కేవలము ఊహ మాత్రమే.

*. ఆత్మ, మనస్సు ద్వారా, మనోమయ గోళమందు ఎరుకను పొందుచున్నప్పుడు మానసిక శరీరముతో తాదాత్మ్యతను చెందుచున్నది.

*. నాల్గవ భూమికను దాటి అయిదవ భూమికలో ప్రవేశించుట యనగా-స్వర్గ ద్వారమును చేరుటయని అర్థము. 

*. ఆత్మ మానసిక సంస్కారములను కలిగి ఉండి, మనస్సు యొక్క చైతన్యమునే కలిగి, మానసిక లోకానుభవమును పొందుచుండును.

*. మానసిక లోకానుభవము :-

(అంతర్దృష్టి, దివ్యదృష్టి) కేవలము చుచుటే భగవద్దర్శనము.

*. ఆత్మ, మానసిక సంస్కారములను కలిగివుండి, మానసిక శరీరంతో తాదాత్మ్యము చెంది, మనస్సే తానని భావించును.


సశేషం...

***

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 

అయినా ఎల్లవేళలా ఈ ఆత్మ ప్రత్యయం, ఈ ఠీవీ చెలామణి కాదు. సందర్భాన్ని బట్టి ప్రయత్నించాలి. అందుకే శ్రీనాథుడు ఒక్కొక్కసారి సహనం అవసరమేనంటూ చెప్పిన పద్యమిది -

"నికటముననుండి శ్రుతి నిష్ఠురముగ

నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు

డుడిగి రాయంచ యూరక యుంట లెస్స

సైప రాకున్న నెందేని జనుట యొప్పు"

- కాకులు గోలపెడుతున్నప్పుడు ఓర్పుతో సహించాలి. లేదా వాటినుండి దూరంగా వెళ్ళాలి. అంటే ఆ కాకులతో మనమూ గోలచేస్తే మన స్థాయి పతనమైనట్టే గదా! ఇది మన జీవితంలో చాలా సందర్భాలకి ఉపకరిస్తుంది.

శ్రీనాథుడు భోగి. రసికుడు. ఎన్నో సుఖాలు అనుభవించాడు. అవకాశాలను అనుకూలంగా మలచుకోవడంలో తనకు తానే సాటి. అయినా రాజుల రోజులు ముగిసిన తర్వాత కష్టాల పాల్పడ్డాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడూ, కవిసార్వభౌముడు, ఆగమ జ్ఞాననిధి అయిన శ్రీనాథుడు ఎన్నో బాధలు పడ్డాడు.

"కుల్లాయుంచితి కోక చుట్టుతి మహాకూర్పాసముండొడ్లితిన్

వెల్లులిందిల పిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్, తల్లీ

కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడిన్"

అని వాపోయాడు. గతకాలంలో ఎప్పుడూ చేయలేని, ఇష్టపడని పనులు చేశాడు. అలవాటు లేనివన్ని అనుభవించాడు. ఎంతటివాడికైనా కాలం బాగుండకపోతే అష్టకష్టాలు తప్పవని అనుభవాలు చెప్తాయి.

జొన్నకూడు తిన్నాడు. సన్నన్నం దొరకలేదు. తన పంటపొలాలకు శిస్తు కట్టలేక పోయాడు. శిస్తు కట్టనందుకు కఠినమైన శిక్షలు అనుభవించాడు. వాటిని ఒక పద్యంలో వివరించి మనకి వ్యకిత్వ వికాస తరగతులు నిర్వహించాడు.

