Thursday 12 November 2020


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


99.నిద్ర

డాక్టరు గారు నాకు తిన్న వెంటనే నిద్ర వస్తుంటుంది

ఐతే నిద్ర పొయిన తర్వాత తిను

ఐతే ఈరొజునుంచీ  మీ ఇంటికి వస్తాను డాక్టర్ ......


100. బామ్మ అన్నయ్య  కంప్యూ టర్ లో వినాయ్యకుడు కనిపిస్తున్నాడు

         ఇక్కడకు వచ్చి పూజ చేయి

         ఎం లొకమొ ఎమొ మట్టి వినాయకుడు కుడా కొనకుండా

         ఈ పూజలు చేయటము ఎందుకో

         ఎందుకు బామ్మా ఖర్చు దండగని అనుకున్నా .........



 

 

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


85. బేబి

భర్త భార్యను హాస్పటల్ ల్లో చూసి కంగారుగా ఎం జరిగింది

నాకేం రోగం లేదు నిక్షేపముగా ఉన్నాను, మీరె చెప్పారుగా

ఇతరులకు సహయ్యము చేయమని,  అవును చెప్పాను

రక్తము ఇవ్వటానికి వచ్చావా, కాదు  మరి ఎందుకు

మనపక్కిమ్టాయనకు పిల్లలులేరు గదా అందుకని

ఆ అందుకని ఏమ్చేద్దామని వచ్చావు , అంత కోపమెందు కండి

కూల్ గా ఉండండి.  ఆ ఉన్న చెప్పు

"టెస్టు టూబ్ బేబిని  నాకడుపులో పెడతారట  అమ్దుకనీ ........    


86. రక్తము

తన ప్రియసిని కందిరీగ  కుట్టటం చూసి నడుం మ్మీద ఒక దెబ్బ వేసాడు ప్రియుడు

ఎంతలా కొట్టావు, ఎ మోటు సరసమూ

ఆ కందిరిగా నీ రక్తముత్రాగితే న బ్రతుకేం కావాలి

నా రక్తం త్రాగాలని అనుకుంటున్నావా ................... 

87. గుడ్లగూబ

రాము గుడ్ల గూబ గురించి నీకు తెలిసింది చెప్పు

ఎంచక్కా చూడగూడనివి రాత్రుల్లో చూడొచ్చు

ఒకటే నవ్వులు

సోమునువుచేప్పు

మనం అందరం గుడ్ల గూబలైతే  రాత్రుల్లో కరంటు లేకుండా

చదువు కోవచ్చు .......................ఒకటే నవ్వులు


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

69. రాత్రి సర్వర్

పూర్వం పావురాలచే ఉత్తరాలు పంపేవారు, 

గుర్రపు రోతులద్వ్వారా వార్తలు పంపేవారు, 

రాజరికములో ఒకనాడు గుడ్లగూబద్వారా వార్త  వచ్చింది, వెంటనే మంత్రి గారు గుడ్లగూబద్వారా

పంపారెందుకు

" ఇది రాత్రి సర్వర్ మహారాజా "  అన్నాడు మంత్రి


70. విలేకరికి సినిమానటికి సంభాషణ

వేలేకరి : ఎక్స్ పోజింగ్ సీన్సులో నటించనని ఇప్పుడు చెప్పా రెందుకు

నటి : కుటుంబ సభ్యు లు వప్పుకోవటములేదు

వేలేకరి : వప్పుకుంటే చేసేవార    

నటి :ఇంకా నావయసు 30 సంవత్సరాలే

వేలేకరి : కుటుంబ సభ్యు లు అంటే ఎవరు

నటి : మేకప్ చేసుకుంటూ మావారు, మనవరాళ్ళు ............. ప్రాంజలి ప్రభ - సరదా సరదా 

71. గర్భవతి

అదేమిటి ఆవిడ ఒక్క బాగ్ లేకుండా రోజు వస్తున్నది. 

ఆవిడ గర్భవతి డెలివరి అయ్యే  వరకు బరువులు ఎత్త వద్దన్నారుట

ఎవరు అంది ఇంకెవరు డాక్టర్ ............


