Saturday 30 June 2018

Pranjali prabha (02-07-2018)

ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీకృష్ణయాణమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
ఇది నా బాల్య విశేషాలు
ఏమని చెప్పది నాటి బాల్యం
అనుభవాల శుభ శోభ రోజులు

కోతి కొమ్మచ్చి ఆట ఆడి
కోతిలా వ్రేలాడ లేక పడ్డ రోజులు
ముళ్ళను లెక్క చేయక తెగిన
పతంగం కోసం పరిగెత్తిన రోజులు

కొబ్బరి తెడ్డుతో క్రికెట్ (కార్కు) బంతిని
కొట్టి ఆటలో పరుగులు తీసిన రోజులు
వంగు దూకుల్లు దూకుతూ వరుసగా
మోదటి బహుమతి తెచ్చిన రోజులు

పిచ్చి బంతి అంటూ వీపున బంతితో
కొట్టి వేగముగా పరిగెత్తించిన రోజులు
బిల్లం గోడు ఆడుతూ ఫర్లాంగ్ దూరం
వెళ్ళి పట్టలేక కంటికి తగిలిన రోజును

ఇసుకలోచేరి గుడి, గోపురాలు కట్టి
చివరకు కాళ్ళతో తొక్కేసిన రోజులు
హోళీ నాడు రంగులు పూసుకుంటూ
నీళ్ళు చల్లుకొని వరుసలు లేని రోజులు

సినమాబండి వెంట నడుచుకుంటూ
పోయి ఇల్లు తెలుసుకోలేక ఏడ్చిన రోజును
నాన్న కోపించగా ఇంటినుండి వెళ్ళి
మరునాడు బిక్కమోహంతో వచ్చిన రోజును

డబ్బులులేక నాన్న కాకి డ్రస్సును
చింపి నాకు గుడ్డలు కుట్టించిన రోజును
స్కూల్లో ఇచ్చే రాగి పైసాకోసం అమ్మ
సేమ్యా తయారికి సహకరించిన రోజును

బాదంపుల్లలు ఏరి, బాదం ఆకులు ఊడ్చి
అమ్మకు తోడుగా కుంకుళ్ళను పొడి చేసిన రోజును
నాన్నతోపాటు ధూపపుపొడి, బేబి మాత్రలు,
ఆవుపాలమందును అమ్మివచ్చిన రోజును

నా ఆరోగ్యం కొరకు అమ్మ వ్రతాలంటూ,నోములంటూ
తిండి తినక ఉపవాసము ఉన్న రోజులను
అమ్మ అనారోగ్యానికి యెటువంటి సేవలు
చేయలేక, చెప్పుకోలేక ఏడ్చిన రోజులు

చదువుకు తగ్గ ఉద్యోగం రాక, ఎవ్వరికీ
చెప్పు కోలేక సినమా పిచ్చోడని పించు కున్న రోజులు
బిఇడి చదువుటకు 3000 లేవని అన్నప్పుడు
నీ బతుకు నీవు బతకటం నేర్చుకో అన్నప్పుడు
కొంప కొంప తిరిగి ట్యూషన్లు చెప్పిన రోజులు

ఈ రాతలు యధార్ధం ఇవి మాత్రం కల్పితాలు
కావు నేను గతంలో అనుభవించిన కొన్ని రోజులు.
ఎందరో మహానుభావులు ఆదరికీ వందనములు

--((**))--

నేటి హాస్యం 

మీరిప్పుడు కరెంటు కుర్చీలో కూర్చున్నారు. 
మరి కొద్ది క్షణాలలో మీరు ప్రాణాలు కోల్పోతారు. 
మీ ఆఖరి కోరికేమైనా వుంటే చెప్పండి?' 

మీరు తీర్చలేరు వదిలేయండి సార్! 

నా మాట నమ్మండి... 
ఎటువంటి కోరికైనా నేను తీరుస్తాను 

అయితే సరే సార్! నేను మిమ్మల్ని నమ్ముతున్నాను 
కరెంటు ఇచ్చినప్పుడు చేతికి ఏ విదమైన తొడుగూ లేకుండా మీరోసారి నా చేతిని ముట్టుకోండి'..!

--((**))--

నేటి హాస్యం 

డాక్టర్ గారూ! ఏమటండీ ఇంత బిల్లు! 

ఐటమ్ టూ ఐటమ్ వ్రాసాను చదవండి, 
ఆనక అడగండి! 

Congratulation fees. 200 
Blood test. 200 
మరి ఈ మూడోది బోదపడడము లేదు, 
అంకె 5,000 అని వుంది! 

మీరిక్కడున్నంత సేపూ 8 సిగరెట్లు కాలుస్తూ మా హాస్పిటల్ సోఫా తగలెట్టారట, 
సోఫా కొన్న రసీదు నఖలు బిల్లుకు జతపరిచాను చూసుకోండి!
--((**))--


--------సుభాషితాలు.---------------------

దానం ప్రియ వాక్సహితం జ్ఞాన 
మగర్వం క్షమాన్వితం శౌర్యం
విత్తం చ త్యాగనియుక్తం
దుర్లభ మే తచ్చతు ర్భద్రం 

తా:--ప్రియవచనములతో గూడిన దానమున్నూ,గర్వము లేని విద్య యున్నూ, క్షమ గలిగిన శౌర్యము న్నూ, త్యాగముతో గూడిన ధనమున్నూ , ఈ నాలుగూఎక్కడో అరుదుగా వుంటాయి.

భాష (పలుకులు,వాణి ) మనుష్యుడికి దేవుడిచ్చిన వరము.దాన్ని సక్రమంగా ఉపయోగించాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.భాషను దురుపయోగం చేయ కూడదు.

అన్నదానాత్పరం దానం విద్యాదాన మతః పరం 
అన్నేన క్షణికా తృప్తి: యావజ్జీవంచ విద్యయా 

అర్థము:--అన్నదానం గొప్పదే కానీ విద్యా దానం అంతకంటే గొప్పది. అన్నదానం వలన క్షణికమైన తృప్తి కలుగును. విద్యా దానము వలన అజ్ఞాన మనే చీకటి విడి పోయి జీవితమతయు సుఖ శాంతులు లభిస్తాయి కదా!

నతులగుచున్ మహోన్నతి దనర్చుచు, నవ్య గుణోక్తి చే గుణో 
న్నతి ప్రకటించుచున్, పరజన ప్రియ కార్య సమర్థతన్ సమం 
చిత నిజ కార్య సంగ్రహము జేయుచు, నిష్టుర వాదులన్ క్షమా 
ధృతి నిరసించుచుం, బరగు ధీరులు పూజ్యులు గారె యేరికిన్

అర్థము:-- సత్పురుషులు అణుకువ కలిగియే ఔన్నత్యమును పొందుదురు. పరుల గుణములను పొగడుచుచు తమ సహృదయత్వమును కనబరుతురు. పరుల కార్య సాఫల్యమున కై ఎక్కువ ప్రయత్నించి వారి కార్యములను సానుకూలము చేయుచు, తమకార్యములను కూడా చేసికొను చుందురు . తమను పరుషముగా నిందించు దుర్జనుల యందు ఓర్పు కనపరిచి వారే దుఃఖ పడునట్లు చేయుదురు. ఇట్టి నడవడిక గలిగిన మహాత్ములు అందరికీ పూజనీయులే. (భర్తృహరి సుభాషితము, ఏనుగు లక్ష్మణ కవి అనువాదము)
--------------శుభోదయం ---------సుభాషితాలు.---------------------

నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ 
దివ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు,కొన్ని విషప్రయుక్తముల్ 
పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధ మైనవే 
నవ్వులు, సర్వ దుఃఖ శమనంబులు, వ్యాధులకున్ మహౌషధుల్ 

అర్థము:--జంతువులు నవ్వవు. మనిషే నవ్వుతాడు. మనసును వెలిగించేవి నవ్వులు. అయితే కొన్ని నవ్వులు ఎటూ తేలవు. మంచో చెడో తెలియ జేయవు. కొన్ని నవ్వులు విషపూరితం గా వుంటాయి. ప్రేమతో నవ్విన నవ్వులే నవ్వులు. నవ్వులు పువ్వుల లాంటివి. సర్వ దుఖాలనూ పోగొట్టేవి నవ్వులే. అలాగే రోగాలకు గొప్ప ఔషధాలు కూడా నవ్వులే. హాయిగా మనసారా నవ్వుకోండి యితరులను నవ్వించండి. .

లోకేషు నిర్ధనో దుఃఖా:
రుణగ్రస్త తతోధికం 
తాభ్యాం రోగ యుతో దుఃఖా 
తేభ్యో దుఃఖా కు భార్య కః 

అర్థము:-- లోకం లో డబ్బులేనివాడు దుఖిస్తాడు,వాడికంటే అప్పు వున్నవాడు ఎక్కువగా దుఖిస్తాడు,వాడికంటే రోగ గ్రస్తుడైనవాడు ఎక్కువ దుఖిస్తాడు, వీళ్ళందరి కంటే గయ్యాళి భార్య వున్నవాడు ఎక్కువ దుఃఖితుడు.

షడ్దోషా పురుషే ణే హ హాతవ్యా భూతిమిచ్చతా 
నిద్రా తంద్రా భయం క్రోధ౦ ఆలసస్య దీర్ఘ సూత్రతా 
అర్థము:--బాగు పడాలనుకునే వాడు అతినిద్ర,సోమరితనము,భయం, కోపం,ఎంతకాలానికీ పని తెమలనీయక పోవడం ఈ ఆరు దోషాలనూ విడిచి పెట్టాలి.