జీవితం "చక్రార పంక్తి రివ గచ్చతి భాగ్యపంక్తిః"కి నిదర్శనం. ఎప్పుడూ కష్టాలే ఉండవ్. ఎప్పుడూ సుఖాలే ఉండవ్. వెలుగునీడలు సహజాతి సహజం. సుఖాలకి పొంగిపోకూడదు. కష్టాలకు కుంగిపోకూడదు. అదే స్థిత ప్రజ్ఞత్వం. మనం మంచి జరిగితే విర్రవీగి పోతాం. కష్టం లేదా దుఃఖం వస్తే న్యూనతాభావంతో ఇతరులను తిట్టిపోస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. "బాధే సౌఖ్యమనే భావన " రావాలి. సుఖదుఃఖాల్ని స్వాగతించగలవాడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరొకరికి ఆదర్శప్రాయుడూ కాగలడు. శ్రీనాథుడు అటువంటి వ్యక్తిత్వం కలవాడు కాబట్టే ఈ పద్యం వెలువడింది -

"కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా

పురవీధి నెదురెండ పొగడదండ

సార్వభౌముని భుజాస్తంభమెక్కెను గదా

నగరి వాకిటనుండు నల్లగుండు

వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత

వియ్యమందెను గదా వెదురు గడియ

ఆంధ్ర నైషధకర్త యంఘ్రి యుగ్మంబున

తగిలియుండెను గదా నిగళయుగము "


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


26. పెళ్ళి

ఒక అమ్మాయి  గుడికి వచ్చి నాకు మంచి భర్తను ప్రసాదించు అని వేడుకుంది

మంచి కనబడిని , మంచిని గ్రహించలేని ఈ లోకంలో దొరకుట కష్టం అన్నాడు

దేముడు. మంచివాడు అసలు పెళ్ళికి సాహసించాడు, ఇక ఇంటికి పో అమ్మాయి.


27.ఉంగరం                                                                                                                            డాక్టర్ పేషంటు  ఫోన్ చేసి మీరు అర్జంటుగా నర్సింగ్ హోం రావాలి 

ఎందుకు సార్  నాకు మొన్ననేగదా  ఆపరేషన్ చ్చేసారు, నేను ఆరోగ్యముగానే ఉన్నాను

నీవు రాకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకు డాక్టర్ ముందు రావయ్య తరువాత

చెపుతా అన్ని ఇప్పుడే చెప్పలా, అనగానే పేషంటు వచ్చాడు    

ముందు ఆపరేషన్ థియటర్ పోదాం పదా, ఎందుకు సార్ నేను బాగానే ఉన్నానుగా 

నీ కడుపులో మాఆవిడ పెళ్ళి  ఉంగరము పెట్టి కుట్టేసా, అది తీసురాకపోతే ఫుడ్,బెడ్ లేదు 


28. కోడి

విందు భోజనానికి వెళ్లి గోవిందరావు కోడి మాంసము గబ గబా తింటున్నాడు

గోవింద్  ఎందుకు అంత తొందరా  కోడి ఎక్కడికి పారిపోదు ఎప్పుడో చచ్చిన

దానిని తింటున్నావు ............నవ్వులే నవ్వులు    

***






Saturday 25 March 2023

 


పురాణాలలోని కొన్ని  విషయాలను తెలుసుకొందాం!
1). తాటికి ఎవరి భార్య? జ : సుందుడు
2). అహం బ్రహ్మస్మి అను మహావాక్యం ఏ వేదంలోనిది? జ: యజుర్వేదం
3). దశరథుని గురువు ఎవరు? జ: వశిష్ఠుడు
4). లక్ష్మీదేవి సోదరుడు ఎవరు? జ: చంద్రుడు
5). ఆదిత్యహృదయాన్ని ఎవరు, ఎవరికి ఉపదేసించారు? జ: అగస్త్యుడు. శ్రీరామునికీ.
6). నరకాసురుడు ఏ రాజ్యాన్ని పాలించేవాడు? జ: ప్రాగ్జ్యోతిషపురం
7). ఆరుముఖాలు గల దేవుడెవరు? జ: కుమారస్వామి
😎. హేమలత అని ఎవరికి పేరు? జ: హిమవంతుని కుమార్తె, పార్వతీదేవి.
9). ఆదిశంకరులు జన్మించిన పుణ్యక్షేత్రమేది? జ: కాలడి
10). సంగీతానికి సంబంధించిన వేదం ఏది? జ: సామవేదం 
  ( మరి కొన్ని మరో పోస్ట్లో చూద్దాం)
0----