72. జలుబు, దగ్గు

డాక్టర్ గారు జలుబు, దగ్గు వస్తున్నది

నా ఫీజు వంద రూపాయలు అడిగి తెలుసుకున్నావా

తెలుసు కోవట మేమిటి బయటున్న అతనికి ఇచ్చి వచ్చా

ఇంతకీ ని జబ్బు ఏమిటో చెప్ప లేదు  

జలుబు, దగ్గు దీనికి నా దగ్గరకు వచ్చి నా అమూల్య్యమైన

సమయం నష్ట పరిచావు అయినా ఇదిగో మందు వ్రాస్తున్న

మూడు  పూటలా వాడు "మిరియాలు పాలుకలిపి త్రాగు "

--(())--

62. జైలు బ్రతుకు

భార్య: భర్తతో ఉప్పు ఎక్కువ అయింది , కారం ఎక్కువైంది అని ఎగిరి పడే వాడవు

          మరి ఇప్పుడు కిక్కుర మనకుండా తింటున్నారు

భర్త: అంతా కాల మహిమ, జైలు బ్రతుకు మాయ   

63. దేవుణ్ణి  ప్రార్ధించండి

డాక్టరు : ఒక గంట ముందు  పెషంటు తెస్తే బ్రతికేవాడు కదా

ఆక్సిడెంటు జరిగి పది నిముషాలు అయినది  డాక్టరు. 

డాక్టరు:  ఐతే డబ్బు కౌంటర్లో  కట్టి దేవుణ్ణి  ప్రార్ధించండి  ప్రాంజలి ప్రభ - నేటి సరదా సరదా  

64. రక్తపోటు:

నాయకులు తప్పులు చేస్తున్నప్పుడు రాదు రక్తపోటు

పోలీసులు అరెస్టు చేస్తారన్నప్పుడు వస్తుంది గగుర్పాటు వ్యాన్ ఎక్కిమ్చి నప్పుడు వస్తుంది వెన్నుపోటు

వాదన ప్రతి వాదనలకు విన్నాక జైలు కు వెళ్లాల్సి వచ్చేటప్పటికల్లా వస్తుంది రక్తపోటు ......


65. వేరు

మీ రిద్దరు అచ్చు  గ్రుద్దినట్లు ఒక్కరిలాగున్నారు

మీ రిద్దరు కవలపిల్లలా

అమ్మ,  ఒక్కటే నాన్నలు వేరు


59. సరదామాట

వాన పడ వద్దంటే  ఎలా  మేఘం ఉన్నప్పుడు

ఆకును కదలద్దంటే ఎలా గాలి ఉన్నప్పుడు

స్నాహం చేయ్య్డంద్దంటే ఎలా నీ ఉన్నప్పుడు

శోభనం వద్దంటే  ఎలా పెళ్లి అయినప్పుడు ......

60. నరక ద్వారం

పెళ్ళి  చేసుకుంటే " స్వర్గం చివరి అంచు దాకా " వేల్లోచ్చుట గదా

అని  అడిగాడు సుబ్బారావు, పుల్లారావును

అవును వెళ్ళవచ్చు " నరక ద్వారం దాటిన "  తర్వాతగా


61. లక్షణాలు

1. చీకటి లక్షణాలు అమృత  మహాదయాలకు  మనిద్వా రాలు

2. స్త్రీ పురిటి నేప్పులే ఆరోగ్యదాయకమైన బిడ్డ జన్మకు మార్గాలు

3. ఖనిజం నుండి వెలువడే అగ్నిజ్వాలలు మెరిసే పుత్తడి కడ్డీలు

4. ఉలి దెబ్బతిన్న రాయి అందమైన దేవతా సిల్పముగా మరే  సూచనలు

5. సాన పెట్టినకొద్దీ  ఘంధం వెదజల్లును పరిమళాలు

6. సాన రాపిడిలో వజ్రము వెలుగు విరజిమ్మే కాంతి వంతములు

7. మూడు  ముళ్ళ భందానికి చిక్కి సాగిస్తున్న సంసారులు

8. దేవుడు కోరికలు తీర్చిన మారని ఆశా  జీవులు   


73. ఇంటి విషయాలు

ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఇంటి విషయాలు ఛెప్పకు

ఎందుకు

ఈ  ఇంటి విషయాలు గుర్తుకువచ్చి అందరి మీద ఎగరాల్సి వస్తుంది

ఎందుకు

నా ఉద్యోగము ఎప్పుడు పోతుందో అని భయముతో ...........