నాస్తి మేఘ సమం తోయం నాస్తి చాత్మ సమం బలం 
నాస్తి చక్షు సమం తేజో నాస్తి నాస్తి ధాన్య సమం ప్రియం 

అర్థము:--వాన నీటి తో సమాన మైన నీరులేదు. ఆత్మా బలం తో సమాన మైన బలం లేదు. కంటి వెలుగు కు సమాన మైన వెలుగు దొరకదు. ఆహారం తో సమానమైన పదార్థము లేదు.ఈ మధ్య బుల్లితెర లో ( టీవీ)
లో చూశాను. వాన నీటిలో బి 12 విటమిను చాలా ఎక్కువగా ఉంటుందని. దీన్ని మన ఋషులు ఎప్పుడో గ్రహించారని ఈ శ్లోకాన్ని బట్టి తెలుస్తోంది. మనవాళ్ళకి పరాయిదేశం వాళ్ళు కనిపెట్టి చెప్తేనే గొప్ప, నమ్ముతారుకూడా.

అభ్యానుసారిణీ విద్యా బుద్ధి: కర్మానుసారిణీ 
ఉద్యోగానుసారిణీ లక్ష్మీ ఫలం భాగ్యానుసారిణీ 
అర్థము:--అభ్య్యాసము (పదే పదే చదువుట)వల్ల విద్యలు, కర్మను బట్టి బుద్ధి, ప్రయత్నము చేయుట చేతనే పనులు జరుగుట, అదృష్టము వల్లనే ధనము లోకములో సమ కూరు చున్నవి.
--((**))--



Friday 29 June 2018

ప్రాంజలి ప్రభ (0 1 - 0 7 - 2 0 1 8)

ఓం శ్రీ రాం - శ్రీ మత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం


నేటి కవిత - ప్రాంజలి ప్రభ  
భావ రస మంజరి 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఫెళ్ళు ఫెళ్ళని ఒళ్ళు విరిచింది 
మేఘమాలిక నుదుటి స్వేదం చిందింది 
జల్లు జల్లులై పుడమితల్లిని మురిపించింది 
గుండె లెండిణ విత్తనంబు విచ్చింది 

పసిడి ఛాయలతో మేను కదిలింది 
పరుగు తీసెడి వయసు మొదలైనది  
పరువాల ఆ సొగసు విప్పారింది  
కొమ్మ,రెమ్మ, ఆకు, కంకులుగా మారింది  

గుట్టు చెప్పి, విప్పి, గుభాలించింది
మెరుపు తీగలా, మిల మిలా మెరిసింది 
ముసి ఉసి నవ్వుల, ముచ్చట్లు చెప్పింది 
అందానికి చిలుక చేరి ముద్దాడి కొరికింది

కంకుల గుంపులతో ముచ్చటించింది 
నెమలి చుట్టూ చేరి పురివిప్పి ఆడింది 
కోకిల గొంతుతో చేను కదిలింది 
రైతన్న ఆకలి తీర్చి ముచ్చట పడింది 

--((**))--


సత్యహీనా వృథా పూజా సత్యహీనో వృథా జపః
సత్యహీనం తపో వ్యర్థం ఊషరే వాపనం వృథా

భావము:-ఊషర క్షేత్రమందు విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్లు గానే సత్యహీనమైన పూజ,జపము, తపము యివన్నీ కూడా నిరుపయోగములే.

యువైన ధర్మశీలః స్యాత్ అనిత్యం ఖలు జీవనం
కోహి జానాతి కస్యాద్య మృత్యుకాలో భవిష్యతి

భావము:- చిరుత ప్రాయములోనే మానవుడు ధర్మశీలుడుగా ఉండవలెను, ఎందుకనగా జీవితము అస్థిరము కదా! యెవనికెప్పుడు మృత్యువు వచ్చునో ఎవరూ ఎరుగరు కనుక
వయసును సాకుగా పెట్టుకోక ధర్మశీలుడవు కమ్ము.

అతగాడెవడో శంకరుడి పేరు పెట్టుకున్నాడట.కానీ ఏనాడూ ఆ పరమేశ్వర నామాన్ని చక్కగా పలికిన పాపాన పోలేదట.కడుపు మండిన కవి కరుణశ్రీ గారు అతడికి ఎలా వాత పెట్టారో చూడండి.
చదువు రాని వేళ 'చంకరు'డన్నాడు,
చదువు కొనెడి వేళ 'సంకరు' డనే
చదువు ముదిరి పోయి షంకరు డనె నయా
స్నిగ్ధ మందహాస శ్రీనివాస

అసారేఖలు సంసారే సారం శ్వశుర మందిరం
హిమాలయే హరః స్సేతే హరి స్సేతే మహా దధౌ:

అర్థము:--- ఈసారము లేని లోకములో సారము మామగారింట్లోనే వుంటుందిట. అందుకనే శివుడే మో తన మామగారిల్లయిన హిమాలయలాల్లో వుంటాడుట, విష్ణువేమో పాలసముద్రములొ వుంటాడట. ఇది కవి యొక్క వ్యంగ్యం. అంటే ఈ కాలము లో కొడుకులు
సెలవులకు తమ ఊరికి వచ్చినప్పుడు, ఊరిలోనే వున్న తల్లిదండ్రులింటికీ పోకుండా మామ గారింట్లో దిగి,తల్లి తండ్రులను మరుదినము వెళ్లి చుట్టపు చూపుగా చూసి వస్తున్నారు. కొంత మంది మూర్ఖులు ఈ శ్లోకము లోని వ్యంగ్యాన్ని అర్థము చేసుకోకుండా దేవుళ్ళే అలా చేస్తే మానవులెంత అని కొట్టి పారేస్తున్నారు . ఆహా! యేమి కొడుకులు?
--((**))--

కత్తి పడవలు(కథ)

సాహితీమిత్రులారా!
వానెప్పుడొస్తుందా, పడవల పందేలెప్పుడెప్పుడు పెట్టుకుందామాని బళ్ళోకొచ్చినప్పట్నుంచీ కిటికీలోంచీ మబ్బుల్ని చూస్తా, మద్దె మద్దెన పక్కనున్న బాచి గాడితో, ఎనక బెంచీ రాంబాబు గాడితో గుసగుసలాడతా వుంటే “నిన్న సైకిలు మీంచి పడ్డప్పుడు మీ మామ నిన్నిడుసుకున్నాడంటగా” అంటూ రామాంజనీలు గాడు ఎనక బెంచీ లోంచి, ఎకసెక్కంగా గిల్లి మరీ అడిగాడు.

“అరేయ్‌ పొట్టోడా…నన్నెవడిడుసుకుంటాడు. నాకేవన్నా దెబ్బల్తగిలాయా పాడా. సైకిలేండిలొంకర్లు పోయిందని, మడ్డుగార్రేక్కు సొట్ట పడిందని మా మావేడుస్తా వుంటే, డొక్కు సైకిల్తెచ్చి నాకిచ్చినందుకు మమ్మా నాన్న మా మావనే తెగిడుసుకున్నారు”

నేనట్లా చెబుతుండగానే, మా సైన్సయ్యవారు “పొట్ట పొడిస్తే అక్షరమ్ముక్కలేదు…గాడిద…పాఠం చెబుతుంటే ఒకటే మాటలు…పక్కచూపులు. పైగా వినేవాళ్ళను చెడగొట్టడం. పీరీడు అయ్యే వరకు బెంచీ ఎక్కి నిల్చో”అనొక్క ఉరుమురిమారు.

బెంచీ ఎక్కడం మనకేమీ కొత్త కాదు గానీ, మబ్బులు కనిపించవనే బెంగ.
పొలాలకవతల నుంచి దుమ్ము రేపుకొస్తూ గాలి వాన.
స్కూలొదిలిపెట్టాక ఇళ్ళకు పరిగెత్తే మూడో క్లాసు పిల్లల్లాగున్నాయి మబ్బులు.
గాలికి కిటికీ తలుపులు అప్పుడే నిద్రలేచిన కోడి పుంజు రెక్కల్లా టపటపా కొట్టుకుంటున్నాయి.

“బెంచీ ఎక్కించినా నీకు సిగ్గులేదురా…”అని, రామాంజనీలును కిటికీ తలుపులు మూసేయమని చెప్పారు మేష్టరుగారు.

తలుపులందక వాడెగురుతా వుంటే కిటికీ రెక్కలు దొరికినట్టే దొరికి తప్పించుకుని టపటప కొట్టుకుంటుంటే, పొట్టోడు జారిపోతున్న చడ్డీని ఒక చేత్తో పైకెగలాక్కుంటూ అదాటున ఎగురుతా వుంటే భలే నవ్వొచ్చింది. నేనుగానీ వాడి పక్కనుంటే, గబుక్కున వాడి చడ్డీని కిందకు లాగేసుందును.

మేష్టరు గారు పాఠం చెబుతూ, మిగతా పిల్లలు పాఠం వింటూ రామాంజనీలు ఎవ్వారం ఎవ్వరూ చూడ్డంలేదని, “కిటికీ నేనెయ్యనా మేస్టారు” అంటే పక్కన ఉరుము లేని పిడుగు పడ్డట్టు ఒక్కసారిగా అందరూ నావైపు చూసి, క్రిష్నాష్టమప్పుడు వుట్టి కొట్టడానికెగిరినట్టు ఎగురుతున్న పొట్టోడిని చూసి ముందు మేష్టరు గారు, తర్వాత నేను, మిగిలిన మా క్లాసు పిల్లలు ఒహటే నవ్వులు. ఆఖర్న రామాంజనీలు-అందరూ తన్ను చూసి నవ్వుతున్నారని తెలిసి, సిగ్గుతో వంకర్లు పోతూ నవ్వేశాడు.