*నాయనా! ఉన్న విషయమేమంటే, ఈ లోకమంతా నీచమైన ప్రాపంచికతతో నిండిపోయింది. కాని నైతిక బలం, వివేకం కలవాళ్ళు వీటివల్ల ఎప్పుడూ మోసపోరు. 'లోకం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడనీ. నేను ధర్మ మార్గాన్నే అనుసరిస్తాను'... ఇది ధీరుని విధానం అని తెలుసుకో. లేకపోతే రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏమి వ్రాసాడు అని ఆలోచిస్తే ఈ లోకంలో ఏ మహత్కార్యము సాధ్యం కాదు.


: దేహం ఉండాలంటే శ్వాస ఉండాలి; శ్వాస వల్ల దేహానికి లాభం. 'తన'కు (ఆత్మ) కాదు.


తనువు ద్వారా వ్యవహరించేది ఎవడో వాడే "నీవు".


మారే సకలానికి మారనిది ఒకటి ఆధారంగా ఉంది. దానినే మనం 'దేవుడు' అనేది.


నేను లో శరీరం ఉంది; శరీరంలో నేను ఉంది.

మొదటి నేను అహం స్వరూపం. (ఆత్మ)

రెండవ నేను అహంకార రూపం. (నామరూపాలు)

శ్రీరమణీయం - (576)


భక్తుని ప్రశ్న : 'ఆత్మవిద్య' అతి సులభమైనది ఎట్లవుతుంది ?

శ్రీరమణమహర్షి : మరే విద్యకైనా జ్ఞాత , జ్ఞానము, జ్ఞేయము అనే మూడు కావాలి. దీనికి అవేవీ అక్కర్లేదు. అది తానే. ఇంతకన్నా విస్పష్టమైనది వేరేమి ఉంది. అందుచేత అది సులభం. నీవు చేయవలసిన సర్వమూ "నేనెవరన్న" విచారణమే !

భక్తుని ప్రశ్న : మా పూర్వజన్మలో మేమెవరము ? గతంలోని విషయాలు మాకు ఏల గుర్తుకురావు !?

శ్రీరమణమహర్షి : దేవుని కృప ఎంతటిదో కదా ! మీకవి స్మృతికి రానివ్వటంలేదు. తాము పుణ్యశీలురమని తెలిస్తే వారి గర్వానికి మేరలుంటాయా ? కాదు. పాపులైవుంటే వారికెంత నిరుత్సాహం, దిగులు కలిగేవో ! ఇందులో ఏదీ మంచిది కాదు. 'తనను తాను ఎరిగితే' చాలు. దైవం వేసివుంచిన ప్లాన్ పాలించబడుతుంది. ఏమి జరిగితే మాత్రం సంతాపం ఎందుకు ? సముద్రాన్ని చేరాక నదికి ప్రవాహం ఆగినట్లే మనుజుడు కూడా ఆత్మలో విలీనమైనాక, అన్ని …
అరుణాచల శివ🙏

         భక్తుడు ఒకరు భగవాన్ తో “భగవాన్ ఆత్మను తెలుసుకోవాలని అంటారు.అది ఎక్కడ ఉంది ?దానిని ఎట్లా గా తెలుసుకోవటం ?”అని ఎంతో అమాయకంగా అడిగారు.

*“ఇప్పుడు నన్ను రమణాశ్రమం ఎక్కడ ఉంది ?అక్కడికి నేను ఎట్లా వెళ్లాలి ?అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను? నీవు చూసేదంతా ఆత్మయే.దానిని ఎప్పుడూ అనుభవంలోనికి తీసుకుంటూనే ఉన్నావు .
కానీ అది తెలియక ఆత్మ ఎక్కడుందని వెళుతున్నావు.*

దానిని ఎఱుగుటకు చేసే ప్రయత్నం ,పండరీపురం భజన చేయడం వంటిదే.

