Monday 29 October 2018


సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు!
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ 
ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే కానీ... 
తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు. 
ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం 
తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే!
దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో 
మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ 
లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ 
భావించాయి. తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా 
భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం 
రాకూడదన్న వరాన్ని పొందారు.
వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఏకంగా స్వర్గం 
మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు 
శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు. కానీ ఆ 
ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ
సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.
శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని 
గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన 
కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన 
తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న 
కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు.
ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి 
కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద 
కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి 
సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం 
చేశారు.
కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం 
శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం 
ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు 
యుద్ధానికి బయల్దేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే 
మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.
శూరపద్ముడు ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే
ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు 
కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట.
దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి. 
నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు 
కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది
స్వస్తి! (శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి సౌజన్యముతో)

Sunday 28 October 2018

ఆరాధ్య లీల



ఆరాధ్య లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

సుధలు పొంగేటి యధరాలు పిలుస్తున్నాయి 
నిదుర పోయేటి నెలవంక కలువమన్నాది       
ఎదురు చూసేటి నయనాలు పిలుస్తున్నాయి 
బదులు రానట్టి మరు మాయ కలువమన్నాది 

మదిని రేపేటి కధనాలు పిలుస్తున్నాయి 
కదలి రావాలి మను బేల కలువమన్నది    
ఎదను పర్చాను మునగంగ పిలుస్తున్నాయి 
బెదురు పోవద్దు మనసంత కలువమన్నది        

మనసు రమ్మంది రణరంగ పిలుస్తున్నాయి    
వయసు పిల్చింది తనువంత కలువమన్నది  
మమత చూపంగ మమకార పిలుస్తున్నాయి  
సోగసు రాగాలు పిలవంగ కలవమన్నది  

రసకేళి ఆడుట - మాధుర్యం పంచుట 
సంతసము పొందుట - సహచరించుట  
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

--((**))--




ఆరాధ్య ప్రేమ లీల (మనోరమ)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఉషోదయ కిరణాలు భాసించె సుందర సుమాలెన్నో   
ఉహాపర విజయాలు సాధించె వందన కళ  లెన్నో    
ఉపాసన రుతురాగ హేమంత  పుష్పము హొయలెన్నో  
ఉమాపతి మురిపాల సౌగంధ పార్వతి ప్రేమలెన్నో 

సుముద్దుల సరి చేసె చామంతి పుష్పము రంగులెన్నో 
సుపొద్దుల  కనులారా సేవించు కల్పపు శోభలెన్నో          
సుహద్దుల ప్రతి గుండె ప్రేమించు ధన్యపు భోధలెన్నో 
సుపద్దుల  ఉదయానె ధర్మంగ  వ్రాయుట రోజులెన్నో 

సుహాసిని సుమమాయె ఆశించె సౌక్యపు సేవలెన్నో     
విలాసిని అనురాగ ఆనంద భాష్పపు  ప్రేమలెన్నో 
వినోదిని  వినురాగ వేదాంత వాద్యపు  త్రోవలెన్నో 
మనోరమ మనువాద మాధుర్య మాంద్యపు మాత్రలెన్నో 


--((**))--  




ఆరాధ్య ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  



Street Art
ఆరాధ్య లీల (కాలచేక్రం) 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

1. పనికి రాని వారు ఉండరు 
    పనిచేయించుకొనే వారు ఉండరు
    గడియారంలా కదులుతుంటారు
    గడియారంలా రెండుసార్లు కలుసుకుంటారు 

పెద్దముళ్లు, చిన్న ముల్లు లా 
పుణ్య, పాపములులా 
స్త్రీ పురుషులు ఏకమయ్యేవిధానములా 
కాలచక్రం గమనించా లంటారు 

2 పేదరికంలో సలహాలిస్తుంటారు 
    సంపాదనలో ఆశపెడుతుంటారు 
.   సంపాదించాక దొచు కుంటారు  
    మన:శాంతి లేకుండా చేస్తారు 

స్నేహితులు శత్రువు లయ్యేలా 
శత్రువులు స్నేహితు లయ్యేలా 
ఆరోగ్య సంరక్షణ కరు వయ్యేలా   
ధనం చుట్టూ తిరిగే వారుంటారు 

3. నవ్వి నవ్విస్తూ ఉండ మన్నారు 
    నవ్వులో అపార్ధాలు తొలుగు తాయంటారు 
    నవ్వుతో ఆరోగ్యమే మార్పంటారు
    నవ్వుతు బతికి నవ్వుతూ చావాలంటారు 
     
మకరందాన్ని పొందేందుకు నవ్వాలా
శత్రువు పోయాడని నవ్వాలా 
భార్య కోరికతో ఏడుస్తూ నవ్వాలా 
నవ్వేవారిని చూసి మోస పోవద్దంటారు 

4 .దొరికేది దోచుకో మంటారు  
    దోరకంది దాచుకోమంటారు 
    దొరికేది ఎక్కువకాలం ఉండదంటారు 
    ఎక్కువకాలం ఉండేది దొరకదంటారు

దొరికిన దానితో సంతృపి చెందాలా
పొందిన దానిలో సంతృపి వెతకాలా
శాశ్వితమనేది లేదని తెలుసుకోవాలా
ఉన్నదానితో తృపి చెందితే గొప్పంటారు 

5. జరిగే వణ్ణి మనమంచికే అంటారు 
    జరగని వణ్ణి మనవి కావంటారు        
    మంచి చెడు, చూడాలంటారు     
    ప్రేమ, స్నేహం తెల్సుకో మంటారు 

మానవత్వాన్ని మరచినవి చూడాలా 
మానవత్త్వమే లేదని పోరాడాలా 
మనసుని మార్చుకొని బ్రతకాలా  
ప్రతిదీ తేలిక భావం ఉంటే మంచి అంటారు 

6. రోగాలు కుందేలులా వస్తాయంటారు 
    రోగాలు తాబేలులా పోతాయంటారు 
    ధనం తాబేలులా  వస్తా యంటారు    
    కుందేలులా పోతా యంటారు 

వెంటనే వచ్చే రోగం తాగించాలా 
నిదానంగా పోయేరోగాన్ని తొలగించాలా 
వచ్చిన ధనం వేగంగా పోతుందని తెలుసు కోవాలా 
ధనమే రోగమని తెలుసు కొంటె మేలంటారు 

7. చిన్న మాటలో మర్మం తెల్సుకోమంటారు 
    మాటల ఆనందాన్ని పంచు కోమంటారు 
    పెద్ద మాటాలు వద్దన్నా వస్తాయంటారు 
     మాటలను తూటాలుగా వాడే వారుంటారు

చిన్న పిల్లల మాటలు అనుకరించాలా 
చిన్న మాటలని ఉపేక్షించాలా
మాటల పట్టింపు లేకుండా ఉండాలా       
మాట మాట పెరిగితే జీవితమే లేదంటారు 

8. సుఖాలలో దేవుడ్ని గమనించరు 
    కష్టాలలో దేవుడేమి చేయలేదంటారు 
    కష్టసుఖాలు కావడి కుండలంటారు  
    కోరికలను తీర్చేది దేవుడని తెలుసుకోలేరు 

హమేషా దేవుణ్ణి ప్రార్ధిస్తూ ఉండాలా
దేవుడే సర్వం ఇస్తాడని ఉండాలా 
శ్రమకు తగ్గ ఫలితమని తెల్సుకొని ఉండాలా 
దేవుడిపై నమ్మకమే బ్రతుకంటారు   

--((**))--



Bramalikhitam -2


*బ్రహ్మలిఖితం 23* (ఆఖరి భాగం)

రచన: మన్నెం శారద గారు

చూస్తూ చూస్తూ కుక్కని వదిలేయలేను. అలాగని కుక్కతో కాపురం చేయలేను. నేనేం చేయను.” అంది బాధగా.
జనంలో కొంతమంది వస్తున్న నవ్వు ఆపుకున్నారు.
“నేనెప్పుడో చెప్పేను నీకు. ఇదంతా కట్టు కథ!” అన్నాడు ఓంకారస్వామి.’
“ఎందుకు చెప్పలేదు. మీరు నా భర్త గత జన్మలో పెంపుడు కుక్కని చెప్పేరు. గత జన్మలో వెంకట్ నా భర్తని చెప్పి అహోబిళంలో నా పెళ్ళి కూడా చేయించేరు. కాని అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. నేనిప్పుడేం చేయాలి?” అంటూ ఉక్రొషంగా లేచింది ఈశ్వరి.
“అబద్ధం!” అన్నాడు ఓంకారస్వామి.
“ఏంటబద్ధం! అహోబిళంలో అభుక్తేశ్వరస్వామిని కలవమని చెప్పడం అబద్ధమా?”
“అంతా అబద్ధం.”
“లేదు అంతా నిజం. నేను ఈ సంగతి తెలియక వెంకట్‌ని పెళ్లి చేసుకున్నాను. ఓంకారస్వామికి సమర్పించుకోవడానికి చెరొక లక్ష అర్జెంటుగా తీసుకొస్తేగాని మమ్మల్నేలుకోనని చెప్పి పంపించేసేడు వెంకట్” అంది జనంలోంచి లేచిన కనకమహాలక్ష్మి.
“నువ్వెవరివో నాకసలు తెలియదు.” అన్నాడు ఓంకారస్వామి.
“పోనీ వీడయినా తెలుసా?” అంటూ ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చేడు ఎస్.ఐ. ఒకతన్ని.
ఓంకారస్వామి దిగ్భ్రాంతిగా చూసి “ఎవరతను?” అనడిగేడు.
“అహోబిళంలోని దొంగ భుక్తేశ్వర స్వామిగాడు వీడే. గతంలో వీడు ఇక్కడే చిల్లర దొంగ. వీడు అతి సన్నిహితుడైన రాజుగాడి తమ్ముడు. వీడే సాక్షాత్తు వెంకట్‌కి, ఈశ్వరికి పెళ్ళి చేసింది” అన్నారు డిజిపిగారు లేచి.
ఓంకారస్వామి వేషంలో ఉన్న నారాయణ నీళ్ళు కారిపోయేడా మాతలు విని.
“ఇదంతా ఏదో కట్టు కథలా వుంది. గిట్టని వాళ్లు నా మీద పన్నుతున్న పన్నాగం. దేవుడి మీద నిందలేస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదు” అన్నాడు మేకపోతు గాంభీర్యం వహిస్తూ.
“ఏం జరుగుతుందో చూద్దామనే స్వయంగా వచ్చేను. ఈ ఫోటో చూడు!” అన్నాడు దిజిపి ఒక ఫోటో అతనికందిస్తూ.
ఓంకారస్వామి దాన్నందుకున్నాడు.
అది సాక్షాత్తు అతనిదే. జైల్లో నారాయణగా వున్నప్పటి ఫోటో.
అతను పేలవంగా డిజిపిగారివైపు చూశాడు.
“యూ రాస్కెల్. కొన్నాళ్ళు నిత్య పెళ్ళికొడుకు వేషమేసి దొంగ పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల గొంతులు కోసేవ్. ఇప్పుడు స్వాములవారి రూపమెత్తి దద్దోజనాలు, చక్రపొంగళ్లు తిని తెగ బలిసి పెళ్లి మీద పెళ్ళిళ్ళు చేయిస్తున్నావు. పద నిన్నిక పర్మనెంటుగా శ్రీకృష్ణ జన్మస్థానంలొ పెట్టేస్తాను. అరెస్ట్ హిం” అన్నారు డిజిపి ఉగ్రంగా.
ఓంకారస్వామి రూపంలో నారాయణ చేతులకు బేడీలు పడ్డాయి. వెనువెంటనే అతనికి సహాయపడిన రాజుని, సంపెంగిని కూడా అరెస్టు చేసేరు.
“ఏడి ఆ వెంకట్ గాడేడి?”
అప్పుడందరూ హాలంతా గాలమేసినట్లుగా చూశారు.
అప్పలనరసమ్మ కంగారుపడుతూ “దొంగ సచ్చినోడు. తప్పించుకున్నాడు బాబు. నాను సెవులు మెలేసి అట్టుకొచ్చినాను. కల్లమీన గూండారేసి పారెల్లిపోనాడు పాపిష్టెదవ” అంది.
“ఎక్కడికి పోతాడులే. ఇరవై నాలుగ్గంటల్లో పట్టేస్తాం” అంటూ డిజిపిగారు కేయూరవల్లి దగ్గరకొచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పేరు.
“నాదేముంది సర్! సమయానికి మీరొచ్చి సహాయపడ్డారు. లేకపోతే ఈ పిల్ల జీవితం అన్యాయమైపోయేది. ” అంది ఈశ్వరిని చూపిస్తూ.
ఈశ్వరి అపరాధిలా తల దించుకుంది.
“జరిగింది మరచిపో. హాయిగా భర్తతో కాపురం చేసుకుని సుఖంగా వుండు. ప్రస్తుత జన్మని నరకం చేసుకుంటూ పూర్వ జన్మల గురించి ఆలొచించడం దేనికి? నీలాంటి అమాయకులున్నంతవరకు ఇలాంటి దొంగస్వాములు పుట్టుకొస్తూనే వుంటారు.” అని ఈశ్వరిని మందలించేరు డిజిపి గారు వెళ్తూ వెళ్తూ.
ఈశరి పశ్చాత్తాపంతో కన్నీళ్ళు కార్చింది.
“నీకోసం నా జీవితంలో మొదటిసారి నటించేను. నువ్విక మారినట్లేనా?” అంది డాక్టరు ప్రభంజన ఈశ్వరి వంక నవ్వుతూ చూసి.
ఈశ్వరి నీరు నిండిన కళ్లతో నవ్వింది.
“హమ్మయ్యా ఇక మీ ఆవిణ్ణి తీసుకెళ్ళొచ్చు. నే చెప్పిన విషయాలు మరచిపోకండి” అంది ప్రభంజన కుటుంబరావుతో.
అందరూ ఎవరిళ్లకి వాళ్లెళుతుంటే కేయూర ఒంటరిగా తన కారులో బయల్దేరింది లిఖిత గురించి ఆలోచిస్తూ దిగులుగా.
తననే క్షణమన్నా పోలీసులు వెంటాడి పట్టుకుంటారని తెలిసిన వెంకట్ ఆటోలో అతివేగంగా రైల్వే స్టేషనుకెళ్ళి కదులుతున్న రైలెక్కేసేడు.
రైలు వేగం పుంజుకుంటుండగా అతను మెల్లగా కంపార్టుమెంటులోకి నడిచేడు. ఆ రైలెక్కడికెల్తున్నదో అతనికి తెలియదు. ఎవర్నన్నా అడిగితే తనని అనుమానించే అవకాశమున్నదని అతడు ముందు ముందుకి నడుస్తూ అక్కడ కిటికీ వైపు కూర్చుని శూన్యంలోకి చూస్తున్న లిఖితని చూసి షాక్కొట్టినట్టుగా వెనక్కి అడుగేసేడు.
నిజంగా ఆమె లిఖితేనా?
తను పొరబడ్డాడేమో?
అతను ఆమె తనని చూడకుండా జాగ్రత్తపడుతూ మెల్లిగా మరోసారామెను పరీక్షించి చూశాడు.
నిస్సందేహంగా ఆమె లిఖితే.
కేరళ కీకారణ్యాలలో ఖచ్చితంగా చచ్చిపోయి వుంటుందనుకున్నాడు తాను.
కాని.. తన అంచనాలని తారుమారు చేస్తూ ఆమె పశ్చిమ కనుమల నుండి తూర్పు కనుముల వైపు ప్రయాణం చేస్తోంది.
ఇందులో ఏదో విశేషముండి ఉంటుంది
అదేదో తాను తెలుసుకొని తీరాలి. లేదా తనని పోలీసులకి పట్టిచ్చే పథకం వేసిన కేయూరవల్లి మీద పగ తీర్చుకోవాలను కుంటే ఆమె నీ అడవుల్లోనే భూస్థాపితం చేయాలి. అలా ఆలోచిస్తూ ఆమెకి మరోవైపుగా కూర్చున్నాడు వెంకట్.
రైలు రెండు కొండ కొనలకి కట్టిన ఊయలలాంటి సస్పెన్షన్ బ్రిడ్జిమీద కొండచిలువలా పాకుతూ కలుగులోకి దూరుతున్న పాములా త్రవ్విన కొండగుహలోకి వెళ్లి బయటకు వస్తోంది. మళ్ళీ అఘాతమైన లోయ. దాని మీద ఊగిసలాడే బ్రిడ్జి. క్రిందకి తొంగి చూస్తే లోతెంతో తెలియని చీకటి పరచుకున్న అడవి. కిటికీ పక్కనే సందేశాలు మొసుకొస్తున్న మేఘశకలాల పరుగులు.
మనసులో ఏ ఆలోచనలూ, బాధలూ లేకపోతె రైలులో అరకు ప్రయాణమంత థ్రిల్ మరొకటి వుండదు.
లిఖిత తండ్రి గురించి ఆరాటంలో ఆ ప్రయాణాన్ని ఆనందించలేకపోతోంది.
రైలు వెళ్తుండగా సన్నని తుంపరలాంటి వర్షం ప్రారంభమైంది.
సాయంత్రం మూడు గంటలకే చీకటి పడినట్లుగా తయారైంది వాతావరణం.
మరి కాస్సేపటికి రైలు బొర్ర గుహలు అని బోర్డున్న స్టేషనులో ఆగింది. అక్కడొక చిన్న స్టేషను తప్ప చుటూ అడవే కాని ఊరేం కనిపించడం లేదు.
లిఖితకి అక్కడ దిగాలంటేనే భయమనిపించింది.
ఎలాగో మనసుకి నచ్చచెప్పుకొని రైలు దిగింది ఆమె దిగడం చూసి వెంకట్ కూడా దిగేడు. ఆమెకి కనిపించకుండా అనుసరిస్తూ.
లిఖిత వర్షంలో తడుస్తూ స్టేషన్ బయటికొచ్చింది. ఎటెళ్లాలో, ఎవరిననుసరించాలో తెలియడం లేదు.
చుట్టూ వాతావరణం నీటిలో ముంచి ఆరేసిన నల్లని గుడ్డలా వుంది. ఎప్పటికీ ఎడతెగని వర్షపు నీటిని పీల్చిన చెట్లు భారంగా వూగుతున్నాయి.
అక్కడే బీడీ కాలుస్తూ నిలబడ్డ ఒక కోయ మనిషి మీద పడింది లిఖిత దృష్టి. అతను శబరిమలై వెళ్తుండగా తమతో ప్రయాణం చేసినవాడు.
లిఖితకు అతన్ని చూసి ప్రానం లేచొచ్చినట్లయింది.
వెంటనే అతని దగ్గరగా వెళ్ళి “బాగున్నావా?” అనడిగింది నవ్వుతూ.
అతను మొదట లిఖితని చూసి బిత్తరపోయేడు.
“ఏంటి సిన్నమ్మా నా మీన నిగా ఏసావేంటి? ఇక్కడిదాకా వొచ్చేవు?” అన్నాడు.
“అదేం లేదు కానీ. నువ్వేంటి భద్రాచలం అడవిలో వుంటానని ఇక్కడ ప్రత్యక్షమయ్యేవు. “అనడిగింది చొరవగా.
“భద్రాచలం చింతపల్లి సీలేరు ఇయ్యన్నీ అడ్డదారిన దగ్గరే బొట్టీ. నాను కట్టుకున్న దానూరు ఇక్కడే. అద్సరే ఏటి వానలో పడవలా తిరగుతున్నావు. ఏదైనా అడవుల మీన బుక్కు రాస్తన్నావేంటి?” అన్నాడు కోయదొర నవ్వుతూ.
“అదేం లేదు. ఇక్కడ కపాల బ్రహ్మని ఒక గొప్ప సాధువున్నాడంట. నీకు తెలుసా?”
కొండ దొర గడ్డం బరుక్కుని “సాధువా! కాసాయ గుడ్డలు కట్టినోల్లు బోల్డంత మందుంతారు అడవుల్లో. మరి నీక్కావాల్సినోడెవరో?” అన్నాడు.
లిఖిత అతనివైపు నిస్పృహగా చూస్తూ “అతనెవరితోనూ మాట్లాడట. ఏదో కొండ మీద. గుడి దగ్గర..”
“ఆయనా.. తెల్సులే. నేన్ జూపిస్తా. ఈ రోజుకి మా గూడెంకి రా. మా ఆడది సూసి మురిసిపోతది. కాస్త జుంటి తేనె తగి, జింక మాంసం తిందువు గాని” అన్నాడు కొండ దొర మధ్యలోనే అందుకొని.
“లేదు. అంత టైము లేదు. తిరిగొచ్చేటప్పుడొస్తాను. ముందు నాకు దారి చూపించు” అంది లిఖిత గాభరాపడుతూ.
“ఆర్నెల్లు నవారల్లి అర్ధగంటలో మంచం ఇరగదీసినట్టు ఏంటంత తొందరపడుతన్నావు బొట్టీ అసలు కతేంటి?” అనడిగేడు కోయదొర.
“పద నడుస్తూ చెబుతాను”.
ఇద్దరూ అక్కడే టీ తాగి అడవి దారిన నడక సాగించేరు.
నేలంతా తడిచి జారుతున్నది.
“భద్రం! పాములుంటాయి” అంటూ హెచ్చరించేడు కోయదొర హడావుడిగా నడుస్తున్న లిఖితని.
పాములే కాదు పులి ఎదురొచ్చి నిలబడినా భయపడే పరిస్థితి కాదామెది. తెల్లారితే కపాల బ్రహ్మ సమాధవుతాడు. అసలు తన తండ్రి అతన్ని కలిసేడో లేదో. ఎలాగైనా తండ్రిని వెంటనే కలవాలన్న పట్టుదల ఆమెకి ఎనలేని శక్తిని ఇస్తోంది.
“ఇంతకీ సంగతి సెప్పేవు కాదు బొట్టే. అలుపన్నా తీరతది. అసలు సంగతి సెప్పు”
లిఖిత తన తండ్రి పట్టుదల, వైఫల్యం, కపాల బ్రహ్మకి తెలిసిన మృతసంజీవినీ విద్య, తండ్రి తిరిగి అక్కడికెళ్ళడం అన్నీ క్లుప్తంగా చెప్పింది. కోయదొర ఆ కథంతా విని ఆశ్చర్యపోయేడు.
కోయదొరతో పాటు రహస్యంగా తను చెప్పిన కథని తనని వెంబడిస్తున్న వెంకట్ కూడా విన్న సంగతి ఆమెకి తెలియదు.
*****
ఆ అర్ధరాత్రి కేయూర మనసు మనసులో లేదు. ఏదో విపత్తునూహించినట్లుగా మనసు ఆటుపోట్లకి గురవుతున్న సముద్రంలా అల్లకల్లోలమవుతున్నది. ఎంత ప్రయత్నించినా నిద్రని నెట్టేస్తున్నాయి కళ్ళు.
వేసుకున్న ట్రాంక్విలైజర్స్ ఏ మాత్రం పని చేయడం లేదు.
ఆమె అస్థిమితంగా బాల్కనీలో కొచ్చి నిలబడింది.
తను ఈశ్వరి జీవితాన్ని చక్కబరచగల్గింది. ఓంకార స్వామి దొంగవేషాలు కట్టించగల్గింది. మతి చెడి దొంగస్వాముల మీద పుస్తకాలు రాసి ప్రజల్ని పక్కదారి పట్టించొద్దని ప్రొఫెసర్ మల్లన్నకి బుధ్ది చెప్పగల్గింది. కాని.. ఆ వెంకట్‌ని పట్టుకోలేక పోయింది. అన్నిటికన్నా తన కన్నకూతురి సమాచారం ఏ మాత్రం తెలుసుకోలేకపోయింది.
లిఖిత వెంకట్‌గాడు కూసినట్లు.. ఇక తిరిగి రాదా? తనని రక్షించే వారెవరు?
అలా అనుకోగానే ఆమె కళ్లు నీటితో మూసుకుపోయేయి. దుఃఖం జలపాతంలా బయటికి దూకింది. వెక్కిళ్ళు తెలియకుండానే తన్నుకు రాసాగేయి.
అలా ఎంతసేపు గడిచిందో..!
నెమ్మది నెమ్మదిగా మనసుని మూసేసిన కారు మబ్బులు కరిగి దుఃఖం ఉపశమించింది.
కళ్లు కడిగిన నందివర్దనాలయ్యేయి.
ఎదురుగా ముసిరిన మసక తొలగి గోడకి తలిగించిన నిలువెత్తు సాయి సాక్షాత్కరించేడు. మనసుకేదో ధైర్యం లభించి నట్లయింది. వెంటనే నందనవనం సుబ్బరాయశర్మగారి ప్రవచనాలు, పలుకులూ గుర్తొచ్చేయి.
ఆమె పెదవులు వాటిని ఉచ్చరించసాగేయి.
అంధకార గుహాంతరంబున
అరయరానిది సాయి నామము
సంధ్యకాలము నందు దోచే
సాక్షి యీ శ్రీ సాయి నామము
ధర్మరూపము దాల్చి సర్వము
తానెయైనది సాయి నామము
కర్మచే సాధింపనేరని
మర్మమీ శ్రీ సాయినామము.
ఆమె ప్రార్ధనలో వుండగానే ఫోను రింగయింది. కేయూర వెళ్లి రిసీవర్ అందుకొంది.
“సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్. నేను డి.జి.పి ని మాట్లాడుతున్నానమ్మా. వెంకట్ కిరండయిల్ పాసింజరెక్కి అరకువైపు వెళ్లినట్లుగా మన పోలీసులు తెలుసుకున్నారు. దారి పొడుగునా అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్‌లెస్ మెసేజ్‌లు పంపించేం.
మీరు సంతోషపడే మరో విషయం చెప్పమంటారా?”
“ఏంటి సర్ అది?” ఎంతో ఉద్విగ్నతకి లోనవుతూ అడిగింది కేయూరవల్లి.
“మీ అమ్మాయి లిఖిత్ కూడా తూర్పు కనుమల అడవుల్లోకి వెళ్ళినట్లుగా కొంత ఆధారాలు దొరికేయి. వెంకట్ ఆమెని వెంబడించేడేమోనని అనుమానంగా ఉంది. అయిన ఇంకా పూర్తి వివరాలు రాలేదు. మీరేం వర్రీ కాకండి. అమ్మాయిని భద్రంగా మీకప్పగించే బాధ్యత మాది.”
“థాంక్యూ సర్. థాంక్యూ” అంది కేయూర కంపిస్తున్న స్వరంతో రిసీవర్ క్రెడిల్ చేస్తూ.
ఎదురుగా వున్న సాయి మొహంలో ఒక దివ్య కాంతి కనిపించిందామె కళ్లకి.
ఊరకుండిన సర్వజగముల
నూపు చున్నది సాయి నామము
తేరి చూడగ రాక వెలిగే
తేజమీ శ్రీ సాయి నామము.
*****
బొర్రా గుహలకి రెండు కిలోమీటర్ల అవతలగా వున్న అరణ్యంలో వున్న ఓ కొండ దగ్గరకి చేరుకున్నారు లిఖిత, కోయదొర.
చిన్న పెన్ టార్చి సహాయంతో అడవిలోని కాలిబాట వెంట పాముల్ని, ఇతర వింత వికృత జంతువుల్ని తప్పించుకొని అక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి పది గంటలు దాటింది.
“ఇప్పుడేటి సేద్దాం. రేపొద్దున్నెక్కుదామా కొండ” అన్నాడు కోయదొర ఆయాసంతో రొప్పుతున్న లిఖితతో.
“లేదు. తెల్లారితే ఆయన సమాధయిపొతాడు. అసలు మా డేడి ఇక్కడికి చేరుకున్నారో లేదొ!” అంది వేదనగా లిఖిత.
సరిగ్గా అప్పుడే తడి బట్టలతో స్నానం చేసి సన్నగా వణుకుతున్న శరీరంతో జపం చేస్తూ మట్టితోనే అమర్చిన మెట్లెక్కుతున్న వ్యక్తి మీద పడింది లిఖిత దృష్టి.
ఒకలాంటి అనుమానంతో ఆయన్ని సమీపించి “స్వామి!” అంది.
ఆయన వెనక్కు తిరిగి చూశాడు.
లిఖిత పెన్ టార్చి వెలిగించింది.
ఆ వెలుగులో అతన్ని చూసి లిఖిత కళ్లు మెరిసేయి.
“డేడీ!” అంది దుఃఖం, ఆనందం కలగలుపయిన కంఠస్వరంతో.
అతను లిఖితను గుర్తించి “నువ్విక్కడిక్కూడా వచ్చేవా బేబీ!” అన్నాడు ఆశ్చర్యంగా.
“రాకేం చేయను. అమ్మని చూడాలని వుందని, ఈ ప్రయత్నం ఇక మానుకుంటానని చెప్పి నేను నిద్రలో వుండగా ఇలా చెప్పకుండా వచ్చేయడం ఏం బాగుంది డేడి. అమ్మకి నా మొహం చూపించలేక నేనూ నిన్ను వెదుకుంటూ వచ్చేసేను.”అంది లిఖిత కన్నీళ్లతో.
కార్తికేయన్ అపరాధిలా తల దించుకొని “ఏం చేయను. నా జీవితకాల కోరిక తీర్చే మనిషి ఇక్కడున్నారని తెలిసేక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయేను. ఇరవై నాలుగ్గంటలు పట్టింది అతను నన్ను పలకరించడానికి” అన్నాడు.
“ఇంతకీ ఆయన.. మీకా మంత్రం ఉపదేశిస్తానన్నారా?’ ఎంతో ఆత్రుతగా అడిగింది లిఖిత.
“ఆ! అతి కష్టమ్మీద. అది ఎవరికీ తెలియడం మంచిది కాదన్నారాయన. కేవల అద్భుత శక్తి సంపన్నులయిన మేధావుల్ని కాపాడటం కోసం దాన్ని వినియోగిస్తానని చెబితే అతి కష్టమ్మీద ఒప్పుకున్నారు.”
లిఖిత ఆయన వైపు నమ్మలేనట్లుగా చూసింది.
“నిజంగానా?”
“నీ మీద ఒట్టు తల్లీ!”
“డేడీ!”
“ఊ”
“రేప్ప్రొద్దుటే మీకుపదేశమవుతుందా?”
“ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే. ఏ మాత్రం వెలుగు రేఖ కనిపించినా ఆయన శాశ్వత సమాధిలోకి వెళ్ళిపోతారట. అందుకే ఈ రాత్రే వెళ్లి ఆయన ముందే కూర్చుంటాను. ఆయన సమాధి ముందు తీవ్ర ప్రార్ధన చేస్తున్నారు.
ఎప్పుడో తెల్లవారే ముందు ఆయన నాకీ మంత్రం కళ్లు తెరవకుండానే ఉపదేశించి సమాధవుతారట. ఇది నా అదృష్టం!” అన్నాడు కార్తికేయన్ ఆనందంగా.
“డేడీ!”
“చెప్పు తల్లీ! ఈ చీకటిలో నేను కొండ ఎక్కడం కష్టమవుతుంది”
“ఒకవేళ ఈ రాత్రి నన్నే పామన్నా కరచి మరణిస్తే?”
“అవేం మాటలు?”
“మాటలు కావు. నువ్వు నేర్చుకున్న మృతసంజీవినీ విద్యతో నన్ను బ్రతికిస్తావా?”
కూతురి ప్రశ్నకి పరిహాసంగా నవ్వి “నీకిక చావే లేదు బేబీ. చావులేని విద్య నేర్చుకున్న తండ్రి వుండగా నీకు చావెలా వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలొచనలు చేయకుండా నువ్వు ప్రశాంతంగా ఇక్కడే వుండు.” అంటూ కార్తికేయన్ కొండ మీదకి నడక సాగించేడు.
లిఖిత నిర్వేదంగా చూస్తూ నిలబడిపోయింది చాలా సేపు.
“రా బొట్టీ! ఆయన తన పట్టు ఒదిలే మడిసి కాడు. మనమీ రాత్రి ఇక్కడే కూర్చుందాం.” అన్నాడు.
సరిగ్గా అదే సమయానికి చాటుగా వుండి అంతా విన్న వెంకట్ అడ్డదారిన కార్తికేయన్‌ని వెంబడించేడు. కొండంతా చెట్లతో నిండి చీకటినిన్ నింపుకొని ఉంది.
అదే అదనుగా అతను కార్తికేయన్ వెనకగా వెళ్ళి ఆమాంతం మీద పడి అతని నోరు నొక్కేసేడు.
అనుకోని ఆ ఆకస్మిక చర్యకి నిర్విణ్నుడయిన కార్తికేయన్ గింజుకోవడానికి ప్రయత్నించేడు. అయినా ప్రయోజనం లేకపోయింది.
వెంకట్ అతని భుజమ్మీద తడి ఉత్తరీయన్ని కార్తికేయన్ నోట్లో కుక్కి చేతుల్ని దొరికిన చెత్ల నారతో బిగించి కట్టేసి ఒక పొదలో పడేసేడు.
ఆ తర్వాత వడివడిగా కొండెక్కడం ప్రారంభించేడు విపరీతమైన ఆనందంతో.
*****
తెల్లవారు ఝామున నాలుగు గంటలయింది.
లిఖిత అస్థిమితంగా నిద్రపొతున్న కోయదొర వైపు చూసింది.
ఇంకాసేపటిలో తన తండ్రికి ఆ మంత్రోపదేశం జరిగిపోతుంది. ఆయన్ని పట్టేవారెవరూ ఉండరు.
“నో! అలా జరగడానికి వీల్లేదు”
ఆమె అరుపుకి ఉలిక్కిపడి లేచేడు కోయదొర.
“ఏంటి బొట్టీ! ఏటయినా కలగన్నావా? ఏంటంత కూత పెట్టేవ్?” అనడిగేడు.
“నేనసలు నిద్రపోతేగా కల కనడానికి. మనమో పని చెయ్యాలి. నాకు సహాయం చేస్తావా?”
“చెప్పు తోలొలిచి ఇమ్మన్నా యిస్తా”
“మా డేడీకి ఆ ఉపదేశం జరక్కుండా చూడాలి!”
కోయదొర ఆమె వైపు పిచ్చిదాన్ని చూసినట్టు చూసి “నీకు ఒంటి మీద తెలివుండే మాటాడతన్నావా? ఇన్నాల్లకి నీ తండ్రి అనుకున్నది జరగతావుంటే అడ్డు పుల్లేస్తావా?” అన్నాడు.
“నీకు తెలియదు కోయరాజూ. మా డేడీ కపాల బ్రహ్మకేమని చెప్పేడు. ఆ విద్యని కేవలం మేధావులు, మహానుభావుల కోసమే వాడతానన్నారు. కాని రాత్రి నేను చచ్చిపోతానేమోనంటే.. నాకిక చావే లేదని చెప్పేరు. అంటే ఆయనలో స్వార్ధం మొలకెత్తింది. ఆయనలో రాక్షసత్వం చోటు చేసుకుంటే.. ఇక ఆ విద్యకి ప్రయోజనముండదు. మనిషికి చావుందని తెలిస్తేనే.. అందులో దానికొక నిర్ణీత కాలం లేదని తెలిసి కూడా మనిషి మించిన రాక్షసుండుంటాడా? నీకు హిరణ్యకశిపుడు కథ తెలుసు కదా?”
“మరేం చేద్దామంటావు పెట్టా?”
లిఖిత ఒక క్షణం ఆలోచించింది.
వెంటనే ఉపాయం స్ఫురించినట్లు ఆమె కళ్లు మెరిసేయి.
“ఈ కొండకి తూర్పెటు?”
కోయదొర చూపించేడు.
“పద వెంటనే అటు మంట వేద్దాం. ఆ వెలుగు రేఖలు చూసి సూర్యుడు ఉదయించేడనుకొని కపాల బ్రహ్మ సమాధి అవుతారు. ఆయనతో పాటే ఆ విద్య కూడా సమాధవుతుంది.” అంది లిఖిత కొండకి తూర్పు వైపు ఆ చీకటిలో అడుగులేస్తూ.
“ఇదిగో బొట్టీ కొంచెమాగు”
ఏంటన్నట్టుగా చూసింది లిఖిత అతనివైపు.
“నీ ఆలోచన శానా బాగుంది గాని. ఈ చిత్తడి వానలో నీకు ఎండుపుల్లలు దొరుకుతాయా? మంట పైకల్లా ఎర్రగా అగపడాలంటే ఎన్ని పుల్లలు కావాలి?” అన్నాడతను.
అతని మాటలు విని పూర్తిగా నిరాశపడిపోయింది లిఖిత.
“ఏం చేయాలి. ఎలా మనం డేడీకి ఆ విద్య తెలీకుండా ఆపగలం.” అంది నిస్సహాయంగా చూస్తూ.
కోయదొర ఒక్క క్షణమాలోచించి నోటిలో వేలుపెట్టి చిత్రంగా మూడుసార్లు ఈల వేసేడు. అరక్షణంలో ఆ ఈలకి బదులు కొన్ని ఈలలు వినిపించేయి. కోయదొర మళ్లీ ఈల వేసేడు.
అంతే.
కొని క్షణాల్లో కొన్ని వందల కాగడాలతో కోయలు, చెంచులు ఆ ప్రాంతానికి పరుగున చేరేరు.
లిఖిత ఆ దృశ్యం చూసి నివ్వెరపోయింది.
“ఏంటి ఒక్క ఈల వేస్తే ఇంత మందొచ్చేస్తున్నారు?” అంది లిఖిత.
కోయదొర నవ్వి “మాకు మీలా మాటాడే పెట్టెలు(టెలిఫోన్లు) లేవు పిట్టా. అయితే మాకుందల్లా కట్టడి. మాలో ఒకడికి కష్టం వచ్చిందంతే అందరూ కట్టకట్టుకు వాల్తారు. మీ సదువుకున్నోళ్ళంతా తలుపులు మూసుకోరు” అని వాళ్ళ వైపు తిరిగి “మీరంతా కొండకి తూరుపు భాగానికెల్లి కాగడాల్ని పైకెత్తండి. శబ్దం చెయ్యొద్దు అన్నాడు.
ఒక వెలుగు ప్రవాహం కొండ తూరుపు వైపు చేరింది.
సరిగ్గా అప్పుడే వెంకట్ కపాలబ్రహ్మ ఎదురుగా కూర్చుని అసహనంగా అతనెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని చూస్తున్నాడు.
కపాల బ్రహ్మ తన ప్రార్ధన ముగించి అర్ధనిమిలితంగా కళ్లు తెరిచి “నువ్వు సిద్ధంగా వున్నావా?మంత్రం ఉపదేశిస్తాను” అన్నాడు.
“చిత్తం” అన్నాడు వెంకట్ మనసు ఆనందంతో పొంగిపోతుండగా.
కపాల బ్రహ్మ మరలా కళ్ళు మూసుకుని ఏదో ఉచ్చరించి తిరిగి కళ్లు తెరిచేడు.
తెరవగానే అతని కళ్ళబడిన దృశ్యం .. ఎదురుగా తూర్పు వైపు ఎర్రని కాంతి అలుముకోవదం.
కపాల బ్రహ్మ కళ్ళు పెద్దవి చేసి “సూర్యోదయమైపోతున్నది” అను గొణిగేడు.
వెంటనే అతను ఊపిరిని స్తంభింపచేసి తనువు చాలించేడన్న విషయం వెంకట్‌కి చాలాసేపటి వరకు అర్ధం కాలేదు.
అతను కపాల బ్రహ్మని పట్టుకొని గట్టిగా కుదిపి “మంత్రం ఉపదేశించండి స్వామి” అన్నాడు. వెంటనే అతని చేతుల్లో ఒరిగిపోయింది కపాల బ్రహ్మ విగత శరీరం.
అతను ఆ షాక్ నుండి తేరుకోక మునుపే చీమల బారులా కాగడాలతో కొండపైకి ఎక్కుతున్న కోయవాళ్ళు ఆ వెనుక లిఖిత రావడం కనిపించింది.
వెంకట్ ని చూసి లిఖిత నివ్వెరపోయింది.
“నువ్వా.. మా డేడీ ఏరి?” అంది.
వెంకట్ జవాబు చెప్పే స్థితిలో లేడు.
ఏం చెప్పినా క్షణాల్లో కోయవాళ్ళు తనని చుట్టుముట్టి చంపేస్తారన్న నిజమర్ధమయి కొండ వెనుక భాగంలోకి పరిగెత్తేడు. కొంతమంది కోయవాళ్లు అతని వెంట పడ్డారు.
“మా డేడీని ఏం చేసేడో ఈ నీచుడు” అంది లిఖిత దుఃఖభారంతో.
“పైన దేవుడున్నాడు. మీ నాన్నకేం కాదు పద!” అన్నాడు కోయదొర ఆమె నూరడిస్తూ.
లిఖిత కోయదొర సాయంతో వెతుకుతుండగా కొండ క్రింద కొన్ని జీపులు, వేన్‌లూ ఆగేయి. వాటి కాంతిలో ఒక చోట మూటలా కట్టేయబడిన కార్తికేయన్ కనిపించి అటు పరిగెత్తేరు లిఖిత, కోయదొర.అప్పటికే పోలీసులు జీప్‌లు, వేన్‌లూ దిగి చకచకా కొండ మీద కొచ్చేసేరు.
లిఖిత కార్తికేయన్ తల ఒళ్ళో పెట్టుకుని “డేడీ!డేడీ!” అని పిలిచింది కంగారుగా.
కోయదొర అతని నోట్లో గుడ్డ తీసి కట్లు విప్పేడు. అతను నీరసంగా మూలుగుతూ “వాడెవడో.. వాడు …నన్ను..”అన్నాడు హీనస్వరంతో.
“మీరు ప్రస్తుతం ఏమీ మాట్లాడకండి” అంది లిఖిత ఆయన తల నిమురుతూ.
పోలీసులు లిఖిత దగ్గరగా వచ్చి “మీరు లిఖిత కదూ!”అనడిగేరు.
“అవును” అందిలిఖిత.
“రండి మిమ్మల్ని జాగ్రత్తగా ఇల్లు చేర్చమని మా డి.జి.పి గారి ఆర్డర్. ఆ వెంకట్ అనేవాడు కూడా ఇటొచ్చేడని తెలిసింది?” అనడిగేడు ఇన్సపెక్టర్.
“వాడు కొండ వెనుకకి పారిపోయేడు”
“పదండి. వాణ్ణి పటుకోండి” అని పోలీసులకి ఆర్డర్ జారీ చేసేడు ఇన్స్‌పెక్టర్.
“ఆణ్ణింక పట్టుకొని ఏం సేసుకుంతారు. ఆడు కాలు జారి లోయలో పడి కుక్క సావు సచ్చేడు” అంటూ వచ్చి చెప్పేరు కోయవాళ్లు.
“దేవుడే ఆణ్ణి శిచ్చిందలసుకున్నాడు. మీరిక బయల్దేరండి. మీ నాన్నగారికి నీరసంగా వుంది” అన్నాడు కోయదొర.
లిఖిత అతనికి నమస్కరించింది.
కూటికోసం కోటి విద్యలు నేర్చినా, చదువూ సంస్కారమెరుగని ఆ అడవి జాతి మనుషులు మనుషుల్లా ప్రవర్తించి తననాదుకున్నారు. ఆ విషయం గుర్తొచ్చి ఆమె కళ్లు చెమర్చేయి.
“అప్పుడే అలా దిగులు మొకమెడతావేంటి బొట్టేఎ. నాను నీ తలంబ్రాలకి రానూ!” అన్నాడు కోయదొర.
లిఖిత నవ్వింది నీరు నిండిన కళ్లతో..
కార్తికేయన్ లిఖిత జీప్ ఎక్కేరు.
“జాగ్రత్తగా ఎల్లిరండి. బాబూ నువ్వింక పెళ్లాం బిడ్డలతో సుకంగా కాపరం సేసుకో. బెమ్మలికితాన్ని ఎవరూ సెరపలేరు బాబూ. ఇక సావు సంగతొదిలేసి బతికనన్నాల్లూ సుకంగా బతకండి..” అన్నాడు కోయదొర.
జీప్‌లూ, వేన్‌లూ కదిలేయి. అడవిలోని ఘాట్ రోడ్డుల వెంట మెలికలు తిరుగుతూ అగ్గిపెట్టెల్లా..
లిఖిత తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని. ఇంకెన్నడూ వదలనని.
సరిగ్గా అదే సమయంలో కేయూరవల్లి శిరిడి సాయి ఎదుట ధ్యాన నిమగ్నమై వుంది. ఒక రకమైన నిశ్చింతతో, నమ్మకంతో..
ఛత్రమై తన భక్తులకు
ఆచ్చాదనంబిడు సాయి నామము
సాధనలచే నెరుగవలసిన
సత్యమీ శ్రీ సాయినామము.

*సమాప్తము.*

Saturday 27 October 2018

ఉగాది ప్రత్యేకత


చదవండి ప్రాంజలి ప్రభ 
ఉగాది  ప్రత్యేకత  

*"ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం."*

(1) *"తైలాభ్యంగనం"*

*"తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది."*

(2) *"నూతన సంవత్సర స్తోత్రం"*

*"అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను."*

(3) *"ఉగాది పచ్చడి సేవనం"*

*"ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!"*

*"అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాది  పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగా*"ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం."*

(1) *"తైలాభ్యంగనం"*
********
*"తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది."*

(2) *"నూతన సంవత్సర స్తోత్రం"*
*********
*"అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను."*

(3) *"ఉగాడి పచ్చడి సేవనం"*
********
*"ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!"*

*"అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాది  పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం."*

(4) *"పూర్ణ కుంభదానం"*

*"ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి."*

(5) *"పంచాంగ శ్రవణం"*

*"తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది."*

*"ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి."*
 నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం."*
--((**))--


******************
*శ్రీవికారి-ప్రయోజనకరి*  
****
*కవి మిత్రులందరికీ *శ్రీవికారి* యుగాది
శుభాకాంక్షలు శుభాభినందనలతో......
******************
   
*1. ఆ.వె.*
*శ్రీ! వికారి* నిన్ను శీఘ్రము పిల్చుచు!
*శ్రీ విళంబి* వెళ్ళు శిబిరమునకు!
షష్ట వత్సరములు చాటుకుండిననీకు!
నీ *యుగాది*నాడు యెంతొ సొగసు!

*2. ఆ.వె.*
మమ్ము వీడునట్టి*మా *విళంబి* నీకు!
కలిన కల్మశముల కలివిషములు!
మలిన మతులు ఖలులు మత్సరములువీడ!
శాంతి పొందుమమ్ము సంతసమున!

*3. ఆ.వె.*
యుగయుగమువసంత మొందించు నాత్మజు!
లందరకును తెల్పు మవని తీరు!
పంచ భూతములను పాటిగా రక్షించి!
కాలగతులశుభము కలుగు జేయు!

*4. ఆ.వె.*
ధన్యవాదములను ధరవిళంబికినిచ్చి!
సాగనంపుజనులు సాదరముగ!
ప్రక్క జేర్చుకొనును పయనమందగచెల్లి!
నక్కజముగ చెల్లి యధ్భుతముగ!

*5. ఆ.వె.*
అరవయేళ్ళకొక్క యధ్భుత వసంత!
మాసమందుగనును మా *వికారి!*
వర్షయుగపుకాంత వలపులసొగసగు!
యవ్వనమ్ముపంచు జవ్వనిగను!

*6. ఆ.వె.*
ఏక వత్సరాన యెగుడుదిగుడులన్ని!
పరవశాల బాధ ప్రాభవముల!
నందిపొందువిందు లధ్భుతరీతిగా!
వందనములునీకు? వర్ష శతము!

*7. సీసము.*
వాసంత శోభతో వాకిళ్ళు లోగిళ్ళు!
రంగవల్లులకాంతి రంగరించ!
కొంగ్రొత్త కోయిల కోమలి సుస్వర!
శ్రవణసంగీతాలు స్వాగతించ!
ఆమనిచిగురించి యవ్వని పులకించి!
కిసలయ నాట్యాల కేళితోడు!
పంచాంగ శ్రవణము బ్రాహ్మణాశీస్సులు!
తారాగణాలన్ని తరలిరాగ!

*శ్రీవికారి* కి నాహ్వాన చిన్మయమున!
యిల్లు వాకిళ్ళునామని పల్లెపల్లె!
నుదయ వాసంత వేడుక లురుతరముగ!
నుత్సవమ్ములుజరుపుదు రుర్వి జనులు!

*8. సీసము.*
సాహిత్య సౌరభ సంగీత నాట్యాల!
సరిగమ పదనిస స్వరఝరులుగ!
కోమల కోయిల  కొంగ్రొత్త గానాలు!
నవనాయకాగణ 'నవ'విధులుగ!
మానసాంతరభావ మావిడాకులశోభ!
మృదుమధుపచ్చడి ముదము గొలుపు!
పరివర్తనాయుత పరిణతి కాంక్షించి!
ప్రణమిల్లుచుంటిమి!భవితకోరి!

యిన్ని సద్గుణా లీప్సితా లిమ్మటంచు!
నిన్నునాహ్వానమునుజేయ నెమ్మనమున!
నిమ్న మానసములవీడి నియతి తోడు!
యుగపు నేటి *వికారి ప్ర యోజనకరి!

*9. సీసము.* 
సబ్బండ వర్ణాల సారాంశ జలధిగా!
సాకుమా లోకులు శాంతినొంద!
సత్సంగ,సత్పథ సంస్కార మానస!
ధర్మము కాపాడ ధరణియందు!
క్రూరాత్ములెందరో కుత్సితయుక్తితో
సన్మాన సులనిల చంపుచుండె
కలికాల మహిమయో కర్మానుగతమదో!
తెలియకుండెడుబాధ వెలికి తీసి!

మంచితనమునుకాపాడు మాతవీవె!
దుష్ట శిక్షణ చేసెడు దూతవీవె!
ధర్మపథమునురక్షించు దాతవీవె!
అమ్మ! *శ్రీవికారి* కిదే యంజలింతు!

*10.ఉ.మా.*
అమ్మ *వికారి* యంచునిను నామని కోయిల నీవసంతమున్!
రమ్మనిపిల్చుచైత్రమున లక్షణ కన్యగ రమ్యగానమున్!
కొమ్మగమావికొమ్మగని కోమలి సుస్వర కూతకూయగా!
యిమ్మహికేగుదెంచి యవ నీశుల మానస బాధదీర్చుమా!

*11.ఉ.మా.*
మా'నవ'మానవాధముల మానస మత్సర మాంద్యమానముల్!
మానిని మౌనపోకడలు మాననిమందగు మృత్యుపాశముల్!
దానవ దంష్ట్ర చేష్టలును దన్నుగ మిన్నుగ దాపురించెగా!
యీనవ వత్సరమ్మునిల నేవిధ సద్గతులు లిచ్చుచుందువో?

*12.ఉ.మా.*
ఎన్నికలమ్ములందుకవు లెందరు భారతి భారతావనిన్!
పన్నుగ *శ్రీవికారి* యుగ భాస్కర తేజములుద్భవించునో?
సన్నుతిగాయుగాది మది శాంతము నోర్పునునందజేయగా!
మన్ననలందగోరు మహి*మాన్విత పండితులెందరెందరో!

*13.ఉ.మా.*
వందనమందజేతుహృది వంచిత లబ్దప్రతిష్ఠులంధరన్!
స్పందితవాగ్విభూషణులు సత్యమసత్యపువాస్తవస్తవా*
స్కందులముందునిక్కమును గావుమటంచునువేడుకుంటునే!
కందిన మానసాత్ములను గౌరవమందగ సాకుభారతీ!

ప్రాంజలి ప్రభ కు పంపినవారు
*రచన*
*మా. మురళీధర శర్మ*
*సిద్ధిపేట-30.03.2019*

--((**))--





ఉగాది విధి - Pranjali pdrabha తెలియ పరుస్తున్నది 

భారతదేశంలో కాలగణనకు మూడు మానాలు అనూచానంగా వస్తున్నాయి. చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్య మానం. ఈ మూడూ వేదాధారమైన ప్రాచీన జ్యోతిషశాస్త్ర ప్రమాణాలతో ఉన్నవే. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాలమానాలు ప్రమాణాలు. సౌర-చాంద్ర మానాల్లో సంవత్సర నామాలు మారవు. చంద్రుడి నక్షత్ర యోగాన్ని అనుసరించి చాంద్రమానం, సూర్య సంక్రమణాల ప్రకారం సౌరమానం, గురూదయాన్ని ఆధారంగా చేసుకొని బార్హస్పత్య మానం లెక్కిస్తారు. ఎవరి పరంపరాగతమైన, ప్రాంతానుసార మానాలు వారికి ప్రమాణాలు. ఇందులో వైరుధ్యాలేమీ లేవు.

ఉగాదినాడు నూతన సంవత్సర ఆరంభాన్ని చక్కని శుభ భావనతో, కాలరూపుడైన భగవంతుడి ఆరాధనతో పవిత్రంగా ఆచరించడం భారతీయుల సంప్రదాయం. శాస్త్ర విధిని అనుసరించి- ముందురోజే శుభ్రం చేసుకున్న గృహాన్ని మామిడి తోరణాలు, రంగవల్లులు, పసుపు గుమ్మాలతో అలంకరించడం సంప్రదాయం. బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి గణపతిని, ఇష్టదేవతను పూజించాలి. వాణీ హిరణ్యగర్బు ´(సరస్వతి, బ్రహ్మ)లు, లక్ష్మీ నారాయణులు, ఉమా మహేశ్వరులతో పాటు దిక్పాలకులను, నవగ్రహాలను యథాశక్తి అర్చించాలి. పంచాంగాన్ని పూజించి, పంచాంగ శ్రవణం చేయాలి.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు- అనే అయిదు అంగాలను జ్యోతిషశాస్త్ర రీత్యా గణించిన గ్రంథమే ‘పంచాంగం’. సంవత్సర ఆరంభంలో- గ్రహ, నక్షత్ర, వారాదులు అనుసరించి కాలాంశాల్ని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. నిత్యం అనుష్ఠానం చేసుకొనేటప్పుడూ- దేశ, కాల సంకీర్తన అనే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో మనం ఉన్న ప్రాంతం; అక్కడి నది, పర్వతాల ప్రస్తావన; దేశ సంకీర్తన; ఆనాటి తిథి, వార, నక్షత్రాది స్మరణ కాల సంకీర్తన ఉంటుంది. అనునిత్యం ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల, ఆ రోజుకు సంబంధించిన కాలభాగాలు జ్ఞప్తిలో ఉంటాయి.

సంవత్సరం, పగలు, రాత్రి, పక్షం, మాసం, అయనం, యుగం, కల్పం... వీటన్నింటికీ పేర్లు, లక్షణాలు ఉన్నాయి. వీటి పరిజ్ఞానమే సంస్కృతి సంబంధ వారసత్వంగా భారతీయులందరి కర్తవ్యం. ఈ కర్తవ్య పాలనలో ఉగాది ఒక మధుర ఘట్టం. ఉ-గ- ‘ఉదు’ అంటే, నక్షత్రం. ‘గ’ అంటే, గమనం. నక్షత్ర గమన (చంద్రుడితో నక్షత్రానుబంధం) రీత్యా ఇది ఉగాది.

పంచాంగ శ్రవణ అనంతరం- ఉగాది పచ్చడిని నివేదించి, ప్రసాదంగా స్వీకరించడం విధి. నింబ కుసుమం (వేప పూత), మామిడి, బెల్లం- దీని ప్రధాన ద్రవ్యాలు అని శాస్త్రం చెబుతోంది. ఈ ప్రసాదాన్ని మొదటి యామం (జాము)లోనే (ఉదయం 8.30-9.00 గంటల మధ్య) గ్రహించాలంటారు. కాలం ఎటువంటివాటిని సూచిం చినా సంకల్ప బలం, సత్కర్మ ఆచరణ, సద్భావనతో సవరించుకోగలం అనే చక్కటి విషయాన్ని పలు ధార్మిక, జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి.

అందుకే ఉత్సాహం, ఆశాభావం, దేశహిత కాంక్షతో నూతన వత్సరాన్ని స్వాగతిద్దాం. కాల స్వరూపుడైన పరమేశ్వరుడు అందరికీ శుభాలు ప్రసాదించుగాక అని ప్రార్థిద్దాం!

--((**))--

క్ష్మి
శ్లోకం: శతా యుర్వజ్ర దేహయం సర్వ సంపత్కరాయ 
సర్వారిస్ట వినాశాయ నిమ్బకుసుమ భక్షణం. 
అర్థము: వేపపూవు తింటే దీర్ఘాయుస్సు కలుగుతుంది,దేహము వజ్ర సమానమవుతుంది. 
మరియు సర్వ అరిస్టాలను తొలగిస్తుంది. 
ఈ పచ్చడి తింటే శరీరానికి మేలు జరుగుతుందని ఆయుర్వేదము చెప్తుంది 
---------------------------------
త్యాముష్ణ శోకే నరాభీష్ట మధుమాస సముర్భవ 
నిభా విశోకే సంతస్తాం మమ శోకం సదా కురు.

అర్థము: (అశోకము అన గా వేపచెట్టు)వసంతమాసము లో చిగురించే అశోకమా 
జీవితములో శోకాలతో బాధపడుతున్నాను ఓ అశోక పుష్పమా నిన్ను 
సేవిస్తున్నాను నన్ను శోకము నుండి విముక్తుడిని చెయ్యి (అశోక మనగా శోకము 
లేకుండుట అని కూడా అర్థము)

ప్రకృతి వర్ణన అంటే పుడమికి తిలకం దిద్దటమే, ఉగాది నాడైతే కవి కలాలు 
కొత్తరంగులు నింపుకొని మరింత పిపాసను జోడించేందుకు ఉరకలేస్తాయి. ఇదిగో ఈ 
భూతిలకం అలాంటిదే. ఇది అతిధృతి ఛందములో ఓ వృత్తం 'భభరసజజగ' గణాలు.

చైత్ర రథమ్మునరావె నా సఖి జావళింప మధూదయం 
నేత్రపథమ్మున శోభలీనుచు నీలినింగిలో చిత్రమై 
గాత్రమ్ము కమ్మని కీర్తనల్ వరగాంచ నవ్యయుగాదినన్
ఆత్రముతో ప్రియకావ్య కన్యక ఆలకించె సుదాక్షరై 
(తానరూపి, హనుమకొండ ) (తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)
--------------------------------------------
ప్రాబంధిక శైలిలో ఆధునిక భావకవిత::
వసంతము::
ఒకటి కోకిల పల్కె నొకట శారిక కుల్కె
నొక కొమ్మపై చిల్క హొయలు నొల్కె
ఒకట మల్లియ పూచె నొకట సంపెగ తోచె
నొక క్రేవ మందార మురిమి చూచె
ఒకట తుమ్మెద పాడె నొకట తెమ్మెర లాడె
కామినీమణి మూగనోము వీడె
ఒకట నవ్వులు హెచ్చె నొకట మోదువు విచ్చె
ప్రణయహృదయమందు వ్రణము దెచ్చె
చల్ల చల్లని చందన చర్చవలన
తాపము మరింత యధికమై తనర జొచ్చె
మధువొ మధువో యటంచు కమ్మ విలుకాడు
పడతి కన్ను గిన్నెల నిండ పట్టి తెచ్చె
(నవ వసంతవైభవము - కవితాపుష్పకము)సురేంద్ర నాథ్
---------------------------------
వచ్చింది వచ్చింది I "వికారినామ " ఉగాది 
కావాలి, కావాలి I మీ అందరికీ శుభకర శ్రీకర 
జీవనానికి నాంది .
నూతన సంవత్సర శుభాకాంక్షలు
--((**))--
సర్వేషాం------- నామ నూతన సంవత్సరారంభావసరే ఉగాది శుభాశయాః.

"శార్వరి శుభములు నొసఁగును..
శర్వాణి కృపాకటాక్ష సంపద చేఁతన్!
పర్వఁపుసుశాంతి కలుఁగున్..
ఖర్వమగు మదాతిశయము కాపురుషులకున్!!!"

శర్వరీ శం చ వో దద్యాత్
నీరోగాచ్చ శుభాశయాత్|
కృత్వా విఘ్నాని నిఘ్నాని
కార్యలాభం ప్రదాస్యతు||

అందరికీ ఉగాది శుభాకాంక్షలు

శర్వుని రాణి పేరుగల శార్వరి నిండగ సస్యసంపదలీ
యుర్విని రాగదే సుఖము లొప్పనికన్ కరోనకున్
గర్వము భంగమౌనటుల కామిత మీయగ నీదు రాకకై
సర్వులు వేచినారిటను శక్తివి నీవని పిల్వనెంచుచున్

శార్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మత్తకోకిల శాంతి దూతగ కూత కూసెను శార్వరీ
మత్తు పెంచును హాయి గొల్పును సృష్టి నేస్తము శార్వరీ
చిత్ర మాలిక చింత తీర్చును బుధ్ధి పెర్గును శార్వరీ
స్థితి మారి ఉగాది శోభలు నిత్య సత్యము శార్వరీ

--(())--



శార్వరి వచ్చి కరోనా ను తరిమి కొట్టాలని ఆశిస్తున్నాను ! అందరికి ఉగాది శుభాకాంక్షలు.

ప్రాంజలి ప్రభ - karona

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

విశాలాంతిక - త/త/త/గ UUI UUI - UUIU

10 పంక్తి 293

ఏమాయ కమ్మింది - మాపైన మే
మేమీ చె సి యున్న - ఇంతా మనో
మార్గమ్ములే ప్రశ్న - లయ్యెనుగా
ఇంతెందు కాలోచనా అందురే

కాలమ్ము మాయగా చుడాలిగా
పంతమ్ము పోకుమా అద్రుష్టమే
ఎవ్వారె మన్నాను మౌనంగ ఉం
డీ దేశ కష్టమ్ము భావించియే

శుబ్రమ్ము చేస్తేను ఆరోగ్యమే
ఏరోగ మూ రాదు భయ్యమ్ములే
కుండంగ జీవించు ఆనందమే
పంచియు ఆహ్లాద మే పొందుటే

ఉద్వేగ ఉద్యోగ సేవార్ధమ్ము
ఎందెందు అందందే ఆరోగ్యమ్ము
బిడ్డల్తొ ఉండేది సౌకర్యమే
ఏరోగ మీదాక రాకుండులే

ఏకష్టమూ రాక సౌఖ్యమ్ములే
ఎంచేసు యున్నానొ ఈమాయలో
--(())--


నేటి కవిత్వం - రథము
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శరీరమే  కదిలించే రథము 
రథానికి ఆత్మయే రధికుడు  
రధికునకు సారధి బుద్ధి 
బుద్ధిని నిర్దేసించేది ఇంద్రియాలు 
ఇంద్రియాలే కదిలే గుర్రాలు 
గుర్రాలకు వెయ్యాలి కళ్లెం 
కళ్లెం అనేది జీవిలో మనస్సు  

కర్మల వళ్ళ కలుగు ఫలం 
ఫలం వళ్ళ పెరుగు భోగం 
భోగం వళ్ళ కలుగు వాసన 
వాసన వళ్ళ కలుగు జన్మ  

జన్మ వాళ్ళ చేయాలి కర్మ 
కర్మలే ఫల సుడి గుండాలు 
గుండాలు తప్పాలంటే ఆత్మ
ఆత్మ శుద్ధిగా ఉండాలి 

అంటే పరమాత్మ ధ్యానమే 
అదే ఆత్మ జ్ఞానము 
దీనికి లింగ బేధము లేదు 
దీనికి నిత్యకర్మ నిష్ఠ 
న్యాయ ధర్మ సత్యానికి శాంతి 
అదే మనకు ప్రశాంతి 
--(())--
3. ప్రస్థానం (సంగీతమ్)
 
కోరిక ఉన్నది నోట మాట రాదు
మాట వచ్చిన నోట పాట  రాదు
పాట వచ్చిన ఒక్క పల్లవీ రాదు
పల్లవి నేర్చిన  అవకాసం రాదు  

ప్రేమ చరణాలు పాడక తప్పదు
సంగీతంపై అన్వేషణ తప్పలేదు  
వయస్సును వంచించుట లేదు
ప్రకృతి పంచే వాకిలికి   తప్పదు  

పాటను పాడాలని కోరిక కలిగింది
అనుకోకుండా ఒక పల్లవి కుదిరింది
కానీ ఆపై అమరలేదు చరణాలు
అన్వేషణలోనే మనుగడ నలిగింది

నేనో గానం చేయాలను కుంటున్నా
వచ్చే అవరోధాలను దాటాళను కున్నా  
ఎన్నో ప్రయత్నాలు చెస్తూ నే ఉన్నా
ఏది మంచో ఏది చెడో తెలియ లేకున్నా 

నీకోసం సంగీతమ్ నేర్చుకున్నా
సంగీతంతో బ్రత కాలను కున్నా
నీ భందం కోసం కష్టపడుతున్నా
సంగీతానికి గానం తోడవ్వలనుకున్నా
--((*))-- 
 ప్రస్థానం (పంచ భూతాలు )

పవిత్రంగా పునీతమౌతున్న పంచభూతాలు



పృథ్వి తొలకరి దిద్దిన మధుర వాసనతో

గ్రీష్మ తాపాన్ని తట్టుకొని నవ వనాలతో

ప్రకృతిమయమై అనేక అనుభూతులతో  

ప్రతి మనసుకు తృప్తినివ్వాలని తపనతో

మోస్తూ చివరకు తనలోకి చేర్చుకోనేది భూమి



పగలు సూర్య వెలుగుతో, రాత్రి చెంద్రుని వెన్నెలతో

కడలిని  పీలుస్తూ, కుండల్లా మేఘాల వివిస్తరణతో

శబ్ద కాలుష్యాన్ని భరిస్తూ ఎవ్వరినీ అనలేని తనంతో

రంగులు మార్చే మేఘాల మెరుపుల కదలికలతో

లెక్కించలేని పరిధిలో అనంతంగా ఉన్నదే ఆకాశం



జాలువారు నదిలో గాలి చేరి తుమ్పరులతో

నిత్య సంచారము చేయు గాలి విహంగాలతో

ప్రాణులను రక్షించేగాలి తరువుల కదలికలతో

గాలికి కోరికల రెపరెపలు కళ్ళు కదలికలతో

పీల్చని వారుబ్రతకరు, అందుకే కావాలి ఈ గాలి    




స్వార్ధంతో, నిస్వార్ధంతో దగ్గరవ్వాలని తపనతో

కడలిలో అగ్ని పుట్టి వచ్చి చేరే తుఫానులతో

అగ్నికి శిలలుకరిగి లార్వగామారి కప్పే బుడిదతో

అడవిని అగ్ని రగిల్చగా వణ్యప్రాణులు పరుగులతో  

ఉదరంలోని ఆహారం జీర్ణ మగుటకు రక్తంతో కలిసేది అగ్ని







హృదయం తల్లడిల్లి చెమ్మగా వచ్చే కంటి నీరుతో   

గంగ యంత్రాల ద్వారా ఉద్భ వించే జలాలతో

ఎడారిగా మారుతున్న మనసులపై చల్లే నీరుతో

బ్రతుకు తెరువుగా నిత్యమూ దొరికే జలాలతో   

ఆభిషెకానికి, ఆఖరిచూపుకు పనికి వచ్చేది నీరు    


పసుపుపచ్చగా (బంగారు) రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము.

శ్రీలలితా త్రిపురసుందరీ సహస్ర నామావళిలోని నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం పీతవర్ణాయై నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు తాపత్రయ బాధలు నశిస్తాయి, అనుష్ఠానాదులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. తల్లి కరుణచే ఐహిక, ఆముష్మిక శుభములు పొందుతారుస్వాధిష్ఠాన చక్రాధిదేవత పచ్చని శరీర ఛాయతో శోభించుచుండును. 

శ్రీచక్రాధిష్ఠాన దేవత అయిన పరమేశ్వరిని శ్రీమన్నగర నాయికాయై నమః  (56వ నామ మంత్రము)  శ్రీఅనగా లక్ష్మి, ఆమెతో కూడిన నగరము శ్రీచక్రము అగును; శ్రీగౌడపాద సూత్రములందు ఈ వ్యాఖ్యగలదు; అందుచే శ్రచక్ర నాయిక (లక్ష్మీ, సరస్వతి, పార్వతుల కలయిక)  ఆదిపరాశక్తి అనియు, అమ్మ శ్రీచక్ర వాసిని అగుటచే శ్రీమన్నగరనాయిక అనియు, శ్రీచక్రమే శ్రీనగరమనియు అంధు బిందురూపంలో విరాజిల్లుతున్న దేవి శ్రీమన్నగరనాయిక, సుమేరు ఉత్తరకొన యందు ఉండు సుధాసాగరమందలి మణిద్వీపమునందు ( ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః ఉండునదియే శ్రీమన్నగరము. ఇది మయబ్రహ్మచే నిర్మింపబడినది ఈ శ్రీమన్నగరమునే విద్యా నగరమనికూడ చెప్పుదురు ఇక్కడినుంచే అమ్మవారు ఆదేశాలు, ఆజ్ఞలు ఇస్తూ పరిపాలన నిర్వహిస్తుంది' వ్యక్తియొక్క సహస్రార స్థానము నుండి ఆ వ్యక్తికి కావలసిన పనులన్నియు ఆజ్ఞలు, సంకల్పాలు, సందేశాలు ఇవ్వబడుతాయి.  మేరు పర్వతము నందలి త్రికూట మధ్య శిఖరవాసిని ( ఓం సుమేరు మధ్య శృంగస్థాయై నమః) త్రికూట మధ్య శిఖరము - శ్రీమన్నగరము ఆ నగరమునకు అధ్యక్షురాలు శ్రీదేవి అగును (55వ నామ మంత్ర వివరణము) సుధా సాగర మధ్యమున పంచవింశతి (25) ప్రాకారములు గల్గిన శ్రీనగరము గలదు. శ్రీనగరమునకు అధిదేవత శ్రీలలితా పరాశక్తియే అగును. ఇక్కడ చెప్పిన ఇరువది ఐదు (పంచవింశతి) ప్రాకారములు పంచవింశతి తత్త్వములు అగును.

 
 508వ నామమంత్రము🕉🕉🕉 ఓం అతిగర్వితాయై నమః

గర్వాతిశయంగల తల్లికి నమస్కారము, స్వాధిష్ఠానమునందు ఉన్న కాకినీ యోగిని మిక్కిలి సౌందర్యంతోనూ, సకల ఐశ్వర్యములతోను విరాజిల్లుచున్నందున, ఆ తల్లి అతిశయించిన గర్వంగలదై ఉంటుంది, శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళిలోని అతిగర్వితా యను అయిదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును ఓం అతిగర్వితాయై నమః అని ఉచ్చరిస్తూ భక్తిశ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు ఉపాసకులు సర్వాభీష్ట సిద్ధులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై, ఆ తల్లి పాదసేవయందే జన్మ ధన్యతనందెదరు. స్వాధిష్ఠాన చక్రాధిదేవత సౌందర్యాతిశయముతో, సకలైశ్వర్యములతో, నాలుగు చేతులతో అతి మనోహరముగా తన తనూవిలాసంతో అతిశయించిన గర్వము కలిగి ఉండుటచే అతిగర్వితా  అనే నామ మంత్రముతో కీర్తింపబడుతున్నది. స్వాధిష్ఠాన చక్రంలో ఏదైనా మార్పుగలగితే మనిషికి గర్వం, దర్పం, దంభం మొదలైనవి కలుగుతాయని భావము. అమ్మవారికి నమస్కరించునపుడు ఓం అతిగర్వితాయై నమః అని అనవలెను.


















ఆరాధ్య లీల (తాగొద్దురా )



ఆరాధ్య  లీల (తాగొద్దురా )   
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే బాబు చెలిమి చెడునురా
తాగితే బాబు కలమి పోవునురా
తాగితే బాబు బలిమి తగ్గనురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే అప్పులు పెరిగి పోవునురా
తాగితే తప్పులు జరిగి పోవునురా
తాగితే ఒప్పులు మనసు కెక్కవురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే హద్దులు మార్పు వచ్చురా
తాగితే పద్దులు చెర్గి పోవురా
తాగితే ముద్దులు తొల్గి పోవురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే వళ్ళు గుళ్ళగ మారురా
తాగితే పళ్ళు నొప్పిగ ఉండురా
తాగితే కళ్ళు తిర్గుచు నుండురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే రక్త నాళాలు చెడునురా
తాగితే వక్త వేషాలు తెల్వవురా
తాగితే యుక్త నేరాలు పెర్గునురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

తాగొద్దురా బాబు తాగొద్దురా
తాగితే ఒట్టు మరచి పోవునురా
తాగితే గట్టు విడిచి పోవాలిరా
తాగితే పట్టు సడలి ఉండునురా
అందుకే తాగొద్దురా బాబు తాగొద్దురా

Friday 26 October 2018

బ్రహ్మలిఖితం -1



బ్రహ్మలిఖితం – 1
రచన: మన్నెం శారద


ముద్దమందార మధురస్మృతి (1) (రోజువారి కధ)
ఒకరి ఆలోచన మరొకరి పరిశీలన కధా పరిచయం 


మార్గశిర మధ్యం…
బ్రహ్మీ ముహూర్తపు వేళ!
వెన్నెల ఎర్రబారుతున్న సమయం.
భువిపై కురుస్తోన్న మంచు – చంద్రకిరణాలతో సఖ్యం పెంచుకొని మరింత ఘనీభవించి నేలంతా తెల్లని గొంగళి పరచినట్లుంది.

మంచి పేరుగ,  మందబుద్ధిని, మార్చనంటివి,  మోహనం 
నుంచి నేరుగ, శంక బుద్ధిని, నమ్మ  పల్కతి , మోహనా 
ఉంచి కాదన, స్థితిప్రఙ్ఞను, ఉన్న లేకయు , కాదులే 
పొంచిఉన్నను, ముప్పు నంతయు, పొంత  లేదియు  మోహనా

సృష్టిలోని యావత్ ప్రాణికోటి వెచ్చదనం కోసం గదుల్లోకి, నెరియల్లోకి, గుహల్లోకి దూరి ముడుచుకొని ఆదమరచి నిదురపోతున్న ఆ సమయంలో గుంటూరు లోని ఒక ఇంటి రెండో అంతస్తులోని ఈశాన్య భాగపు గదిలో చెదరని ఏకాగ్రతతో కనులు మూసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తోంది మందార మల్లి .

సృష్టిలోకధ, వేడినిచ్చియు, శాంతి నిచ్చియు, నీడలో 
ముష్టిలో కధ, సత్యబోధయు, మర్మమార్గము, నీడలో 
ఇష్టిలో కధ, పుణ్యపాపము, ఇచ్చు మార్పుల , నీడలో 
కృష్ణలో కధ, మంచిచేసియు, కష్ట ముండుట , నీడలో  

తడి తలకి పిడచ కట్టి, భావతీక్షణతని సూచిస్తున్న కనుబొమ్మల మధ్య సింధూరం అలది, నిటారుగా కూర్చుని వున్న ఆమె ఆకృతిని పరికిస్తే కొంపతీసి ఆమె యోగనిద్రలోకి వెళ్ళిపోలేదు కదా అనిపిస్తుంది. ఎదురుగా వెలుగుతోన్న అఖండ దీపపు కాంతి కిరణాలు మూలపీఠం మీద అమర్చిన పంచలోహ విగ్రహాల మీద పడి పరావర్తనం చెంది ఆమె నాసికాగ్రాన వున్న రవ్వల ముక్కుపుడక మీద పడి వెలుగు బిందువులుగా మారి క్రిందకి జారుతున్నాయి.

భావతీక్షణ యుక్తధారలు భాగ్య మాస్రిత పొందుకే 
యావపొందియు మౌనదీక్షతొ  యశ్వ వేగము  పొందుకే
సవ్యసాచిగ నిండు యవ్వన సాగివుండుట  పొందుకే 
మువ్వచిందులు గువ్వగూటికి మంత్ర మాయను పొందుకే  

ఆమెకి నలబయి సంవత్సరాల వయసుండొచ్చు. శరీరాకృతిలో కొంత బొద్దుతనముంది. కొద్దిగా నోటి దగ్గరగా జారుతున్న బుగ్గలు ఆమె యౌవనంలో అందమైన స్త్రీ అయి ఉంటుందన్న నిజాన్ని తేటబరుస్తున్నాయి.

వత్సరంబుయు పెర్గియున్నను మొహమాకృతి మారదే 
నిశ్చితంబుయు కల్గియున్నను నగ్న తార్దము మారదే 
వచ్చిపోవును మబ్బువల్లెను వాన మల్లెను  మారదే 
నిచ్చసత్యము చెప్పుతున్నను నైతి కమ్ముగ మారదే 

స్తోత్రం ముగించి, ఆమె కళ్ళు తెరచి లేచి దేవుడికి హారతినిచ్చింది. కుడిచేతితో హారతిస్తూ ఎడం చేతితో ఆమె వాయించిన గంట శబ్దం తరంగాలై ఆ గదినుండి హాల్లోకి అక్కడనుండి ఆమె కూతురు పడుకున్న పడక గదిలోకి ప్రవహించింది.

  ... ... ////  ... //// .... 

2ముద్దమందార మధురస్మృతి (2) (రోజువారీ కధ)
ఆ నిశ్శబ్ద నీరవంలో ఆ ఘంటానాదం నాడీమండలం మీద పని చేయడంతో ఒక రకమైన ఉత్తేజంతో మంచం మీద గబుక్కున లేచి కూర్చుంది లిఖిత.
సరిగ్గా అప్పుడే హారతి పళ్ళెంతో ఆ గదిలోకి ప్రవేశించింది మందార వల్లి.
లిఖిత లేచి నిలబడి హారతి కళ్లకద్దుకుంటూ తల్లి మొహంలోకి చూసింది. హారతి జ్వాలలో ఆవహించిన దుర్గలా వుందామె ఆకృతి.
మల్లెతీగయు ఏకమల్లెను మచ్చికే సుమ అందమే 
తల్లిభాధయు అంతయూ తమ భావమే మరి అందమే 
వల్లి ఆకృతి సంధ్య వెల్గుగ వెన్నెలద్దియు అందమే 
తల్లిమల్లిగ  సద్దుచేయగ తల్లిమాటలొ అందమే
లిఖిత కిటికి తలుపు తెరచి బయటకి చూసింది.
చీకటింకా చెక్కు చెదరలేదు. భూమిని స్పర్శించడానికి వెలుగుకింకా ధైర్యం చిక్కలేదు. చలిగాలి మాత్రం తీసిన తలుపు రెక్క సందులోంచి దొంగలా జొరబడి లిఖిత మొహం మీద తీవ్రంగా దాడి చేసింది.
చీకటింకయు మార్పుతేకయు చిద్విలాసము విస్తరే 
చీకుచింతయు లేకయే మరి చల్లగాలితొ విస్తరే
ఆకుమారక వెల్గుకంతకు ఆర్యమొప్పఁకు విస్తరే  
రేఖమోహము తీవ్రమెత్తగ రంగులా జొర  విస్తరే
లిఖిత తలుపు గబుక్కున మూసి “నీకెన్ని సార్లు చెప్పాలి. ఇంత తొందరగా లేవడమెందుకు చెప్పు?” అంది కోపంగా.
“నాకలవాటైపోయింది. ఈ వేళప్పుడు పూజ చేయకపోతే పిచ్చెక్కినట్లుంటుంది. అది సరే. నువ్వు లేచి మొహం కడుక్కో. నేను కాఫీ తెస్తాను” అంటూ లోనికెళ్లిపోయింది మందార వల్లి.
నీడమాటకు జంకకుండగ  నిప్పుకోడిల వుండెనే 
అడ్డమొచ్చిన మాటమార్చక పూజచేయుట కుండనే 
నడ్డిపెర్గియు అందచందము నప్పుకారము అయ్యెనే 
దొడ్దిఅంతయు గుప్పుగుప్పున దుళ్ళేవాసన ఉండనే
లిఖిత లేచి దుప్పటి మడిచి బాత్రూంలోకి నడిచింది. గీజర్ ఆన్ చేసి బ్రష్ చేసుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చిందామెకు. ఆరోజు కాన్వకేషన్ అని. మనసులోకి ఉత్సాహం పంప్ చేసినట్టు తన్నింది.
ఉత్సవం మది  గుర్తుకొచ్చియు  ఊహ అంతయు  తొందరే 
మత్యమల్లెయు  పాఠమంతయు మల్లి చెప్పుట తొందరే
సత్యపల్కుయు బిడ్డలేఖకు శాంతిమార్గము  తొందరే 
నిత్యసత్యము బత్కునీడలో నమ్మ బుద్ధిగ తొందరే
  
ఈరోజు తాను బి.ఎ. పట్టా తీసుకోబోతోంది మామూలుగా కాదు.. గోల్డ్‌మెడల్‌తో. తను యూనివర్సిటీ ఫస్టు వచ్చింది అదీ లిటరేచర్‌తో. ఈరోజు ఎన్నో కళ్ళు తనని ఆరాధనగా చూస్తాయి. గవర్నర్ ప్రశంసిస్తూ మెడల్‌ని తన మెడలో వేస్తాడు. వేలాది పట్టభద్రుల్లో తనకి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం.
--(())--  

                                                                                                                 
ఆ విషయం స్ఫురించగానే లిఖిత మొహమంతా సంతోషం అందుకొంది.
వయసు తెచ్చిన అందం, ఆనందంతో కలిసి ఆమె మరింత అందంగా కనిపించింది ఎదురుగా వున్న అద్దంలో.
“అమ్మా!” అంటూ గట్టిగా అరచింది లిఖిత ఉషారుగా.

సంతసం ఒక ఆణిముత్యము సుస్వరస్వము హాయిగా
వింతమాయయు దేహమంతయు వమ్ముచేయక హాయిగా
చింతలేకయు సంతసమ్ముగ చెమ్మగిల్లెను హాయిగా
నీతివల్లన విద్యసాధన నిత్యమవ్వును హాయిగా 

“ఊ”.
“ఇలారా”
“ఉండొస్తున్నా!”
“వెంటనే ప్లీజ్!”
మందారవల్లి ఆందోళనగా వంట గదిలోంచి బయటకొచ్చి “ఏం జరిగింది? ఎందుకలా అరిచేవ్?” అని అడిగింది అర్ధం కాక.

“ఏవీ లేదా? సరిగ్గా చూసి చెప్పు!” అంది లిఖిత
“ఏమో నాకేం కనిపించడం లేదు. నీ మొహం తప్ప!”
“అదే నా మొహమే ఎలా వుంది?”

ఉన్నమాటకు తెల్పకుండగ ఉత్సవమ్ముగ  పల్కుటే 
అన్నమాటకు కట్టుబాటుకు తల్లితో లిఖి పల్కుటే 
కన్నవారికి  బిడ్దతీర్చుట కష్టనష్టము పల్కుటే 
చిన్నెలన్నియు వన్నెలన్నియు చిన్నపల్కులు పల్కుటే     
  
లిఖిత ప్రశ్నకి చిరాకు పడుతూ “ఎలా వుంటుంది, నీ మొహంలానే వుంది” అంటూ వెనుతిరిగింది మందార.
లిఖిత గబుక్కున తల్లి భుజాలు పట్టుకొని తనవైపు తిప్పుకుని “ఏంటి? నా మొహం నా మొహంలానే వుందా? హెలెన్ అఫ్ ట్రాయి, క్లియోపాట్రాల్లా వెలిగిపోవడం లేదూ!” అండిగింది సీరియస్‌గా.

పాత్రుడంచు ప్రభుత్వమందలి ప్రౌఢులెందరొ యోగ్యతా 
పత్రముల్ దయ చేయుటే లిఖి ప్రజ్ఞతే బహుమానము పొందుటే
స్తోత్రముల్ విని చిత్తశుద్ధియు శాంతి కల్గుట ఇష్టమే  
క్షేత్రగావుము ముద్దమల్లిక క్షేత్రసొంతము పొందుటే  

  లిఖిత చిలిపి మాటలకు మందార నవ్వలేదు.
“ఏమో వాళ్లని నేను చూడలేదు. నేనీ రోజు ఫాక్టరీకి త్వరగా వెళ్లాలి. నువ్వొచ్చి కాఫీ తాగు” అంది ఎంతో ఉదాసీనంగా.
లిఖిత తల్లివైపు నివ్వెరబోతున్నట్లుగా చూసి “ఏంటీ! ఈ రోజు కూడా ఫాక్టరీ కెల్తావా? ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా మెడల్ తీసుకోబోతున్న విషయమన్నా గుర్తుందా నీకు?” అంది నిష్టూరంగా.

“దానికి నేనేం చేయను? ఈ రోజు స్టాక్ సింగపూర్‌కి ఎక్స్‌పోర్టవుతున్నది. నేను దగ్గర లేకపోతే గల్లంతు చెస్తారు” అంది మందార.
తల్లి జవాబుకి లిఖిత కళ్లలో నీళ్లు చిమ్మేయి.
ఇంకేం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లి మనస్తత్వం ఆమెకి బాగా తెలుసు. ఇంకేం మాట్లాడినా నిష్ప్రయోజనమనీ తెలుసు.

పగలు నగరాలలో  వున్న కేయూర ప్రింట్స్ ఫాక్టరీలో ఒక యంత్రంలా పని చేసి ఏమాత్రం టైము దొరికినా మిగతా కాలాన్ని పూజగదిలో మంత్రోచ్చారణకే జీవితాన్ని అంకితం చేసిన తన తల్లిని కదలించడం చాలా కష్టమని లిఖితకి ఎన్నో సార్లు అర్ధమయింది.

అందుకే లిఖిత తల్లితో తర్కించదు.
మందారవల్లి కాఫీ తెచ్చి కూతురికందించి వెళ్లిపోయింది.

--(())-- 

అప్పుడు కూడా ఆమె కూతురు చిన్నబుచ్చుకుందేమో ఊరడించాలన్న వూహకి కూడా అందకుండా వెనుతిరిగి వెళ్లిపోయింది.

లిఖిత కప్పు తీసుకుని మెల్లిగా తలుపు తీసి బయటకొచ్చింది.
అప్పుడే చిన్నగా తెల్లవారుతోంది.
ఎదురుగా వున్న సముద్రం – ఆకాశం బూడిద రంగులో కనిపిస్తున్నాయి. పక్షులు చాలా అవసరమైన పనులున్నట్లు కువకువలాడుతూ రెక్కలు సాచి గూళ్ళొదిలి వెళ్ళిపోతున్నాయి.

చిన్నబుచ్చుట అంబరం కళ మారుటే లిఖి ఊహాలే
కన్నమాటకి విచ్చు రెక్కలు కొత్తపొంతల ఊహాలే 
ముత్యమల్లెను రాత్రివెల్తురు మంచుబిందువు ఊహాలే
సప్తవర్ణపు కాంతిరేఖలు బిడ్డకళ్లకు ఊహాలే
             
రాత్రి కురుసిన మంచి బిందువులు నేలపై మొలిచిన గరిక కొసలపై నిలబడి సూదితో గుచ్చిన ముత్యాల్లా మెరుస్తున్నాయి.
క్రమంగా చీకటి ఛాయల్ని పూర్తిగా తరిమికొట్టి ప్రకృతినంతా పరిపాలించసాగింది వెలుగు. మరి కాస్సేపటిలో సప్తవర్ణాశ్వరధారూఢుడైన సూర్యుడు సముద్ర గర్భంలోంచి బయటికి రావడం ఎంతో సంతోషంగా గమనించింది లిఖిత.
ఆ దృశ్యాన్నామె ఇంచుమించు ప్రతిరోజూ చూస్తోంది. అయిన ఏ రోజు కా రోజు దృశ్యం ఆమె కనులకి పండుగ చేస్తూనే వుంటుంది.