గాలి ఇంకాస్త పెరిగి, చినుకులు పరిగెత్తుకుంటూ మా క్లాసు లోకి రాబోయి, మేష్టరు గారిని చూసి అడక్కుండా లోపలికొస్తే బాగోదని తటపటాయించి, తొంగి తొంగి చూస్తుండేసరికి కిటికీ దగ్గరగా బెంచీల చివర్లలో కూచున్న వాళ్ళంతా…కొంచెం కొంచెంగా జరుక్కుంటూ బల్ల రెండో కొసన కూచున్న వాళ్ళను నెట్టడం, వాళ్ళు కాళ్ళను నేలకు తన్ని పెట్టి, కిటికీ వైపు వాళ్ళను కిటికీ వైపుకే తిరిగి నెట్టడం… క్లాసురూమంతా వాన నీళ్ళలో కాయితప్పడవలా వూగుతోంది.

వానలో చప్పగా తడుస్తున్న గంటను, క్లాసు రూము పైకప్పును, ఎదురుగా వున్న మమ్మల్ని, చేతికున్న వాచీని మార్చి మార్చి చూసుకుని “గోల చేయకుండా కూర్చోండి. లెక్కల మాష్టరొచ్చే వరకు బయటకెవరన్నా కదిలారా వానలో గోడకుర్చీ వేయిస్తానని”చెప్పి సైన్సయ్యవారెళ్ళిపోయారు.

పైకప్పు కన్నాల్లోంచి బొట్లు బొట్లుగా పడుతున్న వాన నీళ్ళను దోసిళ్ళలో పట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళం చల్లుకుంటా ఉంటే, పొట్టోడు బల్లెక్కి కిటికీ తలుపులు బార్లా తెరిచేశాడు. కొంతమందిమి కిటికీ దగ్గరకెళ్ళిపోయి, నీళ్ళనాపాటున పట్టుకుని చల్లుకోవడం మొదలెట్టాం. ముందు బెంచీల్లో కూచున్న వాళ్ళు నోటు బుక్కుల్లోంచీ మద్య పేజీలు చింపుకుని పడవలు చేసుకుంటున్నారు. ఎనక బెంచీల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటా అరుస్తున్నారు.

ప్యూను సీనివాసులు నెత్తి మీద మూడు మడతల గోనెపట్టా కప్పుకుని పరుగెత్తుకెళ్ళిపోయి ఇంటి బెల్లు కొట్టేశాడు.

‘జైహిందో’ అనుకుంటూ అందరం ఇళ్ళకు ఒహటే పరుగు.

తొందర తొందరగా ఎల్లిపోయి మా ఇంటి ముందు సైడుకాలవలో పడవలొదిలి, మిగిలిన పడవల్ని తుక్కురేగ్గొట్టాలని నేనందరికంటే ముందు ఉరుకుతా ఉంటే – బాచి గాడు, రాంబాబు నా వెనకాతలే పరిగెత్తారు.

వానలో జుట్టు తడిస్తే జలుబొస్తుందని, జలుబుతో జొరమొస్తుందనీ అమ్మా నాన్న కంగారు పడతారని నా భయం. మొన్నొకరోజు మా మామ సైకిలు తొక్కుతూ, నడిరోడ్డు మీద ాామ్మని పడితే సైకిలేండిలు వొంగి పోయిందని, మడ్డుగారుకు సొట్టపడిందని మామ నన్ను తిడతా వుంటే – నేను రోడ్డు మీద పడ్డప్పుడు, నా పక్క నుంచీ ట్రాక్టరెళ్ళిందని తెలిసి ‘సైకిలేండిలు ఇరిగిపోతే పొయ్యింది లెద్దు. పిల్లోడికేమీ కాలేదు. లేచినేల మంచిదైందని’ ఇంటెల్లపాదీ నన్ను చూసి అనందించారు. మరిప్పుడు జుట్టు తడుపుకుని, వొల్లంతా నాన్చుకుని జలుబు తెచ్చేసుకొంటే అంతా దుఃఖమైపోరూ – సంకలో పుస్తకాలు తప్పించి చుట్టూ తల మీద కప్పుకోడానికేదీ కనిపించలేదు. తడిసిన చొక్కాలోంచి నీళ్ళు చిన్నగా పుస్తకాలకు కూడా అంటుతున్నై.

రాంబాబు మైనం కాగితం పుస్తకాల సంచీని, బాచి గాడేమో రేకు పుస్తకాల పెట్టెను నెత్తి మీదెట్టుకుని అలుపు తీర్చుకుంటా నడుస్తుంటే, తల మీద పుస్తకాలెట్టుకుని నేనూ వాళ్ళ పక్కనే నడుస్తున్నా.

రోడ్డులన్నీ నీళ్ళలో దాక్కున్నాయి.
సైడు కాల్వల్లోని వాన్నీళ్ళు పొంగి, మా పడవల కోసం తొంగి తొంగి చూస్తున్నాయి.
ఎక్కడెక్కడి మబ్బులో పడవల పందేలు చూడ్డానికి గుంపులు గుంపులుగా కూడి మా వూరి మీదకొస్తున్నాయి.

ఉరుమొచ్చినప్పుడల్లా ‘అర్జున… అర్జునా’ అనుకుంటూ, గాలి గట్టిగా కొట్టినప్పుడు వొంటికంటుకు పోయిన టెర్లిన్‌చొక్కా చలి పెడుతుంటే గజగజ వొణుక్కుంటూ ఇంకాస్త తడిసి ముద్దై ఇంటికి చేరేసరికి, మా ఇంటి ముందటి చుట్టిళ్ళు తలంటు పోసుకుని సాంబ్రాణి పొగేసుకుంటున్నట్టనిపించింది. వసారా చూరులోంచి పడుతున్న వాన నీటి కింద బొక్కెనలు, బిందెలూ పెట్టి, పంచలో మంచాలేసుక్కూర్చుని, వీధిలోకి దిగులుగా చూస్తున్నారు అమ్మా నాన్న. వానొస్తె పన్లోకెల్లే పన్లేదని హాయిగా బొజ్జోక ఎందుకట్లా దిగులుగా కూర్చుంటారో!

“నన్ను చూడండోచ్‌… ఇంతోన పడ్డా జుట్టు తడవకుండా వొచ్చేసానోచ్‌” అని స్టయిల్‌ కొడ్తూ, తడిసిన పుస్తకాల్ని తెరిచి, పడవల్చేసుకోడానికి కాయితాల కోసమెతుకుతా వుంటే “ఓర్నీ బొక్కులన్నీ తడుపుకొచ్చేసావా… ఇయ్యన్నీ మల్లీ ఎట్టా కొంటాంరా” అని నాన్న, “గుడ్డలన్నీ తడుపుకుంటా రాకపోతే వాన తగ్గిందాక బల్లోనే కూచుని రావొచ్చుకదరా… ఇప్పుడేమి కడతావు … అయిగో నీ గుడ్డలన్నీ బయట తీగ మీద” అని అమ్మ … కొట్టినంత పన్చేసారు.

“నేను తడవలేదు… నా జుట్టు చూడండి”అంటూ ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా, తడిసిన పుస్తకాల్ని జాగరత్తగా చుట్టింటి పొయ్యి దగ్గర పొంతకానించి ఆరబెట్టి “జుట్టు తడిస్తే మొక్క మొలవ్వురా…జలుబొస్తే మాత్రేసుకోవొచ్చు. బొక్కులు తడిసి సిరిగి పోతే మల్లా ఏడ కొంటాంరా కొడకా…ఇట్టాగైతే నీకు చదువెట్లా వొస్తదిరా కొడకా”అంటూ నాన్న ఒకటే తిట్లు.

పడవ చేసుకోడానికి పొడి కాయితం దొరక్క నేనేడుస్తావుంటే, “జలుబని మూలిగినప్పుడు చెబ్తా నీ పని” అంటూ నా చొక్కా లాగు ఇప్పేసి చీరకొంగుతో అమ్మ తల తుడుస్తా వుంటే – కరెంటు స్థంభం పక్క పొగాకు బేర్నీ గోడ చాటునుంచీ రాంబాబు, బాచిగాడు, రామాంజనీలు జిల్లాయిలే అని ఎక్కిరిస్తా ‘కత్తి పడవల్చేసుకొచ్చాం…పందేనికి సై సై’ అంటూ ఒహటే సైగలు.
-----------------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, ఈమాట సౌజన్యంతో
----------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు



పెనుగొండ స్మృతికావ్యం 

సాహితీమిత్రులారా! 
మ. 
అదుగో పాతర లాడుచున్నయది సౌధాంతాల నిశ్శబ్ద, మ 
ల్లదె మా కన్నడ రాజ్యలక్ష్మి నిలువెల్లన్నీరుగానేడ్చుచు 
న్నది, భాగ్యంబులుగాసెగట్టిన మహానందైక సారంబు నం 
దుదయంబయ్యెన భాగ్యరేఖ! చెడెనయ్యోపూర్వసౌభాగ్యములు 
మ. 
కవులన్ బంగరు పల్లకీలనిడియుత్కంఠాప్తితో బండిత 
స్తవముల్ మ్రోయగ రత్నకంకణ ఝణవ్యారంబుగా, నాత్మహ 
స్తవిలాసమ్మున మోసి తెచ్చెనట నౌరా, సార్వభౌముండు – నే 
డవలోకింపుము నీరవంబులయి శూన్యంబైన వీ మార్గముల్ 
ఈ పద్యాలున్న చిరుకబ్బం–కేవలం 122 పద్యాలది, వ్రాసేనాటికి ఏతత్కవి వయస్సు కేవలం 12 సంవత్సరాలేనట! పన్నెండేళ్ళ వయస్సులో ఒకట్రెండు పద్యాలు గిలకడం అంత గొప్ప ఏమీ కాకపోవచ్చుకాని చిరస్థాయి ఐన ఒక చారిత్రక స్మృతికావ్యాన్ని (ఆ కావ్యాన్ని అలా పిలవొచ్చనుకుంటాను) మనోహరంగా శిల్పించడం అసామాన్యులకూ, కారణజన్ములకూ మాత్రమే సాధ్యమయ్యే పని. ఆ దరిమిలా ఆ బాలుడు ఒక మహాకవిగా ఎదిగే క్రమంలో విద్వాన్ పరీక్షకు చదివేటప్పుడు తాను వ్రాసిన ఆ కావ్యమే తనకు పాఠ్యగ్రంథంగా నిర్ణయింపబడిందట. విచిత్రమైన ముచ్చట. 