భజన ఆరంభిస్తున్నప్పుడు  అందరూ కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు.ఒక ఇత్తడి దీపాన్ని వెలిగించి ఇంటి మధ్యలో పెట్టి ,దాని చుట్టూ తిరుగుతూ భజనలు చేయడం ప్రారంభిస్తారు.

పండరీపురం చాలా దూరం.యాత్ర చేద్దాం రండి ,అని పాడుతారు.

నిజానికి దీపం చుట్టి వస్తారు.కానీ యాత్ర అని పాడుతారు .ఇట్లాగే పొద్దు పొడిచే వరకు భజన నడుస్తూనే ఉంటుంది.

ఉదయం అవుతుందనగా ,ఇదిగో పండరి పురం కనపడుతోంది .ఇంకాస్త దూరం ఉంది ,అని పాడుతారు.

ఉదయం వెంటనే పండరీపురం చేరాము.ఇదిగో పాండురంగడు అని పాడి ఆ దీపానికి నమస్కరించి భజన ముగిస్తారు. 

ఈ ఆత్మ విషయంలోనూ ఇలాగే మనము కూడా ఆత్మను ఎప్పుడు దర్శిస్తూనే,ఆత్మ ఎక్కడ ?ఇంకా ఆత్మను ఇంకా పొందలేదే అని భజన చేస్తున్నాము.

అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానం ఉదయించి నప్పుడు ,ఈ ఆత్మ ఇప్పుడే ,ఇక్కడే ఉన్నది .అది “నేనే “అని గుర్తించి ,భజన పూర్తి చేస్తాము .”అన్నారు భగవాన్.


"ముక్తిస్థితి ఎందుకని అర్ధం కావటంలేదు ?"

మన అసలు పేరు ముక్తి. ఇప్పుడున్నది అదనంగా వచ్చి చేరిన స్వరూపం. మనకు పూర్వజన్మల గురించి తెలియటం దేవుని అనుగ్రహం అనుకుంటాం. కానీ మనం ఆ పూర్వజ్ఞానాన్ని మరిచిపోవటమే ఆయన అనుగ్రహం. ఎందుకంటే పూర్వపుణ్యం తెలుస్తే మనకు గర్వం వస్తుంది. చేసిన పాపాలు తెలిస్తే బాధ కలుగుతుంది. అందుకే వర్తమానంలో ఉన్న నేను ఎవరో తెలిస్తే చాలని భగవాన్ శ్రీరమణమహర్షి సెలవిచ్చారు. ఇప్పుడు మన గుణాలు మన మనసును అధిగమిస్తున్నాయి. అందుకే మన ముక్తిస్థితి మనకు అర్ధం కావటం లేదు !

: "ఋభుగీత " (43)


3వ అధ్యాయము [ప్రపంచము చిన్మాత్రము]

ప్రపంచానుభవం నీ విలువ నీకు తెలుసుకోడానికే !!

మనం దేన్నైనా 'అది' అని అంటున్నామంటేనే.. అలా అనటానికి మనం ఉండి తీరాలి. నిద్రలో మనం ఉన్నట్లు మనకు తెలియదు. మన పంచేంద్రియాలు ఏవీ అప్పుడు పనిచేయవు. నిద్రలో ప్రపంచమే కాదు మనం ఉన్నట్లే మనకు తెలియడం లేదు. ఈ ఏర్పాటు అంతా మనం ఉన్నట్లు మనకి తెలియడానికే. జాగృతిలో ప్రపంచానుభవం ఎందుకు కలుగుతుందంటే నీ విలువ నీకు తెలుసుకోడానికే. ఈ సృష్టి అంతా భగవంతుని శక్తి చాటుకోవడానికి కాదు, అసలు వస్తువు విలువ తెలుసుకోడానికే !!

......

11-28,29,30-గీతా మకరందము
         విశ్వరూపసందర్శనయోగము

యథా నదీనాం బహవోఽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి | 
తథా తవామీ నరలోకవీరా 
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి || 
 
తా:- ఏ ప్రకారము అనేక నదీప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందుప్రవేశించుచున్నవో, ఆప్రకారమే ఈ  మనుష్యలోకమందలి వీరులు (రాజులు) లెస్సగ జ్వలించుచున్న మీనోళ్లయందు ప్రవేశించుచున్నారు. 