74. దొచుకోవద్దూ

ఇంట్లో ఆ దొంగ  ఫోటో ఎందుకు అని అడిగింది మంత్రిగారిని విలేకరి 

మంత్రిగారు ఇలా అన్నారు విలేకరితో

గతస్మ్రతులు    గుర్తుకు తెచ్చుకొని రాజకీయములో దొచుకోవద్దూ 


75. అడుక్కోవడం

ఎవరో బయట అరుస్తున్నారు, స్కూటరు శబ్దం కూదా వచ్చింది

అవునమ్మ ఇంటి ముంది  స్కూటరు ఆగింది ఉండు నేనుచూస్తా

నేనే నమ్మ రోజువేచ్చే అడుక్కునేవాడిని

స్కూటరు మిద వచ్చింది ఎవరు నేనే

మా ఆవిడ ఎండలో ఇంటింటికి తిరిగితే కష్టం కదా అని  కొనిపించింది   

95, ఫీజు

డాక్టర్ గారు నాకు రాత్రి పూట నిద్ర రావటములేదు

ఈ మాత్ర వేసుకుంటే సీనియర్ నటి సావిత్రి 

ఈ మాత్ర వేసుకుంటే సిల్క్ స్మిత, సూర్యా కాంతం   

ఏమిటి డాక్టరుగారు ఏమాత్ర వేసుకున్న పోయినవారు గుర్తుకువస్తారు

ఎందుకంటే నీవుకూడా  చేరేది అక్కడకే నాఫీజుకట్టకపోతే .........


96. ముద్దు

నన్ను అదేపనిగా రెచ్చకొట్టకు నేను ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలియదు

నాకుకూడా కావలసినది అదేకదా అన్నది ప్రేయసి

 

97. వప్పుకొ

వయస్సు వంపులన్ని నీకు చూపించనా

కిందా పైన ముందు వెనుకా అంతాచూసుకో నీ సొంతం ఈ సమయంలో

మనపెళ్ళి  అయ్యాక అంతా  నా సొంతంమే కదా  

నాకు పెళ్లి అయింది మాయన వప్పుకొవద్దూ ................

 

98. టైమ్

పాప నీవు ఏం చేస్తున్నావు

నీను టైం  వేష్టు చేస్తున్నాను

మీ ఫాదర్ ఏం చేస్తున్నాడు

మా ఫాదర్ ఓవర టైం చేస్తున్నాడు

మీ మదర్  ఏం చేస్తున్నది

మా మదర్ నైట్ టైం క్లబ్ కు పోతుంది  





పుణ్య క్షేత్రాలు 

చారిత్రకప్రాధాన్యం :

దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది. ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతులతో నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువుతీరి కనువిందు చేస్తాయి.

ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైట కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం : ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.

“ఉగ్ర వీరః మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖః !

నృసింహః భీషణఃభద్రంమృత్యుమృత్యః నమామ్యహః !!”

అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు

ప్రహ్లాదమెట్టు: ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి మధ్య లోని ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం దర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిలమఠం: ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.

ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ప్రత్యేక ఉత్సవాలు: ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది

హోబిలం నరసింహస్వామి 

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని ...

--((**))--



 

పుణ్య క్షేత్రాలు 


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


76. సన్యాసమ్

భార్య : ఎందు కండి మీరు సన్యాసమ్ పుచ్చుకుంటున్నారు

           మిమ్మలిని సుఖపెట్టు తున్నానుగా

భర్త: సుఖపెట్టుతూ నస  పెట్టు తున్నావు అందుకే


77. సరదా ప్రేమ

నేవ్వేడిస్తే  నేనేడుస్తా , నువ్వు నవ్వితే నేనూ నవ్వుతా,

నేను చస్తే నీవు చస్తావా

నీవు బ్రతికావో లేదో చూసి ఆలోచిస్తా ...............