దేవుడే  నిజ భక్తినే కను లారగా గమ నించియే 
జీవుడే తమ వేదమే విను భావమే జయ మిచ్చుటే 
 రేవుకే చెరు సంద్రమే పలు ఉర్కళే లిఖి ఇష్టమే 
నీవునేను అనే పదం లత తల్లిమాటయె దిక్కుగా 

సూర్యోదయా నికి ముందు ఆకాశంలో అతి త్వరితంగా మారే రంగులు గమనిస్తే దేవుడు ఒక అద్భుతమైన చిత్రకారుడనిపించక మానదు. అంతే కాదు – ప్రపంచంలో ఏ చిత్రకారుడు అంత గొప్పగా రంగుల్ని మిశ్రమం చేయలేడు. అనుకుంది లిఖిత.
క్రింద గేటు చప్పుడు వినిపించి ఆలోచనల నుండి బయటపడి క్రిందకి తొంగి చూసిందామె.

గేటుని బార్లా తెరిచి స్టీరింగ్ సీట్లో కూర్చుని కారుని డ్రైవ్ చేస్కుని వెళ్ళిపోతున్న తల్లిని చూసి నిర్లిప్తంగా లోనికి నడిచింది.

చోటు చెప్పేది తల్లి సేవయు ఎంతచెప్పిన తక్కువే 
మాట తోభయ మోచ్చియు పటాటోపలు పల్కులే
ఆట పాటయు చక్కబెట్టుట చిన్న నాటియు నుండియే 
వాట ఏదియు లేక ఉన్నను ప్రేమ మాత్రము తగ్గదే 

తన తల్లి చాలా చిత్రమైన మనిషి. ఆమె మనసులో ఏముంటుందో ఎవరికీ అర్ధం కాదు. తన పనులు తాను యంత్రంలా చేసుకుపోతుంది. బాధ్యతల్ని తు.చ తప్పక పాటిస్తుంది. ఆమె ప్రవర్తన చూస్తే ఆమె జీవితంలో బాగా దెబ్బ తిన్న మనిషిలా ఆనిపిస్తుంది. అదీ పరిస్తితులతో కాదు మనుషులతో!

అదీ భర్తతో!
అతని గురించామెప్పుడూ మాట్లాడదు.
ఇంతకీ తనకి తండ్రున్నాడో లేదో…

ఏమిజర్గునొ ఎంతనొప్పునొ భాద్యతల్లును గుర్తుగా
మంచిచేసియు చెడ్డచేసియు తల్లిసేవల గుర్తుగా 
దెబ్బతిన్నను కష్టమున్నను బిడ్డపెంపక గుర్తుగా 
భర్తలోటును అగ్నిసాక్షిగ మభ్యపెట్టుచు గుర్తుగా 
  
టైమెంతో తెలియదు.
తెలియదనే కన్నా తెలుసుకోవాలన్న ఆసక్తిని మరచి ఎదురుగా వున్న టేబుల్‌వైపే చూస్తున్నాడు డాక్టర్ రామభద్రన్ .
టేబుల్ మీద బోర్లించిన ఆరడుగుల పొడవు, రెండున్నరడుగుల వెడల్పుగల రెక్టాంగులర్ పెట్టె లోపలంతా లేత ఊదారంగు పరచుకొనుంది. సరిగ్గా పరికించి చూస్తే ఆ పెట్టెలో ఒక ప్రాణి వున్న ఉనికిని తెలియజేస్తూ పైకి క్రిందికి ఎగసిపడుతున్న పొట్ట భాగం – ఉచ్చ్వాసనిశ్వాసాలని తెలియజేస్తూ చిన్నగా కదులుతోంది.  రామభద్రన్ కళ్లలో ఒకలాంటి సంతృప్తి – విజయం తాలూకు గర్వం – మరోపక్క అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఓటమి తాలూకు భయసందేహాలు వెలుగునీడల్లా దోబూచులాడుతున్నాయి.,
అతని పక్కనే కూర్చుని ఒకసారి గాజుఫలకంలోని ప్రాణివైపు – మరోసారి రామభద్రన్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు మీనన్.
అతని కళ్లలో ఆందోళన మాత్రమే కదలాదుతున్నది.
--(())--

కారణం ఆ పెట్టెలో ప్రాణంతో గత రెండురోజులుగా పోరాడుతున్నది అతను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య కావడం.
రామభద్రన్ మీనన్ భార్యకి అమర్చిన ట్యూబులు మరోసారి పరీక్షించి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.


నిన్నునీ మహిమం బెరుంగక  నిందచేసియు ఉండెనా 
కాన మాయకు చిక్కి ఉండితి చేయ లేకయు ఉండెనా 
మానుకున్నను ఆకలే మరి బత్కుమార్గము ఉండదే 
మానుమర్మము ఎంతచూసిన కాలధర్మము మారదే 
  
మరో గంట గడిచింది. అతి స్తబ్దంగా – ప్రతి క్షణం రబ్బరులా సాగుతూ.
అంత టెన్షన్‌లోనూ అతనికొక్కసారి నిద్ర వచ్చినట్లయింది. కళ్లు తెలియకుండానే మూసుకున్నాయి. మనిషి జయించలేనిది మరణమే కాదు – నిద్ర కూడా. ప్రతి ప్రాణి ప్రతిరోజు కొన్ని గంటల కాలమైనా నిద్ర రూపంలో తాత్కాలిక మరణానికి గురికాక తప్పదు. నిద్రని జీవితం నుండి విభజిస్తే మనిషి బ్రతికే కాలం అతిస్వల్పం. ఆ స్వల్పానికే మనిషి శాశ్వతంగా వుండిపోతున్నట్లు పక్కమనిషిని దోచుకుంటాడు. కలహిస్తాడు. విపరీత స్వార్ధానికి గురయి అన్నం పెట్టిన చేతినే కొరకాలని ప్రయత్నిస్తాడు. అందలాలెక్కాలని కలగంటాడు. ఇంకా యింకా బాగుపడాలని దొంగ పూజలు చేస్తాడు. తన ప్రగతి కోసం పక్కవాడికి సమాధి కడ్తాడు. అబద్ధాలడతాడు. కృతజ్ఞతని మరచి మృగంలా బతుకుతాడు.

బాల్యమంతయు బత్కువేటలె దోచిదాచుకొ లేనివే 
శల్యమైనను భవ్యమైనను దివ్యమైనను లేనిదే 
అల్పమైనను పాణమైనను శాశ్వతం మరి కానిదే 
వల్లమాలిన భక్తికైనను రక్తికైనను ఒక్కటే 
 
ఈ ఆలోచనలేమీ పట్టని రామభద్రన్ గత ఇరవై సంవత్సరాలుగా మనిషికి మరణమనేది శాశ్వతంగా లేకుందా చెయాలని ప్రయోగశాలలో అకుంఠిత దీక్షతో ఒక తపస్సులా నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. అక్కడే అతనికి పొద్దు పొడిచింది. చీకటి గ్రుంకింది. అక్కడే అతని యౌవనం నిర్వీర్యమై వృద్దాప్యం ఆవరించింది. అక్కడే అతని వత్తయిన నల్లని ఉంగరాల జుత్తు తెల్లబారి రాలిపోయింది. అక్కడే అతని మెరిసే కళ్లు గాజుగోలీల మాదిరి కళావిహీనమై పేలవంగా మారిపోయింది.

దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో  మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం
  
ఒక్క మాటలో చెప్పాలంటే అతని విలువైన జీవితమంతా కర్పూర హారతిలా కరిగిపోయిందా ప్రయోగశాలలోనే!
రామభద్రన్ కే స్వార్ధమూ లేదని చెబితే అది అబద్ధమే అవుతుంది. అతనికీ ఆశ వుంది. బలమైన కోరిక వుంది.
అది మనిషి జీవిత నిఘంటువు నుండి మరణమనే పదాన్ని పూర్తిగా తొలగించాలని!
ఆ ఘనత ప్రపంచ దేశాలన్నింటిలోనూ తనకే దక్కాలని.
అంత బలమైన కోరిక శుభ్రంగా తిని, హాయిగా పడుకుని నిద్రపోతూ కాలం గడిపే ఏ మనిషికీ పుట్టదు.
రాపిడి నుండే అగ్ని పుడుతుంది.
అనంతమైన కష్టాలు, కన్నీటి నుందే మనిషి నిష్ణాతుడవుతాడు.
రామభద్రన్ కి తను చాలా ప్రేమించే తల్లి నాల్గు రోజుల జ్వరానికే చనిపోయింది.
ఎంటొ అభిమానించే తండ్రి రైలు ప్రమాదంలో మరణించేడు. మిగిలిన ఒక్క చెల్లి డయేరియాతో ఈ లోకాన్ని విడిచింది.
అప్పటికి  రామభద్రన్ వయసు పదమూడు సంవత్సరాలు మాత్రమే. వరుసగా ఒకే సంవత్సరంలో అతని జీవితంలో జరిగిన విపత్కారాలు అతని లేత హృదయాన్ని చిద్రం చేసేయి. గుండెలవిసేలా ఏడ్చేడు కొన్నాళ్లు. తర్వాత్తర్వాత కన్నీళ్లు కూడా రావడం మానేసేయి.

స్వాభిమానము విద్యమానము మండుటెండల మాదిరే 
ఆభిజాడ్యము అమ్మనాన్నల అత్తమామల మాదిరే 
భిభత్యమము వచ్చిపోవును మానుషం కథమాదిరే 
జెబ్బజర్చియు మొండిపట్టుగ బత్కుకోరుట కష్టమే

గుండె మీద ఏదో బరువు పడేసి బలంగా నొక్కుతున్న బాధ. చదువు సరిగ్గా చదవలేకపోయేవాడు. స్కూలు ఎగ్గొట్టి ఊరి పొలిమేరలు దాటి మైళ్ళ కొద్ది అగమ్యంగా నడిచేవాడు.
వెళ్లగా వెళ్ళగా ఏదో పరిష్కారం దొరుకుతుందనే వెర్రి ఆశకి గురయ్యేదతని మనసు. శూన్యంలోకి చూపులు నిగిడ్చి తనకి కావల్సిందాన్ని వెదుక్కునేవాడు.

--(())--

నీలాకాశంలో పేర్చినట్లున్న తెల్లని మబ్బులు వెనుకనుండి అతని తల్లి తనని చేతులు సాచి ఆర్తిగా పిలిచినట్లనిపించేది.
పసి వయసులోనే తన బాధ్యత తీర్చుకోకుండా కార్తికేయన్‌ని ఒంటరిగా వెళ్లిపోయినందుకి విచారిస్తున్నట్లుగా కనిపించేదతని తండ్రి రూపం.
దిక్కులేని అన్నని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించేదతని చెల్లి.
రామభద్రన్ లేత హృదయం వేటు తిన్న గువ్వలా గిలగిల్లాడేది. గుండెలో లుంగ చుట్టుకుని గొంతు కడ్డంపడి కరగని మంచు ముక్కలాంటి దుఃఖం అతన్ని అణువణువునా నలిపేసేది!
అప్పుడే అతని హృదయంలో మరణం పట్ల ఒక రకమైన ద్వేషం – దాన్ని జయించాలన్న బలమైన కోరిక ప్రోది చేసుకోనారంభించేయి.
ఎలా?
ఏ విధంగా?
అస్పష్టమైన భావాలు.
నిర్దుష్టత నెరుగని ఆలోచనలు.
జవాబు దొరకని ప్రశ్నలు.
అప్పుడే సరిగ్గా తనని లాలించి ఇంతన్నం పెడుతున్న మేనత్త కూడా ఉన్నట్టుండి విరుచుకుపడి చనిపోయింది.
హార్టెటాక్ అన్నారందరూ!
మేనమామ ఆమె మీద పడి ఏడుస్తుంటే కార్తికేయన్ ఆ దృశ్యాన్ని చూడలేకపోయేడు.
మనసు మెలితిప్పి పిండుతున్న గుడ్డలా తల్లడిల్లిపోయింది.
ఎందుకిలా – తనకి ఎవర్నీ లేకుండా చెయ్యడం.
ఈ చావనేది యింత చెప్పా పెట్టకుండా – ఎలాంటి సూచననివ్వకుండా ఒక్కసారి కలుగులోంచి అకస్మాత్తుగా బయటకొచ్చిన కాలసర్పంలా మనిషి మనుగడనెందుకు కాటేసి వెళ్లాలి?
అసలీ చావెందుకు?
ఇదింత అనివార్యమా?
దీన్నుండి మనిషికి విముక్తి లేదా?
భూమి గుండ్రంగా వుందని – దాన్ని పాములా అనంతమైన జలరాశి చుట్టుకుని వుందని – సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని – ఆకాశం శూన్యమని ఎందుకీ అనవసరపు జ్ఞానం?
విమానంలో కొన్నివేల మైళ్ళని కొన్ని గంటల్లోనే చేరుకోగలనని, టి.విలో ఎక్కడెక్కడివో చూడగలనని, వినగలనని, ఎన్నెన్నో తన మేధస్సుతో కనుక్కుని సుఖపడుతున్నానని మిడిసిపడే మనిషి – మరణం తన మెడలో పాములా చుట్టుకునే కూర్చుందని – దాన్ని అధిగమించలేని తన తెలివి బూడిదలో పోసిన పన్నీరని గ్రహించలేకపోతున్నాడే!
అకస్మాత్తుగా అతని దృష్టి మేనత్త సాంప్రదాయ సిద్ధంగా శిష్టాచారాలతో, అనంత భక్తిభావంతో తెల్లవరాగానే పూజించే దేవుడి పటాల మీద పడింది. అనేక రూపాలతో, అనేక చేతులతో ఆశీర్వదిస్తూ, స్మిత వదనాలతో వున్నాయి దేవుడి రూపాలు.
ఈ యావత్ ప్రకృతిని, ప్రాణుల్ని శాసించే ఒక అద్భుత శక్తి వుందని నమ్మి పూజించిన అత్తని ఈ దేవుళ్లెవరూ మరణం నుండి కాపాడలేకపోయారే?
అసలు దేవుడనే వాడున్నాడా?
ఉంటే..! వాడి పని కేవలం మనిషిని ఏడిపించడమేనా?
స్థితిని వదిలేసి సృష్టి, లయలు చేయడమేనా అతని వృత్తి.
అంటే దేవుడొక శాడిస్టన్నమాట.
అంతే!
రామభద్రన్  హృదయం భగ్గున తాటాకులా మండింది.
అతను ఆవేశంతో తన చేతికందిన వస్తువుని తీవ్రంగా పూజాపటాలకేసి కొట్టేడు.
పటాలన్నీ మేకుల నుండి వూడిపడి భళ్ళున పగిలి గాజు ముక్కలు చెల్లాచెదురయ్యాయి. అందులోని సూదిగా వున్న ఒక పెంకు వేగంగా వచ్చి అతని మేనమామ నుదుటకి తీవ్రంగా గుచ్చుకుని వెచ్చని రక్తం జలజలా బయటకి దూసుకొచ్చింది.
అతన్ని పరామర్శించడానికొచ్చిన చాలామంది దృష్టి కార్తికేయన్ మీద పడింది.
“ఈ నష్టజాతకున్నెందుకు కొంపలో తెచ్చిపెట్టుకున్నావ్? వాడు రాగానే లక్షణంగా వున్న అన్నపూర్ణమ్మ ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా ఠక్కున చచ్చిపోయింది. వాణ్ణి ముందు వెళ్లగొట్టు” అన్నారు.
“అవును. కొందరు కాలుపెడితే అంతే.”
“ఆవిడ పాలిట మృత్యువు వీడు”
“అమ్మా బాబుని, చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు మేనత్తని. ఇంకో నాల్రోజులుంటె…”
వాళ్ల మాటలతో అసలే భార్య చనిపోయి రోదిస్తున్న అతని మేనమామ హృదయంలో సహనం పూర్తిగా చచ్చిపోయింది.
ఒక చేత్తో నెత్తురు ఓడుతున్న నుదుటిని అదిమి పట్టుకుని లేచొచ్చి, మరో చేత్తో  రామభద్రన్   మెడ పట్టుకుని బలం కొద్దీ తోసేస్తూ “పోరా దరిద్రుడా!” అన్నాడు తీవ్రంగా.
రామభద్రన్ విసురుగా గుమ్మం అవతల పడ్డాడు.
మోచేతులు, మోకాళ్లూ గీసుకుపోయి రక్తం చిప్పిల్లింది. వెన్నెముక బెణికి “అమ్మా” అన్నాడు బాధగా. అతని స్థితి చూసి ఏ ఒక్కరికీ జాలి కలగలేదు.  రామభద్రన్ మెల్లిగా లేచి దూరంగా వెళ్లి కూర్చున్నాడు.
ప్రాణాన్ని వదిలేసిన మేనత్త శరీరానికి స్నానం చేయించి పట్టుచీర కట్టేరు. నిండుగా బొట్టు పెట్టి పూలు ముడిచేరు. మెడలో దండ వేసి పాడెక్కించేరు.
“గోవిందా.. గోవిందా” అంటూ పాడె లేచింది.
మేనమామ నిప్పు వేసిన కుండ తీసుకుని ముందు నడుస్తుంటే.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం తన తల్లికి చేసిన అంతిమ యాత్రం గుర్తొచ్చిందతనికి.
కడుపులో పేగులన్నీ మెలేసి తిప్పేస్తున్నట్లయింది.
“అమ్మా! అమ్మా!” అంటూ ఏడుస్తూ మేనత్త నిర్జీవ రధాన్ని వెంబడించి పరిగెత్తేడు తను స్మశాన వాటిక దాక.
చితి అంటుకుంది. రెండు గంటల మునుపువరకు కదలాడి, నవ్వి, మాట్లాడిన మనిషి క్షణాల్లో బూడిదగా మారిపోయింది.
అందరూ వెళ్ళిపోయేరు.
అక్కడే మోకాళ్ల మీద తలపెట్టుకుని చూస్తూ కూర్చున్నాడతను. కాలమెంతయిందో తెలియదు. తూర్పు నుండి చీకటి కోరలు సాచి పైపైకి వస్తున్న ఆ సాయం సంధ్యలో అతని భుజమ్మీదొక చెయ్యి పడింది.
ఉలిక్కిపడి చూసాడతను..

ఇంకా వుంది..


బ్రహ్మలిఖితం – 2

రచన: మన్నెం శారద

రక్తంలో ముంచి తీసినట్లున్న ఎరుపురంగు జడలు కట్టిన వెంట్రుకలు, వళ్ళంతా రాసుకున్న బూడిద, మురికి బారిన కాషాయరంగు వస్త్రాలు, మెడలో రుద్రాక్షలు – చూడగానే భయం కొలిపే ఆకృతిలో వున్న ఒక సాధువులాంటి వ్యక్తి కార్తికేయన్ ఎదురుగా నిలబడి వున్నాడు.
స్మశానాన్ని చూసి చలించని కార్తికేయన్ లేత శరీరం అతన్ని చూసి చిన్నగా వణికింది. అతనదోలా నవ్వాడు.
“భయపడుతున్నావా?”
“ఊహూ” అబద్ధం చెబుతూ లేచి నిలబడ్డాడు కార్తిక్.
“ఎవరు పోయేరు?”
“మా అత్త”
“అమ్మ లేదా?” ముందుకు నడుస్తూ అడిగేడతను.
“చచ్చిపోయింది.”
“నాన్న?”
“ఆయనా చచ్చిపోయేడు”
“ప్రస్తుతం ఎవరూ లేరన్నమాట!” అతను స్మశానానికి పక్కగా వున్న మర్రిచెట్టు క్రింద కూర్చుంటూ అన్నాడు.
కార్తికేయన్ జవాబు చెప్పలేదు.
“రా!కూర్చో!”
అతని పక్కనే కూర్చున్నాడు కార్తికేయన్.
అతను తన జోలెలోంచి అన్నం, కూరలు బయటికి తీసి కొద్దిగా ఒక ఆకులో వేసిచ్చి “తిను” అన్నాడు.
“ఊహూ.. వద్దు” అన్నాడు కార్తికేయన్ మొగమాటంగా.
“ఎవరు చచ్చిపోయినా, ఎవరు బ్రతికినా ఆకలి, నిద్ర ఆగవు నాయినా! ఎన్నాళ్లని పొట్ట మాడ్చుకుంటావు తిను” అన్నాడతను తను తింటూ.
కార్తికేయన్ అయిష్టంగానే ఆకు దగ్గరకి తీసుకుని మెల్లిగా అన్నం, కూర కలపసాగేడు.
ఎక్కడో ముష్టెత్తి తెచ్చిన అన్నమది. అన్నం, కూరలు కలగాపులగంగా ఉన్నాయి. ఆకలనిపిస్తున్నా ఎప్పుడూ అలాంటి భోజనం తినలేదతను. అంతరాంతరాల్లో బాగా బతికిన భేషజమడ్డొచ్చినా ఆకలి అతన్ని తినేలా చేసింది. ఇద్దరూ ఆ పక్కనే వున్న చిన్న కుంటలో చేతులు కడుక్కున్నారు.
అతనా చెట్టు క్రిందే మేనిని వాల్చి గట్టిగా ఆవులించేడు.
కార్తికేయన్ అతని పక్కనే కూర్చుని “మీరు తపస్సు చేసేరా?” అనడిగేడూ.
అతనవునన్నట్లుగా తల పంకించి “హరిద్వారం, ఋషికేష్ అన్నీ చుట్టొచ్చేం” అన్నాడు.
“దేని కోసం?”
కార్తికేయన్ ప్రశ్నకి అతను తడబడినట్లుగా చూశాడు.
చివరికి “మనశ్శాంతి కోసం “అన్నాడూ నిదానంగా నవ్వి.
ఆ జవాబు విని కార్తికేయన్ నిరుత్సాహపడ్డాడు.
అతని మొహంలోని ఆశాభంగాన్ని కనిపెట్టి “ఏదో అడగాలనుకుంటున్నావు కదూ!” అన్నాడు మెల్లిగా.
“మీకు మనశ్శాంతెందుకు లేదు?”
“అన్నీ పోగొట్టుకున్నాను కాబట్టి”
“అన్నీ అంటే… డబ్బా?”
“కాదు.. భార్యని, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని.. అందర్నీ..”
“ఎలా?”
“ఉప్పెన. మహమ్మారిలాంటి ఉప్పెన ఆదమరచి నిద్రపోతుంటే అర్ధరాత్రి ఒక్కసారి మీద పడి మమ్మల్నందరినీ విడదీసింది. నాకొక్కడికే ఈత వచ్చు. ఎలాగో బతికి బయటపడ్డాను. ఒక చెట్టు కొమ్మన మూడు రోజులు కూర్చున్నాను. పాములతో పాటూ. క్రింద కొట్టుకుపోతున్న శవాలు!”
“భయమెయ్యలేదూ?”
“ఎందుకు? అవి కూడా మనలాగే ప్రాణభయంతో వచ్చి చెట్ల మీద కూర్చున్నాయి. ఇక శవాలా? అంతకు ముందు క్షణం వరకు మనతో కలిసిమెలిసి తిరిగిన ఆప్తులవే కదా”
“మీవాళ్ల శవాలు దొరికేయా?”
“లేదు. వాళ్ల కోసం వెతుకుతుంటే వందలాది ఇతరుల శవాలు కనిపించేయి. దుఁఖంలోంచి విరక్తి ప్రవేశించింది. నాదనుకున్న పంట నాశనమైంది. నాదనుకున్న భూమి ఒండ్రుక కప్పేసింది. నాదనుకున్న ఇల్లు కూలిపోయింది. నాదనుకున్న మనుషులు కొట్టుకుపోయేరు. వైరాగ్యంతో రైలెక్కేను. ఎక్కడెక్కడో తిరిగేను. ఎవరెవరో స్వాముల్ని ఆశ్రయించేను. ఎంత తిరిగినా నాకా మనశ్శాంతి లభించనే లేదు నాయినా?”
అతని వైపు కార్తికేయన్ సందేహంగా చూశాడు.
“మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలో మీకు తోచనేలేదా?”
అతను కార్తికేయన్ కేసి అదోలా చూసి “ఏం చేయాలి?” అనడిగేడు.
“మరణం లేకుండా చెయ్యడం. ఆ విద్య మీకెవరూ నేర్పలేదా?”
అతను కార్తికేయన్ వైపు విభ్రమంగా చూసి “అదెలా సాధ్యం?” అనడిగేడు.
“ఎందుకు సాధ్యం కాదు? రెండు సన్నని ఇనుప పట్టాలు పట్టుకుని రైలంత వేగంగా ఎలా పరుగు తీస్తోంది? అంత బరువైన విమానం గాలిలోకెలా లేచి అంత వేగంగా వేళ్తోంది. కొన్ని వేల మైళ్ల అవతల మనిషి మాట్లాడిన మాటలు టెలిఫోనులో అంత స్పష్టంగా ఎలా వినిపిస్తున్నాయి. అలాగే చావులేని మందో, మంత్రమో ఒకటుండి తీరుతుంది. దాని కనుక్కోవాలన్న జిజ్ఞాస వస్తే తప్పకుండా సాధ్యమవుతుంది స్వామి!”
ఈసారి సాధువు కళ్లకి కార్తికేయన్ ఒక పదమూడేళ్ళ పసికుర్రాడిలా కనిపించలేదు. అంతకంతకు లోతైన మరో మనిషి అతనిలో వున్నాడనిపించింది. అతను చాలాసేపు ఆలొచిస్తూ, నింగిలోని మిణుకుమిణుకుమనే నక్షత్రాల్ని తదేకంగా చూస్తూ పడుకున్నాడు.
ఆకలి కొద్దిగా తీరడంతో కార్తికేయన్ కూడా అక్కడే ఒరిగి నిద్రపోయేడు.
తెలతెలవారుతుండగా కార్తికేయన్‌ని ఎవరో కుదిపి లేపటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
ఎదురుగా సాధువు!
“పద, పోదాం!”
“ఎక్కడికి?”
“మరణానికి మందు కనుక్కుందాం”
ఆ మాట వినగానే కార్తికేయన్‌లో ఉత్సాహం చోటు చేసుకుంది. అతన్ని వెంబడించేడు.
తిన్నగా రైల్వే స్టేషనుకెళ్ళి ఇద్దరూ రైలెక్కేరు.
రైలు మద్రాసులో ఆగింది.
అక్కడ తిరిగి బస్సెక్కేరు. బస్సు సాయంత్రానికి కుంభకోణం దగ్గరున్న ఒక చిన్న కుగ్రామంలో ఆగింది. కాలినడకన ఆ దగ్గర ప్రాంతంలో వున్న చిన్న అడవిలోకి తీసుకెళ్ళేడతన్ని సాధువు.
ఒక రెండు కిలోమీటర్లు నడిచేక ఒక చిన్న తాటాకు గుడిసె ముందాగాడు సాధువు. చిన్నగా గుమ్మాన్ని మూసివున్న తడిక మీద తట్టేడు.
అయిదు నిమిషాలనంతరం తడిక చిన్నగా తెరుచుకుంది.
ఆకలితోనూ, ఎంతో దూరం కాలినడకన నడిచిన నీరసంతోనూ తూలుతున్నాడు కార్తికేయన్. తడిక తెరుచుకోగానే కనిపించిన దృశ్యం చూసి అతని శరీరం జలదరించింది.
ఎదురుగా నాలుక బయటికి సాచి, జుట్టు విరబోసుకుని కపాలహారం మెడలో ధరించిన ఎనిమిది చేతుల కాళి విగ్రహం వికృతంగా బెదిరిస్తున్నట్లుగా కనిపించింది. అంతకంటే భయానక దృశ్యమేమిటంటే తెల్లని గడ్డమున్న ఒక నల్లని కంచు విగ్రహంలాంటి మనిషి ఒక గొర్రెపోతుని చంపి దాని తలని పట్టుకుని రక్తాన్ని ఒక గిన్నెలోకి పడుతున్నాడు.
కార్తి వణికిపోతూ సాధువు నడుంని గట్టిగా పట్టుకున్నాడు.
సాధువు చిన్నగా నవ్వి “భయపడ్డావా?” అనడిగేడు.
కార్తి జవాబు చెప్పలేదు.
ఎర్రని, చిక్కని రక్తంతో పాత్ర నిండుతుంటే పక్కనే పడివున్న గొర్రెపోతు మొండెం చాలాసేపు కొట్టుకుని నిటారుగా బిగిసిపోయింది.
ప్రాణం పంచభూతాలలో కలిసిపోతూ, పోతూ చేసిన పోరాటం హృదయవిదారకంగా మనసుని తీవ్రంగా చలింపచేసేదిగా వుంది.
కార్తి పెదవులు సన్నగా వనికేయి.
అప్పటికప్పుడే అతని శరీరం వేడెక్కి జ్వరమొచ్చినట్లయింది.
సాధువు కార్తి నడుం చుట్టూ చెయ్యేసి చిన్నగా తడుతూ”వణక్కం సిరియాక్కారన్ సావీ” అన్నాడు.
కంచు విగ్రహం తల తిప్పి సాధువు వైపు, కార్తికేయన్ వైపు చూసి చిరునవ్వు నవ్వి “కూర్చో! దేవికి హారతి చేసి మాట్లాడతాను” అన్నాడు తమిళంలోనే.
చూస్తుండగానే సిరియక్కారన్ అరచేతిలో కర్పూరముంచుకొని శంఖాన్ని పూరిస్తూ దేవికి హారతిచ్చేడు. అతని శిష్యుడు గంట వాయించేడు. క్షణాల్లో ఆ ప్రడేశమంతా ఏదో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లనిపించింది. కర్పూరహారతి కాంతిలో కాళి విగ్రహం ఎర్రగా మరింత భయానకంగా కనిపించింది.
హారతికాగానే సిరియక్కారన్ గిన్నెలో పట్టిన రక్తానంతా గడగడా తాగేసేడు.
కార్తి అతన్ని మరింత భయంగా చూసేడు.
రక్తతీర్థం తీసుకున్నాక సిరియక్కారన్ మూతి తుడుచుకుంటూ పక్కనే వునన్ చాపమీద కూర్చుని “ఎందుకొచ్చేవు? అప్పుడు కాదని వెళ్ళిపోయేవుగా?” అనడిగేడు సాధువుని.
“అప్పుడెందుకో భయపడ్డాను. అనుకోకుండా వీడు కనపడ్డాడు. తిరిగి ఆశ కల్గింది.”
సిరియక్కారన్ కార్తిని తేరిపార చూసేడు.
“అంటే వీడికి రక్తసంబంధీకులెవరూ లేరా?”
“అందరూ పోయేరు. మావయ్య వున్నాడంట కాని అతను రక్తసంబంధీకుడు కాదు. మేనత్త మొగుడు. వీడి వయసు పదిహేనులోపునే”
సిరియక్కారన్ తల పంకించేడు.
“ఇది కార్తీకం. క్షుద్రోపాసనకి పనికిరాదు. మార్గశిరంలో వచ్చే అమావాస్య ఘడియలు కాళీ ఉపాసనకి బహు మంచి ముహూర్తం. వీడికేం చెప్పలేదు కదూ!”
“లేదు. మరణాన్ని జయించాలని వాడి కోరిక.”
“మంచిది. ఈ పది రోజులూ వీడు రెండు సంధ్యలలోనూ తలార స్నానం చేసి పూజలో కూర్చోవాలి. ఇదంతా మరణరాహిత్యం కోసమేనని వీడు గట్టిగా నమ్మాలి. నేను రేపొచ్చే ఆదివారం రాహుకాలంలో భైరవ పూజ మొదలుపెడతాను. జాగ్రత్త!”
సాధువు తల పంకించేడు.
సంభాషణంతా తమిళంలో సాగడం వలన కార్తికేయన్ ఏమీ ఆర్ధం చేసుకోలేకపోయేడు.
కార్తిని తీసుకొని గుడిసె బయటకొచ్చేడు సాధువు.
“నాకు భయమేస్తుంది!” అన్నాడు చిన్నగా వణుకుతూ.
“దేనికి? ఏం చేయకుండానే చావుని జయింపడమెలా? పద, నదిలో స్నానం చేసి పూజలో కూర్చుందువుగాని!” సాధువు ముందు నడుస్తుంటే అతన్ని అనుసరించేడు కార్తి, చావుని జయించబోతున్నానన్న నమ్మకము, సంతోషంలో.

*****

ఎదురుగా హోమగుండం జ్వలితజ్వాలమై శాఖోపశాఖలుగా, శిఖోపశిఖలుగా వేయి నాలుకలు చాపి సిరియక్కారన్ చెక్క తెడ్డుతో పోస్తున్న ఆవు నేతిని ఎగిరెగిరి అందుకుంటూ మండుతోంది.
ఆ హోమజ్వాలలో సిరియక్కారన్ నేరేడు పండు రంగు మొహంలో కళ్ళు ఎర్రని పత్తికాయల్లా ఒక దారుణాన్ని చేయబోయే ముందు మనిషి భావాలకి దర్పణం పడుతున్నట్లు క్రౌర్యంగా ఉన్నాయి.
హోమగుండానికెదురుగా కార్తికేయన్ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. ఎర్రని పంచె కట్టుకుని మెడలో పూలదండ, నుదుట రుద్రుడి లయనేత్రం లాంటి ఎర్రని బొట్టు. హోమకాంతి అతని పచ్చని శరీరం మీద పడి పరావర్తనం చెంది ఆ గదంతా చెదిరిపోతున్నది.
సాధువు మరో పక్కన కూర్చుని హోమగుండంలో సమిధలు వేస్తున్నాడు.
“ఇప్పుడు నేనన్నట్లుగా చెప్పు” సిరయక్కారన్ మాటలర్ధం కాక సాధువు వైపు చూసేడు కార్తికేయన్.
“ఆయనేమంటే అదను” అని సాధువు తర్జుమా చేసేడు.
కార్తి తలూపేడు.
అతని మొహంలో వచ్చిన నాటి భయం లేదు. నాలుక సాచి వికృతంగా గుడ్లురిమి చూస్తున్న కాళికా విగ్రహాన్ని చూసినా, శంఖానాదం, ఘంటారవాల ఘోషల మధ్య మేకపోతుని బలిచ్చి ఆ రక్తాన్ని నారికేళపాకంలా స్వీకరిస్తున్న సిరియక్కారన్‌ని చూసినా, కత్తివ్రేటు పడి గిలగిలా తన్నుకుంటున్న మూగజీవాన్ని చూసినా కార్తి ఏమాత్రం చలించడం లేదు. అంతే కాదు. ఉభయసంధ్యలలో అతడు వేలు తగిలినా జివ్వున లాగేసే నదీ మధ్య భాగంలో నిలబడి సాధువు చెప్పిన స్తోత్రాన్ని వల్లిస్తున్నాడు.
కటిక నేల మీద పడుకుంటున్నాడు. ఏకభుక్తంగా జీవిస్తున్నాడు.
అన్నింటికి మించి అర్ధరాత్రి స్మశానంలో జరిపే క్షుద్ర పూజలకి సిరియక్కారన్‌తో హాజరవుతున్నాడు.
కారణం – తను మరణాన్ని జయించే మహారహస్యాన్ని తెలుసుకు తీరాలనే తీవ్ర తపన.
కొద్ది క్షణాల్లో ఆ రహస్యం తనకి తెలిసిపోతుంది.
ఓం, హైం హ్రీం, క్లీం భం భం భం భైరవాయ నమః
ఓం హైం హ్రీం, శ్రీం క్లీం దుం దుం దుం దుర్గాయ నమః
నీచోపాసక సౌలభ్యీ, వికార రూపధారిణి
అతి భయంకర విరూపాక్షి ప్రసన్నేకాళీ!
నిధి నిమిత్తే స్వప్రాణం దారాధత్తం!
ఓం! ఓం! ఓం!
కార్తి సిరియక్కారన్ చెప్పిన మంత్రాన్ని ఉచ్చరించేడు.
అతని మంత్రానికి బలాన్ని, శక్తిని యిచ్చి దేవిని ప్రసన్నం చేసుకోవడానికన్నట్లుగా సిరియక్కారన్ శిష్యుడు గంటని ఆ అడవంతా దద్దరిల్లేలా వాయించేడు. సాధువు శంఖాన్ని పూరించేడు. ఆ నాదం శబ్ద తరంగాలుగా మారి దశదిశలూ వ్యాపించి ఆ అడవినంతా ఠారెత్తించింది.
అసలే ఆర్ధరాత్రి – కీచురాళ్ల ధ్వనులు – అప్పుడప్పుడు పక్షుల కలకలరావాలు తప్ప మరే శబ్దమూ లేని ఆ నీరవ స్తబ్దరాత్రి ఆ శబ్దానికే భూకంపం వచ్చినట్లు కదిలింది.
ఎక్కడో ఒక ఏనుగు నిద్రాభంగమై ఘీంకరించింది.
పక్షుల సముదాయం గూళ్ళలో మేల్కొని భయంతో రెక్కలు టపటపలాడించేయి. లేళ్ళూ, కుందేళ్ళూ వణికేయి. పేరు తెలీని ఎన్నో ప్రాణులు భయోత్పాతానికి లోనయి ముడుచుకుని ఆ శబ్దం వచ్చిన వేపుకి దృష్టిని సారించేయి. సరిగ్గా అప్పుడే సిరియక్కారన్ లేచి నిలబడ్డాడు.
కార్తి దీర్ఘంగా కళ్ళు మూసుకొని కాళి జపం చేస్తూనే ఉన్నాడు.
సాధువు లేచి గొడ్డలిని అందించేడు సిరియక్కారన్‌కి.
“జై కాళి మాతా! జై భైరవే!” అంటూ గొడ్డలిని ఎత్తేడు సిరియక్కారన్ మహావేశంతో.
పైకి లేచిన గొడ్డలి ఏం జరుగుతుందో ఏ మాత్రం తెలీని కార్తికేయన్ మెడని ఒక్క వ్రేటుతో నరకడానికి సిద్ధపడుతున్న ఆ భయంకర క్షణంలో ఆ గుడిసె తలుపులు తెరుచుకోవడమూ, బయట నిలబడిన వ్యక్తి కాల్చిన రైఫిల్‌లోని తూటా సిరియక్కారన్ ముంజేతిలోంచి దూసుకుపోవడం ఒక్కసారే జరిగేయి.
ఆ శబ్దానికి ఉలిక్కిపడి కార్తి కళ్ళు తెరిచేడు.
“అబ్బా!” అంటూ ముంజేతిని పట్టుకుని సిరియక్కారన్ నేలమీదికి కూలిపోయేడు.
ఏం జరిగిందో తెలుసుకునే లోపున ఆ ప్రాంతమంతా శక్తివంతమైన టార్చిలైట్ల కాంతితో నిండిపోయింది.
టకటకా బూట్ల శబ్దంతో ఆ గుడిసెని చుట్టుముట్టేరు పోలీసులు. క్షణాల్లో సిరియక్కారన్‌కి, సాధువుకి, అతని శిష్యుడికి బేడీలు పడ్డాయి. అందర్నీ ఎక్కించుకున్న పోలీసు వేన్ కుంభకోణం వైపు శబ్దం చేస్తూ పరుగెట్టింది.

******************
--(())--

ఎదురుగా కూర్చున్న వ్యక్తిని భయంతో చూస్తూ నిలబడ్డాడు కార్తికేయన్.
అతను దాదాపు ఆరడుగుల పొడవు. అంతకు సరిపోయిన బలిష్టమైన శరీర సౌష్టవంతో ఉన్నాడు. వెనక్కి దువ్విన వత్తయిన క్రాఫులో అక్కడక్కాడా నెరసిన తెల్లవెంట్రుకలు అతనికొకరకమైన హుందాతనాన్నిచ్చేయి. సిగరెట్స్ ఎక్కువగా కాల్చడం వలన కొద్దిగా కాఫీ రంగు తిరిగిన పెదవులు, ఆ పెదవులపై వత్తుగా పెంచిన మీసాలు, అతనికొక రకమైన గాంభీర్యాన్నిచ్చేయి. కాని ఆ కళ్ళు మాత్రం ఎక్కడో మగవారికి అరుదుగా వుండే పొడవాటి వాలుకళ్లు – రెప్పలకి వత్తుగా వంపు తిరిగిన వెంట్రుకలు – ముఖ్యంగా ఆ చూపుల్లో కారుణ్యం, ప్రేమ పోటీపడి తొంగి చూస్తున్నాయి.
“కూర్చో” అన్నాడతను. అతని గొంతులోనూ కరకుదనం లేదు.
నిన్నటి రోజున సిరియక్కారన్ గుడిసె మీద దాడి చేసి అతన్ని షూట్ చేసిన పోలీసాఫీసరతనేనా అనిపించిందొక క్షణం కార్తికేయన్‌కి.
పోలీసులంటే ప్రజలకి చాలా దురభిప్రాయముంది. అది పొరబాటైన అభిప్రాయం కానే కాదు. ఖాఖీ డ్రస్సులకి పట్టని పొట్టల్ని పెంచి, లాఠీ చేతిలో వుందని హద్దు ఆపూలేని ప్రవర్తనతో సంస్కార సంఘం అసహ్యించుకునే విధమైన పదజాలాన్ని వాడుతూ అధికారం చేతిలో వుందని తమ దగ్గరికి న్యాయం కోసం వచ్చిన వ్యక్తుల్ని నేలబారు మాటలు మాట్లాడి మళ్ళీ ఎప్పుడూ న్యాయం జరక్కపోతే చూద్దాం కాని పోలీస్ స్టేషన్‌కి మాత్రం వెళ్ళొద్దనిపించే స్థాయిలో ప్రవర్తించే పోలీసు డిపార్టుమెంటులోని కొంతమంది గురించి కొద్దిగా తెలుసు కార్తికి.
కాని.. ఇతను చాలా విభిన్నంగా వున్నాడే?
“దా, కూర్చో! నీ పేరేంటన్నావూ?”
“కార్తి.. కార్తికేయన్”
“నువ్వు తమిళవాడివా?”
“కాదు.. తెలుగు.. తెలుగువాణ్ణే! కాకినాడ”
ఈసారాయన మొహంలో వెలుగు కనిపించింది. వికసించిన మొహంతో నవ్వుతూ “మాదీ కాకినాడే. అంటే ఎప్పుడో మా తాతలనాడు బిజినెస్ మీద కోయంబత్తూరులో సెటిలయ్యేరు. ఇప్పుడు నేను తమిళవాణ్ణో, తెలుగువాణ్ణో నాకే తెలీదు. వీళ్ల చేతికెలా చిక్కేవ్? నీకు మత్తు పెట్టి తెచ్చేరా?” అనడిగేడాయన.
“లేదండి. నేనే కావాలని వచ్చేను”
ఈసారతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యేయి.
“ఎందుకు?” అనడిగేడు కుతూహలంగా.
“చావు లేని మంత్రం నేర్పుతామన్నారు వాళ్లు”
కార్తి జవాబు విని క్షణం మాట్లాడలేకపోయేడతను.
“చావు లేకుండానా?” అన్నాడు ఆశ్చర్యంగా.
“అంటే మృతసంజీవిని విద్యా! కచుడు శుక్రాచార్యుల దగ్గర నేర్చుకున్నట్లుగా!”
మళ్లీ తల ఊపేడు కార్తి.
ఈసారి పకపకా నవ్వాడతను. ఎంతగా నవ్వాడంటే అతని కళ్లలోంచి నీళ్లు చెంపల మీదకి జారేయి. అంచెలంచెలుగా అతను నవ్వుతుంటే మేడమీద నుండి అతని ఎనిమిదేళ్ళ కూతురు – ఇంట్లో పనులు చేస్తున్న ఆర్డర్లీలు హాల్లోకి వచ్చేరు.
అయినా అతనికి నవ్వు ఆపుకోవడం అసాధ్యమయింది.
“డేడీ ఏం జరిగింది. ఎందుకలా నవ్వుతున్నారు?” ఎదురు సోఫాలో కూర్చున్న కార్తిని వింతగా చూస్తూ తండ్రి భుజాలు కుదుపుతూ అడిగిందతని కూతురు కెయూరవల్లి.
అతను కూతురి భుజాన్ని ప్రేమతో తడుతూ ఎత్తుకుని వళ్ళో కూర్చోబెట్టుకుని “వీడు చావు లేని మంత్రం నేర్చుకుందామనుకున్నాడటమ్మా.. అదీ ఆ నీచుడు సిరియక్కారన్ దగ్గర” అన్నాడు.
ఆ పేరు వినగానే ఉలిక్కిపడింది కేయూర.”వాడా.. ఇద్దీ అమీన్‌లా బ్లడ్ తాగుతాడూ?”
“ఎగ్జాట్లీ! వాడు పసిపిల్లల రక్తాన్ని పానకంలా తాగుతాడు. రక్తపిపాసి వాడు. ఏదో నిధి కోసం పసిపిల్లల్ని బలిస్తున్నాడు. వాడి చేతులో పడ్డాడు వీడు.
అతని మాటలు వినగానే కార్తి తెల్లబోయేడు.
శరీరం సన్నగా వణికింది.
“కాదు….నిజంగా మంత్రం నేర్పడానికే!”
“నీ మొహం! నేనొక్క క్షణం రావడమాలస్యమైతే నీ తల తెగి పడుండేది. ఈ జిల్లాలో చాలామంది స్కూలు పిల్లలు ఒక్క నెలలోనే మాయమవ్వడంతో మేం నిఘా వేసేం. నిన్ను కుంభకోణం రైల్వే స్టేషన్ నుండి ఒక సాధువు తీసుకెళ్తున్నాడని రిపోర్టు రాగానే నేనే పర్సనల్‌గా ఈ కేసుని టేకప్ చేసేను. రహస్యంగా ఫాలో అయ్యి ఆ అడవి గెస్ట్ హౌస్‌లోనే వున్నాను. నీ స్నానాలూ, పానాలూ, పూజలూ అన్నీ కనిపెడుతూనే ఉన్నాను. స్పాట్‌లోనే పట్టాలన్నది నా ఆకాంక్ష. అలాగే పట్టుకున్నాను. ఇంతకీ ఆ సిరియక్కారన్ గాడెవరనుకున్నావు. గతంలో పెళ్లాన్ని చంపి పరారై తిరుగుతున్న ఒక హంతకుడు. ఆ ! ఇంతకీ నిన్నెక్కడికి పంపాలి?” అనడిగేడాయన.
కార్తి ఆ వివరాలన్నీ విని చలించిపోయేడు. పెదవులు తడారిపోయేయి.
“నాకు .. నాకెవరూ లేరు సార్!”
“అంటే అనాధవా?”
కార్తి తలదించుకున్నాడు. “అమ్మా,నాన్న చెల్లి అందరూ నెలల తేడాలో చచ్చిపోయేరు. చివరికి అత్త కూడా, నేను నష్టజాతకుణ్ణని మావయ్య తరిమేసేడు” అన్నాడు హీనస్వరంతో.
మనసులో తడి చోటు చేసుకొందతనికి.
“అందుకే చావంటే అసహ్యమేసిందా నీకు?”
ఔనన్నట్లుగా తలూపేడు కార్తి.
“కాని దానికి మందు కనుక్కోవడం ఎవరివల్లా కాదు.”
చప్పున అతివేగంగా తలెత్తి..”నేను కనుక్కుంటాను” అన్నాడు కార్తి.
ఆ పసికళ్లలోని తీవ్రమైన నిర్ణయం తాలూకు చాయలు గమనించి నిరుత్తురుడయ్యేడతను.
“ఎలా? ఇలాంటి దొంగ సాధువులనాశ్రయించా? చావుకి మంత్రం కాదు.. ముందు చచ్చుండేవాడివి” అన్నాడు చిరాగ్గా.
కార్తి మాట్లాడలేదు.
“నీకు నిజంగా అలాంటి నిర్ణయముంటే. ముందు బాగా చదువుకో. గొప్ప సైంటిస్టువి కా. ఆ తర్వాత దానికి మందు కనుక్కో. అంతేకాని ఇలా దొడ్డిదారిన వెళ్లి చావు కొని తెచ్చుకోకు”.
“నన్నెవరు చదివిస్తారు? నాకెవరూ లేరుగా!”
“నేను.. నేను చదివిస్తాను. ఎంత కావాలంటే అంత చదువు .. హాస్టల్లో చేరి..”
“డేడీ!” కూతురి పిలుపుకి తల తిప్పి చూశాడతను.
“హాస్టలెందుకు? మనిల్లు చాలా పెద్దదిగా. నువ్వు కేంప్స్ వెళ్తే నాకు బోర్ కొడుతుంది. నాకు తోడుంటాడు. మేమిద్దరం ఆడుకుంటాం” అంది కేయూర తండ్రి గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్న ధోరణిలో.
అతను చిన్నగా నవ్వి..”యువార్ కరెక్ట్ బేబీ! ఏం కార్తీ మా యింట్లో వుంటావా?”
కార్తి తల పంకించేడు.
“ఇంకేం.. ఆడుకోండి. నేను ఆఫీసుకెల్లొస్తాను” అని అతను గదిలోకి కెళ్లి యూనీఫాం వేసుకుంటుంటే ” మీ నాన్న పోలీసా?” అనడిగేడు కార్తి గుసగుసగా.
“చీ! కాదు. పోలీసాఫీసర్. ఎస్పీ. ఐ.పి.ఎస్. తెలుసా?” అంది కేయూర అసలే పెద్దవైన తన కళ్ళని మరింత పెద్దవి చేసి.
నిజానికి కార్తికేమీ అర్ధం కాలేదు. కాని అర్ధమయినట్లుగా “ఓహో” అన్నాడు.
సూర్యోదయమైంది.
ఒక వెలుగురేఖ లాబరేటరీ కిటికీ అద్దం మీద పడి లోనికి ప్రవేశించే విఫల ప్రయత్నంలో వేయి వ్రక్కలై వెనక్కు మళ్లుతోంది.
“కార్తికేయన్! మిస్టర్ కార్తికేయన్!”
ఉలిక్కిపడి లేచేడు కార్తికేయన్.
గత జ్ఞాపకాల్లోంచి బయటపడటానికి అతనికి రెండు మూడు క్షణాలు పట్టింది.
అతను తల విదిలించుకుని, కళ్లని నులుముకొని పలుచబడిన క్రాఫుని సవరించుకుంటూ “కొద్దిగా నిద్ర పట్టేసినట్లయింది” అన్నాడు నవ్వుతూ.
మీనన్ నవ్వలేదు.
కార్తికేయన్ కేసి నిర్వికారంగా “తెల్లారిపొయింది.” అన్నాదు.
“అవును. అదే చూస్తున్నా. బాగా తెల్లారిపోయింది” అన్నాడు కుర్చీలోంచి లేచి.
“నేను చెబుతున్నది నా భార్య కుట్టియమ్మాళ్ గురించి. ఆవిడ జీవితం తెల్లారిపోయింది.”
ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు కార్తికేయన్.
చివాల్న అతను గాజుపెట్టె దగ్గరకి పరిగెత్తేడు.
లోపల నిశ్చలంగా వుంది కుట్టియమ్మాళ్ శరీరం. ఏ కదలికలూ లేకుండా. పెదవుల కొసల నుండి కొద్దిగా క్రిందకి జారుతున్న నురుగులాంటి ద్రవాన్ని చూసి పూర్తిగా హతాశుడయిపోయాడు కార్తికేయన్.
అతనిలోని ఉత్సాహం, విజయం ఈసారి తప్పక సాధించగలనన్న నమ్మకం ఒక చిన్న సూది గుచ్చిన బెలూన్లా చప్పబడిపోయింది.
పూర్తిగా ఓడిపోయేనన్న బాధ అతని గుండెని ఒక ఎండ్రకాయలా పట్టుకుని నొక్కేయడంతో అతను రక్తం పీల్చేయబడిన మనిషిలా కుర్చీలో నిస్తేజంగా కూలబడి తల పట్టుకున్నాడు.
మీనన్ అతని దగ్గరగా వచ్చి అతని భుజమ్మీద చెయ్యేసేడు.
ఆ స్పర్శలో లాలింపుని గుర్తించి తలెత్తి, “అయాం సారీ మిస్టర్ మీనన్!” అన్నాడు గద్గదమైన స్వరంతో.
“ఇట్సాల్‌రైట్! కుట్టీ బ్రతకదని డాక్టరెప్పుడో చెప్పేసేడు. కుట్టికి, నాక్కూడా ఆ విషయం తెలుసు. అయినా నీ ప్రయత్నానికి ప్రయోగంగా ఆమెని నీకప్పగించేను. ఆమె చనిపోయినందుకు కాదు నేను బాధపడుతున్నది. ఇరవై సంవత్సరాలుగా భార్యాబిడ్డల్ని, సుఖసంతోషాల్ని త్యజించి ఈ ప్రయోగశాలలో నువ్వు ఒంటరిగా చేసిన పోరాటానికి విజయం దక్కలేదని, ఇదిగాక ఇంకేం చేసిన ఒక్క భారతదేశమే కాదు భూగోళంలోని అన్ని దేశాలు గుర్తించి అద్భుత పరిశోధకుడిగా పేరు గడించేవాడివి. బట్! నీ ఆశయం చాలా పిచ్చిది. మరణం అనివార్యమైంది. దానినెవరూ ఆపలేరు. సముద్రం ముందు కట్టిన గూళ్ళు నిలబడవు. ఇప్పటికైనా ఈ నిజాన్ని గ్రహించి ఈ వృధా ప్రయాసని కట్టిపెట్టు. ఎదిగిన నీ కూతుర్నొకసారి వెళ్లి చూడు!” అన్నాడు మీనన్.
“నో” అంటూ గట్టిగా అరిచాడు కార్తికేయన్.
అతని అరుపులు మూసిన తలుపుల్ని, నిర్బేధ్యమైన గోడల్ని ఢీకొని పదిరెట్ల ధ్వనితో మారుమోగింది.
వెంటనే “నో మీనన్! డోంట్ సే లైక్ దట్! అయివిల్ ఫైట్ విత్ ద బ్లడీ డెత్ అంటిల్ మై డెత్!” అన్నాడు జుట్టు పీక్కుంటూ.,
మీనన్ పరిహాసంగా నవ్వి, “నువ్వే ఒప్పుకుంటున్నావన్నమాట చావుకి చావు లేదని” అన్నాడు.
“వాడ్డూయూ మీన్?” అన్నాడు కార్తికేయన్ అసహనంగా.
“అర్ధం కాలేదా, నీ చావు వరకు పోరాడతానన్నావు. అంటే నీకూ తెలుసు.. చావుని లేకుండా చేయడం అసాధ్యమని. నేనొస్తాను మరి కుట్టికి దహన సంస్కారాల ఏర్పాటు చేయాలిగా. నాదొకటే రిక్వెస్టు. రెండ్రోజులు ఏ ట్రాంక్విలైజర్సన్నా వాడి విశ్రాంతి తీసుకో. లేకపోతే ఈ ఓటమి నిన్ను తినేస్తుంది.” అంటూ కుట్టి శరీరాన్ని తీసుకుని కారులో వేసుకొని వెళ్ళిపోయాడు మీనన్.
కార్తికేయన్ ఒక్కడే ఆ ప్రయోగశాలలో, ట్యూబుల మధ్య, జార్‌ల మధ్య, రకరకాల రసాయన పదార్థాల మధ్య మిగిలిపోయేడు ఒంటరిగా.
కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా..

***********

కాన్వోకేషన్ మామూలుగానే జరిగిపోయింది. దాని పద్ధతిలో యాంత్రికంగా.
ఏటా కొన్ని వేలమంది పట్టభద్రుల్ని దేశంలో నలుమూలలా ఊరిఊరికి, పేటపేటకి వున్న కాలేజీలు – సబ్బు బిళ్ళల్లా, అగ్గిపెట్టెళ్ళా వుత్పత్తి చేస్తూనే వున్నాయి. వాళ్లందరికీ ఒక కాగితాన్ని గొట్టంలా చుట్టి వారివారి కుర్చీల్లో పడేసి భావితరపు నిరుద్యోగులమనే బాధతో నల్లడ్రెస్సులు వేసుకుని మౌర్నింగ్‌కి హాజరయినట్లున్న విద్యార్థుల కందజేసి తమ చేతులు దులుపుకుంటూనే వున్నారు ఈ దేశపు పాలకవర్గం.
గవర్నర్ తనదైన పద్ధతిలో విద్యార్తుల్ని వుద్దేశించి మాట్లాడేడు. వైస్ చాన్స్‌లర్ యూనివర్సిటీలని, కాలేజీలని వదిలి వెళ్ళే విద్యాథులకి హితబోధలు చేసేడు.
ఇన్నివేలలో చాలా కొద్ది మందికి మాత్రమే ప్రత్యేకత వుంది. అది గవర్నర్ చెతుల మీదుగా మెడల్‌ని అందుకోవడం.
ఆ ప్రత్యేకత వున్నవారిలో లిఖిత ఒకర్తి.
వరుస క్రమంలో అందరూ మెడల్సు తీసుకున్నారు.
లిఖిత కూడ స్టేజి మీదకెళ్లి గవర్నర్ చేతుల మీదుగా మెడల్, పట్టా తీసుకుంది. విద్యార్థులు కరతాళ ధ్వనులు చేసేరు. ఏదో ఉద్వేగానికి గురయిందామె మనసు.
ఫంక్షన్ ముగిసింది.
హాల్లోంచి బయటకొచ్చింది. యూనివర్సిటీ ఫస్టొచ్చిన స్టూడెంట్స్‌ని వాళ్ళ పేరెంట్స్, అక్కచెల్లెళ్లు, అయినవారు కౌగలించుకుని ప్రశంసిస్తున్నారు.
ఒక్క లిఖితకి మాత్రమే ఎవరూ రాలేదు.
లిఖిత మనసులో ఎక్కడో అసంతృప్తి మొలకెత్తి గుండెలనిండా పాకింది.
తనకి తండ్రెవరో తెలీదు. అసలున్నాడో లేదో కూడా తెలీదు. తన తల్లి అర్ధరూపాయంత బొట్టు పెట్టుకుంటుంది. కాబట్టి ఆయన వుండి వుంటాడని తనకో నమ్మకం. తల్లి మాత్రం ఆ సంగతులు మాట్లాడదు. అడిగితే ఎర్రబడిన కళ్లతో చూసి విసురుగా వెళ్లిపోతుంది.
పోనీ తనయినా రాకూడదా?
ఊహూ! తన కసలిలాంటి సరదాలే లేవు.
తమ ఇంట్లో అన్నీ యాంత్రికంగా జరిగిపోతుంటాయి. ఆమె తనని నిర్లక్ష్యం చెయ్యదు. టైముకి అన్నీ ఏర్పాటు చేస్తుంది. మంచి బట్టలు కొంటుంది. తనని చదివిస్తుంది. తన బాగుకోసం అనుక్షణం శ్రమిస్తుంది. కాని… అందులో ప్రేమని వ్యక్తం చెయ్యదు. అనురాగాన్ని చూపించదు. బాధ్యత మాత్రమే వుంటుంది. కేవలం రోబోట్‌లా, మదర్ రోబోట్‌లా ..
తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది లిఖితకి.
“ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?”
తన ఆలోచనల నుండి బయటపడి పక్కకి చూసింది లిఖిత. వెంకట్ నిలబడి వున్నాడక్కడ.
“ఏం లేదు. నువ్వొచ్చావా ఫంక్షన్‌కి?” అనడిగింది.
“రాకుండా ఎలా వుండగలను. దేవిగారు గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే!”
“మెడల్ని గోల్డ్ కాదు” అంటూ నవ్వింది లిఖిత.
ఇద్దరూ బయటకొచ్చేరు.
“కాస్సెపేటైనా వెళ్దామా?”
“ఇప్పుడా?” అంటూ వాచీకేసి చూసింది లిఖిత.
“ఏం పర్లేదు. ఓ పావుగంట. నేనే వదిలేస్తాను.”
లిఖిత అతని వెనుక బైకెక్కింది.
బైక్ బీచ్ రోడ్డు పట్టింది.
“నాకు తెలుసు నువ్వెక్కడికి తీసికెల్తావో!” అంటూ నవ్వింది లిఖిత గాలి హోరుకి ఎగిరిపోతున్న బాబ్డ్ హెయిర్ సరిచేసుకుంటూ.
“నీకిష్టం కదా సముద్రమంటే.. అందులోనూ ఈ రోజు పౌర్ణమి” అన్నాడు వెంకట్ నవ్వుతూ.
లిఖిత దూరంగా వున్న సముద్రం కేసి చూసింది.
ఆకాశంలో నిండు చందమామ అందని పెళ్ళి కొడుకులా వున్నాడు. సముద్రం అంతరాలు మరచి ప్రేమించి అర్రులు చాస్తున్న పేద పెళ్లికూతురిలా వుంది.
తన ఆలోచనలకి తానే నవ్వుకుంది లిఖిత.
బైక్‌ని పార్క్ చేసి వేరుశనక్కాయలు కొనుక్కుని వెంకట్ వచ్చేంతలో బీచ్‌లో కొంతదూరం నడిచింది లిఖిత.
అతను నడక వేగం పెంచి లిఖితని అందుకొని “ఇక్కడ కూర్చుందాం” అన్నాడు.
లిఖిత కూర్చుని “ఇప్పుడు చెప్పు” అంది.
వెంకట్ ఆమె కళ్ళలోకి అదోలా చూసి”చెప్పాలనే ప్రయత్నం. ఎప్పటికప్పుడు నిన్ను చూసి మూగపోతుంటాను” అన్నాడు.
లిఖిత కిలకిలా నవ్వి “ఇది కవిత్వమా లేక పైత్యమా?” అంది.
వెంకట్ తిరిగి జవాబివ్వలేకపోయాదు.
అదే అతని బలహీనత. లిఖితని అతను ప్రేమిస్తున్నాడు. ఆరాధిస్తున్నాడు. ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. రెండేళ్ళుగా ఇది సాగుతూనే వుంది. కాని తన మనసులోని మాట గట్టిగా లిఖితకి చెప్పలేని పిరికి మనసతనిది.
వాళ్లిద్దరూ ఒకరినొకరు ఎలా పరిచయమయ్యేరన్నదొక గొప్ప విషయం కాదు. కాని లిఖితని చూసిన మరుక్షణమే “ఆమెనొక్కసారి ముద్దు పెట్టుకోలేని జీవితం వృధా!” అనిపించిందతనికి. తన ఆలోచన తప్పేమోనని సిగ్గుపడ్డాడు కూడా. అయినా అతని కలల్లోకి ఆమె తీవ్రంగా జొరబడసాగింది. పగలు – రాత్రి అతని కళ్లలో, మనసులో లిఖిత రూపం ఆక్రమించుకుంటుంది. ఇక తనవల్ల కాదనుకున్నాడతను. వెంటనే తన ప్రయత్నాలు సాగించేడు. లిఖిత స్నేహితురాలు సుమన ద్వారా లిఖితతో స్నేహం సాగించేడు. వెంకట్‌లోని మంచితనం, తన పట్ల వున్న అభిమానం, లిఖితకి కూడా నచ్చాయి. ఇద్దరి స్నేహం బలపడింది.
వేరుశెనక్కాయలు తినడం అయ్యేక “ఇక పోదామా?” అంది లిఖిత.
“అప్పుడేనా?” అతని మొహంలో ఆందోళన చోటు చేసుకుంది.
“నువ్వేం మాట్లాడకపోతే ఏం చేయాలి?” అంటూ లిఖిత విసుక్కుంది.
వెంకట్ గొంతు మరీ పట్టేసింది. “వెన్నెల వృధా అయిపోతుంది” అన్నాడు స్వగతంలా.
“ఈ సంగతి చెప్పడానికేనా ఇంత దూరం తీసుకొచ్చెవు. వెన్నెల వృధా అయిపోవదం లేదు. అసలు వెన్నెలే వృధా అయిన అయిటెం. వెన్నెల వలన పంటలు పండవు. ప్రాణికోటి జీవించదు. క్రిమికీటకాలు నశించవు. ఆ పవర్ సూర్యుడికే వుంది. మగాడంటే సూర్యుడే. చంద్రుడు కానే కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోలేని భీరువులకి, డ్యూయెట్లు పాడుకోడానికి మాత్రమే ఈ పనికిమాలిన వెన్నెల పనికొస్తుంది” అంది లిఖిత వెక్కిరింతగా.
ఆమె ఆలోచనా విధానానికి వెంకట్ తెల్లబోయేడు.
“నువ్వు చాలా విపరీతంగా మాట్లాడుతావు. కవిలకి భావుకతనిచ్చే వెన్నెల్ని ఇంత కించపరచి మాట్లాడిన మొట్టమొదటి మనిషివి నువ్వే” అన్నాదు చిన్నబోతూ.
“సారీ! నా ఉద్దేశ్యం నేను చెప్పేను వెంకట్!. ఇక వెళ్దాం పద” అంటూ లేచి నిలబడింది లిఖిత.
వెంకట్ నిస్సహాయంగా ఆమెని అనుసరించేడు.
“నీ తర్వాత ప్రోగ్రాం ఏమిటీ?”
“భోంచేసి నిద్రపోవడం”
“యూ సిల్లీ! ఇంకా చదువుతావా? లేకపోతే మీ అమ్మగారి బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవుతావా?”
“ఇంకా నిర్ణయించుకోలేదు వెంకట్. ఆ చీరల బిజినెస్సయితే చెయ్యను. చీరలమ్మడం, పచ్చళ్ళు పెట్టడం లాంటి వ్యక్తిత్వం లేని పనులు నాకిష్టముండవు. మనం చేసే పనులు కూడా ఆడతనాన్నే ప్రస్ఫుటించేలా ఏదైనా ఎడ్వంచర్ చేయాలని!” అంది గమ్మత్తుగా భుజాలెగరేసి నవ్వుతూ.
వెంకట్ మరేమీ మాట్లాడలేదు.
అప్‌లాండ్స్‌లో లిఖిత యిల్లు రాగానే బైక్ ఆపేడు వెంకట్.
“బై వెంకట్ గుడ్‌నైట్” అంటూ మెట్లెక్కుతుంటే “లిఖితా ఇది మరచిపోయేవ్!” అన్నాడు వెంకట్.
“ఏంటది?” ఎక్కిన నాలుగు మెట్లూ దిగి గబగబా అతని దగ్గరకొచ్చి అడిగింది లిఖిత అమాయకంగా.
“ఇది” అంటూ చటుక్కున తన చేతులతో ఆమె తలని తిప్పుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని అంత వేగంగానూ వెళ్లిపోయేడు వెంకట్.
ఆ హఠాత్ పరిణామానికి లిఖిత చాలా నివ్వెరపోయింది.
భవిష్యత్తులో ఈ ప్రేమికుడే తనకో ప్రబల శత్రువై అడుగడుగునా తనని మానసిక హింసకి గురిచేసే శత్రువు కాగలడని ఆమె ఊహించలేకపోయింది.

బ్రహ్మలిఖితం – 3

రచన: మన్నెం శారద

కార్తికేయన్ గత మూడు రోజులుగా అవిశ్రాంతంగా తాగుతున్నాడు.
నిజానికతనిదివరకెప్పుడు మందు ముట్టలేదు. సిగరెట్టు కూడా తాగే వ్యసనం లేదు. అసలతనికి అలాంటి దురలవాట్లు చేసుకునేంత తీరిక కూడా లేదు.
జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒకే ధ్యేయంతో, ఒకే లక్ష్యంతో గడిపేడతను. ఎపుడైనా అతని ఆశయాల్ని రెచ్చగొడుతూ నిద్ర కమ్ముకునొస్తే అందులో కూడా అతను మృత్యువు వెంబడించి పరిగెడుతున్నట్లుగానో, మృత్యునివారణకి మందు కనిపెట్టినందుకు తనని యావత్ ప్రప్రంచం కొనియాడుతున్నట్లుగానో కలలొచ్చేవి. ఉలిక్కిపడి లేచిపోయేవాడతను.
అంతులేని ఆస్తి వున్నా వెచ్చని డన్‌లప్ పరుపుల మీద వెల్వెట్టు దుప్పటిలో కూరుకుపోయి రజాయి కపుకుని ఏ.సి గదుల్లో అతనెప్పుడూ కమ్మగా నిద్రపోయెరుగడు. నిద్రలోని హాయి గురించి అతని కసలు తెలీదు.
ప్రయోగశాలలోనే రసాయనాల వాసనలు పీలుస్తూ అవిశ్రాంతంగా ప్రాణాలపై ప్రయోగాలు చేస్తూ తలలో నరాలు చిట్లిపోయేంతగా ఆలోచనల్ని మధిస్తూ ఓడిపోయే కొలది గెలుపుని అందుకోవాలనే పంతంతో ఒక యంత్రంలా పనిచేసేడతను.
కుట్టియమ్మాళ్ మరణంతో ఇప్పుడా యంత్రం స్తంభించినట్లాగిపోయింది. తన మేధస్సు మీద తీరని ఆశయమ్మీద మనసు తిరగబడుతోంది. అపహాస్యం చేస్తోంది. పగలబడి నవ్వుతోంది.
ఇన్నాళ్లూ తనలో అణిగిమణీగి ఒక బానిసలా నోరెత్తకుండా పడివున్న మనసు ఒక్కసారిగా తనలో కలిగిన నిరాశ నిస్పృహల్ని గమనించి ఒక ప్రత్యర్ధిలా తనని గేలి చేస్తూ దాడి చేస్తున్నది.
అదే.. భరించలేకపోతున్నాడు.
తన మనసు నుండి తనే పారిపోవాలన్నంత పిచ్చిగా వుందతనికి. అందుకే అవిరామంగా తాగుతున్నాడు.
నాలుకని చేదు, వెగటుగా మార్చిన విస్కీ గొంతులోంచి గుండెలోకి జారి భగ్గుమంటోంది. అయినా అతను పెగ్ మీద పెగ్ తాగుతూనే వున్నాడు. ఎప్పుడో ఏదో ఒక క్షణం తన హృదయం పోగొట్టుకున్న శాంతిని ఆ మందు తెచ్చివ్వగలదనే వెర్రి ఆశతో తాగుతూనే ఉన్నాడు.
గ్లాసులోని విస్కీలో పోసిన సోడా నురుగులో అయిసు ముక్కలు తేలుతూ సయ్యాటలాడుతున్నాయి. వాటికేసి కాస్సేపు తీక్షణంగా చూస్తూ కూర్చున్నాడతను.
ఇంకాస్సేపటిలో కరిగి తమ ఉనికిని కోల్పోబోతూ కూడా తమ జీవితం శాశ్వతమయినట్లుగా గ్లాసు ఉపరి భాగంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడ్డాయి.
వాటి శరీరాలు క్షణక్షణం క్షీణిస్తూనే వున్నాయి. అయినా ఓటమిని ఏ మాత్రం ఒప్పుకోవడం లేదవి.
తను మాత్రమెందుకింతగా కృంగిపోతున్నాడు.
ఒక శీతోష్ణస్థితిలో గడ్డగా మారిన నీటికున్న స్థయిర్యం, బలమూ తనకి లేదా? తనలోని పట్టుదల, నమ్మకం నీరు కారిపోతున్నాయా?
తనకిక గెలుపే లేదా?
తను పూర్తిగా ఓడిపోయినట్లేనా?
కార్తికేయన్ ఎర్రబడిన కళ్లతో ఆఖరి పెగ్ తాగేసేడు.
“సర్!”
“ఎస్!” అన్నాడతను తలెత్తి చూసి.
ఎదురుగా బెదురుగా నిలబడి వున్నాడు బేరర్.
“బార్ క్లోజ్ చేసే టైమయింది” అన్నాడతను వినయంగా.
ఎంత మనస్తాపంగా వున్నా, ఎంత మందు తాగినా అతనిలోని అంతర్లీనంగా వున్న సంస్కారం అతన్ని లేచి నిలబడేట్లు చేసింది.
“ఇట్సాల్ రైట్!” అంటూ జేబులోంచి చేతికందిన నోట్లు ప్లేట్లో పడేసి గ్లాసు డోరు తీసుకుని బయటకొచ్చేడతను.
కొన్ని వందల రూపాయిలు తగలెట్టి తాగిన మందు శరీరాన్ని మాత్రమే బాలన్సు పోగొట్టి తూలేట్లు చేస్తోంది. మనసు మాత్రం అతన్ని చూసి ఇంకా పరిహసిస్తూనే వుంది.
రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.
నియాన్ లైట్లు చుట్టూ దట్టంగా పేరుకొని వున్న చీకటిని వెలుగు కత్తుల్తో చీల్చి చెండాడే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అత్న్ని చూసి రోడ్డు పక్కన డస్ట్‌బిన్ ఓరగా పడుకున్న ఊరకుక్కలు లేచి నిలబడి భౌభౌమని అరిచేయి.
మనిషి ఎంత మానసిక కాలుష్యానికి గురయినా ఈ కుక్కలు మాత్రం తన నైజ గుణమైన విశ్వాసాన్ని, కాపలా తత్వాన్ని మరచిపోకపోవడం అతనికి ఆశ్చర్యం కల్గించింది.
అతను వెళ్లి తన మారుతి థౌజండ్‌లో కూర్చుని స్టార్ట్ చేసి టర్న్ తీసుకుని పంజగుట్ట నుండి జుబ్లీహిల్స్ వెళ్ళే దారికి మళ్ళించేడు. కారు కూడా తూలుతున్నట్లు వంకర్లు తిరుగుతూ జుబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ అవతలనున్న అతనింటి ముందాగింది.
గూర్ఖా గేటు తెరిచి తన విధి ప్రకారం యాంత్రికంగా సెల్యూట్ చేసేడు. కారు చిన్న జెర్క్‌తో వెళ్ళి పోర్టికోలో ఆగింది.
అతను వెళ్లి యింటి తాళం తీసి లైటు వేసేడు.
వెలుగొక్కసారిగా గదంతా పొగమంచులా కమ్ముకుంది. ఎన్నాళ్లగానో శుభ్రం చేయని వస్తువులన్నీ డిమ్ గా తన మనసులానే కళావిహీనంగా కనిపించేయతని కళ్లకి.
అతను వెళ్లి తూలుతూ మంచానికడ్డంగా పడిపోయేడు. ఏదో చెబుదామని వచ్చిన గూర్ఖా అతని పరిస్థితి గమనించి తలుపు దగ్గరగా వేసి గేటు దగ్గర చతికిలబడ్డాడు బీడీ కాలుస్తూ.

**********

లిఖిత మెల్లిగా తల్లి గదిలోకెళ్లింది.
ఆమె తన గదిలో ఎత్తయిన స్టూలు మీద కూర్చుని డ్రాయింగ్ బోర్డుకి బిగించిన షీటు మీద టీస్క్వేర్ మీద సెట్ స్క్వేర్ పెట్టి ఏదో గీతలు గీస్తోంది.
“అమ్మా” అంటూ మెల్లిగా పిలిచింది లిఖిత.
“ఊ” అందామె తలెత్తి చూడకుండానే..
ఆమె చాలా ఏకాగ్రతగా పని చేస్తున్న విషయం గమనించింది లిఖిత.
గీసిన గడులలో చిత్రమైన బొమ్మలతో నింపుతోంది కేయూరవల్లి
“ఏంటివి?” అనడిగింది తనూ డ్రాయింగ్ బోర్డుని ఆనుకుని నిలబడి చూస్తూ.
“మన శారీస్ మీద ప్రింట్ చేయడానికి కొత్త డిజైన్స్ తయారు చేస్తున్నాను. బాగుందా?” అనడిగింది కేయూర.
“ఊ” అంది లిఖిత.
“మొన్న మనం సింగపూర్ ఎక్స్‌పోర్టు చేసిన స్టాకు పది రోజుల్లోనే అమ్ముడుపోయిందంట., మళ్లీ కావాలని ఆర్డర్సు వచ్చేయి. అక్కడే కాదు యూరప్ దేశాల్లో కూడా మన చీరల మీద క్రేజ్ చూపిస్తున్నారని లెటర్రాసింది మల్హోత్రా. అందుకే నేను శ్రద్ధ తీసుకుని ప్రత్యేకించి ఈ నమూనాలు తయారు చేస్తున్నాను” తల్లి మాటల్లోని ఉత్సాహాన్ని గమనించింది లిఖిత.
“కంగ్రాట్స్, ఇంతకీ నీ ట్రేడ్ సీక్రెట్ ఏంటీ?” అనడిగింది నవ్వుతూ..
“అది చెప్పకూడదు” అంది కేయూర తను కూడా నవ్వుతూ.
“నాక్కూడానా?” అంది లిఖిత మొహం ముడిచి.
కేయూర ఆమె బుగ్గలు సాగదీసి “అసలేం లేదు చెప్పడానికి. క్వాలిటి, నావెల్టీ, మోడరేట్ రేట్సు నా వ్యాపార లాభానికి ముఖ్య సూత్రాలు” అంది.
“అంతేనా?” ఆశ్చర్యం ప్రకటించింది లిఖిత.
“ముమ్మాటికీ అంతే!” కస్టమర్లెప్పుడూ నాణ్యత చూస్తుకుంటారు. రెండోది ప్రతిక్షణం అతి వేగంగా మారుతున్న ఫాషన్స్‌ని దృష్టిలో పెట్టుకుంటే మన సరుకు నిలబడిపోయే సమస్య వుండదు. కంచివారు దాదాపు మన దేవాలయాల మీదున్న చెక్కడాలన్నీ తమ చీరల డిజైన్స్‌గా వాడేసుకున్నారు. అందుకే నేను వాటి జోలికి పోవడం లేదు. అంటే పూర్తిగా కాదు. మొన్న నేను రోమ్ వెళ్లినప్పుడు అక్కడ శిల్పకళ తీరు గమనించి వాటి నమూనాలు తెచ్చేను. అందులో కొంత భారతీయత మేళవించి సరికొత్త డిజైన్స్ తయారు చేసేను. దాంతో వీటికి బాగా క్రేజ్ పెరిగింది. ఇకపోతే అత్యధిక లాభాలు పొంది కస్టమర్‌ని బిచ్చగాణ్ణి చేయడం కాదు నా ఉద్దేశ్యం. నా ఫాక్టరీలో పని చేసేవారికి తగినంత జీతాలివ్వగల స్థాయిలో వుంటే చాలు నా లాభాలు. నువ్వొక్కదానివి. డబ్బు రాసులు చేసి మనీని సర్క్యులేషన్‌కి దూరం చేయడం నా అభిమతం కాదు”. తల్లి ఆలోచనా సరళికి నిజంగానే ఆశ్చర్యపోయింది లిఖిత.
ఆమెలో ఒక అద్భుతమైన వ్యాపారవేత్తే కాకుండా ఒక నిజాయితీ అయిన హృదయం కూడా వుందన్న నిజాన్నామె గ్రహించింది.
“కాని.. అమ్మా?”
“చెప్పు”
“నా ఒక్కదానిక్ కోసమింత కష్టపడటం దేనికి? ఇంత అందమైన చీరలు తయారు చేసి అందులో ఒకటి కూడా కట్టవు. పగలూ రాత్రి కష్టపడి ఆ జుట్టు చూడు. తెల్లబడిపోతున్నది” అంది లిఖిత తల్లి నుదుటి దగ్గర తెల్లబడిన వెంట్రుకలు లాగుతూ.
కేయూర లిఖిత చేతిమీద కొట్టి రేగిన జుట్టు వెనక్కి తోసుకుంటూ “వయసొస్తే వంకరకాళ్లు తిన్నవవుతాయంటారు. వయసు ముదిరితే తిన్నగా వున్న కాళ్ళు వంకర తిరుగుతాయి. దీని గురించి అంత బెంగపడాల్సిన అవసరం లేదు. ప్రతిక్షణం మనిషికి వద్దన్నా పెరిగేది వయసే. వయసు అందం గురించి కాకుండా మనం మన జీవితకాలంలో ఎవరో సంపాదించి తిండి పెడితే తిని తిన్నదరిగేదాకా నిద్రపోకుండా ఏదైనా సాధించగలమా అని ఆలోచించాలి. ప్రతి మనిషి ఏదైనా సాధించి తీరాలి. అదే మనిషికి నిజమైన అందం.. ఆభరణం” అంది.
“దేర్ యూ ఆర్!” అంది లిఖిత చప్పట్లు చరుస్తూ.
” ఈ మాటలకేం గాని అసలు నువ్వు నా గదిలోకొచ్చిన పనేంటీ?”
” నా బి.ఏ. అయింది. ఇప్పుడేం చేయమంటావో నీ సలహా అడగాలని”.
“ఇందులో నా సలహా ఏముంది. నీ అభిరుచికి తగ్గట్లుగా ఏదైనా ఎంచుకో. లేదా నా మిల్స్‌లో చేరిపో”.
తల్లి మాటలకి ఉలిక్కిపడింది లిఖిత.
“అమ్మో అది నా వల్ల కాదు. ఏదైనా విభిన్నమైన పని చేసి పేరు తెచ్చుకోవాలనుంది”.
ఆ మాట వినగానే కేయూరవల్లి మొహంలో రంగులు మారేయి.
“విభిన్నమంటే?” అనడిగింది సూటిగా.
లిఖిత వెంటనే బుర్ర గోక్కుంటూ “అదే అర్ధం కావడం లేదు. నేనేం చేద్దామన్నా అవన్నీ ఎవరో ముందుగానే చాలా తొందరపడి చేసేసేరు. నేనిప్పుడేం చేయాలి?”
“భోజనం” బయట కాలింగ్ బెల్ మోగడంతో లేచి హాల్లో కెళ్లింది కేయూరవల్లి. లిఖిత కూడా నవ్వుతూ ఆమె వెంట నడిచింది.
కేయూర తలుపు తెరిచి ఎదురుగా నిలబడి వున్న వ్యక్తిని గుర్తుపట్టలేక తికమకగా చూసింది.
“నమస్కారం నా పేరు మీనన్” అన్నాడతను.
“మీనన్ అంటే..” ఆమె గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించింది.
“నేను మీకు తెలియను. నా భార్య కుట్టియమ్మాళ్ మీతో కలిసి చదువుకుంది. ఆవిడ మీకు గుర్తుందో లేదో..!” అన్నాడతను.
కేయూర కుట్టియమ్మాళ్ గురించి ఆలోచిస్తూనే”రండి. కూర్చోండి.లిఖితా అంకుల్‌కి మంచినీళ్లు తెచ్చిపెట్టు” అంది.
లిఖిత లోనికెళ్లింది.
“కుట్టి మీ బెంచ్‌మేటంట. చాలా పెద్ద జడ వుందని మీరు బెంచి కేసి కట్టేవారంట ఒకసారి మీరు..”
“ఇక చెప్పకండి. నాకు గుర్తొచ్చింది. తను క్లాసు ఫస్టు. మంచి హేండ్ రైటింగ్. బెస్టాఫ్ ది బాచ్ అని ప్రిన్సిపాల్ పొగిడేవారు. ఎలా వుందిప్పుడు. తనని కూడా తీసుకురాలేకపోయారా?” అనడిగింది కేయూర ఉత్సాహంగా.
మీనన్ విచారంగా మొహం దించుకుని “ఆ అవకాశం నాకివ్వకుండానే తనెళ్లి పోయింది” అన్నాడతను.
కేయూర మొహం మ్లానమైంది. “సారీ” అంది మెల్లిగా.
“ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. ఆమె పదేళ్ళుగా మంచంలో తీసుకుంటున్నది. పోయి సుఖపడింది” అన్నాడాయన నిర్లిప్తంగా.
అన్ని అనుభూతులకి అతీతమైనట్లుందతని మొహం.
ఇంతలో లిఖిత మంచినీళ్లతో పాటు కొన్ని స్నాక్స్, టీపాట్ కప్పు కూడా ట్రేలో తెచ్చిపెట్టింది.
కేయూరకెలా మాటలు పెంచాలో తెలియలేదు.
అతనది గ్రహించినట్లుగా “నేనొచ్చిన పని నా కుట్టి మరణవార్త చెప్పాలని కాదు మీతో కొద్దిగా కార్తికేయన్ గురించి మాట్లాడాలి!” అన్నాడతను కేయూరవల్లి మొహంలోకి నిశితంగా చూస్తూ.
ఆ పేరు వినగానే ఉలిక్కిపడింది కేయూరవల్లి.
మొహంలో రకరకాల రంగులు మారడం స్పష్టంగా కనిపించింది.
వెంటనే ఆమె లిఖిత వైపు తిరిగి “వెంకట్ ఎందుకో ఫోను చేసేడు నీ గురించి. నేను చెప్పడం మర్చిపోయేను” అంది.
లిఖితకి తల్లి మనసు బాగా తెలుసు.
వారిద్దరి సంభాషణ వినకూడదనే ఉద్దేశ్యంతోనే తల్లి తనకా మాట చెప్పిందని గ్రహించి గదిలోకెళ్ళి చున్నీ వేసుకుని, స్లిప్పర్స్ తొడుక్కుని “వస్తానంకుల్” అంటూ బయటకెళ్లి పోయింది.
“అమ్మాయచ్చం తండ్రి పోలికే. ఇప్పుడు చూస్తే అతను చాలా సంతోషపడతాడు” అన్నడు మీనన్.
” ఆ సరదాలతనికి లేవు” అంది కేయూర వేళ్ళు విరుచుకుంటూ ఉదాసీనంగా.
చాలా సంవత్సరాలుగా భర్తకి దూరంగా వుంటున్న ఆమె భర్త పేరు వినగానే అతని వివరాలు వినాలనే ఆసక్తి చూపుతుందని అతనాశించేడు. కాని ఆమె ఏ భావాన్ని ప్రదర్శించడం లేదు.
“మీకో సంగతి చెప్పాలని వచ్చేను”
ఆమె ఏమిటన్నట్లుగా చూసింది.
“అతను కేరల వెళ్తున్నాడు”
ఎందుకని ఆమె ప్రశ్నించలేదు.
“అతను టోటల్‌గా ఫెయిలయ్యేడు”
” ఆ సంగతి ఏనాడో ఆయనకి చెప్పేను. అసలా ప్రయత్నమే తప్పని.. ఇప్పటికయినా తెలిసొచ్చిందా దేవుడితో పోరాటం హాస్యాస్పదమని!”
“లేదు. తెలిసొస్తే అతను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేవాడు. ఇప్పుడతను తను చదివిన చదువుని, మేధస్సుని తుంగలో తొక్కి ఒక నిరక్షర కుక్షయిన మాత్రికుణ్ణి, క్షుద్రోపాసకుణ్ణి ఆశ్రయించబోతున్నాడు. అతనికి తెలుసట మృత్యుంజయ విద్య” అన్నాడు మీనన్.
“వెళ్లనివ్వండి. ఇపుడు మనం చేయగలిగిందేముంది?” అంది కేయూరవల్లి.
మీనన్ ఆమెవైపు తడబాటుగా చూశాడు.
“అంతలా తీసేయకండి. ఎంతయినా అతను మిమ్మల్ని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త. ఇప్పుడతను చిక్కుల్లో పడబోతున్నాడు. ఇన్ని సంవత్సరాల కృషి బూడిదలో పోసిన పన్నీరవడంతో అతను బాగా కృంగిపోయేడు. అయినా దారి లేదని తెలిసి కూడా గోడకేసి తలబాదుకునే తత్వం అతనిది. ఇక లాబరేటరీలో చేయగలిగిందేమీ లేదనే నిర్ణయాన్ని సడలించొచ్చు. కేరళ రాష్ట్రంలో ఎంత విద్యాధికులున్నారో అంత క్షుద్రోపాసకులు కూడా వున్నారు. అక్కడికెళ్తే అసలతను మనిషిగా తిరిగి రాకపోవచ్చు. దయచేసి మీరు తొందరగా బయల్దేరండి” అన్నాడు మీనన్ ప్రాధేయపూర్వకంగా.
కేయూర నిర్లక్ష్యంగా నవ్వింది.
“అగ్నిసాక్షి! పెళ్ళి! ఆ పదాల అర్ధం మీ స్నేహితుడికి తెలుసా? అర్ధం తెలియని మంత్రాలతో ఊదరగొట్టి అసలు నెత్తిన జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో, మంగళసూత్ర ధారణ దేనికో వాటి పరమార్ధమేమితో తెలియకుండా చేసే మన దౌర్భాగ్యపు వివాహ సాంప్రదాయపు విరిగిన శిధిల ఫలకం మా పెళ్లి. నేనాయన్ని ప్రేమించేను. అతనితో జీవితం గడపాలని ఆశించేను. అతని కష్టాల్లో పాలుపంచుకోవాలని అతన్ని సుఖపెట్టాలని, అతనికోసమే బ్రతకాలని వెర్రి కలలు కన్నాను. అతను ఒక్కరోజు కనిపించకపోతే ఎంతగా ఎదురు చూసేదాన్నో, అతని ఆనందం కోసం ఎన్ని త్యాగాలకి సిద్ధపడేదాన్నో నాకింకా బాగా గుర్తున్నాయి. కాని అతను నా చిన్న చిన్న ఆశలు నిర్ధాక్షిణ్యంగా త్రుంచేసేడు.. నావి చాలా చిన్న చిన్న కోరికలు. తీర్చలేనివి కావు. నన్ను కూడా అతను గుర్తించాలని … నేను అతని కోసం చేసే పనుల్ని మెచ్చుకోవాలని .. నాకో బాగోలేకపోతే అతను ఆత్రం చూపాలని. కాని నేను కట్టుకున్నదొక అనుభూతులెరుగని రాయిని. అతనెలా నా కోరికలు తీర్చగలడు. నా మనసు పూర్తిగా విరిగిపోయింది. విశాఖపట్నానికి హైద్రాబాదు రైలు ప్రయాణమైతే ఒకరాత్రి దూరం. విమానమైతే ఒక గంట. కాని మేమిద్దరం విడిపోయేక ఈ ఇరవై సంవత్సరాలలో తిరిగి కలవలేదంటే .. అసలు కలిసే ప్రయత్నమే చెయ్యలేదంటే మా మనసులెంత విరిగిపోయాయో దయచేసి ఆలోచించండి మీనన్‌గారూ!” అంది గంభీరంగా.
ఆమెని చూస్తే అతనికి వింతగా అనిపించింది.
భర్త ఆరడి పెట్టినా, విడాకులు తీసుకుని రెండోపెళ్ళి చేసుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా వుండాల్సొచ్చినా భర్త గురించి తెలియగానే ఆందోళన పడే స్త్రీల శాతమే అతనికి తెలుసు.
కాని… ఈవిడిలా మాట్లాడుతున్నదేమిటి?
కార్తికేయన్ మాత్రం ఏం చేసేడూ?
మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడా?
ఈమెని అగౌరవపరిచేడా?
కేవలం ఒక అకుంఠిత దీక్షతో మాత్రమే ప్రయోగశాలకి అంకితమయ్యేడు.
అతను మాత్రం ఏం సుఖపడ్డాడు.
ఆమెకింకెలా చెప్పాలో అర్ధం కాలేదతనికి.
లేచి నిలబడ్డాడు చేతులు జోడిస్తూ.
“నేను చెప్పవలసింది చెప్పేను. మీకు మీ భర్తను వదిలేసే హక్కుంది. అది కాదనను. కాని అమ్మాయికి తండ్రి కావాలనిపించొచ్చు. ఒక్కసారి అమ్మాయిని పంపితే ఆయన నిర్ణయం మారొచ్చు. ఇప్పుడే నిజంగా ఏ స్త్రీకయినా భర్త నీడలో బ్రతకాల్సిన టైము. అతను కూడా నిష్ప్రయోజనమైన నిర్విరామ శృమ పడిపడి డస్సిపోయేడు. అతనిప్పుడు మీ అనురాగాన్ని ఏమాత్రం వదలుకోలేడు. వస్తాను”
అతను వెళ్తుంటే ఆమె మలచిన రాతి శిల్పంలా నిలబడిపోయింది ఎంతోసేపు భావరహితంగా.