॥ ఓం - గీతా మకరందము  [11-29]॥
యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా 
విశన్తి నాశాయ సమృద్ధవేగాః | 
తథైవ నాశాయ విశన్తి లోకా 
స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః || 

తా:-  ఏ ప్రకారము మిడుతలు వినాశముకొఱకు మిక్కిలివేగముతో గూడినవై బాగుగ మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో ఆప్రకారమే జనులున్ను మిగులవేగముతో గూడినవారై నాశముకొఱకు మీనోళ్ళయందు ప్రవేశించుచున్నారు. 


॥ ఓం - గీతా మకరందము  [11-30]॥
లేలిహ్యసే గ్రసమానస్సమన్తా 
ల్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః | 
తేజోభిరాపూర్య జగత్సమగ్రం 
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో || 
 
తా:- ఓ విష్ణుమూర్తీ! మండుచున్న నీయొక్క నోళ్ళచే జనులందఱిని అంతటను మ్రింగుచున్నవాడవై ఆస్వాదించుచున్నావు. నీయొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సులచేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింపజేయుచున్నవి.

........

Wednesday 22 March 2023

pranjali prabha 24.03

 



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-3
హనుమ సాగరయానము

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః
ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1
 
అంగదాది వానరుల అభ్యర్థనను అనుసరించియు, జాంబవంతుని ప్రోత్సాహముతో హనుమ సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతమును అధిరోహించి సీతాన్వేషణకు చారణాది దివ్య జాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఇచట ఆకాశమున వెళ్ళుట యనగా బ్రహ్మనిష్ఠ కలిగి యుండుట. ఆకాశమనగా పరబ్రహ్మము (అంతటా పూర్ణముగా ప్రకాశించువాడు). దాని యందు విహరించువాడే సంసార సముద్రమును తాను దాటి జీవులను తరింప చేయగలడు.
 
ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః
మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16
 
ఆ మహాబలుడి చే అదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్లనుంచి బంగారు, వెండి, కాటుక ధారలను వెలిగ్రక్కును. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో [1]"మాధ్యమార్చి" అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు హనుమచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడ సాగెను. హనుమ పైకి ఎగుర సన్నద్ధుడై అంగదాది వానరులతో ఇట్లనెను.
 
వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్
యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః     5.1.39
 
గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్
న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్  5.1.40
 
అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః        5.1.41
 
బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్
సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా       5.1.42
 
ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్
ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః         5.1.43
 
ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్
సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44
 
రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను. అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను. అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను. లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను. అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను. ఆత్మీయులను వీడ్కోలినప్పుడు వారిని కొంతదూరము అనుసరించి, వాటి ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖాశ్రువులను రాల్చి శోక తప్తులగుదురు. అదేవిధముగా అచ్చటి మహావృక్షములు ఆయన వేగమునకు కొంతదూరము అనుసరించి పుష్పములను రాల్చుతూ సముద్రముపై పడిపోయెను.
 
దశ యోజన విస్తీర్ణా త్రింశ ద్యోజనమ్ ఆయతా            
ఛాయా వానర సింహస్య జలే చారుతరా౭భవత్ 5.1.76
 
సంధ్యా సమయము కావడం మూలాన మారుతి యొక్క శరీరచ్చాయ పొడవు పది యోజనములు, వెడల్పు ముప్పది యోజనములుగా కనబడెను. త్రోవలో సాగరుని యొక్క ప్రోద్బలముచే మైనాకుడు (సముద్రములో నున్న పర్వతము) హనుమను  కొంచెము తడవు విశ్రాంతి తీసుకొనమని ప్రార్ధించగా, అందుకు సున్నితముగా తిరస్కరించి హనుమ తన ప్రయాణమును కొనసాగించెను.