ఇంత చిక్కని కవిత్వం వ్రాసిన ఆ బాలుడు ఆ పిమ్మట 14భాషలలో ఘనిష్ఠమైన పరిచయము, చాలా భాషల్లో తలస్పర్శి ఐన పాండిత్యమూ సంపాదించి, తానెరిగిన భాషల్లోని అందాలను తెలుగులోకీ తెలుగు భాష సొగసులను అన్య భాషల్లోకీ అనువాద రూపంగా ఆదానప్రదానాలు నిర్వహించడమే కాకుండా, తెలుగులోనూ గొప్ప గ్రంథాలు వెలయించి ‘మహాకవి’గా అన్వర్థమైన బిరుదు పొంది, ఋషీకేశ్‌లో శివానంద మహర్షి అత్యంత ప్రశ్రయంతో ఇచ్చిన సరస్వతీపుత్ర అనే ఉపనామాన్ని తన సార్థక సాహిత్య యశోకాయానికి సహజసిద్ధ కవచంగా అలంకృతం చేసుకొని, పద్మశ్రీ పురస్కార విరాజమానులై, ఆంధ్ర సాహిత్య రంగ వేదిక మీద శివ తాండవం చేసిన ఆ శారదామూర్తి–ఇదేదో పెద్ద ఉత్కంఠ కలిగిస్తున్నట్టు ఇంకా నాన్చేదేముందిగాని–శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. పై పద్యాలున్న చిరుకబ్బం పెనుగొండ లక్ష్మి. 

పుట్టపర్తివారికి విజయనగర కాలం నాటి సామ్రాజ్య వైభవమన్నా, ఆ రోజులనాటి సాహిత్య సౌభాగ్యమన్నా మిక్కిలి ఆసక్తి. కృష్ణరాయల కాలంనాటి ప్రజా జీవనమూ, సంస్కృతీ సంప్రదాయాల ఎడల ఆ ఆసక్తితోనే చక్కటి వ్యాసాలూ వ్రాశారు. చిన్నతనంలో పెనుగొండలో ఉన్నందువల్ల తనున్ననాటి పెనుగొండనూ ఆ నగరు ఒకనాడనుభవించిన సౌభాగ్యాన్ని బేరీజు వేసుకుంటూ, గుండెల్లో నింపుకున్న అపూర్వ వైభవపు జీర్ణ చిహ్నాలు నాదించే నిశ్శబ్ద చరిత్రకు చలించి, తన హృదయ కంపనలకు కావ్యరూపం ఇచ్చారు. ‘అనుభవించి పలవరించి’నందుననే ఆ పద్యాలు గొప్ప సూటిదనంతో పఠితల గుండెల్లోకి దూసుకెళతాయి. 

తల్లికోట యుద్ధం జరిగి విజయనగర సామ్రాజ్యం నామమాత్రావశిష్టమై, హంపీ శిథిలాల కొంపగా మారిపొయ్యాక రాజధాని విజయనగరం నుంచి పెనుగొండకు మారింది. కృష్ణరాయలు బ్రతికున్నపుడే ఆయన సామ్రాజ్యం ఉచ్చదశలో ఉన్నప్పుడు కూడా పెనుగొండ రెండో రాజధాని స్థాయిలో వెలుగులు వెల్లార్చింది. ఎంత ఆపత్కాల రాజధాని ఐనా, ఎంత క్షీణిస్తున్న సామ్రాజ్యమైనా చాప చిరిగినా చదరంత కాకపోదుగదా! ఈనాటి పెనుగొండలోని కోట శిథిలాలూ సౌధాల ఆనవాళ్ళూ, రధ్యలూ ‘కన్నడ రాజ్యలక్ష్మి నిలువెల్లన్ నీరుగానేడ్చే’ ఆ సన్నివేశం ఎంత హృదయస్పర్శిగా; వేదనను కవిత్వంగా తర్జుమా చేశాడో ఆ పసికవి. ‘భాగ్యంబులు గాసెకట్టిన మహానందైక సారం’లో ‘అభాగ్యరేఖ ఉదయించిన వైనం’ ‘చెడెనయ్యో పూర్వసౌభాగ్యముల్’ అంటూ ఎంత హృద్వేగభరితంగా కండ్లకు కట్టాడో! ‘కాసెకట్టడం’ ఎంత ముచ్చటైన పలుకుబడి! 

తన చేతుల రత్నకంకణాలు పరస్పరం ఒరుసుకుంటూ ఝణత్కారాలు చేస్తుండగా కవులను తానే స్వయంగా బంగరు పల్లకీలో కూచోబెట్టి చుట్టూ కవిపండితులు స్తుతి పాఠాలు చదువుతుండగా చక్రవర్తి ఆ రాజవీధుల్లో మోసి తెచ్చాడట. ఆ అపూర్వ దృశ్యాన్ని గుండెలనిండా ఒడిసిపట్టుకొని ‘నేడవలోకింపుము, నీరవంబులయి శూన్యంబైనవీ మార్గముల్’ అని వాపోయినాడు కవి. పెనుగొండలోని మహళ్ళూ, రాజవీధులూ, కోటా, రణభూములూ, రామబురుజులూ, జీర్ణాలయాలూ, సమాధులూ అన్నిటినీ ఒక్కొక్కదాన్నే చూస్తూ ఆ శిల్పాలకు అచ్చెరువు చెందుతూ, ఒకనాటి మహావైభవానికి గుండెలు పొంగించుకుంటూ, నేటి దీన స్థితికి కన్నీళ్ళు రాల్చుకుంటూ–ఆ వాక్యాన్ని నిర్మించాడు. 

ఉలిలొ తేనెలసొనలంజిలికి, యీ యొయ్యారి చిత్రించువే 
ళల నాశిల్పికి గన్నుగొనలను ధారల్గట్టెనేమో జలం 
బులు, జేదోయి చెమర్చియుండుననుకొందున్, భావనావేశ భం 
గులు – పైపై చెలరేగ ముద్దుగొనియుండున్ ప్రేమవిభ్రాంతుడై! 

అని ఆ శిల్పాల రామణీయతకు కతాన్నిలొనారయడానికి ప్రయత్నిస్తాడు. ‘ఎట్లు పైకెత్తిరో, ఏంగుగున్నలకైన తలదిమ్ముగొలుపు ఈ శిలల బరువు’ అంటూ ఆశ్చర్యపోతాడు. ‘మూల్మూలలన్ సాలీడుల్ తమ గూడులల్లుకొని సంసారంబు సాగించునౌరా! లీలాచణుడైన కాలపు కరాలన్ పాచికల్ లోకముల్’ అని నిట్టూరుస్తాడు. 

పగతుర యెడంద నిప్పుకల్ రగులబెట్టి 
యుదధి గర్భంబు సుడివడి హోరుమనగ 
తెనుగు ఢంకాలు మ్రోగిన దివ్యభూమి 
కనుము తమ్ముడా! జీర్ణంబు గగనమహలు! 

-అంటూ తన ‘భావనావేశ భంగిమ’లను ప్రవహింపజేసుకుంటాడు. 

విజయనగర శిథిలాల గురించి కొడాలి సుబ్బారావుగారు హంపీ క్షేత్రము అనే పేరుతో ఒక కావ్యం రచించారు. దానికీ మంచి ఆదరణ వచ్చింది. పెనుగొండ లక్ష్మి దానికన్న పదునైదు సంవత్సరముల ముందుది. ఒకరకంగా దానికి స్ఫూర్తి కూడా అయ్యుండవచ్చు. 

పుటకు 3, 4 పద్యాలకన్నా ఎక్కువలేని కేవలం 36 పుటల పెనుగొండ లక్ష్మి కేవలం పరిమాణంలోనే చిన్నది. కవన పరిణాహంలో మిన్నది. ఇతిహాస జ్ఞాపకాల కిణాంకంగా దానికి ఆంధ్ర సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. 

ఎవడు వినకున్న మనకేకి ఏకతమున 
గానమున్జేయుదము మన ఘనులకీర్తి 
ఱేగియారామవీధి ఘూర్ణిల్లనిమ్ము 
లేక కాలంపుటలల మూర్ఛిల్లనిమ్ము 

-అనే ఆత్మప్రశ్రయంతో వ్రాసుకున్న కవికిశోరుని కబ్బం మరి! 

పుట్టపర్తివారు సర్వతంత్ర స్వతంత్రమైన వ్యక్తిత్వం కలవారు. ఏదో ఒకచోట స్థిరంగా ఇమడలేదు. ఎవరి పెత్తనానికీ తలవొగ్గలేదు. ఢిల్లీలోనూ, కేరళలోనూ, ప్రొద్దుటూరులోనూ అనేక ఉద్యోగాలు చేశారు. ప్రతిచోటా రవ్వలు పండించారు. ఆశనిరాశలూ, రక్తివిరక్తులూ, అతిశయ వినమ్రతలూ–ఇలా ఒక వంద ధోరణుల కలగూరగంప ఆయన. ఐనా పెద్దలూ పిన్నలూ ఆయన్ను సమానంగా గౌరవించారు. ఒకనాడు ఢిల్లీ బజారులో ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే అకస్మాత్తుగా చూచిన అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు తన వాహన శ్రేణిని ఆపి, కారుదిగి పుట్టపర్తివారిని పలకరించి తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళారట. 