**************
బ్రహ్మలిఖితం – 3

రచన: మన్నెం శారద

కార్తికేయన్ గత మూడు రోజులుగా అవిశ్రాంతంగా తాగుతున్నాడు.
నిజానికతనిదివరకెప్పుడు మందు ముట్టలేదు. సిగరెట్టు కూడా తాగే వ్యసనం లేదు. అసలతనికి అలాంటి దురలవాట్లు చేసుకునేంత తీరిక కూడా లేదు.
జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒకే ధ్యేయంతో, ఒకే లక్ష్యంతో గడిపేడతను. ఎపుడైనా అతని ఆశయాల్ని రెచ్చగొడుతూ నిద్ర కమ్ముకునొస్తే అందులో కూడా అతను మృత్యువు వెంబడించి పరిగెడుతున్నట్లుగానో, మృత్యునివారణకి మందు కనిపెట్టినందుకు తనని యావత్ ప్రప్రంచం కొనియాడుతున్నట్లుగానో కలలొచ్చేవి. ఉలిక్కిపడి లేచిపోయేవాడతను.
అంతులేని ఆస్తి వున్నా వెచ్చని డన్‌లప్ పరుపుల మీద వెల్వెట్టు దుప్పటిలో కూరుకుపోయి రజాయి కపుకుని ఏ.సి గదుల్లో అతనెప్పుడూ కమ్మగా నిద్రపోయెరుగడు. నిద్రలోని హాయి గురించి అతని కసలు తెలీదు.
ప్రయోగశాలలోనే రసాయనాల వాసనలు పీలుస్తూ అవిశ్రాంతంగా ప్రాణాలపై ప్రయోగాలు చేస్తూ తలలో నరాలు చిట్లిపోయేంతగా ఆలోచనల్ని మధిస్తూ ఓడిపోయే కొలది గెలుపుని అందుకోవాలనే పంతంతో ఒక యంత్రంలా పనిచేసేడతను.
కుట్టియమ్మాళ్ మరణంతో ఇప్పుడా యంత్రం స్తంభించినట్లాగిపోయింది. తన మేధస్సు మీద తీరని ఆశయమ్మీద మనసు తిరగబడుతోంది. అపహాస్యం చేస్తోంది. పగలబడి నవ్వుతోంది.
ఇన్నాళ్లూ తనలో అణిగిమణీగి ఒక బానిసలా నోరెత్తకుండా పడివున్న మనసు ఒక్కసారిగా తనలో కలిగిన నిరాశ నిస్పృహల్ని గమనించి ఒక ప్రత్యర్ధిలా తనని గేలి చేస్తూ దాడి చేస్తున్నది.
అదే.. భరించలేకపోతున్నాడు.
తన మనసు నుండి తనే పారిపోవాలన్నంత పిచ్చిగా వుందతనికి. అందుకే అవిరామంగా తాగుతున్నాడు.
నాలుకని చేదు, వెగటుగా మార్చిన విస్కీ గొంతులోంచి గుండెలోకి జారి భగ్గుమంటోంది. అయినా అతను పెగ్ మీద పెగ్ తాగుతూనే వున్నాడు. ఎప్పుడో ఏదో ఒక క్షణం తన హృదయం పోగొట్టుకున్న శాంతిని ఆ మందు తెచ్చివ్వగలదనే వెర్రి ఆశతో తాగుతూనే ఉన్నాడు.
గ్లాసులోని విస్కీలో పోసిన సోడా నురుగులో అయిసు ముక్కలు తేలుతూ సయ్యాటలాడుతున్నాయి. వాటికేసి కాస్సేపు తీక్షణంగా చూస్తూ కూర్చున్నాడతను.
ఇంకాస్సేపటిలో కరిగి తమ ఉనికిని కోల్పోబోతూ కూడా తమ జీవితం శాశ్వతమయినట్లుగా గ్లాసు ఉపరి భాగంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడ్డాయి.
వాటి శరీరాలు క్షణక్షణం క్షీణిస్తూనే వున్నాయి. అయినా ఓటమిని ఏ మాత్రం ఒప్పుకోవడం లేదవి.
తను మాత్రమెందుకింతగా కృంగిపోతున్నాడు.
ఒక శీతోష్ణస్థితిలో గడ్డగా మారిన నీటికున్న స్థయిర్యం, బలమూ తనకి లేదా? తనలోని పట్టుదల, నమ్మకం నీరు కారిపోతున్నాయా?
తనకిక గెలుపే లేదా?
తను పూర్తిగా ఓడిపోయినట్లేనా?
కార్తికేయన్ ఎర్రబడిన కళ్లతో ఆఖరి పెగ్ తాగేసేడు.
“సర్!”
“ఎస్!” అన్నాడతను తలెత్తి చూసి.
ఎదురుగా బెదురుగా నిలబడి వున్నాడు బేరర్.
“బార్ క్లోజ్ చేసే టైమయింది” అన్నాడతను వినయంగా.
ఎంత మనస్తాపంగా వున్నా, ఎంత మందు తాగినా అతనిలోని అంతర్లీనంగా వున్న సంస్కారం అతన్ని లేచి నిలబడేట్లు చేసింది.
“ఇట్సాల్ రైట్!” అంటూ జేబులోంచి చేతికందిన నోట్లు ప్లేట్లో పడేసి గ్లాసు డోరు తీసుకుని బయటకొచ్చేడతను.
కొన్ని వందల రూపాయిలు తగలెట్టి తాగిన మందు శరీరాన్ని మాత్రమే బాలన్సు పోగొట్టి తూలేట్లు చేస్తోంది. మనసు మాత్రం అతన్ని చూసి ఇంకా పరిహసిస్తూనే వుంది.
రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.
నియాన్ లైట్లు చుట్టూ దట్టంగా పేరుకొని వున్న చీకటిని వెలుగు కత్తుల్తో చీల్చి చెండాడే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అత్న్ని చూసి రోడ్డు పక్కన డస్ట్‌బిన్ ఓరగా పడుకున్న ఊరకుక్కలు లేచి నిలబడి భౌభౌమని అరిచేయి.
మనిషి ఎంత మానసిక కాలుష్యానికి గురయినా ఈ కుక్కలు మాత్రం తన నైజ గుణమైన విశ్వాసాన్ని, కాపలా తత్వాన్ని మరచిపోకపోవడం అతనికి ఆశ్చర్యం కల్గించింది.
అతను వెళ్లి తన మారుతి థౌజండ్‌లో కూర్చుని స్టార్ట్ చేసి టర్న్ తీసుకుని పంజగుట్ట నుండి జుబ్లీహిల్స్ వెళ్ళే దారికి మళ్ళించేడు. కారు కూడా తూలుతున్నట్లు వంకర్లు తిరుగుతూ జుబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ అవతలనున్న అతనింటి ముందాగింది.
గూర్ఖా గేటు తెరిచి తన విధి ప్రకారం యాంత్రికంగా సెల్యూట్ చేసేడు. కారు చిన్న జెర్క్‌తో వెళ్ళి పోర్టికోలో ఆగింది.
అతను వెళ్లి యింటి తాళం తీసి లైటు వేసేడు.
వెలుగొక్కసారిగా గదంతా పొగమంచులా కమ్ముకుంది. ఎన్నాళ్లగానో శుభ్రం చేయని వస్తువులన్నీ డిమ్ గా తన మనసులానే కళావిహీనంగా కనిపించేయతని కళ్లకి.
అతను వెళ్లి తూలుతూ మంచానికడ్డంగా పడిపోయేడు. ఏదో చెబుదామని వచ్చిన గూర్ఖా అతని పరిస్థితి గమనించి తలుపు దగ్గరగా వేసి గేటు దగ్గర చతికిలబడ్డాడు బీడీ కాలుస్తూ.

**********

లిఖిత మెల్లిగా తల్లి గదిలోకెళ్లింది.
ఆమె తన గదిలో ఎత్తయిన స్టూలు మీద కూర్చుని డ్రాయింగ్ బోర్డుకి బిగించిన షీటు మీద టీస్క్వేర్ మీద సెట్ స్క్వేర్ పెట్టి ఏదో గీతలు గీస్తోంది.
“అమ్మా” అంటూ మెల్లిగా పిలిచింది లిఖిత.
“ఊ” అందామె తలెత్తి చూడకుండానే..
ఆమె చాలా ఏకాగ్రతగా పని చేస్తున్న విషయం గమనించింది లిఖిత.
గీసిన గడులలో చిత్రమైన బొమ్మలతో నింపుతోంది కేయూరవల్లి
“ఏంటివి?” అనడిగింది తనూ డ్రాయింగ్ బోర్డుని ఆనుకుని నిలబడి చూస్తూ.
“మన శారీస్ మీద ప్రింట్ చేయడానికి కొత్త డిజైన్స్ తయారు చేస్తున్నాను. బాగుందా?” అనడిగింది కేయూర.
“ఊ” అంది లిఖిత.
“మొన్న మనం సింగపూర్ ఎక్స్‌పోర్టు చేసిన స్టాకు పది రోజుల్లోనే అమ్ముడుపోయిందంట., మళ్లీ కావాలని ఆర్డర్సు వచ్చేయి. అక్కడే కాదు యూరప్ దేశాల్లో కూడా మన చీరల మీద క్రేజ్ చూపిస్తున్నారని లెటర్రాసింది మల్హోత్రా. అందుకే నేను శ్రద్ధ తీసుకుని ప్రత్యేకించి ఈ నమూనాలు తయారు చేస్తున్నాను” తల్లి మాటల్లోని ఉత్సాహాన్ని గమనించింది లిఖిత.
“కంగ్రాట్స్, ఇంతకీ నీ ట్రేడ్ సీక్రెట్ ఏంటీ?” అనడిగింది నవ్వుతూ..
“అది చెప్పకూడదు” అంది కేయూర తను కూడా నవ్వుతూ.
“నాక్కూడానా?” అంది లిఖిత మొహం ముడిచి.
కేయూర ఆమె బుగ్గలు సాగదీసి “అసలేం లేదు చెప్పడానికి. క్వాలిటి, నావెల్టీ, మోడరేట్ రేట్సు నా వ్యాపార లాభానికి ముఖ్య సూత్రాలు” అంది.
“అంతేనా?” ఆశ్చర్యం ప్రకటించింది లిఖిత.
“ముమ్మాటికీ అంతే!” కస్టమర్లెప్పుడూ నాణ్యత చూస్తుకుంటారు. రెండోది ప్రతిక్షణం అతి వేగంగా మారుతున్న ఫాషన్స్‌ని దృష్టిలో పెట్టుకుంటే మన సరుకు నిలబడిపోయే సమస్య వుండదు. కంచివారు దాదాపు మన దేవాలయాల మీదున్న చెక్కడాలన్నీ తమ చీరల డిజైన్స్‌గా వాడేసుకున్నారు. అందుకే నేను వాటి జోలికి పోవడం లేదు. అంటే పూర్తిగా కాదు. మొన్న నేను రోమ్ వెళ్లినప్పుడు అక్కడ శిల్పకళ తీరు గమనించి వాటి నమూనాలు తెచ్చేను. అందులో కొంత భారతీయత మేళవించి సరికొత్త డిజైన్స్ తయారు చేసేను. దాంతో వీటికి బాగా క్రేజ్ పెరిగింది. ఇకపోతే అత్యధిక లాభాలు పొంది కస్టమర్‌ని బిచ్చగాణ్ణి చేయడం కాదు నా ఉద్దేశ్యం. నా ఫాక్టరీలో పని చేసేవారికి తగినంత జీతాలివ్వగల స్థాయిలో వుంటే చాలు నా లాభాలు. నువ్వొక్కదానివి. డబ్బు రాసులు చేసి మనీని సర్క్యులేషన్‌కి దూరం చేయడం నా అభిమతం కాదు”. తల్లి ఆలోచనా సరళికి నిజంగానే ఆశ్చర్యపోయింది లిఖిత.
ఆమెలో ఒక అద్భుతమైన వ్యాపారవేత్తే కాకుండా ఒక నిజాయితీ అయిన హృదయం కూడా వుందన్న నిజాన్నామె గ్రహించింది.
“కాని.. అమ్మా?”
“చెప్పు”
“నా ఒక్కదానిక్ కోసమింత కష్టపడటం దేనికి? ఇంత అందమైన చీరలు తయారు చేసి అందులో ఒకటి కూడా కట్టవు. పగలూ రాత్రి కష్టపడి ఆ జుట్టు చూడు. తెల్లబడిపోతున్నది” అంది లిఖిత తల్లి నుదుటి దగ్గర తెల్లబడిన వెంట్రుకలు లాగుతూ.
కేయూర లిఖిత చేతిమీద కొట్టి రేగిన జుట్టు వెనక్కి తోసుకుంటూ “వయసొస్తే వంకరకాళ్లు తిన్నవవుతాయంటారు. వయసు ముదిరితే తిన్నగా వున్న కాళ్ళు వంకర తిరుగుతాయి. దీని గురించి అంత బెంగపడాల్సిన అవసరం లేదు. ప్రతిక్షణం మనిషికి వద్దన్నా పెరిగేది వయసే. వయసు అందం గురించి కాకుండా మనం మన జీవితకాలంలో ఎవరో సంపాదించి తిండి పెడితే తిని తిన్నదరిగేదాకా నిద్రపోకుండా ఏదైనా సాధించగలమా అని ఆలోచించాలి. ప్రతి మనిషి ఏదైనా సాధించి తీరాలి. అదే మనిషికి నిజమైన అందం.. ఆభరణం” అంది.
“దేర్ యూ ఆర్!” అంది లిఖిత చప్పట్లు చరుస్తూ.
” ఈ మాటలకేం గాని అసలు నువ్వు నా గదిలోకొచ్చిన పనేంటీ?”
” నా బి.ఏ. అయింది. ఇప్పుడేం చేయమంటావో నీ సలహా అడగాలని”.
“ఇందులో నా సలహా ఏముంది. నీ అభిరుచికి తగ్గట్లుగా ఏదైనా ఎంచుకో. లేదా నా మిల్స్‌లో చేరిపో”.
తల్లి మాటలకి ఉలిక్కిపడింది లిఖిత.
“అమ్మో అది నా వల్ల కాదు. ఏదైనా విభిన్నమైన పని చేసి పేరు తెచ్చుకోవాలనుంది”.
ఆ మాట వినగానే కేయూరవల్లి మొహంలో రంగులు మారేయి.
“విభిన్నమంటే?” అనడిగింది సూటిగా.
లిఖిత వెంటనే బుర్ర గోక్కుంటూ “అదే అర్ధం కావడం లేదు. నేనేం చేద్దామన్నా అవన్నీ ఎవరో ముందుగానే చాలా తొందరపడి చేసేసేరు. నేనిప్పుడేం చేయాలి?”
“భోజనం” బయట కాలింగ్ బెల్ మోగడంతో లేచి హాల్లో కెళ్లింది కేయూరవల్లి. లిఖిత కూడా నవ్వుతూ ఆమె వెంట నడిచింది.
కేయూర తలుపు తెరిచి ఎదురుగా నిలబడి వున్న వ్యక్తిని గుర్తుపట్టలేక తికమకగా చూసింది.
“నమస్కారం నా పేరు మీనన్” అన్నాడతను.
“మీనన్ అంటే..” ఆమె గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించింది.
“నేను మీకు తెలియను. నా భార్య కుట్టియమ్మాళ్ మీతో కలిసి చదువుకుంది. ఆవిడ మీకు గుర్తుందో లేదో..!” అన్నాడతను.
కేయూర కుట్టియమ్మాళ్ గురించి ఆలోచిస్తూనే”రండి. కూర్చోండి.లిఖితా అంకుల్‌కి మంచినీళ్లు తెచ్చిపెట్టు” అంది.
లిఖిత లోనికెళ్లింది.
“కుట్టి మీ బెంచ్‌మేటంట. చాలా పెద్ద జడ వుందని మీరు బెంచి కేసి కట్టేవారంట ఒకసారి మీరు..”
“ఇక చెప్పకండి. నాకు గుర్తొచ్చింది. తను క్లాసు ఫస్టు. మంచి హేండ్ రైటింగ్. బెస్టాఫ్ ది బాచ్ అని ప్రిన్సిపాల్ పొగిడేవారు. ఎలా వుందిప్పుడు. తనని కూడా తీసుకురాలేకపోయారా?” అనడిగింది కేయూర ఉత్సాహంగా.
మీనన్ విచారంగా మొహం దించుకుని “ఆ అవకాశం నాకివ్వకుండానే తనెళ్లి పోయింది” అన్నాడతను.
కేయూర మొహం మ్లానమైంది. “సారీ” అంది మెల్లిగా.
“ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. ఆమె పదేళ్ళుగా మంచంలో తీసుకుంటున్నది. పోయి సుఖపడింది” అన్నాడాయన నిర్లిప్తంగా.
అన్ని అనుభూతులకి అతీతమైనట్లుందతని మొహం.
ఇంతలో లిఖిత మంచినీళ్లతో పాటు కొన్ని స్నాక్స్, టీపాట్ కప్పు కూడా ట్రేలో తెచ్చిపెట్టింది.
కేయూరకెలా మాటలు పెంచాలో తెలియలేదు.
అతనది గ్రహించినట్లుగా “నేనొచ్చిన పని నా కుట్టి మరణవార్త చెప్పాలని కాదు మీతో కొద్దిగా కార్తికేయన్ గురించి మాట్లాడాలి!” అన్నాడతను కేయూరవల్లి మొహంలోకి నిశితంగా చూస్తూ.
ఆ పేరు వినగానే ఉలిక్కిపడింది కేయూరవల్లి.
మొహంలో రకరకాల రంగులు మారడం స్పష్టంగా కనిపించింది.
వెంటనే ఆమె లిఖిత వైపు తిరిగి “వెంకట్ ఎందుకో ఫోను చేసేడు నీ గురించి. నేను చెప్పడం మర్చిపోయేను” అంది.
లిఖితకి తల్లి మనసు బాగా తెలుసు.
వారిద్దరి సంభాషణ వినకూడదనే ఉద్దేశ్యంతోనే తల్లి తనకా మాట చెప్పిందని గ్రహించి గదిలోకెళ్ళి చున్నీ వేసుకుని, స్లిప్పర్స్ తొడుక్కుని “వస్తానంకుల్” అంటూ బయటకెళ్లి పోయింది.
“అమ్మాయచ్చం తండ్రి పోలికే. ఇప్పుడు చూస్తే అతను చాలా సంతోషపడతాడు” అన్నడు మీనన్.
” ఆ సరదాలతనికి లేవు” అంది కేయూర వేళ్ళు విరుచుకుంటూ ఉదాసీనంగా.
చాలా సంవత్సరాలుగా భర్తకి దూరంగా వుంటున్న ఆమె భర్త పేరు వినగానే అతని వివరాలు వినాలనే ఆసక్తి చూపుతుందని అతనాశించేడు. కాని ఆమె ఏ భావాన్ని ప్రదర్శించడం లేదు.
“మీకో సంగతి చెప్పాలని వచ్చేను”
ఆమె ఏమిటన్నట్లుగా చూసింది.
“అతను కేరల వెళ్తున్నాడు”
ఎందుకని ఆమె ప్రశ్నించలేదు.
“అతను టోటల్‌గా ఫెయిలయ్యేడు”
” ఆ సంగతి ఏనాడో ఆయనకి చెప్పేను. అసలా ప్రయత్నమే తప్పని.. ఇప్పటికయినా తెలిసొచ్చిందా దేవుడితో పోరాటం హాస్యాస్పదమని!”
“లేదు. తెలిసొస్తే అతను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేవాడు. ఇప్పుడతను తను చదివిన చదువుని, మేధస్సుని తుంగలో తొక్కి ఒక నిరక్షర కుక్షయిన మాత్రికుణ్ణి, క్షుద్రోపాసకుణ్ణి ఆశ్రయించబోతున్నాడు. అతనికి తెలుసట మృత్యుంజయ విద్య” అన్నాడు మీనన్.
“వెళ్లనివ్వండి. ఇపుడు మనం చేయగలిగిందేముంది?” అంది కేయూరవల్లి.
మీనన్ ఆమెవైపు తడబాటుగా చూశాడు.
“అంతలా తీసేయకండి. ఎంతయినా అతను మిమ్మల్ని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త. ఇప్పుడతను చిక్కుల్లో పడబోతున్నాడు. ఇన్ని సంవత్సరాల కృషి బూడిదలో పోసిన పన్నీరవడంతో అతను బాగా కృంగిపోయేడు. అయినా దారి లేదని తెలిసి కూడా గోడకేసి తలబాదుకునే తత్వం అతనిది. ఇక లాబరేటరీలో చేయగలిగిందేమీ లేదనే నిర్ణయాన్ని సడలించొచ్చు. కేరళ రాష్ట్రంలో ఎంత విద్యాధికులున్నారో అంత క్షుద్రోపాసకులు కూడా వున్నారు. అక్కడికెళ్తే అసలతను మనిషిగా తిరిగి రాకపోవచ్చు. దయచేసి మీరు తొందరగా బయల్దేరండి” అన్నాడు మీనన్ ప్రాధేయపూర్వకంగా.
కేయూర నిర్లక్ష్యంగా నవ్వింది.
“అగ్నిసాక్షి! పెళ్ళి! ఆ పదాల అర్ధం మీ స్నేహితుడికి తెలుసా? అర్ధం తెలియని మంత్రాలతో ఊదరగొట్టి అసలు నెత్తిన జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో, మంగళసూత్ర ధారణ దేనికో వాటి పరమార్ధమేమితో తెలియకుండా చేసే మన దౌర్భాగ్యపు వివాహ సాంప్రదాయపు విరిగిన శిధిల ఫలకం మా పెళ్లి. నేనాయన్ని ప్రేమించేను. అతనితో జీవితం గడపాలని ఆశించేను. అతని కష్టాల్లో పాలుపంచుకోవాలని అతన్ని సుఖపెట్టాలని, అతనికోసమే బ్రతకాలని వెర్రి కలలు కన్నాను. అతను ఒక్కరోజు కనిపించకపోతే ఎంతగా ఎదురు చూసేదాన్నో, అతని ఆనందం కోసం ఎన్ని త్యాగాలకి సిద్ధపడేదాన్నో నాకింకా బాగా గుర్తున్నాయి. కాని అతను నా చిన్న చిన్న ఆశలు నిర్ధాక్షిణ్యంగా త్రుంచేసేడు.. నావి చాలా చిన్న చిన్న కోరికలు. తీర్చలేనివి కావు. నన్ను కూడా అతను గుర్తించాలని … నేను అతని కోసం చేసే పనుల్ని మెచ్చుకోవాలని .. నాకో బాగోలేకపోతే అతను ఆత్రం చూపాలని. కాని నేను కట్టుకున్నదొక అనుభూతులెరుగని రాయిని. అతనెలా నా కోరికలు తీర్చగలడు. నా మనసు పూర్తిగా విరిగిపోయింది. విశాఖపట్నానికి హైద్రాబాదు రైలు ప్రయాణమైతే ఒకరాత్రి దూరం. విమానమైతే ఒక గంట. కాని మేమిద్దరం విడిపోయేక ఈ ఇరవై సంవత్సరాలలో తిరిగి కలవలేదంటే .. అసలు కలిసే ప్రయత్నమే చెయ్యలేదంటే మా మనసులెంత విరిగిపోయాయో దయచేసి ఆలోచించండి మీనన్‌గారూ!” అంది గంభీరంగా.
ఆమెని చూస్తే అతనికి వింతగా అనిపించింది.
భర్త ఆరడి పెట్టినా, విడాకులు తీసుకుని రెండోపెళ్ళి చేసుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా వుండాల్సొచ్చినా భర్త గురించి తెలియగానే ఆందోళన పడే స్త్రీల శాతమే అతనికి తెలుసు.
కాని… ఈవిడిలా మాట్లాడుతున్నదేమిటి?
కార్తికేయన్ మాత్రం ఏం చేసేడూ?
మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడా?
ఈమెని అగౌరవపరిచేడా?
కేవలం ఒక అకుంఠిత దీక్షతో మాత్రమే ప్రయోగశాలకి అంకితమయ్యేడు.
అతను మాత్రం ఏం సుఖపడ్డాడు.
ఆమెకింకెలా చెప్పాలో అర్ధం కాలేదతనికి.
లేచి నిలబడ్డాడు చేతులు జోడిస్తూ.
“నేను చెప్పవలసింది చెప్పేను. మీకు మీ భర్తను వదిలేసే హక్కుంది. అది కాదనను. కాని అమ్మాయికి తండ్రి కావాలనిపించొచ్చు. ఒక్కసారి అమ్మాయిని పంపితే ఆయన నిర్ణయం మారొచ్చు. ఇప్పుడే నిజంగా ఏ స్త్రీకయినా భర్త నీడలో బ్రతకాల్సిన టైము. అతను కూడా నిష్ప్రయోజనమైన నిర్విరామ శృమ పడిపడి డస్సిపోయేడు. అతనిప్పుడు మీ అనురాగాన్ని ఏమాత్రం వదలుకోలేడు. వస్తాను”
అతను వెళ్తుంటే ఆమె మలచిన రాతి శిల్పంలా నిలబడిపోయింది ఎంతోసేపు భావరహితంగా.

**************


కాన్వొకేషన్ జరిగిన రాత్రి వెంకట్ లిఖితని ముద్దు పెట్టుకున్నాక తిరిగి వాళ్ళిద్దరూ కలిసింది ఆ రోజే.
“నువ్వు చేసిన పనేంటి?”
లిఖిత సూటి ప్రశ్నకి తడబడుతూ “నేను నిన్ను ప్రేమించేను. అయ్ లౌ యూ” అన్నాడతను.
“అన్ని భాషల్లో చెప్పనక్కర్లేదు. నాకు తెలుగొచ్చు. కాని నువ్వు ప్రేమించేసేవని నిర్ణయించుకున్నాక నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా నన్ను ముద్దు పెట్టేసుకోవచ్చును అనుకోవడాన్ని ఏమనాలి. ఆడదానికసలు ఇష్టాలుండవనా? నేనెంత హర్టయ్యేనో తెలుసా?” అంది లిఖిత సీరియస్‌గా.
“నాతో ఇంత చనువుగా తిరుగుతున్నావు. నీకిష్టమే నేనంటే అనుకున్నాను” అన్నాడతను నసుగుతూ.
“అవును. ఇష్టమే. నిన్ను స్నేహితుడిగా గుర్తిస్తాను. అభిమానిస్తాను. నీకు కష్టమొస్తే బాధపడతాను. కాని.. చాలా వ్యక్తిగతమైన అనుభూతుల్ని నీ నుండి పొందాలని యింతవరకెప్పుడూ నేననుకోలేదు. నిజం చెప్పాలంటె .. నీ ముద్దు నాకు జీవితమ్మీద ముద్దు మీదున్న తియ్యని అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసింది” అంది లిఖిత కొంచెం తీవ్రమైన కంఠస్వరంతో.
వెంకట్ ఖంగు తిన్నట్టుగా చూశాడామెవైపు
“సారీ! నీకు బాధ కలిగిస్తే క్షమించు. నాకు జీవితంలో అప్పుడే ప్రేమ పెళ్లి అనే రొంపిలో ఇరుక్కోవాలని ఏ మాత్రమూ లేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే మనస్తత్వం నాది!” అంది.
“మీ మమ్మీ సంపాదించింది చాలదనా?” కొంచెం వెటకారం మిళితమైన స్వరంతో అడిగేడు వెంకట్.
లిఖిత అతనివైపు చిరాగ్గా చూసి, “ఎవరో సంపాదించిన దాంతో తిని బతకాలనే సాధారణ మనస్తత్వం కాదు నాది. నువ్వు మాత్రం పెళ్లి అంటూ ఎందుకు తొందరపడుతున్నావో నాకు తెలియదు. అసలేం సాధించేవని?” అనడిగింది.
“సరే. సాధించే కనిపిస్తాను నీకు. నాకు డబ్బు లేదని, చాలాసార్లు నాకు ఫీజు కట్టేవని, నేనెక్కి తిరిగే బైక్, నేను తొడిగే బట్టలు నీవనేగా నీకింత చులకన నేనంటే?” అన్నాడు వెంకట్ కోపంగా.
లిఖిత అతని వైపు అప్రతిభురాలయినట్లుగా చూసి” నువ్వు చాలా తొందరపడుతున్నావ్ వెంకట్. అవన్నీ నేను నీకు స్నేహపూర్వకంగా మాత్రమే చేసేను. నిన్ను స్నేహితుడిగా ఎప్పటికీ గౌరవిస్తాను. కాని.. ఈ రకమైన అనుబంధాన్ని మాత్రం నేనెన్నడూ వూహించలేదు. ” అంది.
వెంకట్ సీరియస్‌గా లేచి నిలబడి”వస్తాను. తొందరలోనే నీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను” అంటూ విసురుగా వెళ్లిపోతుంటే కొంత బాధగానూ, మరికొంత చిరాగ్గానూ చూసి తనూ బయల్దేరింది లిఖిత.
మనసంతా చేదు తిన్నట్లుగా అనిపించింది.
వెంకట్ ఎందుకలా తొందరపాటుగా ప్రవర్తిస్తున్నాడో ఆమెకొక పట్టాన అర్ధం కాలేదు.
చిరాగ్గా హోటల్లోంచి బయటకొచ్చి అక్కడ రోడ్డు మీద సూట్‌కేసు తీసుకుని ఆటోకోసం నిలబడ్డ వ్యక్తిని చూసి “అంకుల్!” అంది దగ్గరికెళ్ళి.
మీనన్ ఆమెని చూసి “వస్తానమ్మా! ఇప్పుడు గోదావరి ఎక్స్‌ప్రెస్‌కి వెళ్లిపోతున్నాను.” అన్నాడు.
“అప్పుడేనా?”
“ఏం చేయను. వచ్చిన పని కాలేదు.”అన్నాడతను నిరాశని వ్యక్తం చేస్తున్న మొహంతో.
“ఏం పని?” సందేహంగా అడిగింది.
“నీకు చెప్పొచ్చునో లేదో మరి?” అన్నాడతను సంశయంగా.
“నేను బి.ఏ. యూనివర్సిటీ ఫస్టొచ్చేనంకుల్! నాకు మైనారిటీ తీరిపోయింది. నాకెందుకు చెప్పకూడదూ?” అనడిగింది లిఖిత రెట్టిస్తున్నట్టుగా.
“అయితే వెళ్ళి మీ అమ్మని మీ నాన్నగారి గురించడుగు. నాకు రైలుకి టైమయింది. వస్తాను” అంటూ ఆటో ఎక్కేసేడతను.
ఆటో సాగిపోతుంటే నిర్విణ్ణురాలయి చూసిందటువైపు లిఖిత.
“వ్వాట్! తనకి నాన్న వున్నాడా?” జవాబు దొరకని ప్రశ్న ఆమె మనసులో ఉదయించింది మొదటిసారిగా.
టైము రాత్రి పదిగంటలు దాటుతోంది.
లిఖిత తల్లి వున్న పూజగదిలోకి మాటిమాటికి తొంగి చూస్తోంది.
తండ్రి గురించి అప్పటికప్పుడు తెలుసుకోవాలన్న ఆత్రుత, తెలిసి తీరాలన్న పట్టుదల హృదయంలో బెలూన్‌లోకి ఊదుతున్న గాలిలా విపరీతమైన వత్తిడి తెస్తోంది. ఆ వత్తిడిని ఆమె లేత హృదయం భరించలేకపోతంది.
నిజానికి తన తల్లి ఆ టైములో పూజ గదిలోకి వెళ్లదు. హాల్లోనే కూర్చుని ఎదురుగా నిశీధిలో ఒదిగిపోయిన ఘోషతో తన ఉనికిని తెలియజేసే సముద్రం కేసి చూస్తూ కూర్చుంటుంది. ఎదురుగా బెర్త్‌లు ఖాళీలేక సముద్రంలోనే తిష్టవేసి దీపాలతో వెలిగే స్టీమర్లు, హార్బర్ వైపు దారి చూపుతూ నీటిలో దీపాలతో తేలియాడే పాంటూన్స్, మాటిమాటికి కాంతి ప్రదక్షిణాలు చేసే లైట్ హౌస్. ఆ కాంతిలో నిశ్చలంగా సముద్ర మధ్యభాగంలో కరకు రాతి గుండెలా కదలిక నిలబడిన డాల్ఫిన్ నోస్ చూసిన దృశ్యాల్నే ఆమె చూస్తుందో.. వాటికి అతీతమైన అలౌకిక దృష్టితో ఆమె యోగనిద్రలో వుంటుందో లిఖితకెన్నడూ అర్ధం కాదు. అప్పుడెంతగా పలకరించినా ఆమె పలకదని కూడా ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు. కాని ఈ రోజు ఆమె దినచర్యకి విరుద్ధంగా ఆమె పూజగదిలో దేవుడి ముందు కూర్చుని వుంది.
అంటే ఆమె కూడా ఏదో తీవ్ర సంఘర్షణకి గురవుతున్నదన్నమాట!
మీనన్ అంకుల్ తండ్రి గురించి ఏం చెప్పి వుంటాడు.
ఆయనకి గాని ఒంట్లో బాగుండలేదా?
మంచమ్మీద ఆఖరి ఘడియల్లో తను చూడకుండానే…”నో.. నెవర్!” లిఖిత అనుకోకుండానే బయటకి అరిచేసింది.
కేయూరవల్లి నిద్రాభంగమైనట్లుగా కూతురివైపు తిరిగి చూసింది.
“నాన్నకేమైంది?” ఆత్రంగా అడిగి9ంది లిఖిత.
కేయూర కనుబొమలు ఆశ్చర్యంగా పైకి లేచేయి.
లేచి గదిలోంచి బయకొస్తూ “నువ్వంతా విన్నావా?” అనడిగింది.
“లేదు. నేను వస్తుంటే మీనన్ అంకుల్ కనిపించేరు. వచ్చిన పని కాలేదని మీ నాన్న గురించి మీ అమ్మ నోటితోనే వినమని చెప్పి వెళ్ళిపోయేరు” అంది లిఖిత గబగబా.
కేయూరవల్లి చెక్కుచెదరని శిల్పంలా బాల్కనీలోకి నడిచింది.
ఆ వెనుకే లిఖిత కూడా వెళ్ళింది.
“నీకు మీ నాన్నంటే అంతిష్టమా?”
తల్లి ప్రశ్నకి తెల్లబోయింది లిఖిత.
“తండ్రంటే ఎవరికిష్టముండదు?” అంది ఆశ్చర్యంగా.
“ఎవరి సంగతో కాదు. నీ సంగతడుగుతున్నాను. ఆయన నీకేం చేసేరని? ఎత్తుకు తిప్పేరా? చదివించేరా? కనీసం ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారొచ్చి నిన్ను చూడాలని ప్రయత్నించేరా? ఎందుకని నీకంత మమకారం?”
కేయూర శరపరంపరలా వదులుతున్న ప్రశ్నల ధాటికి తలదించుకుంది లిఖిత.
“చెప్పవేం? ఏం చెబుతావు? నీ దగ్గరేం జవాబుందని?” అంది కేయూర హేళనగా.
ఈసారి లిఖిత తలెత్తింది. సూటిగా.
“నేనాయన దగ్గర పెరిగుంటే నువ్వన్నవన్నీ చేసి వుండేవారేమో! మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. నువ్వు నన్ను నీ వెంట తెచ్చేసుకున్నావు. నన్ను చట్టం ప్రకారం తన దగ్గరకు లాక్కోక నీకే వదిలేయడంతో ఆయన సంస్కారం కనబడటం లేదా?”
కూతురి మాటలకు పకపకా నవ్వింది కేయూరవల్లి.
“ఎవరో తెలియకపోయినా తండ్రిని బాగానే వెనకేసుకొస్తున్నావు. పీతృ ప్రేమ బాగానే పొంగిపొర్లుతుంది. ఇంతకీ నేను ఆయన్నుంచెందుకు విడిపోయానో తెలుసా? నీకోసమే!” అంది గంభీరంగా .
లిఖిత విస్తుపోయినట్లు చూస్తూ”నా కోసమా?” అంది.
“అవును. ముమ్మాటికీ నీకోసమే. నీ తండ్రిని నేను ప్రేమించి పెళ్లి చెసుకున్నాను. అందుకోసం నా తండ్రిని కూడా ఎదిరించేను. కాని ఆయన నా ప్రేమకేం విలువిచ్చేడు. మనకిష్టమైన వస్తువుని కొనుక్కుని ఇంట్లో పడేసినట్లుగా నా మెడలో తాళికట్టి చెయ్యి దులుపుకున్నారు” అంది కేయూర ఆవేశంగా.
తల్లి గొంతులోని ఆవేశం దానివల్ల కల్గిన కంపన గమనించి తెల్లబోయింది లిఖిత.
“ఇప్పుడసలాయన కెలా వుందో చెప్పమ్మా!” అంది అసహనంగా.
కేయూర చూపు తిప్పి కూతురికేసి తీక్షణంగా చూసింది.
“నీకు చాలా ఆందోళనగా వున్నట్లుంది. నువ్వనుకునే ప్రమాదస్థితిలో ఆయనేం లేరు. నీ తండ్రి ఒక సైంటిస్ట్. పేరు కార్తికేయన్.”
తల్లి మాట విని లిఖిత మొహంలో ఆస్చర్యం, ఆనందం చోటు చేసుకున్నాయి.
ఆయనగురించి ఇటీవల కొన్ని పేపర్లు రాసిన వార్తలు కూడా ఆమె చదివి వున్నది.
“అంటే.. మరణం లేకుండా.. ప్రయోగాలు చేస్తున్న.. కార్తికేయన్..?”
“ఎగ్జాట్లీ ఆయనే. ఆయనిప్పుడు తన ఇరవై రెండు సంవత్సరాల నిరంతర కృషి విఫలం కాగా, కేరళ అడవుల్లోని మాంత్రికుల్ని ఆశ్రయించి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని కేరళ బయలేరుతున్నారట. ఆ విషయం చెప్పడానికే మీనన్ వచ్చేరు” .
“ఈ సంగతి మనకెందుకు చెప్పేరు?”
“మీ నాన్నని రక్షించుకోమని”.
“ఆయనకేమవుతుందని?” ఆశ్చర్యంగా అడిగింది లిఖిత.
“కేరళ రాష్ట్రం గురించి నీకు తెలియదు. మా నాన్నగారు ఎ.ఎస్.పిగా సర్వీసులో జేరి ఐ.జి గా హార్టెటాక్ తో పోయేరు. ఆయన పుణ్యమా అని నేను తమిళనాడు, కేరళ చూడటం జరిగింది. కేరళ ఒక చిత్రమైన, సుందరమైన రాష్ట్రం. దేవతలకు స్వర్గంలో వుండతానికి విసుగు కలిగినప్పుడు భూలోకంలో విహారానికి రావడానికి కేరళని అంత సుందరంగా సృష్టించుకున్నారని కేరళీయులు నమ్ముతారు. దేవతలక్కడికి నిజంగా వస్తారో రారో కాని.. ఆ రాష్ట్రంలో ప్రకృతి సర్వాంగ సుందరంగా వుంటుంది. నీకు తెలుసో లేదో అక్కడసలు నిరక్షరాస్యత లెనే లేదు. భారతదేశంలో దొరికే సుగంధ ద్రవ్యాల కోసం ప్రతి విదేశీయుడూ కాలు పెట్టిందా రాష్ట్రంలోనే. కాని.. ఇన్ని వున్న ఆ రాష్ట్రంలో గొప్ప గొప్ప ఆయుర్వేద మందులతో పాటు.. మనిషిని మట్టుపెట్టే చేతబడులు.. క్షుద్రపూజలు కూడా వున్నాయి. అందుకే మీనన్ మీ నాన్నగారక్కడ కెళ్ళడానికి ఇష్టపడక భయంతో మనల్ని వెదుక్కుంటూ వచ్చేరు!” కేయూర గాధంగా విశ్వసిస్తూ అంది.
తల్లి చివరి మాటకు నవ్వొచ్చింది లిఖితకి.
“నువ్వేం చదువుకున్నావమ్మా?” అంది అమాయకంగా.
“ఎం.ఏ.లిటరేచర్”
“అంత చదువు చదివి నువ్వు చేతబడుల గురించి, క్షుద్రపూజల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నాకు.ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్మి ఇతరుల్ని నమ్మేట్లు చేయడం నేరం!” అంది లిఖిత హేళనగా.
“అలా కూర్చో” అంది తనూ కుర్చీలో కూర్చుంటూ.
లిఖిత కూర్చుని తల్లి మొహంలోకి చూసింది.
“అవును, ఈ రోజులు! ఈ రోజుల గురించి మా అమ్మమ్మ ఊహించి కలలు గంటూ నా పక్కలో పడుకుని చెప్పిన మాటలింకా న అచెవిలో గింగురుమంటూనే వున్నాయి. నేను పుట్టగానే మా అమ్మ చనిపోతే అమ్మమ్మే కొంతకాలం పెంచింది నన్ను. ఆమె స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకెళ్ళింది. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీగారితో కలిసి కన్నకూతురి భవిష్యత్తు గురించి కాక దేశానికి రాబోయే మంచి రోజుల గురించి ఆలోచించి ఆనందపడేవారట. స్వాతంత్ర్యం రావడం వాళ్లు జైళ్లలోంచి బయటికి రావడం ఉన్న ఆస్థిని దేశానికి సమర్పించిన వాళ్లు ఏదో చిన్న టీచరు ఉద్యోగం సంపాదించుకోవడం జరిగిపోయేయి. మా తాతగారు బారిస్టరు చదివి కూడా ‘లా’ ప్రాక్టీసు చేసి ‘లాయరు’ కావడానికిష్టం లేక ఆ పట్టాని చింపి టీచరు పని చేసేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వాల ఆదర్శాల గురించి, వాళ్ల విశాల దృక్పధం గురించి, స్వార్ధమెరుగని వాళ్ల పరమార్ధం గురించి, స్వాతంత్ర్యం వచ్చేక కట్నాలు పోతాయని స్త్రీలకి గౌరవం పెరుగుతుందని లంచాలు, జులుంలు నశించిపోతాయని భారతీయులంతా ఒక తాటి మీద నడిచి దేశాన్ని ప్రగతి బాట మీద నడిపిస్తారని స్త్రీ,పురుష బేధాలు నశించిపోతాయని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని వీటినే చందమామ కథలుగా చెప్పేది అమ్మమ్మ.
“అమ్మమ్మ చచ్చిపోయింది. ఆవిడ కలలెంత కల్లలో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. కట్నాలు లక్షలు, కోట్లలోకి పెరిగిపోయేయి. స్త్రీ శరీరం వ్యాపార వస్తువయిపోయింది. చూస్తుండగానే కుల, మత, ప్రాంతీయ భావాలు కలరా, ప్లేగు వ్యాధుల కన్నా తీవ్రంగా ప్రబలిపోయేయి. మనకో చట్టం, భద్రత ఉన్నాయని , మనకి అన్యాయం జరిగితే అక్కడ మొరపెట్టుకోవచ్చని ఎవరైనా నమ్మితే వాళ్లంత పిచ్చివాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. స్వాతంత్ర్యం వచ్చిన ఈ నలభయ్యేడు సంవత్సరాల్లో మన గొయ్యి మనమే తవ్వుకున్నాం. న్యాయాన్ని ధర పెట్టి అమ్ముకుంటున్నాం. మెడలో నగలు, వేసుకొచ్చిన కారులు చూసి మనుషుల్ని గౌరవిస్తున్నాం. ఇక చేతబడుల్ని, క్షుద్రపూజల్ని నమ్మితే తప్పేముంది. మన నేతలే బాబాల్ని ఆశ్రయించి వాళ్ల పాదాల దగ్గర కూర్చుంటున్నారు. గారడీ విద్యల్ని దైవలీలలుగా నమ్ముతున్నారు. యధారాజా తథా ప్రజా అని నువ్వు నేను నమ్మడంలో తప్పేముంది?”
తల్లికెలా జవాబు చెప్పాలో అర్ధం కాలేదు లిఖితకి.
“ఇప్పుడు నాన్నగారి సంగతి మాట్లాడు. ఆయనకేదన్నా ప్రమాదం జరుగుతుందంటావా?” అనడిగింది ఆందోళనగా.
“ఆ సంగతి నేనెలా చెప్పగలను. ఆ ఇంటీరియర్ ఫారెస్టులో ఎలాంటి మాత్రికులున్నారో నాకేం తెలుసు. అయినా మనల్ని కాదనుకున్న వ్యక్తి గురించి మనమింత సేపెందుకు ఆలోచించాలి.?”
తల్లి ప్రశ్నకీసారి లిఖిత ఎర్రబడిన కళ్లతో చూసింది.
“ఎందుకా? ఆయన నీకు భర్త. నాకు తండ్రయినందుకు. నువ్వెన్ని చెప్పినా నేను వెళ్లి తీరతాను. ఆయన్నొకసారి చూడాలని లేదని నీకబద్ధం చెప్పలేను”.
ఈసారి కేయూర మ్రాన్స్పడినట్లు చూసింది కూతురివైపు.
“వెళ్లు. వెళ్లి ఆయన్నుద్ధరించు. ఎవరికోసం నేనింత కాలం వొంటరిగా ఒక మ్రోడులా జీవించేనో వాళ్లే కూతపెట్టి తండ్రి తరఫున మాట్లాడుతుంటే నాదేముంది?” అంది కన్నీళ్లతో.
ఆమె కన్నీళ్లని చూసింది లిఖిత హృదయం.
అన్ని భావాలని అతీతంగా ఒక యంత్రంలా ఇంతకాలం పని చేసుకుంటూ పోతున్న తల్లి హృదయంలో కూడా ఇంకా అనుభూతుల గోతులున్నాయా? అని ఆశ్చర్యపోయిందామె మనసు.
“చావుని నివారించాలనే అమాయకత్వంతో పసిపిల్లల్ని బలిచ్చే ఒక మాయగాడి చేతిలో పదమూడేళ్ల వయసులో చిక్కుకున్నారు మీ నాన్న. ఆ రాకెట్‌ని పట్టుకుని మీ నాన్నని యింటికి తీసుకొచ్చెరు మా నాన్న భాస్కర్ ఎస్.పి. ఇతనిలోని పట్టుదల చూసి చదివించేరు. మేమిద్దరం మంచి స్నేహితులుగా మసలేవాళ్లం. వయసుతో పాటు నాలో అతనిపట్ల ప్రేమ చోటు చేసుకుంది. మా నాన్న మా పెళ్లికి ఇష్టపడలేదు. అప్పటికాయన ఐ.జి గా పని చేస్తున్నారు. ఆయన వద్దనడానికి కారణం అతనికి డబ్బులేకపోవటం కాదు. పి.హెచ్.డి చేసి ఎప్పుడూ మరణం గురించి ఆలోచించే ఈ మనిషి భార్యని భర్తగా సుఖపెట్టలేడని.. కాని నేను వినలేదు. మా పెళ్లి జరిగిపోయింది. మీ నాన్నకి జుబ్లీ హిల్స్‌లో ఒక స్వంత లాబరేటరీ కట్టించేరు మా నాన్న. నేను ప్రెగ్నెంటయ్యేను. ఆ సమయంలో మీ నాన్న నుండి నేనాశించిన అనుభూతుల్ని పొందలేకపోయేను. మా నాన్న హార్టెటాక్‌తో చనిపోయినప్పుడు కూడా పట్టనట్లే వున్నారు. చావు లేకుండా మందు కనుక్కోవలని ప్రయోగాలు చేసే ఈ మనిషి తననంతవాణ్ని చేసిన మనిషి చచ్చిపోతే విచారించలేదు. నా మనసుకి ఎక్కడో తీరని దెబ్బ తగిలి దాని రూపం కోల్పోయింది. అయినా సహించేను. ఇంతలో నాకు నొపులొచ్చేయి. ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసేరు. మరెవరో పురుడు పోసేరు. నువ్వు పుట్టేవు. ఆయనొక్కసారి కూడా వచ్చి చూడలేదు. తన మొదటి సంతానాన్ని చూసి ఏ తండ్రయినా మురిసిపోతాడు. కాని.. అది జరగలేదు. నా మనసింకా వంగిపోయింది. పొత్తిళ్లలో నిన్ను పెట్టుకుని ఇల్లు చేరేను. అప్పుడు కూడా ఆయన ఇంటికి రాలేదు. లాబ్‌లోనే అహర్నిశలూ గడపటం మొదలెట్టేరు. ఎందుకీ పెళ్ళి? ఏమిటి నేను పొందుతున్నది. పెళ్లి ఒక కమిట్‌మెంట్. తర్వాత భార్యాభర్తలు ఒకరి నుండి మరొకరు ఆశించేవి కంపానియన్‌షిప్. కన్సొలేషన్, కన్సర్న్, ఇవేమి లభించని ఈ పెళ్లినేమనాలి. మా నాన్న ఎందుకితనితో వివాహం వద్దన్నారో నాకు బాగా అర్ధమయింది. అయినా ఓర్చుకున్నాను. కాదు. మాకు విడిపోయే రోజు దగ్గరకొచ్చేసింది. నీకు అనుకోకుండా బాగా జబ్బు చేసింది. డయేరియా. పసిపిల్లలకి దీన్ని మించిన జబ్బు లేదు. నేను లాబ్‌కి ఫోన్ చేసేను. అయినా ఆయన రాలేదు. ఒక కుక్కపిల్ల ప్రాణాల్ని కాపాడే ప్రయోగం చేస్తున్నారాయన. కన్నకూతురి చావు బ్రతుకుల్ని పట్టించుకోలేదాయన. నిన్ను తీసుకుని భోరున కురిసే వర్షంలో కారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ నీలోఫర్ హాస్పిటల్ చేరుకున్నాను. వారం రోజులు చావు బ్రతుకులతో పోరాడి బతికేవు నువ్వు. ఈ లోపు నేను ప్రార్ధించని దేవుడు లేదు. ఇక నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నిన్ను తీసుకుని తిన్నగా విశాఖపట్నం వచ్చేసేను. ఇక్కడ నాకొక స్నేహితురాలుంది. ఆమె సహాయంతో కేయూర టెక్స్‌టైల్స్ ప్రారంభించేను. దాదాపు నీ వయసు, ఈ కంపెనీ వయసూ ఒకటే. నీ ప్రాణాల్ని కాపాడినందుకే నేను దేవుళ్ళకంతగా పూజ చేస్తాను. ఈ నిరాసక్తం, నిస్తేజమూ, నిర్లిప్తమయిన నా జీవితంలో నువ్వే ఒక వెలుగురేఖవి. నీ ఆలంబనతో అల్లుకుంటూ ఊపిరి పోసుకుంటున్నది నా బ్రతుకు. ఇప్పుడు చెప్పు కేవలం పుట్టుక నిచ్చిన నీ తండ్రి నీకు ఏం చేసేరు. ఏమైనా చేసేరనుకుంటే వెళ్లు. నేను నిన్నాపే ప్రయత్నం చెయ్యను” అంది కేయూరవల్లి తనిన్నాళ్లూ ప్రోది చేసుకున్న గాంభీర్యాన్ని వదలి కన్నీళ్లతో.
తల్లి చెప్పిన కథ విని తల్లడిల్లిపోయింది లిఖిత.
వెంటనే తల్లిని కౌగిలించుకుని “నేనెక్కడికీ వెళ్లనమ్మా నిన్నొదిలి” అంది ఏడుస్తూ.
కేయూర ఆమె ముంగురులు సవరిస్తూ “ఏడవకు. అందుకే ఎప్పుడూ మీ నాన్న సంగతులు మాట్లాడలేదు నేను” అంది ఓదార్పుగా.

******
లిఖిత ఉలిక్కిపడి నిద్ర లేచింది.
తండ్రి ఏదో కష్టంలో ఇరుక్కుపోయి తనని పిలుస్తున్నట్లుగా కలొచ్చిందామెకు. ఎంత ఫ్రాయిడ్ సిధాంతాన్ని నమ్ముదామన్నా మనసేదో చెడునే ఊహిస్తున్నది. మనం చదివిన చదువుకి, విజ్ఞానానికి ఏ మాత్రం పొంతన కుదరని అతీతమైన అదృశ్య శక్తులేవో వున్నాయేమోనన్న అనుమానం ఎంత వద్దన్నా ఆమె మీదకి ప్రాతఃకాలపు నీడలా సాగుతూనే వుంది.
ఆమె లేచి మంచినీళ్లు తాగి తిరిగి ఫ్రిజ్ మూస్తూ పూజగది వైపు చూసింది. అక్కడ అఖండ దీపం వెలగడం లేదు. అగరొత్తుల ధూపం అలుముకోవదం లేదు. ముఖ్యంగా ధ్యానముద్రలో తల్లి అక్కడ కనిపించకపోవడంతో లిఖిత తల్లడిల్లిపోతూ తల్లి బెడ్‌రూంలోకి తొంగి చూసింది. తల్లి గోడకి మొహం పెట్టుకొని పడుకొనుంది.
లిఖిత గోడ గడియారం వైపు చూసింది.
టిక్కుటిక్కు శబ్దాలతో కాలాన్ని ముందుకు నెడుతూ సెకండ్స్ ముల్లు ముందుకు కదులుతుందంటే చిన్న ముల్లు అయిదు మీద, పెద్ద ముల్లు రెండు మీదకు చేరుకున్నయి. నాలుగ్గంటలకే లేచి పూజ మొదలెట్టే తల్లి ఈరోజు అయిదూ పది నిమిషాలయినా లేవకపోవడంలోని అంతరార్ధం అర్ధం కాక గదిలోంచి చిన్న నిష్క్రమించబోతూ బెడ్ లైటు కాంతిలో ఆమె భుజాలు కదులుతున్నట్లుగా అనుమానమొచ్చి అక్కడే నిలబడింది కొంత సేపు.
అయిదు నిమిషాలనంతరం ఆమె వెక్కిళ్ళు అణుచుకుంటూ ఏడుస్తున్నదనే విషయం అర్ధమయింది లిఖితకి.
కంగారుగా వెళ్లి తల్లి మంచం మీద కూర్చుని తల్లిని తనవైపు తిప్పుకుంది.
కూతురిని గమనించగానే కేయూరలో దుఖఃమధికమయింది.
భోరున కూతురి వడిలో తల పెట్టుకుని ఏడ్చింది.
ఆమె ముఖం చూసి నిర్విణ్ణురాలయింది లిఖిత.

********
ఎప్పుడూ ధీరగంభీరంగా వుండే తల్లి యిలా డీలాపడి ఎందుకేడుస్తుందో ఆమెకెంత మాత్రం అర్ధం కాలేదు.
“అమ్మా! అమ్మా! ఏం జరిగింది?” అనడిగింది ఆత్రుతగా.
కేయూరవల్లి జవాబు చెప్పలేదు. ఇంకా కూతురి వడిలో మొహం దాచుకుని ఏడుస్తూనే వుంది.
“నేను, నేను వెళ్లనన్నాను కదమ్మా నాన్నగారి దగ్గరకి” అంది లిఖిత తల్లినూరడించే ఉద్ధేశ్యంతో.
కేయూర రివ్వున తలెత్తింది.
“లేదు. నువ్వెళ్లి తీరాలి”
ఈసారి ఆశ్చర్యపోవడం లిఖిత వంతయింది.
విప్పారిత నేత్రాలతో తనని వింతగా చూస్తున్న కూతుర్ని గమనించి తల దించుకుంది కేయూర.
“రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. గతమంతా తలచుకునేసరికి మీ నాన్నతో గడిపిన కొద్దికాలం ఎంతో సుదీర్ఘంగా అనిపించింది. ఆయన నన్ను పట్టించుకోకపోయినా ఆయన్ని నేను సిన్సియర్‌గా ప్రేమించేను. ఎంత విదిలించుకున్నా గుండెలో ఎక్కడో ఒక చిన్న పరమాణువులా ఆయన పట్ల నాకింకా ప్రేమ వుందనే నిజాన్ని ఈ రాత్రి రుజువు చేసింది. ఆయనకేమన్నా అవుతుందేమోనని భయంగా వుంది. వెంటనే నువ్వెళ్లి ఆయన్ని ఈ ప్రయాణం నుండాపు” అంది కేయూర ంలానమైన మొహంతో.
తల్లి మాటలు వినగానే లిఖిత మొహంలో సంతోషం చోటు చేసుకుంది.
“నిజంగానామ్మా?” అంది సందేహంగా.
“నిజంగానే. ఆలస్యం చేయకు. వెళ్లి ముందు మీనన్ గారిని కలువు. ఆయన నిన్ను మీ నాన్నగారికి పరిచయం చేస్తారు.” అంది.
లిఖిత తల్లివైపు పేలవంగా చూసింది.
“తండ్రికి కూతుర్ని మరొకరు పరిచయం చేయడం.. చాలా హాస్యాస్పదంగా వుంది కదూ!”
“అది కాదు. నువ్వూ రాకూడదూ!”
“ఇప్పుడు కాదు. అనుబంధం నాతోనయినా ఆ బంధానికి వారధిగా నిలబడిన నీకే యిప్పుడెక్కువ ప్రాధాన్యత వుంది. నీ మాటే ఆయన వింటారు. వింటారు కాదు విని తీరతారు. వెంటనే ఏ రైలుందో చూడు” తల్లి ఆజ్ఞ లభించగానే లిఖిత ఎగిరి గంతు వేసినంత పని చేసి తల్లిని కౌగలించుకుంది తనకి జన్మనిచ్చిన తండ్రిని చూడబోతున్నాననే ఆనందంతో…

#సశేషం..
(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు
శుభదినం.


బ్రహ్మలిఖితం – 5
రచన: మన్నెం శారద
నారాయణ సెంట్రల్ జైల్లోంచి బయటకొచ్చేడు.
వచ్చినందుకు అతనికి సంతోషంగానూ లేదు, లోపల వున్నందుకు విచారంగానూ లేదు.
జైలుకెళ్లడం అతనికిది మొదటిసారి కాదు.
రాజస్థాన్ వెళ్లి ఎప్పుడో సెటిలయ్యానని, చాలా ఆస్థి వున్న ఇంజనీరునని చెప్పి ఓ చదువుకున్న అయినింటి పిల్లను పెళ్లి చేసుకొని.. గత చరిత్ర బయటపడి జైలుకెళ్లేడతను. తీగెలాగితే డొంకంతా కదిలింది.
ఒకసారి సినిమా ప్రొడ్యూసరుగా వేషాలిప్పిస్తానని.. చాలా మంది యువతీయువకుల దగ్గర డబ్బు కాజేసి పరారయి పెళ్లికొడుకు వేషం కట్టి ఒక పాతిక దాక వివిధ రాష్ట్రాల్లో పెళ్ళిళ్లు చేస్కున్నాడతను.
దొరికినప్పుడు జాలీగా జైలుకెళ్లడం.. దొరకనప్పుడు అవతారం మార్చడం అతనికి ఆనవాయితీ అయిపోయింది.
జైలు బయటకొచ్చి ఓ కల్వర్టు మీద కూర్చుని బీడీ కాలుస్తూ ఆలోచనలో పడ్డాడతను.
ఇప్పుడే అవతారమెత్తాలి??
పెళ్లికొడుకు గెటప్‌కి తన మొహమింక ఎంతమాత్రం సూట్ కాదు.
చప్పి దవడలు, బవిరి గడ్డం, గుంటకళ్ళు, గారపళ్లు, సవరాలు కట్టే సన్నాసి మొహంలా వుంది తనది. ఈ రూపం ఏ అవతారానికి బాగుంటుందా అని అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాదు.
సరిగా అప్పుడు అతని దృష్టి ఎదుట చెట్టు క్రింద కూర్చున్న జ్యోతిష్యుడి మీద పడింది. అక్కడ ఓ పదిమంది దాక గుమిగూడి వున్నారు. రివ్వున ఆకాశంలో హాయిగా ఎగిరే పిట్ట కటకటాల పెట్టెలో కడుదీనంగా వుంది. బాగా పరికించి చూస్తే ఆ కళ్లలో ధైన్యం, ఆ కాళ్లలో పటుత్వం సడలి, సన్నటి వణుకు కనిపిస్తున్నాయి.
అయినా ఎవరూ దాని పరిస్థితి గమనించడం లేదు.
అది కుంటుతున్నట్లుగా బయటికొచ్చి నోటితో ఒక కార్డుని కరచుకుని యజమాని వడిలో పడేసి మళ్లీ అర్జెంటుగా పెట్టెలో దూరుతోంది.
కార్డులో ఏముంటుందో తన ఆశలేమవుతాయోనని అక్కడి మనుషులు ఆశతో చూస్తున్నారు. యజమాని సగర్వంగా కార్డులో విషయం చెబితే భవిష్యత్తు గురించి కలలుగంటూ అతనికి డబ్బులిచ్చి వెళ్తున్నారు.
కొడుకుల చదువులు గురించి, కూతుళ్ల పెళ్ళిళ్ళు గురించి, ఉద్యోగంలో ప్రమోషన్ల గురించి ప్రతి మనిషికి రకరకాల ఆశలు, ఆందోళనలు, అనుమానాలూ..
నారాయణ బీడి మీద బీడి కాలుస్తూ చిలక జ్యోతిష్యుడి ఆదాయం గురించి ఆలోచిస్తున్నాడు.
సాయంత్రానికి అతను ఓ వంద రూపాయిల చిల్ల పోగు చేసుకున్నాడు.
నారాయణ కళ్లు మెరిసేయి. అతని పెట్టుబడంతా ఒక చిలుక వంద కార్డులు. ఎంతమందొచ్చినా అవే అటూ ఇటూ తిరుగుతుంటాయి. ఒక చోట కదలకుండా కూర్చుని తేలికగా సంపాదించేస్తున్నాడు.
అతను నోట్లో బీది విసిరేసి జ్యోష్యుడి దగ్గరగా వెళ్లి “చాలా మోసం గురూ!” అన్నాడు.
జ్యోతిష్యుడు అతన్నెగాదిగా చూసి “ఏంటి మోసం?” అన్నాడు చిరాగ్గా.
” ఆ చిలక్కి గాని, నీకు గాని జ్యోతిష్యం తెలీదు. పిండాకూడు తెలీదు. దాన్నడ్డం పెట్టుకుని మనుషుల్ని మోసం చేస్తున్నావు” అన్నాడు నారాయణ తెలివిగా.
జ్యోతిష్యుడు పకపకా నవ్వి,” నేను మోసం చెయ్యడం లేదు. ఆ వచ్చే పిచ్చి జనమే మోసపోవాలనుకుంటున్నారు. దానికి నేనేం చెయ్యను. కూటి కోసమేగా కోటి విద్యలు” అన్నడు లేచి గోనె సంచి దులుపుకుని భుజాన వేసుకుంటూ.
“పాపం, వాళ్ళేదో సమస్యలతో బాధపడి భవిష్యత్తు తెలుసుకోవాలని వస్తున్నారు. వాళ్లనిలా దోచుకోవటం మంచిది కాదు”
జ్యోతిష్యుడు చిలక పెట్టెకి తాళమేసి చేత్తో పుచ్చుకుని ముందుకు నడుస్తూ “ఏదో జరుగుబాటు లేని బక్క వెధవని. నా వెంబడి పడ్డావేంటి?” అన్నాడు.
సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా ఏదో ఉప్పెన వచ్చినట్టుగా రోడ్డంతా జనసందోహంతో నిండిపోయింది.
ముందు నాదస్వరంతో, బాణాసంచా వెలుగులతో జనం బుక్కా చల్లుకుంటూ ఉన్మాదుల్లా నాట్యం చేస్తూ వెళ్తున్నారు. ఆ వెనుక కొన్ని పోలీస్ జిప్సీ వాన్‌లు, దాని వెనుక కొంతమంది నగరంలో ప్రముఖుల కార్లు, ఆ వెనుక టాప్‌లెస్ మెర్సిడీస్‌లో కాషాయరంగు దుస్తుల్లో చెక్కు చెదరని చిరునవ్వుతో జనం అడక్కపోయినా అభ్యం పెడుతూ ఓ వ్యక్తి.. ఆ వెంట మరికొన్ని కార్లు బిలబిలా వెళ్లిపోయేయి.
“ఎవరతను?” నారాయణ గొణుగుతున్నట్లుగా అడిగేడు.
“నువ్వే దేశం నుండొచ్చేవు?” అని వెటకారంగా అడిగేడు జ్యోతిష్యుడు.
“జైలునుండి”
ఈసారి జ్యోతిష్యుడు ఉలిక్కిపడ్డాడు.
“నేనేం మర్డర్లు చెయ్యలేదు. నీలానే కూటికోసం కాసిన్ని పెళ్ళిళ్ళు చేసుకుని దొరికిపోయేను”.
“అలాంటివి చేస్తే జైలు ఖాయం. అటు చూడు ఆ మహానుభావుడు. లంకంత కార్లో ఎంత దర్జాగా వెళ్తున్నాడో. ఏనుగు కుంభస్థలం కొట్టేడు మరి!” అన్నాదు.
నారాయణ అర్ధం కానట్లుగా చూసేడు.
“నీకింకెవరూ లేకపోతే పద. నా గుడిసె దగ్గర మాట్లాడుకుందాం” అన్నాదు జ్యోతిష్యుడు.
నారాయన తలూపేడు.
అతని వెంట నడుస్తూ “నీ పేరేంటన్నా?” అనడిగేడు.
“పేరు దేవుందిలే, రాజని పిలువు” తను గాంభీర్యంగా ముందుకి నడుస్తూ.
*****
తన ప్రయాణానికి కావల్సిన డబ్బు డ్రా చెయ్యడం కోసం బాంక్ కెళ్ళింది లిఖిత. బాంక్ రద్దీగా ఉంది.
ఆ రోజు శనివారం.
లిఖిత విత్‌డ్రాయల్ ఫారం ఇచ్చి టోకెన్ తీస్కుని బెంచి మీద కూర్చుంది. ఒక్కొక్కరూ కేష్ తీసుకొని కదులుతున్నారు.
వాచీ చూసుకుని లిఖిత అసహనంగా.
ఫ్లయిట్‌కి మరో గంట మాత్రమే టైముంది.
“మీరర్జంటుగా వెళ్లాలా?”
లిఖిత అటువైపు చూసింది.
కౌంటరు దగ్గరున్న ఒక బాంక్ ఎంప్లాయీ అడిగింది నవ్వుతూ.
“ఎస్ మాడం!” అంది లిఖిత.
కాష్‌ని బాగ్‌లో పెట్టుకుని తన లగేజ్ తీసుకుని బయటకి రాబోతూ చప్పున వెనుతిరిగి “థాంక్యూ మాడం. థాంక్స్ ఎ లాట్! మీ పేరు?” అంది సభ్యతగా.
“ఈశ్వరి. ఇక్కడ క్లర్కుగా పని చేస్తున్నాను” అందామె నవ్వుతూ.
“నా పేరు లిఖిత. మళ్లీ కలుస్తాను” అంటూ లిఖిత పరిగెడుతున్నట్లుగా వెళ్లి ఆటోని పిలిచింది.
“నేను తీసుకెళ్తాను రా” ఆ గొంతు విని ఆశ్చర్యంగా అటుకేసి చూసింది లిఖిత.
బైక్ మీద వెంకట్ కూర్చునున్నాడు నవ్వుతూ.
“నువ్వా?” అంది లిఖిత ఆశ్చర్యంగా.
“ఏం నేను నేనులా కనబడటం లేదా?” అదోలా మొహం పెట్టి అడిగేడు వెంకట్.
“నాకు నీతో ఆర్గ్యూ చేసే టైం లేదు. నేను త్వరగా వెళ్లాలి.” అంది లిఖిత.
“తెలుసు. అందుకే వచ్చేను. మీ అమ్మగారు చెప్పేరు పద. ఎయిర్‌పోర్టులో దింపుతాను” అన్నాడు వెంకట్ బైక్ స్టార్టు చేస్తూ.
లిఖితకి అయిష్టంగా అనిపించినా ఆమె ధ్యానమంతా తండ్రి మీదనే వుంది. అందుకే గబుక్కున బైక్ ఎక్కేసింది.
“మీ డీడి సైంటిస్టని చెప్పనే లేదు నువ్వు?”
“నాకు తెలిస్తేగా చెప్పేది?” విసుగ్గా అంది లిఖిత.
“అయిసీ.. మీ ఇంట్లో ఏంటి ఒక్కసారి అన్నీ సెంటిమెంట్స్ వచ్చేసేయి. భర్తకోసం ఆవిడ, తండ్రి కోసం నువ్వు తెగ కంగారు పడిపోతున్నారు” అన్నాడు వెంకట వెటకారంగా.
లిఖిత కోపంగా అతనివైపు చూసి “నువ్వు నన్ను ఎయిర్‌పోర్టులో దింపాలనొచ్చేవా.. లెక నన్నెత్తి పొడవాలంనొచ్చేవా?” అంది సీరియస్‌గా.
“సారీ! జోక్ చేసేను” అన్నాడు వెంకట్ నవ్వుతూ.
లిఖిత నవ్వలేదు.
అతని కేరక్టర్ గురించి ఆలోచిస్తుంది. నిన్న తనని నిష్టూరం చేసి చాలా ఫోర్సుగా వెళ్లిన వ్యక్తి తిరిగి ఎందుకు వెంటనే వచ్చినట్లు.
మాట్లాడుతూనే తనని వెన్నుపోటు పొడవాలనా?
లేక నిజంగా అతన మీద ప్రేమ చంపుకోలేకనా?
“నేను నీతో రానా? “అనడిగేడు వెంకట్ తిరిగి.
“థాంక్స్. నేనే శ్రీలంక వెళ్లడం లేదు. వెళ్ళేది హైద్రాబాదు. తోడక్కర్లేదు” అంది.
“నీకసలు నా మీద ప్రేమే లేదు. ఉంటే నన్నొద్దనవు.”
“వెంకట్! అవతల టైమయిపోతున్నది. నాకు ఫ్లయిట్ మిస్ చెయ్యకు. నేనాలస్యం చేస్తే డేడి వెళ్లిపోతారు” అంది ఆందోళనగా.
“నువ్వనవసరంగా ఆందోళన పడకు. నేను నిన్ను ఫ్లయిటెక్కిస్తాగా!” అన్నాడు వెంకట్ కొద్దిగా స్పీడు పెంచుతూ.
లిఖిత మౌనంగా కూర్చుంది
వెంకట్ కూడా మరేం మాట్లాడలేదు.
కొంతదూరం వెళ్లి ఒక నిర్మానుష్యమైన స్థలంలో బైక్ సడెన్‌గా ఆగిపోయింది.
లిఖిత గుండె నిజంగానే దడదడలాడింది.
“ఏమయింది?” అంది కంగారుగా.
వెంకట్ బైక్‌ని చాలాసార్లు స్టార్ట్ చెయ్యాలని విఫలయత్నం చేశేడు. కాని బైక్ స్టార్ట్ కాలేదు.
“సారీ లిఖితా! దీనిక్కూడా నువ్వెళ్లడమిష్టం లేదు” అన్నాడదొలా నవ్వుతూ.
లిఖిత అతన్ని నివ్వెరపోతూ చూసి “నేనెంతో టెన్షన్ ఫీలవుతుంటే నువ్వు చాలా చూల్‌గా నవ్వుతున్నావే. నా ప్రయాణం పాడుచెయ్యాలని వొచ్చేవు కదూ నువ్వు!” అంది.
వెనక్ట్ పరిహసంగా నవ్వి “నువ్వేమన్నా అనుకో డార్లింగ్. ఇప్పుడన్నా చెప్పు, నన్ను ప్రేమిస్తున్నానని!” అన్నాడు బైక్‌కి జారబడి.
సరిగ్గా అప్పుడే ఆమె వెళ్లదలుచుకున్న విమానం టేకాఫయి ఆకాశంలోకి ఎగురుతూ కనిపించింది.
లిఖిత అతని వైపసహ్యంగా చూసింది.
“అమ్మ నన్ను కారులో వదులుతానంటే నేనే వద్దన్నాను. ట్రెయినయితే ఆలస్యమవుతుందని ఎంత తొందర్గా వెళ్లి ఆయన్ని చూద్దామా అని ఆశపడ్డాను. నువ్వు కావాలని ఇలా చేస్తావనుకోలేదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో. ఆడదాన్ని ఏడిపించిన వాడెవడూ ఈ భూమ్మీద బాగుపడలేదు. పడడు కూడా.” అంది ఉక్రోషంగా.
ఈసారి నిజంగానే ఆమె కళ్లలో నీళ్ళొచ్చేయి.
*****
ఆమెనాస్థితిలో చూసి వెంకట్‌కి చాలా ఆనందం కలిగింది. దాన్ని పైకి కనపడకుండా ప్రయత్నం చేస్తూ “అరె! ఏదో జరిగినట్లేడుస్తూ శాపాలు పెడతావేంటి, నిన్ను సాయంత్రం గోదావరి ఎక్కిస్తానులే. ఒక్క రాత్రిలో మీ డేడిని చూడలేనట్లుగా వర్రీ అయిపోతావేంటి?” అన్నాడు.
“నేనెందుకు వర్రీ అవుతున్నానో నీకెలా చెబితే అర్ధమవుతుంది. నాకు తండ్రి వున్నాడని , కాస్త ఆలస్యం చేస్తే నేనతన్ని చూడలేనేమోనని ఎంతో కంగారుగా బయల్దేరేను నేను. నా ప్రయత్నాన్ని భగ్నం చేసాడా దేవుడు. నేనిక ఆయన్ని చూడలేనేమో!” అంది లిఖిత బుగ్గలమీద జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ.
వెంకట్ ఆమె కన్నీళ్లు తుడిచే నెపంతో ఆమె దగ్గరగా వచ్చి కర్చీపుతో తుడిచే ప్రయత్నం చేయబోయేడు. లిఖిత వెనక్కి జరిగింది కోపంగా.
“నీకు నా మీద బాగా కోపం వచ్చినట్లుదంది. ఏం చేయను. నేను నిన్నంత కోపంగా వెళ్లిపోయి నిన్నసలు చూడకూడదనుకున్నాను. రాత్రి ఒక్క క్షణం నిద్ర పడితే ఒట్టు. అందుకే తిరిగొచ్చెసేను. నిన్ను వదలి వుండలేకనే బైక్ పాడయిందని నటించేను. నువ్వింత సీరియస్సయిపోతావనుకోలేదు”.
లిఖిత కళ్లు కోపంతో ఎర్రబడి పోయేయి.
“అంటే… బైక్‌కి నిజంగా రిపేర్ రాలేదా?”అంది నివ్వెరపోతూ.
“చెబుతున్నాగా! నిన్నొదిలి వుండలేక”
లిఖిత మాట్లాడలేదు. కోపాన్ని పళ్లబిగువున నొకి “రైల్వే స్టేషన్‌కి పద. ఇప్పుడే ట్రెయినుంటే అదెక్కి ముందు విజయవాడ చేరతాను. అక్కణ్ణుంచి ఎలాగోలా వెళ్తాను” అంది.
“అవస్థ పడతావేమో!” అన్నాడు వెంకట్ బైక్ స్టార్ట్ చేస్తూ.
లిఖిత జవాబు చెప్పలేదు.
ఆమె మనసంతా తండ్రి మీదనే వుంది.
తను వెళ్లేవరకన్నా తండ్రి బయలుదేరకుండా వుంటే బాగుండును. వెంకట్ మాటి మాటికి బైక్‌కి సడెన్ బ్రేక్స్ వేసి తన మీదికి ఒరుగుతున్నాడని గ్రహించి కూడా ఓర్చుకుంది లిఖిత.
ఆ బైక్ రైల్వే స్టేషన్ చేరుకుంది.
విజయవాడ వెళ్ళే ఎక్స్‌ప్రెస్ ట్రెయినొకటి వుందని టికెట్ తీసుకుంది. ప్లాట్‌ఫారం టికెట్ తీసుకొని వెంకట్ కూడా ట్రెయిన్ దగ్గరకొచ్చేడు. ఆమె బాగ్‌ని సీట్లో పెట్టి క్రిందికి దిగి “వెంకట్, నీకో సంగతి చెప్పాలనుకుంటున్నాను” అంది.
వెంకట్ మొహం విప్పారింది.
“ఏంటి నన్ను ప్రేమిస్తున్న సంగతా?”
లిఖిత అతనివైపు నిరసంగా చూసింది.
“కొంతకాలం టైమిస్తే ప్రేమించేదాన్నేమో కాని.. నువ్వా అవకాశం ఇవ్వలేదు నాకు. నిన్ను ఒక మంచి స్నేహితుడిగా గౌరవించేను. అభిమానించేను. కాని.ఈ రోజు నుండి నా మనసులో నీకా స్థానం కూడా లేదు. మగాడికుండాల్సిన లక్షణాలు నీకు లేకపోయినా మనిషికుండాల్సిన లక్షణాలు యిన్నాళ్లు నీకున్నాయని నమ్మడం వల్లనే నిన్ను గౌరవించేను. కాని… ఈ రోజుతో నా దృష్టిలో నువ్వు రెండు కాళ్ళున్న ఒక నికృష్ట నీచ జంతువువి. నేను నిన్ను అనేక విషయాల్లో ఒక స్నేహితురాలిగా ఆదుకున్నాను. కాని. నువ్వన్నీ మరిచిపోయి నాకు బైక్ రిపేర్ వచ్చిందని అబద్ధమాడి ఫ్లయిట్ అందకుండా చేసేవు. నీ బుర్ర చెడిపోయింది. అది కుళ్ళిపోకుండా ఏ డాక్టరుకన్నా చూపించుకో. మనిషిగా బతకడానికి ప్రయత్నించు..”
సిగ్నల్ ఇవ్వడంతో లిఖిత గబుక్కున రైలెక్కేసింది. లిఖిత అన్న మాటలు విని వెంకట్ దిగ్భ్రమ చెందేడు.
“ఒక ఆడదానికి ఇంత పొగరా? చూస్తా దీని సంగతి అనుకుంటూనే “నీకు నిజంగానే చాలా కోపం వచ్చేసినట్టుంది. సారీ చెబుతున్నాగా” అన్నాడు పైకి.
లిఖిత అయిష్టంగా మొహం తిప్పుకుంది.
రైలు కదిలింది.
వెంకట్ రైలుతో పాటుగా కదిలి “లిఖితా! జాగ్రత్త. వెళ్లగానే ఫోను చెయ్యి” అన్నాడు.
లిఖిత జవాబు చెప్పలేదు.
“ప్లీజ్! కొంచెం మనీ వుంటే ఇస్తావా? ఇప్పుడింటికి తిరిగెళ్లడానికి నా బైక్‌లో పెట్రోలు కూడా లేదు.” అన్నాడతను స్పీడందుకున్న రైలుతో పరిగెత్తుతూ.
లిఖిత పర్సులోంచి వెయ్యి రూపాయిలు తీసి అతనివైపు విసిరింది.
వెంటనే రైలు వేగమందుకొంది.
వెంకట గబగబా ఆ నోట్లు ఏరుకొని చూసేసరికి రైలు ప్లాట్‌ఫారాన్నొదిలేసింది.
డబ్బు జేబులో కుక్కుకుని తిన్నగా ఒక బార్‌కెళ్లి కూర్చున్నాడు. పెగ్ మీద పెగ్ గొంతులోకి జారుతున్న కొద్ది అతనికి లిఖిత మీద ద్వేషం.. పగ పెరిగిపోసాగాయి.
అతనిలోని వికృతమైన మనిషి బాహాటంగా బయటికి రాసాగేడు.
“చూస్తాను దీని సంగతి. ఇది నన్ను మగాణ్ణి కాదంటుందా.. మనిషినే కాదంటుందా?” అనుకున్నాడు.
ఆ క్షణం అతన్ని ఆమె ఎన్ని విధాల తన పరిధిని దాటి కూడా ఆదుకున్నదీ మరచిపోయేడూ. తన తల్లికి జబ్బు చేసినప్పుడు హాస్పిటల్లో ఫీజు కట్టలేని స్థితిలో తనుంటే డబ్బు తీసుకొని ఆమె హాస్పిటల్‌కి పరిగెత్తుకొచ్చిన సంఘటనగాని, , తనకి ఫీజుకు కట్టి చదివించిన సంగతి కాని, చివరికి తల్లి చచ్చిపోతే ఒంటరయిపోయిన అతన్ని ఊరడించి ఆదుకున్న సంగతి కాని అతనికిప్పుడేమీ గుర్తులేవు. రావు కూడా!. మీదుమీరి ఆమే అతని జీవితాన్ని నాశనం చేసినంతగా ఫీలయిపోతున్నాడతను.
లిఖితని ఎంతర్జంటుగా నాశనం చేసేస్తే , అంత అతనికి మనశ్శాంతి లభిస్తుందని నమ్ముతున్నాడు కూడా.
ఒక మనిషికి అన్నం పెట్టి ఆదరిస్తే అదెంత విషంగా మారగలదో తెలీని లిఖిత మాత్రం రైల్లో తండ్రి గురించి ఆలోచిస్తూ ప్రయాణం చేస్తోంది.
ఆమె జీవితాన్ని ఏ విధంగా కాటు వెయ్యాలా , ఆమెనెలా అల్లరి చెయ్యాలా అని ఆమె డబ్బుతో తాగిన మందుతోనే పథకాలు వేస్తూ బయటకొచ్చేడు వెంకట్.
బార్ కెదురుగా ఒక చిన్న గుడి వుంది.
ఆ గుడిలోని దేవతకి చెంపలేసుకొని దణ్ణం పెట్టుకున్నాడు తూలుతూ.
ఇంకా వుంది…