శ్రీరామ జయరామ జయజయ రామ
జానకి రామ, పట్టాభి రామ, కారుణ్య రామ,
ఆరోగ్య రామ, గుణాభి రామ, సార్వ భౌమ,
ఓం శ్రీ రామ, మాత్రేనమః 

ప్రాంజలి ప్రభ 23/3 సుందరకాండ.3


యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-2

సుందరకాండ సౌందర్యము

శ్రీరామాయణము మహాకావ్యము. కావ్యమున శబ్దము, అర్థము, రసము - అను మూడు ఉండును. ఈ  మూడును సుందరములై యున్న ఆ కావ్యము మాహాకావ్యము. సుందర కాండలో ఇట్టి శబ్దార్థరస సౌందర్యములు అధికము. కావుననే ఇది సుందరకాండ.
ఇందలి కావ్యగతశబ్దార్థరస సౌందర్యములను పరిశీలింతుము.

1 శబ్ద సౌందర్యము
హంసో యథా రాజత ప౦జర స్థః
సింహో యథా మన్దరకన్దర స్థః
వీరో యథా గర్విత కుఞ్జర స్థః
చన్ద్రో౭పి బభ్రాజ తథా౭మ్బర స్థః      5 5 4
మున్నగు శ్లోకములలో వర్ణ, పద, అనుప్రాసలు అందము కనబడును.

2 "అర్థ సౌందర్యము*
ఇందలి వర్ణనలు, కథ, అలంకారములు కడు మనోహరములు. ఉదాహరణకు

ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమ్ అన్వయుః
ప్రస్థితం దీర్ఘమ్ అధ్వానం స్వబన్ధుమ్ ఇవ బాన్ధవాః    5.1.47

తమ్ ఊరు వేగోన్మథితాః సాలా శ్చా౭న్యే నగోత్తమాః
అనుజగ్ముర్ హనూమన్తం సైన్యా ఇవ మహీ పతిమ్            5.1.48

ఆ కపివరుని వేగమునకు ఆ మహావృక్షములన్నియు ఒక ముహూర్తకాలము అతనిని వెన్నంటి ఒక మహారాజును అనుసరించుచున్న సైన్యము వలె కాన వచ్చెను.
అటులననే రావణుని అంతఃపురంలో పెట్టిన దీపములు ఆరకుండా జూదములో ఓడిపోయినను వదలలేక అటువైపు చూచుచున్న జూదగాళ్ళతో పోల్చెను. (9 .32 ).

ఇట్టి అనేకమైన అలంకారములు సముద్రతరణ, లంకాన్వేషణ, సీతాదర్శనము, అశోకభంజనము, రావణ దర్శనము, లంకాదహనాదులలో కావ్య సౌందర్యము వర్ణనాతీతము.

3 రస సౌందర్యము
ఈ కాండలో నవరసాలు చాలా అందముగా వర్ణింపబడినవి. సీతారాముల పరస్పరానురాగము, ఎడబాటును  వర్ణించుటలో "శృంగారము" గోచరించును.  రాక్షసులను జయించుటలో "వీరరసము" గానబడును. సురస, సింహిక, లంకిణీల వ్యర్థాటోపము "హాస్యరసమును" సూచించును. రాక్షసులను చంపుటలో "రౌద్రరసము" కనబడును. లంకాదహనములో "భయానకం" గోచరించును. సముద్ర లంఘనములో "అద్భుతము" గోచరించును. సీత కనబడక హనుమ నిర్వేదము చెందినప్పుడు "శాంతము" కనబడును.  రాక్షసుల వలన సీత పడిన బాధ "కరుణ" ను చూపును.

ఈ కాండ యందు మొదట నుండి చివర వరకు హనుమ కనబడును. పదిహేనవ సర్గ నుండి చాలా వరకు సీత కనబడును. చివరి సర్గలో శ్రీరాముడు కనబడును. ఈ ముగ్గురి యొక్క సౌందర్యములు ఇందు అభివ్యక్త మగుటచే దీనికి "సుందరాకాండ" అయినది.