78. పచ్చడి

సీతమ్మగారు మీరు మిరపకారం పచ్చడి బాగా పెడతారుటా తెలిసివచ్చా

నేను పెట్టేటప్పుడు ఏమికావాలో చెపుతా అప్పుడు రా అంది జానకితో

ఇదిగో ఈ సీసాడు


 


01. ఓం నమః శివాయ: “జగద్గురు బోధలు” (3)
శ్రీ కంచి పరమాచార్య వైభవం
🕉🌞🌏🌙🌟🚩

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం|
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం||

ఆర్ద్రాదర్శనము
ॐॐॐॐॐॐॐॐ

మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే శీత లాంగా భుజంగా
వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందసం సర్వగాత్రే,
ఇత్థం శీతం స్రభూతం కసక సభా నాథ! సోఢుం క్వశక్తిః ?
చిత్తే నిర్వేదతప్తే యది భవతి న తే నిత్యవాసో మదీయే.


శివుడు చంద్రమౌళీశ్వరుడు. మఠములో ఉన్న అర్చనా మూర్తియున్నూ చంద్రమౌళీశ్వరుడే.
అయ్యా! నీమౌళిలో ఏమున్నవి? గంగ, చంద్రుడూ ఈరెండూ చలువచేసేవస్తువులే, నీచేతులకున్నూ, కాళ్ళకున్నూ తొడగికొన్న నగలో? అవిన్నీ అంటుకొంటే జివ్వు మనిపించే చల్లని పాములు. ఇవి చాల వన్నట్టు ఎడమతట్టున మాచల్ల తల్లి దయచేతనయిన తడిముద్ద ముంచుగొండ గారాబు కూతురు. అట్టి హైమవతి.


ఆర్ద్రాదర్శనం చిదంబరానికి విశేషం. ఆర్ద్రమంటే బాగా తడిసినదని అర్థం. ఆర్ద్రాదర్శనం జరిగేనాడు మంచు ఎక్కువగా పడుతుంది. నాడు పున్నమకూడాను. నక్షత్రం ఆర్ద్ర. చలి! చలి! చలి!


శివునకు ఆర్ద్ర ప్రీతిపాత్రమయితే పెరుమాళ్ళకు శ్రవణం అంటే మక్కువ. శ్రవణం శ్రవణం అంటూ పెరుమాళ్ళకు విశేషించి ఉత్సవాలు చేస్తారు. శివుడుమాత్రం ఆర్ద్రాప్రియుడు.

తెనుగువారివలెనే అరవలు సైతం నక్షత్రాలను అశ్వినీ భరణీ కృత్తిక ఈ మొదలుగా అంటారు. అరవంలో 'తిరు' అంటే శ్రేష్ఠం. తిరు శ్రీ కి పర్యాయంకూడా. కాని ఈ 'తిరు'ను నక్షత్రాలకు చేర్చి తిరుఅశ్వని తిరుభరణి అని వారనడంలేదు. శ్రవణం మళయాళీలకు 'ఓణం'. కాని అరవంలో శ్రవణానికీ ఆర్ద్రకు మాత్రం శ్రేష్ఠవాచకమయిన తిరు అనేశబ్దం చేర్చి తిరువాణం తిరువాదిరై అని అనడం వాడుక. ఇట్లా శివవిష్ణు ప్రీతిపాత్రాలయిన ఈ ఆర్ద్రాశ్రవణాలకు మాత్రం శ్రేష్ఠవాచకమయిన తిరుశబ్దం చేర్చడం వాడుక. తక్కినవానికి తిరు శబ్దం చేర్చరు.