1959-60లలో ఆంధ్రపత్రిక వీక్లీలో తెలుగు వెలుగులు అనే శీర్షికలో అప్పటి తెలుగు ప్రముఖుల పరిచయాలు చేశారు. ఒకే ఒక పేజీలో ఆ మహనీయుల మూర్తిమత్వాన్ని క్లుప్తంగా ఐనా సమగ్రంగా ఆవిష్కరించారు. ఆ శీర్షిక గొప్ప పాఠకాదరణ పొందింది. వాటిలో పుట్టపర్తివారిని గురించిన ఈ నాలుగు మాటలూ చూస్తే వారి వ్యక్తిత్వం బాగా అర్థమవుతుంది. ఆ వింగడింపు చాలా బాగుంటుందనిపించినందున ఇక్కడ ఉదహరిస్తున్నాను. ‘పట్టరాని ఆవేశం, పట్టిచూద్దామనే కావేషం, ఏ పిల్ల గాలి వీచినా కదలిపోయే మనసు, ఏ చల్లగాలి సోకినా వడలిపోయే దినుసు, మాట వినకపోతే మతి చలించేంత ఆగ్రహం, మాట వింటే కనకాభిషేకం చేసేటంత అనుగ్రహం, మూడు అంగల్లొ ముల్లోకాలు జయిద్దామన్న ఆశ, మానవమాత్రులం ఏమిటి సాధ్యమన్న నిరాశ, ధృవునికన్నా దృఢతరమైన భక్తి, దానికి ప్రతిధృవమైన విశృంఖల రక్తి, ఛీఛీ ఏమిటీ పాడులోకం అన్న విరక్తి, ఇదే కదా మన తరణోపాయానికి మెట్టు అన్న ఆసక్తి, మంత్రతంత్రాలపై మరులు, అధివాస్తవిక భావాల తెరలు, ఇంతవాణ్ణైనా జనం అడుగులకు మడుగులొత్తడం లేదే అన్న సంతాపం, ఆ! మనది ఎంతపాటి పాండిత్యంలే అన్న పశ్చాత్తాపం’– ఇలాంటి పరస్పర వైరుధ్యాల రాలే శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు. ఉవ్వెత్తుగా లేచి సంఘర్షించుకునే ఈ వైరుధ్యాలే ఈయనను బహుభాషావేత్తగా తీర్చాయి. రచనలో బహుమార్గానుసారిగా మార్చాయి. 

పుట్టపర్తివారు కవి మాత్రమే కాదు. గొప్ప విమర్శకులు. అనర్గళ వాగ్ధాటి కలిగిన మహావక్త. యాభై ఏళ్ళనాడు హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో ప్రాకృత సాహిత్యంలోని సొగసులను వారు నిరర్గళంగా వింగడిస్తూ ప్రసంగిస్తుంటే వినే అదృష్టపు జ్ఞాపకం ఈ వ్యాసకర్త మనసులో ఇంకా పచ్చగానే ఉంది. 

పుట్టపర్తివారు దాదాపు 20 వేల ద్విపదలతో పండరి భాగవతం వ్రాశారు. జనప్రియ రామాయణం పేరుతో రామాయణం వ్రాశారటగాని అది అసంపూర్ణమనుకుంటాను. అగ్నివీణ, సాక్షాత్కారం లాంటి చిరు రచనలు వెలయించారు. ఇంకా అనేక రచనలు సృష్టించారు కాని… 

ఏమానందము భూమితలమున – ఓహోహో 
ఊహాతీతంబీయానందంబిలా తలంబున – 
శివతాండవమట – శివలాస్యంబట’ 

-అంటూ 

ధిమిధిమిద్ధ్వని సరిద్గిరి గర్భములు దూగ, నమిత 
సంరంభ హాహాకారములు రేగ – ఆడెనమ్మా 
శివుడు, పాడెనమ్మా భవుడు 

-అంటూ శివతాండవాన్ని అపూర్వ సంగీత గేయ ఫణితితో వారు రూపుకట్టించిన తీరు ఆంధ్ర రసికులచేత పారవశ్య తాండవం చేయించింది. నృత్యానికి గూడా అమరిపోయి నభూతోనభవిష్యత్తన్నట్లు రచించిన గేయాలతో వారు రచించిన శివతాండవం అనే గేయ కావ్యం అపూర్వ ప్రశస్తి పొందింది. వారు ఏ సభలో పాల్గొన్నా, శ్రోతలు వారిచేత ఆ గేయాలు పాడించుకుని విని ముగ్ధులయ్యేవారు. పుట్టపర్తివారు అనగానే ముందు గుర్తొచ్చేది శివతాండవ కావ్యమే! 

కారణాలు ఏవైనా అయ్యుండవచ్చుగాని వారి ప్రతిభకూ యోగ్యతకూ తగినంత గుర్తింపు రాలేదని, రావలసిన పురస్కారాలు అందలేదని, ప్రజానీకంలో ఒక వేదనతో కూడిన అభిప్రాయం వుంది. సాహిత్య రంగంలో కూడా సాహిత్యేతరమైన కారణాలు రాజ్యమేలుతున్న రోజులాయె. ఆ అభిప్రాయం సరికాదు అనుకోడం కూడా సరైనదో కాదో చెప్పడం సులభం కాదు. 

తెలుగువారు మరిచిపోగూడని సాహితీమూర్తి శ్రీ పుట్టపర్తి. వారి పెనుగొండ లక్ష్మి ప్రతిపద్య సుందరమైన కావ్యం! 
----------------------------------------------------------- 
రచన: చీమలమర్రి బృందావనరావు, ఈమాట సౌజన్యంతో 
----------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

Thursday 28 June 2018

Pranjali Prabha (30-06-2018)


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 


నేటి భావ రసమంజరి 
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పోనీ, పోనీ, దేశం ఎటుపోతే నాకేం 
పొతే, పోనీ, నన్ను వదిలి పొతే నాకేం 
రానీ, రానీ, కష్టాల్, నష్టాల్  నాకేం 
వస్తే రానీ భూకంపాల్, పెనుతుఫాన్ నాకేం 

కష్టాల్, నష్టాల్, నా మనసును తాక లేవ్
కోపాల్, తాపాల్, శాపాల్ నన్నేమి చేయ లేవ్
తిట్లు, పోట్లు, ఇక్కట్లు, నా తనువుని మార్చ లేవ్
కానీ, రానీ, రానీ, పోనీ, నా హృదయాన్ని కదిలించ లేవ్
          
కళా కవితా రాగం, రోగం నన్ను వెంబడించ నీ
దీపం, ధ్యానం, యఁగాభ్యాసం నాకు అలవాటు కానీ
హాసం, లాసం, నా ప్రవర్తనను చూసి ఎక్కిరించ నీ
ప్రకృతి వికృతిగా మారినా ప్రేమను పంచుతా ననీ

విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ప్రార్ధించుతున్నాను 
మనసు వక్రమార్గం పోకుండా ఉండే విద్య నేర్పమంటున్నాను       
నన్ను కన్న తల్లి తండ్రులకు వాగ్దానం చేస్తున్నాను
ప్రాణం ఉన్నంతవరకు ధర్మాన్ని వదలకుండా ఉంటాను 
ఉంటాను, ఉండమని చెపుతాను, 
కృషితో నాస్తి దృర్భిక్షం - ప్రేమ సత్ప్రవర్తనతో సర్వం సుఖం 

--((**))--
నేటి కవిత 
భావ రస మంజరి 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

మన కన్నులు నిత్యం
వెతకటం సత్యం 
సత్యాన్ని తెలుస్కోవటం 
మాత్రం అనిత్యం 

కల్పుతాం స్నేహ హస్తం 
చెప్పలేము ఎంత సాస్వితం 
కల్పుతాం చిరుత హాసం  
ఎంతవరకు మార్చునో కల్ముషం 

చేస్తాం మధుర సంభాషణం 
ఎంతవరకు తీర్చునో పరిష్కరం
పంచు కుంటాం ఆరోగ్యం   
ఎందుకు పంచుకోలేము ఆనారోగ్యం 

పొందుతాం హృదయానందం 
ఇతరుల్లో చూడలేము ఆనందం 
సంపాదన కోసం పోరాడుతాం 
తృప్తి లేక జీవనం సాగిస్తాం    

--((**))--

రావణాసురుడు 
మరణ ఘడియలను సమీపిస్తున్నాడు!

ఆ శ్రీరామ చంద్ర మూర్తి, లక్ష్మణుని ఆదేశించారు
"లక్ష్మణా! నీవు శీఘ్రమే ఆ మహానుభావుడు రావణాసురుని కడకేగి 'రాజ నీతి' అభ్యసించి రమ్ము "

ఎన్నడూ అన్నగారితో మారు మాటాడని లక్ష్మణుడు
"అన్నగారూ! మన శత్రువుదగ్గరకు నన్ను పంపుచున్నారా? "

"నామీద గౌరవమును పెంపొందించుకొని మరీ నా ఆజ్ఞను తక్షణమే శిరసావహించాలి సుమా, 
కాని ఎడల అమూల్య సంపదను జారవిడుచుకొన్నవాడవౌతావు సుమా! "

లక్ష్మణుడు రావణుని శిరస్సున సమీపించి
"మా అన్నగారు మీ దగ్గర 'రాజ నీతి' అభ్యశించుటకు నను పంపినార" నెను!