బ్రహ్మలిఖితం 6

రచన: మన్నెం శారద

భగవంతుడు దుష్టులకెన్నడూ సహాయపడడని.. తాత్కాలికంగా కనిపించే విజయాలన్నీ తర్వాత శాపాలై వంశపారంపర్యంగా తింటాయని అతను గ్రహించే స్థితిలో లేడిప్పుడు. అదతని దురదృష్టం.
*****
లిఖిత ఎంతో అవస్థపడి హైద్రాబాదు చేరుకుంది. తల్లి ఇచ్చిన ఎడ్రస్ ప్రకారం ఆమె ఎలాగోలా జుబ్లీహిల్స్‌లోని కేయూర లాబరేటరీస్‌కి చేరుకుంది. అంతవరకు ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదని ఆమెకి గుర్తు కూడా లేదు.
ఆమెకు ఆకలి, దాహం అన్నీ తండ్రిని చూడాలన్న ఆరాటంలోనే కలిసిపోయాయి.
దూరం నుండే కనిపిస్తున్న తల్లి పేరు చూసి ఆమె హృదయం ఆర్ద్రమైంది.
తల్లి మీద అతనికి ప్రేమ లేకపోతే ఆ పేరెందుకు పెడతారు. ఒక అవిరామ కృషిలో అతను బాంధవ్యాలు తెగ త్రెంచుకొని అంకితమైపోయేరు. అంతే” అనుకుంది మనసులో.
ఇంకొన్ని సెకండ్లలో తన తండ్రిని చూడబోతున్నానన్న ఆనందం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.
గబగబా గేటువేపడుగులు వేసింది.
అక్కడంతా నిర్మానుష్యంగా వుంది. గేటుకి తాళం వేసుంది. లిఖిత హతాశురాలయి బాగ్‌ని క్రిందపెట్టి దిక్కులు చూసింది.
అడగటానిగ్గాని.. చెప్పడానిగ్గాని అక్కడసలెవరూ లేరు.
ఎలివేటెడ్ లాండ్ కావటాన చలిగాలి జివ్వున మొహానికి తగులుతోంది.
ఆర్కిటెక్ట్స్ తమ నైపుణ్యాన్నుపయోగించి కట్టిన అందమైన బిల్డింగ్స్ షోకేసులలోని కేకు ముక్కల్లా తళుక్కుమంటున్నాయి. కాని ఆ అందాల్లో ఏదో లోపముంది. జీవచైతన్యం లేదు వాటిల్లో. అలికి ముగ్గేసిన ఒక వూరి గుడిసెకున్న కళ కూడా వాటికి లేదు. కారణం మనిషి నానాటికి కోల్పోతున్న సంఘీభావమే. మనిషి తన సుఖాన్ని యంత్రంలా డబ్బు సంపాదించడంలోనే చూసుకొని ఆనందపడుతున్నాడు. వందలుంటే వేలు, వేలు, లక్షలు, కోట్లు కావాలని అంచులేని తీరాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. అందుతున్న ఆనందాల్ని కాలదన్నుతున్నాడు. గమ్యం లేని పరుగుతీస్తున్నాడు. అందుకే అతని ఆర్జనకి అందం లేదు. ఆ అందానికి కళ లేదు.
ఎన్నో ఖరీదైన కార్లు ఆ రోడ్డువెంట పరిగెడుతున్నాయి. కాని ఏ ఒక్కరూ ఒక ఆడపిల్ల ఎడ్రస్ దొరక్క నిలబడి వుందేమోననిగాని, లిఫ్ట్ కావాలని గాని ప్రశ్నించలేదు. కళ్లకి, కార్లకి కూలింగ్ గ్లాసెస్ బిగించి కృత్రిమంగా సృష్టించుకున్న చీకటిలో పరుగులు పెడ్తూనే వున్నారు.
లిఖిత అలాగే నిస్పృహగా చూస్తూ నిలబడింది నిస్సహాయంగా.
“ఏ అమ్మా! కౌన్ హోనా ఆప్‌కో?”
ఆ ప్రశ్నకి ఉలిక్కిపడీ చూసింది లిఖిత.
గూర్ఖా వాచ్‌మన్ బిల్డింగ్ వెనుకనుండి వస్తూ అడిగేడామెను.
ఆమెకి ప్రాణం లేచొచ్చినట్లయింది.
“కార్తికేయన్ సైంటిస్టు” అంది.
” ఓ షెహర్ మే నై!. బాహర్ గయే!” అన్నాడతను.
లిఖిత ఒక్కసారిగా పాతాళంలోకి కూరుకుపోయినట్లు ఫీలయింది.
“ఏ ఊరో తెలుసా?”
అతను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినట్లు గడ్డం గీక్కుంటూ”ముజ్‌కో నహీ మాలూం. మీనన్ సాబ్‌కో పూచో” అన్నాడు.
ఎక్కడుంటారాయన?”
గూర్ఖా వేలుపెట్టి దూరంగా చూపించాడు.
“ఓ పింక్ బిల్డింగ్. ఉదర్ జావో”
అక్కడ రకరకాల సైజుల్లో చాలా పింక్ బిల్డింగ్స్ ఉన్నాయి.
అయినా తన ప్రయత్నం తాను చెయ్యడానికి అటువైపు సాగిపోయింది.
తండ్రిని సకాలంలో చూడలేకపోయేనన్న వేదన రెండు కన్నీటి బిందువులుగా మారి ఎంత ఆపుకున్నా ఆగక ఆమె బుగ్గల మీదకి జారిపోయింది.
*****
నల్లని నైలాను దారాలతో అల్లిన దోమతెరలా చీకటి ఆకాశం నుండి జారుతూ భూమిని కప్పుతోంది.
పడమట సూర్యుడు నిష్క్రమించిన ఛాయల్ని చూపుతూ భూమికి, ఆకాశానికి మధ్య ఒక చిన్న అస్పష్టమైన రేఖ కనబడుతూనే వుంది.
విశాఖపట్నంలోని మాహారాణీ పేట అవతల వున్న పేదవర్గపు ప్రపంచంలోకి అడుగుపెట్టేడు రాజుతోపాటు నారాయణ.
నేల మీద బోర్లించిన ఒక పెద్ద కోళ్ళ గంపలా వుందతనిల్లు.
“నువ్విక్కడే కూర్చో” అని గుడిసె ముందున్న చిన్న విరిగిన బెంచి చూపించి, చిలక పంజరాన్ని తీసుకొని లోపలికెళ్ళేడు రాజు.
నారాయణ తటపటాయిస్తూ ఆ బెంచి మీద కూర్చున్నాడు.
కీచుమంటూనే నారాయణ బక్క శరీరాన్ని మోయడానికంగీకరించింది బెంచ్.
అయితే గరిమనాభి లేనట్లుగా వూగుతోన్న ఆ బెంచి మీద కూర్చోవడానికి నారాయణ చాలా అవస్థ పడుతున్నాడు.
జైలుకి వెళ్ళేముందు తను చేసుకున్న ఆఖరి పెళ్లి గుర్తొచ్చింది అతనికి.
ఏం వైభోగం! ఏం మర్యాద!
పెళ్ళికూతురు అతిలోక సుందరి కాకపోయినా అనాకారి మాత్రం కాదు.
“మా చెల్లెలు ఎం.ఏ మూడుసార్లు చదివింది” అన్నాడు పెళ్ళికూతురు అన్న గర్వంగా.
“ఏం ఫెయిలయిందా పాపం?” అని తనన్న మాటలని వాళ్లు హాస్యంగా తీసుకొని తెగ నవ్వేరు.
“ఇంజనీరింగ్ చదివి ఏం తెలీనట్లడుగుతున్నారు. మా చెల్లి ఒకసారి సోషియాలజీతో, మరోసారి సైకాలజీతో, ఇంకోసారి ఫిలాసఫీతో పాసయింది. ఇంత చదివినా దానికి గర్వమనే పదానికి అర్ధం తెలీదు. ఏంటొ పెళ్ళే ఎంతకీ కుదర్లేదు” అన్నాడు పిల్ల బావగారు
“ఆలస్యమైనా మాంచి కుర్రాడు దొరికేడు. మా మనవరాలిది అదృష్ట జాతకమే బాబూ. దాని పేరన పదెకరాల మాగాణి వుంది. వంద తులాల బంగారముంది. మంచి ఉద్యోగం చేస్తుంది. తెలిసీ తెలియని వయసులో ఒక ముదనష్టపు పెళ్లి చేసేం. వాడు శోభనం జరక్కుండానే పుటుక్కుమన్నాడు. అడ్డుపుల్లలేసేందుకే అయిన వాళ్లున్నారు. తెలిసినవారెవరూ దీనికి సంబంధాలు రాకుండా చేసేరు చుట్టాలు. ఇన్నాళ్లకి నువ్వొప్పుకుని దాని మెడలో మూడు ముళ్ళేసేవు. చల్లగా నూరేళ్ళు కాపురం చెయ్యండి” అంది అమాయకంగా పిల్ల నాయినమ్మ.
పేపల్రో ప్రకటన చూసి ఆ పిల్లనెందుకిచ్చి చేసేరో తనకర్ధమయింది.
పెళ్ళికూతురు అన్న మాత్రం పోయే ప్రాణం గొంతులో అడ్డం పడ్డట్లుగా చూశాడు తనవైపు.
“వెంటనే తను చిరునవ్వు నవ్వి లేచి బావమరిది భుజం తట్టి “నాకేదో తెలిసిపోయిందని మీ అమ్మాయిని వదిలేస్తానేమోనని బాధపడకండి. నాకిలాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు. మీ అమ్మాయిని బంగారంలో పెట్టి చూసుకుంటాను” అన్నాడు సదరు పిల్ల వంటిమీద నగల్ని తలచుకుంటూ.
పిల్ల అన్న తన చేతులు పట్టుకున్నాడు ఆనందభాష్పాలతో. అంతా బాగానే జరిగిపోయింది.
రాజస్థాన్‌లో తన ఆస్తుల గురించి సింగపూర్‌లో తన షేర్లు గురించి చెప్పీ చెప్పనట్లు నిగర్వంగా అప్పుడో మాట, ఇప్పుడో మాటగా సాదాసీదాగా అన్నాడతను.
పెళ్ళికొడుకు నిరాడంబరుడని పెళ్ళికొచ్చిన వాళ్లందరూ చెప్పుకుని పొగుడుతుంటే విననట్లుగానే విన్నాడు.
పెళ్ళయిన మర్నాడు సినిమాకని బయల్దేరితే దారిలో కారాపింది పెళ్లికూతురు.
“నా వాచీ బాగా లేదు. కొత్తది కొనిపెట్టండి”అంది సరదాగా. జేబులో రూపాయి లేకపోయినా నవ్వుతూ షాపులోకెళ్ళేడు. అవీఇవీ తిరగేసి “ఈ ముష్టి ఇండియా వాచీలెందుకు, వచ్చేనెలలో సింగపూరెల్తాగా. తెస్తాలే” అన్నాడు.
ఆ అమ్మాయి అంగీకరించింది.
ఇద్దరూ కారెక్కేసి వెళ్ళిపోయేరు.
పదహార్రోజులు తనని నేల మీద నడవనివ్వలేదు. ఒకటే మర్యాదలు. విందు భోజనాలు. సరదాలు, సంతోషాలు.
ఆ మర్నాడే పెళ్లికూతురి బంగారం పట్టుకుని పారిపొవాలని ప్లాను చేస్తుండగా తన దురదృష్టం పండి పెళ్లికూతురి స్నేహితురాలు శైలజ వచ్చింది.
పెళ్లికి రాలేకపోయినందుకు విచారిస్తూ ఆవిడ మాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పి తన వైపు నవ్వుతూ చూసిందల్లా షాక్కొట్టినట్లయిపోయి “మీరేంటి?” అంది.
“వెంకటేశ్వరరావు” అన్నాడు తను తడుముకుంటూ.
“ఇది నీ కొత్త పేరా?” అడిగిందావిడ వెటకారంగా.
తనకి గొంతులో తడారిపోతున్నది. కొంపదీసి ఈవిడ గతంలో తను చేసుకున్న వాళ్లలో ఒకర్తి కాదు కదా. అనుకుంటున్నాడు భయంభయంగా.
“వీడు పెద్ద చీట్. వీడు రకరకాల పేర్లతో చాలామందిని పెళ్లిచేసుకొని ఆనక పెళ్లికూతురి నగలు కాజేసి ఉడాయిస్తాడు. గుంటూరులో నాజ్ థియేటర్ దగ్గర కల్యాణమంటపంలో ఒక అయినింటి పిల్లని పెళ్లి చేస్కుంటుంటే వీణ్ణి అరెస్ట్ చేసి జైలుకి పంపేను. రిలీజయ్యేడో లేదో వీడు మళ్లీ మీకు టోపీ పెట్టేసేడు” అంది శైలజ.
అప్పుడర్ధమయింది తనకి అవిడ ఆ రోజు తనని అరెస్టు చేసిన పోలీసాఫీసరని.
వెంటనే పెళ్ళిల్లు శవం వెళ్లిన యిల్లులా తయారయింది.
ఏడుపులు.. మొత్తుకోళ్ల మధ్య శైలజ ఫోను చెయ్యగానే పోలీసులొచ్చి తనను అరెస్టు చేసి పట్టుకుపోయేరు.
ఈసారి జైల్లో పోలీసులు తనని కుళ్ళబొడిచేరు.
ఆరోగ్యం చెడింది.
“ఏరా పెళ్లికొడకా! నీ మొహం అద్దంలో చూస్కోరా ఒకసారి. వెళ్లి మళ్లీ పెళ్ళి చేస్కుంటావురా బాడ్కో!” అంటూ పచ్చి బూతులు తిట్టి బూట్ల కాళ్లతో తన్నేరు.
అంతమంది పెళ్లికూతుళ్ల శాపాలు తగిలి పాపాలు పండినట్లుగా తనకి టి.బి. వచ్చింది. ఆ జబ్బుతో బాధపడుతున్నా పోలీసులు జాలి చూపించలేదు. మందిప్పించి మరీ తన్నేవారు.
ఎలాగో జబ్బు నయమైంది కాని పీనుగ రూపు పోలేదు. తనకి మరో వ్యాపారం, మోసం తెలీదు. ఇది తప్ప. కాని తన రూపం చూసి పిల్లనెవరూ ఇవ్వరు. ఏం చేయాలి తనిప్పుడు.
“ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు?” అనుకుంటూ రెండు ముంతలు తీసుకొని బయటకొచ్చేడు రాజు.
“ఏం లేదు.” అని ఈ లోకంలోకొచ్చి ముంతలకేసి చూస్తూ “ఏంటది?” అన్నాదు నారాయణ.
“సీసాలో ఉంటే బ్రాందీ, పేకట్‌లో వుంటే సారా, ముంతలో వుంటే కల్లు. తాగు” అంటూ ఒక ముంత నారాయణ కందించేడు రాజు.
చాలా రోజుల తర్వాత అలాంటి ద్రవం కనిపించటంతో ప్రాణం లేచొచ్చినట్లయింది నారాయణకి.
ముంతెత్తుకుని గడగడా తాగేసి “చాలా బాగుంది. ఏ కల్లిది?” అనడిగేడు.
“ఈతకల్లు. సరేగాని అలా గబగబా తాగేసేవేంటి.. నా పెళ్లామింకా కబాబులే తేలేదుగా..”అనడిగేడు రాజు అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ.
నారాయణ సిగ్గుపడుతూ”ఇంకో ముంత తెప్పించరాదూ!” అనడిగేడు ఆశగా.
“దాందేవుంది. కాని, ఆ కల్లుకొట్టు నా పెళ్లాంది. అది రూపానికే కాదు గుణానిక్కూడా కీలుగుర్రంలో రాక్షసిలాంటిది. పైగా చెప్పలేని గర్వం. దాని బాబుకి ఇలాంటివి రెండు గుడిసెలున్నాయి.
పెళ్లికి నాకో వందరూపాయల కట్నం, రెండు పందులు, ఒక టెర్లీన్ చొక్కా కొనిపెట్టేడు. దీనికో నాలుగు ఈత చెట్లున్నాయి. అందుకే నన్నిది పురుగులా చూస్తది. సాయంత్రం నే తెచ్చిన చిల్లర లెక్కెట్టుకునే కల్లు పోస్తది”
అతని మాట పూర్తవుతుండగానే రయ్యిమంటూ రాజు పెళ్లాం కబాబులు తీసుకొని అక్కడికొచ్చి “ఈడెవడు?” అంది నారాయణని సీరియస్‌గా చూస్తూ.
“నాక్కావల్సినోళ్ళే. ఎల్లి ఇంకో ముంత కల్లిప్పించు” అన్నాడు రాజు గాంభీర్యంగా.
“ఏంటి ఇంకో ముంత కల్లా! తా దూర కంతలేదు మెడకో డోలంట. నువ్వు తాగిందే దండగ. బయటకి నడవండి” అంది కస్సున తోకమీద లేచిన త్రాచులా.
ఎన్నో వెధవ పనులు చేసిన నారాయణ కూడా ఆవిడ గొంతువిని అకారం చూసి అదిరిపడ్డాడు.
ఆవిడ నిజానికి చూడగానే బ్రహ్మరాక్షసిలా గోళ్ళూ, పళ్లతో లేదు.
సాదా నలుపు, సన్నం, గూళ్లెత్తు.. మామూలుగానే వుంది.
కాని ప్రత్యేకంగా ఆ మొహంలో ఎక్కడో చెప్పలేని ఒక హీనాతినీనమైన కళ వుంది. దుర్భర దారిద్యం చూపెత్తినట్లుగా కట్టగట్టుకు తరుముకొస్తాయనిపించింది. ఇలాంటి స్త్రీని రాజు పాపం ఎలా పెళ్లి చేసుకున్నాడో~” అని కొద్దిగా విచారించేడు కూడ.
రాజు లేచి ఆవిణ్ణి పిలిచి “ఊరికే అరవకు. అతను బాగా డబ్బున్న మారాజు. ఇద్దరం కలిసి ఓ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం” అన్నడు.
“డబ్బున్న మారాజుకి నీతో ఏంటి పని?” అందావిడ కోపంగా.
“సవాలక్షుంటాయి. డబ్బున్నోళ్లకి బుర్ర వుండదు. అందుకే నా దగ్గర కొచ్చేడు. నువ్వెళ్లి ఇంకో ముంత కల్లు పంపించు. మన పని సజావవుతుంది9” అన్నాడు.
ఆవిడ తలూపి లోనికెళ్లింది.
ఇంకాస్సేపటిలో ఆవిడ మరో ముంతకల్లు తెచ్చిపెట్టి వెళ్లింది.
ఆవిడ వెళ్తుంటే “సంపెంగీ!” అని పిలిచేడు రాజు.
సంపెంగి వెనుతిరిగి “ఏంటింకా?” అంది చిరాగ్గా.
“ఇంకో రెండు కబాబులు కూడా”
సంపెంగి లోనికెళ్లిపోయింది.
నారాయణ తెల్లబోయి చూస్తుంటే “ఏంటలా అశ్చర్యపోతున్నావు?” అనడిగేడూ రాజు నవ్వుతూ.
నారాయణ తేరుకుని “ఊహూ.. ఏం లేదు”అన్నాడు మొహమాటంగా.
“నువ్వు చెప్పకపోయినా నేనర్ధం చేసుకోగలను. రోజూ నా దగ్గరకొచ్చే జనాన్ని ఎంతమందినో చూస్తుంటాను. మొహాల్ని చూసి వాళ్ల భావాలు కనిపెట్టే తెలివి నాకుంది. దరిద్రపు పెద్దమ్మలా వున్న నా పెళ్లానికి సంపెంగి పేరేవిటా అని కదూ! ఇదే సందేహమొచ్చి నేను నా మావనడిగేను. ఈ పేరెందుకు పెట్టేవని ఆయన పెద్ద వేదాంతిలా నవ్వి లక్ష్మిదేవిని దరిద్రురాలని పిలిచినా కళకళ్ళాడుతూనే వుంటది. ఇది భూమ్మీద పడగానే దాని తల్లి దీన్ని చూసి గుండె ఆగి చచ్చింది. మంత్రసాని మూర్చపోయింది. నేను కూడా దాన్నెత్తుకోటానికి ఝడుసుకున్నాను. కాని.. తప్పలేదు. రక్తసంబంధం. ఇక అందమెలాగూ లేదని పిలుచుకోటానికైనా బాగుంటుందని సంపెంగి పేరు పెట్టుకున్నాను.. అన్నాడు” అంటూ నవ్వాడు.
“మరి నువ్వెలా పెళ్లి చేసుకున్నావీవిణ్ణి?” జాలిగా అడిగేడు నారయణ.
“ఏం చేయను. నేను మరీ అతీగతీ లేనివాణ్ణి కాదు. మా నాన్న గవర్నమెంటాఫీసులో జవానుగా పని చేసేవాడు. ఆయన అకస్మాత్తుగా చచ్చిపోయేడు.వెంక మాకు ఆస్తి లేదు. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. గతిలేక వీళ్ల పేటలో వీళ్ళ గుడిసెకే అద్దెకొచ్చేం. నా చెల్లెలి పెళ్ళికోసం మా అమ్మ ఇతని దగ్గర అప్పు చేసింది. అప్పు తీర్చలేకపోయెం. ఇక తన కూతుర్ని పెళ్లి చేస్కుని తీరాలని పట్టుబట్టేడు మా మామ. తప్పించుకోలేని పరిస్థితిలో దీన్ని కట్టుకున్నాను. ఆ బెంగతోనే మా అమ్మ చచ్చిపోయింది. రోజంతా ఎంతో సంపాదిస్తాను. అంతా ఎలా ఖర్చయిపోతుందో తెలియదు. తెల్లారి పది పైసల బిళ్లుండదు” అన్నాడు రాజు విచారంగా.
నారాయణ కూదా దిగులుగా మొహం పెట్టి చూసాడు.
“సరే! మధ్యలో దాని సంగతి దేనికి. నాకో బ్రహ్మాండమైన ఉపాయం తోచింది. ఆ పని చేస్తే మనం ఆర్నెల్లలో లక్షాధికార్లమైపోవచ్చు” అన్నాడు రాజు సంతోషంగా.
“ఏంటది?”
రాజు నారాయణ చెవి దగ్గర చేరు గుసగుసలాడేడు.
అది విని నారాయణ ఉలిక్కిపడి “అమ్మా దొరికిపోయేమంటే సున్నంలోకి ఎముకుండదు” అన్నడు భయంభయంగా.
“దొరకడడమంటూ జరగదు. నా దగ్గరికి చదువుకున్న బడాబడా బాబులొస్తారు. వాళ్ల బలహీనతలు నాకు తెలుసు. ఇప్పుడు మనం చేసేది కొంచెం పెద్ద ఎత్తులో జరుగుతుంది. అహోబిలంలో నా తమ్ముడున్నాడు. వాడు మనకి కలిసొస్తాడు. నే చూసుకుంటాగా! నువ్వు నే చెప్పినట్లుగా చెయ్యి” అన్నాడు రాజు.
నారాయణ సందేహంగా చూసేడు.
రాజు ఫర్వాలేదన్నట్లుగా నవ్వేడు.
******
ఆ ఇల్లు నిశ్శబ్దాన్ని కూడా భరించలేనంత నిశ్శబ్ధంగా వుంది.
అక్కడ కట్టిన కట్టడాలన్నింటిలోనూ ఆ ఇంటికొక ప్రత్యేకత వుండటం గమనించింది లిఖిత.
ఆ ఇల్లు హిప్‌డ్ రూఫ్‌తో సాంద్రతతో కూడిన ఆకుపచ్చని చెట్ల మధ్య విరిసిన ఒకే ఒక రోజాపువ్వులా వుంది. ఆ ఇంటిని గమనిస్తే ఆ ఇంటి యజమాని అభిరుచి ప్రస్ఫుటమవుతుంది.
లిఖిత గేటు తెరవగానే గుబురుగా వున్న మామిడి చెట్టులోంచి ఒక కోయిల కూతకూసింది.
చెట్ల నిండా పేరు తెలియని రకరకాల పిట్టలు వాసాలు చేసుకొని ధీమాగా చిగుళ్ళు మేస్తూ, తోకలాడిస్తూ, కొమ్మకొమ్మకి రెక్కలు టపటపలాడిస్తూ ఉత్సాహంగా గెంతుతున్నాయి. ఉడుతలు కొన్ని ఆకలి లేకపోయినా చిలిపిగా జామపిందెలు కొరికి క్రిందపడేసి దొంగచూపులు చూస్తున్నాయి.
గేటు చప్పుడు విని ఒక తెల్లని పిల్లి మ్యావ్‌మంటూ ముందుకొచ్చి నిలబడి లిఖితని తేరిపార చూసింది.
గోడ ప్రక్కన గిన్నెలో పాలు తాగుతున్న పామరిన్ కుక్కపిల్ల కుయ్‌కుయ్‌మన్నట్లుగా తలెత్తి భౌభౌమంది.
దాని కళ్లు నల్లనేరేడు పళ్లలా మెరిసేయి. వాటిలో కాపల గుణంకన్నా స్నేహగుణమే మిన్నగా అనిపించింది.లిఖిత చెయ్యివూపి చిన్నగా నవ్వింది.
ఆ మాత్రానికే కుక్కపిల్ల స్నేహపాత్రంగా తోకాడించింది.

ఇంకా వుంది..

(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి).
ధన్యవాదాలు,
శుభదినం.

బ్రహ్మలిఖితం – 7

రచన: మన్నెం శారద

తాత్కాలికంగా వచ్చిన పని మరచిపోయి లిఖిత దాని దగ్గర కెళ్లి మోకాళ్ల మీద కూర్చుని దాన్ని నిమరసాగింది.
పామరిన్ కుక్కపిల్ల లిఖిత ఏనాటి నుండో తెలిసినట్లుగా లిఖితని ఆనుకొని కూర్చుని ఆమె చేతుల్ని ఆబగా నాకుతూ తన ప్రేమని ప్రకటించుకోసాగింది. బహుశ గత జన్మలో ప్రేమరాహిత్యానికి గురయిన వ్యక్తులు పామరిన్ కుక్కలుగా పుడ్తారేమోననిపించింది లిఖితకి. ఎలాంటి కరకురాతి మనిషయినా వాటిని దగ్గరకు తీయకుండా వుండలేడు.
లిఖిత దాన్ని లాలిస్తుండగా పక్క గోడ మీంచి “డాలీ” అంటూ ఒక స్త్రీ గొంతు వినిపించింది.
లిఖిత ఉలిక్కిపడినట్లుగా లేచి నిలబడింది.
ఆవిడ ఆశ్చర్యపోతున్నట్లుగా చూసి “మీరు?” అంది.
“మీనన్ గారి గురించి” అంది లిఖిత.
“అయాన హాస్పిటల్లో వున్నారు. మీరేమవుతారాయనకి?”
“ఏం కాను. ఆయన ఫ్రెండ్ కూతుర్ని. ఆయనతో పనుండి..”
“సరే! అలా తిరిగి మా ఇంట్లోకి రండి” అందావిడ.
లిఖిత బాగ్ తీసుకుని పామరిన్‌ని మరోసారి బుజ్జగించి గేటు తీసుకుని ఆవిడింట్లోకి నడిచింది.
ఆవిద హాలు తలుపు తెరచి “రండి.. చూస్తే ఇప్పుడే వూరు నుండి వచ్చినట్లున్నారు. మొహం కడుక్కోండి. కాఫీ ఇస్తాను” అంది.
లిఖిత వెళ్ళి మొహం కడుక్కుని రాగానే ఆవిడ టవలందించింది. మొహం తుడుచుకుంటుండగానే ఆవిడ వేడి కాఫీ అందిస్తూ “నా పేరు శ్రీవల్లి. మావారు విజయబాంక్ మానేజరు. మీనన్‌గారు మా నైబర్. చాలా మంచి మనిషి. ఆయన భార్య కుట్టి కూడా మాకు బాగా తెలుసు. చాలా కలుపుగోలు మనిషి. కాని.. పాపం అనారోగ్యంతో పోయేరు. మీనన్‌గారికి ఆవిడంటే చాలా ప్రేమ. ఆవిడ చాలాకాలంగా మంచం మీదనే వుంటున్నా. అదే పదివేలనుకొని ఆవిణ్ణి కంటికి రెప్పలా చూసుకునేవారు. అవిడ పోయేక ఆయన చాలా డిప్రెస్సయ్యేరు. దానికి తోడు ఆయన స్నేహితుడు కూడా వెళ్ళిపోవడంతో..”
“ఎవరాయన?”
“కార్తికేయన్”
“ఆయనెక్కడికెళ్ళేరో తెలుసా?”
“కేరళ అడవులకని విన్నాను. వివరాలు సరిగ్గా తెలియవు. మీనన్‌గారికే తెలుసు.”
“ఆయనకిప్పుడెలా వుంది? అసలేంటి జబ్బు?” అని ఆత్రంగా అడిగింది లిఖిత.
“హార్టెటాక్. ఇంటెన్సివ్ కేర్‌లో వున్నారు”
“ఆయనతో ఒకసారి మాట్లాడవచ్చా?”
“లాభం లేదు. ఆయనకసలు స్పృహ రానేలేదు. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? ” అంటూ శ్రీవల్లి భర్త శ్రీనివాస్ వచ్చేడక్కడికి.
“నా పేరు లిఖిత. మీరంటున్న కార్తికేయన్ కూతుర్ని నేనే” అంది లిఖిత.
వాళ్లిద్దరూ మొహమొహాలు చూసుకుని “అయితే మీరర్జంటుగా బయల్దేరండి” అన్నారు వాళ్లు.
లిఖిత వాళ్లవైపు అయోమయంగా చూసి”ఎక్కడికి?” అంది.
“కొచ్చిన్. మీరొస్తే ఆ మాటే చెప్పమన్నారు మీనన్ మొన్న కొద్దిగా స్పృహ వచ్చినప్పుడు. కొచ్చిన్ దగ్గర చోటా నికరా అనే ఊరుంది. అక్కడ భగవతి ఆలయ ప్రధాన పూజారిని కలిసి మీనన్ పేరు చెబితే ఆయన కొన్ని వివరాలందిస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యొద్దు. డబ్బు కావాలంటే నేనిస్తాను. పదకొండున్నరకి కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ సికిందరాబాదులో బయల్దేరుతుంది క్విక్!” అన్నాడాయన.
“మీనన్‌గారిని ఒక్కసారి చూడొచ్చా?”
“ప్రయోజనం లేదు. ఎవర్నీ లోపలికి రానివ్వడం లేదు. చూసి ఏం చేస్తారు? ఆయన మన లోకంలో ఉంటే కదా!”
“వల్లీ! ఆవిడకి భోజనమేర్పాటు చూడు. నే వెళ్లి ఒక టిక్కెట్ సంపాదించుకొస్తాను” అంటూ బయట కెళ్ళిపోయేడు శ్రీనివాస్ కారులో.
“భయపడకండి. మీ నాన్నగారికేం జరగదు. మీరు వెంటనే బయల్దేరుతున్నారు కదా!” అంది శ్రీవల్లి ఊరడింపుగా.
లిఖిత తేరుకున్నట్లుగా నవ్వి లేచి స్నానానికెళ్ళింది.
ఆసీల మెట్ట జంక్షన్‌లో అలవాటు ప్రకారం చిలక జోస్యం చెబుతున్న రాజు తన దగ్గరున్న కార్డుల్లో మరో వంద కార్డులు హెచ్చుగా కలిపాడు.
బాంక్‌కి వెళ్లడానికి బస్టాపు కొచ్చిన ఈశ్వరి ఎంతసేపు నిలబడ్డా తన బస్సు రాకపోవడంతో తనలోని చిరాకునణచుకుంటూ రాజు దగ్గరున్న చిలక కేసి చూసింది కాలక్షేపంగా.
చిలక కుంటుతూ పెట్టెలోంచి బయటకొచ్చి ముక్కుతో కొన్ని కార్డుల్ని తోసి ఒక కార్డుని బయటికి లాగి రాజు చేతికందించింది.
రాజు కార్డు చదివి “నీ రోజులు బాగున్నాయి. నువ్వెంటనే ఓంకారస్వామిని కలువు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.” అన్నాడు.
“ఓంకార స్వామా?” అన్నాడా జాతకం చూపించుకోడానికొచ్చిన వ్యక్తి.
“ఓంకారస్వామి తెల్దా? బీవుడిపట్నం ఎల్లే దార్లో మర్రిసెట్టు కిందుంటాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మగానుభావుడు. ఎవులికి పుట్టాడో తెల్దు. ఏ వూరో తెల్దు!” అన్నాదు మరో వ్యక్తి.
ఇంతలో ఒకతను వగర్చుకుంటూ వచ్చి “అయ్యా తవరన్నట్టుగా ఓంకారస్వామి దగ్గరకెళ్ళేను. ఆయన చెప్పినట్టే జరిగింది. మీ రుణం తీర్చుకోలేను. ఈ డబ్బుంచండి.” అంటూ కొన్ని వందల రూపాయల నోట్లు రాజు చేతిలో కుక్కి పరిగెత్తినట్లుగా వెళ్లిపోయేడు.
ఈశ్వరి అదంతా గమనిస్తూనే ఉంది.
నిన్న తన కాషియర్ శెలవు పెడితే ఆ సీట్లో కూర్చుంది. కొంత కాష్ మిస్సయింది. బాధ్యత తన మీదే నెట్టేసాడు మానేజరు. మర్యాదగా కట్టేస్తే పోలీసు రిపోర్టివ్వనని బెదిరించేడు. నిజానికి తనకేం తెలీదు. అతన్నడిగితే?
కొంచెం సిగ్గుగా అనిపించినా ఇది తన ఉద్యోగ సమస్య. అడిగితే తప్పేముందని మనసు మొండికేసింది.
తన బస్సొచ్చింది
అయినా ఈశ్వరి ఎక్కలేదు.
జనం రద్దీ తగ్గేక మెల్లిగా ఆమె అడుగులు రాజు దగ్గరకు పడ్డాయి.
రాజు ఆమెని క్రీగంట చూసి “చెప్పవే చిలకమ్మా కష్టాల్లో యిరుక్కున సీతమ్మొచ్చింది. దారి చూపించు” అన్నాడు చిలకని హుషారు చేస్తూ.
చిలక మాత్రం నీరసంగా బయటకొచ్చి ఒక కార్డు తీసి రాజు మొహాన విసిరి వెళ్లిపోయింది.
రాజు కార్డు చదివి “వెళ్లి ఓంకార స్వామిని కలవ్వే తల్లీ! నీ సమస్య పరిష్కారమవుతుంది” అన్నాదు రాగాలు తీస్తూ.
“ఆయనెక్కడుంటాడు?”
“బీవుడి పట్నం దారిలో, సాక్షాత్తు దేవుడాయన”.
ఈశ్వరి పర్సులో డబ్బు చూసుకుని ఆటో ఎక్కింది. యాంత్రికంగా వెళ్తున్నదన్నమాటే కాని మనసంతా గందరగోళంగా వుంది. ఈ సాముల్ని నమ్ముతున్నదేంటి తనింత చదువుకుని. వీళ్లలో చాలా మోసగాళ్లుంటారంటారు. బాంక్‌లో డబ్బు పోతే తనేం చేస్తాడు” వెయ్యి అనుమానాలతో మర్రిచెట్టు దగ్గరికి చేరుకుంది.
అక్కడ ఓ పాతిక ఆటోలున్నాయి. రెండు మూడు పందిళ్లు వెలిసేయి. జనం గుంపులు గుంపులుగా వచ్చి ఓంకారస్వామిని దర్శించి వెళ్తున్నారు.
ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు, మంచినీళ్లు పోసేవారు, సోడా కొట్టులు, స్వామి తాయెత్తులు ఇచ్చేవాళ్లు, స్వామి పటాలు అమ్మేవాళ్లు, అదొక తీర్థంలా అనిపించింది ఈశ్వరికి.
టికెట్టు కొనుక్కుని కొబ్బరికాయ, పూలు తీసుకొని తన వంతు వచ్చేక లోనికెళ్ళింది ఈశ్వరి. “స్వామి ఎక్కువగా మాట్లాడరు. వెంటనే నీ సమస్య చెపుకో. పరిష్కారం చెబుతారు” అంది ఒకావిడ.
ఈశ్వరి ఆకుపచ్చ డ్రస్సులో వున్న ఆయన కాళ్లకి మొక్కింది. ఆయన తలంతా నిమిరేరు.
ఈశ్వరి దూరంగా జరిగి “బాంక్‌లో పని చేస్తున్నాను. డబ్బు పోయింది. నా మీద పెట్టేరు. నాకేం తెలియదు” అంది.
అలా చెబుతున్నప్పుడు కళ్ళు ఆత్మాభిమానంతో వర్షించేయి.
ఓంకారస్వామి చిరునవ్వు నవ్వేడు.
ఈశ్వరి అర్ధం కానట్టు చూసింది.
“గత జన్మ బంధం గట్టిగా పట్టుకొని లాగుతుంది. నీ జాడ కోసం నీ భర్త పూజలు చేస్తున్నాదు. రెండ్రోజుల్లో నీ దగ్గరకో మనిషొస్తాడు. వచ్చి నువ్వడక్కుండానే డబ్బిచ్చి వెళ్తాడు. అతనే నీ భర. కానుకో!” అన్నాదు.
ఈశ్వరి అతనివంక అయోమయంగా చూసి “నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. ఇతను నా భర్తేంటి?” అంది.
ఓంకారస్వామి ఫక్కున నవ్వేడు.
“నే మాట్లాడేది పూర్వజన్మ గురించి. పూర్వజన్మలో నీ భర్త నిన్ను చాలా ప్రేమించేడు గాని పైకి పట్టించుకునేవాడు కాదు. దాంతో నువ్వు నీ ఇంటి పెంపుడు కుక్కని బాగా చేరదీసేవు. అది నిన్ను ప్రేమించింది. వచ్చే జన్మలో నీ భర్త కావాలని ఆశించింది. ఫలితంగా నీ మేనమామ నీ భర్తయ్యేడు. ఇప్పుడు నీ అసలు భర్తకి తన పూర్వజన్మ గురించి తెలిసి నీకోసం తిరుగుతున్నాదు. నిన్నేవిధంగా గుర్తుపట్టాలో తెలియక అవస్థ పడుతున్నాడు. రెండ్రోజుల్లో నువ్వు తప్పు లెక్కపెట్టి ఎక్కువ ఇచ్చిన డబ్బు తీసుకొచ్చినవాడే నీ భర్త!”
ఓంకారస్వామి మాటలకి తల తిరిగిపోయింది ఈశ్వరికి. అతను చెప్పిన ఒక్క మాట కూడా నమ్మబుద్ధి కాలేదు. జన్మలేమిటీ, కుక్కలేవిటీ. అంతా కట్టుకథ. అని విసుక్కుంటూ బయటకొచ్చేసింది.
ఓంకార స్వామి మాత్రం చిద్విలాసంగా నవ్వి కళ్లు మూసుకున్నాడు.

*******
లిఖిత ఎక్కిన కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వదిలి అతివేగంగా ముందుకి పరుగెడుతోంది. ఆమె ఆలోచనలతో పోటీ పడుతూ. తను చాలా దురదృష్టవంతురాలు. తండ్రి వుండి కూడా అతని ప్రేమకి దాదాపు తండ్రి లేనట్లుగానే బ్రతికింది.
అకస్మాత్తుగా తన తండ్రి బ్రతికే వున్నాడని, అదీ అతనొక గొప్ప సైంటిస్టని తెలిసి తన మనసు ఉప్పొంగిపోయింది.
అతను కృతకృత్యుడు కావొచ్చు… కాకపోవచ్చు. కాని మనిషి జీవితంలో ఆఖరి విషాద ఘట్టమైన మృత్యువుని ఒక పెన్సిల్ గీతలా తుడిచేయాలని అతని స్వమకాల్ని, సంసారాన్ని దూరంగా నెట్టి తన జీవితాన్నే పణంగా పెట్టి ఒక ఘోర తపస్సులా నిరంతర కృషి చేసేడు.
కాని ఇపుడు అంత చదువుకున్న మనిషి.. అన్నీ తెలిసిన శాస్త్రవేత్త ఒక అతి సామాన్యుడిలా మాయలు, మంత్రాలతో మరణాన్ని అరికట్టాలనే విశ్వప్రయత్నంతో ఏ చదువూరాని వ్యక్తుల చేతుల్లో ఇరుక్కోబోతున్నాడు.
దీని అజ్ఞానమనాలా, అతి తెలివనాలా?
బహుశ మనిషి తన ప్రయత్నాల్లో అపజయం ఎదురై కృంగిపోయినప్పుడే తన మీద తనకి నమ్మకం పోయినప్పుడే జాతకాల్ని, బాబాల్ని, మాయల్ని, మంత్రాల్ని నమ్ముతాడేమో! శారీరకంగా మనిషి బలహీనంగా వున్నప్పుడే రోగాలు మన శరీరంలోకి తేలిగ్గా ప్రవేశించినట్లుగా మానసికంగా బలహీనులైన మనుషుల్నే ఈ మోసగాళ్ళు వశం చేసుకుంటారు.
“టికెట్ ప్లీజ్!” అనగానే లిఖిత ఈ లోకంలో కొచ్చి బాగ్‌లోంచి టీకెట్ తీసి టి.సి. కి అందించింది.
టి.సి సైన్ చెసి పక్క బెర్తుల వాళ్ల టికెట్స్ చెక్ చేస్తున్నాడు. ఆ బెర్త్ చివరికి వున్న కోయదొరని కూడా టికెట్ అడిగేడు యధాలాపంగా టి.సి.
“మాకు టికటేంటి దొరా.. లోకమంతా ఏకం చేసి తిరిగేటోల్లము” అన్నాడు కోయదొర నవ్వుతూ.
“నువ్వే లోకాలన్నా తిరుగు టికెట్టు కొని. లేకపోతే వచ్చే స్టేషన్‌లో దిగిపో” అంటూ ముందుకు సాగిపోయాదు టి.సి.
“సార్‌కి ముక్కుమీదుంది కోపం. మనసు మాత్రం ఎన్నపూసె. పెట్టల పెళ్ళిగాక దిగులేసుకున్నాడు.” అన్నాడు కోయదొర వెళ్తున్న టి.సి వైపు చూస్తూ.
వెంటనే అతని పక్కన కూర్చున్న వ్యక్తి కోయదొరతో మాటలు కలిపేడు.
“ఏ వూరు మీది?”
“ఖమ్మం దగ్గర”
“మీకివన్నీ ఎలా తెలుస్తాయి?”
“చెప్పకూడదు దొరా. చెబితే తల్లి పల్కదు”
“తల్లెవరు?”
“సమ్మక్క మా కులదేవత. మొన్నమాసకి వెయ్యి కోళ్ళు, వెయ్యి మేకపోతులు బలిచెసి రక్తం లేదూ, రక్తంతో అమ్మకి తానం జేయించేం. తానమంటె ఏంటనుకున్నావు. మీరు గుళ్లలో పాలతో జెయ్యరూ అభిషేకమని గట్లే మేమూ రక్తంతో జేస్తాం. గూడెంలో పిల్లా పాపా భయం లేకుండా జూస్తారు. ఇంక చాల చేస్తంలే. అవన్నీ జెప్పకూడదు. చెబితే పవర్ బోతది”
“అయితే నా చెయ్యి జూడు” అంటూ అతను తన చేతిని అందించేడు.
“చెయ్యి తిరగదిప్పు”
అతను వెనక్కి తిప్పేడు.
“కోయదొరలు రేకలు జూసి జెప్పరు. మణికట్టు ఎనక భాగంలో మాకు మీ జాతకం గీత గీసినట్లుగా కనిపిస్తుంది. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ ఇసాలాక్షి, కోనలపాడు సమ్మక్క మీన ఆన. నీకిద్దరు పెట్టలు ఒక పుంజు.. అర్ధం కాలే..” అన్నాడు.
“లేదయ్యా నాకు ఒక కూతురు.. ఒక కొడుకే.”
“అది నిజమే. నే జెప్పేది నీ చేతిలో వున్న సంతానం. నువ్వు బలవంతంగా కత్తిరేసి కనకపోతే నేనేం జేస్తాను”
అతను అవునన్నట్లుగా ఒప్పుకొని నవ్వాడు.
“పెట్టకి అక్షింతలేద్దామని అదే మ్యారేజి చెయ్యాలని తన్నుకులాడుతున్నవు. సంబంధాలొస్తున్నాయి గాని. కారణం లేకుండానే పుటుక్కుమని తుస్సుమంటున్నాయి. పెట్ట దిష్టి నీళ్లు తొక్కింది. అందుకే నువ్వు తలపెట్టిన పని జరగడంలేదు. సమ్మక్కని నమ్మితే ఒక పూజ చెసి తాయెత్తిస్తా. ఏంటి నమ్ముతావా?” అన్నాడు కోయదొర.
అతను సందిగ్ధంగా చూసేడు.
మనసులో పూజ చెయించుకోవాలని వున్నా చుట్టూ జనం ఏమనుకుంటారోనని కొద్దిగా సిగ్గు పడుతున్నాడు.
అదే బెర్తు మీద శబరిమలై వెళ్టున్న అయిదారుగురు అయ్యప్ప స్వాములున్నారు.
“చేయించుకోండి. వాళ్లకి చాలా మహిమలుంటాయి. ఇందులో పోయేదేముంది?” అన్నారు వాళ్లు. వాళ్లకి ఆ దూర ప్రయాణంలో కాస్త కాలక్షేపం కావాలి.
కోయదొర సంచిలోంచి ఒక ఫైలు తీసి బెర్త్ మీద పెట్టి తెరిచేడు. అందులో దుర్గాదేవిలాంటి ఆకారంలో ఒక ఫోటో వుంది. దాని మీద పసుపు, కుంకుమలు జల్లి వున్నాయి.
“అమ్మకి దణ్ణం పెట్టుకో . నమ్ముతాను తల్లి అను” అన్నాడు.
అతనలాగే అని దణ్ణం పెట్టుకున్నాడు.
వెంటనే కోయదొర జోలెలోంచి ఒక చిన్న చెక్కపీటలాంటిది తీసి దాని మీద ఆముదం రాశాడు. దాని మీద ఒక రాగి బిళ్ల వుంచి దానిపై కర్పూరపు బిళ్లలు , కేరం బోర్డు కాయిన్స్‌లా పేర్చేడు. వాటిని అగ్గిపుల్లతో వెలిగించేడు. జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది.
“సరిగ్గా జ్యోతివైపే చూడు. చెంపలు వాయించుకో. సమ్మక్కని తల్చుకో” అన్నాడు అతన్ని కంగారు పరుస్తూ.
అందరూ రెప్పవేయకుండా జ్యోతినే చూస్తున్నారు.
లిఖిత కూడా తాత్కాలికంగా తన తండ్రి గురించి మర్చిపోయి జ్యోతి వంకే ఆసక్తిగా చూసింది.
ఆశ్చర్యంగా జ్యోతి నడవడం ప్రారంభించింది.
“ఏం జరుగుతోంది?” అన్నాడు కోయదొర.
“జ్యోతి నడుస్తోంది” అన్నారంతా ముక్తకంఠంతో.
“నిజవేనా?”
“నిజమే,.”
“సమ్మక్కని నమ్ముతారా?”
“నమ్ముతాం”
“నీ పెట్టకి పెళ్ళికొడుకు జ్యోతి నడిచిన వైపునుండి వచ్చె మాఘమాసం లోపు నొస్తాడు. ఈ పూజ పదకొందువేలకి చేస్తాను. నువ్వు చిక్కుల్లో వున్నావు. వెంటనే వెయ్యి నూటపదార్లు పెట్తు. సమ్మక్కకి జాతర చెయిస్తాను” అన్నాదు కోయదొర దదదడా ఫైలు మీద కొడుతూ.
అతని గుండె గుభేలుమంది.'”అంతా?” అన్నాదు బాధగా.
“బేరాలాడకు తల్లిక్కోపమొస్తుంది. రోజులు బాగుంటే వచ్చే యీనాటికి లక్షలు జూస్తావు. దొంతర్లు దొంతర్లేరుకుంటావు డబ్బు” అన్నాడు కోయదొర.
అతను జేబులు తడుముకొని “అయిదొందలుంచు. ప్రయాణంలో వున్నాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. మా యింటికి రా. నువ్వడిగినంతా యిస్తాను” అన్నాడు బ్రతిమాలె ధోరణిలో.
కోయదొర అయిష్టంగానే అయిదొందలు తీసుకొని “సరే! శబరిమలై అయ్యప్ప దర్శనం తర్వాత తిరిగొస్తా. పిల్ల పెళ్లి కుదిరితే అయిదు వేలివ్వాలి. ఇస్తావుగా?” అన్నాడు.
అతను సరేనని తలూపేడు.
జ్యోతి నడవడంతో అందరికీ అతనిమీద చెప్పలేని గురి కుదిరింది.
అతని దగ్గర నిజంగానే మహత్తుందని నమ్మి తమ తమ బాధలు చెప్పుకోసాగేరు. అందులో టి.సి కూడా చేరేడు.
ప్రతి మనిషికి రకరకాల అనుమానాలు.. ఆశలు.
వాళ్ల వాళ్ల సైకాలజీని స్టడీ చేస్తూ వాళ్లాశించేది ఫలానా పూజ చేస్తే జరుగుతుందని అతను చెబుతున్నాడు. వాళ్లందరూ గొర్రెల్లా తలలాడిస్తున్నారు. చిత్రమేమిటంటే వారిలో డాక్టర్లు, ప్లీడర్లు, జర్నలిస్టులు, వ్యాపారస్థులూ అందరూ వున్నారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక జర్నలిస్టు తన దగ్గరున్న కెమెరాతో కోయదొర ఫోటో తీసి అతన్ని ఇంటర్వ్యూ చేసేడు. తను పని చేస్తున్న ఒక దినపత్రికలో ప్రచురించేందుకు.
టి.సి అతనికి ప్రత్యేకమైన బెర్తు కేటాయించేడు టిక్కెట్టు లేకుండానే.

(సశేషం

బ్రహ్మలిఖితం 8 & 9

రచన: మన్నెం శారద

“లిటరరీ ఫ్లాక్” అనుకుంది మనసులో కసిగా లిఖిత.
చీకటి పడింది. రెండరటిపళ్ళు తిని బెర్తెక్కి పడుకుంది.
శరీరాన్ని వాల్చినా మనసుకి విశ్రాంతి లభించడం లేదు. కొన్ని గంటలుగా కంపార్టుమెంటులో కోయదొర చేసిన విన్యాసాలు మనిషి పల్స్ తెలుసుకొని ఆడుతున్న నాటకాలు గుర్తొచ్చి ఆశ్చర్యపడుతోంది.
ఒక చదువుకోని అడవి మనిషి .. అడవిలో దొరికే పిచ్చి పిచ్చి వేర్లు తెచ్చి వాటిని దగ్గర పెట్టుకుంటే శని విగడవుతుందని అదృష్టం పడుతుందని, అనుకున్న పనులు జరుగుతాయని నిముషంలో ఈ చదువుకున్న గొర్రెల మందకి అమ్మి డబ్బు చేసుకోవడం చాలా చిత్రంగా అనిపించింది.
మనిషి తన చదువుకున్న చదువుని పరీక్షా పత్రాల వరకే పరిమితం చేస్తున్నాడా? అందులోంచి మధించిన విజ్ఞానాన్ని జీవితానికన్వయించుకోలేనంత దీన హీనస్థితిలో వున్నాడా?
దేశానికి ప్రజలకి చీకటిలో జరిగే దారుణాల్ని ఉన్నదున్నట్లుగా తెలియజేసే బాధ్యత వున్న జర్నలిస్టు, అడవిలో అజ్ఞానంలో బ్రతికే ఒక కోయవాణ్ణి మహత్తర శక్తులున్న మనిషిగా చిత్రించి ప్రచారం చెయ్యడం ఎంతవరకు సమంజసం.
తన చేతిలో ఒక పేపరుందని కలముందని తన బుర్రలో పేరుకున్న అజ్ఞానన్ని వేలాదిమందికి పంచడం ఎంతవరకు క్షమార్హం.
అయితే జ్యోతి ఎలా నడిచినట్లు!
ఆలోచిస్తూనే పడుకుంది లిఖిత.
అకస్మాత్తుగా ఎవరో తట్టి లేపినట్లుగా మెలకువొచ్చి బెర్త్ మీద నుండి వంగి చూసింది. తెలతెలవారుతోంది. చలిగాలి జివ్వున వీస్తోంది.
అందరూ అప్పుడే లేచి కూర్చుని తర్జన భర్జన పడుతున్నాడు.
“ఏం చేస్తాం! చచ్చినట్లిక్కడ కూర్చోవాల్సిందే. సాయంత్రం కాని తిరిగి బయల్దేరదంట!” అంటున్నారెవరో.
“ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది లిఖిత.
“తమిళనాడు బందట. రైలిక్కడాపేసేరు. తిరిగి సాయంత్రం వరకు ఇక్కడే మన జాగారం.” అన్నాడా జర్నలిస్టు.
లిఖిత నవనాడులూ కృంగిపోయినట్లయింది.
చాలామంది రైలు దిగి రిటైరింగ్ రూమ్స్‌కి వెళ్తున్నారు.
“ఏ వూరిది?”
జాలారిపేట అని చెప్పేడు జర్నలిస్టు.
లిఖిత ఉసూరుమంటూ బెర్త్ దిగింది.
తన తండ్రిని ఎంత తొందరగా కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నదో అంతగానూ ఆలస్యమవుతోంది. ఇదంతా వెంకట్ చలవ. ఏడుస్తూ ట్రెయిన్ దగ్గర కొచ్చేడు. తన డబ్బు తీసుకుంటూ మరీ శాపాలు పెడ్తాడు. అని విసుక్కుంటూ బాగ్ తగిలించుకొని రైలు దిగింది లిఖిత.
ఏం చేయాలో తోచక నిస్సత్తువుగా ప్లాట్‌ఫాం మీదున్న బెంచి మీద కూర్చుంది.
ఇంతలో ఒక కానిస్టేబుల్ ఆమె దగ్గర కొచ్చి “మే అయ్ నో యువర్ నేం ప్లీజ్?” అనడిగేడు.
“లిఖిత”
“ఎక్కడ బయల్దేరేరు. ఎక్కడికెల్తున్నారు?”
“ఫ్రం సికిందరాబాద్ టు కొచ్చిన్”
“పర్పస్ అఫ్ ద జర్నీ?”
“టు విజిట్ కేరళ”
“అయిసీ! మీ ఫాదర్ పేరు?”
లిఖితకీసారి నిజంగానే కోపమొచ్చింది.
“అవన్నీ చాలా అవసరమా?” అనడిగింది విసుగ్గా.
“అవసరమే మాడం. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే మొదట మీరు దుయ్యబెట్టేది పోలీసు డిపార్టుమెంటునేగా!” అంటూ నవ్వాడతను.
“అయితే బాగా రాసుకోండి. మా ఫాదర్ పేరు కార్తికేయన్. సైంటిస్టు. నా తల్లి పేరు కేయూరవల్లి. నా తాతగారి పేరు లేట్ భాస్కరన్. ఐ.జి ఆఫ్ ది పోలీస్.”
ఆ మాట విని అదిరిపడ్డట్టుగా చూసేడు కానిస్టేబుల్. వెంటనే గబగబా రైల్వే పోలీస్ స్టేషన్‌లో కెళ్ళేడు.
కాస్సేపటీలో ఒక అరడజనుమంది యూనీఫారంలో వున్న ఇన్స్పెక్టరుతో పాటు ఎస్పీ, రైల్వేస్ ఆమె దగ్గరగా వచ్చి సెల్యూట్ చేసేరు.
ఆ హఠాత్ చర్యకి లిఖిత తెల్లబోయి లేచి నిలబడింది. ప్రయాణికులంతా వింతగా చూస్తున్నారు.
“వీళ్లందరికీ మూకుమ్మడిగా పిచ్చిగానెక్కలేదు కదా” అనుకుంది మనసులో.
“నా పేరు హరిహరన్. మీ తాతగారే నన్నీ డిపార్టుమెంటులో రిక్రూట్ చేసింది. ఆయన చలవ వల్లనే ప్రమోషన్ సంపాదించేను. ఆయన్ పోయేక మీ వివరాలు తెలియలేదు. మీ అమ్మగారు బాగున్నారామ్మా” అనడిగేడూ వినయంగా.
లిఖిత తలూపింది.
“పదండి. మిమ్మల్నిక్కడ ఆర్ అండ్ బి గెస్త్ హౌస్‌లో వుంచుతాను. రెస్టు తీసుకుందురుగాని” అన్నారాయన.
“ఎందుకండి మీకు శ్రమ” అంది లిఖిత.
“నోనో! నాటెటాల్. ఇటీజే గ్రేట్ ఆపర్చునిటీ టు గెటే చాన్స్ టు సర్వ్ యూ. కమాన్ బేబీ!” అన్నారాయన లిఖిత భుజం చరుస్తూ.
ఇదంతా చూస్తున్న జర్నలిస్టు గబగబా ఆవిడ దగ్గరగా వచ్చి.”నేనూ మీతో వస్తాను మాడం. నేను మీ ఫ్రెండ్‌నని చెప్పండి” అనడిగేడు.
లిఖిత తలూపి “హీవిల్ ఆల్సో ఫాలో అజ్. ఎనీ అబ్జెక్షన్?” అడిగింది.
“లెట్ హిమ్ కమ్” అన్నారాయన ముందుకి నడుస్తూ.
అందరూ ఫ్లయోవర్ మీద నుండి దిగేరు.
అక్కడున్న అంబాసిడర్‌లో లిఖిత, జర్నలిస్టు ఎక్కేరు. డ్రైవరు పక్కన ఒక ఇన్స్పెక్టరెక్కేడు.
అందరు పోలీస్ ఆఫీసర్సు తమిళ సినిమాల్లో చూపించించే పోలీసాఫిసర్లలానే పెద్ద పెద్ద మీసాలతో వున్నారు.
కారు ముందుకి సాగిపోతుండగా జర్నలిస్టు కారు వెనుక గ్లాసులోంచి చూసి తెల్లబోతూ “మాడం! వెనక్కి చూడండి” అన్నాడు.
లిఖిత వెనక్కి తిరిగి చూసింది.
ఒక మెటడోర్ నిండా పోలీసులు తమ కారుని ఫాలో చేస్తున్నారు.
లిఖిత ఆశ్చర్యపోతూ “వాళ్లంతా ఎక్కడికొస్తున్నారు?” అనడిగింది ముందు సీట్లో కూర్చున్న ఇన్స్పెక్టర్ని.
“మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలని చెప్పేరు ఎస్పీ సార్!” అన్నాడతను వినయంగా.
“నేను మీ గెస్టునా? క్రిమినల్నా?” అంది లిఖిత.
ఆ మాట విని జోక్‌గా తీసుకొని పెద్దగా నవ్వేడు ఇన్స్పెక్టర్.
“ఈ రోజు బంద్. ప్రభుత్వానికనుకూలంగా జరుగుతోంది. అందుకే ఎక్కడి రైళ్లక్కడాగిపోయేయి. మీకే ప్రమాదం జరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేరు సార్!”
లిఖిత మరేం మాట్లాడలేదు.
కారు ఒక ప్రశాంతంగా చాలా పెద్ద గ్రవుండ్‌లో వున్న గెస్ట్ హౌస్ పోర్టికోలో కెళ్లి ఆగింది.
లిల్ఖిత, జర్నలిస్టు కారు దిగేరు. స్నానాలు ముగించగానే టిఫిన్స్ వచ్చేయి. ఇంతలో ఇన్స్పెక్తర్ వచ్చి ఒక కలర్ టీవీ అరేంజ్ చేసి క్రికెట్ మాచ్ వస్తోంది చూడండమ్మా” అన్నాడు.
“నాకు చాలా అయిష్టమైన ఆటల్లో మొదటిది క్రికెట్!” అంది లిఖిత.
అతను తెల్లబోయి చూసి “వ్వాట్ మాడం. ప్రపంచంలో తొంభయిశాతం క్రికెట్ అంటే పడి చస్తారు. క్రికెట్ మాచ్ చూడడం ఒక క్రెడిట్‌గా ఫీలవుతారు” అన్నాడు.
లిఖిత నవ్వి “నేను మిగతా పది శాతంలోకి వస్తాను. ఎక్కువమంది ఇష్టపడేదాన్ని నేను మనసులో ఇష్టం లేకున్నా ఇష్టమని చెప్పలేను” అంది.
“అయితే ఏదన్నా సైట్ సీయింగ్ చేస్తారా” దగ్గర్లో జలబంధారి అని వాటర్ ఫాల్స్ వుంది. అక్కడ మురుగన్ కోవెలుంది. రొంబ వ్యూటిఫుల్ ప్లేస్” అన్నాడతను.
లిఖిత కన్నా జర్నలిస్టు ఉత్సాహం చూపిస్తూ “వస్తాం. వస్తాం. సాయంత్రం వరకు ఇక్కడేం చేస్తాం?” అన్నడు.
అతను లిఖిత అనుమతి కోసం చూసేడు.
“చెప్పండి మాడం. వస్తామని” అని బ్రతిమాలేడు జర్నలిస్టు.
లిఖిత సరేనంది.

*******

సంపెంగి అందించిన కబాబులు తింటూ, కల్లు తాగుతూ “మనం అనుకున్న దానికంటే బాగుంది మన గిరాకీ. కాని నువ్వప్పుడే చాలా తొందపడిపోతున్నావు నారాయణా! కొత్తమతం తీసుకుంటే గుర్తులెక్కువని ఆ బాంక్ పిల్లకేంటి.. రెండ్రోజుల్లో దాని పూర్వజన్మలోని మొగుడొచ్చి డబ్బిస్తాడని చెప్పేవు. నాటకమాడిద్దామన్నా మన దగ్గరంత డబ్బెక్కడిది? ఇవ్వకపోతే ఓంకారస్వామి ఉత్త నాటకాలరాయుడని పదిమందికి చెప్పి రామక్రిష్ణా బీచ్‌లోని ఇసకంతా మన నెత్తిన పోయిస్తది” అన్నాడూ రాజు విసుక్కుంటూ.
ఓంకార స్వామిగా అవతారమెత్తిన నారాయణ విలాసంగా నవ్వి సంపెంగి వైపు చూసేడు. సంపెంగి మొహం చిటపటలాడుతున్నట్లుగానే వుంది. మైక్రోస్కోపు పెట్టి పరీక్షించినా ఆవిడ మొహంలో నవ్వు మచ్చుకైనా కనిపించదు. కాని.. ఇదివరకులా చిరాకు పడకుండా వాళ్లడిగినంత కల్లు పోస్తున్నది. కారణం.. వాళ్లు ఆడుతున్న కొత్త నాటకం భవిష్యత్తులో బాగా లాభాలు సంపాదించి పెట్టగలదనే ఆశతో మాత్రమే.
“మరీ నన్ను సన్నాసోడిగా జమ కట్టేయకు. దానికి అగిన ఎరేంజ్‌మెంట్లు చేసేనేనప్పుడే. నిన్న వెంకట్ అని ఒక ఆడదాని సొమ్ము తిని బతికే ఏబ్రాసోడొకడు నా దగ్గరకొచ్చేడు. వాడు ప్రేమించిన పిల్ల వీడి ప్రేమని ఎడం కాలితో తన్ని కేరళ వెళ్ళిందంట. అదింక తిరిగి రాకూడదని వీడి ప్లాన్. అంతే కాదు ఆ పిల్ల అమ్మకున్న బట్టల మిల్లు వీడి చేతిలోకి రావాలని దానికి తనే వారసుడు కావాలని నా దగ్గర కొచ్చేడు. వాణ్ణి బుటలో పెట్టేను.
“ఎలా?” కుతూహలంగా అడిగేడు రాజు. నారాయణలో కొంత ఫోజు పెరిగింది.
గర్వంగా సంపెంగి వైపు చూసేడు.
సంపెంగి అర్ధం చేసుకున్న దాన్లా గూళ్ళెత్తి నడుస్తూ వెళ్లి మరొక కల్లు ముంత తెచ్చి నారాయణ కందించింది.
“కబాబులు?” అనడిగేడు నారయణ గర్వంగా.
సంపెంగి మళ్లీ వెళ్ళింది.
“నీ తస్సదియ్యా! రేగి కంపలాంటి నా పెళ్ళాం చేత పనులు చేయిస్తున్నవు. నువ్విన్ని పెళ్ళిళ్ళెలా మానేజ్ చేసేవో నాకర్ధమవుతున్నదిప్పుడు” అన్నాడు రాజు నవ్వుతూ.
“ఎవరికే బలహీనతలున్నదో దాని మీద ఆశ రేకెత్తిస్తే వాళ్లు కుక్కల్లా తోకలూపుతూ మన వెంబడి తిరుగుతారు. నీ పెళ్లానికి డబ్బు పిచ్చి. పూరి గుడిసె లెవలయినా ప్రీమియర్ పద్మినిలో తిరగాలని కలలు కంటుంటుంది. అద్సరే. ఆవిడ కబాబులు కాల్చుకొచ్చేలోపునే అసలు విషయం చెబుతాను. కొన్నావిడ వినకపోవడమే మంచిది. లేకపోతే నిముషానికోసారి మన గుట్టు బయట పెట్టే ప్రయత్నాలు చేస్తుంది.”
“అవునవును” అన్నాడు రాజు.
” ఆ వెంకట్ గాడికి రేపొక ఇరవైవేలు తీసుకెళ్ళి బాంక్‌లో ఈశ్వరి అనే పిల్లకివ్వమని, ఆ పిల్ల ముందు జన్మలో నీ భార్యని చెప్పేను”.
“వాడు నమ్మాడా?”
నారాయణ విలాసంగా నవ్వాడు.
“మన దగ్గర కొచ్చేరంటేనే సగం మానసికంగా మన మాటలు నమ్మడానికి సిద్ధపడొస్తారు. ఇక మనం సాగదీస్తూ, సంశయంగా కాకుండా దైవం పూని మాట్లాడుతున్నట్లుగా మాట్లాడాలి. అలౌకికంగా చూడాలి. చిరునవ్వులొలికించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. వారి ఎదుట నున్నవాడు వాళ్లలాంటి మనిషి కాదని గొప్ప అద్భుత శక్తులున్న దైవాంశ సంభూతుడనే అభిప్రాయం కల్గించహలి. అప్పుడు మనం కొన్ని తప్పులు చెప్పినా వాళ్లు పదిమందిలో బయటపెట్టే సాహసం చెయ్యరు. మొన్నేం జరిగిందో తెలుసా?” అంటూ నవ్వేడు నారాయణ.
రాజులో ఉత్సాహం ద్విగుణీకృతమైంది.
“ఏం జరిగింది?” అనడిగేడూ.
“మల్లన్నని ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసరట. దేవుడు లేదు. దయ్యం లేదని… మాయలూ మంత్రాలూ మోసమని, చేతబడులు, సింగినాదాలూ చీటింగని పాతికేళ్ళూ పుంఖాను పుంఖాలు కనిపించిన ప్రతి పేపర్లోనూ కలం తీసుకుని దూదేకినట్లు ఏకి పారేసేడు. కాని ఇప్పుడేం జరిగిందో సింహంలాంటి మనిషి చెవులేలాడేసుకొని పిల్లిలా మన వరండాలో మూడుగంటల సేపు నా దర్శనం కోసం పడిగాపులు పడ్డాడు.
వాది కులగోత్రలు, పుట్టు పూర్వొత్తరాలూ, మనవాళ్ళొచ్చి నా చెవిలో ఊదెళ్ళి పోయేరు. నేను చేతిలో ఒక ఏపిల్ తీసుకుని పైకెగరేసి పట్టుకుంటూ హాల్లో భక్తుల ముందు ఈ లోకంలో లేనట్లుగా నదుచుకుంటూ వాణ్ణి గమనించినట్లుగా వెళ్లి మళ్లీ వెనక్కొచ్చేసేను. భక్తులతోపాటు వాడు లేచి ఆశీర్వాదం కోసం ఆరాటపడటం నేను క్రీగంట గమనించేను.
నేను తిరిగొచ్చి మన ఓలంటీరుని పంపించి మల్లన్నని లోపలికి పంపమని చెప్పేను. మల్లన్న వెన్నెముకలేని మనిషిలా అతని వెంబడొచ్చి నా కాళ్ల మీద పడ్డాడు”.
“నిజంగానా?” ఆశ్చర్యపోతూ అడిగేడు రాజు.
“కావాలంటే మన ఓలంటీర్లనడుగు. మల్లన్నని పేరుతో పిలవగానే వాడు ఫ్లాటయిపోయేడూ. నీకేం సమస్యలున్నాయని వచ్చావు. అంతా బాగానే వుందిగా. ఆరోగ్యం కూడా ఫర్వాలేదు” అన్నాను.
“మీరన్నట్లు నాకేం లోటు లేదు. ఇల్లు కట్టేను. పిల్లల పెళ్ళిళ్ళు చేసేను. మనశ్శాంతి లేదు. ఇక ఆరోగ్యమంటారా.. మొన్నీమధ్యన కేన్సరొచ్చి తగ్గింది” అన్నాడతను.
“అదే చెబుతుంట. ఇంకే పెద్ద జబ్బులూ రావు నీకు. మొదట్నుంచీ దేవుణ్ణి తూలనాడేవు. అదే నీ అశాంతికి మూలమని చెప్పేను. ఇంకేం ఉంది. లైబ్రరీల్లో వేలాది పుస్తకాలు చదివిన మనిషి నా కాళ్ల మీద కుక్కపిల్లలా పడ్డాడు. వాడలాంటి ట్రాన్స్‌లో వుండగా నేను తగరపు వలసనుండి వచ్చి నాకు ముత్యం వుంగరం యిచ్చిన పాకాల సుబ్బమ్మగారి ఉంగరం గాల్లోంచి తెప్పించినట్లుగా తెప్పించి వాడిని పెట్టుకోమన్నాను. వాడికి మతి పోయింది. కాని దురదృష్టం. ఆ రింగు వాడి ఏ వేలికీ పట్టలేదు. నేనది తిరిగి తీసుకొని అటూ ఇటూ తిప్పి “నీ అదృష్టానికిది కుదరడం లేదు” అని చెప్పి ఇది అసలైన ముత్యమేనా, చూడు!” అంటూ మన ఓలంటీరుకిచ్చేను.
అతను “ఇది మేలిమి బంగారంలో ఇమిడిన స్వాతి ముత్యం స్వామి!” అంటూ దాన్ని తిరిగిస్తున్నట్లుగా కొంచెం పెద్ద సైజులో నా ఆకృతి గుద్దిన రాగి ఉంగరం నా చేతికిచ్చేడు. నేను గాలిలో చేతులు తిప్పి రాగి ఉంగరం తెప్పించినట్లు తెప్పించి అతనికిచ్చేను.
మల్లన్న మొహంలో ఆనందం తాండవించింది.
ఆ ఉంగరాన్ని మహాప్రసాదంగా స్వీకరించి నా ఫోటోలు అడిగి పట్టుకెళ్ళేడు. వచ్చే పౌర్ణమినాడు నా పుట్టినరోజు ప్రకటిస్తున్నాను. ఆ రోజుకి మల్లన్న నా మహత్యాల గురించి అన్ని పేపర్లలోనూ రాసేస్తాడు” అన్నాడు నారాయణ గర్వంగా.
రాజు నిజంగానే నారాయణ తెలివితేటలు చూసి చకితుడయ్యేడు.
విత్తనం నాటిన మూడో నాటికే పందిరంతా అల్లుకుపోయిన గుమ్మడి పాదులా అనిపించేడు నారాయణ అతని కళ్ళకి.
“నిజంగా నువ్వు చాలా తెలివ్వైనవాడివే నారాయణా! నీ మొహంలో ఆ పీడ కళ పోయి తేజస్సు వచ్చింది. కొంపదీసి దేవుడు నిన్ను నిజంగా ఆవహించలేదు కదా!” అన్నాడు సంభ్రమంగా చూస్తూ.
” నా బొంద! భక్తులు తెచ్చిన పళ్ళు, మిఠాయిలు, పంచామృతాలు తాగి నా బుగ్గలు వూరి రంగొచ్చింది. ఇలాంటి ఆహారం తినే పూర్వం మునీశ్వరులు దివ్యకాంతితో వెలిగిపోయేవారు. దాన్నే బ్రహ్మతేజస్సు అనుకునేవారు పిచ్చి ప్రజలు.” అంటూ నవ్వేడు నారాయణ.
“ఇంతకీ ఆ వెంకట్ గాడి సంగేంటి?”
“ఏవుంది. ఎక్కడో రేపటికల్లా ఆ డబ్బు సంపాదిస్తాడు వాడు. చూస్తుండు. అందులో కొంత డబ్బు బాంక్ పిల్ల కృతజ్ఞతతో మనకి సమర్పించుకుంటుంది. కథ అంతటితో ఆగదు. అద్సరే గానీ, రేపణ్ణుంచి నేనీ గుడిసెల దగ్గరకి రాను. మన రహస్యం బట్టబయలైపోతుంది. ఇప్పటికే తగినంత ప్రచారం జరిగింది కాబట్టి నువ్వా చిలకని గాలి కొదిలి నా దగ్గరే పి.ఏ గా చేరు” అన్నాడు నారాయణ.
రాజు సరేనన్నట్లుగా తల పంకించేడు.
“నువ్వు చెప్పిన సలహా బాగుంది. పరమాన్నం పెడతానంతే గంజికాసుకోటానికి గింజలడిగిపెట్టినట్లుగా.. ఆ ఎండలో నాకీ తిప్పలు దేనికి?” అంటూ రయ్యిన లేచి పంజరంలోని చిలకని బయటకొదిలేసేడు రాజు.
అది నిస్సహాయంగా కుంటుతూ బయటకొచ్చింది. చాలా సంవత్సరాలుగా యజమాని పంజరపు తలుపు తెరవగానే వచ్చి కొన్ని కార్డులు కెలికి ఒక కార్డు ముక్కును కరచి అతనికివ్వదానికి అలవాటుపడ్డది కావడంతో చుట్టూ కార్డుల కేసి చూసింది.
“నీ యవ్వ! నీతో నాకింక పని లేదు. ఎగిరిపో” అంటూ రాజు కల్లు తాగిన నిషాతో దాన్ని పట్టుకుని ఎగరేసాడు.
కాని చిలుక దబ్బున క్రిందపడింది.
ఎన్నో రోజులు మంచం మీద తీసుకున్న రోగిష్టి మనిషి లేచి నడవడానికి ప్రయత్నిస్తే ఎలా తూలిపోతాడో అలాగే చిలుక తన రెక్కల్ని సాచి ఎగరలేక నిస్సహాయంగా కూలబడిపోయింది.
అనేక సంవత్సరాలుగా అతనితోనే కలిసి బతుకుతున్నందువలన దాని మూగ హృదయంలో యజమాని పట్ల నమ్మకము, ప్రేమ కూడా బలంగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇతనే తన బ్రతుకు తెరవు కోసం, హాయిగా పసిడి రెక్కలు పరచి ఆకాశంలో ఎగిరే తనని నిర్దాక్షిణ్యంగా పట్టి రెక్కలు కత్తిరించి పంజరపు పాలు చేసేడన్న ఉక్రోషం, కక్ష మచ్చుకైనా లేవా మూగజీవిలో.
పైపెచ్చు అతన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు దాని హృదయం. తనని నమ్ముకొని అతను పొట్ట పోసుకుంటున్నాడన్న నిజం తెలీని ఆ అమాయకపు పక్షి అతను వేసే గింజలు తిన్నందుకే అతని మీద ప్రేమ పెంచుకుంది. ఒక్కసారిగా తన అవసరానికి వాడుకొని పని తీరేక పొమ్మని వదిలేసిన యజమానిని వదులుకోలేక దాని కంటిలో నీరు గిర్రున తిరిగింది.
కాని..దాని కన్నీరు చూసి కరిగిపోయే మానవత్వం అక్కడున్న ఇద్దరికీ లేదని దానికి తెలియదు.
“థూట్! పొమ్మంటే ఇక్కడే చస్తుంది. పాడు ముండ!” అంటూ ఒక కర్ర పుల్ల తీసుకొని అదిలించబోయేడు రాజు.
అప్పుడే కబాబులు తీసుకొస్తున్న సంపెంగి ఆ దృశ్యం చూసి తెల్లబోతూ “దాన్నొదిలేసేవేంటి?” అంది కంగారుగా.
“ఇక దాంతో పన్లేదే పిచ్చిముండా! మనం పట్టిందంతా బంగారమయ్యే రోజులు దగ్గరకొచ్చేసేయి!” అన్నాడు కర్రతో దాన్ని కొడుతూ.
సంపెంగి కబాబులు వాళ్ల మీదకిసిరి కొట్టి చిలకని ఒడిసిపట్టుకొని “నీకేవన్నా పిచ్చెక్కిందా? జోస్యాలు మానేసినంత మాత్రాన దీన్నొదిలేసుకుంటారా?” అంది కోపంగా మొగుడివైపు చూస్తూ.
నారాయణతో పాటు రాజుకూడా బ్రహ్మరాక్షసిలాంటి ఆ మనిషిలో ప్రేమ, దయ వున్నాయనే విషయం గ్రహించి ఆశ్చర్యపోయేరు.
“చిలక మాంసం ఎంత రుచిగా ఉంటుందో మీరెప్పుడైనా తిని చూశారా? దీన్నిప్పుడే బొచ్చు పీకి కాల్చుకొస్తాను. చూద్దురుగాని” అంది సంపెంగి దాన్ని తీసుకొని లోనికెల్తూ.
ఆ మాట విని నారాయణ ఉలిక్కిపడ్డాడు.
ఎన్నో మోసాలు చేసి అవినీతిగా బ్రతికే అతను కూడా చిలకని చంపబోతున్నదని తెలిసి చలించిపోయేడు.
“వద్దు సంపెంగీ దాన్ని చంపకు”అనరిచేడు కీచుగా.
సంపెంగి వెనక్కి తిరిగి నవ్వింది క్రూరంగా.
“ఏం జాలా?”
“పాపమది మూగజీవి!”
“ఏం కోడి మూగజీవి కాదా? మేకపోతు మూగ జీవి కాదా? వాటితో తయారుచేసిన కబాబులు చప్పరించి తినగా లేంది. చిలక మాంసం తింటే తప్పా! ఎదవ నీతులు చెప్పబోకు.” అంటూ రయ్యిన లోనికెళ్ళిపోయింది.
మరి కాస్సేపటిలో కత్తికి ఎరవుతూ చిలక చేసిన చివరి రొద వాళ్ల చెవిలో పడింది.
నారాయణ “హరిహరి” అంటూ చెవులు మూసుకున్నాడు. అవసరం తీరేక తోటి మనిషిని కూడా మానసికంగా కత్తి లేకుండానే హత్య చేసి అవతలకి విసిరేయగల శక్తి ఈ సృష్టిలో నికృష్టమైన మనిషికి మాత్రమే వుందని గ్రహించే శక్తి నారాయణలాంటి వాళ్లకుండదు.

***********

కారు మెల్లగా వెళ్తోంది.
రోడ్డు కిరువైపులా పెద్ద పెద్ద మర్రి, మారేడు, రావి వృక్షాలు చేతులు పెనవేసుకుని షేక్‌హేండిస్తున్నట్లుగా దట్టంగా పెరిగి దారిన వెళ్ళేవారికి చల్లని గాలిని, నీడని ఇస్తున్నాయి. రోడ్డు పక్కన పెరిగిన చెరకు తోట్టల్లోంచి తియ్యని వాసనలొస్తున్నాయి.
దూరంగా వలయాకారంలో వున్న కొండలు వాటి వెనుక దట్టమైన నీలి రంగులో క్రమ్ముకొన్న మేఘాల పంక్తులు , వాటి కావల దుప్పటిలో దాక్కున్న సూర్యుదు తన ఉనికి చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి నిదర్శనంగా మేఘాల కొసల్ని వెండి అంచులు ఎంతో హృద్యంగా వుందా ప్రాంతం.
కృత్రిమంగా ఎత్తయిన కాంక్రీటు కట్టడాలతో క్రిక్కిరిసి పోతున్న జనారణ్యం నుండి కాలుష్యమెరుగని ఆ ప్రకృతి కాంత వడిలో పయనించడం మనసుకి ఎంతో సుఖాన్నిస్తోంది లిఖితకి.
తండ్రి గురించి తాత్కాలికంగా మరచిపోయి ఆ అరుదయిన అందమయిన దృశ్యాల్ని కంటి ఫ్రేములో కమనీయంగా బిగించే ప్రయత్నం చేస్తుందామె మనసు.
“మాడం!”
“నే రాసిన ఆర్టికలొకసారి చదువుతారా?”
“ఇప్పుడు కాదు” ఆమె చూపు తిప్పకుండానే జవాబు చెప్పింది జర్నలిస్టుకి.
మరో అరగంటలో కారు జలబంధారి చేరింది.
కారు దిగకుండానే లిఖిత చూపులు గుడి మీద పడ్డాయి.
ఆ గుడిని చూడగానే లిఖిత మనసు ఆనందంతో గండులేసింది.
కొండవాలులో కొంత ఎత్తునున్నదా దేవాలయం.
క్రింద విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామి కోవెలలున్నాయి.
కొద్దిగా మెట్లెక్కేక హెక్టాగన్ షేపులో (పంచముఖాలు) వున్న మంటపం, అక్కణ్ణుంచి మరి కొన్ని మెట్లెక్కితే శివలింగాకృతిలో వున్న సుబ్రమణ్యస్వామి కోవెల, ఆ కోవెలకి నీడపడుతూ వేయి తలల శేషేంద్రుడి శిల్పం. తలతలకి ఎర్రని దీపాలు, చాలా గమ్మత్తుగా కట్టేరా గుడిని. గుడి వెనుక కొండమీద నుండి నాలుగయిదు ధారలలో జలపాతం క్రింది జారుతున్నది. దూరం నుండి చూస్తే రాతి కొంతమీద గట్టిగా నామసుద్దతో రాసినట్లు నిశ్చలంగా కనిపిస్తున్నాయి నీటి ధారలు.
“ముందు గుడిలో దర్శనం చేసుకుందాం” అన్నాడు ఇన్‌స్పెక్టర్.
లిఖిత తల పంకించింది.
ముగ్గురూ దేవుడికి అర్చన చేయించేరు
తులసి మాలలతో, గన్నేరు పూలదండలతో శోభాయమానంగా వున్నాడు శ్రీవళ్లీ సమేతుడయిన సుబ్రమణ్యస్వామి.
ఇన్‌స్పెక్టర్ బూట్ సాక్సు తీసి ఇన్‌షర్ట్ బయటికి లాగి చాలా వినయంగా లెంపలేసుకుని ముగురన్‌కి మొక్కుకున్నాడు.
పూజయ్యేక మంటపం దగ్గర కూర్చున్నారు. ఇన్‌స్పెక్టర్ బూట్లు వేసుకుని మళ్లీ టక్ చేసుకుంటుంటే “ఇందాక దేవుడి దగ్గర లెంపలేసుకున్నారెందుకు?” అని కొబ్బరి ముక్క తింటూ చిలిపిగా అదిగింది లిఖిత.
“తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా మాడం!” అన్నాడతను నవ్వుతూ.
“అంటే తెలిసేం చెయ్యరన్న మాట!”
లిఖిత ప్రశ్నకతను ఇబ్బందిగా నవ్వేడు.
“మీతో మాటలడటం రొంబ కష్టం!” అన్నాడు అరవ యాసతో.
“మీ పోలీసు డిపార్టుమెంటు వాళ్లు తెలిసే చేస్తారు. నా ఫ్రెండ్ బస్సెక్కుతుంటే ఒకడు గొలుసు లాగేసేడు. ఆమె వెళ్ళి దగ్గరలో వున్న పోలీసు స్టేషనులో రిపోర్టిచ్చింది. ఆ గొలుసు లాగిన వాడెవరో, ఆ ఏరియాలో ఎవరా పనులు చేస్తారో వాళ్లకి తెలుసు. గొలుసు వెంటనే దొరికిపోయింది. నా ఫ్రెండ్ ఆ సంగతి తెలిసి తన అదృష్టానికి పొంగిపోతూ పోలీసు స్టేషనుకెళ్లింది. ఈ గొలుసు మీదేనా అంటూ ఆ గొలుసుని ఆవిడ మొహం మీడ ఆడించడమే గాని గొలుసు నా ఫ్రెండ్‌కివ్వలేదా ఇన్‌స్పెక్టరు. ఆవిడ విసిగి విసిగి చివరికి ఎవర్నో పట్టుకొని ఒక ఐ.జి.గారి చేత ఆ ఇన్‌స్పెక్టరుకి ఫోను చేయించింది. ఐ.జి.గారు చెప్పినప్పుడల్లా వాళ్లు ఫోనులోనే సాల్యూట్ కొట్టి ఇస్తాననడం, ఈవిడ వెళ్తే ఇవ్వకపోవడం. చివరికి ఆమె విసిగి వదిలేసింది. ఇలాంటివి తెలిసి చేసిన తప్పులు కావా?” అనదిగింది సూటిగా లిఖిత.
ఇన్‌స్పెక్టరు వెర్రిగా నవ్వాడు.
“అయిజీగారు చెప్పినా ఇవ్వలేదా మాడం!” ఆశ్చర్యంగా అడిగేడు జర్నలిస్టు.
“లేదు. కారణం ఆయన వీళ్లకి డైరెక్ట్ హెడ్ కాకపోవడమే. ఈ డిపార్టుమెంటులో హయ్య ర్ అథారిటీ పట్ల విపరీతమైన వినయవిధేయతలు చూపిస్తారు. సాల్యూట్స్ కొటడం, గంటలు గంటలు నిలబడడం, .. కాని ఇవన్నీ కేవలం వీళ్ల ఆఫీసర్సుగా ఉన్నంతవరకే!” అంది లిఖిత.
“ఎక్కడో కొంతమంది అలా ప్రవర్తించినంత మాత్రాన మొత్తం డిపార్టుమెంటుననడం భవ్యం కాదు మాడం!” అన్నాదు జర్నలిస్టు ఇన్‌స్పెక్టరుని వెనకేసుకొస్తూ.
లిఖిత నవ్వింది.
“నిజమే! ఒక లీటరు నీళ్లలో ఒక గ్లాసు పాలు కలిపితే నీళ్ళలో పాలు కలిపేరంటాం కాని పాలలో నీళ్ళు కలిపేరనం. అలానే వుంది. మన దేశంలో అవినీతి పర్సంటేజీ. ఇలాంటి విషయాలు రాయరు మీలాంటి జర్నలిస్టులు. ఏ తార ఏ తారడుతో తిరుగుతుందో, ఏ తార ముసల్దయిపోయిందో, అర్ధం లేని వ్యర్ధపు మాటల్ని బాక్స్‌లు కట్టి మరీ రాస్తారు పెద్ద డిస్కవరీ చేసినట్లుగా” అంది.
జర్నలిస్టు మొహం మాడింది.
లిఖిత అదేం పట్టించుకోనట్లుగా లేచి నిలబడి “పదండి ఆ జలపాతాన్ని దగ్గరగా చూద్దాం!” అంది.
అందరూ కొండెక్కేరు..
దూరం నుండి స్తబ్దంగా చలనం లేనట్లుగా కనిపించిన జలపాతం దగ్గరకు వెళ్తుంటే హోరున శబ్దంతో, తుళ్ళుతూ శక్తిలా క్రిందకి దూకుతోంది. సన్నని పాయలా కనిపించే ఆ జలపాతంలోని నీరు కొండ దిగువున ఒక పెద్ద టాంక్‌లా తయారయింది. దాని నుండి తీసిన కాలువలతో ఆ ప్రాంతంలోని పంటలన్నీ పండుతాయని తెలిసి లిఖిత ఆశ్చర్యపోయింది. రాయికి రాయికి మధ్య చెమ్మలా కనిపించే ఈ నీరెక్కడినుండి ఉద్భవిస్తుంది అనే నిజం సరిగ్గా ఎవరికీ తెలియదు.
కాస్సేపు నీటితో ఆడుకుని తిరిగి బయల్దేరేరు ముగ్గురూ. కారులో తిరిగి “నా ఆర్టికల్ చదవండి మాడం” అంటూ వెంటపడ్డాడు జర్నలిస్టు.
అతని పోరు భరించలేక ఆర్టికల్ తీసుకుని టైటిల్ చూసి మొహం చిట్లించింది లిఖిత.
“అక్షరం తెలీని అడవి మనిషి దగ్గరున్న అద్భుత శక్తులు” అని టైటిల్ పెట్టేడతను.
“ఇదంతా కోయదొర గురించేనా?”
“అవును మాడం. చదవండి.”
“అక్కర్లేదు. టైటిల్ చూస్తేనే పాఠకులకేం చెప్పదలుచుకున్నావో తెలుస్తున్నది. ఏ అద్భుత శక్తి చూశావ్ నువ్వు!”
“అదేంటి? మీరూ చూశారుగా జ్యోతి నడవటం”
“చూశాను.”
“మరింకేమిటి, అదద్భుత శక్తి కాదా? మీరు నడిపించండి చూద్దాం.”
“నడిపిస్తాను. కాస్త ఆముదం, ఒక రాగి బిళ్ళ, కర్పూరం తీసుకురా!” అంది లిఖిత.
“ఊరుకోండి. మీవల్ల కాదు”
“నా వల్లనే కాదు నీ వలన కూడా అవుతుంది కాస్త ఆలోచిస్తే”
“ఎలా?” ఆశ్చర్యపోతూ అడిగేడు జర్నలిస్టు.


ఇంకా వుంది..

బ్రహ్మలిఖితం – 10
రచన: మన్నెం శారద
“రాగి వేడిని బాగా పీలుస్తుంది తొందరగా. దాని మీద వెలిగించిన కర్పూరపు వేడికి రాగి కాయిన్ వేడెక్కుతుంది. దాంతో ఆముదం కూడా వేడెక్కి దాని డెన్సిటీ (సాంద్రత) తగ్గి పలచబడుతుంది. పలచబడగానే ఆముదం ప్రవహించటం మొదలెడుతుంది వాలుకి. దాంతో పైన జ్యోతి వెలుగుతున్న రాగిబిళ్ళ కదిలి ప్రవాహానికనుగుణంగా నడుస్తుంది. మన అదృష్టం ఆ దిశనుందని.. మనకి భ్రమ కల్గిస్తాడు కోయదొర. నేను కూడా నిన్న జ్యోతి నడవడం గురించి ఆశ్చర్యపడ్డాను. కాని ప్రాక్టికల్‌గా ఆలోచించేను. మీరొక జర్నలిస్టు లోకాన్ని మేల్కొలపవలసిన బాధ్యత వుంది మీకు. ఏదో బ్రతుకుతెరువు కోసమే అయితే ఇంకా చాలా పనులున్నాయి తొందరగా సంపాదించుకోవడానికి” అన్నది లిఖిత.

జర్నలిస్టు ఆమెవైపు తెల్లబోయి చూశాడు.

వయసు చిన్నదయినా ఆమెలోని భావాలు మాత్రం చాలా పదునుగా వుండటమాతను గమనించి ఆశ్చర్యపోయేదు.