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా|
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం||"
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః|
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం||

అనునది ప్రాజ్ఞుల వచనము. పురుష మోహనాకారుడు, సుగుణగుణా సుందరుడు, శ్రీరాముడు. సర్వవిధముల భువనైక సుందరి సీతామాత. కాంచనాద్రి కమనీయ విగ్రహుడైన హనుమ పరమ సుందరుడు. అశోక వనము అతిలోక సుందరము. శ్రీసీతారామహనుమంతుల మహామంత్రములు దివ్యములు, సుందరములు. ఈ మహితాత్ముల కథ సర్వాద్భుత సుందరము. ఈ సుందరాకాండము యొక్క బహువిధవైభవములను వర్ణించు కవిత్వము (కావ్యము) అంత్యంత సుందరము. ఈ సుందర కాండము నందు సుందరము కానిదేది లేదు. సీతాన్వేషణ మహాకార్యమున ప్రముఖ పాత్రను నిర్వహించిన మహాత్ముడు హనుమ. హనుమ యొక్క శక్తిసామర్థ్యములు, బలపరాక్రమములు అత్యద్భుతములు, నిరుపమానములు. ఈయన కార్యదీక్షతలు అపూర్వములు. అణిమాది అష్ట సిద్ధులు అన్నియు ఈయనకు కారతలామలకములు. బుద్ధి, వైభవము సాటిలేనిది. సమయస్ఫూర్తి  ఉగ్గుపాలతో అబ్బిన విద్య. ఇంత ఎందులకు ఈ మహాత్ముని విషిష్ఠ లక్షణము లన్నియు ఈ సుందర కాండము గోచరించును. అయినను ఎల్లప్పుడూ తనను దాసుడుగానే అభివర్ణించుకొన్నాడు గాని సర్వస్వతంత్రుడిగా భావించుకోలేదు. అహంకారము ఈషన్మాత్రము గూడ లేదు.

శ్రీరామ జయరామ జయజయ రామ
కళ్యాణ రామ కారుణ్య రామ పట్టాభి రామ
సకల గుణ ధామ, సర్వ భౌమ
శ్రీ రామ శ్రీ మాత్రేనమః

ఆధారం వాల్మీకి రామాయణం సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ 

Tuesday 21 March 2023

ప్రాంజలి ప్రభ...22/03

 




ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: 
  • *శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-1*002 

*హనుమ స్వరూపము*
*వేదవేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే*
*వేద: ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా*

వేదములచే తెలియబడు పరమపురుషుడు దశరధునికి కుమారుడైనట్లుగా,వేదము,వాల్మీకి వలన , రామాయణ రూపముతో ఉండినది..

శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై మరల నసించిపోవు చున్న ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు గా అవతరించాడని  మన భారతీయుల ప్రగాఢ విశ్వాసము. శ్రీరాముని మీద మనకు లభించినన్ని పరిశోధనా గ్రంథాలు వేటి యందు లభించవు. శ్రీరాముడు మానవునిగా జన్మించి తన శిష్య ప్రజ్ఞచే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అకుంఠిత దీక్షతో ఆయా యోగ రహస్యాలను అభ్యాసం చేసి, తన సత్య సంధతతో భగవంతునిగా రూపాంతరము చెందినవాడు. తనను గూర్చి *"ఆత్మానాం మానుషం మన్యే"* (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న శ్రీరాముడు *"సత్యేన లోకాన్ జయతి"*  అను ప్రమాణము ననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడు అయినందున శ్రీరాముడు అన్ని లోకములను జయించ గలిగిన వాడై భగవంతునిగా ఈ లోకుల దృష్టిలో ఉండిపోయాడు. దుర్లభమైన మానవ జీవితమును వ్యర్థము చేసుకొనకుండా బాహ్యమున ధర్మాచరణమును, అంతరమున జ్ఞానము కలిగి ఉండవలెనని మనకు శ్రీరాముని ద్వారా తెలియు చున్నది.
రామలక్ష్మణులు సీతను అన్వేషించుతూ పంపా తీరమునకు వచ్చినప్పుడు, సుగ్రీవుని భయము పోగొట్టుటకై హనుమ సుగ్రీవునితో ఇది ఋశ్యమూకం గాన ఇక్కడికి వాలి, వాలి సంబంధీకులు రాలేరు అని చెపుతాడు. ఆ విధంగా రామాయణంలో హనుమ పాత్ర పరిచయము అయింది. రామసౌందర్యమును చూడగానే హనుమ ఆకర్షితుడయ్యెను. హనుమను చూచి, అతని సంభాషణ విని నంతనే రాముడు అతనిలోని గుణగణములను తెలుసుకొనెను. రాముడు లక్ష్మణుతో హనుమను గురించి చెపుతూ ..