రావణుని రసవత్తరమైన ప్రత్త్యుత్తరము విందాము:
"లక్ష్మణా! 
ఆ మహా పురుషుడు శ్రీరామ చంద్రుని అనుజునిగా జన్మమెత్తిననూ, నిరంతరమూ ఆ మహానుభావుడి సన్నిధిలో గడిపినప్పటికీ, నీ పూర్వజన్మ సుక్రుతము నిను వీడడము లేదు సుమీ!
విద్య నేర్వగోరువారు గురువు పాదముల చెంతనే వుండాలనే ప్రాధమిక విషయాన్నెలా మరచావయ్యా! 
ఏది ఏమైనా నా దైవము ఆజ్ఞను మనసారా శిరసావహిస్తాను "
అని లక్ష్మణునకు క్షుణ్ణంగా రాజనీతి బోదించారట ఆ మహానుభావుడు రావణాసురుడు!
అందులో ఒక్క విషయం 
" చేయాలనుకున్న మంచిపని వెనకాడకుండా చేసేయ్ - ఆలోచిస్తే అమృతం కూడా విషం గా మారుతుంది, నన్నే చూడు దేవతలను జయించి అమృతాన్ని తెచ్చుకున్నా - తాగ నివ్వలేదు నాలో ప్రవేశించిన అహం. (అహం రాకుండా జాగర్తపడు )

ప్రేమ పాశానికి చిక్కకు, దైవ ప్రార్ధనను మరువకు - నేను ప్రేమ పాశానికి చిక్కి దైవ ప్రార్ధనను తగ్గించా అదే నా మృత్యువుకు మార్గమైనది.      

ఓం శ్రీ రామ్ సర్వం శ్రీ రామార్పణమస్తు
--((**))--

మంజీర నాదాలు-కెంజాయ మెరుపులు
మేనిలో గంధాలు-మెరుపుతీగ..!
చిగురాకు లధరాలు-సిందూర వర్ణాలు
తలిరాకు సొగసులు-తరుణిసుమము..!
నీలంపు గన్నులు-నిండైన రూపమ్ము
నవ్వితే రతనాలు-నవ్యకాంతి..!
కస్తూరి పరిమళం-కరిగించు రసధార
మృగనాభి రాధమ్మ-సొగసుగత్తె..!

వర్ణరంజిత విరులన్ని-వలపుదెలుప.!
స్వర్ణకాంతుల వదనమ్ము-సౌరులొలికె..!
మధుర మంజుల గానాలు-మత్తుగొలుప..!
మరులు వికసించ రాధమ్మ-మురిసిపోయె..!

క్రూరాత్ముడు అజామీళుడు 
నారాయణ యనచు నందుని బిలువన్ 
ఏ రీతిని ఏలుకొంటివొ వెలదగ క్రిష్ణ 
ఏరీ నీ సాటి వేల్పు నగధర సౌరీ! 

అజామీళుడు క్రూరుడు, ధుర్మార్గుడు, నీచుడు, దోపిడీదారుడు, దయాదాక్షిణ్య రహిత హంతకుడు, స్త్రీలోలుడు! 

తన చరమాంకము వుంపుడుగత్తె ఇంట గడిపాడు! 
అనుకోకుండా ఆమె వల్ల కన్న కొడుకుకి "నారాయణ " అనే పేరు పెట్టడం జరిగింది! 

ఒకానొక సంధ్య వేళ! 
అజామీళుడు దాహార్తితో పరితపిస్తూ కొడుకును పిలుస్తున్నాడు! వాడు ఎంతకూ రాకపోయేసరికి కొడుకును వేడుకుంటున్నట్లు 
"నారాయణ! నారాయణ! నారాయణ! " 
అని అతి దీనంగా, ఆర్తితో మొర పెట్టుకోసాగాడు! 
స్వయంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వాని దాహము తీర్చిన పిమ్మట ప్రాణము విడిచాడు! 
శ్రీమన్నారాయణుడు అతనికి స్వర్గప్రాప్తి కలిగించాడు! 

అందుకే మనము కూడా అంతిమ ఘడియలలో 
"నారాయణుని స్మరించాలి సుమా! 


తెనాలి రామకృష్ణ కధలు 

తాతాచార్యులవారికీ, తెనాలి రామకృషునికీ పడేది కాదుట ఎప్పుడూ నేను చెప్పింది సరైనదంటే నేను చెప్పినదే సరైనదని వాదులాడుకునే వారట.
ఒకసారి ఆ వాదనలో ఒక పందెం వేసుకున్నారట. నేను చెప్పినది సరైనదైతే మీరు నన్ను భుజాల మీదికెక్కించుకొని రాజవీధిలో తిరగాలి, నేను ఓడినట్లైతే, నేను మిమ్మల్ని భుజాలమీదికెక్కించుకొని రాజవీధిలో తిరుగుతాను. అదీ పందెం. ఆ పందెం లో 
తాతాచార్యులవారు ఓడిపోయారట. ఇంకేముంది నన్ను భుజాలమీదెక్కించుకొని రాజవీధిలో తిరగాలి రండి అని రామకృష్ణుడు పట్టుబట్టాడాట. రాహ్మకృష్ణా! అలా చేయకురా! నా పరువు పోతుందని ఆయన బ్రతిమలాడినా రామకృష్ణుడు వినకయేసరికి . తాతాచార్యులవారు విధి లేక రామకృష్ణుడిని భుజాలమీదెక్కించుకొని,రాజవీధిలో నడుస్తున్నాడట.
ఈ దృశ్యాన్ని రాయలవారు తనగది కిటికీలోనుంచి చూశారట. భటులను పిలిపించి 
ఆ పైనున్నవాడిని కొరడాలతో కొట్టుకుంటూ నా దగ్గరికి తీసుకొని రండని ఆజ్ఞాపించాడు.
రాయలవారు చూడడం గ్రహించిన రామకృష్ణుడు తాతాచార్యులవారి భుజం మీదినుంచి 
దిగి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించండి గురువర్యా! నా వల్ల అపరాధం జరిగిపోయింది.
దానికి శిక్షగా నేను మిమ్మల్ని భుజాలపై ఎక్కించుకొని తిరుగుతానని చెప్పి ఆయన్ని ఒప్పించి ఆయన్ను తన భుజాల మీదికి ఎక్కించుకొని నడవసాగేడు. భటులు వచ్చి రాజుగారు పైనున్నవాడిని కొరడాలతో కొట్టి తీసుకొని రమ్మన్నారు కదా! రామకృష్ణుని భుజాలపైన వున్న తాతాచార్యుల వారిని కొరడాలతో కొట్టుకుంటూ ఆయన నేను రాయలవారి గురువుగారినని చెప్తున్నా వినిపించుకోకుండా యిది రాజుగారి ఆజ్ఞ అంటూ తీసుకెళ్లారట. రాయలవారు చూసి ఇదేమిటి నేను పైనఉన్నవాడిని కదా తీసుకొని రమ్మనింది. మాగురువుగారిని తీసికోచ్చారేమిటని గద్దించి అడిగేసరికి భటులు వణికి పోతూ ఈయనగారే పైనున్నదని చెప్పారట. రాయలవారు గురువుగారి కాళ్ళమీద పడి
క్షమించమని వేడుకొని సంగతేమని అడిగితే, జరింగింది చెప్పి తాతాచార్యులవారు 
కళ్ళనీళ్ళ పర్యంత మయ్యారట. రామకృష్ణుని పిలిపించి బాగా తిట్టి కొరడా దెబ్బలతో సత్కరించి, ఇలాంటివి యికమీద జరిగితే పెద్ద శిక్షే పడుతుందని హెచ్చరించారట.


మేము తెగ నవ్వేవాళ్ళం 

"ఇదేంటిరా ......
పిల్లలని స్కూల్ కి దలడానికి ....
వాళ్ల "మమ్మీ" లు వస్తారు !!
కానీ...
పప్పూ గాడిని ....
స్కూల్ కి వదలడానికి .....
రొజూ వాళ్ల డాడీ వస్తారు..??
ఎందుకంటావ్?" అడిగాడు "సందేహం" గాడు
"హహహ....
ఒరేయ్...
అందుకే రా, మరి వాళ్ల డాడీ వస్తున్నారు.....

--((**))--
నీకు ఇంకా అమాయకత్వం పొలెదురా!!!!!" అన్నాడు "పిడుగు" 'గారు
మంత్రిగారూ! తమరేమీ అనుకోరంటే ఓ మాట!

ఏమీ అనుకోను, చెప్పవోయ్!

మీ కింద ఊడిగం చేసేవాడికి అప్పనంగా ఇరవై లక్షలు చేతిలో పెట్టి ఓ పదిమందిని రోజూ ఇస్తానని చెప్పి ఎం. పి గా పోటీ చేయమన్నారు,
అదంత అవసరమా అని?