*****
కేయూరవల్లి మనసు మాటిమాటికీ స్థిమితం కోల్పోతుంది. దాదాపు ఇరవై సంవత్సరాలు భర్తను వదిలి, భావరహితంగా సముద్రంలో కెరటాలు తకిడికి కదలక నిశ్చలంగా పగలూ రాత్రి అలానే నిలబడి వున్న డాల్ఫిన్ నోస్‌లా కాలం గడిపిందామె.

కాని.. ఇప్పుడెందుకో ఆమె గడ్డకట్టిన హృదయంలో సంచలనం చెలరేగుతోంది.

లిఖిత ఊరు విడిచిన నాటినుండి ఆమె మనసు మనసులో లేదు. కూతుర్ని విడిచి ఎప్పుడూ వుండలేదామె.

దగ్గర వున్నప్పుడు ముద్దు చెసింది. ప్రేమ ప్రదర్శించింది కూడా ఏమీ లేదు.

కాని.. ఇప్పుడు లిఖిత లేకపోతే తెలుస్తున్నదామెకి. తనకి కూతురి పట్ల వున్న అనురాగము.

వెళ్లి ఒక ఫోను కూడా చెయ్యలేదు.

అసలెలా చేరిందో!

ఆయన.. కనిపించేరో లేదో!

ప్రతిక్షణం భారంగా కదిలి గతంలో వినీలమవుతుంటే నిలకడలేని హృదయం చేసే అలజడిని చంపుకోడానికి కేయూరవల్లి వెళ్ళి డ్రాయింగ్ టేబుల్ దగ్గర కూలబడింది.

పెన్సిల్ షార్ప్ చేసి గడులలో డిజైన్స్ నింపుతుంటే.. అవేవీ నచ్చినట్లనిపించిక ఎరేజ్ చేస్తూ కూర్చుంది తిరిగి.

తననవసరంగా లిఖితని పంపించింది.

తండ్రిలాగే ఆమెకూ తొందరెక్కువ. కొంపదీసి తను కూడా కేరళ వెళ్లిపోలేదు కదా..

అలా అనుకోగానే కేయూర గుండే ఒకడుగు క్రిందికి జారినట్లయింది.

కళ్ళలో నీళ్లు సుళ్లు తిరిగేయి.

“ఆంటీ!”

ఆ పిలుపు విని కేయూర కొంగుతో కళ్లు తుడుచుకుని గుమ్మంవేపు చూసింది.
ఎదురుగా ఎంకట్ నిలబడి వున్నాడు నవ్వుతూ.
అతన్ని చూడగానే ప్రానం లేచొచ్చినట్లయిందామెకు.
ఇదివరలో అతనికంత ప్రాముఖ్యమిచ్చేది కాదు. కేవలం లిఖిత స్నేహితుడిగానే గౌరవించేది. అదీ మనసులో మాత్రమే. పెద్దగా మాట్లాడే అవకాశమిచ్చేది కాదు.
కాని.. ఇప్పుడతనామెకు చాలా ఆత్మీయుడిగా గోచరించేడూ.
“వెంకట్, లిఖిత గాని ఫోను చేసిందా నీకు. అసలెలా వెళ్ళింది. ఆ రోజు ఫ్లయిట్ దొరికిందా?” అని అడిగింది కంగారుగా.
వెంకట్ ఆమెని నిశితంగా గమనిస్తూ “బ్రహ్మాండంగా దొరికింది.అసలు నేనెళ్ళకపోతే లిఖిత వెళ్లలేకపోయేది. నా బైక్ ఎక్కమంటే మొండికేసింది. నన్నిష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయినా నేను పట్టించుకోలేదనుకోండి. జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు చేర్చేను. ఈ పాటికి వాళ్ల డేడితో కబుర్లు చెబుతుంటుంది” అన్నడు.
“నిజంగానే లిఖిత జాగ్రత్తగా చేరుకుంటుందంటావా?” కేయూర సందేహానికి పకపక నవ్వాడు వెంకట్.
“లిఖితనింకా పసిపాపే అనుకుంటున్నారు మీరు. తనకన్నీ తెలుసు. మీకు చెబితే బాగుంటుందో లేదో కాని తను వెళ్తూ వెళ్తూ ఏం చెప్పిందో తెలుసా?” అంటూ కొద్దిగా సిగ్గుపడటానికి ప్రయత్నించేడు వెంకట్.
కేయూర అతనివైపు సందేహంగా చూసి “ఏం చెప్పింది?” అనడిగింది సౌమ్యంగా.
“మీక్కోపం వస్తుందేమో?”
కేయూర రాదన్నట్లుగా తలడ్డం ఊపింది.
“నన్ను వదిలి వెళ్ళలేనంటూ ఏడ్చింది. నన్నూ రమ్మంది. నేనాశ్చర్యపోయేను. తను నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పగానే నా కాళ్లలో వణుకు పుట్టింది. నా స్థానమెక్కడ? మీ అంతస్థెక్కడ? స్నేహానికవన్నీ లేకపోయినా… పెళ్ళికి చాలా అవసరం కదా ఆంటీ. అందుకే.. ఆ సంగతులు తర్వాత మాట్లాడొచ్చని తనని నచ్చచెప్పి పంపించేను.
అతను చెప్పింది విని నిజంగానే దిగ్ర్భాంతికి గురయింది కేయూర. లిఖితకి ఈడొచ్చింది. ఈడుతోపాటు వ్యక్తిత్వమొచ్చింది. ఒకవేళ లిఖిత మనసుకి వెంకట్ నచ్చితే కాదనడానికి తానెవరు?
కాని.. ఎందుకో ప్రతి రూపాయికి లిఖిత దగ్గర చేయి జాచే ఈ వ్యక్తిత్వం లేని పురుషుడు లిఖిత భర్త కావడానికి లోలోపల ఆమె మనసంగీకరించలేకపోయింది.
డోలాయమానంగా వున్న ఆమె మానసిక పరిస్థితిని గ్రహించేడు వెంకట్.
“లిఖితకి భర్త కావడానికి నేనర్హుణ్ణి కాదని మీరాలోచిస్తున్నది. ఆ సంగతి మీకన్నా నాకు బాగా తెలుసు. అందుకే మీరిచ్చి చేస్తానన్నా నేను చేసుకోను. ఆ విషయంలో వర్రీ కాకండి. అద్సరే! అసలింతకీ యింకా యింట్లో కూర్చున్నారేంటి? ఫ్యాక్టరీకి వెళ్లరా?” అన్నాడు నవ్వుతూ.
లిఖిత జాగ్రత్తగా వెళ్లిందని విని కేయూర మనసు ఒకింత ఊరట చెందింది.
“లిఖిత సంగతి తెలీక పిచ్చి పట్టినట్లయింది. నువ్వు చెప్పేవుగా. నాక్కాస్త రిలీఫ్‌గా వుంది. ఇంట్లో కూర్చుంటే చాలా బోర్‌గా వుంది. నేను ఫ్యాక్టరీకి బయల్దేరతాను” అంది కేయూర కాస్త తేలికపడిన మనసుతో.
“నన్ను కాస్త జగదాంబ సెంటర్లో వదిలేయండి” అన్నాడు వెంకట్.
కేయూర రేగిన జుట్టు సరిచెసుకుని, స్లిప్పర్స్ వేసుకుని బయటకొచ్చింది. ఆమెని వెంబడించేడు వెంకట్.
ఇంటికి తాళం వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని అవతలి వైపు డోర్ తెరిచింది. వెంకట్ ఎక్కగానే డోర్ మూసి ఎ.సి. ఆన్ చేసింది. చల్లని పిల్లతెమ్మెరలాంటి గాలి కారంతా పరచుకొని మనసుకి, శరీరానికి ఆహ్లాదం కలుగచేసింది క్షణాల్లో. వెంకట్‌కి ఎంతో అసూయనిపించింది.
డబ్బుంటే ఎడారిలో సముద్రాన్ని, సముద్రంలో భవనాన్ని సృష్టించుకోవచ్చు కాని.. ఈ డబ్బు అందరికీ అందుబాటులో వుండదు. ఒక ఆడది గర్వంగా, నిటారుగా కూర్చుని డ్రైవ్ చేస్తుంటే ఏమీ చేతానివాడిలా పక్కన కూర్చున్నాడు తను.
ఎందుచేత?
డబ్బులేక!
డబ్బు వలన పొందే సదుపాయాలు లేక!
కేయూర స్టడీగా కారుని డ్రైవ్ చేస్తోంది.
కారు మెత్తగా కదులుతోంది. గతుకుల రోడ్డులోని కుదుపుల్ని మింగి.
కేయూరని క్రీగంట చూస్తున్నాడు వెంకట్. తనొచ్చిన పని కాలేదు. ఇరవై వేలు కావాలని అడగాలని వచ్చేడతను. కాని ఆమెని చూస్తుంటే గొంతు పెగలటం లేదు. ఒకవేళ అడిగినా “ఎందుకు, ఏం పని?” అని అడక్కుండా అంత డబ్బిచ్చే పిచ్చి ఆడదానిలా కనిపించడం లేదామె అతని కళ్ళకి.
ఆమెలో ఏదో గొప్ప మెజెస్టీ వుంది.
నిజానికామె తల కూడా సరిగ్గా దువ్వుకోలేదు. కట్టింది నేత చీర. మెడలో సన్నని చెయిన్. ఎడం చేతికి టైటన్ వాచి. కుడి చేతికి ఒక బంగారు గాజు మాత్రమే వున్నాయి.
కాని.. చాలా శ్రద్ధగా తీర్చి దిద్దుకున్న వాళ్లకన్నా ఆమెలో గొప్ప ఆకర్షణ వుంది. బహుశ అది ఆమె స్వయంగా తనని తాను తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వంలోంచి పుట్టుకొచ్చిన శక్తి కావొచ్చు.
వెంకట్ ఆలోచనల్లో వుండగానే కారు బ్రేకుపడింది.
వెంకట్ ఉలిక్కిపడ్డట్లుగా చూశాడు.
“నువ్వు జగదంబా సెంటర్‌లో దిగుతానన్నావు కదూ?” అంది కేయూర.
“అవునాంటీ!” అంటూ గాభరాగా దిగేడు వెంకట్.
అతను దిగగానే కారు ముందుకి నడవబోతు ఏదో గుర్తొచ్చినట్లుగా రెండడుగులు వెనక్కి నడిపి”వెంకట్!” అంది.
నిరుత్సాహంగా పేవ్‌మెంటెక్కబోతున్న వెంకట్ తన పక్కన నిలబడ్డ ప్రషియన్ బ్లూ కలర్ మారుతీ థౌజండ్‌ని చూసి ఆశ్చర్యపోయేడు.
కేయూరవల్లి డోర్ తెరచి “వెంకట్, ఈ పాతికవేలు కొంచెం ఎల్లమ్మతోట బ్రాంచి ఎస్.బి.ఐ లో డిపాజిట్ చెయ్యి. నేను తిరిగెళ్లాలంటే పూర్ణా మార్కెట్ దాకా వెళ్లి కారు రివర్సు చెయ్యాలి. అక్కదంతా వన్‌వే ట్రాఫిక్” అంటూ బాంక్ బుక్, కాష్ అతని చేతికిచ్చింది.
వెంకట్ మొహం లాటరీ కొట్టినట్లుగా ఆనందంతో కళకళ్లాడింది.
“విత్ ప్లెషర్!” అంటూ డబ్బందుకున్నాడు వెంకట్.
కేయూర ఎక్సిలేటర్‌ని బలంగా తొక్కి కారుని ముందుకి పరుగు తీయించింది.
కారు కనిపించినంత సేపూ చూసి కనుమరుగవ్వగానే హుషారుగా ఈల వేస్తూ, కాష్ తీసుకొని బాంక్ వైపు నడిచేడు వెంకట్. అతని పని కూడా అదే బాంక్‌లో వుండటం విశేషం.

*****
సరిగ్గా సాయంత్రం ఆరుగంటల నలభై అయిదు నిముషాలకి హైద్రాబాద్ కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్ జాలార్‌పెయిట్‌లో బయల్దేరింది.

ఎస్పీ హరిహరన్, మిగతా రైల్వే పోలీసు సిబ్బంది లిఖితకి దగ్గరుండి వీడ్కోలిచ్చేరు. ఆమె వద్దని వారించినా టిఫిన్ పాకెట్స్, ఫ్లాస్కులో కాఫీ ఆమె సీటు పక్కన పెట్టేరు. హరిహరన్ ఆమెని ఆప్యాయంగా కౌగలించుకుని “విష్ యూ ఆల్ ది బెస్ట్ బేబీ! రిటర్న్‌లో నాకు తెలియజేస్తే మళ్లీ ఇదే స్టేషన్‌లో నిన్ను కలుస్తాను” అన్నాడు.

అలా చెబుతున్నపుడు అతని కళ్ళు వాత్సల్యంతో తడయ్యేయి.

రైలు కదిలింది. అతని చేతిలోని ఆమె చెయ్యి చిన్నగా జారి విడివడింది.

కంపార్టుమెంటు దూరమవుతుంటే కనిపించినంత సేపూ చెయ్యి వూపుతూనే వున్నాడు హరిహరన్.

లిఖిత హృదయం ఆర్ద్రమైంది.

భారంగా వచ్చి తన సీట్లో కూర్చుంది.

మనసులో ఇంకా తిరుంబత్తూరు గెస్టు హవుసు, జలబంధారి, హరిహరన్ ప్రేమ.. ముద్ర వేసుకొని హత్తుకున్నట్లుగా గుర్తొస్తున్నాయి. అంతా కలిసి పన్నెండు గంటల అనుబంధం .. అంతే!

కాని జన్మజన్మల బంధంగా అనిపిస్తోంది.

తన తాతగారతనికేం చేసేరో తెలీదు కాని.. ఈ ఊరుకాని ఊర్లో భాషేతర ప్రంతంలో, తనకి ఎంతో ఆదరణ, ఆప్యాయతని అందించేరు హరిహరన్.

లేశమాత్రమైన సహాయానికి వంశపారంపర్యంగా కృతజ్ఞతని చూపించిన హరిహరన్‌ని చూస్తుంటే .. ఒక పక్క తన సహాయం అందుకుంటూనే విషాన్ని గుమ్మరిస్తూ, విశ్వాసరహితంగా ప్రవర్తిస్తున్న వెంకట్ గుర్తొచ్చేడామెకు.

ప్రతిక్షణం మరణం వైపు పయనిస్తూన్న ఈ చిన్న జీవితాన్ని కొందరు అకారణ ద్వేషంతో రెచ్చిపోతూ, అబద్ధాలతో మోసగిస్తూ, క్షణక్షణం తమ నీచ ప్రవర్తనతో ఎదుటివాళ్లకి చులకనవుతూ సిగ్గు విడిచి బ్రతుకుతారెందుకో..

“మేడం!”

లిఖిత ఆలోచనల్లోంచి బయటపడి పక్కకి చూసింది.

“ఏంటంత తెగ ఆలోచిస్తున్నారు?” అంటూ నవ్వేడు జర్నలిస్టు.

“హరిహరన్‌గారి గురించి. ఆయన మన గురించి చాలా శ్రమపడ్డారు కదూ!” అంది లిఖిత.
జర్నలిస్టు తీసి పారేసినట్లుగా నవ్వి “మీరు మరీ సెంటిమెంటు ఫీలయిపోతున్నారేంటి? ఆయన జేబులో డబ్బులేవన్నా తీసిపెట్టేడేంటి? గవర్నమెంటు కార్లు, గవర్నమెంటు గెస్టుహౌసు, గవర్నమెంటు సబార్డినేట్స్. అయినా మీ తాతగారి వల్ల ఉద్యోగం సంపాదించేడు కాబట్టి. ఏదో నామ్ కా సర్వీసు చేసినట్లు నటించేడు. వెంటనే ఆయన గురించి మనసులోంచి తీసి పడేసి మన లోకంలో పడండి” అన్నాడు.
లిఖిత అతనివైపు అసహ్యంగా చూసింది.
“ఎంత గవర్నమెంటువే అయినా మనకాయన సేవ చేసి తీరాలన్న రూలేం లేదు. పైగా మా తాతగారేం సర్వీసులో లేరు. చెయ్యారగానే అన్నం పెట్టిన మనిషిని మరచిపోవడం సృష్టిలో బహుశ ఒక్క మనిషికే చేతనవుననుకుంటాను” అంది సీరియస్‌గా.
జర్నలిస్టు మొహం మాడింది.
“ఏదో నేను సరదాకన్నానండి బాబూ! అలా అగ్గి మీద గుగ్గిలమై పోకండి” అన్నాదు నవ్వడానికి ప్రయత్నిస్తూ.
కోయదొర, అయ్యప్ప స్వాములు మళ్లీ ఎక్కేరు.
లిఖిత ఒక ఐ.జీ మనుమరాలని కంపార్టుమెంటంతా తెలిసిపోయి చాలా మర్యాదగా చూడటం ప్రారంభించేరు.
కోయదొర లిఖితని ఎగాదిగా చూసి “మాంచి ఘనమైన జాతకం పెట్టది. కలక్టెరవుద్ది” అన్నాడు.
లిఖిత అతన్ని చిరాగ్గా చూసి “నువ్వింక జాతకాలు చెప్పడం ఆపకపోతే నువ్వు నిన్న కంపార్టుమెంటులో చేసిన గారడీ విద్య రహస్యాలు బయటపెడ్తాను” అంది.
“గారడీ యిజ్జెలా? అట్లనకు పెట్టా కళ్లు పోతాయ్! సమ్మక్క కోపగించేను” అన్నాడు గంభీరంగా.
“నువ్వు నిన్న జ్యోతినెలా నడిపించేవో నేనిప్పుడు చెబితే నా కళ్లు పోతాయో.. నీ వళ్లు చీరబడుతుందో చూద్దాం” అంది సవాలుగా.
అందరూ చిత్రంగా లిఖిత వైపు చూశారు.
కోయదొర మొహం పేలవమైపోయింది.
అయినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ “కోయదొరతో ఎకసెక్కాలాడకు”అన్నాడు.
“ఎకసక్కెం కాదు. ఎవరైనా ఒక కాపర్ కాయినుంటే ఇవ్వండి” అంది లిఖిత చాలెంజిగా.
అందరూ గబగబా జేబులు తడుముకున్నారు.
ఇక పరిస్థితి విషమిస్తుందని తెలిసి కోయదొర లేచి నిలబడి గుమ్మం దగ్గరకెళ్ళేడు.
“పారిపోతున్నట్లున్నాడు” అన్నాడు జర్నలిస్టు కంగారుగా.
“కొంపదీసి వెళ్ళే రైళ్ళోంచి దూకడు గదా, అన్యాయంగా చస్తాడు”అన్నాడొక అయ్యప్ప దీక్ష తీసుకున్న వ్యక్తి.
లిఖిత లేచి నిలబడి గుమ్మం వైపు చూసింది.
కోయదొర లిఖితకి రెండు చేతులెత్తి జోడించేడు.
లిఖిత తెల్లబోయినట్లుగా చూసిందతనివైపు.
“కూటికోసం కోటి విజ్జెలు తల్లీ. ఏదోమా పెద్దోల్లు మాకియి నేర్పి పొట్టపోసుకోమన్నారు. నువ్వంతోడివవుతావ్, ఇంతోడివవుతావని జెప్పి ఏదో నాల్గు పైసలు సంపాదించ్కుంటున్న. నా పొట్ట కొట్టమాకు. సదువుకొని, నేయాన్ని తల్లకిందులు జేసి, నీతిమాలి బతుకుతున్న మీ పట్టణాల్లోని జనం కన్నా నేను సెడ్డోణ్ణి కాదు” అన్నాడు చిన్నగా.
లిఖితకి అతను అన్న దాంట్లో అబద్ధమేమీ కనిపించలేదు. అతన్నల్లరి పెట్టడం వృధా అయిన పనిగా భావించి “వచ్చి సీట్లో కూర్చో” అంది తనెళ్ళి సీట్లో కూర్చుంటూ.
ఆమె రాగానే “నా దగ్గరొక రాగి బిళ్ల వుంది. జ్యోతిని నడిపించంది” అనడిగేడొక అయ్యప్ప భక్తుడు.
లిఖిత వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
లిఖిత చిన్నగా నవ్వి “ఊరికే సరదాకన్నాను. నాకేం రాదు.” అంది.
జర్నలిస్టు తెల్లబోయినట్లుగా లిఖితవైపు చూసి “అదేం, అలా వెనక్కు తగ్గిపోతున్నారు. జ్యోతెలా నడుస్తుందో నాకు చెప్పారు కదా~” అన్నాడు.
“అది నీలాంటివాళ్ల కోసం. చేతిలో పెన్నుంది కదాని.. రేప్పొద్దున పేపరు కొక మసాలా వార్తందించి పది రూపాయలు సంపాదించుకోవాలంటే నీలాంటి వాళ్ల కొసం వెలుగుని పంచే శక్తి లేకపోతే తప్పు లేదు కాని చీకటిని వ్యాపింపజేయడం మాత్రం క్షమించరాని నేరం” అంది లిఖిత.
వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో మిగతా వారికి అంతుబట్టలేదు.
అందరి దృష్టి మళ్లించడానికి “అప్పుడే బాగా చీకటి పడిందే టిఫిన్ చేద్దామా?” అంది తన దగ్గరున్న టిఫిన్ పేకట్స్ అందరికీ పంచుతూ.
“ఒక్క మనిషికిన్ని పంపేరేంటి?” అన్నాడొకాయన ఆశ్చర్యంగా.
“ఆయన పెద్ద ఆఫీసరు. ఈవిడొక పెద్దాఫీసరు మనుమరాలు. అందుకే మర్యాదలు పెద్ద లెవెల్లోనే వున్నాయి” అన్నారు మరొకరు.
” ఆ మాటలన్నీ ఎందుకు? అన్నదాతా సుఖీభవ! అన్నారు మన పెద్దలు. ఈ టిఫిన్స్ తిని ఆయన ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకోండి. అదే పదివేలు!” అంది లిఖిత.
అందరూ టిఫిన్స్ చేసి బెర్తులు వాల్చుకున్నారు.
ఎంత వద్దన్నా లిఖిత బెర్త్ కూడా పరచి మర్యాదలు చేసేరు.
లిఖిత బెర్త్ ఎక్కి పడుకొని నిద్రపోవాలని ప్రయత్నించింది కాని.. ఎంతకీ నిద్రపట్టలేదు. పదే పదే తండ్రి గుర్తొస్తున్నాడు.
ఇప్పుడాయన ఎక్కడున్నారో? ఎలా వున్నారో.
అసలు తనాయన్ని చేరుకోగలదా?
ఆ పరభాషా రాష్ట్రంలొ తనకెవరైనా సహాయపడతారా?
అప్పూడు గుర్తొచ్చిందామెకి తను కనీసం తండ్రి ఫోటో ఆయినా చూడనేలేదని ఎలా ఆయన్ని గుర్తించటం?
ఈ విషయం తనకి తల్లికూడా గుర్తు చేయలేదు.
లిఖిత మనసు ఎంతగానొ కృంగిపోయింది బాధతో.
ట్రెయిన్ కొచ్చిన్ చేరేసరికి అయిదు గంటలవ్వొచ్చు. అప్పటికింకా తెల్లావారదు. తను తిన్నగా భగవతి కోవెలకి వెళ్లాలా? ఎక్కడైనా బస చెయ్యాలా?
లిఖిత ఆలోచిస్తూ కళ్లు మూసుకుంది.
ఎక్కడో గుప్పున వాసన.
అది ఖచ్చితంగా లిక్కర్ వాసనే!
ఆమె క్రింద పడుకొన్న కోయదొర వైపు చూసింది.అతడు గాఢ నిద్రలో వున్నాడు. అయ్యపస్వామి దీక్షలో వున్న ఒక వ్యక్తి టాయిలెట్‌కి వెళ్లి వచ్చి క్రింద బెర్త్ మీద పడుకున్నాడు.
కాని.. అతన్ననుమానించడానికి భయమేసింది లిఖితకి
అయ్యప్ప దీక్ష చాలా కఠినతరమైందంటారు. చాలా నిష్టాగరిష్టమైందంటారు. అతనెందుకు తాగుతాడు. అని మనసులోనే లెంపలేసుకుంది లిఖిత.
మరి కొంతసేపటికామెకు కొద్దిగా నిద్రపట్టేసింది. ట్రెయిన్ అతి వేగంగా కదిలిపోతూ ఎక్కడ పట్టాలు తప్పుతుందోనన్నంత వేగంగా పరిగెత్తుతోంది.
ఒక్కసారి ఆమె మీద ఏదో పాకినట్లయి ఉలిక్కిపడి కళ్ళు తెరచింది. ఇందాక అయ్యప్ప దీక్షలో వున్న వ్యక్తి ఆమె మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు.
లిఖిత భయంతో కెవ్వున అరిచింది.
అంతే!
వెంటనే దాదాపు కంపార్టుమెంట్‌లో అందరూ లేచి పోయేరు. లైట్లు వెలిగాయి.
“ఏం జరిగింది?” అనడిగేరందరూ ఆందోళనగా.
“ఇతను.. ఇతను.. ” అంటూ వణుకుతూ నల్ల డ్రెస్సులో వున్న ఆ వ్యక్తిని చూపించింది లిఖిత.
“నేనా.. నేనేం చేషేను. బాత్రూంకి వెళ్దామని .. లేషానంతే!” అన్నాడతను.
అతను తాగి వున్నాడని అక్కడున్నందరికీ బాగా అర్ధమైపోయింది.
“అబద్ధం. నా మీద చెయ్యేసేడు. తాగాడు కూడా!” అంది లిఖిత్ ఔద్రేకమైన స్వరంతో.
దీక్షలో వుండగా అతను చేసిన అరాచకాన్ని చూసి అందరూ తెల్లబోయేరు. మిగతా అయ్యప్పలు తాము కూడా తప్పు చేసినట్లుగా తలలు దించుకున్నారు.
“నిన్ననే నన్ను ఆడోళ్ళని వశం చేసుకునే వేరుంటే ఇవ్వమని నా ఎంబడి పడ్డాడు. అప్పుడే అనుకున్నా ఈడి కళ్ళకి పొరలు గమ్మేయని” అన్నాడు కోయదొర అతనివైపు చీధరగా చూస్తూ.
అతని మాట విని అందరూ నిశ్చేష్టులయ్యేరు.
వెంటనే కోపంతో అతన్ని కంపార్టుమెంటులోంచి బయటకి నెట్టేయబోయేరు.
“ఈ చీకట్లో ఎక్కడికెళ్తాడులెండి. అతను దీక్షలో చేసిన పాపానికి ఇంతకంటే అవమానం, శిక్ష ఏం కావాలి. నలుగురిలో అతని పరువు తీసేడయ్యప్ప!” అన్నాడొక దీక్షలో వున్న స్వాములు.

ఇంకా వుంది…

బ్రహ్మలిఖితం .. 11
రచన: మన్నెం శారద
అతను తలదించుకుని టాయిలెట్స్ దగ్గర నిలబడ్డాడు.

కోయదొర లిఖిత వైపు చూసి చిరునవ్వుతో “మేం కూడా కూటి కోసం అబద్ధాలడతాం. కాని మా సమ్మక్క జాతరలు నిష్టగా చేస్తం. పూజలో వుంటే పెళ్ళాన్ని కూడా తల్లిలానే చూస్తం. ఇపుడు చెప్పు. పుస్తకల్లో చ్ అదివి నాగరికత తెలుసుకునే మీ బస్తీ జనాలు పరగడుపునే పాపాలు చేస్తారా లెదా? ఇంతోటీ గోరాలు మా అదవిలో చిత్తకార్తి ఊరకుక్కలు కూదా సెయ్యవు!” అన్నాడూ.

లిఖిత అతనికి జవాబు చెప్పాలేకపోయింది.

********
టైము పదకొండు గంటలు దాటింది.

కాలం గడిచే కొలది బాంక్‌లో రద్దీ పెరిగిపోతున్నది.

ఈశ్వరి మనసు మనసులో లేదు.

ఓ పక్క పని చేస్తున్నా మనసులో మాత్రం ఓంకారస్వామి చెప్పిన మాటలు నిజమవుతాయో లేదోనని ఆందోళనగా చూస్తోంది.

ఒకవేళ కొంపదీసి నిజమయితే! అలా అనుకోవడమే తరువాయి ఈశ్వరి శరీరం జనవరి నెలలో జమ్మూలో చిక్కుపడినట్లుగా బిగుసుకుపోయింది.

క్షణక్షణం అతిప్రయాస మీద వెనక్కి జరుగుతున్నాయి.

ఓంకార స్వామిం చెప్పింది ‘ఉత్త హంబక్’ అనే నమ్మకం మనసులో కొద్ది కొద్దిగా ఏర్పడి బలపడసాగింది.

లంచ్ ముగిసింది.

ఈశ్వరి లెడ్జర్ బుక్ ముందేసుకుని ఫిలప్ చేస్తోంది.

“ఏమండి?”

ఈశ్వరి తెలెత్తింది.

వెంకట్ నిలబడి వున్నాడక్కడ.

“ఎవరు మీరు?” ఈశ్వరి తడబాటుగా అడిగింది.

“మీ పేరు ఈశ్వరి కదూ!” అతనామె ప్రశ్నకి జవాబు చెప్పకపోగా ఎదురు ప్రశ్నించేడు.

అవునన్నట్లుగా తలాదించింది ఈశ్వరి.

“మొన్న కేష్ డ్రా చేసినప్పుడు ఇరవైవేలెక్కువిచ్చేసేరు. వెంటనే రావడానిక్కుదరలేదు. ఈపాటికి మీ ఉద్యోగం ఊడిందేమోనని భయపడ్డాను తీసుకోండి” అతను కాష్ వున్న కవరు చేతికందిస్తుంటే ఈశ్వరి కొయ్యబారిపోయింది.
భయంతో, ఆశ్చర్యంతో ఆమె కనుపాపలు పెద్దవి కావడం క్రీగంట గమనించి కూడా గమనించనట్లుగా వెనుతిరిగేడు వెంకట్.
అంతవరకు చేష్టలు దక్కి ప్రాణం కోల్పోయినట్లుగా నిలబడీపోయిన ఈశ్వరి ఒక్కసారి “ఏమండీ!” అంటూ తేలు కుట్టినట్లుగా కెవ్వున అరిచింది.
బాంక్ ఎక్జిట్ దాటుతూ అతను వెనుతిరిగి చూసి “పిలిచేరా ?” అనడిగేడు అమాయకంగా.
అప్పటికే ఈశ్వరి రివ్వున పరిగెత్తుకెళ్ళి అతని దగ్గరగా నిలబడి “మీ పేరు? ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు?” అనడిగింది రొప్పుతూ.
ఆ దృశ్యాన్ని బాంక్‌లోని తన సహోద్యోగులు ఆసక్తిగా గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఆమెకి తోచడం లేదు.
“వెంకట్. ద్వారకానగరి. బిజినెస్” అన్నాడు వెంకట్.
“మీ ఎడ్రస్ రాసిస్తారా, మీతో మాట్లాడాలి!” అంది ఈస్వరి.
వెంకట్ కొంత ఇబ్బంది నటించి “అంతవసరమంటారా?” అనడిగేడు.
“చాలా అవసరం” అంది ఈశ్వరి.
“అయితే ఒక పని చెయ్యండి. సాయంత్రం ఆరుగంటలకి రామకృష్ణా బీచ్ దగ్గరున్న వేంకటేశ్వర స్వామి గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను రండి” అంటూ వెళ్ళిపోయేడు వెంకట్.
వెళ్తున్న అతని వైపు మైమరపుగా చూస్తూ సీట్లో కొచ్చిందామె.
అంతసేపూ ఆమెనే గమనిస్తున్న ఆమె కొలీగ్ లావణ్య “ఏం జరిగింది ఎవరతను?” అనడిగింది ఆశ్చర్యంగా.
“మొన్న కాష్ తగ్గింది కదా! ఇతనికే ఇచ్చేసేనట!” అంటూ పేకెట్ చూపించింది.
లావణ్య పేకెట్ తెరచి “తగ్గింది ఇరవై వేలేగా పాతికిచ్చేడేంటీ? నిన్ను చూసి మైమరచిపోయేడా?” అంది కన్ను కొడుతూ.
ఆ మాటకే ఈశ్వరి బుగ్గలెర్రబడ్డాయి. “చీ.. ఊరుకో” అంది సొట్టబడిన బుగ్గలలో నవ్వు దాచుకుంటూ.
ఈసారి తెల్లబోవడం లావణ్య వంతయింది.
ఏ చిన్న జోక్ వేసినా సీరియస్సైపోయే ఈశ్వరి ఈ రోజు తన జోక్‌నింత స్పోర్టివ్‌గా రిసీవ్ చేసుకోవడం ఆమెకి చాలా ఆశ్చర్యాన్ని కల్గించింది.
“సర్లే. ముందెళ్ళి ఆ ఇరవై వేలూ మానేజర్‌గాడి మొహాన కొట్టు. చిన్న తప్పు దొరికితే ఉద్యోగాలు పీకేయాలని మహా సరదా పడిపోతుంటాడు శాడిస్టు వెధవ!” అంది లావణ్య.
ఈశ్వరి తలూపి మిగతా అయిదువేలూ లావణ్య దగ్గర పెట్టి మానేజర్ దగ్గరకెళ్ళి ఇరవై వేలూ యిచ్చి గాలి పీల్చుకుంది.
మానేజర్ వాటిని జమ చేసుకొని “ఎక్కడివి? ఏదైనా నగమ్మేసేవా?” అడిగేడు కుతూహలంగా.
“లేదు లెండి. మావారడ్జెస్ట్ చేసేరు. నాక్కాస్త పర్మిషనిస్తారా? ఇంటికెళ్లాలి” అనడిగింది.
“ఓకె.. ఓకె..” అన్నాడాయన.,
“మావారడ్జెస్ట్ చేసారని చెప్పావేంటే” అని ఆలోచించుకుంటూ సీటు కొచ్చి బాగ్ సర్దుకుంటుంటే అయిదువేలు ఈశ్వరి కందిస్తూ అడిగింది లావణ్య.
“చెక్కేస్తున్నావా?”
“ఆ!” అంది ఈశ్వరి నవ్వుతూ.
“అద్సరే! ఆ మహానుభావుడి కసలు మన దగ్గర ఎకౌంటుందా?” అనడిగింది.
దాంతో ఈశ్వరికి కొద్దిగా అనుమానమేసింది.
******
వేంకటేశ్వర్రావులు, వెంకట్రావులు, వెంకట సుబ్బారావులు, రామరావులూ ఇలా చాలా ఎకౌంట్లున్నాయి. కాని కేవలం వెంకట్ వున్నట్లుగా గుర్తు లేదు. ఒకవేళ్ అతను పూర్తి పేరు చెప్పలేదేమో.
ఆలోచిస్తూ బ్యాంక్ బయటకొచ్చి బీచ్ కెళ్ళే బస్సుకోసం నిలబడింది బస్టాండులో.

******

ఇంకా తెలవారకుండానే ‘కొచ్చి’ అని ప్రస్తుతం పిలవబడే కొచ్చిన్‌లో రైలాగింది. లిఖిత రైలు దిగి ఒక ప్రక్కగా నిలబడింది వెంటనే ఏం చేయాలో తోచక. దాదాపు రైలంతా అయ్యప్ప భక్తులే వున్నారు. స్టేషనంతా చూస్తుండగానే ఒక నల్లని తెర కప్పినట్లయిపోయింది వాళ్లతో. స్టేషన్ చాలా పెద్దదయిన అపురాతనంగా వుంది. ఆమెకి దణ్ణం పెట్టి వెళ్ళిపోయేడు కోయదొర.

జర్నలిస్టు మాత్రం ఆమెని వీడకుండా పక్కకొచ్చి నిలబడి “ఎక్కడికెళ్లాలి?” అనడిగేడు. లిఖిత అతని వైపు చురుగ్గా చూసి “నా సంగతి మీకు దేనికి? మీ దారిన మీరు వెళ్ళండి” అంది.

“సారీ! మీతో వస్తే మర్యాదలు బాగా జరుగుతాయని ఆసక్తి” అన్నాడు నవ్వుతూ.

“ఇక్కడ నాకేం ఇన్‌ఫ్లూయెంస్ లేదు. వెళ్లండి” అంది లిఖిత.

“మరీ నన్నొక పురుగులా విదిలించేయకండీ. ఎంతయినా మగాణ్ని. కాస్త తోడుంటే మీకు ఇబ్బందులుండవు. నన్ను మీతో రానివ్వండీ. ప్లీజ్!” అన్నాడూ.

లిఖిత అతని మాటని పూర్తిగా కాదనలేకపోయింది.

ఈ రాష్ట్రంలో తనతో కాస్త తెలుగు మాట్లాడేవాడతనే.

“సరే పదండి!” అంది.

“దట్స్ గుడ్!” అంటూ ఆమె బాగ్‌ని కూడా అందుకున్నాడతను. ఇద్దరూ టాక్సీలొ ఎం.జి రోడ్డులో వున్న ద్వారక హోటల్ కెళ్ళేరు. కొచ్చిన్ చూస్తుంటే కొద్దిగా కాకినాడ వాతావరణం కనిపించింది. అక్కడ డబుల్ రూం బుక్ చేసింది లిఖిత. అప్పటికే బాగా తెల్లారింది.

వెంటనే కాఫీలు తెప్పించింది.

ఇద్దరూ కాఫీ తాగాక “మీకేమన్నా పనులుంటే స్నానం చేసి ముగించుకు రండి” అంది లిఖిత.

అతను బుద్ధిగా తలూపేడు.

అతను స్నానం చేసేక లిఖిత వెళ్ళి షవర్ ఓపెన్ చేసుకొని స్నానం చేసింది. నీళ్ళు జల్లుగా మీద పడుతుంటే మనసు హాయిగా ఫ్రెష్‌గా తయారవ్వసాగింది. ఆ హాయిని కోల్పోవడానికిష్టం లేక లిఖిత దాదాపు అరగంటసేపూ స్నానం చేస్తూనే వుంది. ఇంకా ఇంకా చేయాలనిపించినా తానొచ్చిన పని గుర్తొచ్చి స్నానం ముగించి బట్టలు వేసుకొని బయటకొచ్చింది.

రూం తలుపు దగ్గరగా వేసుంది. అతను బయటకెళ్ళి నిలబడినట్లున్నాడు.

తలుపు బోల్ట్ వేసి చీర కట్టుకుంది. కేరళలో చాలా దేవాలయాల్లోకి స్త్రీలని చీర తప్ప మరో డ్రెస్సులతో, మగవాళ్లని షర్టులతో రానివ్వరని ఆమె ఎక్కడో చదివినట్ళు గుర్తు.
తల దువ్వుకొని బాగ్ అక్కడే పెట్టి బయటకొచ్చి కారిడార్‌లో జర్నలిస్టు కోసం చూసింది. అక్కడతను కనిపించలేదు. అతను క్రిందకు ఎళ్లి నిలబడుండొచ్చని ఆమె తన హేండ్‌బాగ్ కోసం చూసింది. అదెక్కడా కనిపించకపోవడంతో ఆమె కంగారుపడి మంచం మీద, టేబుల్ మీద అన్ని ప్రాంతాలూ వెదికించి. బాగ్ దొరకలేదు.
ఆమె హతాశురాలయిపోయింది.
గబగబా రూం తాళం వేసి క్రిందకొచ్చి జర్నలిస్టు కోసం అంతటా చూసింది.
“ఏం జరిగింది?” అనడిగేడు బేరర్ ఒకడు ఇంగ్లీసులో, ఆమె ఆందోళన చూసి.
“నా మనీ బాగ్ పోయింది. నాతో వచ్చిన వ్యక్తిని చూశారా?” అనడిగింది లిఖిత ఆందొళనగా.
“అతను ఆటోలో వెళ్ళిపోవడం చూసాను. అతను మీకేం కాడా?” అనడిగేడతను ఆశ్చర్యంగా.
“జస్ట్ హీ యీజే ట్రెయిన్ మేట్” అంది లిఖిత. అప్పటికే ఆమె కళ్ళలో నీళ్ళు నిలిచేయి.
“యూ ఆరే ఎడ్యుకేటెడ్ గాల్, హౌ డుయు బిలీవ్ ఏ స్ట్రేంజర్ మాడం. ఇట్సాల్ రైట్. డోంట్ వర్రీ. లెటజ్ ఇంఫార్మ్ ది థింగ్స్ టు అవర్ హోటల్ మానేజర్!” అన్నాడతను.
లిఖిత తలూపి అతనితో మానేజర్ దగ్గరకెళ్ళి జరిగిందంతా చెప్పింది.
“మీరు ఖంగారు పడకండి. పోలీస్ రిపోర్టిద్దాం. ఇన్ ద మీన్‌వైల్ మీరు కావాలంటే మీ ఇంటికి ఫోన్ చేసి టి.ఎం.ఓ చెయమని చెప్పండి” అన్నాడతను.
వేరే రాష్ట్రంలో వాళ్లు చూపిస్తున్న ఆదరణ, సహృదయతలకి లిఖిత కళ్ళు వర్షించేయి. కన్నీటిని తుడుచుకుంటూనే ఇంటీకి డయల్ చేసింది. ఎంతకూ లైన్ దొరకలేదు.
ఆమె నిస్సహాయంగా మానేజర్ కేసి చూస్తోంది.
“ఇట్స్ ఓకే. ఆందోళన చెందకండి.ముందు టిఫిన్ చేసి మీరొచ్చిన పని చూసుకోండి. ఈ అయిదొందలూ వుంచుకోండి.” అన్నాడు తన పాకెట్ లోంచి డబ్బు తీసిస్తూ.
లిఖితకి ఆత్మాభిమానమడ్డమొచ్చింది. ఎవరికైనా ఇవ్వడమే కాని ఎవరి దగ్గరా తీసుకోవడమెరుగని ఆమె మనసు ఆ డబ్బు తీసుకోడానికెంతగానో సిగ్గుతో కుంచించుకుపోయింది.
“ఫర్వాలేదు తీసుకోండి. ఇంటినుండీ డబ్బు రాగానే ఇచ్చేద్దురుగాని. ట్రీట్ మీ ఏజ్ యువర్ ఫ్రెండ్. ప్రపంచంలో అందరూ నీచులూ, మోసగాళ్ళే వుండరు” అన్నాడతను మెత్తగా.
“థాంక్స్” అంటూ డబ్బందుకుంది లిఖిత.
రెస్టారెంట్లో మరో కప్పు కాఫీ తాగి భగవతి టెంపుల్ అడ్రస్ తెలుసుకుని ఆటోలో అక్కడికి చేరుకుంది.
పెద్ద సరంభీ పెంకుటిల్లులా వున్న ఆ గుడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది మొదట. గుడి బయట గోడకమర్చిన ఇనుప బద్దెల మీద ప్రమిదల్లో దీపాలు వెలుగుతున్నాయి. లోపలికెళ్ళి స్లిప్పర్స్ చెట్టు పక్కగా పెట్టి గుడిచుట్టూ ప్రదిక్షిణాలు చేసి గర్భగుడి ముందుకొచ్చింది. అక్కడ కూడా లోపల వేలాది ప్రమిదలతో కొమ్మల్లా వున్న ఇత్తడి కుందెలలో దీపాలు వెలుగుతున్నాయి. కాంతి చెదరి అమ్మవారి మీద పడినప్పుడు అమ్మవారి వంటిమీద నగలు తళుక్కుమంటున్నాయి. పూజారి కూడా మన పూజారిలా లేడు. తెల్లటి లుంగీ పంచె, వెనక్కు దువ్విన పల్చని జుట్టు, నుదుటున అడ్డ విబూధి నామాలు, నల్లని శరీరం .. అతనందరికీ తులసి దళాలు వేసిన నీటిని తీర్థంగా ఇచ్చేడు. తర్వాత చందనం, పసుపు కలిపిన చిన్న చిన్న ముద్దల్ని చేతిలో పెట్టేడు. దాన్నేం చేసుకోవాలో తెలీక లిఖిత అందరివైపూ చూసింది. వాళ్లందరూ దాన్ని నుదుట బొట్టులా పెట్టుకుంటున్నారు. లిఖిత కూడా వారిననుసరించింది.
ఆ రోజు శుక్రవారం.
గుడి రద్దీగానే వుంది.
ప్రొద్దుటే తల స్నానాలు చేసి, తెల్లని సాంప్రదాయపు ఓణీ తీరు కట్టుతో ఆడవాళు, పైన ఆచాదన లేకుండా లుంగీలతో మగవాళ్ళు భగవతిని సందర్శించుకుంటున్నారు.
ఒక్క ఘంటారావన తప్ప ఒక్క చిన్న శబ్దం కూడా లేదక్కడ. అందరూ అమ్మవారిని సందర్శించుకోవడానికి గుడికి వచ్చేమన్న భావన తప్ప ఒకర్నొకరు పలకరించుకోవడాలు, కబుర్లూ లేవు.
అంతే కాదు. మన వైపులా దద్దోజనాలూ, చక్కెర పొంగళ్లూ, పులిహోరలూ ప్రసాదాల్లా పెట్టడం లేదు. చాలా నిరాడంబరంగా, నిర్మలంగా జరుగుతున్నది పూజావిధానం.
లిఖిత గుడి ప్రాంగణంలో ఓ పక్కగా కూర్చుంది.
మరో గంటలో గుడిలో రద్దీ తగ్గింది. పూజారి నిదానంగా బయటకొచ్చి నిలబడ్డాను.
లిఖిత లేచి నమస్కరించింది.
అతను ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా దూరం నుండే చెయ్యెత్తి అభయమిచ్చినట్లుగా ఊపేడు.
లిఖిత అతని దగ్గరగా వెళ్లి “నేను హైద్రాబాదు నుండి .. మీనన్ పంపేరు మీ దగ్గరకి.. ” అంది సైగ చేస్తూ.
“నా దగ్గరికా?” అన్నాడతను తెలుగులో.
తెలుగు వినగానే ఆమె ప్రాణం లేచి వచ్చినట్లయింది.
“మీకు తెలుగొచ్చా? మీ పేరు కుట్టికారనే కదూ!” అంది.
అతను తల పంకించి “వచ్చు నేను కొన్నాళ్ళు ఆంధ్రాలో వున్నాను. ఇంతకీ ఏ మీనన్ పంపించేడు నిన్ను?” అనడిగేడు.
లిఖితకెలా చెప్పాలో తెలియలేదు.
“ఆయన మా నాన్నగారి స్నేహితుడు. ప్రస్తుతం హార్ట్ డిసీస్‌తో హాస్పిటల్లో వున్నారు. మా నాన్నగారి పేరు కార్తికేయన్”.
కుట్టికారన్ ఆమె వైపు అదోలా చూసి “రా, ఈ పక్కన కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాడు తను ముందుకి నడుస్తూ.
లిఖిత అతన్ననుసరించింది.
ఇద్దరూ గుడి ప్రాంగణంలో వున్న మరో మంటపంలో కూర్చున్నారు.
“ఇప్పుడు చెప్పు. మీ నాన్నని వెదుక్కుంటూ వచ్చేవా? ఆయన రెండ్రోజుల క్రితమే నా దగ్గర్కొచ్చి వెళ్ళేరు”.
ఆ మాట వినగానే లిఖిత మొహంలో ఆనందం చోటు చేసుకుంది.
“మీ దగ్గర కొచ్చేరా? ఇప్పుడెక్కడున్నారు?” అనడిగింది ఆత్రుతగా.
“తెలియదు” అతని జవాబు వినగానే ఆమె మొహంలో వర్షరుతువులో వచ్చిన ఎండలా సంతోషం వెంటనే మాయమయ్యింది.
కుట్టికారన్ అది గమనించేడు.
“నేను చెప్పి చూశాను. అతని ప్రయత్నం ప్రయోజనం లేనిదని. చెడు దాపురించినవాళ్లకి హితం చెవికెక్కదు. మగవాడికెప్పుడూ మంచిని చెప్పే తల్లి కాని, భార్య కాని వుండాలి. స్త్రీ శక్తిస్వరూపిణి. కాని ఆ స్త్రీ రాక్షస గుణాలతో చెడు చెప్పిందంటే మగాది బతుక్కి నిష్కృతుండదు. మీ అమ్మగారు ఆయన్ని వెళ్లనివ్వకుండా వుండాల్సింది.”
లిఖిత మొహం మ్లానమయింది.
“ఆయన చాలా సంవత్సరాలుగా మాతో లేరు” అంది మెల్లిగా.
కుట్టికారన్ అర్ధమైనట్లుగా తల పంకించి “అతను వెళ్ళింది నీచోపాసకుల దగ్గరకి. నువ్వెలా వెళ్తావు! ఆడపిల్లవి!” అన్నాడు జాలిగా.
“ఎలాగైనా నా తండ్రిని రక్షించుకోవాలి. ప్లీజ్! నేను పుట్టేక ఆయన్ని చూడలేదు” అంది లిఖిత చేతులు జోడిస్తూ.
కుట్టికారన్ క్షణం సేపు కళ్ళు మూసుకుని వేళ్ళని లెక్కలు కడుతున్నట్లుగ్లా అడించి “నువ్వు బయలుదేరిన వేళ మంచిది కాదు. నీ కడుగడుగునా ఆటంకాలు ఈపాటికే వచ్చి వుండాలి!” అన్నడు.
లిఖిత ఆశ్చర్యంగా చూసింది.
“నువ్వు నన్నొక మోసగాడనుకొంటున్నావు కదూ! అదేం కాదు. నేను ఈ గుడి ప్రాంగణంలో కూర్చుని నాకు తోచింది చెబుతాను. కావాలని ఏదీ చెప్పను. బహుస అమ్మ నాచేత ఈ మాటలు పలికిస్తుంటుందేమో నాకు తెలియదు. నేనిలా చెప్పినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోను” అన్నారాయన.
“దేవుడున్నాడంటారా?”
లిఖిత ప్రశ్నకి అతను పకపకా నవ్వాడు.
లిఖిత అతనివైపు తెల్లబోయినట్లుగా చూసింది. “లేడనడానికి నిదర్శనముందా?”అనడిగేడు నవ్వుతూనే.
“మీకెప్పుడైనా కనిపించేడా?”
“ఎలా కనిపిస్తాడు. నిర్వికారుడాయన”.
“మరి గుడిలో ఆ రూపం?”
“ఒక దివ్య శక్తికి మనం కల్పించుకొన్న ఆకృతి. మనం మన అత్మీయుల్ని తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు అని వరుసలతో విభజించుకోలేదూ! వాళ్లందర్నీ మనం వివిధ వరుసలో ప్రేమిస్తున్నాం కదా. ప్రేమ మాత్రం ఒక్కటే కదా. అలానే భగవంతుడికి శతకోటి పేర్లు, ఆకారాలు ఏర్పరచుకొని పూజిస్తున్నాము. ఒక్క మాటలో నిజం చెప్పాలంటే మన శక్తికన్నా అతీతమైన ప్రతి శక్తిని దైవంగా భావించి పూజించడం మానవుడు అలవరచుకొన్నాడు. అద్సరే. మనం దేవుడున్నాడా లేడా అని తర్కించే అంత తీరికగా లేము. ముందు మీ నాన్నగారి జాడ తెలుసుకోవాలి.” అంటూ ఆయన లిఖిత వైపు చూశాడు.
“అవును” అంది లిఖిత ఆందోళనగా
“ఈ రాష్ట్రం చాలా చిత్రమైంది. అందమైంది కూదా. కాని గనులలో విలువైన వజ్రాలు, బంగారంతో పాటు విషనాగులు కూడా వున్నట్లు ఈ సుందరమైన అక్షరాస్యులున్న ఈ కేరళలో కొంతమంది క్షుద్రోపాసకులు, చేతబదులు, నీచపూజలు చేసే వారు కూడా వున్నారు. మీ నాన్నగారిలా మానసికంగా బలహీనులైన వ్యక్తుల్ని, అడ్డదారిన పైకి రావాలనుకునే మనుషుల్ని వాళ్లు వశపరుచుకుంటారు.”
“అసలు చేతబడులు ఉన్నాయంటున్నారో, లేవంటున్నారో కూడా నాకర్ధం కావట్లేదు” అంది.
మళ్ళీ పకపకా నవ్వేడు కుట్టికారన్.
“లేవు. ముమ్మాటికీ లేవు. ఇదంతా మనిషి బలహీనతలతో కొంతమంది ఆడుతున్న నాటకం. మనిషి నరాలు పట్టుదప్పినప్పుడు తప్పుడు అలవాటులతో మానసికంగా క్షీణించినపుడు కొన్ని భ్రమలకి లోనవుతాడు. అప్పుడు తన తప్పుల్ని, లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకు నన్నెవరో చేతబడి చేసేరని చెప్పుకుని ఇతరుల జాలి సంపాదించాలని ప్రయత్నిస్తాడు. అలాంటప్పుడు అతని పక్కనున్నవారు ఆ అవకాశాన్ని తమ ప్రయోజనాలకి వాడుకోటానికి తమ శత్రువులు ఆ పని చేసేరని అతని మెదడులో విషం నూరి పోస్తారు. అసలే మానసికంగా బలహీనమైన ఆ వ్యక్తి వెంటనే చేతబడులు తీసే వ్యక్తిని ఆశ్రయిస్తాడు. అతడు కూడా ఇతని బలహీనతతో ఆడుకుంటాడు. దాదాపు ఇతన్ని తమ మాటలతో పిచ్చివాణ్ణి చేస్తారు. ఇదంతా మనిషి సైకాలజీ మీద ఆడుతున్న ఒక గొప్ప నాటకం”
“ఇప్పుడు మా నాన్నగారి సంగతి!”
“అక్కడికే వస్తున్నాను. ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ఇలాంటి వాళ్లున్నారు. ఒకటి మున్నార్ అడవిలో. రెండోది టేక్కాది ప్రాంతాలలో. మూడోది శబరిమలై వెళ్ళే త్రోవలో పంచా దాటి వెళ్టే అరన్ మూలా అనే చొట వీళ్ళు వున్నారని వినికిడి. నువ్వొక్కతివే ఆడపిల్లవి బయల్దేరేవు. ఎలా వెదుకుతావు?” అన్నాడాయన జాలిగా చూస్తూ.
“మీరాశీర్వదించండి. నా ప్రయత్నం నేను చేస్తాను” అంది లిఖిత అతని పాదాలకి నమస్కరిస్తూ.
కుట్టికారన్ ఆమెని ఆశీర్వదించి భగవతి దగ్గర కుంకుమ పొట్లం కట్టి తెచ్చి ఆమె చేతికిచ్చి “రోజూ ఈ బొట్టూ పెట్టుకుని పని ప్రారంభించు. నీకు జయం కల్గుతుంది. ఆడపిల్లవి జాగ్రత్త!” అన్నాడు.
లిఖిత అతనివైపు నిశితంగా చూసి “మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. మొదట మున్నార్ వెళ్తాను. కానీ వెళ్ళే ముందొక్క మనవి” అంది వినయంగా.
ఆయన ఏమిటన్నట్లుగా చూశాడు.
“మగవాడికి దారి చూపాల్సింది తల్లిగాని, భార్యగాని అన్నారు. అంటే స్త్రీయే మగవాడికి గురువులాంటిది. మీరు పూజించే అమ్మవారు కూడా స్త్రీమూర్తే. అలానే ఆదిశక్తి కూడా స్త్రీయే. ఈ ప్రకృతి కూడా స్త్రీగానే పరిగణింపబడుతోంది. అలాంటప్పుడు నన్నెందుకు మాటిమాటికి ఆడపిల్లనని జాలి చూపిస్తారు. తెలివితేటలకి, ప్రతిభకి, సమయస్ఫూర్తికి, వివేకానికి వివక్షత పాటిస్తారెందుకు? నేనీ పని తప్పక సాధిస్తాను. నా తండ్రిని కలుసుకొని తీరతాను. ఇంకెప్పుడు ‘ఆడ’ అన్న పదాన్ని చేతకానిదానికి పర్యాయపదంగా వాడకండి ప్లీజ్!” అంది ఒకరకమైన ఉద్వేగానికి గురవుతూ.
అంత వయసు పైబడి సదా అమ్మవారి సేవలో నిమగ్నుడయిన కుట్టికారన్ కూడా తెల్లబోయేడామె మాటలకు.
వివేకం, మంచితనం మూర్తీభవించిన అతను వెంటనే తేరుకొని గట్టిగా నవ్వి “నా కళ్లు తెరిపించేవమ్మా.. నాకు జన్మనిచ్చింది తల్లని మరిచిపోయేను తాత్కాలికంగా. ఎంతయినా మగాణ్ణి కదూ!” అన్నాడు తల మీద చెయ్యి పెట్టి నిమిరి.
లిఖిత మరోసారతనికి నమస్కరించి గుడినుండి బయటికొచ్చింది. తన ప్రయత్నానికి నాందిగా అడుగులు వేస్తూ.

ఇంకా ఉంది…
(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)

ధన్యవాదాలు

శుభదినం.

బ్రహ్మలిఖితం 12
రచన: మన్నెం శారద
వేంకటేశ్వర స్వామి గుడి మెట్లెక్కుతుంటే ఈశ్వరి కాళ్ళు చిన్నగా వణికేయి.
ఒక అపరిచిత వ్యక్తిని కలుసుకోడానికి తనేంటింత ధైర్యంగా వస్తోంది.

తను కాకినాడ పక్కన కత్తిపూడిలో పుట్టి పెరిగింది. ముందు నుండీ ఘోషా కుటుంబం తమది. తండ్రి పట్టుదల వలన కాకినాడ మేనమామ ఇంట్లో వుంది, బి.ఏ వరకు చదివింది. పేరుకి కాలేజీకి వెళ్ళేదే గాని ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తేది. మళ్లీ అక్కడ వంచిన తల ఇంట్లో ఎత్తేది. ఆడవాళ్లు ఆ ఇంట్లో కేవలం తినడానికి మాత్రమే నోరు తెరవాలి. మగవాళ్ళేదైనా చెబితే కేవలం సరేనంటూ గంగిరెద్దులా తల తిప్పి చెప్పాలి. బి.ఏ ఫైనలియర్‌లో వుండగా తనకి మేనమామ కొడుకు కుటుంబరావుతో పెళ్ళయింది. కుటుంబరావు కోరమండల్ ఫెర్టిలైజర్స్‌లో పని చేస్తున్నాడు. అతని పట్టుదల వలనే తను ఉద్యోగం చేస్తోంది.

కుటుంబరావు అలవాట్ల పరంగా చూస్తే మంచివాడే.

చుట్ట, బీడీ, సిగరెట్‌లో దేన్నీ ముట్టడు. కల్లు, సారా, బ్రాందిల్లాంటివి చస్తే తాగడు. పరాయి ఆడవాళ్లు వివస్త్రలుగా ఎదురుగా నిలబడ్డా కన్నెత్తి చూడడు. ఎవరితోనూ విమర్శలు పెట్టుకోడు. కోతలు కోయడు. భార్య వండి కంచంలో ఏది పెడితే అది తిని ఆఫీసుకెళ్లిపోతాడు. సాయంత్రం ఇంటికి రాగానే ఆవిడ కాఫీ యిస్తే కాఫీ, టీ ఇస్తే టీ తాగుతాడు. ఆవిడ కాఫీ పేరుతో కుడితిచ్చినా అతడు తాగుతాడేమోనని ఆవిడకనుమానం. కాని ఆవిడకంత ధైర్యం లేదు ఆ పని చెయ్యడానికి.

అలానే ఇద్దరు పిల్లలు పుట్టేరు. స్కూలుకెళ్లి చదువుకుంటున్నారు.

మాట్లాడకపోతే మానే. కనీసం కొట్లాడటం కూడా రాని భర్తతో ఈశ్వరికి జీవితం ఉప్పులేని కూరలా తయారయింది.

ఏది చేసినా ఇది బాగుందనడు. బాగోలేదనడు.

ఎలా తయారైనా నువ్వీరోజు బాగున్నావనో, ఈ చీర నీకు నప్పిందని చస్తే చెప్పడు.

పెళ్లయి పదేళ్లయినా చిన్న మెలికా, మెరపూ లేని జీవితం ఆమెది.

సరిగ్గా మనసు విసిగి వేసారిన సమయంలో సుదీర్ఘ గ్రీష్మ తాపంలో డస్సిపోయింది అనుకున్న తన ప్రాణానికి తొలకరి జల్లులాంటిదయింది ఓంకారస్వామి మాట.

అందుకే ఆమె కట్టుబాట్లని త్రెంచుకొని వెంకట్‌ని కలుసుక్కునేందుకు అక్కడికొచ్చేసింది.

చివరి మెట్టు మీద పాదం మోపుతున్నప్పుడు ఆమె పాదం పట్టి తప్పినట్లుగా వణికింది.

తన తడబాడు నణచుకుంటూ తలెత్తి చుట్టూ చూసింది. సముద్రం వైపుగా వున్న పేరాపెట్ వాల్ నానుకొని ఆమె రాకకోసం ఎదురు చూస్తున్నాడు వెంకట్.

బ్లూయిష్ వైట్ లూయీ ఫిలిప్స్ షర్ట్‌ని, బ్లాకిష్ బ్లూ రేమండ్స్ పేంట్‌లో టక్ చేసి తల బాగా వెనక్కి దువ్వు రెండు చెతుల్నీ పేరాపెట్ వాల్ కాన్చి నిలబడ్డాడు. ఆ డ్రెస్సు కూడా అంతకు ముందు పుట్టినరోజుకి లిఖిత కొనిపెట్టిందే.

వెంకట్ ఈశ్వరి రావడం గమనించి చిరునవ్వు నవ్వేడు. ఆ నవ్వులోని కృతకత తెలీని ఈశ్వరి తనూ నవ్వాలని ప్రయత్నించి విఫలురాలయి సిగ్గుతో తల దించుకుంది.
ఏదో తప్పు చేస్తున్నానన్న భావన ఆమె మనసుని ఎండ్రకాయలా పట్టుకు పీకుతోంది.
“రండి” అన్నాడతను చొరవగా.
ఈశ్వరి బలిపశువులా అతని దగ్గరకు నడిచింది.
“ఇక్కడ కూర్చుందామా, లేక బీచ్‌లో కెళదామా?”
అతని ప్రశ్నకామె కంగారు పడుతూ “వద్దొద్దు. బాగా వెలుగుగా వుంది. ఎవరైనా చూస్తారు.” అంది గాభరాగా.
అతను నవ్వి “సరే, ఇక్కడే కూర్చుందాం” అంటూ అతను కటకటాలుగా కట్టిన పేరాపెట్ వాల్ కానుకుని కూర్చున్నాడు.
ఈశ్వరి కూడా అతని కభిముఖంగా కొద్దిగా దూరంగా మోకాళ్ల మీద తల పెట్టుక్కూర్చుంది.
పైకి గాంభీర్యం వహించినా మనసు మాత్రం సూపర్ ఎక్స్‌ప్రెస్ వచ్చేటప్పుడు దడదడలాడే ఫ్లాట్‌ఫారంలా వణుకుతూనే వుంది.
వెంకట్ క్రీగంట ఆమెని నిశితంగా గమనించేడు.
స్వచ్చమైన పారచూట్ కొబ్బరినూనె రాసి జడ గట్టిగా దువ్వు అల్లింది. అయితే జద చాలా పెద్దది. మంచి గోధుమ రంగులో మెరిసే శరీరం గుండ్రని ఆకృతి. కాటుక దిద్దిన కళ్లు, లిప్‌స్తిఖ్ లేకుండానే గులాబీ రంగులో మెరిసే పెదవులు, మైసూర్ క్రేప్ చీరలో తీర్చిదిద్దినట్లున్న ఆకృతి, ముఖ్యంగా మెడలో దిట్టంగా వున్న రెండు పేటల మంగళసూత్రాల గొలుసు. నల్ల పూసలు, చేతికి ఆరు జతల గాజులు, చెవులకి డైమండ్ దుద్దులు, ఈవిడకి ఓంకారస్వామి పాతికవేలు ఎందుకిమ్మన్నట్టు?
“ఏదో మాట్లాడాలన్నారు?”
వెంకట్ ప్రశ్నకి ఆమె కళ్లెత్తి అతనివైపు చూసింది.
ఓంకారస్వామి చెప్పిన మాటలు చెప్పడానికి నోరు పెగల్లేదు. తీరా విని తననొక పిచ్చిదానిలా జమకట్టి కింగ్ జార్జి హస్పిటల్‌కి తరలిస్తాడేమోనని భయపడిందామె.
“నేను మీకు ఎక్సెస్ పే చేసింది ఇరవై వేలే. ఇరవ్వయిదిచ్చేరు మీరు. సరిగ్గా లెక్క చూసుకోలేదా?” అంది మెల్లిగా.
అతనదోలా నవ్వేడు.
ఆమె తనేమన్నా అతప్పు మాట్లాడేమోనని కంగారు పడింది.
“నా కసలు మీ బాంక్‌లో అకౌంట్ లేదు.”
అతని జవాబు విని ఆమె అదిరిపడింది.
“ఏంటి మీరంటున్నది?” అంది గగుర్పాటుగా.
“ఎస్. మేడం. నేను చెబుతున్నది నూటికి నూరుపాళ్లూ నిజం”
“అయితే మీరెందుకా డబ్బిచ్చేరు?” కొంచెం కోపంగానూ, మరికొంచెం భయంగానూ అడిగింది ఈశ్వరి.
“ఎందుకంటే .. వద్దులెండి. నన్ను పిచ్చివాడిగా జమకడతారు!” అన్నాడు వెంకట్.
ఈసారి ఈశ్వరి అనుమానం బలపడింది.
తనకు చెప్పినట్లుగానే ఓంకార స్వామి ఇతనికి తన గురించి చెప్పేడేమో.
“నేనేం అనుకోను చెప్పండి” అంది ఈశ్వరి కొంత ధైర్యం తెచ్చుకొని.
వెంకట్ పేరాపెట్ వాల్ కటకటాల్లోంచి సముద్రం కేసి దీక్షగా చూశాడు.
అలల వంపులో పైకి లేస్తు, క్రిందకి మునిగిపోయినట్లుగా వంగుతూ వెళ్తూన్న జాలర్ల పదవల కేసి చూస్తూ “నాకో కల వచ్చింది” అన్నాదు.
ఈశ్వరి టెన్షన్‌గా ఊపిరి బిగబెట్టి అతనేం చెప్పబోతున్నాడాని వింటోంది.
“ఆ కలలో నాకొక స్వాముల వారు కన్పించి మీరు గత జన్మలో నా భార్యని, మీరు డబ్బు పోగొట్టుకుని ఆపదలో వున్నారని వెంటనే ఆ డబ్బివ్వమని చెప్పేడు. మీకెంత ఇవ్వమని చెప్పాడో గుర్తు లేదు. అందుకే పాతికవేలు తెచ్చిచ్చేను”. వెంకట్ మాటలు విని అసలే పెద్దవైన తన కళ్ళని మరింత పెద్దవి చేసింది ఈశ్వరి.
“నా పేరు బాంక్ పేరు కూడా చెప్పేడా స్వామి?” అనడిగింది అమాయకంగా.
“చెప్పలేదు. మీ ఆనవాళ్లు మాత్రం కొద్దిగా చెప్పినట్లు గుర్తు. అందుకే సిటీలో బాంక్ బాంక్ తిరిగేను. మీ బాంక్ కొచ్చినప్పుడు మిమ్మల్ని చూడగానే జన్మ జన్మలనుబంధం వున్నట్లుగా అనిపించింది నాకు” అన్నాదు వెంకట్ గాఢంగా నిశ్వసిస్తూ.
ఈశ్వరి మ్రాన్స్పడినట్లుగా చూసిందతనివైపు.
“మీరు వివాహితలా వున్నారు. నా మాటలు విని కోపం తెచ్చుకోకండి. నా కలలు తరచూ నిజమవుతుంటాయి. 1977 నవంబరులో ఉప్పెన వచ్చేముందు కూడా నాకో కలొచ్చింది. అంతా కొట్టుకుపోతున్నట్లుగా. అప్పుడు చిన్నవాణ్ణి. నా మాటలెవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీని షూట్ చేస్తున్నట్లు, భూకంపం వచ్చినట్లు.. దాదాపు అన్నీ జరిగేయి. అందుకే నేను గాఢంగా మీరు నా భార్యని నమ్ముతున్నాను. అలా అని నేనేం మీ జీవితానికడ్డం రాను” అంటూ భారంగా ఏదో పోగొట్టుకున్న వాడిలా నటిస్తూ లేచి నిలబడ్డాడు వెంకట్.
ఈశ్వరి కూడా లేచి నిలబడి “ఆగండి. నా మాట కూడా వినండి” అంది.
“చెప్పండి”
“ఇదే మాట నాకు భీమిలీ బీచ్ రోడ్డులో వున్న ఓంకారస్వామి నాకు చెప్పేరు. నేను డబ్బు పోయినప్పుడు ఆ విషయం తెలుసుకోడానికతన్ని ఆశ్రయించేను. ఆయన గత జన్మలో నా భర్త ఈ డబ్బు తెచ్చిస్తాడని చెప్పేడు. అందుకే సాయంత్రం మీతో మాట్లాడాలన్నాను. మనిద్దరం అక్కడికెళ్దాం రండి” అంది ఈశ్వరి.
“వద్దు. నాకు స్వాములు, బాబాలంటే నమ్మకం లేదు. వెళ్లిన వాళ్లని వాళ్లు ఉత్తినే వదలరు” అన్నాడు వెంకట్.
“నా మాట వినండి. అతను మామూలు స్వామి కానే కాదు. మీ కలలో కొచ్చిందతనేనని నా నమ్మకం. నా మాట కాదనకండి ప్లీజ్!” అంది ఈశ్వరి బ్రతిమాలుతున్న ధోరణిలో.
వెంకట్ ఆమె మాట తీసేయలేనట్లుగా బలవంతంగా “మీ ఇష్టం” అన్నాడూ.
ఈశ్వరి కళ్లలో సంతోషం మెరిసింది.
ఇద్దరూ గుడిమెట్లు దిగుతుంటే అయిదేళ్ల పసిపిల్లాడిలా సముద్రం తుళ్ళుతూ పరుగులు పెట్టి ఆడుతోంది.
మెట్ళు దిగుతూ అతన్ని గమనించింది ఈశ్వరి.
వెడల్పు మొహం, పెద్ద కళ్లు .. బాగానే ఉన్నాడనుకుంది.
కాని.. ఆ కళ్లలో నిర్మలత్వం ఏమాత్రం లేదని, అతని బ్రెయిన్‌లో జరిగే క్రిమినల్ థాట్స్‌కి ఆ కళ్లు గవాక్షాలని గ్రహించలెకపోయిందా అమాయకురాలు.
అతన్ని భర్తగా ఊహించుకొని అతనితో అడుగులెయ్యడానికామె మనసు ఉత్సాహపదింది కూడా.
ఇద్దరూ ఆటోలో భీమిలీ బీచ్ రోడ్డులోని ఓంకార స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు.
వారిద్దరూ లోనికి ప్రవేశిస్తుండగా పీనుగులాంటి ఒక మనిషిని గట్టిగా లోనికీడ్చుకొస్తున్నారు కొందరు. అతనసలు స్పృహలో లేడు. వెంట ఇద్దరాడవాళ్లున్నారు.
“ఏం జరిగింది?” అనడిగింది ఈశ్వరి ఆత్రంగా.
“ఏం చెప్పాలి తల్లీ! వీడుత్త తాగుబోతయిపోయేడు. తాగి పడుకుంటే పర్లేదు. అర్ధరాత్రి అందరి కొంపల మీదకి వెళ్తాడు తగాదాలకి. వీడితో మా పరువు పోతోంది. ఓంకారస్వామి మహిమ విని వీణ్ని తాగుడు మానిప్స్తాడేమోనని తీసుకొచ్చేం” అంది ముసలావిడ బాధగా.
ఆవిణ్ణి చూస్తే జాలేసింది ఈశ్వరికి.
ఆ తాగుబోతుని ఓంకారస్వామి ముందు కూలేసేరు.
అతను కళ్ళు మూసుకుని తూలిపోతూ కూర్చున్నాడు.
“గోవిందూ! ఒరే గోవిందూ!” అంటూ అతన్ని పేరుతో పిలిచేడు ఓంకారస్వామి.
అతన్ని పేరు పెట్టి పిలవగానే అతని వాళ్లంతా అతని మహిమ గుర్తించి లెంపలేసుకున్నారు చెంపలు నొప్పి పుట్టేటట్లుగా.
గోవిందు మాత్రం తూలుతూనే “ఊ” అన్నాడు కళ్ళు ఏమాత్రం తెరవకుండానే.
“నోరు తెరు!” అన్నాడు ఓంకారస్వామి.
అతను నోరి తెరిచే స్థితిలో లేనే లేడు.
అతని వాళ్లందరూ కలిసి అతని నోరు బలవంతంగా తెరిచేరు.
ఓంకారస్వామి ఇంత విబూది అతని నోట్లో వేసి “ఈ రోజు నుండితను తాగడు. తాగితే వెంటనే కక్కేస్తాడు. తీసుకెళ్లండి.” అన్నాదు.
అందరూ మళ్లీ అతన్ని లాక్కెళ్ళిపోయేరు.
ఓంకారస్వామి శిష్యుడి అవతారమెత్తిన రాజు ఈశ్వరిని, వెంకట్‌ని లోనికి ప్రవేశపెట్టేడు.
ఈశ్వరి ఓంకారస్వామి పాదాలకి మొక్కి “మీరన్నట్లుగానే జరిగింది స్వామి! ఈయన డబ్బు తెచ్చిచ్చేరు. ఈయన క్కూడా నేను పూర్వ జన్మలో భార్యగా కలొచ్చిందట. “అంది భక్తిగా
ఓంకారస్వామి తలెత్తి వెంకట్‌ని చూస్తూ “ఎవడ్రా నీకు కలలో కొచ్చిన స్వామి?” అనడిగేడు కాస్త కోపంగా.
“మీలానే వున్నాడు స్వామి. నేనిదివరలో చూడలేదు” అన్నాడు.
“నీకు అనుకున్నదానికంటే ఎక్కువే ముట్టింది కదూ!” అన్నాడు ఈశ్వరి వైపు చూస్తూ.
“అవును స్వామి! ఆ అయిదువేలూ మీకిద్దామని తెచ్చేను” అంటూ అయిదువేల కట్ట బయటకు తీసింది ఈశ్వరి.
“మాకెండుకు సన్యాసులం?” అన్నాడు ఓంకారస్వామి దర్పంగా.
ఆ మాట విని రాజు ఖంగు తిన్నాడు. కాషాయ రంగు చీరకట్టి సన్యాసినిలా తయారైన సంపెంగి ఆ డబ్బువైపే ఆశగా చూస్తోంది.
“డబ్బుని చేత్తో తాకరు స్వామి. హుండీలో వెయ్యండి. అన్నదానానికుపయోగపడుతుంది” అన్నాడు రాజు.
ఈశ్వరలాగే చేసింది.
“ఇప్పటికయినా మీకు నమ్మకం కుదిరిందా మీరిద్దరూ భార్యాభర్తలని?”
ఓంకారస్వామి ప్రశ్నకి వాళ్లిద్దరూ బుద్ధిగా తలూపేరు.
“మీకపనమ్మకంగా వుంటే.. ఆళ్లగడ్డ దగ్గర అహోబిళం వెళ్లండి. అక్కడ వెయ్యేళ్ళు తపస్సు చేసిన అభుక్తేశ్వర స్వామి వుంటారు. వారు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు” అన్నాడు ఓంకారస్వామి.
వాళిద్దరూ తలూపి బయటకెళ్లేరు.
వళ్లు వెళ్లగానే ” ఆ తాగుబొతు నా కొడుకు తాగడం మానేస్తాడని చెప్పేవేంటి? వాడు మళ్లీ తాగితే అందరొచ్చి మనల్ని మక్కెలిరగకొడ్తారు” అన్నాడు రాజు గుసగుసగా.
“వాడు పుట్టిందగ్గర్నుంచీ తాగుతున్నాడట. ఇప్పటికెన్ని వేల పీపాలయి వుంటాయో. లివర్ ఎప్పుడో చెడి వాడికి వాంతులు పట్టుకున్నాయని కూడా నాకు తెలిసింది. అందుకే అలా చెప్పేను. భయమేం లేదు. వాడి ఆకారం చూశావుగా. బహుశ వాడికి లోపల గుండె, జీర్ణకోశం, కిడ్నీలు ఇలాంటివేవీ వుండి వుండవు!” అన్నాడు ఓంకారస్వామి నవ్వుతూ.
“వాడు తిరుగుబోతు కూడా!” అన్నాడు రాజు నవ్వుతూ.
“పోనీ వాడి గురించి మనకెందుకులే ఆలోచన. ఈ జంట బహుశ అహోబిళం వెళ్తారు. నీ తమ్ముణ్ణి వెంటనే అభుక్తేశ్వరస్వామి అవతారమెత్తమను. ఈ పిల్ల వలన మనకు చాలా లాభముంటుంది ముందు ముందు” అన్నాడు ఓంకారస్వామి అవతారమెత్తిన నారాయనణ.
రాజు సరేనంటూ తలూపేడు.

*****
కేయూరవల్లి పూజగదిలోంచి బయటకొచ్చింది.

ఇది వరకులా పూజ మీద ఏకాగ్రత కుదరడం లేదు. మనసులో దేవుని రూపానికి బదులు కూతురి రూపం కనబడుతోంది.

లిఖిత పడరాని కష్టాలు పదుతున్నట్లుగా కలలొస్తున్నాయి.

అక్కడికి మనసు చంపుకొని కేయూర లాబ్స్ కి ఫోన్ చేసింది.

ఫోన్ రింగవుతుందే గాని ఎవరూ ఎత్తడమే లేదు.

కేయూర కాఫీ కలుపుకొని మగ్ తీసుకొని బాల్కనీ రెయిల్స్ పట్టుకొని ఆలోచిస్తూ నిలబడింది.

సూర్యుణ్ణి కని, అతను ఆకాశంలో దోగాడుతుంటే.. చూసి మురిసిపోయే తల్లిలా సముద్రం ఉప్పొంగుతుంతుంది.

ఇరవై నాలుగ్గంటల్లో ఈ సముద్రం ఎన్ని రూపాంతరాలు చెందుతుందో గమనిస్తుంటే చాలా ఆశ్చర్యమనిపిస్తుంటుంది కేయూరకి.

*****

ప్రత్యూషంలో వేదాంతిలా, సూర్యోదయం తర్వాత చైతన్యం నింపుకొని కళకళల్లాడే మనిషిలా పది గంటల తర్వాత శ్రమజీవిలా మిట్టమధ్యహ్నం అన్యాయాన్ని చూసి సహించలేని తీవ్రవాదిలా, సాయంత్రం కల్లాకపటమెరుగని పసిపాపలా అర్ధరాత్రి అన్యాయానికి బలయి ఘోషించే స్త్రీమూర్తిలా, పలకకుండానే ఎన్నో భావాల్ని ప్రస్ఫుటం చేసే శక్తి సముద్రానికి మాత్రమే వుందనిపిస్తుందామెకు.

ఆమె ఆలోచనలనుకోకుండా వెంకట్ మీదకి మళ్ళేయి.

లిఖిత వెంకట్‌ని ప్రేమించిన సంగతి ఆమె ఆలోచించే కొలది ఆశ్చర్యాన్ని అపనమ్మకాన్నీ కూడా కల్గిస్తున్నది.

కాని.. ప్రేమ గుడ్డిది.

ఎవరి మనసుని ఎవరు స్పందింప చేయగలరో తెలుసుకోవడం చాలా కష్టం.

కాని ఎందుకో వెంకట్ లిఖితకి తగినవాడనిపించడం లేదు.
మనసుకి నచ్చచెప్పుకోవడం మహాకష్టంగా ఉందామెకు.
సరిగ్గా అపుడే గేటు ముందు వెంకట్ బైకాగింది.
కేయూర దృష్టి అటు మళ్ళింది.
“గుడ్ మార్నింగాంటీ!” అన్నాడు వెంకట్ క్రిందనుందే నవ్వుతూ.
కేయూర తల పంకించింది.
అతను హడావిడిగా మెట్లెక్కి వచ్చి “లిఖిత సంగతులేమైనా తెలిసేయాంటీ?” అనడిగేడు.
“లేదు” అంది కేయూర దిగులుగా.
“ఏంటి తనింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది? మీ ఆందోళనర్ధం చేసుకోనక్కర్లేదా?” అన్నాడు కొంత కోపాన్ని ప్రదర్శిస్తూ.
కేయూర మాట్లాడలేదు.
అతని మాటలామె హృదయాన్ని బరువు చేస్తున్నాయన్న నిజాన్నతను గ్రహించేడతను.
అదే కావాలతనికి.
ఆమె మానసికంగా బలహీనురాలయి తన మీద ఆధారపడాలి.
అతను మళ్లీ ఏదో అనబోతుండగా ఫోను రింగయింది.
కేయూర గబుక్కున రిసీవరందుకుంది.
అవతల్నుండి లిఖిత కంఠస్వరం వినిపించగానే ఆమెకు ప్రాణం లేచొచ్చినట్లయింది.
“హలో లిఖిత! నేను. మీ అమ్మని. ఎక్కణ్ణుంచి?” అంది ఆత్రుతగా.
లిఖిత చెప్పిన విషయం విని ఆమె మొహం మ్లానమవడం వెంకట్ గమనిస్తున్నాడు.
“అయ్యో! అసలు నువ్వెందుకెళ్ళేవు. నీదంతా నీ తండ్రి దూకుడే. సరే. ఇప్పుడే పంపుతాను. ఎడ్రస్ చెప్పు!” కేయూర బాల్ పెన్ అందుకొని గబగబా ఆమె చెపిన ఎడ్రస్ ఫోన్ నెంబర్ నోట్‌బుక్‌లో రాసింది.
“వెంటనే టి. ఎం. ఓ పంపుతాను. నువ్వక్కడే వుండు. జాగ్రత్త. నువ్వే ఆపదలో చిక్కుకుంటావోనని భయంగా వుంది. వెంటవెంటనే ఫోనులు చెయ్యి. లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది” అంటూ రిసీవర్ క్రెడిల్ చేసి వెంకట్ వైపు చూసింది.
“ఎక్కడుందాంటీ!” ఆని ఆత్రం ప్రకటించేడు వెంకట్.
“కొచ్చిన్ వెల్లిందంట. ఎవరో మనీ పర్స్ కొట్టేసేరంట. చేతిలో పైసా లేదట. ఒక పది వేలు అర్జంటుగా పంపమంది. వెంటనే టి.ఎం.ఓ చేసొస్తావా?” అనదిగింది కేయూర గాభరాగా.
“అలాగే ఆంటీ! కాని పదివేలు సరిపోతాయంటారా? అసలు నేనెళ్తే ఎలా వుంటుంది?”
కేయూర ఆలోచించింది.
లిఖిత మొండిగా మున్నార్ అడవుల్లోకి బయల్దేరబోతున్నది. వేరే రాష్ట్రం. అందులోనూ మంత్రగాళ్ల దగ్గరకి. ఒక మగతోడుండటం సమంజసం!” అంతకంటే ఎక్కువాలోచించే స్థితిలో ఆమె లేదు.
వెంటనే విత్ డ్రాయల్ ఫారం మీద ఫిగర్ వెయ్యకుండా సంకతం చేసి అతని చేతికిస్తూ “బాంక్ బుక్ నీ దగ్గరే వుంది కదూ!” అంది.
వెంకట్ అప్పుడే ఆ సంగతి గుర్తొచ్చినట్లుగా నటించి”అవునాంటీ, మర్చిపోయొచ్చేను. ఇంటికెళ్లి బాంక్ కెళ్తాను” అన్నాడు.
“సరే! ముందెలాంటి చిక్కుల్లో వుందో! ఒక పదివేలు పంపించు. తర్వాత నువ్వో పదివేలు తీసుకుని బయల్దేరు. ఫ్లయిటయినా సరే. డబ్బుకాలోచించకు!” అంది కేయూర ఆందోళనగా.
“అలాగే ఆంటీ! నేను నీకు ఫోను చేస్తుంటానుగా! ఒక గ్లాసు మంచినీళ్లిస్తారా?”
కేయూర లోనికెళ్లింది. వెంకట్ అదే అదనుగా టెలిఫోను వైర్ డిస్‌కనెక్ట్ చేసి ఏమీ ఎరగనట్లుగా కూర్చున్నాడు.
కేయూర మంచినీళ్లు తెచ్చిచ్చింది.
అతనా నీళ్లు తాగి లిఖిత ఎడ్రస్ తీసుకుని బయకొచ్చి బైక్ ఎక్కేడు మనసులో హుషారుని దాచుకుంటూ.
కేయూర మాత్రం అతనివైపే చూస్తూ నిలబడింది ఆందోళనణచుకుంటూ.



ఇంకా వుంది.