వాక్యకుశలః,(వాక్యకుశలుడు),  ఋగ్వేదమునందు బాగుగా శిక్షణ పొందినాడు, యజుర్వేదమును ధారణ చేసినాడు,  సామవేదమును చక్కగా ఎరిగిన వాడు, వ్యాకరణమును అనేక మార్లు వినినాడు, మాట్లాడినప్పుడు సందిగ్ధము లేకుండా, తొందరగా గాని, మెల్లగా గాని గాకుండా ముఖము నందు ఎట్టి వికార భావములు లేకుండా, మధుర స్వరముతో, సంస్కారముగా, మంగళకరమైన మధుర స్వరముతో మాట్లాడినాడు అనెను. ఇట్టివాడు దూతగా ఉన్నచో కార్యము తప్పక సిద్ధించునని దూతగా హనుమ యొక్క విశిష్టతను  చెప్పినాడు.  హనుమ యొక్క ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్దమునకు హనుమతో గల సామ్యము గోచరించును. మనలోని ఒక భావమును ఆవిష్కరించ వలెనన్న కోరిక గలిగినచో శరీరములోని వాయువులలో కదలిక గల్గును. ఆ వాయువుచే అభిహతమై మూలాధార స్థానము నుండి శబ్దము బయలుదేరి నాభిని, హృదయమును, కంఠమును దాటి తిన్నగా శిరస్థానమును చేరును. అచట నుండి పైకి పోవ వీలు లేక కంఠము నుండి ముఖము గుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునప్పుడు నోటిలోని ఆయా స్థానములలో వాయువు యొక్క తాకిడిచే శబ్దముగా వెలికి వచ్చును. ఇందు హనుమకు, శబ్ధమునకు సాపత్యమును చూద్దాము.

1 హనుమ వాయువు వలన జన్మించాడు. శబ్దము కూడా వాయువు వలననే జనియించింది.
2 పుట్టగానే హనుమ సూర్య మండలము వైపు (సమాధి అవస్థ) కు పోయెను. శబ్దము కూడా ముందుగా శిరస్సు వైపు సాగును. అటు పోవ వీలుగాక నోటి నుండి వెలుపలికి వచ్చును. నోటిలోని ఆయా వర్ణముల అభివ్యక్త స్థానములే అంజన, కనుక అంజనాసుతుడు అయ్యెను.
3 సూర్యుని నుండి క్రిందకు పడిపోటచే దౌడలు సొట్ట  బోయి   హనుమ గా పేరు వచ్చినది. శబ్దము గూడ శిరఃస్థానము నుండి నోటిలోని దౌడల కదలికచే వర్ణ రూపమున వెలుపలికి వచ్చును గాన శబ్దము గూడ "హనుమ" అగును.
4 శబ్ద సామర్థ్యము వలన అవసరమైన కార్యములు నెరవేర్చుటలో మంత్రి వలే పని చేయును. స్వాధ్యాయన ప్రవచన శీలి యగు సుగ్రీవునకు హనుమ సచివుడు.
ఇట్టి హనుమయే రాముని సీతమ్మతో  కలుపును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
సీతారామ మనోభిరామ కళ్యాణ రామ 
సమస్త జనరక్షక పాలన రామ .. ఓం శ్రీరాం 
/మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--