ఓరి పిచ్చోడా! ఇంతకాలం నాతో తిరిగావు గానీ రాజకీయాలు వంట పట్టించుకున్న పాపాన పోలేదు.
గత మూడు సార్లు మనకు ఎదురు లేదు కాబట్టి నెగ్గుకొచ్చాము, ఇప్పుడా పరిస్థితి లేదు, ఇక్కడ సరిసమానముగా రెండు వర్గాలున్నాయి!
ఇప్పుడు మనది కాని వర్గము మనిషి పోటీ చేయబోతున్నాడు, ఆ వర్గానికి చెందిన ఈ నా అనుచరుడిని బరిలోకి దింపుతున్నాను, వీడికి, వీడి వర్గంలో మంచోడనే పేరుంది, వీడు వీడి వర్గం నుండి నాలుగో వంతు వోట్లు రాబట్టుకున్నా నా గెలుపు సునాయాసము!
--((**))--
󾁇󾓲󾁁ॐ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ॐ󾁁󾓲󾁇
👬మిత్రులకు శ్రేయోభిలాషులకు👬
󾀊☕శుభశుభోదయం శుభదినం☕󾀊
󾆟 మీకు మీ కుటుంబసభ్యలకు󾆟
🌞󾁉󾁂 "రథసప్తమి" శుభాకాంక్షలు󾁂󾁉🌞

సూర్యాష్టకం
(1).ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోzస్తుతే ||
(2)సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(3)లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(4)త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(5)బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(6)బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(7)తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(8)తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
(9)సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ ||
(10)ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా ||
(11)స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ||

నేటి కవిత
భావ రస మంజరి
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

వర్ణాలు వేరైనా ఒకటవ్వాలని
వలపులన్ని పంచుకొని బతకాలని
వలకు చిక్కక జీవించాలని
వద్దన్నా ప్రేమను బ్రతికించాలని
ఇరువురు చేరే నగరం

వెంబడించే నగర మృగాలు చిక్కి
వేడుకున్న, ఏడ్చినా ఫలితం లేక మ్రొక్కి
ఊరకుక్కల బారినుండి తప్పించుకొని
నగర బక్షకులను ఆశ్ర ఇంచే
వర్ధమాన వరులను వేరుచేసే
వలదన్నా వరుసకలిపి ముచ్చటించే
నక్క బుద్దులు నమ్మ బలికె
నవనితాన్ని అమాంతం మింగ చూసే
రాబందులు వచ్చి నవనితాన్ని నాకే
వేడి సెగలు కమ్ముకోగా కరగక తప్పక
చల్ల కుండ లాంటి నది లో జారే
ఆవురావురమంటూ
తిమింగలాలు చుట్టు ముట్టే 
బ్రతుకు తెల్వని చేపపిల్ల
వడ్డుకు చేరి గిల గిల కొట్టుకొని
కసాయివానికి చిక్కి ఆహారమయ్యే
ఇదేమి నగరం
--((**))--   

Tuesday 26 June 2018

Pranjali Prabha*

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయ నమ:

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
వద్దన్నా రాంద్రాన్వేషణా సక్తి ఎందుకు - యతి వినయంబు ఉన్నజాగర్త పడ రెందుకు
కార్యం సఫలం అవుటకు గర్వం ఎందుకు - సమాయంబు కాదంటూ త్రిప్పుటెందుకు
దర్శనం కోసం వస్తే అడ్డుపెట్టుటెందుకు - పెడమోము చూపి తిరస్కరించుట ఎందుకు
నీవు లోభంతో గదిమి వేయుట ఎందుకు - సమాధానము చెప్పక మౌనం ఎందుకు       

లిట్టి ప్రభుదుర్ణయపుఁ జేష్ట లెఱుగలేక
వెంబడించెడి వాడెపో వెఱ్ఱివాడు
దానికొడ బడ డింగిత జ్ఞానశాలి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


కన్నంబు ద్రవ్వి తస్కరు డింటివానికి, వాడు లేడని ముంతవైచి చనునె
తెరవాటుకాడు చింతించునే కట్టిన, బట్ట డుల్చిన మానభంగ మనుచు
వలబడ్డమెకము చూల్వహియించె నంచును, విడువంగఁజూచునే వేఁటకాఁడు
జారుండు పరకాంతశయ్యపై దారిచి, వావి గాదనిపల్కి వదలి చనునె
ఆత్మజను గుత్త రూకల కమ్ము నాతఁ
దరణమున నొసంగఁజూచునే యల్లునకును
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

నేటి కవిత 
భావ రస రంజరి 
రచయత:  మల్లాప్రగడ రామకృష్ణ  

కన్నంబు తవ్వి తస్కరుడు 
ఇంట దూరే  
మగవాడు లేడు మొత్తం 
దోచుకోరా తస్కరా
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు   

తస్కరుడు తెరచాటు చేరి 
కదిలించగా 
వెలువలూడ్చి దాహం తీర్చరా 
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు

తస్కరుడు వలలో చిక్కానే 
అనే భయముతో 
విడువరా నన్ను విడువరా  
తస్కరా, తన్ను తినకరా  
కళ్లుతెరచి ఉడాయించే తస్కరుడు

కలవరింతలు కాపు కాసి
భ్రమలు తొలగింప చేసి  
కలలో తన్మయత్వం చూపి 
హాయిగా నిద్రలో జారే 
--((**))--


నేటి కవిత  
భావ రస మంజరి
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఆకాశ వీధి: లో హాయిగా తిరిగేవు 
చల్లగా జారీ వర్షము కురిపించావా మబ్బు మామా 
తెల్లని వెన్నెలతొ తిమిరాలు తొలగించ
చల్లని గాలితో తడిలో ముంచవా మామా 

నీలాల గగనంలొ నిండుగా వెలి గేవు! 
కనుసైగ చేస్తున్నా కరిగి పావుటకు రావా మామా 
చల్లని వెన్నెలలొ సాగర తీరములొ 
ఉడుకు రక్తం తో ఉవ్విళ్లూరుతో ఉన్నాను మామా 

చలి గాలి కెగిరేను సరస మాడగ పైరు 
ఆకలి తీర్చి అలసట తీర్చుకో మబ్బు మామా 
ఊహలలొ విహరించె నామనసు నీకె 
త్వరత్వరగా వచ్చి తమకం తగ్గించు మామా 

వీణ మూగ బోయింది నీ వేడి కదలిక కోసం 
మదిలో తలిచా కనురెప్ప కదిలించు మామా  
పున్నమి రేయిది పూల పానుపులా పిలిచా  
నీ తుషార బిందువులను రాల్చి చల్లఁపర్చు మామ 

తెల్లచీరెలొఅందమే తళుకు మని ఉన్నా  
ఉరుములు మెరుపులు తగ్గించి చల్లపరచి పోమామా 


--((**))--


నేటి కవిత 
భావ రస మంజరి 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

1 . కలల్లో దాహం గమనించి 
      - కల్లోలాన్నీ తొలగించు 
     కనువిందు చూపు అందించి 
     - కొనలనాగు కోరిక తృప్తి పరచు

     నవ్వులతో నయనాల కదలిక 
     -హృదయ స్పందనవు మేలి కలయక
     నధరాల అమృతం మరువలేక 
     -విశ్రాంతి కల్పించి విందు చేయుచు          

    ప్రేమకు సమానమైన విద్య లేదు   
     -విద్యకు సమానమైన నేత్రము లేదు
    పతిదేవునికి వాక్కు మించినది లేదు 
    -సత్యవాక్కుకు సమానమైన తపస్సు లేదు 

    సుఖానికి మించిన తపస్సు లేదు 
     -తపస్సే సుఖానికి నాంది అనక తప్పదు
     అలుకలేని కాపురం అందమైనది కాదు 
    -స్వీయ తపనలు పతి కౌగిలింతకు నాంది

    మనసు, మాట, పని, ఒకే మాదిరి
    సర్వ కార్య సిద్ధికి ఇరువురిదీ ఒకేదారి 
   త్రికరణ శుద్ధిగా  ఏకమై బ్రతుకే దారి 
   అభ్యుదయమే హృదయానందానికి దారి 
             
      --((*))-- 

ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు 
అందాల ఓమామ నా చందమామ! 

తెల్లని వెన్నెలతొ తిమిరాలు తొలగించ 
నీలాల గగనంలొ నిండుగా వెలి గేవు! 

చల్లని వెన్నెలలొ సాగర తీరములొ 
చలి గాలి కెగిరేను సరస మాడగ పైట! 

ఊహలలొ విహరించె విను వీధిలొమనసు 
వీణలే మ్రోగగా మదిలోన నిను తలచి! 

పున్నమి రేయిది పూల పానుపు పిలిచె 
తెల్లచీరెలొఅందమే తళుకు మని మెరియ! 

శ్రీనివాసమూర్తి గంజాం 
26-6-18


శ్రీవారూ! నాకు రచయిత్రినవాలనుంది! 

నాకు సంబందించి 
నువ్వు గొప్ప రచయిత్రివే, 
ఇప్పుడీ విషయం లోకానికి తెలియాల్సుంది! 

కాస్త విడమరచి చెప్పొచ్చుగా! 
మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తెస్తాను! 

నువ్వు ఏదైనా పెళ్ళికి వెళ్ళావనుకో 
ఆ పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో కళ్ళకు కట్టినట్లుగా నాకు చెబుతూ కొసమెరుపుగా మగపెళ్ళివారి పెట్టుపోతలు మరీ మరీ చెప్పి, దానిని మన పెళ్ళితో ముడి పెట్టి, మావాళ్ళు నీకు చేసిన అన్యాయాన్ని పూస గుచ్చినట్లు వర్ణించి విచారంలో మునిగిపోతావు! 
ఎవరింటికైనా వెళ్ళావనుకో 
వాళ్ళ ఇంటిపై, ఆ ఇంటాయన చూపించే శ్రద్ద, 
ఆయన కారణంగా బాత్రూమ్, కమోడ్ 
ఎంత శుభ్రముగా వుంటాయో వర్ణించి, వర్ణించి, 
ఆ విషయాన్ని నాతో పోల్చి నేనొక్కడినే కాకుండా, నన్ను కన్న పాపానికి మా అమ్మనూ కలిపి 
నాకు కూడా తెలియని భయంకర రహస్యాలను కూడా జొప్పించి కడు రమ్యముగా దులిపేస్తావు!
--((**))--


గురువుగారూ! 
సముద్రపు నీళ్ళంత ఉప్పగా కన్నీళ్ళు ఎందుకు ఉంటాయో? 

సముద్రమంత బాధ గుండెల్లో ఉంటుంది కాబట్టి నాయనా!