బ్రహ్మలిఖితం 13

#రచన: #మన్నెం శారద

#అర్ధరాత్రి దాటింది.
ఈశ్వరికెంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు.
పదే పదే వెంకట్ రూపం కళ్ళలో కవ్విస్తూ కనబడుతోంది. అతనే తన భర్తన్న భావన ఆమె మస్తిష్కంలో క్షణక్షణం బలపడసాగింది.
పక్కనే పడుకున్న కుటుంబరావు నిద్రలో ఆమె మీద చెయ్యి వేసాడు. బలమైన సర్పం మీద పడినట్లుగా ఆమె ఉలిక్కిపడింది.
వెంటనే ఆ చేతిని చీదరగా విసిరికొట్టింది.
కుటుంబరావుకి మెలకువ రాలేదు.
ఈశ్వరి అతన్ని పరాయి వ్యక్తిలా గమనించింది.
అతను కొద్దిగా నోరు తెరిచి గురక పెడుతున్నాడు.
డొక్కలు గురక వలన ఎగసెగసి పడుతున్నాయి.
ఈశ్వరికి వెంటనే అతను పూర్వజన్మలో కుక్కని ఓంకారస్వామి చెప్పిన మాటలు గుర్తుకొచ్చేయి.
ఆమె అనుకోకుండా కెవ్వున అరచింది.
కుటుంబరావు ఉలిక్కిపడి లేచి” ఏం జరిగింది?” అన్నాడు.
“ఏం లేదు. ఏం లేదు” అందామె తనలోని గగుర్పాటునణచుకుంటూ.
“కలొచ్చిందా? కాసిన్ని మంచినీళ్ళు తాగి పడుకో” గొణీగినట్లుగా అని అటు తిరిగి పడుకున్నాడు.
ఈస్వరి లేచి ఫ్రిజ్ తెరచి మంచినీళ్లు తాగింది.
తిరిగి భర్త పక్కన పడుకోవాలనిపించలేదు.
వెళ్లి పిల్లల గదిలోకి తొంగి చూసింది.
వాళ్లిద్దరూ గాఢనిద్రలో వున్నారు. వాళ్లు కప్పుకున్న దుప్పట్లు సరిచేసి హాల్లోకొచ్చి నిలబడింది.
ముసురుతున్న ఆలోచనలు ఆమె హృదయాన్ని స్థిమితం కోల్పోయేలా చేస్తున్నాయి.
ఏదో జరిగిపోయిందేదో జరిగిపోయింది.
ఇప్పుడెందుకు తనకి గత జన్మ గురించి తెలియాలి.
ఇప్పుడెలా ఈ నిజాన్ని తెలీనట్లుగా నటించి ముందు జీవితాన్ని గడపగలదు తను.
అందులోనూ తన భర్త గత జన్మలో తన పెంపుడు కుక్కని తెలిసేక అతన్నెలా గౌరవించగలదు. అతని స్పర్శనెలా భరించగలదు.
పైగా క్షణక్షణానికి తన మనసు వెంకట్ వైపు మొగ్గిపోతున్నది.
ఒక్కసారి అహోబిలం వెళ్తే?
అక్కడున్న అభుక్తేశ్వర స్వామి ఏం చెబుతారో?
తన జీవితానికెలాంటి నిష్కృతి చూపిస్తారో?
రేపే వెంకట్‌ని అడగాలి. అతనికి తన ఫోను నెంబరు కూడా ఇచ్చింది. అతనొకసారి తనకి ఫోను చేస్తే బాగుండును.
ఈశ్వరి తన ఆలోచనల్లో తానుండగానే ఫోను రింగయింది.
ఈశ్వరి గబాగబా వెళ్లి రిసీవర్ ఎత్తింది.
“హలో నేను.. వెంకట్‌ని.. నీకూ నిద్ర పట్టలేదు కదూ. నాకూ అంతే!” అంటూ నవ్వేడతను.
ఈశ్వరి హృదయం సంతోషంతోనూ, భయంతోను మరింత వేగంగా కొట్టుకుంది.
భర్త గదివైపు చూస్తూ “ఒక్క నిముషం” అని రిసీవర్ పెట్టి ఆ గది తలుపులు దగ్గరకేసి వచ్చి మళ్లీ రిసీవరందుకుంది.
“నిన్ను నేనొదిలి వుండలేకపోతున్నాను డార్లింగ్!”
ఆ మాట వినగానే ఈశ్వరి శరీరమంతా గోదారి లంకల్లో మొలిచిన రెల్లుగడ్డితో సున్నితంగా నిమిరినట్లు పులకరించింది.
“ఏంటి! మాట్లాడవు. నిన్నిబ్బంది పెడుతున్నానా?” అంటూ రెట్టించేడు వెంకట్.
“అదికాదు. ఇప్పుడీ పరిస్థితిలో మనకీ నిజం తెలియకుండా వుండాల్సింది” అంది అతి నీరసంగా ఈశ్వరి.
“తెలిసినందుకు బాధపడుతున్నావా? అలాగయితే నేను నిన్ను బాధించనులే. ఈ ఊరొదిలేసి వెళ్లిపోతున్నాను” అన్నడు వెంకట్ కంఠంలో బాధని అరువు తెచ్చుకుని.
“వద్దొద్దు. మిమ్మల్ని చూడకుండా బ్రతకలేను. ఇప్పటికే ఇక్కడొక క్షణం వుండలేకపోతున్ననాను” అంది ఈశ్వరి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొంటూ.
వెంకట్ తన పాచిక పారినందుకు సంతోషిస్తూ “ఎలా మరి! నిన్ను తీసుకెళ్లిపోదామంటే.. నువ్వు పెళ్లయినదానివి. పైగా పిల్లలున్నారు. నాకా సరైన ఉద్యోగం… ఆస్తి లేవు. నిన్నెలా పోషించగలను?”
అతని మాటలకి ఆశ్చర్యపోయింది ఈశ్వరి.
“మరి నిన్నెలా పాతిక వేలు తెచ్చిచ్చేరు?” అనడిగిందాశ్చర్యంగా.
“బెగ్, బారో, ఆర్ ధెఫ్ట్! అన్నాడు. రెండోది చేసేను. నా భార్య కష్టంలో వున్నప్పుడు నేనెలా చూస్తూ ఊరుకోగలను”
వెంకట్ జవాబు విని ఈశ్వరి హృదయం ఆర్ద్రమైపోయింది.
“ఇలా ఎప్పుడైనా ఆ కుక్క మొహంగాడన్నాడా?” అనుకుని మనసులోనే.
“ఈసారి మీరలా నాకోసం అప్పు చేయొద్దు. మాకు చచ్చేంత ఆస్తుంది. కాని మా మేనమామ మూణ్నెల్లకోసారొచ్చి నా నగలు తూకం వేసి ఎంత తరుగొచ్చిందో మరీ చూసుకుంటాడు. ఇకపోతే మా పెదనాన్న రేపోమాపో చచ్చేట్లున్నాడు మంచం మీద. ఆయనకి పెళ్లాం, పిల్లలు లేరు. నేనే అతని ఆస్థికి వారసురాల్ని. ఆ ఆస్తి చేతికొస్తే నేనీ కుక్కమొహంగాణ్ని వదిలేసి తీరతాను” అంది ఈశ్వరి.
ఆమె ఆస్థి వివరాలు వినగానే వెంకట్ మొహం చింకి చేటంతయింది. ఏమి తనదృష్టం. అటు లిఖిత అమ్మని బుట్టలో వేసి కంపెనీ హేండోవర్ చేసుకోవాలి. ఇటు ఈ పిచ్చిదాన్ని వశం చేసుకొని ఆస్తి కాజేయాలి.
“ఏంటి మాట్లాడరు?” అంటూ ఈశ్వరి రెట్టించింది.
“ఆహా! ఏం లేదు కుక్కమొహం గాడెవరా అని ఆలోచిస్తున్నాను” అన్నాడూ.
“ఇంకెవరు? ప్రస్తుతం నా మొగుడే. పూర్వ జన్మలో మనింటి పెంపుడు కుక్కేనట ఇతను. అది తెలిసిందగ్గర్నించి నాకతన్ని చూస్తే కంపరమెత్తిపొతున్నది!”
ఆ మాత విని వచ్చే నవ్వాపుకున్నాడు వెంకట్.
“చీ! ఛీ! నీకేం గతి పట్టింది డార్లింగ్. అది సరే మనం ఒకసరి అహోబిలం వెళ్దాం. ఆ ఓంకారస్వామి మాటలెంతవరకు నిజమో తెలుసుకోవాలిగా.” అన్నాడు.
“నేనూ.. అదే అనుకుంటున్నాను. రెండ్రోజులు మా వూరెళ్తానని శెలవు పెడ్తాను. ఆళ్లగడ్డ కర్నూల్ జిల్లాలో వుందట. ముందక్కడికి వెళ్దామంటే.. మనకెవరో ఒకరు దారి చెబుతారు” అంది ఈశ్వరి.
“అలాగే” అన్నాడు వెంకట్ ఆనందంగా రిసీవర్ క్రెడిల్ చేస్తూ..
*****
వెంకట్ ఫోను చేసి చెప్పిన మాటలు గుర్తొచ్చి లిఖిత హృదయం భగ్గుమంటోంది.
“లిఖితా! మీ అమ్మ నీకు టి.ఎం.ఓ చెయ్యమని నాకు చెప్పింది. వెంటనే నన్ను నీకు తోడుగా వుండమని కొచ్చిన్ వెళ్లమని కూడా చెప్పింది. కాని ఈ రెండూ నేను చేయడం లేదు. డబ్బు డ్రా చేసుకున్నాను. అందులో ఒక్క పైసా కూడా నీకు రాదు. వెళ్తూ వెళ్తూ నా మొహాన వెయ్యి రూపాయలు ముష్టోడి కిసిరినట్లు విసిరి కొడ్తావా? ప్రస్తుతం మీ అమ్మ నా గుప్పెట్లో వుంది. చెప్పాలని ప్రయత్నించేవా ఆ అడవిలో నీకెలానో నీ బాబు దొరకడు. నువ్వొచ్చేటప్పటికి మీ అమ్మ బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతుంది. బీ కేర్‌ఫుల్!” అంటూ బెదిరించేడు.
అతని మాటలు విని లిఖిత నివ్వెరపోయింది.
తమ ఇంట్లో ఒక పెంపుడు కుక్కలా తిరిగి, తమ కనుసన్నల్లో పడటానికి అడ్డమైన చాకిరి చేయడానికి సిద్ధపడిన ఈ వ్యక్తిత్వం లేని నీచుడు అకారణంగా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో అర్ధమయ్యేసరికి లిఖితలో విపరీతమైన ఉద్రేకం చోటు చేసుకుంది.
ఒక నీచుడి బెదిరింపుకి వణికిపోయే మనస్తత్వం కాదామెది.
వెంటనే ఇంటికి రింగ్ చేసింది.
ఎంత ట్రై చేసినా ఫోను డెడ్ సౌండ్ వస్తోంది.
లిఖిత నిస్పృహగా రిసీవర్ని క్రెడిల్ చేస్తుంటే హోటల్ మేనేజర్ ఆమెవైపు జాలిగా చూసి “వాట్ హేపెండ్?” అనడిగేడు.
జరిగింది చెప్పడం చాలా అనవసరమనిపించింది లిఖితకి.
ఆలోచిస్తూ అతనికెదురుగా బిగించి వున్న అద్దంలోకి అప్రయత్నంగా చూసింది.
వెంటనే ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి.
“జస్టే మినిట్!” అంటూ బయటకొచ్చి ఆ రోడ్డులోనే వున్న ఒక జ్యూయలరీ షాపుకెళ్లింది లిఖిత.
తన చెవులకున్న డైమండ్ హేంగింగ్స్ షాపతని చేతిలో పెట్టి “అయి వాంట్ మనీ. వెరీ క్విక్ డిస్పోసల్” అంది లిఖిత.
అతను వాటిని పరీక్షించి , ఆమె చేతిలో లక్ష రూపాయిలు పెట్టేడు.
ఆమె తెల్లబోతూ “లక్షా?” అంది.
“అంతకంటే రాదు. కావాలంటే ఇంకెక్కడైనా అమ్ముకోండి అమ్ముకోండి” అన్నడతను.
తల్లి తనని డైమండ్ టాప్స్ పెట్టుకోమంటే.. తను ఇష్టం లేక ఎంతో మారాం చేసింది. కాని.. ఇప్పుడవే ఊరుకాని ఊరిలో ఆదుకున్నాయి. ఈ లక్ష రూపాయిలు పట్టుకొని తిరుగుతుంటే.. తన కూడా మళ్లీ ఏ నకిలీ జర్నలిస్టో పడకమానడు అనుకుంటూ వాటిని బాగ్‌లో సర్దుకుని షాప్ ఓనర్ వైపు తిరిగి “థాంక్స్” అంది.
అతడు పళ్లికిలించేడు.
లిఖిత గ్లాసు డోర్ తీసుకొని బయటికి నడుస్తుంటే “ప్రొద్దుటే లక్ష రూపాయలు లాభం!” అనుకున్నాడతను డైమండ్ హేంగింగ్స్ చేత్తో తిప్పి అపురూపంగా చూసుకొంటూ.
ఆమె తిరిగి హోటల్‌కి రాగానే మానేజర్ ఆమెని జాలిగా చూస్తూ “డబ్బు కోసం మీరవస్థ పడుతున్నట్టున్నారు. ఒక పని చెయ్యండి. ఈ హోటల్ బిల్ నేను కడ్తాను. మున్నార్ వెళ్లడానికి ఏర్పాటు చేస్తాను. మీరు తిరిగొచ్చేక నాకు డబ్బిద్దురుగాని” అంటూ వేలికున్న అయ్యప్ప స్వామి ఉంగరం తీసేడతను.
లిఖిత అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ “అదెందుకు?” అంది.
“నేనూ మిడిల్ క్లాస్ మనిషినే! కేష్ లేదు నా దగ్గర. ఇదమ్మేసి అర్జెంటుగా డబ్బు తే!” అన్నాడొక బేరర్‌ని పిలిచి.
లిఖిత తేరుకుని “వద్దొద్దు” అంది.
అతను తెల్లబోతూ “ఏం?” అన్నాడు చిత్రంగా చూస్తూ.
“నా దగ్గర డబ్బుంది. మీ సహకారానికి కృతజ్ఞతలు. నేను బిల్ పే చేస్తాను. ఎంతయింది?” అంటూ బాగ్‌లోంచి ఒక పదివేల కట్ట తీసింది లిఖిత.
మానేజర్ ఆ కట్టవైపు విభ్రమంగా చూసేడు.
“ఎక్కడిది?” అనడగబోయి నాలిక్కరచుకొని బిల్ సిద్ధం చేసిచ్చేడు.
ఆమె బిల్ పే చేసి “నాకో సహాయం చేస్తారా?”అనడిగింది.
“విత్ ప్లెషర్!”
“నా దగ్గర లక్ష రూపాయిలున్నాయి. ఇందులో నేనొక పదివేలు మాత్రం తీసుకొంటాను. మిగతాది మీ దగ్గర దాచాలి.!”
ఆ మాట విని అతను గాభరాపడుతూ “అంత డబ్బే! వద్దండి!” అన్నాడు.
లిఖిత చిన్నగా నవ్వి “ఏం ఆ మాత్రం సహాయపడకూడని మనిషిలా కనిపిస్తున్నానా నేను?” అంది.
“అది కాదు. డబ్బు పాపిష్టిదన్నారు. అంతే కాక చాలా అవసరమైనది కూడా. ఏ క్షణం ఏ బుద్ధి పుడుతుందో. కావాలంటే మీ కూడా బాంక్‌కొచ్చి డిపాజిట్ చేయించి పెడ్తాను” అన్నాడు మానేజర్.
“నాకంత టైము లేదు. పైగా నాకు మీమీద చాలా నమ్మకముంది. ప్రాణం పోయినా మీరు నా డబ్బు తాకరు!”
మానేజర్ ఆశ్చర్యంగా చూసి “ఏంటంత నమ్మకం నా మీద!” అన్నాడు.
లిఖిత నవ్వి “నా నమ్మకానికెలాంటి డెరివేషనూ లేదు. కొందరు అప్పు అని తీసుకొని అడిగితే అపకారం చేస్తారు. మీలో నాకు మానవత్వపు విలువలు కనిపిస్తున్నాయి దట్సాల్!” అంటూ తనో పదివేలు తీసుకొని మిగతా బండిల్స్ అతని చేతికందించింది.
అతను వణుకుతున్న చేతులతో దాన్ని అందుకున్నాడు.
ఆమె ‘థాంక్స్’ చెప్పి రెండడుగులు ముందుకేసి వెనుతిరిగి “మీ పేరు?” అనడిగింది.
“జోసెఫ్”
“మరి మీ చేటికి అయ్యప్ప రింగు..?” ఆమె ఆశ్చర్యపోతూ అడిగింది.
“అది నా నమ్మకం..” అతను నవ్వాడు.
లిఖిత చెయ్యి వూపుతూ బయటకి నడిచింది.
*****
ఈశ్వరి, వెంకట్ ఎలాగోలా కష్టపడి కర్నూలు చేరుకొని అక్కడ బస్సెక్కి ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఆళ్ళగడ్డ ఊరు చిన్నదయినా రాయలసీమలో రాజకీయపరంగా పేరు గాంచింది.
ఇద్దరూ బస్సు దిగి అహోబిలం ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూండగా పంచెకట్టుతో ఒక ముసలాయన ఎదురుపడ్డాడు. ఈశ్వరిని చూస్తే ఆయనకి సద్భావన కల్గింది.
“ఎక్కడికెళ్ళాలమ్మా?” అనడిగేడాయన.
“అహోబిలం” అన్నడు వెంకట్ తను కల్గజేసుకుంటూ.
“ఇంతెండలోనా?”అతను రిస్టువాచీ కేసి చూసుకుంటూ అని “సరే. ముందు మా యింటికి రండి. భోంచేసి వెళ్దురుగాని” అన్నాడూ.
అపరిచితుల్ని భోజనానికి రమ్మంటున్న అతని సహృదయతకి వాళ్లాశ్చర్యపోయేరు.
అనుమానంగా చూస్తున్న వాళ్లవైపతను చూసి నవ్వి “నా పేరు నారాయణరెడ్డి. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ని. నాకు తోచిన మంచి పని చేయడం నాకలవాటు. రండి” అన్నాడు.
వాళ్లతన్ని అనుసరించేరు.
ఇంట్లోవాళ్లు ఎవరు ఏంటి అని అడక్కుండానే వాళ్లకి మంచి భోజనం పెట్టేరు.
“కాస్సేపు పడుకోండి. మూడింటికి లేచి బయల్దేరితే చల్లగా వుంటుందన్నాడాయన.
ఈశ్వరి వెంకట్ పడుకున్నారన్నమాటేగాని నిద్ర పట్టలేదెవరికీ.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
తొందరగా నిజం తెలుసుకొవాలని ఈశ్వరి, అతి తొందరగా అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని వెంకట్ ఆతృతపడుతున్నారు.
మూడు కాగానే గంట కొట్టినట్లు ఠక్కున లేచి కూర్చున్నారు.
రెడ్డిగారమ్మాయి వాళ్లకి వేడివేడి పకోడీలు, టీ తెచ్చిచ్చింది.
అవి తిని టీ తాగి తల దువ్వుకొని ఇద్దరూ క్రింద కొచ్చేటప్పటికి జట్కాబండి రెడీగా వుంది.
“ఒరే సుబ్బా, బండి నిదానంగా నదుపు. అమ్మాయి భయస్తురాల్లా వుంది” అని చెప్పేడు నారాయణరెడ్డి.
ఆయన కూతురు మరచెంబుతో నీళ్లు, ఉడకబెట్టిన వేరుశెనక్కాయలు తెచ్చి ఇస్తూ “బండిలో కాలక్షేపం” అంటూ నవ్వింది.
బండి కదులుతుంటే ఈశ్వరి, వెంకట్ అతనికి నమస్కరించేరు.
“జాగ్రత్త! అహోబిల నృసింహస్వామిని దర్శించండి. ఆ చుట్టుపక్కల ప్రాంతం మనోహరంగా వుంటుంది. చూడండి. కాని.. అక్కడుండే బైరాగుల్ని, స్వాముల్ని కదిలించకండి!”అన్నాడు హెచ్చరికగా మాస్టారు.
వాళ్లిద్దరూ మొహమొహాలు చూసుకున్నరు.
జట్కా ఆ లోపున స్పీడందుకుంది.
“ఈ ఊళ్ళో ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితే బాంబులేసుకొని చంపుకుంటారంటారు. ఈయనెవరో మనం ఎవరో తెలీకపోయినా భోజనం పెట్టి మర్యాదలు చేసేడు” అంది ఈశ్వరి ఆశ్చర్యంగా.
“అవునమ్మా. ఈ ఊరిని బాంబుల గడ్డని కూడా అంటారు జనం. ఈ గడ్డ మీద జనానికి పౌరుషాలు, పంతాలు ఎక్కువ. కుళ్ళుకి, కావేషాలకి, ఆశకి, అసూయకి చంపుకోరు మా వూరి జనం. అలాగే స్నేహానికి ప్రాణాలిస్తారు. అస్తులు పంచేస్తారు. ఆ మాస్టారయ్య మా వూళ్ళొ గాంధీ మహత్ముడిలాంటివాడు. తనకున్న దానిలో బీదలకి అయిదెకరాల ఇళ్ల స్థలం పంచేడు అదిగో ఆ వచ్చే శారదానగర్ ఆయన దానం చేసిన స్థలమే.” అన్నాడు జట్కా సుబ్బడు.
అతని మాటలు మౌనంగా విన్నారు వాళ్లిద్దరూ.
జట్కా వెళ్తోంటే చల్లని గాలి వీచసాగింది. చెట్ల గుబుర్ల సాంద్రత పెరిగి రోడ్డు పొడుగునా నీడ పరుచుకుంది.
జట్కా ఒక చోట ఆగింది.
“దిగండి. అహోబిలం వచ్చింది” అన్నాదు సుబ్బడు.
ఇద్దరూ దిగేరు.
“నువ్వెళ్లిపో. ఈ రాత్రి మేమిక్కడుంటాం”
“ఇక్కడా?”
“ఏం?”
“రాత్రులుండె సదుపాయాలేం లేవిక్కడ. మిమ్మల్ని అంతా చూపించి తిరిగి తీసుకొచ్చేయమన్నారు” అన్నాడు సుబ్బడు.
ఈశ్వరి వెంకట్ వైపు చూసింది.
“మేమొక రాత్రి ఇక్కడ నిద్ర చేయాలనుకున్నాం. నువ్వెళ్లు” అంటూ డబ్బులివ్వబోయేడు వెంకట్.
సుబ్బడు “నయం. మా రెడ్డిగారు డొక్క చించేస్తారిట్టాంటి పన్లు జేస్తే. వస్తా!” అంటూ జట్కా తోలుకు వెళ్లిపోయేడు.
“పడ” అన్నాడు వెంకట్ ముందుకి నడుస్తూ.
ఈశ్వరి అతన్ననుసరించింది.
ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో అల్లుకుపోయి ఆకాశాన్ని కనిపించనీయడం లేదు. పలకలు పేర్చినట్లున్న రాళ్ల సందుల్లోంచి సన్నగా చుక్కలుగా కారుతున్నట్లనిపించే నీరు గుడిముందు ఒక కోనేరుగా మారడం చిత్రంగా అనిపిస్తుందెవరికైనా. ఆ కోనేటి మెట్ళు, చుట్టూ రాతి కట్టడం కూడా పలకలతో నిర్మించినట్లే వుంది. ముఖ్యంగా అందులోని నీరు ఎన్నిసార్లు సెడిమెంటేషన్, ఫిల్టరింగ్ చేసినా అంత స్వచ్చంగా మారదనిపిస్తుంది. ఈశ్వరి ఆ వాతావరణాన్ని పరవశంగా గమనిస్తూ గుహలాంటి గుడిలోకి వెంకట్ ననుసరించి నడిచింది.
ఆ రాత్రే ఆమె జీవితం ఒక భయంకరమైన మలుపు తిరగబోతున్నదని , తన అందమైన సంసారాన్ని తానే చేతులారా భ్రష్టు పట్టించుకోబోతున్నానని ఆ సగటు అమాయకురాలికెంత మాత్రమూ తెలియదు.

ఇంకా వుంది.

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ధన్యవాదాలు,

శుభదినం.

#రచన: #మన్నెం శారద

#లిఖిత ఎంగేజ్ చేసిన టాక్సీ కొచ్చిన్‌లో బయల్దేరింది.
అడుగడుగునా బాక్‌వాటర్స్‌తో, కొబ్బరి తోటలతో మరో లోకంలో అడుగుపెట్టినట్లుంది కొచ్చిన్.
లిఖిత కళ్లార్పకుండా చూస్తుందా స్థలాల్ని.
సహజంగా సైట్ సీయింగ్‌కి, శబరిమలై వెళ్ళే యాత్రికుల్ని తీసుకెళ్ళడానికలవాటు పడ్డ డ్రైవర్ లిఖితలోని ఆసక్తి గమనించి “ఇదేనా మొదటిసారి రావడం మేడం?” అనడిగేడు ఇంగ్లీషులో.
అవునన్నట్లుగా తల పంకించింది లిఖిత.
“ఎన్‌చాంటింగ్ యీజ్ ద కరెక్ట్ వర్డ్ టు డిస్క్రయిబ్ ద బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ” అన్నాడతను నవ్వుతూ.
లిఖిత అతనివైపు విస్పారిత నేత్రాలతో చూసింది.
అతను చాలా సింపుల్‌గా వున్నాడు. నల్లని శరీరం, వెనక్కు దువ్విన వత్తయిన క్రాఫు తెల్లషర్టు, తెల్ల లుంగీ చాలా సాదాగా వున్నాడు.
కాని.. ఆ కళ్ళలో మాత్రం అతనిలోని తెలివి తాలూకు మెరపు కనిపిస్తోంది. అతని ఇంగ్లీషు ఉచ్చారణలో మళయాళపు యాస కనిపిస్తున్నా చక్కటి భాష మాట్లాడుతున్నాడు.
“ఏ జర్నీ త్రూ ద బాక్ వాటర్స్ యీజ్ వెరీ ప్లెషరబుల్ ఇన్ ఏ కంట్రీ బోట్ ఫ్రం కొల్లాం టూ కొట్టాయం విచ్ యీజ్ కాల్డ్ వెనీస్ ఆఫ్ ఈస్ట్” అన్నాడతను తిరిగి నవ్వుతూ.
“ఏం చదువుకున్నారు మీరు?” అనడిగింది ఆసక్తిగా.
“ఎం.ఏ లిటరేచర్!”
“మరిలా టాక్సీ నడుపుతున్నారేంటి?”
“చూడండి మేడం. మా రాష్ట్రంలో నిరక్షరాస్యులే లేరు. ఎంతమందికని ప్రభుత్వం ఉద్యోగాలు ప్రొవైడ్ చెయ్యగలదు. అందుకే తప్పుకాని ప్రతి పనిని కష్టపడి చేసుకుంటాం. అయినా డిగ్రీలు ఉద్యోగం కోసమనే ఉద్ధేశ్యం తప్పు మేడం!” అన్నాడతను ఇంగ్లీషులో.
“మీ పేరు?”
“క్రిష్టఫర్. నా సంగతికేం గాని పరిగెత్తుతున్న అందాల్ని మిస్ కాకుండా చూడండి” అంటూ హెచ్చరించేడతను.
లిఖిత మళ్ళీ కిటికీలోంచి బయటికి చూసింది.
కేరళ రాష్ట్రం చాలా గమ్మత్తుగా వుంది. మనలా ఒక వూరు, మధ్యలో ఖాళీ స్థలాలు, మళ్ళీ మరో వూరు. అలా లేదు. అడుగడుగునా తోటలు. తోటల మధ్య ఇళ్ళు. అలా ఎప్పటికీ ఊరు అంతం కానట్లుగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఇళ్ళనానుకునే బాక్ వాటర్సున్నాయి. వాళ్లంతా మరో చోటికి ఫెర్రీల ఆధారంతోనే వెళ్లడం గమనించింది లిఖిత.
“అవర్ స్టేట్ యీజ్ ఏ నేరో స్ట్రిప్ టక్ట్ ఎవే ఇన్ ద సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ఇండియా ఇన్ బిట్వీన్ ద అరేబియన్ సీ ఆండ్ వెస్ట్రన్ ఘాట్స్” అన్నాడు క్రిస్టఫర్.
లిఖిత అతని మాటలు వింటూ భగవంతుడు సృష్టించిన అందాల్ని ఇచ్చిన ప్రకృతిని ఎలా వుపయోగించుకున్నాడో గమనిస్తోంది. బాక్ వాటర్స్, కొబ్బరి తోటలు, టీ తోటలు, రబ్బరు తోటలతో కేరళ పచ్చదనంతో మనసుని పరవశానికి గురి చేస్తోంది.
టీ తోటల పసుపు, లేతాకుపచ్చ, ముదరాకు పచ్చరంగుల్లో కొండవాలుల్లో అందంగా గీతలు గీసి హద్దులేర్పరిచినట్లుగా కంపిస్తున్నాయి.
అడుగడుగునా చిన్న చిన్న వాగులు, జలపాతాలు, సూర్య కిరణాలు జొరబడకుండా పెరిగిన చెట్లు, నిజంగానే కేరళీయులు దేవతలు భూలోక సంచారానికి కేరళ రాష్ట్రాన్ని సృష్టించుకున్నారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపించింది లిఖితకి.
భగవతి కోవెలలో పూజారి కుట్టికారన్ చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చేయి. ఇంత చదువుకున్న అందమైన రాష్టరంలో నీచోపాసకులు ఎలా వెలిసేరో అనుకుంది బాధగా.
క్షణం సేపు తండ్రి గుర్తొచ్చి ఆమె మొహం మబ్బులు కమ్మినట్టయింది.
చీకటి పడుతుండగా టాక్సీ మున్నార్ టీన్ చేరుకుంది.
“ఎక్కడ దిగుతారు?” అనడిగేడు క్రిస్టఫర్.
“నాకు తెలీదు. మీరు చెప్పండి. ఎక్కడ బాగుంటుందో?”
“క్రిస్టఫర్ ఒక క్షణం ఆలోచించి “పదండి సినాయ్ కాటేజెస్‌కి తీసుకెళ్తాను” అంటూ టాక్సీని బస్టాండు దగ్గరగా వున్న సినాయ్ కాటేజెస్‌కి తీసుకెళ్ళేడు. లిఖిత అతనికి థాంక్స్ చెప్పి అతని టాక్సీ చార్జీలు పే చేసి లోనికెళ్లి ఒక రూం తీసుకుంది.
స్నానం చేసి భోంచేసి మనసు శరీరం అలసిపోవడం వలన వెంటనే పడుకొని నిద్రపోయింది లిఖిత..

**************
అహోబిళంలో నృసింహస్వామి దర్శనం చేసుకుని “నువ్విక్కడ ఈ కోనేటి గట్టున కూర్చో. నే వెళ్ళి స్వాములవారిని కలిసి రమ్మంటే నిన్ను తీసుకెళ్తాను” అన్నాదు వెంకట్ ఈశ్వరితో.
ఈశ్వరి బుద్ధిగా తలూపింది.
ఆమెకేదో ఆందోళన మొదలైంది మనసులో.
తనకెంత ధైర్యం! మొదటిసారి భర్తని, పిల్లల్ని వదిలేసి ఒక అపరిచిత వ్యక్తితో ఊరుగాని ఊరొచ్చేసింది.
అసలేం జరగబోతున్నదో!
ఇతను కూడ వెంకటే తన భర్తని చెబితే..
ఏం చేయాలి తనిప్పుడు! భర్తని.. పిల్లల్ని వదిలేసి .. ఇతనితో వుండిపోవాలా?
భర్తని వదిలేయగలదుగాని.. పాపం.. పిల్లలు.. ఆ పెద్దాడికి వంట రాదు. చిన్నాడు తనని చూడకుండా ఒక్క పూటా వుండలేదు. వాళ్ల చదువులు పాడయిపోతాయేమో! ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకుంటే.. ఆవిడ తన పిల్లల్ని సరిగ్గా చూస్తుందా? పోనీ తను వెంకట్‌ని బ్రతిమాలి తన పిల్లల్ని తీసుకెళ్తే! అతనొప్పుకుంటాడా?”
“ఈశ్వరి!!”
ఆ పిలుపు విని ఆమె తృళ్ళిపడి లేచి నిలబడింది.
ఎదురుగా వెంకట్‌తో పాటు ఒక గడ్డాలు మీసాలున్న వ్యక్తి నిలబడి వున్నాడు.
“ఈయనే ఓంకారస్వామి చెప్పిన స్వాములవారు. నమస్కారం పెట్టు” అన్నాడు వెంకట్.
ఈశ్వరి అతనికి నమస్కరించింది భయంగా.
“అతను కమండలమెత్తి అందులోని నీళ్ళు ఆమె మీద జల్లి “అపచారం చేసింది అమ్మణీ అమ్మ! నిన్ను కాదని మరొకణ్ణి కట్టుకుంది. పాప దోషం తీసేయాలి! ఒప్పుకుంటుందా?” అంటూ వెంకట్ వైపు తిరిగి చూశాడు.
“ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటున్నానని చెప్పు!” అన్నాడు వెంకట్ ఈశ్వరి వైపు తిరిగి.
ఈశ్వరి తలాడించింది అయోమయంగా .
“అయితే రండి” అంటూ అతను కోనేటిలోకి దిగేడు.
వెంకట్ అతనిననుసరించి ఈశ్వరి కోనేటిలోకి దిగేరు.
ఈశ్వరి భయంగా వెంకట్ భుజం పట్టుకుంది.
“ఊ!” అని ఘర్జించేడు స్వామి.
ఈశ్వరి బిత్తరపోతూ చూసింది.
“అపచార దోషం తీసేసేంతవరకు అతన్ని తాకరాదు.!”
ఈశ్వరి తలాడించి వెంకట్‌కి దూరంగా నిలబడింది.
ముగ్గురూ మొలలోతు నీళ్లలో నిలబడ్డారు.
దోసిళ్ళతో నీళ్లు పట్టుకోమని ఏవేవో మంత్రాలు చదవసాగేడు.
ఈశ్వరి కళ్ళు గట్టిగా మూసుకుంది.
అరగంట గడిచింది.
అతను వాళ్ల దోసిళ్ళలో తన చేతిలోని మూటలో పొడి తీసి జల్లేడూ. నీరు పసుపు పచ్చగా మారింది. మరో పొడి తీసి జల్లేడూ. నీరు క్షణాల్లో ఎర్రరంగుగా మారింది.
“దోసిట్లో నీటిని కోనేటిలో వంపండి”
ఇద్దరూ స్వామి చెప్పినట్లే చేసేరు.
క్షణాల్లో కోనేరంతా ఎర్రగా మారిపోయింది.
“కళ్ళు తెరవండి”
ఇద్దరూ కళ్లు తెరిచేరు.
“చూడండి కోనేరే రంగులో వుందో?”
“ఎర్రగా వుంది”
“ఎందుకలా అయింది?” గంభీరంగా అడిగేడు స్వామి.
ఇద్దరూ మౌనంగా చూశారతనివైపు.
ఈ అమ్మణి పాపం చేసింది. భర్తని కాదని మరో వ్యక్తిని మనువాడి ఇద్దరు పిల్లల్ని కన్నది. అందుకే కోనేరు కన్నెర్ర చేసింది . సరే! ఆ పాపమంతా తేసేసేను. ఇప్పుడో మంత్రం చెబుతాను. కళ్ళు మూసుకుని వినండి. మనసెటూ పోకూడదు” అంటూ హెచ్చరించేడు స్వామి.
ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు.
స్వామి ఏదో ఒక మంత్రం చెప్పేడు.
వెంకట్ కొద్దిగా కళ్ళు తెరచి స్వామివైపే చూశాడు.
స్వామి కన్ను కొట్టి ఇవతలికి రమ్మన్నాడు.
వెంకట్ నవ్వాపుకొని ఇవతలికొచ్చి నిలబడ్డాడు.
ఈశ్వరి మాత్రం ఏకాగ్రతగా భక్తిభావంతో కళ్ళు మూసుకుంది.
“నా మాటలు జాగ్రత్తగా విను”
ఈశ్వరి తలూపింది.
“ఇవి నేను చెబుతున్న మాటలు కావు. నీ అదృష్టం పండి ఇక్కడికొచ్చేవు. ఈ జన్మలోనే నీ భర్తని కలుసుకున్నావు. ఇక ఇతన్ని వదలకూడదు.అర్ధమయిందా?”
ఈశ్వరి అర్ధమైనట్లుగా తలూపింది.
“నీటిలో మూడు మునకలెయ్యి!” అన్నాడు అభుక్తేశ్వరస్వామి.
ఈశ్వరి అలానే చేసింది.
ఆమె నిలువెల్లా తడిచి సన్నగా వణుకుతోంది.
అభుక్తేశ్వరస్వామి దృష్టి తడిసిన బట్టల్లో స్పష్టమవుతున్న ఆమె శరీరాకృతి మీద మెడలో నగల మీద ఒక్కసారే పడింది.
“పాపాత్మురాలా!” అంటూ గావుకేక పెట్టేడు.
ఈశ్వరి ఇంకా వణికింది.
“నీ భర్త వుండగా ఆ పెళ్ళెలా చేసుకున్నావు? వాడిని వెంటనే ఈ క్షణం నుండి వదిలెయ్యాలి. అర్ధమయిందా?”
ఈశ్వరి “అయింది స్వామి!” అంది లెంపలు వాయించుకుంటూ.
“అయితే మెడలో తాళి తెంపు!”
ఆమె ఉలిక్కిపడింది.
“ఒక కుక్క కట్టిన తాళిని మెడలో వుంచుకుని ఎగతాళవుతావా?”
“లేదు”
“అయితే తెంచు. ఇతను నీ మెడలో తాళి కడతాడు”
ఈస్వరి అప్పటికే మానసికంగా అసక్తురాలయిపోయింది. పూర్తిగా వాళ్లేం చెబితే అది చేసే పరిస్థితిలో వుంది. భర్తిప్పుడు నిజంగా కుక్కలానే కన్పిస్తున్నాడు. వెంకట్ జన్మజన్మలకి తనకి భర్తగా అనిపిస్తున్నాడు.
ఏదో శక్తి ఆవహించినట్లుగా మెడలో తాళి తెంపేసింది.
అభుక్తేశ్వరస్వామి శంఖం పూరించేడు కోలాహలంగా.
వెంటనే ఆ తెంచిన బంగారపు తాడుని తన జేబులో వేసుకొని మంగళసూత్రాల్ని పసుపు తాడుకెక్కించి ఈశ్వరి మెడలో కట్టమన్నాడు వెంకట్‌ని.
వెంకట్ అతనివైపు నిస్సందేహంగా చూశాడు.
“కొంపేమి మునగదులే. వెయ్యి” అన్నాడతను నెమ్మదిగా.
ఎందుకైనా మంచిదని వెంకట్ ఆవిడ మెడలో నాలు ముళ్ళేసేడు.
ఇద్దరూ కోనేటిలోంచి బయటకొచ్చేరు.
“ఈ తీర్థం తాగండి” అంటూ కమండలంలోని తీర్థం ఇద్దరి చేతుల్లో పోసేడు.
వెంకట్ తాగబోతుంటే మళ్లీ కన్నుకొట్టి ఆగమన్నట్లుగా సైగ చేసేడు స్వామి.
ఈశ్వరి మాత్రం అదేం గమనించలేదు.
మూడుసార్లు భక్తిపూర్వకంగా తీర్థం తీసుకుంది.
“బయటికి రండి” అని ఆజ్ఞాపించి తాను ముందు నడిచేడు అభుక్తేశ్వరస్వామి. పేరుగు తగినట్టుగానే అతను డొక్కలు కనిపిస్తూ వున్నాడు. అతనిని నిశితంగా గమనిస్తూ అనుసరించేడు వెంకట్.
“ఈ పిల్ల విషయం నాకు మా రాజు రాసేడు” అన్నడతను వెంకట్‌తో గుసగుసగా.
వెంకట్ మాట్లాడలేదు.
స్వామి ఈశ్వరివైపు చూసి”నువ్వు కాస్సేపలా చెట్టు క్రింద కూర్చుని దైవధ్యానం చేసుకో” అన్నాడు.
ఈశ్వరి యోగనిద్రలో వున్నట్లుగా తల పంకించి అక్కడే వున్న చెట్టూ క్రింద కూర్చుంది.
అప్పటికే బాగా చీకటి పడింది.
పక్షులు గోలగోల చేస్తూ గూళ్లకి చేరేయి,.
అసలే వృక్ష సముదాయంతో వున్న ఆ ప్రాంతం మరింత చీకటిమయమైంది.
స్వామి అక్కడే వున్న మంటపంలో కూర్చుని వెంకట్‌ని కూర్చోమన్నట్లుగా సైగ చేసేడు.
వెంకట్ కూర్చున్నాడు.
“ఇక్కడే ఈ మంటపంలోనే మనకిప్పుడు శోభనం!”
స్వామి మాటలకి వెంకట్ ఉలిక్కిపడ్డాడు.
“మనకంటున్నారేమిటి?”
స్వామి కన్నుకొట్టి “నేనేం నిజం స్వాములోర్ని గాదు. నా పేరు అసిరి. మా అన్నలా నేనూ చిలకజోస్యం చెప్పి ఈ ప్రాంతాల్లో బతుకుతున్నాను. విశాఖపట్నంలో ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను. అందుకే ఇంత దూరం పారిపోయొచ్చేను. నాక్కాస్త ఆడ బలహీనతుంది. ఇదొక పిచ్చిముండ మనమిప్పుడేం చేసినా కాదనే స్థితిలో లేదు దాని మనసు. భయపడకు” అన్నాడు.
వెంకట్‌కెందుకో అతను చెప్పింది నచ్చలేదు.
అతని దృష్టి ఆమె ఆస్తి మీదే కేంద్రీకృతమై వుంది.
ఈ శారీరక సంబంధాల మీద అతనికి మక్కువ లేదు.
“వద్దు స్వామి! నాకింట్రస్టు లేదు. ఆ పిల్ల చాలా ఆస్తికి కాబోయే వారసురాలు. అది మనకొస్తే చాలు!” అన్నాడు.
స్వామి హేళనగా నవ్వేడు.
“అదెలానూ వస్తుంది. ఈ ఒంటరి రాత్రి అలాంటి ఆడపిల్లని వదులుకొనే స్థితి నీకుంటే వుండొచ్చు. నాకు మాత్రం లేదు. ఇపుడు మనమేం చేసినా కిమ్మనదా పిల్ల. నువ్వు కూర్చో” అంటూ స్వామి వేషంలో ఉన్న అసిరి చెట్టు క్రింద కూర్చున్న ఈశ్వరి దగ్గర కెళ్ళి భుజం తట్టేడు. ఆమె యాంత్రికంగా పైకి లేచింది.
అతనామె చెయ్యి పట్టుకుని మంటపం వైపు నడిపించేడు.
సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతమంతా ఒక టార్చ్ లైటు గిరగిరా తిరిగింది.
స్వామితో పాటు వెంకట్ కూడా ఆ కాంతిని చూసి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు.
వెంటనే అడుగులు చప్పుడు వినిపించింది.
ఏం జరగబోతున్నదో స్వామి వేషంలో వున్న అసిరి వెంటనే గ్రహించేడు.
అంతే!!
వెంటనే ఈశ్వరిని వదిలేసి రివ్వున చెట్ల గుబురుల్లోంచి పారిపోయేడు.
ఆ కాంతి చిన్నగా వెంకట్ మొహం మీద నిలిచింది.
“అబ్బాయ్! అమ్మాయేది?”
ఆ గొంతు హెడ్‌మాస్టారు నారాయణరెడ్డిగారిదని గ్రహించేడు వెంకట్.
వెంటనే గొంతు తడారిపోయింది.
“మీరా?” అన్నాదు హీనస్వరంతో.
“అవున్నేనే! మీరీ రాత్రికి ఇక్కడ వుంటారని తెలిసి పరిగెత్తుకొచ్చేను. మీకు ముందే చెప్పేను కదా. ఇక్కడ దొంగ వెధవలుంటారని. ఇంతకీ అమ్మాయేది?” అనడిగేరు మాస్టారు ఆత్రంగా.
“పిల్లల్లేరని అతను పూజ చేస్తానంటే…” అంటూ గొణిగేడు వెంకట్ ఏం చెప్పాలో తోచక.
మాస్టారు గాబరా పడుతూ “అసలమ్మాయేదయ్యా?” అన్నాడు కోపంగా.
వెంకట్ మంటపం వైపు చూపించేడు.
మాస్టారు, జట్కా అతను గబగబా మంటపం వైపు పరిగెత్తినట్లుగా నడిచేరు. అక్కడ ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా కళ్లు మూసుకుని కూర్చుని వుంది ఈశ్వరి.
ఆ అమ్మాయిని ఆ స్థితిలో చూసి మాస్టారి పితృహృదయం ద్రవించింది.
“అమ్మా ఈశ్వరి!” అని పిలిచేడు ఆర్ద్రత మేళవించిన స్వరంతో.
ఈశ్వరి పలకలేదు.
మాస్టారు ఆ పిల్ల వంటి మీద తడి బట్టలు చూసి “ఏం చేసారీ పిల్లని! వాడేడి?” అన్నడు రౌద్రంగా.
“ఏదో పూజ చేసేడు కోనేటిలో అతను పారిపోయినట్లున్నాడు” అన్నాడు వెంకట్ సగం ప్రాణం వచ్చి.
“నువ్వు చదువుకున్నావా?”
వెంకట్ తలాడించేడు.
“ఎందుకు? ఏడవను? మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అంతకీ పిల్లలు పుట్టకపోతే ఎవర్నయినా అనాధని పెంచుకోవచ్చుగా. నేను సందేహించి రాకపోతే.. ఈ పిల్ల బతుకు అధ్వాన్నమైపోయేది. ఏదో జరగబోతున్నదనే అనుమానంతోనే నేను పరిగెత్తుకొచ్చేను” అన్నారాయన.
వెంకట్ మాట్లాడలేదు.
మాస్టారు జట్కా అతని సహాయంతో ఈశ్వరిని జట్కా ఎక్కించేరు.
వెంకట్ ఎక్కేక మాస్టారు కూడా ఎక్కేరు.
జట్కా కదిలింది.
ఈశ్వరింకా ఈ లోకంలోకి రాలేదు.
జట్కా వెళ్తుంటే మాస్టారన్నారు మెల్లిగా.
“అహోబిళం చాలా పవిత్ర పుణ్యక్షేత్రం. చూడదగిన స్థలం. కాని మొగలిపువ్వులో మిన్నాగుల్లా ఇప్పుడిలాంటి ప్రాంతాల్ని దొంగస్వాములు ఆక్రమించుకుని కలుషితం చేస్తున్నారు. నమ్మిన మనుషుల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. పిల్లలు పూర్వ జన్మ రుణ సంబంధీకులు. రుణం లేకపోతే పిల్లలు కల్గరు. దానికోసం ఇంగితం మరచి నిన్ను కట్టుకున్న భార్యని పూజల పేరుతో పరాయి వారికప్పగిస్తావా? భార్యాబిడ్డలనే కాదు. ఏ స్త్రీనయినా గౌరవంగా చూడాలి. కన్నబిడ్డలా ఆదరించాలి. వీలైతే సహాయపడాలి. స్త్రీని మోసం చేసినవాడు స్త్రీ ఆస్తిని కాజేసినవాడు ఏడేడు జన్మలు రౌరవాది నరకాలను అనుభవిస్తాడని పెద్దలు చెబుతారు.

ఇంకా వుంది..

(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు,

శుభదినం.


₹బ్రహ్మలిఖితం 15
# పిచ్చి పిల్లనింకెప్పుడిలాంటి స్థలాలికి తీసుకురాకు.
“ప్రొద్దుటే మీ ఊరు బయల్దేరు” అన్నారాయన వెంకట్‌తో.
ఈశ్వరి ఆయన మాటలు విని అర్ధం చేసుకోగల్గితే ఎలా వుండేదో? కాని… అది జరగనే లేదు.
వెంకట్‌ని ఆమె భర్తగా అనుకోవడం మాస్టారి తప్పు.
స్వార్ధంతో కనుపొరలు కప్పుకుపోయిన ఆ నీచుడికి ఆయన చెప్పిన నీతిశాస్త్రం అర్ధం కాలేదు.
కొంచెంలో తను బయటపడ్డానని మాత్రమే సంతోషిస్తున్నదతని హృదయం.
******
ఎక్కడో ఒక పేరు తెలియని పిట్ట వెర్రి ఆనందంతో కూతలు పెట్టింది.
లిఖిత గిలిగింతలు పెట్టినట్లుగా లేచి కూర్చుంది.
ఆ పిట్ట క్షణక్షణానికి రెచ్చిపోతున్నట్లుగా కూత పెంచింది.
లిఖిత గబగబా వెళ్ళి కిటికి తలుపులు తెరిచింది.
ఎదురుగా, దూరంగా బట్టతలల్లా వున్న కొండలు, ఆ వెనుక పరుగులు పెడుతున్న మేఘాలు, కొండవాలులో వివిధ దశల్లో వున్న తేయాకు తోటలు, ఎందుకా పక్షి వెర్రిగా కూస్తున్నదో అర్ధమైంది లిఖితకి.
మనిషి పరవశంలోంచే కళలు పుట్టుకొచ్చేయి. విపరీతమైన సంతోషానికి గురయినప్పుడే అతను చిందులేసేడు. ఎలుగెత్తి అరిచేడు. ఆ చిందులే నాట్యంగా, ఆ అరుపులే సంగీతమై నిలిచిపోయేయి.
అక్కడ ప్రకృతి సోయగాలు చూస్తే ఎవరికైనా హద్దులు మరచి ఆడాలని, పరవశించి పాడాలనిపిస్తుంది.
లిఖిత మొహం కడుక్కుని బేరర్‌ని పిలిచి కాఫీ తాగుతూ “ఇక్కడ చూడదగిన స్థలాలేమిటీ?” అనడిగింది ఇంగ్లీషులో.
“ఇక్కడ ఏ ప్రదేశమైనా అందంగానే వుంటుంది మేడం. ఇది సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో వుంది. ఈ ఊరు ముద్ర పూజ, నల్లగాని కుండల అనే మూడు కొండవాగుల మధ్య వుంది!” అన్నాడు బేరర్ ఉత్సాహంగా
ఇంకెలా కదపాలో ఆమెకర్ధం కాలేదు.
“టిఫినేముంది?”
“ఇడ్లీ, దోసె, వద”
“అంటే ఇవి మా వేపూ వుంటాయి. మీ కేరళ వంటకాలేమీ లేవా?”
“ఉన్నాయి ఇడియప్పం, పుట్టు”
“పుట్టా? పేరు గమ్మత్తుగా వుంది. ఎలా చెస్తారు?” అనడిగింది లిఖిత.
“బియ్యాన్ని, కొబ్బరిని పొడుగాటి వెదురు గొట్టాల్లో పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు” అని చెప్పేడు బేరర్.
“ఒన్ ప్లేట్ పుట్టు” అంది లిఖిత నవ్వుతూ.
బేరర్ ఉత్సాహంగా వెళ్ళి పుట్టు తెచ్చి పెట్టేడు.
లిఖిత పుట్టు తినడం ప్రారంభించగానే బేరర్ ఆమె మొహంలో భావాల్ని గమనిస్తూ నిలబడ్డాడు.
“చాలా బాగుంది” అంది లిఖిత.
బేరర్ సంతృప్తిగా నవ్వాడు.
“ఇక్కడ మంత్రగాళ్లు, అదే క్షుద్రపూజలు చేసే వాళ్లుంటారటగా?” అనడిగింది లిఖిత.
ఆమె ప్రశ్న అర్ధం చేసుకుని మొహం చిట్లించేడు బేరర్.
“వద్దు మేడం. చాలా డేంజర్. అటెళ్ళకండి” అన్నాడు కంగారుగా.
“ఎటు?” అంది లిఖిత.
అతను ఇబ్బందిగా చూశాడామె వైపు.
“ఇక్కడికి నలభయి కిలోమీటర్ల దూరంలో మరయూర్ అనే ప్రాంతముంది. ఇక్కడ వాటంతటవే పుట్టి పెరిగిన గంధపు వృక్షాలుంటాయి. ఆ వెనుక అడవిలో వాళ్ళుంటారు కాని..”
“ఏంటో చెప్పు బ్రదర్!”
ఆ పిలుపుకే అతను కరిగిపోయేడు.
మీరూరికే చూడాలనుకుంటే అటువైపు వెళ్ళొద్దు. వాళ్ల చేతిలో పడినవాళ్ళు తిరిగి రారు. వాళ్ళు చేసే క్షుద్రపూజలు స్త్రీలు చూడకూడదు”
“ఎందుకు?”
“వాళ్ళ క్షుద్రదేవత కూడా స్త్రీ. వాళ్ల మంత్రాలకి స్త్రీలు వశం కారు. స్త్రీలో కూడా అంతర్గతంగా వుండే శక్తి వాళ్ల మంత్రశక్తుల్ని పారనివ్వదు. అందుకే ఆ ప్రాంతాల్లోకి స్త్రీలని రానివ్వరు”
అతని మాటలు విని ఆమె ఆలోచనలో పడింది.
ఆ వెంటనే ఏదో తోచినట్లు ఆమె కళ్ళు మెరిసేయి.
“మగవాడి వేషంలో వెళ్తే?”
“అంతవసరమా సిస్టర్?”
“అవసరమే. మా డేడి మరణాన్ని మట్టుపెట్టే మంత్రం నేర్చుకోవాలని ఈ అడవుల్లోకి వచ్చేరు. సరిగ్గా ఎక్కడున్నారో తెలీదు. ఆయన్ని వెదుక్కుంటూ వచ్చేను. నా సహాయపడలేవా?” అనడిగింది లిఖిత.
ఆ కుర్రాడి మనసు చలించింది.
“నేనెళ్ళిరానా?” అన్నాడు ఆత్రంగా.
“వద్దు. నేనే వెళ్తాను. నాకు నీదొక డ్రెస్సు కావాలి!”
“వాళ్లు లుంగీ కట్టమంటారు. కుదరదక్కా”
“ఫర్వాలేదు. తెచ్చిపెట్టు”
అతను నిర్లిప్తంగా చూసి వెళ్ళిపోయేడు.
లిఖిత ఆలోచిస్తూ కూర్చుంది.
“తను చాలా సీరియస్సయిన విషయాన్ని తేలికగా తీసుకుంటున్నదేమో. అంత ఇంటీరియర్ ఫారెస్టులోకి తాను మగ వేషమేసి వెళ్ళడం దుస్సాధ్యమేమో. ఏదైనా ప్రమాదం జరిగితే.. తనెలా తప్పించుకురాగలదు. తన దగ్గరెలాంటి ఆయుధమూ లేదు. ఇంతకీ తన తల్లి ఎలా వుందో. తిరిగి తను ఫోన్ చేసే ప్రయత్నమే చెయ్యలేదు. ఆమెని వెంకట్ గుప్పెట్లో పెట్టుకుని ఏ విధంగా సతాయిస్తున్నాడో? అలా అనుకోగానే ఆమెకి వెంటనే తల్లితో మాట్లాడాలనిపించింది. వెంటనే ఆపరేటర్‌కి చెప్పి లైనిమ్మంది.
మరో పది నిమిషాల్లోనే వైజాగ్‌కి లైను దొరికింది. కాని.. ఎంతసేపు రింగయినా రిసీవరెవరూ లిఫ్ట్ చేయడం లేదు.
లిఖిత నిస్పృహగా రిసీవర్ క్రెడిల్ చేసింది.
తల్లి నిజానికి ఆ టైములో ఫాక్టరీలో వుంటుంది. తను లేకపోయినా ఆమె ఏకాగ్రతగా ఫాక్టరీకెళ్లి పనులు చూసుకోగల్గుతున్నదా?
ఎందుకో ఆమె మనసు కీడునే శంకిస్తుంది.
తల్లిని వెంకట్ ఏ విధంగా యిబ్బంది పెడుతున్నాడో తెలీదు. వెంకట్‌లో ఎందుకంత రాక్షసత్వం ఉద్భవించిందో కూఋఆ ఆమెకర్ధం కావqడం లేదు.
“సిస్టర్!”
బేరర్ పిలుపుకి తలెత్తింది లిఖిత.
బేరర్ ఒక కవరు ఆమె చేతికందించి “కట్టుకోండి” అన్నాడు బయట కెళ్తూ.
లిఖిత కవరు తెరచి చూసింది.
ఒక కొత్త లుంగీ, బనీను, టోపీ వున్నాయందులో.
లిఖిత కొంత సంశయంగా వాటిని చూస్తూ కూర్చుంది కాస్సేపు.
తను తండ్రి కోసం అంత దూరమొచ్చింది.
మంచో చెడో, సఫలమో విఫలమో తన ప్రయత్నం తాను చేసి తీరాలి. ఇప్పుడు తను బెదిరి వెనుకడుగేస్తే తనిక జీవితంలో తండ్రిని కలవలేదు.
లిఖిత లేచి టాయిలెట్‌లోకెళ్ళి డ్రెస్ మార్చుకొని అద్దంలో చూసుకుంది.
తన రూపం తనకే నవ్వు తెప్పించింది.
ఒక సున్నితమైన మగపిల్లవాడిలా వుంది తను.
బాబ్డ్ హెయిర్‌ని క్లిప్పులతో బిగించి టోపీ పెట్టుకుని చిన్న బాగ్‌లో తనకు కావల్సిన టార్చిలైటు ఇత్యాదివి సర్దుకొని రూం లాక్ చేసి బయటకొచ్చింది.
బేరర్ ఆమెని వింతగా చూసి నవ్వి “బావున్నావక్కా! రా నిన్ను బస్సెక్కిస్తాను” అన్నాడు.
లిఖిత అతన్ననుసరించింది.
మున్నారు అందాలు చూస్తుంటే మనసు పరవశిస్తోంది.
తాత్కాలికంగా తన సమస్యల్ని మరచి అతనితో బస్టాండుకి చేరుకుంది.
వాళ్లు వెళ్ళేసరికి మరయూర్ బస్ సిద్ధంగా వుంది.
“అక్కా! నీకు మళయాళం రాదు. జాగ్రత్త. ఏదైనా తెలుగు పేరే చెప్పు. ఇంతకీ మీ నాన్నగారెలా వుంటారో తెలుసా?”
“తెలియదు”
ఆమె జవాబు విని ఆతనాశ్చర్యపోయేడు.
“మరెలా కనుక్కుంటావు?”
“అదే తెలియడం లేదు. ఆయన్ని పుట్టేక చూసే అదృష్టం కల్గలేదు. పేరు కార్తికేయన్”
అంది లిఖిత.
“కార్తికేయన్.. కార్తికేయన్” అంటూ ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేడు బేరర్.
కాని అప్పటికే బస్సు ఆ ప్రాంతాన్ని వదిలేసింది.
*****
కేయూరవల్లి మనసు మనసులో లేదు.
కూతురు తిరిగి తనకి ఫోను చేయలేదు. అసలెలా వుందో? వెళ్ళిన వెంకట్ కూడా తిరిగి రాలేదు. తనొక పిచ్చిది. కనీసం వెంకట్‌తోనన్నా తన భర్త ఫోటో ఇచ్చి పంపలేకపోయింది.
ఏం చేయడానికి దిక్కు తోచడం లేదు.
సరిగ్గా అప్పుడే ఆమెకొక టెలిగ్రాం వచ్చింది.
ఆమె ఆత్రుతగా సంతకం పెట్టి దాన్ని తిప్పి చూసింది.
“మీనన్ ఎక్స్‌పైర్డ్. జస్ట్ ఇన్ఫార్మ్‌డ్ నైబర్స్”
అది చూసి ఆమె పాతాళంలోకి కృంగిపోయిహ్నట్లయింది. ఇప్పుడు తమకి సహాయం చేసే మనిషొక్కడూ వెళ్ళిపోయేడు. చాలా దిగులుగా అనిపించింది కేయూరకు.
కష్టాలు అన్ని వైపులనుండి తరుముకొస్తున్న భ్రాంతి కల్గిందామె మనసుకి.
భర్తని వదిలి అనేక సంవత్సరాలు మనోనిబ్బరంగా, తనకు నచ్చిన రీతిలో గౌరవంగా బ్రతికింది తను. కాని ఏదో దుష్టగ్రహ ప్రభావం సోకినట్లుగా తాను అకస్మాత్తుగా అనేక కష్టనష్టాలకి గురవుతున్నది. కన్నకూతురు ఎటెళ్ళిందో తెలియడం లేదు. ఫాక్టరీకి కూడా కష్టాలు సంప్రాప్తించేయి. ఎక్స్పోర్ట్ అయిన స్టాకు తుఫానులో చిక్కుకుని డామేజయింది.
మనిషికి మరణం కన్నా గొప్ప శిక్ష ఒంటరితనం.
ప్రస్తుతం ఆమె పరిస్థితి అదే.
అది కూడా మానసికమైతే అదొక ప్రత్యక్ష నరకం.
కేయూరవల్లి పిచ్చిపట్టినట్లు గదంతా కలయ తిరిగింది కాస్సేపు. అప్పుడే ఆమె టెలిఫోన్ రింగయింది.
ఆ ఫోను లిఖిత నుండయి వుంటుందనే ఆత్రుతతో కేయూరవల్లి గబగబా వెళ్ళి రిసీవర్ ఎత్తింది.
“హలో నేను రాజ్యలక్ష్మిని”
రాజ్యలక్ష్మి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్. శిరిడిసాయి డివోటి. అప్పుడప్పుడు సత్సంగం పేరుతో సాయి భక్తుల్ని ఒక చోట చేర్చి సాయి సూక్తులు పారాయణం చేస్తుంటుంది. ఉచిత వైద్య సదుపాయాలు, అన్నదానాలు చేయడమ ఆమె కార్యక్రమాలు. ఆమె కేయూరకి స్నేహితురాలు.
“ఏంటి?” అంది కేయూరవల్లి నెరసంగా.
“ఏంటంత నీరసంగా మాట్లాడుతున్నావు? లిఖిత రాలేదా?”
“లేదు”
“ఏ విషయమూ తెలియలేదా?”
“లేదు.”
“సరే. ఒక పని చెయ్యి. ఇప్పుడు వెంటనే నా దగ్గరకి బయల్దేరిరా. ఇక్కడికి నందనం నుండి బాబా భక్తులొకరొచ్చేరు. ఆయన్ని కలిస్తే నీకేదైనా పరిష్కారం కనిపించొచ్చు”
“సరే!” అంది కేయూర.
అనుకొన్న వెంటనే కారు తీసుకుని రాజ్యలక్ష్మి ఇంటీకి బయల్దేరింది.
మనసులో ఏవేవో ఆలొచనలు
అసలు దేవుడున్నాడా?
దేవుడున్నప్పుడు దయ్యమూ వుంటుందా?
దేవుడుంటే మంచివాళ్లకెందుకీ కష్టాలు?
దేవుడు నిర్వికారుడంటారు కదా, మరెందుకిన్ని రూపాలు వెలిసేయి. కేయూర పిచ్చిపిచ్చిగా ఆలోచిస్తూ రాజ్యలక్ష్మి ఇల్లు చేరింది.
కేయూరని సాదరంగా ఆహ్వానించింది రాజ్యలక్ష్మి.
నందనం నుండి వచ్చిన శర్మగారు కేన్ చెయిర్‌లో కూర్చుని ఉన్నారు. అప్పుడే కొంతమంది భక్తులు ఆయన రాక తెలిసి వచ్చి ఆయనకి నమస్కరిస్తున్నారు. ఏవేవో సందేహాలడుగుతున్నారు.
కేయూరవల్లిని చూడగానే ఆయన మందహాసం చేసేరు.
కేయూర నమస్కరించింది.
“మనిషి ప్రాకృత ఆలోచనే దేవుడు. అతని వికృత దృక్పధమే దయ్యం. తెలిసిందిగా..” అన్నారాయన.
కేయూర ఉలిక్కిపడినట్లుగా చూసిందతనివైపు. తను కారులో వేసిన యోచనీయనకెలా తెలిసింది.నిజంగా ఇతనేదో దైవాంశభూతుడేమో. అనుకుని మనసులో.
“రామ్మా కూర్చో”
కేయూర చాప మీద కూర్చుంది.
“నాలో ఏ అద్భుత శక్తి లేదు. నేనూ మీలాంటి మనిషినే. అన్ని కష్టాలూ చూసాను. కడగళ్ళు పడ్డాను. కన్నీళ్లు కార్చేను. ఎవరో సాయిని నమ్ము అన్నారు. ఆ రోజు నుండి సాయిని ప్రార్ధిస్తూ వచ్చెను. ఆయన్ని నేను ఏమీ అడగను. నన్నెవరు కష్తపెట్టినా, అవమానించినా, మోసగించినా నేను సాయి ఎదురుగా కూర్చుని ఆ నీచుల బారి నుండి నన్ను రక్షించమని ప్రార్ధిస్తాను. అంతేగాని వారిని దండించమని అడగను. నాకిది కావాలని కోరను. అలా అలా బాబాకి నేను సన్నిహితుణ్ణయ్యేను. చాలామంది నాలో ఏదో శక్తి వుందనుకుంటారు. ఆ శక్తి నీలోనూ వుంది తల్లి. నీవు కూడా భక్తురాలివేగా?”
అతని మాటలు మంత్రముగ్ధురాలిగా విన్నది కేయూరవల్లి. అతని కళ్ళలో ప్రేమ, వాత్సల్యం తొణికిసలాడుతున్నాయి.
రాజ్యలక్ష్మి వాళ్లందరికీ కాఫీలు తెచ్చిచ్చింది.
అందరూ వెళ్ళిపోయేక రాజ్యలక్ష్మి అతని దగ్గరగా కూర్చుంది.
“స్వామి! కేయూర కూడా చాలా భక్తురాలు. కాని ప్రస్తుతం ఆమె కాలం బాగా నడవటం లేదు. మానసికంగా చాలా క్షోభననుభవిస్తోంది. భర్త జడ, కూతురి జాడ తెలియడం లేదు. ఫాక్టరీలో కూడా నష్టాలు ప్రారంభమయ్యాయి. ఏదైనా మార్గం చెప్పండి!” అంది వినయంగా.
ఆయన కేయూరవైపు చూసి నవ్వారు.
“నేనెవర్నమ్మా మార్గం చెప్పడానికి. సాధనలచే అందరాని యసాధ్య వస్తువు సాయినామము. శోధనలు ఉడుగంగ గన్నడు చోద్యమీ శ్రీ సాయి నామం. నీవెంత తీవ్రంగా ప్రార్ధిస్తే అతనంత వేగంగా నీ సమస్యల్ని పరిష్కరిస్తాడు” అన్నారాయన.
కేయూరవల్లి అతనివైపు చూసింది.
“ఏంటి సందేహిస్తున్నావు?” అనడిగేడాయన.
“ఇంతవరకు మనస్థయిర్యంగానే బతికేను. ఎవరిచేతనైనా మోసపోయేవేమోగాని మోసగించలేదు. కాని.. ఇప్పుడేదో బలం కోల్పోతున్నట్లుగా వుంది. దిగులుగా వుంది” అంది కేయూర దీనంగా.
“బలిమి లేదను వగచు వారికి
బలము తానౌ సాయినామము
బలము చే గర్వించు వారికి
బల్లెమీ శ్రీ సాయి నామము”
“నీకేం భయంలేదు. సదా సాయిని జపించి నిమిత్త మాత్రురాలినై చూస్తూ కూర్చో. అతనే నీ ఛత్రం పడతాడు. అతనే నీ శత్రువులని కాలరాస్తాడు. నువ్వెంత నిజాయితీగా వుంటే ఆయన నీకంత త్వరితంగా దర్శనమిస్తాడు. మీ అమ్మాయికేం భయం లేదు. ఆమె విజయం సాధిస్తుంది. ఇవి బాబా చెబుతున్న పలుకులు. నావి కావు. ఈ విభూది పొట్లం గుమ్మానికి కట్టు. నీ ఇంట్లోకి శత్రువు రాలేదు” అన్నాడాయన ఒక విభూది పొట్లం ఇస్తూ.
కేయూర అతనికి నమస్కరించి బయటికి నడిచింది. రాజ్యలక్ష్మి ఆమెననుసరించింది.
భయపడకు. నీ పూజలూరికే పోవు. నీవు ఎవరి కొంపలూ ముంచలేదు. ఎవరి జీవితాలూ నాశనం చేయలేదు. నిన్ను భగవంతుడు సదా కాపాడుతాడు” అంది ఓదార్పుగా.
కేయూర చిన్నగా నవ్వడానికి ప్రయత్నించి “వస్తాను” అంది మెట్లు దిగుతూ.
ఆమె కారెక్కి బయల్దేరే వరకూ చూస్తూ నిలబడింది రాజ్యలక్ష్మి. కారెళ్లిపోయేక రాజ్యలక్ష్మి లోపలికొచ్చింది.
“ఆమె పెద్ద ఆపదలో వుంది. ఒక దుర్మార్గుడు ఆమె ఆస్తిని కాజేసే పథకం తయారుచేస్తున్నాడు. కాని.. అది జరగదు. ఆమె జోలికెళ్ళిన వాళ్లు వాళ్ళ కళ్ళు వాళ్ళే పొడుచుకుంటారు” అన్నారు శర్మగారు స్వగతంలా.
రాజ్యలక్ష్మి అతనివైపు చిత్రంగా చూసింది.
ఆయన చిన్నగా నవ్వి కళ్ళు మూసుకున్నారు.
“రుజువుగా వర్తించువారికి
రుజువు తాజౌ సాయినామము
రుణ విమోచనమైన ముక్తికి
రూపమీ సాయినామము.
ఆయన గొంతులో భక్తి పారిజాత పరిమళంలా వెల్లివిరుస్తోంది.
*****
ఆ అడవిలో బస్సు చిత్రవిచిత్రమైన మెలికలు తిరుగుతూ హైలీ ఎలివేటెడ్ రోడ్డుల మీద కొండ చిలువలా పాకుతూ వెళ్తోంది.


ఇంకా వుంది..
(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)
ధన్యవాదాలు.
శుభదినం.
16
ప్రతి కిలోమీటరుకి అడవి దట్టమవడం గమనించింది లిఖిత. ముందంతా రబ్బరు తోటలున్నాయి.
వాటికి కట్టిన చిన్న చిన్న కుండలలో గాటు పెట్టిన చెట్టు నుండి చిక్కని పాలు కారుతున్నాయి. కొన్ని చోట్ల పాలని ట్రేలో ఎండబెట్టి తయారుచేసిన రబ్బరు షీట్లు ఆరవేసున్నాయి.
కొంత దూరం వెళ్లేక వాతావరణం బాగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులు కొండలమీదకు విహారం వచ్చినట్లుగా తిరుగుతున్నాయి.
ఇది తన తండ్రి చావు బ్రతుకుల సమస్య కాకపోతే తనెంతో ఎంజాయ్ చేసి ఉండేది విహారాన్ని. కాని మనసులో ఆయన ధ్యాస ఒక పక్క ముల్లులా గుచ్చుకుంటున్నది.
“ఎక్కడికెళ్తున్నావ్?”
పక్కన కూర్చున్న వ్యక్తి ప్రశ్నకి తన ఆలోచనలనుండి బయటపడి చూసింది లిఖిత.
ఒక వృద్ధుడు నుదుట అడ్డనామాలతో కూర్చుని లిఖిత వైపే చూస్తున్నాడు.
అతను మళయాళంలో మాట్లాడింది ఆమెకర్ధం కాలేదు.
“ఐ డు నాట్ నో మళయాళం” అంది.
“సైట్ సీయింగ్?”
“ఊ” అంది పొడిగా.
“యువర్ నేం?”
లిఖిత అనబోయి నాలిక్కరుచుకొని “ప్రభు” అంది అప్పటికప్పుడు తోచింది చెబుతూ.
అతను తర్వాతేం మాట్లాడలేదు.
బస్ మరయూర్ చేరింది.
లిఖితతో పాటు ఆ వృద్ధుడు కూడా బస్ దిగేడు. బస్ దిగి లిఖిత ఎటెళ్ళాలొ ఏం చేయాలో తెలీక అలాగే నిలబడింది.
మనసు మళ్ళీ ఆందోళన వైపు మొగ్గిపోసాగింది.
ఆ వృద్ధుడు ఆమెని దీక్షగా గమనిస్తూ “ఎక్కడికెల్లాలో చెప్పు. నేను తీసుకెళ్తాను” అన్నాడు వచ్చీరాని ఇంగ్లీషులో.
లిఖిత అతని మొహంలోకి నిశితంగా చూసింది. అతని వయసు అరవై దాటి ఉంటుంది. అతని కళ్లు గాజుగోళాల్లా ఉన్నాయి. భవరహితంగా అతనికి తను నిజం చెప్పొచ్చో లేదో. చెప్పకపోతే తనకిక్కడ ఆ మాత్రికులుండే దారెవరు చూపిస్తారు. ఇలాంటి పెద్దవాళ్లకి విషయాలు తెలిసుండొచ్చు. అతను వృద్ధుడు తనకెలాంటి హానీ చేయడు అనే నమ్మకం కుదిరిందామెకు.
“ఇక్కడ చేతబడులు, క్షుద్రపూజలు చేసే వాళ్లుంటారట. ఎక్కడో తెలుసా?”
అతను కళ్ళు పెద్దవి చేసి “వాళ్లతో ఏం పని నీకు?” అనడిగేడు.
“మా నాన్నగారు వాళ్ల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుందామని వచ్చేరు. ఆయన్ని వెదుక్కుంటూ వచ్చేను” అంది లిఖిత.
“నీకు భయం లేదా?” అతనాశ్చర్యంగా అడిగేడు.
లిఖిత లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది.
అతను ‘పద’ అంటూ ముందుకి నడిచేడు.
చందనపు చెట్ల సుగంధ శీతల గాలుల్లో వాళ్లిద్దరూ అలసట మరచి ముందుకు సాగేరు.
అరగంట గడిచింది.
ఆ చెట్లకవతల వున్న ఒక పెద్ద కొండ దగ్గర ఆగేడా వృద్ధుడు. లిఖిత కూడా ఆగింది.
“వెళ్లి ఆ వాగులో కాళ్లు కడుక్కునిరా”
లిఖిత వాలులో ప్రవహిస్తున్న వాగువైపు సాగింది. తన చేతిలోని సంచిని వాగు పక్కన పెట్టి కాళ్లు, చేతులు, మొహం కడుక్కుని తిరిగి చేతిలోకి సంచిని తీసుకుంది. అలా తీసుకోవడంలో ఆమెకు భగవతి కోవెలలో పూజారి కుట్టికారన్ ఇచ్చిన కుంకుమ పొట్ళం జారి క్రిందపదిపొవడం ఆమె గమనించలేదు.
అదే ఆమె దురదృష్టం.

*****

వాల్తేర్ స్టేషన్‌లో రైలు దిగగానే ఈశ్వరి వెంకట్ వైపు సందిగ్ధంగా చూసి “నేనిప్పుడెక్కడికెళ్ళాలి?” అని ప్రశ్నించింది.
“ఇంకెక్కడీకి, మీ ఇంటికే!” అన్నాడు వెంకట్.
“అదెలా? నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాను. మీ ఇల్లే నా ఇల్లు” అంది ఈశ్వరి.
“అది నిజమే అనుకో. కాని.. నేను నీ కోసం మంచిల్లు చూడాలి. అన్ని వస్తువులూ కొనాలి. నువ్వు కూడా మీ ఆయనకి డైవొర్స్ ఇవ్వాలిగా. లేకపోతే శ్రీకృష్ణజన్మస్థానంలో పెడతారు మనిద్దర్ని.” అన్నాడు వెంకట్ ఆమెకి నచ్చచాబుతున్న ధోరణిలో.
ఈశ్వరి మొహం నిరుత్సాహంగా తయారయింది.
“నేను మిమ్మల్నొదిలి బ్రతకలేను” అంది బాధగా.
“ఎంత. నాల్రోజులోపిక పట్టు” అన్నాడు ఓదార్పుగా. ఈశ్వరి వస్తున్న కన్నీళ్లాపుకొని ఆటో ఎక్కింది.
వెంకట్ హమ్మయ్య అనుకొని మరో ఆటో ఎక్కి తన రూం చేరుకున్నాదు. అతను ఆటో చార్జీలు పే చేసి వెనక్కు తిరిగేసరికి అక్కడ తన మామయ్య సూర్యనారాయణ నిలబడి ఉన్నాడు.
అతన్ని చూడగానే గుండె గుభేలుమంది వెంకట్‌కి.
సూర్యనారాయణ గర్భ దరిద్రుడు. ఏ పని చేసినా కలిసి రాలేదు. ముగ్గురు కూతుళ్లు. అందులో ఏ దరిద్ర దేవతనో తనకంటగట్టాలని అతని ప్లాను. ఇదివరకు అనేక ఉత్తరాలు రాసేడు. తను జవాబివ్వకపోవడంతో నేరుగా వచ్చేసేడు.
“బావున్నావా అల్లుడూ! ఇంటికి తాళం కనిపించేసరికి ప్రాణం ఉసూరుమనిపించింది. వెళ్లిపోదామనుకుంటుండగా వచ్చేవు. నా అదృష్టం బాగుంది.” అన్నాడతను నవ్వుతూ.
వెంకట్ వస్తున్న ఏడుపుని నవ్వుగా మార్చుకొని “బాగానె ఉన్నాను. ఆఫీసు పని మీద టూరెళ్లేను” అంటూ ఇంటి తాళం తీసేడు.
“ఉద్యోగం చేస్తున్నావన్నమాట. బాగుంది. ఇంతకీ ఎలాగైనా మా పెద్దది అదృష్టవంతురాలు” అన్నాడాయన కుర్చీలొ దుమ్ము భుజమ్మీద కండువాతో దులుపుకొని కూర్చుంటూ.
తనుద్యోగం చేయడం వాళ్లమ్మాయి అదృష్టంగా ఎలా మారిందో ఆలొచిస్తూ “పని మీద వచ్చేవా?” అనడిగేడు ఎదురుగా వున్న స్టూలు లాక్కుని కూర్చుంటూ.
“పనే మరి! పెద్దదాని పెళ్లి చేయాలనుకుంటున్నాను” అన్నాడాయన నవ్వుతూ.
“కుదిరిందా?” అనడిగేడు వెంకట్ అమాయకంగా.
“పెద్దాడితో పరాచికాలాడకు. అది నిన్ను తప్ప మరొకర్ని కట్టుకోనని భీష్మించుకుంది. అందుకే వచ్చేను” అన్నాడు.
వెంకట్ గుండె గుభేలుమంది.
“అదికాదు మామయ్యా. నాకిప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు” అన్నాడు.
“నువ్విలా మాట్లాడతావనే శుభలేఖలచ్చేయించుకొని మరీ వచ్చేను. నా కూతురు కనకమహాలక్ష్మికేం లోటు. నిన్నే ప్రేమించిందని వెంటబడుతున్నాను కాని.. అప్పుడే విజయనగరంలో అరడజను దిగ్విజయమైన సంబంధాలొచ్చేయి తనకి” అన్నడు.
“మరింకేం చెయ్యలేకపోయేవా?” అంటూ వెటకారంగా అడిగేడు వెంకట్.
“చెబుతున్నాగా నిన్ను ప్రేమించి చచ్చిందని. పైగా చచ్చిన మీ అమ్మ కూడా నిన్ను నా కూతురికి చేసుకోమని చెప్పి మరీ చచ్చింది. లేకపోతే దాని పేరున పది లక్షలు బంపర్ లాటరీ వచ్చిన విషయం తెలిసి జనం ఎగబడుతున్నారు” అన్నాడు సూర్యనారాయణ గర్వంగా.
ఆ మాట వినగానే పాదాల క్రింద బాంబు పెట్టినట్లు ఎగిరి పడ్డాడు వెంకట్.
“ఏంటి మామయ్యా నువ్వు చెబుతున్నది నిజమేనా? కనక బంపర్ కొట్టేసిందా?” అనడిగేడు ఆశ్చర్యంగా.
వెంకట్ వెంటనే పెళ్ళికి ఒప్పేసుకుంటే డబ్బు మీద ఆశ పడుతున్నాడనుకుంటారని “నాకు నికరమైన ఉద్యోగం లేదు. పెళ్ళాన్నెలా పోషిష్తాను?” అన్నాడు బధగా మొహం పెట్టీ.
మగాడికి పెళ్ళాం పట్ల ప్రేమ, తన మగతనం పట్ల నమ్మకముంటే చాలు. ఆడది శుభ్రంగా సుఖపడిపోతుంది. అయినా దానికొచ్చిన డబ్బుల్లో సగం దానికే ఇద్దామనుకుంటున్నాను. ఇక భయం దేనికి?”
మామగారి మాటలు విని వెంకట్ ఉక్కిరిబిక్కిరయిపోయేడు. వెంటనే “నీ ఇష్టం” అన్నాడు సిగ్గు అభినయిస్తూ.
“అయితే నాతో బయల్దేరు” అన్నాడు సూర్యనారాయణ లేచి నిలబడి.
వెంకట్ ఇంటీకి తాళం వేసి అతనితోపాటు మెట్లు దిగేడూ అమితమైన ఆనందంతో.

*****

ఆ గుహ బాగా చీకటిగా ఉంది.
ఆ చీకటిని పారద్రోలేందుకు అక్కడక్కడా గుచ్చిన కాగడాలు ప్రయత్నిస్తున్నాయి.
లిఖిత ఆ వృద్ధుని వెంట లోనికి నడిచింది.
లోపల ఒక పెద్ద హోమగుండం వెలుగుతోంది.
అక్కడ కొందరు నల్లగా దృఢంగా వున్న వ్యక్తులు జనపనార గుత్తుల్లాంటివి నూనెలో ముంచి ఆ హోమగుండంలోముంచి నేలకేసి బాదుతున్నారు. ఆ చర్య అంతరరార్ధమేంటో లిఖితకి అర్ధం కాలేదు.
గుహలోపల ఒక ఎత్తయిన రాతి ఫలకం మీద పది తలలు, ఇరవై చేతుల స్త్రీ విగ్రహం దిశమొలతో ఉంది. ఆ పది తలల కళ్ళు వివిధ భావాల్ని ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాయి. ఆ విగ్రహం పది నాలుకల్ని బయటకు సాచింది వికృతంగా. పెదవుల కిరువైపులా ఉన్న కోరలకి మాంసపు ముక్కలు గుచ్చి ఉన్నాయి.
బట్టతల, అడ్డబొట్టు పెట్టుకున్న వృద్ధుడొకడు ఆ విగ్రహమ్ముందు కూర్చుని మంత్రాలు చదువుతున్నాడు.
లిఖిత ఆ వాతావరణాన్ని భయంగా చూస్తోంది.
లిఖితతో వచ్చిన వృద్ధుడు ఆమెని అక్కడే నిలబడమని సైగచేసి పూజ చేస్తున్న వృద్ధుడి దగ్గరకెళ్ళి “మహామాయా!” అని పిలిచేడు.
అతదు కళ్ళు తెరచి చూసేడు ఏంటన్నట్లుగా.
“నువ్వు కావాలనుకున్నంత వయసు కుర్రాడు దొరికేడు” అన్నాడు మళయాళంలో.
అతను వెనక్కు తిరిగి చూసేడు.
లిఖిత టోపీతో లుంగీతో నిలబడి ఉంది.
“మన ప్రాంగణంలోకి నెత్తిన టోపీ పెట్టుకుని రాకూడదని చెప్పలేదా?” అన్నాడు మహామాయ
“మరచిపోయేను. ఇప్పుడు చెబుతాను”అంటూ వెనుతిరగబోయేడు వృద్ధుడు.
“ఆగు. పూజ ముగించి నేనొస్తాను. ఇంతకీ వాడు బ్రాహ్మణుడేనా?”
“తెలియదు. అడగలేదు”
“సరే. కాస్సేపాగు”
వృద్ధుడు వెనుతిరిగి లిఖిత దగ్గరకెళ్లి” కూర్చో. మహామాయ వస్తాడు” అన్నాడు.
లిఖిత అక్కడే ఉన్న రాయి మీద కూర్చుంటూ “ఏం చేస్తారిక్కడ?”అనడిగింది అమాయకంగా.
“ఏం చేద్దామని వచ్చావిక్కడికి?”
“మా నాన్న ఉన్నాడేమోనని. ఆయనిటువైపు అడవుల్లోకొచ్చేడని తెలిసి వచ్చేను.”అంది లేచి నిలబడుతూ.
“మీ నాన్న పేరు?”
“కార్తికేయన్”
ఆ జవాబు విని ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి.
“కూర్చో. మహామాయ వచ్చేక మాట్లాడుదువుగాని”
లిఖిత మళ్ళీ కూర్చుంది. దిక్కులు చూస్తూ, అక్కడి వ్యవహారం చూస్తే పిచ్చి పట్టేటట్లుంది.
చీకటిని మింగిన గుహలో, చిరుత కళ్ళలాంటి కాగడాలు వెలుగుతున్నాయి.
ఆ ఎర్రని కాంతిలో నల్లని పోత పొసిన కంచు విగ్రహాల్లాంటి మనుషులు కేవలం మాటలు రాని రోబోట్‌ల్లా యాంత్రికంగా ఊహకందని పనులు చేసుకుంటూ పోవడం, భగభగ మండే హోమగుండం, వికౄతంగా నాలుకలు సాచిన విగ్రహం. తన తండ్రి అకక్డ కూడా లేకపోతే ఏం చేయాలి.
ఆమె ఆలోచిస్తుండగానే మహామాయ ఆమె దగ్గర కొచ్చి నిలబది “నువ్వు కార్తికేయన్ కొడుకువా?” అనడిగేడు.
లిఖిత బెదురుతూ లేచి నిలబడి అవునని తల పంకించింది.
మహామాయ వృద్ధుడికేసి తిరిగి చిరునవ్వు నవ్వి “కుర్రాడు సున్నితంగా అమ్మాయిలా ఉన్నాడు” అన్నాడు మళయాళంలో.
వృద్ధుడు నవ్వాడు.
“ఇక్కడికి నెత్తిన టోపీ ధరించి రాకూడదు. తీసేయ్”
లిఖిత బెదిరినట్లు చూసింది మహామాయ వైపు.
“నీకే చెప్పేది”
“ఇంతకీ మా డేడీ ఉన్నారా ఇక్కడ?”
“ఆ సంగతి తర్వాత. ముందు టోపీ తియ్యి”
లిఖిత భయం భయంగా టోపీ తీసేసింది.
టోపీలో ముడిచిపెట్టిన జుట్టు భుజాల మీదకు జారింది. మహామాయతో పాటు, వృద్ధుడు కూడా నివ్వెరపోయి చూశారామెవైపు.
“నువ్వు అబ్బాయివి కావా? అనడిగేడు వృద్ధుడు ఆశ్చర్యంగా.
“అబ్బాయినే. అబ్బాయినే. నాకు మొక్కుంది.మా నాన్న కనిపించేక జుట్టు తీస్తానని”అంది కంగారుగా.
మహామాయ ఫక్కున నవ్వాదు.
ఆ నవ్వుకి గుహంతా దద్దరిల్లింది. వారి వారి పనుల్లో నిమగ్నమైన వాళ్లందరూ ఏకాగ్రత చెదరి మహామాయవైపు చూశారు.
మహామాయ ఎదుట నిలబడిన అమ్మాయిలాంటి అబ్బాయి మీద వాళ్లందరి దృష్టి పడింది.
“ఎందుకలా భయపడతావురా. నీకు తండ్రంటే ఎంతిష్టమా. సరే. మా దగ్గర చాలామంది భక్తులున్నారు. వాళ్లలో ఎవరు నీ తండ్రో రేపు తెలుసుకుందువుగాని. ఈ రాత్రికి కొలను పక్కన పడుకో. నువ్వు లోనికి రావచ్చునో లేదో అమ్మనడిగి చెబుతాను” అన్నాడు మహామాయ. లిఖిత భుజం చరుస్తూ.
లిఖిత తలవూపి మెల్లిగా బయటకొచ్చి కొలను పక్కన రాతిమీదకూర్చుంది భయంగా.
అప్పుడే చీకటి చెట్ల నీడలతో కలిసి దట్టమైన దుప్పటిలా అడవంతా పరచుకుంటుంది.

*****

“నీకు పూర్తిగా మతి పోయింది”
ఈశ్వరి చెప్పిన కథ విని తెల్లబోయి గట్టిగా అరచింది లావణ్య.
ఆమె అరుపుని విని మిగతా కొలీగ్స్ వాలిద్దరి వైపు చూసారు. ఆ విషయం గ్రహించి ఈశ్వరి “ష్”అంది.
లావణ్య పరిస్థితి గ్రహించి గొంతు తగ్గించి “నువ్వు చాలా పొరపాటుగా ప్రవర్తిస్తున్నావు. ముత్యాల్లాంటిద్దరు పిల్లల్ని, భర్తని పెట్టూకుని ఇంకొకడు నా మొగుడంటూ పెళ్లి చేసుకుంటావా? బుద్ధుందా అసలు” అంది.
ఈశ్వరి నవ్వి “ఏం చేస్తాను. అతనే నా భర్తని తెలిసేక, నువ్వయితే మాత్రమేం చేస్తావేంటి?” అంది తిరిగి ఎదుగు ప్రశ్నేస్తూ.
“నేనిలాంటి దొంగ సన్యాసుల మాటల్ని వినను. అయినా పూర్వజన్మ సింగినాదాల్ని నేను నమ్మను. ఇప్పుడు వీళ్లనేం చేస్తావు?”
“వదిలేస్తాను”
ఆ జవాబు విని తెల్లబోయింది లావణ్య.
“నిన్నెవరో భారీ ఎత్తున మోసం చేస్తున్నారే ఈశ్వరి. వెంటనే వాళ్లమీద పోలీస్ రిపోర్టివ్వు. లేకపోతే నువ్వింకా చిక్కుల్లో పడతావు” అంది.
“అది నీ భ్రమ. వెంకట్ నా జన్మజన్మల భర్త. నేనిక ఈ కుక్కగాడితో కలిసి బ్రతకడం దుర్లభం” అంది ఈశ్వరి నిష్కర్షగా పర్సు తీసుకుని తన సీటు కెళ్లిపోతూ.
లావణ్య ఆమెవైపు బాధగా చూసింది.
“ఈశవరి ఉత్త అమాయకురాలు. పల్లెటూరినుండొచ్చింది. కుటుంబరావుతో ఆమె కాపురమంత వరకూ సజావుగానే సాగుతోంది. ఎవరో ఆమెని మనసు విరిచి పక్కదారి పట్టిస్తున్నారు. ఏ ఉద్ధేశ్యంతోనో” అనుకుంది బధగా.
ఈశ్వరి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నది. తను ఇక ఎంతమాత్రం వెంకట్‌కి దూరంగా ఉండదు. ఉండలేదు. తన గత జన్మ వృత్తాంతం వీలైనంత తొందరగా కుటుంబరావుకి చెప్పి వెంకట్ దగ్గరకెళ్ళిపోవాలి. ఎందుకనో వెంకట్ అహోబిళం నుండి వచ్చే తనకి తిరిగి కనిపించలేదు. ఏమయ్యేడో. ఆమె ఆఫీసవర్సు అయ్యేవరకు అతని గురించే ఆలోచిస్తూ గడిపింది.
అలా ఆలోచిస్తూనే ఆమె ఇల్లు చేరుకుంది.
ఇల్లు, పిల్లలు తనకి సంబంధం లేనివిలా కనిపిస్తున్నాయి. ఆమెని చూసి పిల్లలు పరిగెత్తుకొచ్చి “ఆకలేస్తుంది. ఏవైనా వండమ్మా” అన్నారు.
“అవన్నీ మీ నాన్ననడగండి. ఈ రోజు నుండి నాకేం సంబంధం లేదు” అంది.
పిల్లలు తెల్లబోయి చూశారు తల్లివైపు.
“సరే ఈ పది రూపాయలు పట్టుకెళ్ళి ఏవైనా తెచ్చుకు తినండి. నేను బయటకెళ్ళొస్తాను” అంటూ వాళ్లకి నోటందించి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని చీర మార్చుకుని ఆటో ఎక్కి భీమిలి రోడ్డులోని ఓంకారస్వామి ఆస్రమానికెళ్లింది.
ఈశ్వరిని చూడగానే రాజు ఓంకారస్వామిని చూసి కన్ను గీటేడు.
“ఏం జరిగింది బాలా? అహోబిళం వెళ్ళొచ్చేరా?” అనడిగేడు ఓంకారస్వామి.
“వెళ్ళేం స్వామి. అక్కడ అభుక్తేశ్వరస్వామి మీరు చెప్పినట్లే చెప్పేడు. అతను మా వివాహం కూడా జరిపించేసేడు” అంది ఈశ్వరి.
“మరి మీ ఆయన్ని తీసుకురాలేదేంటి?”
“ఆయనిక్కడికి రాలేదా?” ఆశ్చర్యపోతూ అడిగింది ఈశ్వరి. ఓంకారస్వామి, రాజు మొహమొహాలు చూసుకున్నారు.
అప్పుడే లోనికొచ్చిన సంపెంగి “ఇంకేం వస్తాడిక్కడికి. ఎవర్తినో పెళ్ళి చేసుకుని టింగురంగా అని బీచ్‌లో తిరుగుతుంటే చూశాను. దానికి పది లక్షల లాటరీ వచ్చిందాట. మీతో పని లేదని తెగేసి చెప్పేడు” అంది.
ఆ మాట విని కళ్ళు తిరిగి పడిపోయింది ఈశ్వరి.
“ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందని వాడు పెళ్ళీ చేస్కుంటే ఈవిడిక్కడ సొమ్మసిల్లి పోతుందేంటి?” అన్నాదు రాజు చిరాగ్గా.
“ష్” అన్నాడు ఓంకారస్వామి కోపంగా.
రాజు ఓంకారస్వామి వైపు చూసేడు.
” ఆ అమ్మాయి కనక ఇదంతా బయటపెడితే మన పరిస్థితి పూర్ణా మార్కెట్టయిపొతుంది. కాబట్టి మనం ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వెంకట్‌గాడి జుట్టు మన చేతిలో ఇరికించుకోవాలి. ముందా పిల్ల మీద నీళ్లు జల్లండి” అన్నడు సీరియస్‌గా.
సంపెంగి ఈశ్వరి మొహాన నీళ్లు కొట్టింది.
ఈశ్వరి కాస్సేపటికి తేరుకుని లేచి కుమిలికుమిలి ఏడవటం ప్రారంభించింది.
“అమ్మాయి, ఎందుకలా ఏదో ఊహించుకుని ఏడుస్తావు? అసలేం జరిగిందో తెలుసుకోనివ్వు. ఆ అర్భకుడు మా చేతుల్లోంచి జారిపోడు. జారిపోలేడు. నువ్వు హాయిగా ఇంటికెళ్ళు. మేం విషయం కనుక్కుంటాంగా” అన్నాదు.
ఈశ్వరి కళ్లు తుడుచుకుని వాళ్ల కాళ్లకి దణ్ణం పెట్టి వెనుతిరిగింది.

****

టైమెంటయిందో తెలియదు.
నల్లటి మొహం మీద మచ్చల్లా ఉన్నాయి. ఆ చీకటిలో చెట్ల నీడలు.
రకరకాల జంతువులు ఉండి ఉండీ వింతగా అరుస్తున్నాయి.
నిశ్శబ్దాన్ని ఆసరా చేసుకుని వాగు ఘోషిస్తూ ప్రవహిస్తోంది.
లిఖితని ఆ వాతావరణం క్షక్షణం పిరికిదానిగా మారుస్తోంది.
గట్టు మీద కాళ్ళు ముడుచుకుని ఏ క్షణం ఏ జంతువు మీద పడుతుందోననే ఆందోళనతో చుట్టూ చీకటిని కళ్లు పెద్దవి చేసి దీక్షగా చూస్తోంది.
ఆమె భయాన్ని రెట్టింపు చేస్తూ ఎక్కడో ఏనుగు ఘీంకరించింది. ఆ అరుపుకి ఆమె చేతులు గుండెల మీదకి వెళ్ళేయి.
సరిగ్గా అదే సమయానికి గోరుచుట్టు మీద రోకటిపోటులా రెండు గజాల పొడుగున్న త్రాచొకటి జరజరా పాకుతూ వచ్చి వాగులో తలపెట్టి నీరు తాగసాగింది
లిఖిత ముందు మెరుస్తున్న దాని శరీరాన్ని చూసి ఏంటో అనుకుంది.
కాని ఆ మెరపు కదలడం అచ్చు పాములా ఉండటంతో ప్రాణం కోల్పోయినట్లుగా బిగుసుకుపోయింది.
భయంతో అరవాలన్నా అరుపు గొంతులోనే లుంగ చుట్టుకుపోయింది.
“ఏంటి భయపడ్డావా?”
ఆమె భుజమ్మీద పడ్డ మొరటు హస్తాన్ని చూసి కెవ్వున అరిచింది లిఖిత.
ఎదురుగా చీకటిలో నవ్వుతూ నిలబడ్డాడు మహామయా.

ఇంకా వుంది .


బ్రహ్మలిఖితం – 17

రచన: మన్నెం శారద

అతన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యమొచ్చింది లిఖితకి.
“పాము.. పాము” అంది లేచి నిలబడి అదురుతోన్న పెదవులతో.
“అదేం చేస్తుంది. అంతకంటే భయంకరమైన జంతువులున్నాయీ అడవిలో”అన్నాడతను లిఖితను దగ్గరకు తీసుకుంటూ.
అతను మళయాళంలో మాట్లాడిందేమిటో అర్ధం కాకపోయినా అతని స్పర్శలో ఉన్న నీచదృష్టిని గమనించి అతని చేతుల్ని దూరంగా తోసేయ్యబోయింది లిఖిత.
“ఏంటంత భయపడుతున్నావు. మగపిల్లాడివేగా. మా పెరియార్లు నిన్ను మగపిల్లాడివనుకొని బలికి తీసుకొచ్చేడు. నేనప్పుడే గ్రహించేసేను. ఈ పూజలతో విసిగి పోయినప్పుడు సరసానికి పనికొస్తావని” అంటూ ఆమెని మరింత గట్టిగా కౌగిట్లో బిగించేడు.
లిఖిత విడిపించుకోలేని అశక్తితో గింజుకుంటూ అడవి దద్దరిల్లేలా అరిచింది.
“నువ్వెంత అరిచినా, ఈ గుహ ప్రాంతానికెవరూ వచ్చే సాహసం చేయరు. అనవసరంగా శ్రమపడకు” అంటూలిఖితని నేలమీదకి తోసేడు మహామాయ.
లిఖిత వణికిపోతూ చేతులు జోడించిదతనికి.
కాని.. క్షుద్ర పూజలు చేసి రక్తతర్పణాలు చేసే ఆ నీచోపాసకుడికి ఆమెపట్ల ఎలాంటి జాలికాని, సానుభూతికాని కలగలేదు సరికదా రెట్టింపు ఆనందంతో ఆమెని వశం చేసుకోవడానికి మీదకి జరిగేడు పైశాచికంగా.

******
పరధ్యానంగా కారు నడుపుతోన్న కేయూరవల్లి దూరంగా పేవ్‌మెంటు మీద ఒకమ్మాయితో నడుస్తున్న వెంకట్‌ని చూసి ఉలిక్కిపడి కారు బ్రేక్ వేసింది. కారు కీచుమంటూ ఆగింది.
వెంటనే కారు దిగి పరిగెత్తి “వెంకట్! వెంకట్!” అని పిలిచింది చప్పట్లు చరుస్తూ.
వెంకట్ వెనుతిరిగి కేయూరని చూసి గతుక్కుమన్నాడు.
కేయూర అతనికేసి తీక్షణంగా చూస్తూ “ఎప్పుడొచ్చేవు నువ్వు. లిఖితేది?” అంది అతని పక్కనున్న పిల్లకేసి చూస్తూ.
వెంకట్ ఇబ్బందిగా మొహం పెట్టి “సాయంత్రం ఇంటికొచ్చి చెబుతాను. దయచేసి మీరు వెళ్లిపోండి” అన్నాడు నెమ్మదిగా.
“వీల్లేదు. లిఖిత ఏమయిందో నాకు వెంటనే తెలియాలి. నీకోసం నేను క్షణక్షణం ఎంతగానో ఎదురు చూస్తుంటే, నువ్వు ఊళ్ళోనే ఉండి, నాకే సంగతి చెప్పకుండా తిరుగుతున్నావా?”
“ఆంటీ ప్లీజ్. నేను ప్రొద్దుటే వచ్చేను. నా మాట వినండి” కేయూర సరేనన్నట్లుగా తల పంకించి”ఈ పిల్లెవరు?” అనడిగింది.
“ఆ సంగతి కూడా చెబుతాను” అన్నాడు వెంకట్ ఓర్పుగా.
కేయూర అనుమానంగా ఆ ఇద్దర్నీ పరీకిస్తూ వెళ్ళి కారెక్కింది. మనసు చిందరవందరగా తయారయింది.
“వెంకట్ వస్తాడు. లిఖిత సంగతులు చెబుతాడని ఎంతో ఆశగా తను క్షణాలు లెక్కబెడుతూ భగవంతుణ్ణి ప్రార్ధిస్తుంటే ఇలా జరుగుతున్నదేమిటి? ఈ వెంకట్ అసలెల్లేడా? ఆ పిల్లెవరయి ఉంటుంది?”
ఆలోచించే కొలది ఆమె తలలోని నరాలు ఒక రకమైన ఉద్రిక్తతకి గురయి చిట్లిపోయేంత వేడెక్కిపోతున్నాయి.
కేయూర ఫాక్టరీకి వెళ్లలేక కారు రివర్సు చేసి ఇంటిదారి పట్టించింది.
పది నిముషాల్లో కారు ఇల్లు చేరింది. తాళం తీసి పైకెళ్ళి హాల్లో కూర్చుంది కళ్ళు మూసుకుని.
వెంటనే వందనం శర్మగారు చెప్పిన మాటలు గుర్తొచ్చేయి. తనకిపుడే బలమూ లేదు దైవబలం తప్ప.
రూషము టెక్కెము నందు దాల్చిన
జాణకును ఈ సాయినామము
విషమశరమై ఒప్పుచూ
విమలమౌని శ్రీ సాయి నామము
ఇతరులకి హాని చేస్తూ విషాన్ని కొండెంలో దాల్చి, భగవంతుడికి పూజలు చేసే నీచుల్ని దేవుడు క్షమించడు. వారికి తిరిగి విషమే లభిస్తుంది.
“ఆంటీ!”
కేయూరవల్లి ఉలిక్కిపడి కళ్ళు తెరచి చూసింది.
ఎదురుగా వెంకట్ నిలబడి ఉన్నాదు దీనంగా.
అతన్ని చూడగానే కేయూర కళ్ళెర్రబడ్డాయి.
“నువ్వు కేరళ వెళ్లనే లేదు కదూ!” అంది కోపంగా.
“అనుకున్నాను. మీరు సరిగ్గా అలానే అనుకొని ఉంటారని”అన్నాడు వెంకట బాధ నటిస్తూ.
“మరి లిఖితేది?”
“అదే ఎలా చెప్పాలో తెలీక నిన్ననగా వచ్చి కూడామొహం చాటేసేను”అన్నాడు వెంకట్.
“అంటే… నా లిఖిత కేమైంది?” అంటూ గాభరాగా అడిగింది కేయూర.
అప్పటికే ఆమె కళ్లలోకి వర్షాకలపు వాగుల్లా నీళ్లు వచ్చిపడ్డాయి.
“అబ్బే ఆంటీ! మీరు ఏడవద్దు. లిఖిత నేను వెళ్ళేసరికే కేరళ అడవుల్లోకి వెళ్ళిపోయింది. ఎటు సైడు వెళ్ళిందీ ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయేరు. అప్పటికీ నేను పంపా అవతల అడవులన్నీ వెదికేను. కేరళ మంత్రగాళ్ల దగ్గరకెళ్లిన వాళ్లు తిరిగి బయటపడటం అసంభవమని అక్కడందరూ చెప్పేరు. నన్ను కూడా వాళ్లు…”అంటూ ఆగి కేయూరవల్లి మొహంలోని రియాక్షన్ కోసం చూసాడు వెంకట్.
కేయూర గుండెలదరడం.. మొహం నిండా ఆందోళన అలముకోవడం స్పష్టంగా కన్పిస్తున్నాయి.
“ఎందుకంటే ఆంటీ.. మిమ్మల్ని అన్నీ చెప్పి బాధపెట్టడం. లిఖిత క్షేమంగా రావాలని మీరనుకుంటే.. ఒకటే మార్గముంది”
“ఏంటది చెప్పు. నాకు లిఖిత క్షేమాన్ని మించింది లేదు.” అంది ఏడుస్తూ.
“మీకిష్టముంటుందో లేదో?”
“ఉంటుంది చెప్పు”
భీమిలి రోడ్డులో ఓంకారస్వామి అని ఒక గొప్ప అద్భుత శక్తులున్న స్వామి ఉన్నాడు ఆయన్నాశ్రయించండి. మీకు మేలు జరుగుతుంది” అన్నాడు.
“ఓంకారస్వామా? నేనతని పేరైనా వినలేదే?”అంది కేయూర కళ్లు తుడుచుకుని.
“ఏంటి అన్ని పేపర్లనిండా, పత్రికలనిండా ఆయన గురించి రాస్తుంటే మీరతని పేరైనా వినలేదా? చాలా చిత్రంగా ఉంది.మీకంత అనుమానంగా ఉంటే ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లన్నగారికి ఫోను చేసి కనుక్కోండి” అన్నాడు వెంకట్.
కేయూర వెంటనే రాజ్యలక్ష్మికి ఫోను చేసింది.
“ఏంటి కేయూరా, అంత గాభరాగా ఉన్నావు. లిఖిత సంగతులేమైనా తెలిసాయా?” అనడిగింది రాజ్యలక్ష్మి.
“లేదు రాజ్యం. దానికోసం పంపిన వెంకట్ తిరిగొచ్చేడు. అది ఇంటీరియర్ ఫారెస్టుకెళ్లిపోయిందంట. ఆ మీనన్‌గారు రాకపోతే మాకీ దౌర్భాగ్యం పట్టేది కాదు. నేనే .. బుద్ధిలేని దాన్ని. అనవసరంగా దాన్ని పంపించేను”అంది దాదాపు ఏడుస్తున్నట్లుగా.
“ఏంటిది కేయూర. ధీర గంభీరమయిన కేయూరే మాకు తెలుసు గాని.. ఇలా ఏడ్చి బెంబేలు పడే కేయూర కాదు. కష్టాలు రాగానే కృంగిపోతే ఎలా? శర్మగారేం చెప్పేరు? చివరికి మంచే జరుగుతుందన్నారుగా. ఇంతకీ ఆ విభూది గుమ్మానికి కట్టేవా?” అంది రాజ్యలక్ష్మి.
“లేదు. మర్చేపోయేను. ఇప్పుడే కడతాను” అంది కేయూర రిసీవర్ క్రెడిల్ చేస్తూ.
వెంకట్ పేపర్ చదువుతున్నట్లుగా నటిస్తూ ఆమె మాటల్ని వింటున్నాడు.
ఆవిడ రిసీవర్ క్రెడిల్ చేయగానే పేపర్ మడుస్తూ “ఏంటాంటీ, వస్తున్నావా?” అనడిగేడు.
“లేదు. అద్సరే ఈ విబూది పొట్లం కాస్త వీధి గుమ్మానికి కట్టిపెట్టు”అంటూ దారంతో దాన్ని బిగించి వెంకట్ చేతికిచ్చింది.
“ఏంటిది?” అంటూనే దాన్ని చేతిలోకి తీసుకుని స్టూలేసుకుని గుమ్మంపైన కట్టేడు వెంకట్.
“ఎవరో నందనం నుండి షిర్డీసాయి భక్తుడొచ్చి ఇచ్చేరు. ఎవరో నీచుడి వలన మా కుటుంబానికి ఆపదలు రాబోతున్నాయట. ఇది కడితే అతని ఆటలు సాగవట.” అంది కేయూర అమాయకంగా. వెంకట్ గతుక్కుమన్నాడు.
“ఆ. సింగినాదం. ఇలాంటివి పని చెయ్యవాంటీ!” అంటూ స్టూలు దిగబోతూ జారిపడ్డాడు వెంకట్. వెంటనే కాలు బెణికింది.
“అమ్మా” అని అరిచేడు బాధగా.
కేయూర గబగబా వెళ్ళి అతన్ని లేవదీసి చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టింది.
వెంకట్ బాధతో విలవిల్లాడుతున్నాదు.
కేయూర ఎముక విరిగించేమోననే భయంతో అతని పేంట్ మోకాలిదాక లాగి నొక్కి చూసింది. వాపు రాకపోవడంతో హమ్మయ్య అనుకొని “బెణికినట్లయింది. పద డాక్టరు దగ్గరకు తీసుకెళ్తాను” అంది కేయూర.
“వద్దాంటీ. అదే తగ్గుతుంది” అన్నాదు వెంకట్ నొప్పిని ఓర్చుకుంటూ.
కేయూర లోనికెళ్లి పెయిన్ బామ్ తెచ్చి మర్దన చేస్తూ నా వల్ల ఇదంతా జరిగింది. నా దురదృష్టం నీకూ అంటుకున్నట్లు ఉంది” అంది బాధగా.
“అదేం లేదులే ఆంటీ! దగ్గరుండి లిఖితని తీసుకురాలేకపొయేను. అదే బాధగా ఉంది” అన్నాడు దిగులుగా మొహం పెట్టీ.
కేయూర కళ్లలో మళ్లీ నీళ్లూరేయి.
వాటిని వెంకట్‌కి కనిపించనివ్వకుండా “భగవంతుడు ‘ఇది’ అని నిర్ణయిస్తే దాన్ని మనమెవరమూ అధిగమించలేము. నాకు నమ్మకముంది లిఖిత తిరిగొస్తుందని” అంది.
ఆమె ఆత్మవిస్వాసానికి అతను విస్తుపోయేడు.
పేంట్ సరిచేసుకుని మెల్లిగా లేచి నిలబడుతూ “అయితే మీరు ఓంకారస్వామి దగ్గరకి రారా ఆంటీ?” అనడిగేడు.
“నేనెక్కడికీ రాను. నా లిఖిత క్షేమంగా తిరిగొస్తుంది నా ఇంటికి!” అంది స్థయిర్యంగా.
వెంకట్ తన పథకం పారనందుకు ఆలోచిస్తూ గడప దాటుతుంటే “వెంకట్” అంది కేయూర.
కేయూర పిలుపు విని గతుక్కుమని వెనుతిరిగి చూశాడు.”నా గొడవలో పడి అడగటం మరచిపోయేను. నిన్న నీతో ఉన్న అమ్మాయెవరు?” అనడిగింది.
వెంకట్ ఊహించి దానికి జవాబు సిద్ధం చేఉసుకునే రావడంతో అంత గాభరా కనింపించనివ్వకుండా “మా మావయ్య కూతురు. కాస్త మెంటలొస్తే కె.జిలో షాక్ పెట్టించి తీసుకొస్తున్నాను” అన్నాడు.
” ఆ పిల్ల పిచ్చిదానిలా లేదే?” అంది కేయూర ఆశ్చర్యపడుతూ.
“కొన్ని పిచ్చిలంతే. బయటపడవు. దానికి పెళ్లి పిచ్చి. పిచ్చి కుదిరితేగాని పెళ్లి కాదు. ఏం చేస్తాం” అంటూ తప్పుకున్నాడు వెంకట్.

*****
ఆ చీకటి నిర్మానుష్య రాత్రి తన జీవితం తన జీవితం అన్నివిధాల నాశనమవ్వ బోతున్నదన్న వేదనతో లిఖిత కెవ్వున అరచి కళ్లు గట్టిగా మూసుకుంది.
ఆమె అరుపు ఆ నిశ్శబ్దంలో అనేక వేల తరంగాలు పుట్టించి అడవిని హోరెత్తించింది.
అడవంతా దద్దరిల్లినట్లయింది.
పక్షులు గూళ్లలో నుండి మేల్కొని కువకువలాడేయి.
ఆమె అరుపుకి బదులిస్తున్నట్లుగా మరికొన్ని జంతువులు తిరిగి అరిచేయి.
సరిగ్గా అదే సమయంలో ఒక కిలోమీటరు దూరంలో ఆ కొలనులోనే స్నానం చేసి ఒడ్డున పడుకొన్న ఏనుగు ఉలిక్కిపడి లేచి మెడలో గంటని మ్రోగిస్తూ పరుగున ఆ అరుపు వచ్చిన దిశకి వచ్చింది. ఆ మత్తగజం పరుగుకి అడవంతా కంపించినట్లయింది.కామంతో కళ్ళు మూసుకుపోయి లిఖితని ఒడిసిపట్టుకున్న మహామాయ ఏనుగు పరుగున రావడం గమనించనే లేదు.
ఏనుగు ఎర్రబడిన కళ్లతో తొండంతో చుట్టేసి మహామాయని ఒక్క ఉదుట్న దూరంగా విసిరేసింది. లిఖిత భయంతో వణికిపోతూ ఏనుగుని చూస్తూ అలానే లేచి కూర్చుంది.
“గణా!గణా!” అంటూ ఏనుగు వెనుక ఒక యువకుడు పరిగెత్తుకొచ్చేడు.
ఏనుగు తల తిప్పి అతనివైపు చూసి ఘీంకరించింది.
అతను వచ్చి ఏనుగుని నిమురుతూ లిఖితవైపు చూసేడు. లిఖిత భయంగా లేచి నిలబడింది.
ఏనుగు మాత్రం ఇంకా కోపాన్ని వీడక దూరంగా వాగులో పడ్డ మహామాయ దగ్గర కెళ్లి కాలెత్తి అతని పొట్ట మీద వేసింది. మహామాయ అప్పడంలా మారి వాగులోని ఇసకపొరల్లోకి కూరుకుపోయేడు. అప్పటికే అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసి అయిదు నిముషాలు దాటిపోయింది.
అతను పరుగున వెళ్లి “గణా!గణా!” అంటూ ఏనుగుని ఆపే ప్రయత్నం చేసేడు కాని అప్పటికే అంతా జరిగిపోయింది.
ఏనుగుతో అతను తిరిగొచ్చి లిఖితవైపు చూసి “ఎవరు నువ్వు?” అనడిగేడు.
ఆమెకతని ప్రశ్న అర్ధం కాలేదు.
ఇంకా వీడని భయంతొ అతనిని చూస్తూ నిలబడింది.
అతను ఏనుగుకేదో సంజ్ఞ చేసేడు.
ఏనుగు క్రింద కూర్చుంది.
అతను లిఖితని ఎక్కమని సైగ చేసేడు.
ఆమె భయంగా ఎక్కి కూర్చుంది. అతను ఎక్కేడు. ఏనుగు లేచి నిలబడి నడక సాగించింది. అడవిలో అది నడుస్తుంటే కొమ్మలు వాళ్లని తాకుతున్నాయి. లిఖిత భయంతో దాని మెడకి కట్టిన గంటల తీగెల్ని గట్టిగా పట్టుకుంది. అలా ఆ అడవిలో రెండు కిలోమీటర్ల నడక సాగేక ఒక విశాలమైన మైదానం లాంటి ప్రదేశం వచ్చింది. అక్కడ పూరిపాకల్లాంటి కొన్ని గుడిసెలున్నాయి.
అక్కడికెళ్ళేక “గణా!” అని అరిచేడతను. ఏనుగు మళ్లీ చతికిలబడింది.
అతను దిగి ఆమెకి చేయందించేడు.
లిఖిత కూడా మెల్లిగా ఏనుగు దిగింది.
వాళ్లిద్దర్నీ చూసి ఓక వ్యక్తి పరుగున వచ్చాడక్కడికి.
అతను లిఖితని ఆశ్చర్యంగా చూస్తూ ఏదో ప్రశ్నించేడు. ఏనుగు తాలూకు వ్యక్తి మళయాళంలో ఏదో చెప్పేడు.
అతను లిఖితవైపు తిరిగి “తమిళమా?” అన్నాడు.
“కాదు తెలుగు” అంది లిఖిత.
అతడు వెంటనే ఫక్కున నవ్వి “మన తెలుగే!” అన్నాడు.
వెంటనే ఏనుగు తాలూకు వ్యక్తి లిఖితవైపు చూసి మా నాన్న మళయాళి. మా అమ్మ తెలుగు మనిషే. నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తాది. నా పేరు కాణ్హ. నీ పేరు?” అనడిగేడు.
“లిఖిత” అంది
అప్పుడే తూర్పువైపున చీకటి తెల్లవారుతోంది.
కాస్త దృఢమైన ఆకారం ఆమెకు స్పష్టమవుతోంది. అతనికి పాతికేళ్ళ వయసుంటూంది. మెలి తిరిగిన కండరాలు, ఆరడుగుల ఎత్తు అతను. పూర్తిగా మళయాళీ యువకుడిలా లేడు. తెలుగువాడని కూడా అనిపించడంలేదు. కళ్లలో మెరపులాంటి ఆకర్షణ ఉంది.
లిఖిత అతనివైపు స్నేహపూర్వకంగా చూసి నవ్వింది. అతను కూడా కొద్దిగా నవ్వి “ఆ మాయగాడి దగ్గరకి ఎందుకు వెళ్లావు?” అనడిగేడు.
లిఖిత జరిగిన వృత్తాంతం అంతా క్లుప్తంగా చెప్పింది.”అయితే మీ నాన్న ఆ గుహలో ఉన్నాడంటావా?” అనడిగేడూ కాస్త అనుమానంగా.
“సరిగ్గా తెలియదు. ఉన్నాడని అనుమానం”
“గుర్తుపడతావా?”
“చూడలేదు. కాని పేరు తెలుసు”
బదులుగా కాణ్హ పకపకా నవ్వాడు.
“పేరుతోనే ఎలా కనుక్కుంటావు?” అన్నాడు.
లిఖిత ఖిన్నవదనంతో చూసిందతని వైపు.
ఆమె మొహంలో బాధ తాలూకు క్రినీడలు దోబూచులాడటం గమనించి ప్రయత్నిద్దాంలే ముందు భోంచేద్దువుగాని రా” అంటూ ఆమెని తన గుడిసెలోకి తీసుకెళ్ళేడు.
యభై సంవత్సరాలున్న స్త్రీమూర్తి చేస్తున్న పనాపి “ఎవర్రామ్మాయి?” అని అడిగింది లిఖితని పరిశీలనగా గమనిస్తూ.
కాణ తల్లికి మళయాళంలో జరిగిందంతా చెప్పేడు. ఆమెకు లిఖిత తెలుగు పిల్లని తెలియగానే ప్రాణం లేచొచ్చినట్లయింది.
“ఏమ్మా. ఆ మహామాయ పరమనీచుడని నీకెవరూ చెప్పలేదా? ఒకప్పుడు నేను కూడా నీలానే వాడి చేతిలో చిక్కుకోబోయేను. వీడి తండ్రి నన్ను రక్షించేడు. ఆయన్నే పెళ్ళి చేస్కున్నాను” అంది.
లిఖిత స్నానం చేసి చాలా రోజుల తర్వాత ఆవిడ వండిన తెలుగు భోజనం తిన్నది.
లిఖిత భోంచేస్తుంటే ఆవిడ సాలోచనగా చూస్తూ “ఆ మహామాయ దగ్గర చాలా క్షుద్రవిద్యలున్నాయి. వాణ్ని మన గణ ఎలా చంపగల్గిందో నాకాశ్చర్యమేస్తున్నది” అంది.
“అదే నేనూ అనుకున్నాను. కాని.. ఏ క్షుద్రవిద్యన్నా దేవుడి ముందు తల దించాల్సిందే కదా. ఈవిడ దగ్గరేమన్నా అద్భుత శక్తులున్నాయేమో” అన్నాడు కాణ్హ నవ్వుతూ.
లిఖిత సిగ్గుపడుతూ “ఏం లేవు. నా దురదృష్టం కొద్ది కొచ్చిలోని భగవతి కోవెలలో పూజారి ఇచ్చిన కుంకుమ కూడా పోగొట్టుకున్నాను” అంది.
కాణ్హా ఆమె మాటలు విని సందేహంగా చూస్తూ ఏనుగు దగ్గరికి పరిగెత్తేడు. అతని చర్య అర్ధం కాని అతని తల్లి, లిఖిత కూడా అతనెళ్లిన దిశ వైపు చూసేరు.
కాణ్హా ఏనుగు దగ్గరగా వెళ్లి దాన్ని పరిశీలనగా చూస్తూ”అమ్మా.. అమ్మా ఇలా రా!” అని పిలిచేడు ఉత్సాహంగా.
కాణ్హా తల్లితోపాటు లిఖిత కూడా అక్కడికి చేరుకున్నారు.
కాణ్హా వాళ్ళకి ఏనుగు మొహం చూపిస్తూ “అమ్మా దీని మొహాన ఎర్రగా అంటుకున్నదేమిటి? నేను ఆ మహామాయగాడి రక్తం అనుకున్నాను కాని.. కుంకుమలా లేదూ?” అనడిగేడు.
ఆమె కూర్చున్న ఏనుగు దగ్గరగా వెళ్ళి నుదుటిమీద కొద్దిగా చేత్తో తడిమి “ఇది కుంకుమే. దీని నుదుటున ఎవరు పెట్టేరు?” అంది ఆశ్చర్యంగా..
లిఖిత ఆశ్చర్యంగా ముందుకొచ్చి చూసింది.
కాణా ఏనుగుని ఎగాదిగా చూస్తూ “నువ్వు నీ కుంకుమని ఎక్కడ పోగొట్టుకున్నావు?” అనడిగేడు.
“వాగు ఒడ్డునే. అక్కడే స్నానం చేస్తున్నపుడు పోయినట్లుంది”
కాణా కళ్లు ఆ మాట విని చిత్రంగా మెరిసేయి.
“అమ్మా” అంటూ తల్లిని కౌగలించుకుని గిరగిరా తిప్పేడు.
ఆమె అర్ధం కానట్లుగా చొసి “ఏంటి?” అంది.
“ఈ కుంకుమ భగవతి కోవెలలో పూజారి ఇచ్చిందేనమ్మా. అందుకే మన గణ ఆ నీచుణ్ణి చంపగల్గింది” అన్నాదు ఆనందాతిరేకంతో.
లిఖిత తెల్లబోయి చూసిద్ని.
“ఈ కుంకుంకంత శక్తుందా?” అనడిగింది ఆశ్చర్యపోతూ.
“ఉంది. నీతి, నిజాయితీ, రుజువర్తనానికెప్పుడూ శక్తుంటుంది. దాని ముందు ఏ క్షుద్రశక్తైనా నిలబడదు.నిలబడలేదు. నీచోపాసకులకి, క్షుద్ర ఆరాధకులకి ఎప్పుడూ చివరన ఇలాంటి చావే పడుతుంది. కాణ్హా. గణాకి స్నానం చేయించకు. వెంటనే మీరిద్దరూ దీని మీద వెళ్లి వాడి స్థావరానికి వెళ్లండి. వెళ్లి ఈమె తండ్రిని పట్టుకోండి. ఆ నీచ స్థావరాన్ని నాశనం చేయండి. మీకు భగవతి సహాయపడుతుంది”అంది ఒకరకమైన ఉద్వేగభరితమైన కంఠస్వరంతో అతని తల్లి.
కాణ్హ తల్లి మాటని వెంటనే శిరసావహించేడు.
ఇద్దరూ ఆమెకి నమస్కరించి ఏనుగు మీద వెళ్తుంటే ఆమె భగవతి నామోచ్చారణ చేస్తూ వాళ్లు కనిపించినంత మేరా చూస్తూ నిలబడింది.

ఇంకా..... ఉంది.....

బ్రహ్మలిఖితం – 18

రచన: మన్నెం శారద

ఓంకారస్వామి కళ్ళు తెరచి ఒక కనుబొమ్మ సాధ్యమైనంత పైకెత్తి వెంకట్ వైపు చూశాడు సీరియస్ గా.
వెంకట్ అసహనంగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు.
వెంకట్ తనకు నమస్కరించకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వైనమర్ధమయింది ఓంకారస్వామి రూపంలో ఉన్న నారాయణకి.
“ఏంటి పెళ్లికొడకా? అత్తగారింట్లో తిన్న అరిసెలు, మినపసున్నుండలు ఇంకా అరిగినట్టు లేదు. ఇటువైపు సీత కన్నేసే వేంటి?” అన్నాడు తన ఏకాంత మందిరంలో బూరుగు దూది పరుపుల మీద పడుకుని భక్తులు భక్తిప్రపత్తులతో సమర్పించుకున్న పళ్లని ఏరేరి తింటూ.
అక్కడ ఆ గదిలో రాజు, సంపెంగి తప్ప మరెవరూ లేరు.
రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లన్న చెడామడా ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ దొరికిన పేపర్లన్నింటిలో రాసిన ఆర్టికల్స్ చదివి ఓంకారస్వామి భక్తబృందం ఆంధ్రదేశమంతటా బాగా పెరిగిపోయింది. దాంతో పలుకుబడి, డబ్బు, సదుపాయాలూ కూడా పెరిగిపోయాయి. కూర్చున్న చోటనుండి కదలకుండా కూర్చుని బాగా తిని అతని చప్పి దవడలు పూడాయి. గుంట కళ్ళలో కాస్త మెరపొచ్చింది.
“ఏదో అర్జెంటుగా చేసుకోవాల్సొచ్చింది” అన్నాడు వెంకట్ నిర్లక్ష్యంగా.
“అర్జంటుగానయితే మాత్రం పెళ్లి మీద పెళ్ళెలా చేసుకున్నావు? ఆ పిల్ల సంగతేంటి?”
” ఏ పిల్ల సంగతి?”
ఓంకారస్వామి పకపకా నవ్వాడు. నవ్వుతూ రాజువైపు తిరిగి “వీడు మరీ మనతోటే పరాచికాలాడుతున్నాడు. ఆ పిల్లెవరో నువ్వు చెప్పు రాజూ!” అన్నాడు నవ్వుతూనే.
“తెలీనట్టు డ్రామాలాడతావేంటి? ఈశ్వరి. ఆ పిల్లకి సంగతి తెలిసి లబోదిబోమంటూ ఏడుస్తూ వచ్చింది. అహోబిళంలో దాన్ని పెళ్లి చేసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటావా?” అన్నాదు రాజు తను జోక్యం చేసుకుంటూ
“అది పెళ్లా, సింగినాదమా? ఏదో మీరు నాటకమాడమన్నారని ఆడేను. దానికి మొగుడు, పిల్లలున్నారు. దాంతో నాకు పెళ్ళేంటి? అసలు నేను మీ దగ్గరకొచ్చిన పని వేరు. లిఖితని లొంగదీసుకునే మార్గం చెప్పమని వచ్చేను. ఆ పని చెయ్యనే లేదు మీరు!” అన్నాడు వెంకట్ అక్కసుగా.
నారాయణ, రాజు మొహమొహాలు చూసుకున్నారు. వెంకట్ తమని స్వాములుగా గుర్తించి, గౌరవించడం లేదని గ్రహించేరు. అలా గ్రహింపుకి రాగానే నారాయణ కళ్ళలోకి పాకిన రక్తం ఎర్రజీరలుగా మారి అతనిలోని క్రౌర్యానికి దర్పణం పట్టింది.
అతను వెంకట్ వైపు తీవ్రంగా చూస్తూ”మమ్మల్నే ధిక్కరిస్తున్నావా?” అన్నాడు కోపంగా.
“లేకపోతే ఏంటండి, నన్ను ఆ ఈశ్వరి కోసం దోషిలా నిలబడతారేంటి?” అన్నాడు వెంకట్.
“సరే! ఈశ్వరి సంగతలా ఉంచు. నువ్వు నీ మావ దగ్గర కట్నమెంత తీసుకున్నావ్? ఆ సంగతి చెప్పు!”
“కట్నమా సింగినాదమా? ఏదో పెళ్లి కెదిగిన ఆడపిల్లలందరూ అలానే నిలబడిపోయేరని ఏడిస్తే…”
“మాకు కట్టుకథలు చెప్పి మా నోట్లో పొట్టు పోద్దామని చూస్తే గాల్లో ధూళిలా కలిసిపోతావు. ఆ పిల్ల పేరున పది లక్షల లాటరీ వచ్చింది. అందులో రెండు లక్షలు తెచ్చి మా హుండీలో వేస్తే సరేసరి. లేదంటే ఈశ్వరి నీ ఇంటికి కాపురాని కొస్తుంది. తర్వాత నీ పాట్లు కథలు కథలుగా చెప్పుకుంటారీ ఊరి జనం”అన్నాడు ఓంకారస్వామి.
“అంటే నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?”
“మెయిలూ లేదు. ఎక్స్‌ప్రెస్ లేదు. డబ్బట్టుకొచ్చేయ్. ఏ పేచీ ఉండదు. నువ్వెవరితో కాపురం చేస్తే మాకేటి?” అంది సంపెంగి సీరియస్‌గా.
“నేను పోలీస్ రిపోర్టిస్తాను” అన్నాడు వెంకట్ కోపంగా.
“ఏమని?” కూల్‌గా అడిగాడు ఓంకారస్వామి.
“మీరు దొంగస్వాములని!”
ఓంకారస్వామి కోపం తెచ్చుకోలేదు.
“రాజు!” అని పిలిచేడు మెత్తగా.
“చెప్పండి స్వామి!” అన్నాడు రాజు వినయంగా.
“రిసెప్షనుకి రింగు కొట్టి ఎస్పీని లైన్లో పెట్టు” అన్నాడు.
రాజు వెంటనే ఆ పని చేసేడు.
ఎస్పీ వెంకటస్వామి లైన్లోకి రాగానే రాజు “నమస్తే సార్! మా స్వామిగారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ” అన్నాడు. ఓంకారస్వామి రిసీవరందుకున్నాడు.
“వాడి చేతికా కార్డ్‌లెస్ ఇవ్వు” అన్నాడు.
వెంకట్ కార్డ్‌లెస్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు.
“నమస్కారం స్వామి! ఏమన్నా అర్జెంటు పనుందా చెప్పండి.నిముషంలో వచ్చేస్తాను” అన్నాడు ఎస్పీ వెంకటస్వామి.
“ఏం లేదు నీ యోగక్షేమం కనుక్కుందామని. మీ ఆవిడ అరోగ్యమెలా ఉంది? అమ్మాయి ప్రసవమయ్యిందా?”
“తమ దయవల్ల బాగానే ఉంది. అమ్మాయికి బాబు పుట్టేడు. మీ పేరే పెట్టుకోవాలనుకుంటున్నాం” అన్నాదు ఎస్పీ.
“అద్సరే! మీ హోం మినిస్టరుగారొస్తారన్నారు. ఎప్పుడూ రావడం?”
“ఈ నెల్లోనే. ఎంత తొందరగా మిమ్మల్ని చూడాలా అని ఆయన తెగ కంగారు పడుతున్నారు. పైకి నక్సలైట్ ఏరియా విజిటని పేరేగాని.. రావడం మీ దర్శనానికే..” అన్నాడు ఎస్పీ గుంభనంగా నవ్వుతూ.
ఓంకారస్వామి రిసీవర్ క్రెడిల్ చేసి వెంకట్ వైపు చూశాడు.
వెంకట్ నుదుటున చెమటలు బిందువులుగా పేరుకోవడం గమనించి మందహాసం చేస్తూ “ఇప్పుడు చెప్పు టాపు టు బాటం నా భక్తులయిన డిపార్టుమెంటులో ఎవరికిస్తావు రిపోర్టు.”అనడిగేడు మందహాసం చేస్తూ.
వెంకట్ తనలోని భయాని అణుచుకుంటూ “ఇప్పుడు నేనేం చేయాలి?”అనడిగేడు.
“చెప్పేనుగా. నీ పెళ్లాన్నడిగి రెండు లక్షలు తెమ్మని”
వెంకట్ తల పంకించి నిస్సహాయంగా చూస్తూ వెనుతిరిగి వెళ్లాదు.
వెళ్టున్న వెంకట్‌ని చూసి చేతిలోని ద్రాక్షపండుని పైకెగరేసి పట్టుకొని “దొంగముండాకొడుకు. నా దగ్గరా నాటకాలు” అంటూ పకపకా నవ్వాడు. అతని నవ్వుతో శృతి కలిపేరు రాజు, సంపెంగిలు.

*****

ఏనుగు ఇనుమడించిన ఉత్సాహంతో లిహితని, కాణ్హని ఎక్కించుకుని అడవిలో వడివడిగా పరిగెత్తినట్లుగా నడవసాగింది. దాని మెడలోని మువ్వలు లయబద్ధంగా సవ్వడి చేస్తూ ఆ నాదం కూడా ఏనుగుతో పాటు పరుగు తీస్తోంది. రెండు కిలోమీటర్లు నడకసాగి అడవిలో ఒక వాగుని ఏనుగు దాటుతుండగా “అక్కా, అక్కా ” అన్న పిలుపు విని అటు తిరిగి చూసింది లిఖిత. దూరంగా మున్నార్ హోటల్లో పరిచయమైన బేరర్ అలుపుగా పరిగెత్తుకొని వస్తూ “అక్కయ్యా ఆగు ఆగు!” అన్నట్టు చెయ్యి ఊపసాగేడు.
కాణ్హ ఏమిటన్నట్లుగా లిఖితవైపు చూశాడు. “ఆపండి ఆ అబ్బాయి నాకు తెలుసు” అంది లిఖిత.
కాణ్హ ఏనుగుని అంకుశంతో అదలిస్తూ “గణా ఆగు” అన్నాడు. ఏనుగు ఆగి మోకాళ్ల మీద వంగి కూర్చుంది. కాణ్హ క్రిందకి దిగి లిఖితకి చేయందించేడు. లిఖిత కాణ్హ భుజాల మీద చేతులానించి ఏనుగు దిగింది.
అప్పటికే బేరర్ కుర్రాడు వాళ్ల దగ్గరకొచ్చి “అక్కయ్యా, మీ నాన్నగారు కూడా మా హోటల్లోనే దిగేరు. నేనాయన్ని గుర్తుపట్టగలను”అన్నాదు వగరుస్తూ.
ఆ మాట వినగానే లిఖిత మొహం సంతోషంతో వికసించింది.
“ఇతనికి మా నాన్న తెలుసు. ఇతన్ని కూడా తీసికెల్దాం”అంది లిఖిత కాణ్హ వైపు తిరిగి.
కాణ్హ బేరర్ని ఏనుగెక్కించేడు. ఆ తర్వాత లిఖిత, కాణ్హ ఎక్కేరు.
ఏనుగు మరో ఇరవై నిమిషాల్లో మహామాయ ఉన్న గుహని చేరుకుంది. అప్పుడే మహామాయ మృతశరీరాన్ని వాగులోంచి తీసి గుహ బయట పడుకోబెట్టేరతని శిష్యులు.
ఏనుగుని ఆ పైన లిఖితని చూడగానే కకావికలై పక్కకి తప్పుకున్నారు.
ఏనుగు ఆ ప్రాంతం చేరగానే చిత్రంగా మారిపోయింది.
ఏదో శక్తి ఆవహించినట్లుగా ఊగిపోతూ తొండాన్ని అటూ ఇటూ వడివడిగా తిప్పుతూ, ఘీంకరిస్తూ గుహలోకి ప్రవేశించింది.
లోపల పూజలు చేస్తున్న కొంతమంది ఏనుగుని చూసి బెదరిపోయి లేచి నిలబడ్డారు.
ఏనుగు ఆ పూజా ప్రాంతాన్ని తన తొండంతో ఒక్కసారి చెల్లాచెదురు చేసింది. తన పాద తాడనంతో హోమగుండాన్ని మసి చేసేసింది.
దాని ఊపుకి అందరూ బెదరి గుహ గోడలకి అంటుకుపోయేరు.
ఏనుగు ఊపుగా దుష్టశక్తిని సమీపిస్తుండగా “విగ్రహాన్ని తాకారంటే నాశనమై పోతారు. వెంటనే వెళ్లకపోయేరా.. ఇదిగో మిమ్మల్నిప్పుడే ఎందుకూ గాకుండా చేస్తాను”అంటూ ముందుకొచ్చి బెదిరించేడొక వృద్ధుడు. అతను బస్సులో కలిసి తనతో ఆ గుహకి తీసుకొచ్చిన వ్యక్తిగా గుర్తుపట్టింది లిఖిత.
“వాడే.. నన్ను తీసుకొచ్చేడిక్కడికి” అంది లిఖిత కసిగా అతనివైపు చూస్తూ..
అంతే!
“గణ” ఏదో అర్ధమయినట్లుగా అతనివైపు తిరిగి తొండంతో అతన్ని చుట్టేసి గిరగిరా తిప్పి బలంకొద్దీ విసిరేసింది. అతను ఉండలా చుట్టుకుని గుహ రాతి గోడకి కొట్టుకొని క్రిందపడ్డాడు గాలి తీసిన బంతిలా.
అంతే! ఆ తర్వాత అతను కదలలేదు.
అతని తల క్రిందనుండి చిక్కగా జాలువారి, వాగులో ప్రవహించి వెలుగులో ఎర్రగా కనబడడం చూసి కళ్ళు మూసుకుని లిఖిత.
ఆ తర్వాత పనిగా ఏనుగు విగ్రహం మీద విరుచుకు పడింది. ఎన్నో సంవత్సరాలుగా అనేక బలుల్ని అందుకున్న ఆ క్షుద్ర దేవత ‘గణ’ మీద ఏ ప్రభావాన్నీ చూపించలేకపోయింది.
గణ కుంభస్థలంతో ఆ విగ్రహాన్ని బలంగా ఢీకొంది. ఆ దెబ్బకి విగ్రహం కుప్పకూలిపోయింది.
ఏనుగింకా కసి తీరనట్లుగా ఆ విగ్రహాన్ని కాళ్లతో తొక్కి పిండి పిండి చేసింది.
అప్పుడు కనిపించేయి. ఆ విగ్రహం కడుపులో ఉన్న యంత్రాలు. కొన్ని రాగిరేకుల మీద ఉన్న కొన్ని క్షుద్ర మంతాలు.
లిఖిత కళ్లు మాత్రం ఆ ప్రాంతమంతా వెతుకుతున్నాయి తన తండ్రి కోసం.
“అక్కా! అక్కా!” అంటూ ఆమెని గట్టిగా కుదిపేసేడు కంగారుగా.
లిఖిత “ఏంటి?” అంది వెనక్కు తిరిగి.
బదులుగా బేరర్ ఓ మూల కూర్చుని జరుగుతున్నదేమీ తనకి పట్టనట్లుగా కళ్లు మూసుకుని జపం చెస్తూ ఈతాకులతో ఉప్పు నీటిని పిండిబొమ్మకి అభిషేకం చేస్తున్న వ్యక్తి కనిపించేడు.
“ఎవరతను?” అనడిగింది లిఖిత.
“మీ నాన్న. కార్తికేయన్” అన్నాడు బేరర్.
ఆ జవాబు విని లిఖిత శరీరమంతా రక్తం ఉద్వేగానికి గురయి వేగంగా ప్రవహించడం వలన పులకించింది.
“కాణ్హ ఏనుగుని ఆపు” అనిద్ కంగారుగా.
కాణ్హ “గణా! ఆగు! శాంతించు!” అన్నాడు చేత్తో దువ్వుతూ.
ఏనుగు చెవులూపుతూ వినయంగా క్రింద కూర్చుంది.
కాణ్హ తను దిగి మిగిలిన ఇద్దర్నీ దింపేడు.
లిఖిత గబగబా తండ్రి దగ్గరికి రివ్వున పరిగెత్తి “డేడీ!డేడీ!” అని పిలిచింది ఆత్రుతగా.
అతను కళ్లు తెరవనే లేదు.
ఏదో మంత్రాన్ని నిశ్శబ్దంగా ఉచ్చరిస్తూ తన పూజ కొనసాగిస్తూనే ఉన్నాడు.
కాణ్హ ‘గణ’వైపు చూశాడు.
“గణ’ ఏదో అర్ధమయినట్లుగా వెళ్లి అతను పూజ చేస్తున్న పిండి బొమ్మని కాలితో తొక్కి విసిరేసింది
అయినా కార్తికేయన్‌లో చలనం లేదు.
లిఖిత అతన్ని పరిశీలించి చూసింది.
బట్టతల, వడలిన శరీరం, చిన్న పంచెతో ఉన్న ఇతను ఒక గొప్ప సైంటిస్టు కార్తికేయనయి ఉంటాడా? అయి ఉంటే అతనింత దిగజారి ఇలాంటి క్షుద్రపూజలు చేస్తాడా?
“తంబి ఇతను నిజంగా మా నాన్నేనా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టే చెబుతున్నావా?” అనడిగింది.
“మీ నాన్నవునో కాదో నాకు తెలియదు. కాని అతను కార్తికేయనే. సైంటిస్టే. అలా రాసుంది మా రిజిస్టరులో.”అన్నాడు బేరర్.
వెంటనే లిఖిత హృదయం ఆర్ద్రమైంది. కన్నీరు పొంగుకొచ్చింది.
పుట్టి పెరిగేక, తనకు జన్మనిచ్చిన తండ్రిని అంత దీనావస్థలో చూడాల్సి రావడం వచ్చినందుకు ఆమె హృదయం బాధతో రెపరెపలాడింది.
“మా డేడీకేదో చేసేరు” అంది ఏడుస్తూ.
కాణ్హ లిఖితని పక్కకు తోసి కార్తికేయన్ దగ్గర కెళ్లి అతని భుజాలు పట్టుకొని కుదిపేడు. అయినా ప్రయోజనం కనిపించలేదు.
కాణ్హ ఒక్క ఉదుటున ఎత్తి అతన్ని ఏనుగు మీద కూర్చోబెట్టేడు.
ఏనుగు బలంగా అతన్ని క్రిందకి నెట్టేసింది.
కాణ్హ ‘గణ’ చేసిన ఆ చర్యకి మొదట తెల్లబోయి చూసేడు. తర్వాత ఏదో అర్ధమయినట్లుగా తల పరికించి “మీ నాన్నకి చేతబడి జరిగింది. చేతబడి జరిగిన వ్యక్తిని గణపతి సమానమైన ఏనుగు తన మీద ఎక్కించుకోదు” అన్నాడు.
లిఖిత ఆ మాట విని ఖిన్నురాలయి “మరెలా, మా నాన్నని తీసికెళ్ళడం!” అంది.
“గణా!” అని అరిచేడు కాణ్హ.
ఏనుగు మోకాళ్ల మీద కూర్చుంది.
“మీరిద్దరు దాని మీద పదండి. నేనాయన్ని తీసుకొస్తాను” అన్నాడు కాణ్హ కార్తికేయన్‌ని లేవదీసి తన భుజాల మీదెక్కించుకుని..
లిఖిత, బేరర్ ఏనుగు మీద వెళ్తుంటే వారిని అనుసరించేడు కాణ్హ కార్తికేయన్‌తో.
గణ వెళ్తూ వెళ్తూ మళ్లీ మహామాయ మృతకళేబరాన్ని మరోసారి తొక్కి ముందుకి నడిచింది ఆగ్రహావేశాలతో.

*****
“వెంటనే నాకు రెండు లక్షలివ్వు” అన్నాడు వెంకట్ భార్యతో.
“నా దగ్గరెక్కడివి?” అంది కనక మహాలక్ష్మి అమాయకంగా చూస్తూ.
“మరీ ఓవర్‌గా నటించేయకు. నీకు లాటరీలో పది లక్షలొచ్చింది అందులోంచివ్వు”
కనకమహాలక్ష్మి ఎన్నాళ్లగానో తిండిలేనట్లుగా కళ్లు తేలేసి “నాకు లాటరీ రావడమేంటి? ఎవరు చెప్పేరు బావా నీకు?” అంది.
“మీ నాన్న. అందుకే నిన్ను పెళ్లి చేస్కున్నాను”
కనకమహాలక్ష్మి మొహంలో కళ తప్పింది.
“అంటే డబ్బుకి ఆశపడి నన్ను పెళ్ళి చేసుకున్నావన్నమాట. నన్ను ప్రేమించనే లేదా అయితే?” అంటూ ముక్కు ఎగ చీదింది.
వెంకట్ పరిస్థితి ఇరకాటంలో పడింది.
ప్రేమించలేదంటే.. అసలే మొండిఘటమైన పెళ్లాం పైసా ఇవ్వకుండా పుట్టింటికి చెక్కేస్తుందన్న భయంతో అమాంతం ఆవిడ కాళ్లు పట్టుకున్నాడు. మంచం మీదనుండి క్రిందకి దూకి.
కనకమహాలక్ష్మి భర్త చేష్టలకి తెల్లబోతూ కాళ్ళు సర్రున వెనక్కు లాక్కుని “మీకు పిచ్చి ఉందని చెప్పలేదే మా నాన్న. కన్నెచెర తప్పించాలని పిచ్చోడికిచ్చి చేసి నా గొంతు కోసేడు!” అంది ఏడుస్తూ.
వెంకట్ అలానే నేలమీద కూలబడి భార్యకి రెండు చేతులు జోడించి నాకు పిచ్చి లేదు కనకం. నేను చాలా ఆపదలో ఉన్నాను. నా పీకమీద కత్తి ఉంది. వ్రేటు పడకుండా రక్షించు” అన్నాడు దాదాపు ఏడుస్తూ.
“అయ్యో . మీకు బాగా ముదిరిపోయినట్లుంది. మీ పీక మీద కత్తి కాదు కదా బ్లేడు ముక్క కూడా లేదు. అయ్యో రామచంద్రా. నాకిప్పుడెవరు దిక్కు!” అని ఏడవటం మొదలెట్టింది.
వెంకట్‌కి ఆవిడ ఏడుపు విని నిజంగానే మతి చలించినట్లయింది.
“కాస్సేపు నీ ఏడుపు ఆపవే దరిద్రపు మొహమా!” అన్నాడు కోపంగా జుట్టు పీక్కుంటూ.,
సరిగ్గా అప్పుడే ఆ ఇంటి తలుపులు ధనధనా మోగేయి. వెంకట్ ఏడుపు ఆపుకొని వెళ్లి తలుపు తీసేడు.
ఎదురుగా ఈశ్వరి నిలబడి వుంది సూట్‌కేస్ చేత్తో పట్టుకొని.

సశేషం..


బ్రహ్మలిఖితం – 19
రచన: మన్నెం శారద
కార్తికేయన్ ఒక పెద్ద చెట్టు మ్రాను కానుకొని కళ్ళు మూసుకొని జీవచ్చవంలో ఏదో జపిస్తూనే ఉన్నాడు.

అతని ధోరణి, రూపు చూసొఇ లిఖిత వస్తోన్న దుఃఖాన్ని పెదవులు బిగించి ఆపుకుంటోంది.

“నేనొస్తానక్కా!” అన్నాదు బేరర్ లేచి నిలబదుతూ. లిఖిత కృతగ్నతగా తలాడించి పర్సులోంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టబోయింది.

అతను చేతిని వెనక్కు లాక్కుని “ఎందుకక్కా?” అనడిగేడు ఆస్చర్యంగా.

“నువ్వు నాకు చాలా సహాయం చేసేవు. నా తండ్రిని నేను కలుసుకునేలా చేసేవు!” అంది లిఖిత.

అతను నవ్వాడు.

“చేసిన సహాయానికి ఈ సృష్టిలో బహుశ ఒక్క మనిషే కిరాయి పుచ్చుకుంటాడనుకుంటాను. నా ఆత్మీయతకి రేటు కట్టద్దక్కా!” అన్నాడు బాధగా.

లిఖిత వెంటనే తప్పు చేసినట్లుగా ఫీలయి “సారీ”! అంది.

“ఇట్సాల్ రైట్. నీ ఎడ్రస్సివ్వు. ఆంధ్ర వస్తే నిన్ను చూడటానికే వస్తాను.” అన్నాడు నవ్వుతూ.

లిఖిత తన అడ్రస్ రాసిచ్చింది.
అతనెళ్ళిపోగానే లిఖిత మనసు మళ్ళీ కృంగిపోయింది. కాణ్హా తల్లి కార్తికేయన్‌ని బాగా గమనించి చూసి “ఆయన్ని తీసుకురావడంలో మన ‘గణ’ మహిమ ఏమీ లేదు. అంతా భగవతి కుంకుమ శక్తి. అందుకే ఈయన్ని కుట్టికారన్ దగ్గరకి తీసికెళ్ళండి. ఆయనే మార్గం చూపుతారు” అంది.
“నేనూ వెళ్లాలా?” అనడిగేడు కాణ్హా.
“నువ్వలా అడిగినందుకే సిగ్గుపడుతున్నాను నేను. ఆపదలో అసహాయంగా ఉన్న స్త్రీలకి సాయపడటమే మగతనం. కండలు పెంచుకొని ఆడాళ్లని కాని మాటలనడం కాదు” అందామె కోపంగా.
కాణ్హా తప్పు చేసినవాడిలా తలదించుకొని “నిన్నొకర్తిని. వదలలేక అడిగేనంతే!” అన్నాడు.
ఆమె నిస్పృహగా నవ్వి ” మీ నాన్నని ఒక ఏనుగు చంపినప్పుడు నువ్వు నా కడుపులోనే ఉన్నావు. అప్పుడెవరు కాపాడేరు నన్ను. ఏ ఏనుగు వాతబడ్డాడో నీ తండ్రి ఆ ఏనుగునే నీకు మచ్చిక చేయించేను. భయం లేదు. నా బాగు ‘గణ’ చూసుకుంటుంది” అంది.
గణ బదులుగా చెవులూపింది.
కాణ్హా కార్తికేయన్‌ని తీసుకొని లిఖితతో కలిసి మున్నార్ బయల్దేరేడు కొచ్చిన్ చేరడానికి.
*****
“నువ్వెందుకొచ్చేవిక్కడికి?” అన్నాడు వెంకట్ ఈశ్వరిని చూసి పిచ్చెక్కిపోతూ.
ఈశ్వరి తెల్లబోతూ అతనివైపుషూసి “ఏమిటలా మాట్లాడుతున్నారు. అహోబిళంలో నన్ను పెళ్ళి చేసుకుని. ఎప్పుడోచ్చి మీరు కాపురానికి తీసుకెళ్తారా అని ఎదురు చూస్తున్నాను. కాని.. మీరు మళ్లీ పెళ్ళి చేసుకున్నారంటగా! ఇదేమైనా న్యాయమా?” అంటోఒ కనకమహాలక్ష్మి వైపు కళ్ళెర్ర జేసి చూస్తూ.
ఆ మాటలు విన్న కనకమహాలక్ష్మి ఉప్పొంగిన గోదారిలా ఉరికొచ్చి “ఏంటితను నిన్ను పెళ్ళి చేసుకున్నాడా?” అనడిగింది.
“అవును. ఈ జన్మలోనే కాదు. పోయిన జన్మలో కూడా.” అంది ఈశ్వరి.
కనకమహాలక్ష్మి అర్ధం కానట్లుగా చూసింది.
“అది పిచ్చిది. కె.జి నుండి తప్పించుకొచ్చింది.” అన్నాడు వెంకట్.
ఈశ్వరి వెంకట్ వైపు తెల్లబోయి చూసి “ఏంటి? నేను పిచ్చిదాన్నా? అహోబిళంలో నన్ను పెళ్ళి చేసుకొని అబద్ధాలు చెబుతారా? పదండి ఓంకారస్వామి దగ్గరకి. ఈ మాట అక్కడందురుగాని.” అంది తీవ్రంగా.
ఆవిడ మాటలు విని కనకానికి నిజంగానే మతి పోయినట్లయింది.
“ఈవిణ్ణి నిజంగానే పెళ్ళి చేసుకున్నారా? మరెందుకు నా గొంతు కోసేరు. ఉండండి మా నాన్నకి చెబుతా మీ సంగతి!” అంది ఏడుస్తూ.
అప్పుడే స్కూటర్ దిగి కుటుంబరావు లోనికొచ్చేడు. “మీరెవరు?” అనడిగేడు వెంకట్ అతన్ని.
కుటుంబరావు మొహం ఆ ప్రశ్నకి వంట్లో రక్తం విరిగినట్లుగా తెల్లబడింది.
“మీరు భర్తని చెప్పుకుంటూ పరిగెత్తుకొచ్చిన ఈశ్వరికి భర్తని!” అన్నాడు.
“ఏం కాదు. మీరు కుక్క. ఇతనే నా అసలు భర్త.” అంటూ వెంకట్ వెనక్కి వెళ్ళి నిలబడింది ఈశ్వరి.
కుటుంబరావు మనసు-శరీరం సిగ్గుతో చితికిపోయింది.
“సారీ! నా భార్య మానసిక పరిస్థితి బాగోలేదు.” అన్నాడు బాధగా.
“అలాగైతే ఆస్పత్రిలో పడెయ్యాలిగాని ఇలా కొంపలమీద కొదిలితే ఎలా?కాపురాలు కూలిపోవూ?” అంది కనకం కోపంగా.
“నాకేం పిచ్చి లేదు. నేను శుభ్రంగానే ఉన్నాను. ఇతను నా పూర్వజన్మలో భర్త. కావాలంటే ఓంకారస్వామినడుగు” అంది ఈశ్వరి వెంకట్ చెయ్యి పట్టుకుని.
కుటుంబరావుకి తల కొట్టేసినట్లయింది.
“ఈశ్వరి!” అన్నాదు కోపంగా.
“మీరేం గొంతు పెంచకండీ. మీరు పూర్వజన్మలో కుక్కని తెలిసేక నాకు మిమ్మల్ని చూస్తుంటేనే వాంతికొస్తున్నది వెళ్లండి” అంది ఈశ్వరి.
“చీ!” అన్నాడు కుటుంబరావు ఏహ్యంగా.
“ప్రస్తుతమీ జన్మలో కుక్కలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఎంతయినా మేనమామ కూతురినని భరిస్తున్నాను. నేను వదిలేస్తే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. నీకేదో మత్తుమందు పెట్టి నాటకమాడు తున్నారు వెళ్లు. పిల్లలనన్నా గుర్తు తెచ్చుకొని జీవితాన్ని అల్లరి చేసుకోకుండా వచ్చేయ్” అన్నాడు కోపాన్ని అణచుకొని బాధని వ్యక్తం చేస్తూ.
“నేను చచ్చినా రాను” అంది ఈశ్వరి మొండిగా.
కుటూంబరావు ఇక కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు.
“అయితే నీ చావు నువ్వు చావు!” అంటూ గిర్రున వెనుతిరిగి వెళ్లిపోయేడు.
“అయితే ఇదిక్కడే ఉండిపోతుందా?” అంది కనకమహాలక్ష్మి గొంతు పెంచుతూ.
“ఉంటాను. ఉండకెక్కడికి పోతాను. ఆయన నా భర్త!” అంది ఈశ్వరి.
“అయితే నా గతేంటి? నా స్థానం ఏవిటి?” అంది కనకమహాలక్ష్మి ఏడుస్తూ.
వెంకట్ వాళ్లిద్దరి కేసి కసిగా చూస్తూ “మీకు నా భార్య స్థానం కావాలంటే నాకు రెండ్రోజుల్లో అర్జెంటుగా రెండు లక్షల రూపాయిలు కావాలి. లేకపోతే నా శాల్తీయే ఉండదు. ఎవరు అర్జెంటుగా డబ్బు తెస్తారొ వాళ్ళే నా భార్య!” అన్నాదు.
అతని జవాబు విని వాళ్లు దిగ్భ్రమకి గురయ్యేరు.
“నేను వెంటనే మా పెదనాన్న పొలం అమ్మి తెస్తాను. నేనే నీ భార్యని” అంటూ చకచకా వెళ్లిపోయింది ఈశ్వరి.
“నేను మా నాన్ననడుగుతాను. నిజంగా ఆయన చెప్పినట్లు లాటరీ వస్తే తప్పకుండా ఇస్తాడు. కాని.. డబ్బు ఇచ్చినా ఇవ్వలేకపోయినా నేనే నీ భార్యని!” అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది కనకమహాలక్ష్మి.
వాళ్లిద్దరు వెళ్ళిపోగానే వాన వెలిసినట్లయింది వెంకట్‌కి.
లేచి సిగరెట్ వెలిగిస్తూ ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు.
కేవలం కుతంత్రాలకి, కుయుక్తులకీ అలవాటు పడిన అతని బుర్ర ఆ స్త్రీల దుఃఖం చూసి జాలికి గురి కాలేదు.
ఇద్దరూ చెరో రెండు లక్షలూ తెస్తే ఒక రెండు ఓంకారస్వామి మొహాన పడేసి, తన జేబుని మరో రెండు లక్షలతో నింపుకోవచ్చు. అలాంటి ఆలోచన రాగానే వెంకట్ మొహంలో ఆనందం తాండవించింది.
*****
కొచ్చిన్‌లోని భగవతి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టింది లిఖిత. ఆ వెనుక కాణ్హా కార్తికేయ చేతిని పట్టుకుని లోనకి తీసుకురాబోయేడు. ఆ రోజు శుక్రవారం.
ఆలయమంతా దీపాలతో దేదీప్యమానంగా ఉంది.
భక్తులకి హారతి అందిస్తున్న కుట్టికారన్ చేయి పక్షవాతమొచ్చినట్లుగా బాధగా ‘అంబా’ అన్నాడు.
కాని.. బాధ తీరలేదు. కాలు కూడా బిగుసుకుపోసాగింది. అతను బాధని పళ్ల బిగువున ఆపుకుంటూ ఆలయ వీధి ప్రాంగణం వైపు చూశాడు.
లిఖిత, కాణ్హా బలవంతంగా కార్తికేయన్‌ని లోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
“వద్దు. అతన్ని లోనికి తీసుకు రావొద్దు” అని గట్టిగా అరిచేడూ.
లిఖిత ఉలిక్కిపడి కుట్టికారన్ వైపు చూసింది. కుట్టికారన్ బాధగా కాలిని, చేతిని కూడదీసుకుంటూ “అంబ అతన్ని లోనికి రానివ్వద్దంటున్నది. వెంటనే బయటకు తీసుకెళ్ళండి” అన్నాడు. భక్తులంతా కుట్టికారన్ వైపు చిత్రంగా చూస్తున్నారు.
లిఖిత గబగబా తండ్రిని బయటికి తీసుకెళ్లింది. మరో రెండు నిముషాల్లో కుట్టికారన్ కాలు, చెయ్యి స్వాధీనానికొచ్చేయి.
కాణ్హా కార్తికేయన్‌ని పట్టుకొని “నువ్వెళ్లి పూజారితో మాట్లాడిరా!” అన్నాడు లిఖితతో.
లిఖిత లోనికెళ్లింది.
అందరితో పాటు ఆమెకు కుట్టికారన్ చందనం, తీర్థం ఇచ్చేడు
“రద్దీ తగ్గేక మా డాడీ చేసిన అపచారమేంటి?” అతన్నెందుకు లోనికి రానివ్వరు?”అనడిగింది.




ఇంకా వుంది.

బ్రహ్మలిఖితం – 20

రచన: మన్నెం శారద

జోసెఫ్ మీదపడి నిశ్శబ్దంగా రోదిస్తున్న అతని భార్యని భుజాలు పట్టుకొని లేవదీసింది లిఖిత.
ఆమె కళ్ళు తుడుచుకుని దుఃఖాన్ని అదుపు చేస్కునే ప్రయత్నం చేసింది.
“మిమ్మల్ని ఓదార్చే ధైర్యం చేయలేను. కాని.. ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని కూడా మీరు ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదంటే.. మీలాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉంటారన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను” అంది లిఖిత బాధగా.
ఆమె శుష్క మందహాసం చేసింది. ఆ నవ్వు తుఫానులో పొడసూపిన సూర్యకిరణంలా ఉంది.
“జోసెఫ్ గురించి మీకు తెలియదు. అతను కోటీశ్వరుడంటే బహుశ మీరు నమ్మకపోవచ్చు. ఆయన తండ్రి ఇక్కడ కొన్ని వందల ఎకరాల రబ్బరు, టీ తోటలకు అధికారి. నేనొక టీచర్ని. నన్ను ప్రేమించిన పుణ్యానికి ఆయన ఆంత ఆస్తిని వదులుకొని ఓ హోటల్లో మేనేజరుగా ఉద్యోగం సంపాదించి నన్ను పెళ్ళి చేస్కున్నారు. నా అదృష్టం వక్రించి ఒక్కసారే ఆయన రెండు కిడ్నీలు దెబ్బ తిన్నాయి. నేను ఒకసారి మీరిచ్చిన డబ్బు వాడదామన్నాను. ఆయన చస్తే అంగీకరించలేదు. చివరికి…” అందామె కన్నీరు కారుస్తూ.
లిఖిత కళ్లనిండా నీళ్ళు నిండేయి.
“రియల్లీ హీ వాజ్ గ్రేట్” అంది.
“అవును. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయనతో కొన్నాళ్లయినా జీవితం గడిపిన అదృష్టాన్ని తలుచుకుంటూ .. ఈ పిల్లల కోసం మిగతా జీవితాన్ని గడపాలి”అందామె భారంగా.
హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని జోసెఫ్ మృతదేహాన్ని ఆమెకప్పగించేరు.
లిఖిత వారితోపాటు వెళ్లింది.
జోసెఫ్ ఖనన కార్యక్రమం చాలా నిరాడంబరంగా హోటల్ యాజమాన్యం వారి రాకతో జరిగిపోయింది.
జోసెఫ్ భర్య వెనుదిరిగి వస్తుంటే లిఖిత ఆమె ననుసరించి “ఏమండి?” అని అంది.
ఆమె వెనుతిరిగి చూసింది.
“మీ పేరడగలేదు నేను”
“మరియా”
మీరేమీ అనుకోకపోతే ఈ డబ్బు..”
“నన్ను తీసుకోమంటారు.!” అందామె విషాదంగా నవ్వుతూ.
లిఖిత అవునన్నట్లుగా తల పంకించింది.
“నా జోసెఫ్ ప్రాణాలు ఈ డబ్బు దొరక్కే పోయేయి. ఇప్పుడెందుకీ డబ్బు నాకు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు” అంది మరియ.
“కనీసం. పిల్లల భవిష్యత్తు కోసమైనా!”
“వద్దండి. నా పిల్లల్ని నేను పెంచగలను. మీకు తెలియదు. జోసెఫ్ ఒకరోజు ఇంటికి చాలా ఆనందంగా వచ్చేశారు. ఏంటి విశేషం అని అడిగితే .. ఈ రోజు జాక్‌పాట్ కొట్టేసేనోయ్. ఒక ముసలమ్మ అన్నం లేకుండా ఏడుస్తుంటే హోటల్‌కి తీసుకెళ్ళి అన్నం పెట్టించేను” అనేవారు. మరో రోజు ఎవరికో బీదవాళ్లకి వందరూపాయలిచ్చాననేవారు. నేను పిచ్చిపిచ్చిగా దానాలు చేసేస్తున్నరని కోప్పడితే మనం వెనకేసుకోవాల్సింది దానం, ధర్మం కాని డబ్బు కాదని చెప్పేవారు. అలాంటీ మహానుభావుణ్ణే పోగొట్టుకున్న నాకీ డబ్బెందుకు?” అందామె నిర్లిప్తంగా.
లిఖిత స్పందించిన హృదయంతో ఆ మాటలు వింది.
ఈ దేశంలో ఎందరెందరో తమ స్వలాభాల కోసం పదవులనలంకరించేరు. కొందరు కోట్ల ఆస్తులు కూడబెట్టి విదేశాలు వెళ్ళేరు. ఇంకొందరు ప్రాచుర్యం కోసం రోడ్లమీద సత్యాగ్రహాలు చేసేరు. మరి కొందరు ఇరవైనాలుగ్గంటలు ఏకధాటిగా ఆడో, పాడో, గెంతో పబ్లిసిటీ తెచ్చుకున్నారు. కాని.. ఇంత ఉదాత్తమైన వ్యక్తిత్వమున్న మనిషి మరణాన్ని ఎవరూ చివరికి కన్నతండ్రి కూడా గుర్తించలేడు.
అతి సామాన్యంగా అతనెళ్ళిపోయేడు.
లిఖిత కప్పుడొచ్చింది దుఃఖం భూమిలోంచి జలం ఎగదన్నినట్లు.
ఆమె వెనుతిరిగి లిఖిత భుజాలు పట్టుకొని “ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరందరూ అతను లేడని నాకు గుర్తుచేయొద్దు. హీయీజ్ విత్ మీ వోన్లీ” అంది.
ఆమె మనోస్థయిర్యానికి లిఖిత చేతులు జోడించింది మనస్ఫూర్తిగా.
*****
అతను చిన్నగా దగ్గేడు.
సిటవుట్ లో కూర్చున్న కేయూరవల్లి ఉలిక్కిపడి అతనివైపు చూసింది.
అతను నమస్కారం పెట్టేడు.
“ఎవరు మీరు?”
“నా పేరు కుటుంబరావు. నేను మీకు తెలియదు. మీ దగ్గరకొచ్చే వెంకట్ గురించి తెలుసుకోవాలని వచ్చేను”
వెంకట్ పేరు వినగానే కేయూర తేరుకుని “రండి కూర్చోండి. ఏంటి పని?” అనడిగింది.
కుటుంబరావు కూర్చున్నాడు.
“చెప్పంది” అంది కేయూర.
“అతను మీకు తెలుసా?”
“తెలుసు. మా అమ్మాయి క్లాస్‌మేటతను” అంది కేయూర అతన్ని నిశితంగా గమనిస్తూ.
కుటుంబరావు కాస్సేపు తల దించుకున్నాడు. అతనెందుకొచ్చేడో కేయూరకర్ధం కాలేదు.
“ఏమిటో చెప్పండి” అంది తిరిగి రెట్టిస్తున్నట్లుగా.
“ఏం లేదు. నాకు నిజంగా ఎలా చెప్పాలో తెలియడం లేదు. చాలా సిగ్గుచేటుగా ఉంది” అన్నాడు మెల్లిగా.
అలా చెబుతున్నప్పుడతని కళ్ళనిండా అభిమానం చంపుకోవాల్సి వచ్చినందుకు దెబ్బతిన్నట్లుగా ఎర్రజీరలలుముకొన్నాయి. పెదవులు చిన్నగా కంపించేయి.
“వెంకట్ ఏం చేసేడు?”
“చాలా ఘోరమే చేసేడు మేడం. నా భార్యని పెళ్ళి చేసుకున్నాడు.”
ఆ మాట విని తల తిరిగింది కేయూరకి.
కుటుంబరావుని పిచ్చివాడిలా చూసి “మీరంటున్నదేమిటి? మీ భార్యని పెళ్లి చేసుకోవడమేంటి?”అనడిగింది విస్మయంగా.
“నేనబద్ధం చెప్పడం లేదు” అంటూ జరిగినదంతా క్లుప్తంగా చెప్పేడు కుటుంబరావు.
అతను చెప్పిన కథ వినడానికే కాదు నమ్మడానిక్కూడా అసంబద్ధంగా, కాకమ్మ కథలా అనిపించింది కేయూరకి.
“మీ మానసిక పరిస్థితి బాగానే ఉందా?”అనడిగింది చివరికి.
ఆ మాట విని కుటూంబరావు మొహం పాలిపోయింది. “ఇది నా ఖర్మ. ఏం చెప్పమంటారు. అది నా మేనకోడలే. ఉద్యోగం కూడా చేస్తుంది. ఎవడో వాడు పూర్వజన్మలో దీని భర్తని చెప్పేడంట. వాణ్ణి తీసుకుని అహోబిళం వెళ్ళి పెళ్ళి చేసుకొచ్చింది. ఇప్పుడూ వాడికి డబ్బు కావాలట. ఆస్తి పంపకం చేసేస్తే వాడితో వెళ్ళిపోతుండంట. మాకిద్దరు పిల్లలు. వాళ్ల కోసమే నా విచారం.
“అయితే ఈ మధ్యనొక అమ్మయితో చూశానతన్ని. ఆవిడేనా?”
“కాదు. వాడి మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడటీ మధ్య. దాంతో ఇది పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది. గదిలో పెట్టి తాళం వేసేను. ఎవరో అతను మీకు తెలుసని చెబితే.. వివరాలు తెలుసుకుందామని వచ్చేను. దయచేసి అతన్ని మందలించండి. నా సంసారాన్ని కాపాడండి.”అన్నాడతడు చేతులు జోడించి.
“ఎప్పుడు జరిగిందితంతా?”
“ఈ మధ్యనే. పోయిన వారం సెలవు పెట్టి వాళ్ల ఊరెళ్లొస్తానని ఈ నిర్వాకం చేసింది.” అన్నాడాయన ఉక్రోషంగా.
కేయూర ఆ జవాబు విని దిగ్భ్రమకి గురయింది.
అంటే .. ఇతను కేరళ వెళ్లడం, లిఖితని కలవడం అంతా అబద్ధమన్నమాట.
ఆ విషయం గ్రహింపుకి రాగానే ఆమె కళ్లెర్రబడ్డాయి.
“రాస్కెల్! వాడిని చూస్తే నాకెప్పుడూ అపనమ్మకమే. ఈ మధ్య నా ఒంటరితనంలో నేను వాన్ని నమ్మక తప్పలేదు. మీరెందుకు ఊరుకున్నారు. పోలీసు రిపోర్టివ్వండి” అంది కోపంగా.
అతను శుష్కంగా నవ్వేడు.
“ఈ దేశంలో పోలీసు స్టేషన్లు నందిని పంది చెయ్యడానికి తప్ప దేనికి పనికొస్తాయి? పైగా నా సంసారం రచ్చకెక్కుతుంది. అందుకే అతను మీకు భయపడతాడేమో మందలించి మా మధ్యకి రావొద్దని చెప్పమని అడగడానికొచ్చాను” అన్నాడు కుటుంబరావు ప్రాధేయపూర్వకంగా.
కేయూరవల్లికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అతను తననే మోసగిస్తున్నాడని చెప్పలేకపోయింది.
కుటుంబరావు లేచి నిలబడి చేటులు జోడించి “వస్తానమ్మా. మీకు శ్రమ ఇస్తున్నందుకు క్షమించండీ” అన్నాడు.
కేయూర నీరసంగా తల పంకించి నమస్కారం పెట్టిందతనికి
కుటుంబరావు బయటకొచ్చి స్కూటర్ స్టార్టు చేసుకొని ఆ వీధి మలుపు తిరుగుతుండగా వెంకట్ అతన్ని గమనించి పక్కకి తప్పుకొన్న విషయం కుటుంబరావు గమనించలేదు.
వెంకట్ మెదడులో చకచకా ఆలోచనల రీళ్ళు తిరిగిపోయేయి.
నిస్సందేహంగా అతను కేయూరవల్లిని కలిసి వెళ్తున్నాడు. అంటే… తన గుట్టు ఆవిడకి తెలిసిపోయుంటుంది. ఇప్పుడు తనెళ్తే ఆవిడ తనని చంపినంత పని చేస్తుంది. అనుకొని వెంకట్ గబగబా భీమిలీ రోడ్డులోని ఓంకారస్వామి దగ్గరకి బయల్దేరేడు.
*****
చోటానికరాలోని భగవతి గుడి ప్రాంగణంలో బాగా దిగువగా ఉన్న కోనేటిలో కార్తికేయన్ మొలలోతు నీళ్ళలో నిలబడి ఉన్నాడు.
లిఖిత, కాణ్హా కొంచెం ఎగువలో నిలబడి అక్కడ జరుగుతున్న తతంగాన్ని కొంత భయంగానూ, మరి కొంత ఆసక్తిగానూ గమనిస్తున్నారు.
కోనేరంతా పసుపు రంగులో ఉంది. పసుపు బట్టలతో చేతబడి చేయబడిన వ్యక్తులు దిగడం వలన కోనేరంతా పసుపు రంగుకు మారింది.
ఆ ఆలయపూజారి పసుపు, కొబ్బరినూనె కలిపిన ముద్దని కార్తికేయన్ శరీరమంతా మర్ధించేడు శిరస్సుతో సహా. కొబ్బరాకుల దోనెతో కార్తికేయన్ తలపై నీరు గుమ్మరిస్తూ మలయాళంలో మంత్రాన్ని ఉచ్చరిస్తూ దాదాపు ఒక గంట ఆ తతంగాన్ని సాగించేడు.
ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి చందనం పూత చేసి ముందు భాగంలో ఉన్న కోవెలలో కూర్చోబెట్టేరు. లిఖిత, కాణ్హా కూడా అక్కడ దగ్గర్లో కూర్చున్నారు. ఆలయమంతా తైల దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతోంది. గర్భగుడికి దగ్గరగా ఇరువైపులా ఉన్న రెండు స్తంభాల్ని చూపించేడు కాణ్హా లిఖితకి.
ఆ స్తంభాల నిండా సూది మోపేంత ఖాళీ లేకుండా మేకులు దిగబడి ఉన్నాయి.
“ఏంటవి?” అనడిగింది లిఖిత ఆశ్చర్యపడుతూ.
“ఇక్కడున్న మేకుల సంఖ్యనుబట్టి అంతమందికి ఇక్కడ చేతబడి తీసేరని అర్ధం”
అతని జవాబు విని సంశయంగా చూసింది లిఖిత.
“నిజంగా చేతబడులున్నాయంటావా?” అనడిగింది లిఖిత.
“అక్కడ కూర్చున్నవాళ్ళని చూడు”
లిఖిత గర్భగుడికి ఇరువైపులా ఉన్న మండపాల్లో కూర్చుని ఉన్న వ్యక్తుల వైపు చూసింది.
అక్కడ చాలా మంది స్త్రీ పురుషులు చందనపు పూతలతో కూర్చుని ఉన్నారు. ఎవరూ ఈ లోకంతో సంబంధం లేనట్లుగా కళ్లు మూసుకుని పూనకం వచ్చినట్లుగా వూగుతున్నారు. కొందరు గజగజా వణుకుతున్నారు.
ఒక పక్క భక్తులకి ఆలయంలో దైవ దర్శనం జరుగుతున్నా వాళ్లు మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా కూర్చుని ఉన్నారు. కార్తికేయన్ చిన్న టవల్ కట్టుకుని వాళ్లలో ఒకడుగా కూర్చుని ఉండటం లిఖితకి ఎనలేని బాధని కల్గించింది.
ఒక గొప్ప సైంటిస్టుకి ఆ గతి పట్టడమేంటి? నిజంగా చేతబడులంటూ ఉన్నాయా?
వెంటనే కొచ్చిన్‌లో భగవతి కోవెల పూజారి కుట్టికారన్ చెప్పిన మాటలు గుర్తొచ్చేయి.
మనసు బలహీనమైనప్పుడు మానసిక రుగ్మతలు అందులోకి తేలిగ్గా జొరబడతాయి. తన తండ్రి ఎన్నో సంవత్సరాలు ప్రయొగశాలలో చేసిన శ్రమ వృధా అయిందని కృంగిపోయేడు. ఇక తనేం చేయలేనన్న భావనతో తనలో ఉన్న శక్తిని తనే మరచిపోయేడు. ఫెయిల్యూర్ అతన్ని తీవ్ర సంక్షోభానికి గురి చేసింది. ఆ బాధే అతన్నిలా కొందరి క్షుద్రోపాసకుల వశం చేసింది.
లిఖిత అక్కడి పూజారులు చేస్తున్న తతంగాన్ని గమనించింది. వాళ్లు ఇప్పుడు తన తండ్రి తలలో, శరీరంలో నరాల్ని చల్లబరిచే వైద్యాలు, రకరకాల ఆయుర్వేద మూలికలతో చేస్తూ మరో పక్క క్షుద్ర చేతబడులు తీస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు.
లేకపోతే మూలికల తైలాన్ని శరీరం తలకి మర్దించాల్సిన అవసరమేముంది?
ఎన్నాళ్లకి తన తండ్రి మామూలు మనిషి అవుతాడో! తననెప్పుడు గుర్తిస్తాడో. దిగులుగా ఆలోచిస్తూ కూర్చుంది లిఖిత.
*****
“డబ్బు తెచ్చేవా?” లోనికి ప్రవేశించిన వెంకట్‌ని ప్రశ్నించేడు ఓంకారస్వామి.
“ఏం డబ్బు నా పిండాకూడు. ఆ ఈశ్వరి మొగుడు లిఖిత తల్లి దగ్గరకెళ్లి నా సంగతంతా చేప్పేసేడు. ఆవిడిప్పుడేం చేస్తుందోనని వణుకుతూ పరిగెత్తుకొచ్చేనిక్కడికి” అన్నాడు వెంకట్.
“ఆ ఒంటరి ఆడదేం చేస్తుంది?” అనడిగేడు ఓంకారస్వామి హేళనగా.
“అంతలా తీసిపారేయకండి. మొగుణ్ణొదిలేసి ఇరవై సంవత్సరాలు ఫాక్టరీ సొంతంగా నడుపుతూ మహారాణిలా బతికింది. ఏదో కూతురు దూరమైందని డీలాపడింది కానీ.. లేకపోతేనా?”
“ఏం చేస్తుందంటావు?”
“ఏమో నేనేం చెప్పగలను. ఇదంతా ఆ ఈశ్వరి వల్లనే వచ్చింది. అది నేనే దాని భర్తనని రంకెలేసి వీధిన పడటం వల్లనే ఈ ముప్పొచ్చింది. అది సీక్రెట్‌గా ఆస్తి తెస్తుందని ఆశపడ్డాను గానీ. ఇలా రచ్చకెక్కి పిచ్చి పట్టిస్తుందనుకోలేదు.”
ఓంకారస్వామి వెంకట్ భయాన్ని హేళనగా తీసుకున్నాడు.
“నువ్వూరికే తాడుని చూసి పామనుకుంటున్నావు. ఆ కేయూరని ఇంట్లోనే బంధించిరా. భయమేం లేదు. అదేం చేస్తుంది!” అన్నాడు.
వెంకట్ సంశయంగా చూసి “ఇంకా గొడవవుతుందేమో!” అన్నాడు.
“సింగినాదమవుతుంది. ప్రస్తుతానికాపని చేసి రా. తర్వాత ఆలోచిద్దాం.” అన్నాడు.
వెంకట్‌కి ఆ ఉపాయం నచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టడానికి తిరుగుమొహం పట్టేడు.

ఇంకా వుంది.