--((**))--

మాష్టారూ!ఐదు వందలివ్వండి సార్, 
నాలుగు రోజుల్లో ఇచ్చేస్తా 

ఇంద! ఖచ్చితంగా ఇచ్చేయాలి సుమీ! 

ఎంత మాట! మీరు నా పాలిట దేముడంటే నమ్మండి! 
********************* 

ఎక్కువ డబ్బిచ్చేసావు ఆనందం 

500 తల్లి సార్, 50 పిల్ల సార్ 

*******×***** 

మాష్టారు! 20,000 అప్పివ్వండి సార్, 
పది రోజుల్లో తిరిగిచ్చేస్తా! 

ఇంద! 
*****************×* 

ఇవిగో సార్, తల్లి 20,000, పిల్ల 2000 
**×*********** 

మాష్టారు! నెలలో ఇచ్చేస్తాను, 5,00,000 అప్పివ్వండి సార్! 

మాష్టారు తల్లి,పిల్లని ధ్రుష్టిలో పెట్టుకుని ఇచ్చేసారు 5,00,000 
********* 

ఏమయ్య ఆనందం! ఆర్నెల్ల పోద్దైంది, 
తల్లీ లేదూ, పిల్లా లేదు! 
నీకిదేమైనా ధర్మమా చెప్పు! నువ్వు అదనంగా ఇచ్చే సొమ్ముకి ఆశపడి, మా ఇంటావిడ నగలు తాకట్టు పెట్టి మరీ నీకిచ్చానే 5,00,000 

" మూణ్ణెలైంది తల్లి పోయి! 
ఆ బాదలో నేనున్నాను సార్ 
ఇంక పిల్ల వూసే లేదు సార్! "

--((**))--

నేటి కవిత 
భావ రస రంజరి 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

వాకిట్లొ ముగ్గూలె, లోగిల్లొ చిందూలె, 
సరదా సరదాకి ముచ్చట్లే  
చీకట్లొ ఆట్లాటె, అంగట్లొ అప్పుల్లె, 
ముద్దు మురిపాల ముచ్చట్లే  
తాకట్లొ ఆస్తుల్లు, సందట్లొ ఆర్భాటు
విద్య ఆర్భాట ముచ్చట్లే 
ఎండల్లొ చన్నీళ్ళు, వాణల్లొ వేడ్నిళ్లు,
మూడు నాళ్ళ ముచ్చట్లే 
నిద్రాకి దుప్పట్లు, కుంపట్లొ మంటళ్లు, 
ఒకరి కొకరు ముచ్చట్లే 
అత్తింట్లొ ముచ్చట్లు, పుట్టింట్లొ చప్పట్లు 
నీకు నాకు మధ్య ముచ్చట్లే 

ఈ పూట కేమేమి,ఈ రాత్రి వెన్నెల్లొ 
నవ్వుల పువ్వుల ముచ్చట్లే 
నవ్వు ల్లె పువ్వుల్లొ,  నావెల్గు నీవేగ
నలిగి కరిగే ముచ్చట్లే 
నాతృప్తి నీ వేగ, ఈ వేష మెచ్చేన 
చీకటి వెల్తురు ముచ్చట్లే 
ఈ మాట ఏ తీర్పు, ఈ ఆశ ఏ మాయ
సరుబాటు ముచ్చట్లే 
ఈ బొమ్మ నీదేను, పొందాలి చీకట్లొ 
ఏకపరాకాష్ట ముచ్చట్లే
ఇకచాలు నిద్రవస్తుంది      
వలువలు కట్టుకొని నిద్రపో 
--((**))--


హరహర శంకర

జయజయశంకర వరసుత

అభయ అభిరామ సుధావర

విరిహరి సుమసమ పరిమళ

నందనానందుల కౌశలసుధామ

పావనవనికి పావనవనమాలి

భావనావననీ

సుసృజనభాషితములు.🌹🌹


**** చరవాణి స్తోత్రమ్ ****
*********************
ప్రథమం వాయుభాషణం|
ద్వితీయం యంత్ర గణనం|
తృతీయం ఛాయాచిత్రాణి |
చతుర్థం క్రయ విక్రయం |
పంచమం అంతర్జాలిన్యాం |
షష్టమం క్రీడా విలాసిని |
సప్తమం చిత్ర దర్శిని |
అష్టమం ఖండాతర దర్శినీ |
నవమం సర్వప్రాంత విహారిణీ |
దశమం మార్గదర్శిని |
ఏకాదశం ముఖపుస్తకే |
ద్వాదశం వ్యర్థ సందేశః |
ఇతి ద్వాదశ నామానీ |
చరవాణీ నమోస్తుతే||

చరవాణీ నమస్తుభ్యం |
సర్వ వార్తా సమన్వితః|
చరాచర స్వరూపేణ |
విద్యుత్ గ్రాస భక్షిణీ||1||

చిత్రగ్రహణ రూపేణ|
యంత్ర గణన రూపిణీ |
క్రయ విక్రయ సర్వాణీ |
గృహ ప్రాంగణ దర్శిని||2||

సర్వ స్తోత్రాణి గానాని |
కర్ణాంతరాళ శ్రావణి |
దూర ప్రాంతేషుమార్గాణి |
అంతర్జాల సందర్శిని ||3||

మధ్యమాంగుళ తర్జన్యా|
స్పర్ళ మాత్రేణ శోభినీ |
సర్వ మానవ హస్తేన |
అలంకారేణ దర్శనం॥|4॥

సర్వక్రీడా సముత్పన్న |
సర్వ వస్తు విలక్షణ|
దూరభారాణి విచ్ఛేద |
వాయుమార్గ సంచారిణీ ॥5॥

ఖండాంతర నివాసిన్యాం|
భాషణేషు సమీపతః |
వాయు సంకేత గ్రాహేణ|
సమీపేన సందర్శిని ॥6॥

వినా మానవ హస్తేన |
క్షణక్షణ విచారిణః |
చరవాణి సభా మధ్యే |
సంభాషణే విశేషతః ॥7॥

కార్య కారణ సంబంధ |
మధ్యే వాయు విహారిణీ |
సందేశాని సంకేతాణి |
పురోగతి నిరోదకః ॥8॥

వయో విత్తం జ్ఞాన శూన్యం|
లింగ భేదాన్యేవచ |
చరవాణీ వినాహస్తే |
పశు రూపేణ గణ్యతే ॥9॥

జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|
గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |
యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ|
దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ ॥ 10 ॥

వాగ్భూషణం చరభాషణం|
చరవాణీ హస్త భూషణం|
కర్ణే వార్తాయాం శ్రవణం |
చరవాణీ నమోనమః ॥11॥

కంపనం ఆగమనేన |
సూక్ష్మ ప్రాణి వినాశనం |
సంభాషణేన సర్వాణీ |
వాయు మార్గేన గమ్యతే ॥12॥

సంఖ్యా మాత్రేణ ఆహ్వానం |
సంఖ్యా ధీనేన వర్తినీ|
వ్యర్థేన కాలక్షేపాయ |
కుర్వంతి వ్యర్థ భాషణం ॥13॥

జ్ఞప్తి పత్రాణి సంయుక్త |
నామ పత్ర సమన్విత |
ఇదం పత్ర వినాశేన |
సర్వ సంబంధ నాశనం ॥14॥

#$ ఫలశృతి* *#$
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ప్రయాణే భాషణేనస్య |
ప్రమాదానిచ లభ్యతే |
వైద్యశాలాయాం గచ్చంతీ |
పరలోకం చ లభ్యతే ॥

చరవాణీ యో జానాతి |
అనారోగ్యంచ లభ్యతే|
నిత్య ప్రయోగ మాత్రేన|
మృత్యు మార్గం చ గమ్యతే||
***************ఎవరు రాసారో తెలీదు కాని బాగుంది.



సిగ్గేలనే బాల సిగ్గేలనె మదినేలు మాధవుడు
మనసార నిను పిలువ సిగ్గేలనే బాల సిగ్గేలనె!

సిగ్గు తో వాలగా సింగారి నీ కనులు
సిగలోని మొగ్గలు విరబూసె నవ్వులై!

సుకుమారి సుందరి, సోయగాలను చూచి
కోరింది నా మనసు కోసరుగా ఒక ముద్దు!

హద్దు లేదే చెలియ యిద్దరి మధ్య నిక
హత్తు కొనవే హృదిని అరమరికలే వద్దు!

ప్రణయా రాధన వేళ పంతాలు యేలనె
పంచు కోరావె మన ప్రేమ సామ్రాజ్యము!

శ్రీనివాస మూర్తి గంజాం
25-6-18


--((**))--

ఆవుపాలు నెయ్యి నైవేద్యమిడినారు 
కర్పూర హారతినె జూపినారు 
సుప్రభాతము ముగిసె భక్తులెల్ల తనియ 
తిరుమలగిరివాస ఓ శ్రీనివాస! 

సుప్రభాతగానం పూర్తికాగానే స్వామికి నైవేద్యమిచ్చి, కర్పూర హారతిని చూపిస్తారు. ఇదంతా తెరవెనుక జరుగుతుంది. సుప్రభాత సమయంలో లోపల అర్చకులు, జియ్యంగార్లు మాత్రమే ఉంటారు. వారు దీపాలను సరిజేసి, కొత్తదీపాలు వెలిగించి, స్వామివారి దోమతెర తొలగించి, తూగుటుయ్యలపైన పవళించిన స్వామిని మేల్కొలిపి, ఆ భోగశ్రీనివాసుని స్నపనమండపం నుండి గర్భగృహంలోని జీవస్థానానికి చేరుస్తారు. స్వామివారి పరుపు, మంచాలను గొల్ల బయటకు తెచ్చేస్తాడు. ఇవన్నీ పూర్తయ్యాక భక్తులకు స్వామి దర్శనం కలుగజేస్తారు.