బ్రహ్మలిఖితం 21
రచన: మన్నెం శారద గారు
అతను కళ్ళద్దాలు సవరించుకొని అందులో రసింది దీక్షగా చదివేడు. ఆ పైన పకపకా నవ్వాడు.
కాన్హా అసహనంగా చూస్తూ నిలబడ్డాడు.
“ఏముంది అందులో?”
“ఏముంటుంది? మామూలే. నీకు తనకి ఉన్న అనుబంధానికి వెల లేదట. నువ్వు చేసిన సహాయానికి డబ్బిస్తే నువ్వు బాధపడతావని డబ్బివ్వడం లేదట. ప్రేమకి పర్యవసానం పెళ్లి కాకపోతే ఆమె హృదయంలో మొదటి స్థానం నీదేనట. మనసు నెప్పుడైనా ఒంటరితనం ఆవహించినా, బాధ కల్గినా మొదటిసారి గుర్తు చేసుకునేది నిన్నేనట. ఎప్పుడయినా తన దగ్గరకి రావొచ్చని ఎడ్రసిచ్చింది.” అని చెప్పేడతను.
ఆ మాటలో కొన్ని పదాల అర్ధం నిర్దుష్టంగా తెలీకపోయినా కాన్హా కళ్లు నీటితో చిప్పిల్లేయి.
అతనది చూసి పకపకా నవ్వి “ఏంటి ఏడుస్తున్నావా? ఇవన్నీ నిజమనే నమ్మేస్తున్నావా? మగాడిపట్ల టియర్‌గాస్ ఆడాళ్ళు. చక్కగా ఈ మాటలు చెప్ఫేసి చెక్కేసిందా? సరిగ్గా నాలుగేళ్ల క్రితం నా ప్రియురాలు కూదా ఇలానే చెప్పేసి ఎవణ్ణో కట్టుకుని బాంబే వెళ్ళిపోయింది. నమ్మకు. ఈ దగాకోరు మాటలు నమ్మకు. అంతా ట్రాష్.” అంటూ మళయాళంలో అరుస్తూ ఆ ఉత్తరాన్ని ముక్కలుగా చింపేసి గాలిలో ఎగరేసేడతను.
కాన్హా అతని చర్యకు నిరుత్తుడయి కోపంగా అతని కాలర్‌ను పట్టుకొని కొట్టబోయేడు.
“వద్దు. వాడు పిచ్చోడు. కొట్టకు” ఎవరో పోర్టరు వచ్చి కాన్హా నుండి అతన్నొదిలించేడు.
కాన్హాలో అప్పూడావరించింది చెప్పలేని నిస్పృహ.
ఎప్పుడయినా, ఎన్నడయినా లిఖితని చూడాలనిపిస్తే.. వెళ్ళే దారి పూర్తిగా సమాధి చేయబడించని తెలిసి అతని హృదయం నొక్కేసినట్లయింది.
నిర్లిప్తత ఆవరించిన హృదయంతో అతను మున్నార్ బయల్దేరేడు.
బస్సు కదిలింది. ఓ మూల సీటులో కూర్చుని అతను అనుకున్నాడు. ‘ఆమెనెందుకు కలవాలి. కలిసినా తమ మధ్యనున్న అంతర్యాలు కలవవు. ఆ ఎడ్రస్సలా పోవడమే ఒక విధంగా మంచిదేమో.
కఠినమైన నిర్ణయం కన్నీరు తెప్పిస్తుంటే కళ్ళు మూసుకున్నాడతను.
**********
డాక్టరు ప్రభంజన విచారంగా తన గదిలో కూర్చొని ఎంతకూ బయటకు రాకపోయేసరికి ఈశ్వరి అనుమానంగా ఆమె గదిలోకి తొంగి చూసింది.
ప్రభంజన కూర్చున్న భంగిమలోగాని, చూపులోగాని మార్పు రాకపోయేసరికి ఈశ్వరి తనే చొరవ చేసుకొని లోనికొచ్చి ‘మేడం’ అని పిలిచింది.
ప్రభంజన చూపు మరల్చి ఈశ్వరి కేసి చూసి విచారంగా మొహం పెట్టి “నువ్వనవసరంగా నా కొంప ముంచేవు” అంది బాధగా.
ఈశ్వరి ఆమె వైపు తెల్లబోతూ చూసి “ఏం జరిగింది మేడం. వెంకట్‌ని తెసుకొస్తానని వెళ్ళి ఇలా దిగులుగా వచ్చేరేంటీ? అతను కనబడలేదా?” అంది ఆత్రుతగా.
“నేను ఓంకారస్వామి దగ్గర కెళ్ళేను. అతను నా పూర్వజన్మ గురించి చెప్పేడు. అప్పట్నించి నా మనసు మనసులో లేదు. నా భర్త ఎవరో తెలిశాక.. నాకన్నం ముట్టబుద్ది కావటం లేదు. ఏం చేయాలో దిక్కు తోచక ఏడుస్తున్నాను” అంది ప్రభంజన.
ఈశ్వరి ఆశ్చర్యంగా చూస్తూ “ఏమిటీ, డాక్టర్ సుందరంగారు మీ భర్త కాదా?” అంది.
“పోయిన జన్మలో కాదట. ప్రస్తుతం నా భర్త.” అంటూ ఆగి ఈశ్వరి కళ్లలోకి చూసింది.
“చూశారా! నన్నన్నారుగాని మీక్కూడా పూర్వజన్మలోని భర్త మీదే ప్రేమ కల్గింది. ఇప్పుడింతకీ ఆయనెక్కడున్నాడు.”
ప్రభంజన వేలుపెట్టి వరండాలొకి చూపించింది.
ఈశ్వరి అటు చూసి ఎవరూ లేకపోవడంతో “అక్కడెవరున్నారు మీ పెంపుడు కుక్క తప్ప” అంది.
“అదే నా భర్తట. నా మీద ప్రేమతో నా ఇంట్లోకే వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి.” అంది బాధగా ప్రభంజన.
ఈశ్వరి మొహం ఏవగింపుగా పెట్టి “చా! చ! ఈ కుక్కా!” అంది.
ప్రభంజన ఈశ్వరి వైపు అదోలా చూసి “అలా అనకు. నాకు బాధేస్తుంది. ఏదో పాపం కొద్ది అలా పుడితే అది నా భర్త కాకపోతుందా? నేను సుందరంగారిని వదిలి దాన్ని తీసుకెళ్ళి పోదామనుకుంటున్నా.
ఈశ్వరి నవ్వాపుకొని “ఖచ్చితంగా మీకు పిచ్చి పట్టిందనుకుని పిచ్చాసుపత్రిలో వేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా దాన్ని తరిమేసి సుందరంగారితో హాయిగా ఉండండి” అంది.
“ఎందుకని?”
ప్రభంజన సూటి ప్రశ్నకి ఈశ్వరి చిరాగ్గా చూసింది.
“ఎందుకేమిటి, సొసైటీలో మీరొక పెద్ద డాక్టరు. ఒక కుక్క పూర్వ జన్మలో మీ భర్తంటే నవ్వరూ. పైగా దాంతో వెళ్తే మీ గౌరవమేం కావాలి?”
ప్రభంజన ఈశ్వరికేసి నిశితంగా చూసి “నీ పెళ్లయి ఎన్నేళ్ళయింది?” అనడిగింది.
“పద్నాలుగేళ్ళు”
“పద్నాలుగేళ్ళు కాపురం చేసిన భర్తని, కన్న పిల్లల్ని సొసైటీలో నీకున్న స్థానాన్ని వదిలేసి వెంకట్ అనేవాడితో వెళ్లిపోతే నీ గౌరవం మాత్రం పోదా? నువ్వెళ్లిపోగానే నీ భర్త, పిల్లల గతేంటి?” అనడిగింది సూటిగా.
ఈశ్వరి తెల్లబోయినట్లుగా చూసిందామెవైపు.
మొదటిసారిగా ఆమె సరైన జవాబు చెప్పలేకపోయింది.
ప్రతివాళ్ళూ తమ పూర్వజన్మల గురించి తెలుసుకొని ప్రస్తుత అనుబంధాలు వదిలేసి వెళ్ళిపోతే ప్రపంచమేమైపోతుందో ఆలోచించు. అసలివన్నీ నమ్మదగ్గ విషయాలు కాదు ఈశ్వరి. వాళ్లు బ్రతుకు తెరవుకోసం ఏవేవో చెబుతారు. నా చిన్నప్పుడొక జ్యోతిష్కుడు నాకసలు చదువే రాదన్నాడు. ఆ మాట మనసులో పెట్టుకుని చదవకపోతే నేను డాక్టర్నయ్యేదాన్నా? ఆలోచించు” అంటూ ఆ గదిలోంచి డిస్పెన్సరీ వైపు వెళ్లిపోయింది డా.ప్రభంజన.
ఈశ్వరి మొదటిసారి ఆలోచించడం మొదలెట్టింది.
*****
వెంకట్ అనుచరులు తలుపు తాళం తీసి అన్నం కేరియర్ అక్కడ పెడుతూ “అన్నం తెచ్చేం” అన్నారు. చీకట్లో మంచం కేసి చూస్తూ.
“నాకొద్దు” అంది మంచం మీద ఆకారం.
“ఏమో మాకు తెల్దు. ఆయన తినమని చెప్పేడు. తిను”
“ఆయనెప్పుడొస్తాడు?”
“చెప్పలేదు”
“ఇప్పుడే రమ్మనీసిండి. నాకు సూడాలనిపిస్తన్నదా బాబుని”.
ఆమె మాట తీరుకు ఆశ్చర్యపడి టార్చిలైటు వెలిగించేడు అందులోని వ్యక్తొకడు.
ఆ వెలుగులో మంచమ్మీద కూర్చున్న ఆకారాన్ని చూసి అందరి గుండెలు ఝల్లుమన్నాయి.
చారెడు బంతిపూల దండతో జడేసుకుని చంకీ రవిక, నైలాను చీర కట్టి మెల్లకన్నుతో మెల్లిగా నవ్వింది అప్పలనరసమ్మ.
“నువ్వెవరివి. ఆవిడేది?” అన్నారు వాళ్లు కోపంగా.
“నేనెవతినా! మీ కళ్లల్లో దుమ్ముగొట్టా. నన్నే కదరా ఆటోరిచ్చాలో అమాంతం తెచ్చి ఈ గదిలో కుదేసినారు. ఎవురో సాధువు ఆ కిటికీలోంచి నా బుర్ర మీన సెయ్యెట్టి ఆ ఎంకటుగాడే నీ మొగుడు. ఆణ్ని మనువాడమని సెప్పి ఇంత బుగ్గి నా మొకాన కొట్టి ఎల్లిపోనాడు. అంతే. నా ఆకారమిలాగయిపోనాది. మీరు బేగెల్లి ఎంకటుని రమ్మని సెప్పండి.” అంది అప్పలనరసమ్మ.
ఆ మాటలు విని వాళ్ల గుండె బేజారైంది.
పరుగున వెంకట్ దగ్గరికి పరిగెత్తేరు.
అప్పుడు వెంకట్ ఓంకారస్వామి దగ్గర కూర్చొని ఉన్నాడు.
వెంకట్ వాళ్లవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
“కొంప మునిగింది. ఆవిడ మారిపోయింది” అన్నారు వాళ్లు గుసగుసగా వెంకట్ పక్కన చేరి.
“అంటే! పారిపోయిందా?” అనడిగేడు వెంకట్ గాభరాగా.
“లేదు సామి. అదెవర్తిగానో మారిపోయింది. నిన్ను సూడాలంటుంది. ఎంటనే నిన్నట్టుకొచ్చేయమని అరిచి గీ పెడుతుంది. అందుకే నీకు సెబుదామని.” అన్నారు వాళ్లు.
ఓంకారస్వామి ఏవిటన్నట్లుగా చూశాడు వెంకట్ వైపు.
మిగతా భక్తులకి అనుమానం రాకుండా వెంకట్ లేచి ఓంకారస్వామి చెవిలో విషయాన్ని గుసగుసగా చెప్పేడు.
ఓంకారస్వామి భ్రుకుటి ముడిపడింది.
“తమాషాగా ఉందే. నిజంగా మీరు కేయూరవళ్లనుకొని ఇంకెవర్నొ బంధించలేదు కదా.” అనడిగేడు.
“ఇంకా నయం. నేనే కదా ఆవిణ్ణి తీసుకెళ్లింది” అన్నాడు వెంకట్.
“అయితే ఇదేదో చిత్రంగా ఉంది. నువ్వెల్లొకసారి చూసిరా. “అన్నాడు ఓంకారస్వామి.
వెంకట్ అదురుతున్న గుండెతో వాళ్ల వెంట బయలుదేరాడు.
*****
రైలు వేగంగా వెళ్తోంది. కాన్హా ప్రాట్ఫామ్ మీద నిలబడి తనని అలాగే చూస్తూ నిలబడిపోయిన దృశ్యం లిఖిత కళ్ళనుండి వీడిపోవడం లేదు.
“బేబీ!”
తండ్రి పిలుపుకి కళ్ళు తెరచి చూసింది లిఖిత.
“నేను పడుకుంటాను” అన్నాడాయన.
లిఖిత కర్టెన్ సరిచేసి చలిగా అనిపించి కొద్దిగా ఏ.సి తగ్గించి కూర్చుంది తన సీట్లో.
కార్తికేయన్ పడుకున్నాడు.
లిఖిత రైలు వేగంగా వెళ్తుంటే అద్దంలోంచి దట్టంగా పరిగెత్తుతున్న కొబ్బరి చెట్ల సముదాయాన్ని చూస్తూ కూర్చుంది.
సాయంత్రమయింది.
రైలు జాలార్ పెయిట్లో ఆగింది.
వెంటనే ఎస్పీ హరిహరన్ గుర్తొచ్చేడామెకు.
ట్రెయిన్ తమిళనాడు బంద్ వలన అక్కడాగిపోతే ఆయన తనకు చేసిన మర్యాదలు గుర్తొచ్చేయి.
గబగబా గుమ్మం దగ్గర కొచ్చి అక్కడే నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్ని పిలిచి “హరిహరన్గారున్నారా?” అనడిగింది.
అతను వెళ్లి మరో ఇన్పెక్టర్ ని పిలుచుకొచ్చేడు.
అతను వెంటనే లిఖితను గుర్తుపట్టి సెల్యూట్ చేసేడు.
లిఖిత అతనికి ప్రతి నమస్కారం చేస్తూ “హరిహరన్ గారున్నారేమో చూద్దామని” అంది.
వెంటనే అతని మొహం మ్లానమైంది.
“రెండ్రోజుల క్రితమే ఆయనకి హార్టెటాక్ వచ్చింది.” అన్నాడతను.
“ఇప్పుడెలా ఉన్నారు?” అంటూ గాభరాగా అడిగింది లిఖిత.
“చనిపొయేరు. ఒక్క స్ట్రోక్కే”
అతని జవాబు ఆమె మనసుని నలిపేసింది. అసలే కాన్హా ఎడబాటుతో కుమిలిపోతున్న ఆమె మనసులో దుఃఖం ఆగలేదు. కన్నీరు వెంటనే చెంపల మీదకి జారింది.
“సారీ! చెప్పకూడదనుకున్నాను.” అన్నాడతను.
లిఖిత జవాబు చెప్పలేదు.
అతను తన కర్తవ్యం గుర్తొచ్చినట్లుగా వెళ్లి ఫ్లాస్కోతో కాఫీ టిఫిన్స్, అరటిపళ్లు తెచ్చి ఆమెకందించబోయేడు.
“వద్దు” అంది లిఖిత హీనస్వరంతో.
అ”అలాగనకండి. సార్ చాలా మంచివారు. ఎన్నడూ పోలీసాఫీసర్ దర్పం ప్రదర్శించలేదు. ఆయనక్కావలసిన వాళ్లు మాకూ కావాల్సిన వాళ్ళే!” అంటూ బలవంతంగా లోనికొచ్చి బెర్త్ మీద ఉంచేడు.
రైలు కదిలింది.
అతను దిగి మళ్లీ సెల్యూట్ చేసేడు.
రైలు వేగమందుకుంటుంటే లిఖిత కన్నీటిని దాచుకోలేకపోయింది. నిశ్శబ్దంగా అవిరామంగా వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కూర్చుంది.
తన మనసుని దోచుకున్న ఎవరు వీరంతా.
ఊరుకాని ఊరులో భాషేతర ప్రాంతంలో తన్ని ఆదుకొని ఆత్మీయతని పంచిన మనుషులు.
తనంటే ఎవరో ఏమిటో తెలియకపోయినా మానవత్వాన్ని చూపించిన ఘనులు.
ఇంకా అక్కడక్కడా ఇలాంటి వారుండబట్టే తను తన తండ్రిని కలుసుకోగల్గింది.
కార్తికేయన్ లేచి కూర్చుని లిఖిత వైపు చూసి “ఏంటమ్మా అలా వున్నావు?” అనడిగేడు.
లిఖిత హరిహరన్ మరణం గురించి చెప్పింది.
అతను బాధగా కళ్లు మూసుకున్నాడు.
కాస్సేపటికి కళ్లు తెరచి “అందుకే నేనీ మరణాన్ని జయించాలని విశ్వప్రయత్నం చేసేను. కాని ప్రయోజనం లేకపోయింది” అన్నాడు బాధగా.
అతని ఎదురు సీటులో కాషాయ వస్త్రాలు ధరించి, నున్నగా గుండుతో నుదుటన చందనం లేపనంతో చెవులకి బంగారు సింహపు మకరకుండలాలతో కుడిచేతికి బంగారు కంకణంతో కూర్చున్న వృద్ధుడు కార్తికేయన్ వైపు చూసి “మీరెవరు?” అనడిగేడు.
“ఒక సైంటిస్టుని”
“మరి మరణమంటున్నారేమిటి?”
“అవును. చావులేని మందు కనుక్కోవాలని విశ్వప్రయత్నం చేసి ఓడిపోయాను. చివరికి మళయాళ క్షుద్రోపాసకుల్ని కలిసి ఆ అద్భుత శక్తిని సంపాదించాలనుకున్నాను. అదీ జరగలేదు” అన్నాడు కాస్త విచారంగా.
ఆ వృద్ధుని పెదవులు అపహాస్యంగా విచ్చుకున్నాయి.
“క్షుద్ర అనే పదంలోనే తక్కువ, నీచం అనే అర్ధాలు ఇమిడి ఉన్నాయి. అలాంటి క్షుద్రోపాసకులు మహత్తరమైన మరణ రాహిత్యం గురించి మీకు బోధించగలరని ఎందుకనుకున్నారు?”
అతని ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయేడు కార్తికేయన్.”లాబరేటరీలో నిర్విరామ శ్రమ నాకే ప్రయోజనం కూర్చలేదు. . అందుకే వాళ్లనాశ్రయించేను. ఓటమి మనిషిని బలహీనుణ్ని చేస్తుంది కదా!” అన్నాడు చివరికి.
అతను తల పంకించి కాస్సేపు కళ్లు మూసుకుని తెరచి “మరణరాహిత్యం! అంటే మరణం లేకపోవడం. అది లేకపోతే జననముంటుంది కాని మరణముండదు. అప్పుడీ భూవిస్తీర్ణం మానవవాసానికి సరిపోతుందా? ఇప్పటికే ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారు. అడవుల్ని నరకుతున్నారు. సముద్రాల్ని, నదుల్నీ పూడుస్తున్నారు. ప్రకృతినంతా వికృతం చేసేస్తున్నారు. సంతృప్తి అనే పదాల్ని పూర్తిగా సమాధి చేస్తున్న మనిషి మరణం లేకపోతే మృగమయిపోడూ!” అన్నాడు.
లిఖిత అంతసేపు అనాసక్తంగ వారి సంభాషణ వింటున్నదల్లా అతని మాటలకు ఆసక్తురాలయి వారి వైపు తిరిగింది.
“అంటే నా ఉద్ధేశ్యంలో ఈ మహత్తరమైన రహస్యాన్ని అది మంత్రం కానివ్వండి, మందు కానివ్వండి. అందరికీ అందుబాటులోకి తేవాలని కాదు. మనుషులు అకాలంగా మరణం వాతపడకుండా, అలానే గొప్పవారిని, మేధావుల్ని రక్షించుకోవాలని నా ఆకాంక్ష.”కాని ఇది ఎవరివల్లనా కాదని తెలిసి పొయింది. పూర్వం శుక్రాచార్యుల వారు కచుడికి బోధించిన మృతసంజీవినీ విద్య కూడా కట్టు కథేననుకుంటాను” అన్నాడు కార్తికేయన్.
“కాదు”
ఆయన జవాబు విని “అయితే ఉందంటారా?” అనడిగేడు కార్తికేయన్.
ఆ ప్రశ్నలో కొంత హేళన మిళితమై ఉండటం గమనించాడా వృద్ధుడు.
“మన శక్తికి అందని పరిజ్ఞానం లేదనుకోవడం కేవలం మన అజ్ఞానం మాత్రమే. అయితే మానవ అవతారం ఎత్తిన భగవంతుడు కూడా మరణించేడు. మనకి చావు అనివార్యమని చెబుతూ! కాని మృత సంజీవిని విద్య ఉన్నది. అది ప్రస్తుతం తెలిసిన వ్యక్తి ఒకరే.”
“ఎవరాయన?”
“కపాలబ్రహ్మ. తూర్పు కనుమలలో అరకులోయకి దగ్గర్లో ఉన్న బొర్రా గుహల కావల్ ఉంటాడని తెలుసు. ఈ ఉత్తరాయణంలొ ఆయన తనువు చాలిస్తారని విన్నాను.” అంటూ వ్రేళ్ళని లెక్కపెడుతూ.”ఇంకెంత, ఆయన సమాధి కావడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది” అన్నారాయన.
ఆ మాటలు వినగానే కార్తికేయన్‌లో ఉత్సాహం పొంగి పొరలింది. టైము చాలా తక్కువగా ఉండటం వలన ఒక విధమైన టెన్షన్ కూడా చోటు చేసుకుంది. కాని దాన్ని బయటకి కనిపించనీయకుండా” మీరు చెబుతున్నది నిజమేనా?” అనడిగేడు.
ఆయన కార్తికేయన్ కేసి కళ్ళు తిప్పి చూశాడు.
ఆ కళ్లు మండుతున్న అగ్నికణికల్లా ఉన్నాయి.
“ప్రకృతిని నమ్ముతూ మాకు తెలిసిన పరిజ్ఞానాన్ని విషయ వాంఛలకి ఉపయోగించకుండా ఊరూరా మంచిని పంచడానికి తిరుగుతున్న ఉపదేశికులం మేం. మాకబద్ధమాడాల్సిన పని లేదు.”
లిఖిత ఆయన కోపాన్ని చూసి భయపడింది.
“నాన్నారు చాలా జబ్బున పడి లేచేరు. ఏదైనా ఆయన మాటలు మిమ్మల్ని బాధిస్తే క్షమించండి”
ఆయన చిరునవ్వు నవ్వాడు.
“కోపం కాదది. నా నిజాయితీకుండే తీక్షణతది” అన్నాడాయన.
లిఖిత ఆయనకి అరటి పళ్లందించింది.
ఆయన లిఖితని ఆశీర్వదిస్తూ “శుభజాతకం. తలిదండ్రులకి ఆసరా అవుతావు” అన్నాడు.
అందరూ టిఫిన్స్ తిన్నారు.
రైలు వేగం పెంచుకుంది. అందరూ తెరలు వేసుకొని పడుకున్నారు.
అక్కడ నిద్రరాని వారిద్దరే.
ఒకరు తన సాధన వ్యర్ధమైందనే వేదనతో కార్తికేయనయితే మరొకరు లిఖిత.
మధ్యరాత్రి రైలు గుంటూరులో ఆగింది. లిఖిత ట్రెయిన్ దిగింది తండ్రిని తీసుకొని.
ఇద్దరూ బస్సులొ విజయవాడ చేరుకొని మద్రాసు నుండొస్తున్న హౌరామెయిల్‌ని కాచ్ చేసేరు. కండక్టర్‌ని బ్రతిమిలాడి రెండు సీట్లు సంపాదించింది లిఖిత.
తాము విశాఖపట్నానికి దగ్గరగా వచ్చేస్తున్నామన్న తలంపు ఆమెనొక రకమైన ఉద్వేగానికి గురి చేస్తోంది. తొందరలో తల్లిని చూడబోతోంది. అదీ తండ్రితో కలిసి.
తల్లిని… తండ్రిని తను కలపబోతోంది.
పుట్టినందుకు తన జన్మకొక సార్ధకత లభించబోతోంది.
ఇలాంటి తలపులతో ఆమె హృదయం తీవ్రంగా స్పందిస్తోంది. అలాగే ఆలోచిస్తూ ఆమె ఎప్పుడో నిద్రలోకి జారుకుంది.
అలా ఎంత సేపయిందో.
సరిగ్గా ఎవరో తట్టినట్లు మెలకువొచ్చేసింది.
బాగా తెల్లారిపోయింది.
ఎండ గూడా వచ్చేసింది.
రైలు స్టేషన్లో ఆగి ఉంది.
“ఏ స్టేషనిది?” అనడిగింది ఎదురుగా సంపెంగి పూలమ్ముతున్న వ్యక్తిని.
“వాల్తేరు” అన్నాడతను.
లిఖిత ఆనందంగా తండ్రి బెర్త్ వైపు తిరిగి లేపబోతూ ఉలిక్కిపడింది.
అక్కడ బెర్త్ మీద అతను కప్పుకున్న దుప్పటి మాత్రమే ఉంది.
లిఖిత ఉలిక్కిపడి టాయిలెట్స్ వైపు వెళ్లింది. అక్కడా అతను కనిపించలేదు.
ఇంకా ఉంది.

బ్రహ్మలిఖితం 21
రచన: మన్నెం శారద గారు
అతను కళ్ళద్దాలు సవరించుకొని అందులో రసింది దీక్షగా చదివేడు. ఆ పైన పకపకా నవ్వాడు.
కాన్హా అసహనంగా చూస్తూ నిలబడ్డాడు.
“ఏముంది అందులో?”
“ఏముంటుంది? మామూలే. నీకు తనకి ఉన్న అనుబంధానికి వెల లేదట. నువ్వు చేసిన సహాయానికి డబ్బిస్తే నువ్వు బాధపడతావని డబ్బివ్వడం లేదట. ప్రేమకి పర్యవసానం పెళ్లి కాకపోతే ఆమె హృదయంలో మొదటి స్థానం నీదేనట. మనసు నెప్పుడైనా ఒంటరితనం ఆవహించినా, బాధ కల్గినా మొదటిసారి గుర్తు చేసుకునేది నిన్నేనట. ఎప్పుడయినా తన దగ్గరకి రావొచ్చని ఎడ్రసిచ్చింది.” అని చెప్పేడతను.
ఆ మాటలో కొన్ని పదాల అర్ధం నిర్దుష్టంగా తెలీకపోయినా కాన్హా కళ్లు నీటితో చిప్పిల్లేయి.
అతనది చూసి పకపకా నవ్వి “ఏంటి ఏడుస్తున్నావా? ఇవన్నీ నిజమనే నమ్మేస్తున్నావా? మగాడిపట్ల టియర్‌గాస్ ఆడాళ్ళు. చక్కగా ఈ మాటలు చెప్ఫేసి చెక్కేసిందా? సరిగ్గా నాలుగేళ్ల క్రితం నా ప్రియురాలు కూదా ఇలానే చెప్పేసి ఎవణ్ణో కట్టుకుని బాంబే వెళ్ళిపోయింది. నమ్మకు. ఈ దగాకోరు మాటలు నమ్మకు. అంతా ట్రాష్.” అంటూ మళయాళంలో అరుస్తూ ఆ ఉత్తరాన్ని ముక్కలుగా చింపేసి గాలిలో ఎగరేసేడతను.
కాన్హా అతని చర్యకు నిరుత్తుడయి కోపంగా అతని కాలర్‌ను పట్టుకొని కొట్టబోయేడు.
“వద్దు. వాడు పిచ్చోడు. కొట్టకు” ఎవరో పోర్టరు వచ్చి కాన్హా నుండి అతన్నొదిలించేడు.
కాన్హాలో అప్పూడావరించింది చెప్పలేని నిస్పృహ.
ఎప్పుడయినా, ఎన్నడయినా లిఖితని చూడాలనిపిస్తే.. వెళ్ళే దారి పూర్తిగా సమాధి చేయబడించని తెలిసి అతని హృదయం నొక్కేసినట్లయింది.
నిర్లిప్తత ఆవరించిన హృదయంతో అతను మున్నార్ బయల్దేరేడు.
బస్సు కదిలింది. ఓ మూల సీటులో కూర్చుని అతను అనుకున్నాడు. ‘ఆమెనెందుకు కలవాలి. కలిసినా తమ మధ్యనున్న అంతర్యాలు కలవవు. ఆ ఎడ్రస్సలా పోవడమే ఒక విధంగా మంచిదేమో.
కఠినమైన నిర్ణయం కన్నీరు తెప్పిస్తుంటే కళ్ళు మూసుకున్నాడతను.
**********
డాక్టరు ప్రభంజన విచారంగా తన గదిలో కూర్చొని ఎంతకూ బయటకు రాకపోయేసరికి ఈశ్వరి అనుమానంగా ఆమె గదిలోకి తొంగి చూసింది.
ప్రభంజన కూర్చున్న భంగిమలోగాని, చూపులోగాని మార్పు రాకపోయేసరికి ఈశ్వరి తనే చొరవ చేసుకొని లోనికొచ్చి ‘మేడం’ అని పిలిచింది.
ప్రభంజన చూపు మరల్చి ఈశ్వరి కేసి చూసి విచారంగా మొహం పెట్టి “నువ్వనవసరంగా నా కొంప ముంచేవు” అంది బాధగా.
ఈశ్వరి ఆమె వైపు తెల్లబోతూ చూసి “ఏం జరిగింది మేడం. వెంకట్‌ని తెసుకొస్తానని వెళ్ళి ఇలా దిగులుగా వచ్చేరేంటీ? అతను కనబడలేదా?” అంది ఆత్రుతగా.
“నేను ఓంకారస్వామి దగ్గర కెళ్ళేను. అతను నా పూర్వజన్మ గురించి చెప్పేడు. అప్పట్నించి నా మనసు మనసులో లేదు. నా భర్త ఎవరో తెలిశాక.. నాకన్నం ముట్టబుద్ది కావటం లేదు. ఏం చేయాలో దిక్కు తోచక ఏడుస్తున్నాను” అంది ప్రభంజన.
ఈశ్వరి ఆశ్చర్యంగా చూస్తూ “ఏమిటీ, డాక్టర్ సుందరంగారు మీ భర్త కాదా?” అంది.
“పోయిన జన్మలో కాదట. ప్రస్తుతం నా భర్త.” అంటూ ఆగి ఈశ్వరి కళ్లలోకి చూసింది.
“చూశారా! నన్నన్నారుగాని మీక్కూడా పూర్వజన్మలోని భర్త మీదే ప్రేమ కల్గింది. ఇప్పుడింతకీ ఆయనెక్కడున్నాడు.”
ప్రభంజన వేలుపెట్టి వరండాలొకి చూపించింది.
ఈశ్వరి అటు చూసి ఎవరూ లేకపోవడంతో “అక్కడెవరున్నారు మీ పెంపుడు కుక్క తప్ప” అంది.
“అదే నా భర్తట. నా మీద ప్రేమతో నా ఇంట్లోకే వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి.” అంది బాధగా ప్రభంజన.
ఈశ్వరి మొహం ఏవగింపుగా పెట్టి “చా! చ! ఈ కుక్కా!” అంది.
ప్రభంజన ఈశ్వరి వైపు అదోలా చూసి “అలా అనకు. నాకు బాధేస్తుంది. ఏదో పాపం కొద్ది అలా పుడితే అది నా భర్త కాకపోతుందా? నేను సుందరంగారిని వదిలి దాన్ని తీసుకెళ్ళి పోదామనుకుంటున్నా.
ఈశ్వరి నవ్వాపుకొని “ఖచ్చితంగా మీకు పిచ్చి పట్టిందనుకుని పిచ్చాసుపత్రిలో వేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా దాన్ని తరిమేసి సుందరంగారితో హాయిగా ఉండండి” అంది.
“ఎందుకని?”
ప్రభంజన సూటి ప్రశ్నకి ఈశ్వరి చిరాగ్గా చూసింది.
“ఎందుకేమిటి, సొసైటీలో మీరొక పెద్ద డాక్టరు. ఒక కుక్క పూర్వ జన్మలో మీ భర్తంటే నవ్వరూ. పైగా దాంతో వెళ్తే మీ గౌరవమేం కావాలి?”
ప్రభంజన ఈశ్వరికేసి నిశితంగా చూసి “నీ పెళ్లయి ఎన్నేళ్ళయింది?” అనడిగింది.
“పద్నాలుగేళ్ళు”
“పద్నాలుగేళ్ళు కాపురం చేసిన భర్తని, కన్న పిల్లల్ని సొసైటీలో నీకున్న స్థానాన్ని వదిలేసి వెంకట్ అనేవాడితో వెళ్లిపోతే నీ గౌరవం మాత్రం పోదా? నువ్వెళ్లిపోగానే నీ భర్త, పిల్లల గతేంటి?” అనడిగింది సూటిగా.
ఈశ్వరి తెల్లబోయినట్లుగా చూసిందామెవైపు.
మొదటిసారిగా ఆమె సరైన జవాబు చెప్పలేకపోయింది.
ప్రతివాళ్ళూ తమ పూర్వజన్మల గురించి తెలుసుకొని ప్రస్తుత అనుబంధాలు వదిలేసి వెళ్ళిపోతే ప్రపంచమేమైపోతుందో ఆలోచించు. అసలివన్నీ నమ్మదగ్గ విషయాలు కాదు ఈశ్వరి. వాళ్లు బ్రతుకు తెరవుకోసం ఏవేవో చెబుతారు. నా చిన్నప్పుడొక జ్యోతిష్కుడు నాకసలు చదువే రాదన్నాడు. ఆ మాట మనసులో పెట్టుకుని చదవకపోతే నేను డాక్టర్నయ్యేదాన్నా? ఆలోచించు” అంటూ ఆ గదిలోంచి డిస్పెన్సరీ వైపు వెళ్లిపోయింది డా.ప్రభంజన.
ఈశ్వరి మొదటిసారి ఆలోచించడం మొదలెట్టింది.
*****
వెంకట్ అనుచరులు తలుపు తాళం తీసి అన్నం కేరియర్ అక్కడ పెడుతూ “అన్నం తెచ్చేం” అన్నారు. చీకట్లో మంచం కేసి చూస్తూ.
“నాకొద్దు” అంది మంచం మీద ఆకారం.
“ఏమో మాకు తెల్దు. ఆయన తినమని చెప్పేడు. తిను”
“ఆయనెప్పుడొస్తాడు?”
“చెప్పలేదు”
“ఇప్పుడే రమ్మనీసిండి. నాకు సూడాలనిపిస్తన్నదా బాబుని”.
ఆమె మాట తీరుకు ఆశ్చర్యపడి టార్చిలైటు వెలిగించేడు అందులోని వ్యక్తొకడు.
ఆ వెలుగులో మంచమ్మీద కూర్చున్న ఆకారాన్ని చూసి అందరి గుండెలు ఝల్లుమన్నాయి.
చారెడు బంతిపూల దండతో జడేసుకుని చంకీ రవిక, నైలాను చీర కట్టి మెల్లకన్నుతో మెల్లిగా నవ్వింది అప్పలనరసమ్మ.
“నువ్వెవరివి. ఆవిడేది?” అన్నారు వాళ్లు కోపంగా.
“నేనెవతినా! మీ కళ్లల్లో దుమ్ముగొట్టా. నన్నే కదరా ఆటోరిచ్చాలో అమాంతం తెచ్చి ఈ గదిలో కుదేసినారు. ఎవురో సాధువు ఆ కిటికీలోంచి నా బుర్ర మీన సెయ్యెట్టి ఆ ఎంకటుగాడే నీ మొగుడు. ఆణ్ని మనువాడమని సెప్పి ఇంత బుగ్గి నా మొకాన కొట్టి ఎల్లిపోనాడు. అంతే. నా ఆకారమిలాగయిపోనాది. మీరు బేగెల్లి ఎంకటుని రమ్మని సెప్పండి.” అంది అప్పలనరసమ్మ.
ఆ మాటలు విని వాళ్ల గుండె బేజారైంది.
పరుగున వెంకట్ దగ్గరికి పరిగెత్తేరు.
అప్పుడు వెంకట్ ఓంకారస్వామి దగ్గర కూర్చొని ఉన్నాడు.
వెంకట్ వాళ్లవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.
“కొంప మునిగింది. ఆవిడ మారిపోయింది” అన్నారు వాళ్లు గుసగుసగా వెంకట్ పక్కన చేరి.
“అంటే! పారిపోయిందా?” అనడిగేడు వెంకట్ గాభరాగా.
“లేదు సామి. అదెవర్తిగానో మారిపోయింది. నిన్ను సూడాలంటుంది. ఎంటనే నిన్నట్టుకొచ్చేయమని అరిచి గీ పెడుతుంది. అందుకే నీకు సెబుదామని.” అన్నారు వాళ్లు.
ఓంకారస్వామి ఏవిటన్నట్లుగా చూశాడు వెంకట్ వైపు.
మిగతా భక్తులకి అనుమానం రాకుండా వెంకట్ లేచి ఓంకారస్వామి చెవిలో విషయాన్ని గుసగుసగా చెప్పేడు.
ఓంకారస్వామి భ్రుకుటి ముడిపడింది.
“తమాషాగా ఉందే. నిజంగా మీరు కేయూరవళ్లనుకొని ఇంకెవర్నొ బంధించలేదు కదా.” అనడిగేడు.
“ఇంకా నయం. నేనే కదా ఆవిణ్ణి తీసుకెళ్లింది” అన్నాడు వెంకట్.
“అయితే ఇదేదో చిత్రంగా ఉంది. నువ్వెల్లొకసారి చూసిరా. “అన్నాడు ఓంకారస్వామి.
వెంకట్ అదురుతున్న గుండెతో వాళ్ల వెంట బయలుదేరాడు.
*****
రైలు వేగంగా వెళ్తోంది. కాన్హా ప్రాట్ఫామ్ మీద నిలబడి తనని అలాగే చూస్తూ నిలబడిపోయిన దృశ్యం లిఖిత కళ్ళనుండి వీడిపోవడం లేదు.
“బేబీ!”
తండ్రి పిలుపుకి కళ్ళు తెరచి చూసింది లిఖిత.
“నేను పడుకుంటాను” అన్నాడాయన.
లిఖిత కర్టెన్ సరిచేసి చలిగా అనిపించి కొద్దిగా ఏ.సి తగ్గించి కూర్చుంది తన సీట్లో.
కార్తికేయన్ పడుకున్నాడు.
లిఖిత రైలు వేగంగా వెళ్తుంటే అద్దంలోంచి దట్టంగా పరిగెత్తుతున్న కొబ్బరి చెట్ల సముదాయాన్ని చూస్తూ కూర్చుంది.
సాయంత్రమయింది.
రైలు జాలార్ పెయిట్లో ఆగింది.
వెంటనే ఎస్పీ హరిహరన్ గుర్తొచ్చేడామెకు.
ట్రెయిన్ తమిళనాడు బంద్ వలన అక్కడాగిపోతే ఆయన తనకు చేసిన మర్యాదలు గుర్తొచ్చేయి.
గబగబా గుమ్మం దగ్గర కొచ్చి అక్కడే నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్ని పిలిచి “హరిహరన్గారున్నారా?” అనడిగింది.
అతను వెళ్లి మరో ఇన్పెక్టర్ ని పిలుచుకొచ్చేడు.
అతను వెంటనే లిఖితను గుర్తుపట్టి సెల్యూట్ చేసేడు.
లిఖిత అతనికి ప్రతి నమస్కారం చేస్తూ “హరిహరన్ గారున్నారేమో చూద్దామని” అంది.
వెంటనే అతని మొహం మ్లానమైంది.
“రెండ్రోజుల క్రితమే ఆయనకి హార్టెటాక్ వచ్చింది.” అన్నాడతను.
“ఇప్పుడెలా ఉన్నారు?” అంటూ గాభరాగా అడిగింది లిఖిత.
“చనిపొయేరు. ఒక్క స్ట్రోక్కే”
అతని జవాబు ఆమె మనసుని నలిపేసింది. అసలే కాన్హా ఎడబాటుతో కుమిలిపోతున్న ఆమె మనసులో దుఃఖం ఆగలేదు. కన్నీరు వెంటనే చెంపల మీదకి జారింది.
“సారీ! చెప్పకూడదనుకున్నాను.” అన్నాడతను.
లిఖిత జవాబు చెప్పలేదు.
అతను తన కర్తవ్యం గుర్తొచ్చినట్లుగా వెళ్లి ఫ్లాస్కోతో కాఫీ టిఫిన్స్, అరటిపళ్లు తెచ్చి ఆమెకందించబోయేడు.
“వద్దు” అంది లిఖిత హీనస్వరంతో.
అ”అలాగనకండి. సార్ చాలా మంచివారు. ఎన్నడూ పోలీసాఫీసర్ దర్పం ప్రదర్శించలేదు. ఆయనక్కావలసిన వాళ్లు మాకూ కావాల్సిన వాళ్ళే!” అంటూ బలవంతంగా లోనికొచ్చి బెర్త్ మీద ఉంచేడు.
రైలు కదిలింది.
అతను దిగి మళ్లీ సెల్యూట్ చేసేడు.
రైలు వేగమందుకుంటుంటే లిఖిత కన్నీటిని దాచుకోలేకపోయింది. నిశ్శబ్దంగా అవిరామంగా వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కూర్చుంది.
తన మనసుని దోచుకున్న ఎవరు వీరంతా.
ఊరుకాని ఊరులో భాషేతర ప్రాంతంలో తన్ని ఆదుకొని ఆత్మీయతని పంచిన మనుషులు.
తనంటే ఎవరో ఏమిటో తెలియకపోయినా మానవత్వాన్ని చూపించిన ఘనులు.
ఇంకా అక్కడక్కడా ఇలాంటి వారుండబట్టే తను తన తండ్రిని కలుసుకోగల్గింది.
కార్తికేయన్ లేచి కూర్చుని లిఖిత వైపు చూసి “ఏంటమ్మా అలా వున్నావు?” అనడిగేడు.
లిఖిత హరిహరన్ మరణం గురించి చెప్పింది.
అతను బాధగా కళ్లు మూసుకున్నాడు.
కాస్సేపటికి కళ్లు తెరచి “అందుకే నేనీ మరణాన్ని జయించాలని విశ్వప్రయత్నం చేసేను. కాని ప్రయోజనం లేకపోయింది” అన్నాడు బాధగా.
అతని ఎదురు సీటులో కాషాయ వస్త్రాలు ధరించి, నున్నగా గుండుతో నుదుటన చందనం లేపనంతో చెవులకి బంగారు సింహపు మకరకుండలాలతో కుడిచేతికి బంగారు కంకణంతో కూర్చున్న వృద్ధుడు కార్తికేయన్ వైపు చూసి “మీరెవరు?” అనడిగేడు.
“ఒక సైంటిస్టుని”
“మరి మరణమంటున్నారేమిటి?”
“అవును. చావులేని మందు కనుక్కోవాలని విశ్వప్రయత్నం చేసి ఓడిపోయాను. చివరికి మళయాళ క్షుద్రోపాసకుల్ని కలిసి ఆ అద్భుత శక్తిని సంపాదించాలనుకున్నాను. అదీ జరగలేదు” అన్నాడు కాస్త విచారంగా.
ఆ వృద్ధుని పెదవులు అపహాస్యంగా విచ్చుకున్నాయి.
“క్షుద్ర అనే పదంలోనే తక్కువ, నీచం అనే అర్ధాలు ఇమిడి ఉన్నాయి. అలాంటి క్షుద్రోపాసకులు మహత్తరమైన మరణ రాహిత్యం గురించి మీకు బోధించగలరని ఎందుకనుకున్నారు?”
అతని ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయేడు కార్తికేయన్.”లాబరేటరీలో నిర్విరామ శ్రమ నాకే ప్రయోజనం కూర్చలేదు. . అందుకే వాళ్లనాశ్రయించేను. ఓటమి మనిషిని బలహీనుణ్ని చేస్తుంది కదా!” అన్నాడు చివరికి.
అతను తల పంకించి కాస్సేపు కళ్లు మూసుకుని తెరచి “మరణరాహిత్యం! అంటే మరణం లేకపోవడం. అది లేకపోతే జననముంటుంది కాని మరణముండదు. అప్పుడీ భూవిస్తీర్ణం మానవవాసానికి సరిపోతుందా? ఇప్పటికే ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారు. అడవుల్ని నరకుతున్నారు. సముద్రాల్ని, నదుల్నీ పూడుస్తున్నారు. ప్రకృతినంతా వికృతం చేసేస్తున్నారు. సంతృప్తి అనే పదాల్ని పూర్తిగా సమాధి చేస్తున్న మనిషి మరణం లేకపోతే మృగమయిపోడూ!” అన్నాడు.
లిఖిత అంతసేపు అనాసక్తంగ వారి సంభాషణ వింటున్నదల్లా అతని మాటలకు ఆసక్తురాలయి వారి వైపు తిరిగింది.
“అంటే నా ఉద్ధేశ్యంలో ఈ మహత్తరమైన రహస్యాన్ని అది మంత్రం కానివ్వండి, మందు కానివ్వండి. అందరికీ అందుబాటులోకి తేవాలని కాదు. మనుషులు అకాలంగా మరణం వాతపడకుండా, అలానే గొప్పవారిని, మేధావుల్ని రక్షించుకోవాలని నా ఆకాంక్ష.”కాని ఇది ఎవరివల్లనా కాదని తెలిసి పొయింది. పూర్వం శుక్రాచార్యుల వారు కచుడికి బోధించిన మృతసంజీవినీ విద్య కూడా కట్టు కథేననుకుంటాను” అన్నాడు కార్తికేయన్.
“కాదు”
ఆయన జవాబు విని “అయితే ఉందంటారా?” అనడిగేడు కార్తికేయన్.
ఆ ప్రశ్నలో కొంత హేళన మిళితమై ఉండటం గమనించాడా వృద్ధుడు.
“మన శక్తికి అందని పరిజ్ఞానం లేదనుకోవడం కేవలం మన అజ్ఞానం మాత్రమే. అయితే మానవ అవతారం ఎత్తిన భగవంతుడు కూడా మరణించేడు. మనకి చావు అనివార్యమని చెబుతూ! కాని మృత సంజీవిని విద్య ఉన్నది. అది ప్రస్తుతం తెలిసిన వ్యక్తి ఒకరే.”
“ఎవరాయన?”
“కపాలబ్రహ్మ. తూర్పు కనుమలలో అరకులోయకి దగ్గర్లో ఉన్న బొర్రా గుహల కావల్ ఉంటాడని తెలుసు. ఈ ఉత్తరాయణంలొ ఆయన తనువు చాలిస్తారని విన్నాను.” అంటూ వ్రేళ్ళని లెక్కపెడుతూ.”ఇంకెంత, ఆయన సమాధి కావడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది” అన్నారాయన.
ఆ మాటలు వినగానే కార్తికేయన్‌లో ఉత్సాహం పొంగి పొరలింది. టైము చాలా తక్కువగా ఉండటం వలన ఒక విధమైన టెన్షన్ కూడా చోటు చేసుకుంది. కాని దాన్ని బయటకి కనిపించనీయకుండా” మీరు చెబుతున్నది నిజమేనా?” అనడిగేడు.
ఆయన కార్తికేయన్ కేసి కళ్ళు తిప్పి చూశాడు.
ఆ కళ్లు మండుతున్న అగ్నికణికల్లా ఉన్నాయి.
“ప్రకృతిని నమ్ముతూ మాకు తెలిసిన పరిజ్ఞానాన్ని విషయ వాంఛలకి ఉపయోగించకుండా ఊరూరా మంచిని పంచడానికి తిరుగుతున్న ఉపదేశికులం మేం. మాకబద్ధమాడాల్సిన పని లేదు.”
లిఖిత ఆయన కోపాన్ని చూసి భయపడింది.
“నాన్నారు చాలా జబ్బున పడి లేచేరు. ఏదైనా ఆయన మాటలు మిమ్మల్ని బాధిస్తే క్షమించండి”
ఆయన చిరునవ్వు నవ్వాడు.
“కోపం కాదది. నా నిజాయితీకుండే తీక్షణతది” అన్నాడాయన.
లిఖిత ఆయనకి అరటి పళ్లందించింది.
ఆయన లిఖితని ఆశీర్వదిస్తూ “శుభజాతకం. తలిదండ్రులకి ఆసరా అవుతావు” అన్నాడు.
అందరూ టిఫిన్స్ తిన్నారు.
రైలు వేగం పెంచుకుంది. అందరూ తెరలు వేసుకొని పడుకున్నారు.
అక్కడ నిద్రరాని వారిద్దరే.
ఒకరు తన సాధన వ్యర్ధమైందనే వేదనతో కార్తికేయనయితే మరొకరు లిఖిత.
మధ్యరాత్రి రైలు గుంటూరులో ఆగింది. లిఖిత ట్రెయిన్ దిగింది తండ్రిని తీసుకొని.
ఇద్దరూ బస్సులొ విజయవాడ చేరుకొని మద్రాసు నుండొస్తున్న హౌరామెయిల్‌ని కాచ్ చేసేరు. కండక్టర్‌ని బ్రతిమిలాడి రెండు సీట్లు సంపాదించింది లిఖిత.
తాము విశాఖపట్నానికి దగ్గరగా వచ్చేస్తున్నామన్న తలంపు ఆమెనొక రకమైన ఉద్వేగానికి గురి చేస్తోంది. తొందరలో తల్లిని చూడబోతోంది. అదీ తండ్రితో కలిసి.
తల్లిని… తండ్రిని తను కలపబోతోంది.
పుట్టినందుకు తన జన్మకొక సార్ధకత లభించబోతోంది.
ఇలాంటి తలపులతో ఆమె హృదయం తీవ్రంగా స్పందిస్తోంది. అలాగే ఆలోచిస్తూ ఆమె ఎప్పుడో నిద్రలోకి జారుకుంది.
అలా ఎంత సేపయిందో.
సరిగ్గా ఎవరో తట్టినట్లు మెలకువొచ్చేసింది.
బాగా తెల్లారిపోయింది.
ఎండ గూడా వచ్చేసింది.
రైలు స్టేషన్లో ఆగి ఉంది.
“ఏ స్టేషనిది?” అనడిగింది ఎదురుగా సంపెంగి పూలమ్ముతున్న వ్యక్తిని.
“వాల్తేరు” అన్నాడతను.
లిఖిత ఆనందంగా తండ్రి బెర్త్ వైపు తిరిగి లేపబోతూ ఉలిక్కిపడింది.
అక్కడ బెర్త్ మీద అతను కప్పుకున్న దుప్పటి మాత్రమే ఉంది.
లిఖిత ఉలిక్కిపడి టాయిలెట్స్ వైపు వెళ్లింది. అక్కడా అతను కనిపించలేదు.
ఇంకా ఉంది.


*బ్రహ్మలిఖితం 23* (ఆఖరి భాగం)

రచన: మన్నెం శారద గారు

చూస్తూ చూస్తూ కుక్కని వదిలేయలేను. అలాగని కుక్కతో కాపురం చేయలేను. నేనేం చేయను.” అంది బాధగా.
జనంలో కొంతమంది వస్తున్న నవ్వు ఆపుకున్నారు.
“నేనెప్పుడో చెప్పేను నీకు. ఇదంతా కట్టు కథ!” అన్నాడు ఓంకారస్వామి.’
“ఎందుకు చెప్పలేదు. మీరు నా భర్త గత జన్మలో పెంపుడు కుక్కని చెప్పేరు. గత జన్మలో వెంకట్ నా భర్తని చెప్పి అహోబిళంలో నా పెళ్ళి కూడా చేయించేరు. కాని అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. నేనిప్పుడేం చేయాలి?” అంటూ ఉక్రొషంగా లేచింది ఈశ్వరి.
“అబద్ధం!” అన్నాడు ఓంకారస్వామి.
“ఏంటబద్ధం! అహోబిళంలో అభుక్తేశ్వరస్వామిని కలవమని చెప్పడం అబద్ధమా?”
“అంతా అబద్ధం.”
“లేదు అంతా నిజం. నేను ఈ సంగతి తెలియక వెంకట్‌ని పెళ్లి చేసుకున్నాను. ఓంకారస్వామికి సమర్పించుకోవడానికి చెరొక లక్ష అర్జెంటుగా తీసుకొస్తేగాని మమ్మల్నేలుకోనని చెప్పి పంపించేసేడు వెంకట్” అంది జనంలోంచి లేచిన కనకమహాలక్ష్మి.
“నువ్వెవరివో నాకసలు తెలియదు.” అన్నాడు ఓంకారస్వామి.
“పోనీ వీడయినా తెలుసా?” అంటూ ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చేడు ఎస్.ఐ. ఒకతన్ని.
ఓంకారస్వామి దిగ్భ్రాంతిగా చూసి “ఎవరతను?” అనడిగేడు.
“అహోబిళంలోని దొంగ భుక్తేశ్వర స్వామిగాడు వీడే. గతంలో వీడు ఇక్కడే చిల్లర దొంగ. వీడు అతి సన్నిహితుడైన రాజుగాడి తమ్ముడు. వీడే సాక్షాత్తు వెంకట్‌కి, ఈశ్వరికి పెళ్ళి చేసింది” అన్నారు డిజిపిగారు లేచి.
ఓంకారస్వామి వేషంలో ఉన్న నారాయణ నీళ్ళు కారిపోయేడా మాతలు విని.
“ఇదంతా ఏదో కట్టు కథలా వుంది. గిట్టని వాళ్లు నా మీద పన్నుతున్న పన్నాగం. దేవుడి మీద నిందలేస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదు” అన్నాడు మేకపోతు గాంభీర్యం వహిస్తూ.
“ఏం జరుగుతుందో చూద్దామనే స్వయంగా వచ్చేను. ఈ ఫోటో చూడు!” అన్నాడు దిజిపి ఒక ఫోటో అతనికందిస్తూ.
ఓంకారస్వామి దాన్నందుకున్నాడు.
అది సాక్షాత్తు అతనిదే. జైల్లో నారాయణగా వున్నప్పటి ఫోటో.
అతను పేలవంగా డిజిపిగారివైపు చూశాడు.
“యూ రాస్కెల్. కొన్నాళ్ళు నిత్య పెళ్ళికొడుకు వేషమేసి దొంగ పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల గొంతులు కోసేవ్. ఇప్పుడు స్వాములవారి రూపమెత్తి దద్దోజనాలు, చక్రపొంగళ్లు తిని తెగ బలిసి పెళ్లి మీద పెళ్ళిళ్ళు చేయిస్తున్నావు. పద నిన్నిక పర్మనెంటుగా శ్రీకృష్ణ జన్మస్థానంలొ పెట్టేస్తాను. అరెస్ట్ హిం” అన్నారు డిజిపి ఉగ్రంగా.
ఓంకారస్వామి రూపంలో నారాయణ చేతులకు బేడీలు పడ్డాయి. వెనువెంటనే అతనికి సహాయపడిన రాజుని, సంపెంగిని కూడా అరెస్టు చేసేరు.
“ఏడి ఆ వెంకట్ గాడేడి?”
అప్పుడందరూ హాలంతా గాలమేసినట్లుగా చూశారు.
అప్పలనరసమ్మ కంగారుపడుతూ “దొంగ సచ్చినోడు. తప్పించుకున్నాడు బాబు. నాను సెవులు మెలేసి అట్టుకొచ్చినాను. కల్లమీన గూండారేసి పారెల్లిపోనాడు పాపిష్టెదవ” అంది.
“ఎక్కడికి పోతాడులే. ఇరవై నాలుగ్గంటల్లో పట్టేస్తాం” అంటూ డిజిపిగారు కేయూరవల్లి దగ్గరకొచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పేరు.
“నాదేముంది సర్! సమయానికి మీరొచ్చి సహాయపడ్డారు. లేకపోతే ఈ పిల్ల జీవితం అన్యాయమైపోయేది. ” అంది ఈశ్వరిని చూపిస్తూ.
ఈశ్వరి అపరాధిలా తల దించుకుంది.
“జరిగింది మరచిపో. హాయిగా భర్తతో కాపురం చేసుకుని సుఖంగా వుండు. ప్రస్తుత జన్మని నరకం చేసుకుంటూ పూర్వ జన్మల గురించి ఆలొచించడం దేనికి? నీలాంటి అమాయకులున్నంతవరకు ఇలాంటి దొంగస్వాములు పుట్టుకొస్తూనే వుంటారు.” అని ఈశ్వరిని మందలించేరు డిజిపి గారు వెళ్తూ వెళ్తూ.
ఈశరి పశ్చాత్తాపంతో కన్నీళ్ళు కార్చింది.
“నీకోసం నా జీవితంలో మొదటిసారి నటించేను. నువ్విక మారినట్లేనా?” అంది డాక్టరు ప్రభంజన ఈశ్వరి వంక నవ్వుతూ చూసి.
ఈశ్వరి నీరు నిండిన కళ్లతో నవ్వింది.
“హమ్మయ్యా ఇక మీ ఆవిణ్ణి తీసుకెళ్ళొచ్చు. నే చెప్పిన విషయాలు మరచిపోకండి” అంది ప్రభంజన కుటుంబరావుతో.
అందరూ ఎవరిళ్లకి వాళ్లెళుతుంటే కేయూర ఒంటరిగా తన కారులో బయల్దేరింది లిఖిత గురించి ఆలోచిస్తూ దిగులుగా.
తననే క్షణమన్నా పోలీసులు వెంటాడి పట్టుకుంటారని తెలిసిన వెంకట్ ఆటోలో అతివేగంగా రైల్వే స్టేషనుకెళ్ళి కదులుతున్న రైలెక్కేసేడు.
రైలు వేగం పుంజుకుంటుండగా అతను మెల్లగా కంపార్టుమెంటులోకి నడిచేడు. ఆ రైలెక్కడికెల్తున్నదో అతనికి తెలియదు. ఎవర్నన్నా అడిగితే తనని అనుమానించే అవకాశమున్నదని అతడు ముందు ముందుకి నడుస్తూ అక్కడ కిటికీ వైపు కూర్చుని శూన్యంలోకి చూస్తున్న లిఖితని చూసి షాక్కొట్టినట్టుగా వెనక్కి అడుగేసేడు.
నిజంగా ఆమె లిఖితేనా?
తను పొరబడ్డాడేమో?
అతను ఆమె తనని చూడకుండా జాగ్రత్తపడుతూ మెల్లిగా మరోసారామెను పరీక్షించి చూశాడు.
నిస్సందేహంగా ఆమె లిఖితే.
కేరళ కీకారణ్యాలలో ఖచ్చితంగా చచ్చిపోయి వుంటుందనుకున్నాడు తాను.
కాని.. తన అంచనాలని తారుమారు చేస్తూ ఆమె పశ్చిమ కనుమల నుండి తూర్పు కనుముల వైపు ప్రయాణం చేస్తోంది.
ఇందులో ఏదో విశేషముండి ఉంటుంది
అదేదో తాను తెలుసుకొని తీరాలి. లేదా తనని పోలీసులకి పట్టిచ్చే పథకం వేసిన కేయూరవల్లి మీద పగ తీర్చుకోవాలను కుంటే ఆమె నీ అడవుల్లోనే భూస్థాపితం చేయాలి. అలా ఆలోచిస్తూ ఆమెకి మరోవైపుగా కూర్చున్నాడు వెంకట్.
రైలు రెండు కొండ కొనలకి కట్టిన ఊయలలాంటి సస్పెన్షన్ బ్రిడ్జిమీద కొండచిలువలా పాకుతూ కలుగులోకి దూరుతున్న పాములా త్రవ్విన కొండగుహలోకి వెళ్లి బయటకు వస్తోంది. మళ్ళీ అఘాతమైన లోయ. దాని మీద ఊగిసలాడే బ్రిడ్జి. క్రిందకి తొంగి చూస్తే లోతెంతో తెలియని చీకటి పరచుకున్న అడవి. కిటికీ పక్కనే సందేశాలు మొసుకొస్తున్న మేఘశకలాల పరుగులు.
మనసులో ఏ ఆలోచనలూ, బాధలూ లేకపోతె రైలులో అరకు ప్రయాణమంత థ్రిల్ మరొకటి వుండదు.
లిఖిత తండ్రి గురించి ఆరాటంలో ఆ ప్రయాణాన్ని ఆనందించలేకపోతోంది.
రైలు వెళ్తుండగా సన్నని తుంపరలాంటి వర్షం ప్రారంభమైంది.
సాయంత్రం మూడు గంటలకే చీకటి పడినట్లుగా తయారైంది వాతావరణం.
మరి కాస్సేపటికి రైలు బొర్ర గుహలు అని బోర్డున్న స్టేషనులో ఆగింది. అక్కడొక చిన్న స్టేషను తప్ప చుటూ అడవే కాని ఊరేం కనిపించడం లేదు.
లిఖితకి అక్కడ దిగాలంటేనే భయమనిపించింది.
ఎలాగో మనసుకి నచ్చచెప్పుకొని రైలు దిగింది ఆమె దిగడం చూసి వెంకట్ కూడా దిగేడు. ఆమెకి కనిపించకుండా అనుసరిస్తూ.
లిఖిత వర్షంలో తడుస్తూ స్టేషన్ బయటికొచ్చింది. ఎటెళ్లాలో, ఎవరిననుసరించాలో తెలియడం లేదు.
చుట్టూ వాతావరణం నీటిలో ముంచి ఆరేసిన నల్లని గుడ్డలా వుంది. ఎప్పటికీ ఎడతెగని వర్షపు నీటిని పీల్చిన చెట్లు భారంగా వూగుతున్నాయి.
అక్కడే బీడీ కాలుస్తూ నిలబడ్డ ఒక కోయ మనిషి మీద పడింది లిఖిత దృష్టి. అతను శబరిమలై వెళ్తుండగా తమతో ప్రయాణం చేసినవాడు.
లిఖితకు అతన్ని చూసి ప్రానం లేచొచ్చినట్లయింది.
వెంటనే అతని దగ్గరగా వెళ్ళి “బాగున్నావా?” అనడిగింది నవ్వుతూ.
అతను మొదట లిఖితని చూసి బిత్తరపోయేడు.
“ఏంటి సిన్నమ్మా నా మీన నిగా ఏసావేంటి? ఇక్కడిదాకా వొచ్చేవు?” అన్నాడు.
“అదేం లేదు కానీ. నువ్వేంటి భద్రాచలం అడవిలో వుంటానని ఇక్కడ ప్రత్యక్షమయ్యేవు. “అనడిగింది చొరవగా.
“భద్రాచలం చింతపల్లి సీలేరు ఇయ్యన్నీ అడ్డదారిన దగ్గరే బొట్టీ. నాను కట్టుకున్న దానూరు ఇక్కడే. అద్సరే ఏటి వానలో పడవలా తిరగుతున్నావు. ఏదైనా అడవుల మీన బుక్కు రాస్తన్నావేంటి?” అన్నాడు కోయదొర నవ్వుతూ.
“అదేం లేదు. ఇక్కడ కపాల బ్రహ్మని ఒక గొప్ప సాధువున్నాడంట. నీకు తెలుసా?”
కొండ దొర గడ్డం బరుక్కుని “సాధువా! కాసాయ గుడ్డలు కట్టినోల్లు బోల్డంత మందుంతారు అడవుల్లో. మరి నీక్కావాల్సినోడెవరో?” అన్నాడు.
లిఖిత అతనివైపు నిస్పృహగా చూస్తూ “అతనెవరితోనూ మాట్లాడట. ఏదో కొండ మీద. గుడి దగ్గర..”
“ఆయనా.. తెల్సులే. నేన్ జూపిస్తా. ఈ రోజుకి మా గూడెంకి రా. మా ఆడది సూసి మురిసిపోతది. కాస్త జుంటి తేనె తగి, జింక మాంసం తిందువు గాని” అన్నాడు కొండ దొర మధ్యలోనే అందుకొని.
“లేదు. అంత టైము లేదు. తిరిగొచ్చేటప్పుడొస్తాను. ముందు నాకు దారి చూపించు” అంది లిఖిత గాభరాపడుతూ.
“ఆర్నెల్లు నవారల్లి అర్ధగంటలో మంచం ఇరగదీసినట్టు ఏంటంత తొందరపడుతన్నావు బొట్టీ అసలు కతేంటి?” అనడిగేడు కోయదొర.
“పద నడుస్తూ చెబుతాను”.
ఇద్దరూ అక్కడే టీ తాగి అడవి దారిన నడక సాగించేరు.
నేలంతా తడిచి జారుతున్నది.
“భద్రం! పాములుంటాయి” అంటూ హెచ్చరించేడు కోయదొర హడావుడిగా నడుస్తున్న లిఖితని.
పాములే కాదు పులి ఎదురొచ్చి నిలబడినా భయపడే పరిస్థితి కాదామెది. తెల్లారితే కపాల బ్రహ్మ సమాధవుతాడు. అసలు తన తండ్రి అతన్ని కలిసేడో లేదో. ఎలాగైనా తండ్రిని వెంటనే కలవాలన్న పట్టుదల ఆమెకి ఎనలేని శక్తిని ఇస్తోంది.
“ఇంతకీ సంగతి సెప్పేవు కాదు బొట్టే. అలుపన్నా తీరతది. అసలు సంగతి సెప్పు”
లిఖిత తన తండ్రి పట్టుదల, వైఫల్యం, కపాల బ్రహ్మకి తెలిసిన మృతసంజీవినీ విద్య, తండ్రి తిరిగి అక్కడికెళ్ళడం అన్నీ క్లుప్తంగా చెప్పింది. కోయదొర ఆ కథంతా విని ఆశ్చర్యపోయేడు.
కోయదొరతో పాటు రహస్యంగా తను చెప్పిన కథని తనని వెంబడిస్తున్న వెంకట్ కూడా విన్న సంగతి ఆమెకి తెలియదు.
*****
ఆ అర్ధరాత్రి కేయూర మనసు మనసులో లేదు. ఏదో విపత్తునూహించినట్లుగా మనసు ఆటుపోట్లకి గురవుతున్న సముద్రంలా అల్లకల్లోలమవుతున్నది. ఎంత ప్రయత్నించినా నిద్రని నెట్టేస్తున్నాయి కళ్ళు.
వేసుకున్న ట్రాంక్విలైజర్స్ ఏ మాత్రం పని చేయడం లేదు.
ఆమె అస్థిమితంగా బాల్కనీలో కొచ్చి నిలబడింది.
తను ఈశ్వరి జీవితాన్ని చక్కబరచగల్గింది. ఓంకార స్వామి దొంగవేషాలు కట్టించగల్గింది. మతి చెడి దొంగస్వాముల మీద పుస్తకాలు రాసి ప్రజల్ని పక్కదారి పట్టించొద్దని ప్రొఫెసర్ మల్లన్నకి బుధ్ది చెప్పగల్గింది. కాని.. ఆ వెంకట్‌ని పట్టుకోలేక పోయింది. అన్నిటికన్నా తన కన్నకూతురి సమాచారం ఏ మాత్రం తెలుసుకోలేకపోయింది.
లిఖిత వెంకట్‌గాడు కూసినట్లు.. ఇక తిరిగి రాదా? తనని రక్షించే వారెవరు?
అలా అనుకోగానే ఆమె కళ్లు నీటితో మూసుకుపోయేయి. దుఃఖం జలపాతంలా బయటికి దూకింది. వెక్కిళ్ళు తెలియకుండానే తన్నుకు రాసాగేయి.
అలా ఎంతసేపు గడిచిందో..!
నెమ్మది నెమ్మదిగా మనసుని మూసేసిన కారు మబ్బులు కరిగి దుఃఖం ఉపశమించింది.
కళ్లు కడిగిన నందివర్దనాలయ్యేయి.
ఎదురుగా ముసిరిన మసక తొలగి గోడకి తలిగించిన నిలువెత్తు సాయి సాక్షాత్కరించేడు. మనసుకేదో ధైర్యం లభించి నట్లయింది. వెంటనే నందనవనం సుబ్బరాయశర్మగారి ప్రవచనాలు, పలుకులూ గుర్తొచ్చేయి.
ఆమె పెదవులు వాటిని ఉచ్చరించసాగేయి.
అంధకార గుహాంతరంబున
అరయరానిది సాయి నామము
సంధ్యకాలము నందు దోచే
సాక్షి యీ శ్రీ సాయి నామము
ధర్మరూపము దాల్చి సర్వము
తానెయైనది సాయి నామము
కర్మచే సాధింపనేరని
మర్మమీ శ్రీ సాయినామము.
ఆమె ప్రార్ధనలో వుండగానే ఫోను రింగయింది. కేయూర వెళ్లి రిసీవర్ అందుకొంది.
“సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్. నేను డి.జి.పి ని మాట్లాడుతున్నానమ్మా. వెంకట్ కిరండయిల్ పాసింజరెక్కి అరకువైపు వెళ్లినట్లుగా మన పోలీసులు తెలుసుకున్నారు. దారి పొడుగునా అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్‌లెస్ మెసేజ్‌లు పంపించేం.
మీరు సంతోషపడే మరో విషయం చెప్పమంటారా?”
“ఏంటి సర్ అది?” ఎంతో ఉద్విగ్నతకి లోనవుతూ అడిగింది కేయూరవల్లి.
“మీ అమ్మాయి లిఖిత్ కూడా తూర్పు కనుమల అడవుల్లోకి వెళ్ళినట్లుగా కొంత ఆధారాలు దొరికేయి. వెంకట్ ఆమెని వెంబడించేడేమోనని అనుమానంగా ఉంది. అయిన ఇంకా పూర్తి వివరాలు రాలేదు. మీరేం వర్రీ కాకండి. అమ్మాయిని భద్రంగా మీకప్పగించే బాధ్యత మాది.”
“థాంక్యూ సర్. థాంక్యూ” అంది కేయూర కంపిస్తున్న స్వరంతో రిసీవర్ క్రెడిల్ చేస్తూ.
ఎదురుగా వున్న సాయి మొహంలో ఒక దివ్య కాంతి కనిపించిందామె కళ్లకి.
ఊరకుండిన సర్వజగముల
నూపు చున్నది సాయి నామము
తేరి చూడగ రాక వెలిగే
తేజమీ శ్రీ సాయి నామము.
*****
బొర్రా గుహలకి రెండు కిలోమీటర్ల అవతలగా వున్న అరణ్యంలో వున్న ఓ కొండ దగ్గరకి చేరుకున్నారు లిఖిత, కోయదొర.
చిన్న పెన్ టార్చి సహాయంతో అడవిలోని కాలిబాట వెంట పాముల్ని, ఇతర వింత వికృత జంతువుల్ని తప్పించుకొని అక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి పది గంటలు దాటింది.
“ఇప్పుడేటి సేద్దాం. రేపొద్దున్నెక్కుదామా కొండ” అన్నాడు కోయదొర ఆయాసంతో రొప్పుతున్న లిఖితతో.
“లేదు. తెల్లారితే ఆయన సమాధయిపొతాడు. అసలు మా డేడి ఇక్కడికి చేరుకున్నారో లేదొ!” అంది వేదనగా లిఖిత.
సరిగ్గా అప్పుడే తడి బట్టలతో స్నానం చేసి సన్నగా వణుకుతున్న శరీరంతో జపం చేస్తూ మట్టితోనే అమర్చిన మెట్లెక్కుతున్న వ్యక్తి మీద పడింది లిఖిత దృష్టి.
ఒకలాంటి అనుమానంతో ఆయన్ని సమీపించి “స్వామి!” అంది.
ఆయన వెనక్కు తిరిగి చూశాడు.
లిఖిత పెన్ టార్చి వెలిగించింది.
ఆ వెలుగులో అతన్ని చూసి లిఖిత కళ్లు మెరిసేయి.
“డేడీ!” అంది దుఃఖం, ఆనందం కలగలుపయిన కంఠస్వరంతో.
అతను లిఖితను గుర్తించి “నువ్విక్కడిక్కూడా వచ్చేవా బేబీ!” అన్నాడు ఆశ్చర్యంగా.
“రాకేం చేయను. అమ్మని చూడాలని వుందని, ఈ ప్రయత్నం ఇక మానుకుంటానని చెప్పి నేను నిద్రలో వుండగా ఇలా చెప్పకుండా వచ్చేయడం ఏం బాగుంది డేడి. అమ్మకి నా మొహం చూపించలేక నేనూ నిన్ను వెదుకుంటూ వచ్చేసేను.”అంది లిఖిత కన్నీళ్లతో.
కార్తికేయన్ అపరాధిలా తల దించుకొని “ఏం చేయను. నా జీవితకాల కోరిక తీర్చే మనిషి ఇక్కడున్నారని తెలిసేక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయేను. ఇరవై నాలుగ్గంటలు పట్టింది అతను నన్ను పలకరించడానికి” అన్నాడు.
“ఇంతకీ ఆయన.. మీకా మంత్రం ఉపదేశిస్తానన్నారా?’ ఎంతో ఆత్రుతగా అడిగింది లిఖిత.
“ఆ! అతి కష్టమ్మీద. అది ఎవరికీ తెలియడం మంచిది కాదన్నారాయన. కేవల అద్భుత శక్తి సంపన్నులయిన మేధావుల్ని కాపాడటం కోసం దాన్ని వినియోగిస్తానని చెబితే అతి కష్టమ్మీద ఒప్పుకున్నారు.”
లిఖిత ఆయన వైపు నమ్మలేనట్లుగా చూసింది.
“నిజంగానా?”
“నీ మీద ఒట్టు తల్లీ!”
“డేడీ!”
“ఊ”
“రేప్ప్రొద్దుటే మీకుపదేశమవుతుందా?”
“ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే. ఏ మాత్రం వెలుగు రేఖ కనిపించినా ఆయన శాశ్వత సమాధిలోకి వెళ్ళిపోతారట. అందుకే ఈ రాత్రే వెళ్లి ఆయన ముందే కూర్చుంటాను. ఆయన సమాధి ముందు తీవ్ర ప్రార్ధన చేస్తున్నారు.
ఎప్పుడో తెల్లవారే ముందు ఆయన నాకీ మంత్రం కళ్లు తెరవకుండానే ఉపదేశించి సమాధవుతారట. ఇది నా అదృష్టం!” అన్నాడు కార్తికేయన్ ఆనందంగా.
“డేడీ!”
“చెప్పు తల్లీ! ఈ చీకటిలో నేను కొండ ఎక్కడం కష్టమవుతుంది”
“ఒకవేళ ఈ రాత్రి నన్నే పామన్నా కరచి మరణిస్తే?”
“అవేం మాటలు?”
“మాటలు కావు. నువ్వు నేర్చుకున్న మృతసంజీవినీ విద్యతో నన్ను బ్రతికిస్తావా?”
కూతురి ప్రశ్నకి పరిహాసంగా నవ్వి “నీకిక చావే లేదు బేబీ. చావులేని విద్య నేర్చుకున్న తండ్రి వుండగా నీకు చావెలా వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలొచనలు చేయకుండా నువ్వు ప్రశాంతంగా ఇక్కడే వుండు.” అంటూ కార్తికేయన్ కొండ మీదకి నడక సాగించేడు.
లిఖిత నిర్వేదంగా చూస్తూ నిలబడిపోయింది చాలా సేపు.
“రా బొట్టీ! ఆయన తన పట్టు ఒదిలే మడిసి కాడు. మనమీ రాత్రి ఇక్కడే కూర్చుందాం.” అన్నాడు.
సరిగ్గా అదే సమయానికి చాటుగా వుండి అంతా విన్న వెంకట్ అడ్డదారిన కార్తికేయన్‌ని వెంబడించేడు. కొండంతా చెట్లతో నిండి చీకటినిన్ నింపుకొని ఉంది.
అదే అదనుగా అతను కార్తికేయన్ వెనకగా వెళ్ళి ఆమాంతం మీద పడి అతని నోరు నొక్కేసేడు.
అనుకోని ఆ ఆకస్మిక చర్యకి నిర్విణ్నుడయిన కార్తికేయన్ గింజుకోవడానికి ప్రయత్నించేడు. అయినా ప్రయోజనం లేకపోయింది.
వెంకట్ అతని భుజమ్మీద తడి ఉత్తరీయన్ని కార్తికేయన్ నోట్లో కుక్కి చేతుల్ని దొరికిన చెత్ల నారతో బిగించి కట్టేసి ఒక పొదలో పడేసేడు.
ఆ తర్వాత వడివడిగా కొండెక్కడం ప్రారంభించేడు విపరీతమైన ఆనందంతో.
*****
తెల్లవారు ఝామున నాలుగు గంటలయింది.
లిఖిత అస్థిమితంగా నిద్రపొతున్న కోయదొర వైపు చూసింది.
ఇంకాసేపటిలో తన తండ్రికి ఆ మంత్రోపదేశం జరిగిపోతుంది. ఆయన్ని పట్టేవారెవరూ ఉండరు.
“నో! అలా జరగడానికి వీల్లేదు”
ఆమె అరుపుకి ఉలిక్కిపడి లేచేడు కోయదొర.
“ఏంటి బొట్టీ! ఏటయినా కలగన్నావా? ఏంటంత కూత పెట్టేవ్?” అనడిగేడు.
“నేనసలు నిద్రపోతేగా కల కనడానికి. మనమో పని చెయ్యాలి. నాకు సహాయం చేస్తావా?”
“చెప్పు తోలొలిచి ఇమ్మన్నా యిస్తా”
“మా డేడీకి ఆ ఉపదేశం జరక్కుండా చూడాలి!”
కోయదొర ఆమె వైపు పిచ్చిదాన్ని చూసినట్టు చూసి “నీకు ఒంటి మీద తెలివుండే మాటాడతన్నావా? ఇన్నాల్లకి నీ తండ్రి అనుకున్నది జరగతావుంటే అడ్డు పుల్లేస్తావా?” అన్నాడు.
“నీకు తెలియదు కోయరాజూ. మా డేడీ కపాల బ్రహ్మకేమని చెప్పేడు. ఆ విద్యని కేవలం మేధావులు, మహానుభావుల కోసమే వాడతానన్నారు. కాని రాత్రి నేను చచ్చిపోతానేమోనంటే.. నాకిక చావే లేదని చెప్పేరు. అంటే ఆయనలో స్వార్ధం మొలకెత్తింది. ఆయనలో రాక్షసత్వం చోటు చేసుకుంటే.. ఇక ఆ విద్యకి ప్రయోజనముండదు. మనిషికి చావుందని తెలిస్తేనే.. అందులో దానికొక నిర్ణీత కాలం లేదని తెలిసి కూడా మనిషి మించిన రాక్షసుండుంటాడా? నీకు హిరణ్యకశిపుడు కథ తెలుసు కదా?”
“మరేం చేద్దామంటావు పెట్టా?”
లిఖిత ఒక క్షణం ఆలోచించింది.
వెంటనే ఉపాయం స్ఫురించినట్లు ఆమె కళ్లు మెరిసేయి.
“ఈ కొండకి తూర్పెటు?”
కోయదొర చూపించేడు.
“పద వెంటనే అటు మంట వేద్దాం. ఆ వెలుగు రేఖలు చూసి సూర్యుడు ఉదయించేడనుకొని కపాల బ్రహ్మ సమాధి అవుతారు. ఆయనతో పాటే ఆ విద్య కూడా సమాధవుతుంది.” అంది లిఖిత కొండకి తూర్పు వైపు ఆ చీకటిలో అడుగులేస్తూ.
“ఇదిగో బొట్టీ కొంచెమాగు”
ఏంటన్నట్టుగా చూసింది లిఖిత అతనివైపు.
“నీ ఆలోచన శానా బాగుంది గాని. ఈ చిత్తడి వానలో నీకు ఎండుపుల్లలు దొరుకుతాయా? మంట పైకల్లా ఎర్రగా అగపడాలంటే ఎన్ని పుల్లలు కావాలి?” అన్నాడతను.
అతని మాటలు విని పూర్తిగా నిరాశపడిపోయింది లిఖిత.
“ఏం చేయాలి. ఎలా మనం డేడీకి ఆ విద్య తెలీకుండా ఆపగలం.” అంది నిస్సహాయంగా చూస్తూ.
కోయదొర ఒక్క క్షణమాలోచించి నోటిలో వేలుపెట్టి చిత్రంగా మూడుసార్లు ఈల వేసేడు. అరక్షణంలో ఆ ఈలకి బదులు కొన్ని ఈలలు వినిపించేయి. కోయదొర మళ్లీ ఈల వేసేడు.
అంతే.
కొని క్షణాల్లో కొన్ని వందల కాగడాలతో కోయలు, చెంచులు ఆ ప్రాంతానికి పరుగున చేరేరు.
లిఖిత ఆ దృశ్యం చూసి నివ్వెరపోయింది.
“ఏంటి ఒక్క ఈల వేస్తే ఇంత మందొచ్చేస్తున్నారు?” అంది లిఖిత.
కోయదొర నవ్వి “మాకు మీలా మాటాడే పెట్టెలు(టెలిఫోన్లు) లేవు పిట్టా. అయితే మాకుందల్లా కట్టడి. మాలో ఒకడికి కష్టం వచ్చిందంతే అందరూ కట్టకట్టుకు వాల్తారు. మీ సదువుకున్నోళ్ళంతా తలుపులు మూసుకోరు” అని వాళ్ళ వైపు తిరిగి “మీరంతా కొండకి తూరుపు భాగానికెల్లి కాగడాల్ని పైకెత్తండి. శబ్దం చెయ్యొద్దు అన్నాడు.
ఒక వెలుగు ప్రవాహం కొండ తూరుపు వైపు చేరింది.
సరిగ్గా అప్పుడే వెంకట్ కపాలబ్రహ్మ ఎదురుగా కూర్చుని అసహనంగా అతనెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని చూస్తున్నాడు.
కపాల బ్రహ్మ తన ప్రార్ధన ముగించి అర్ధనిమిలితంగా కళ్లు తెరిచి “నువ్వు సిద్ధంగా వున్నావా?మంత్రం ఉపదేశిస్తాను” అన్నాడు.
“చిత్తం” అన్నాడు వెంకట్ మనసు ఆనందంతో పొంగిపోతుండగా.
కపాల బ్రహ్మ మరలా కళ్ళు మూసుకుని ఏదో ఉచ్చరించి తిరిగి కళ్లు తెరిచేడు.
తెరవగానే అతని కళ్ళబడిన దృశ్యం .. ఎదురుగా తూర్పు వైపు ఎర్రని కాంతి అలుముకోవదం.
కపాల బ్రహ్మ కళ్ళు పెద్దవి చేసి “సూర్యోదయమైపోతున్నది” అను గొణిగేడు.
వెంటనే అతను ఊపిరిని స్తంభింపచేసి తనువు చాలించేడన్న విషయం వెంకట్‌కి చాలాసేపటి వరకు అర్ధం కాలేదు.
అతను కపాల బ్రహ్మని పట్టుకొని గట్టిగా కుదిపి “మంత్రం ఉపదేశించండి స్వామి” అన్నాడు. వెంటనే అతని చేతుల్లో ఒరిగిపోయింది కపాల బ్రహ్మ విగత శరీరం.
అతను ఆ షాక్ నుండి తేరుకోక మునుపే చీమల బారులా కాగడాలతో కొండపైకి ఎక్కుతున్న కోయవాళ్ళు ఆ వెనుక లిఖిత రావడం కనిపించింది.
వెంకట్ ని చూసి లిఖిత నివ్వెరపోయింది.
“నువ్వా.. మా డేడీ ఏరి?” అంది.
వెంకట్ జవాబు చెప్పే స్థితిలో లేడు.
ఏం చెప్పినా క్షణాల్లో కోయవాళ్ళు తనని చుట్టుముట్టి చంపేస్తారన్న నిజమర్ధమయి కొండ వెనుక భాగంలోకి పరిగెత్తేడు. కొంతమంది కోయవాళ్లు అతని వెంట పడ్డారు.
“మా డేడీని ఏం చేసేడో ఈ నీచుడు” అంది లిఖిత దుఃఖభారంతో.
“పైన దేవుడున్నాడు. మీ నాన్నకేం కాదు పద!” అన్నాడు కోయదొర ఆమె నూరడిస్తూ.
లిఖిత కోయదొర సాయంతో వెతుకుతుండగా కొండ క్రింద కొన్ని జీపులు, వేన్‌లూ ఆగేయి. వాటి కాంతిలో ఒక చోట మూటలా కట్టేయబడిన కార్తికేయన్ కనిపించి అటు పరిగెత్తేరు లిఖిత, కోయదొర.అప్పటికే పోలీసులు జీప్‌లు, వేన్‌లూ దిగి చకచకా కొండ మీద కొచ్చేసేరు.
లిఖిత కార్తికేయన్ తల ఒళ్ళో పెట్టుకుని “డేడీ!డేడీ!” అని పిలిచింది కంగారుగా.
కోయదొర అతని నోట్లో గుడ్డ తీసి కట్లు విప్పేడు. అతను నీరసంగా మూలుగుతూ “వాడెవడో.. వాడు …నన్ను..”అన్నాడు హీనస్వరంతో.
“మీరు ప్రస్తుతం ఏమీ మాట్లాడకండి” అంది లిఖిత ఆయన తల నిమురుతూ.
పోలీసులు లిఖిత దగ్గరగా వచ్చి “మీరు లిఖిత కదూ!”అనడిగేరు.
“అవును” అందిలిఖిత.
“రండి మిమ్మల్ని జాగ్రత్తగా ఇల్లు చేర్చమని మా డి.జి.పి గారి ఆర్డర్. ఆ వెంకట్ అనేవాడు కూడా ఇటొచ్చేడని తెలిసింది?” అనడిగేడు ఇన్సపెక్టర్.
“వాడు కొండ వెనుకకి పారిపోయేడు”
“పదండి. వాణ్ణి పటుకోండి” అని పోలీసులకి ఆర్డర్ జారీ చేసేడు ఇన్స్‌పెక్టర్.
“ఆణ్ణింక పట్టుకొని ఏం సేసుకుంతారు. ఆడు కాలు జారి లోయలో పడి కుక్క సావు సచ్చేడు” అంటూ వచ్చి చెప్పేరు కోయవాళ్లు.
“దేవుడే ఆణ్ణి శిచ్చిందలసుకున్నాడు. మీరిక బయల్దేరండి. మీ నాన్నగారికి నీరసంగా వుంది” అన్నాడు కోయదొర.
లిఖిత అతనికి నమస్కరించింది.
కూటికోసం కోటి విద్యలు నేర్చినా, చదువూ సంస్కారమెరుగని ఆ అడవి జాతి మనుషులు మనుషుల్లా ప్రవర్తించి తననాదుకున్నారు. ఆ విషయం గుర్తొచ్చి ఆమె కళ్లు చెమర్చేయి.
“అప్పుడే అలా దిగులు మొకమెడతావేంటి బొట్టేఎ. నాను నీ తలంబ్రాలకి రానూ!” అన్నాడు కోయదొర.
లిఖిత నవ్వింది నీరు నిండిన కళ్లతో..
కార్తికేయన్ లిఖిత జీప్ ఎక్కేరు.
“జాగ్రత్తగా ఎల్లిరండి. బాబూ నువ్వింక పెళ్లాం బిడ్డలతో సుకంగా కాపరం సేసుకో. బెమ్మలికితాన్ని ఎవరూ సెరపలేరు బాబూ. ఇక సావు సంగతొదిలేసి బతికనన్నాల్లూ సుకంగా బతకండి..” అన్నాడు కోయదొర.
జీప్‌లూ, వేన్‌లూ కదిలేయి. అడవిలోని ఘాట్ రోడ్డుల వెంట మెలికలు తిరుగుతూ అగ్గిపెట్టెల్లా..
లిఖిత తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని. ఇంకెన్నడూ వదలనని.
సరిగ్గా అదే సమయంలో కేయూరవల్లి శిరిడి సాయి ఎదుట ధ్యాన నిమగ్నమై వుంది. ఒక రకమైన నిశ్చింతతో, నమ్మకంతో..
ఛత్రమై తన భక్తులకు
ఆచ్చాదనంబిడు సాయి నామము
సాధనలచే నెరుగవలసిన
సత్యమీ శ్రీ సాయినామము.

*సమాప్తము.*