ఓం నమః శివాయ: “జగద్గురు బోధలు” (3ఆ )
శ్రీ కంచి పరమాచార్య వైభవం

చెన్నపట్నానికి సమీపాన తిరువాన్మియూర్, తిరువళిక్కేణి, తిరువెట్రియార్ అనేవి ఉన్నవి. వీనికి తిరు శబ్దం మొదల ఉన్నది. అరవంలో కేణి అంటే కొలను. తిరువలిక్కేణిలో ఒక కొలను ఉండేదిట. దానిలో అల్లిపూలు పూచేవిట. అందుచేత దానికి తిరువల్లిక్కేణి. తిరువల్లికేణి అనే పేరు ఏర్పడింది. మదరాసులోనే తిరువెట్టీశ్వరన్ పేట అని మరొక ప్రదేశముంది. అచట తిరువెట్టీరుని ఆలయం ఉంది. అర్జునునకు పాశుపతం ఇచ్చే సందర్భంలో కిరాత వేషంలో వచ్చిన శివునకున్నూ తపస్సు చేసుకుంటున్న అర్జునునకున్నూ యుద్ధం జరిగి అర్జునుని వింటిదెబ్బలు తిని శివుడనుగ్రహించాడని పురాణం. అందుచేత ఇచటి దైవాన్ని తిరువెట్టీశ్వరన్ అని వ్యవహరిస్తారు. ఇట్లా స్వామితో సంబంధం కల పేర్లకు తిరుశబ్దం కలపడం ఒక వాడుక. ఇపుడు స్వామికి చెప్పినా చెప్పకపోయినా ఆసాములకు మాత్రం విరివిగా తిరుశబ్దం వ్యవహారంలోకి వచ్చింది.


దక్షిణదేశంలో ఏదయినా ఒక ఊరు వెలిస్తే అక్కడ ఒకశివాలయం విష్ణ్వాలయం కట్టడం బహుళంగా ఆచారంలో ఉంది. శివుని గుడిలో గర్భగృహంలో శివలింగంమీద ఒక ధారాపాత్ర వేలాడగటతారు. దాంట్లోంచి శివుని తలమీద అప్పసమూ జలధార పడుతూనేవుంటుంది. ఉత్తరదేశానికి వెళ్ళిచూస్తే ప్రతివాళ్లూ నదిలోనో చెరువులోనో స్నానంచేసి ఒక చిన్నపాత్రలో నీరు తెచ్చి శివాలయానికి వెళ్ళి శివలింగం మీద స్వహస్తంతో కుమ్మరించిపోతారు. దీనికి 'చడానా' అని అంటారు. ఉత్తరదేశంలో మరోవిశేషమేమంటే అంబికాలయం కాని రామాలయంకాని కాళికాలయంకాని ఏఆలయమయినా సరే మన ప్రాంతాలలో రావిచెట్లకింద నాగలింగ ప్రతిష్ఠ చేసిన రీతిగా ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. కొన్ని కాళికాలయాలలో ద్వాదశ పన్నెండు లింగాలు కనబడతై. శ్రీ శంకర భగవత్పాదులు ఈ ద్వాదశలింగాలనూ స్తోత్రం చేశారు. హిమాలయంలో కేదారం, సౌరాష్ట్రంలో సోమనాథం, వారణాసిలో విశ్వనాథం, గోదావరిలో త్ర్యంబకం.


మహాబలిపురంలో ఉన్నట్లు ఔరంగాబాదు సమీపంలో ఎల్లోరాగుహలు ఉన్నై. అచట కొండా కొండా తొలిచి కోవెలకట్టారు. దీనిని చూచినవారికి మహాబలిపురం పెద్దవింతగా కనిపించదు. తంజావూరు ఆలయప్రాకారంలాగా కొండనేమలిచి గుడిగా ప్రాకారంగాకూడా నిర్మాణంచేశారు. దానిని నిర్మించడానికి అరవదేశంనుంచే శిల్పులు వెళ్లారుట. ఆలా వెళ్ళినవారు పల్లవచోళులకాలంలో వెళ్ళి ఉంటారు. ఆలయంలో ఆ పెద్దశిల్పి ఒక సంస్కృతశ్లోకం చెక్కాడు. దానిభావం :


ఈ కోవెలను నిర్మించిన తరువాత నేను తిరిగి చూచుకొన్నాను. దీనిని నిర్మించింది నేనా? అని నాకు ఆశ్చర్యం కలుగుతూంది. ఎన్నిజన్మలెత్తినా ఇట్టి ఆలయాన్ని (ఇంకొక దానిని) నేను కూడా నిర్మించలేను. నాలోనుండి ఎవరు దీనిని నిర్మించారో నాకు ఏమీ తెలియడంలేదు. ఇట్టి ఆలయం ఇంతకుముందు కట్టిందిలేదు, ఇక ముందేవరున్నూ కట్టబోరుగూడా. 'మళ్ళాకట్టు' అంటే నేనుకూడా ఇట్టి ఆలయం కట్టలేను'.


ఇట్టి ఎల్లోరాలోనే నాగేశం. భీమేశ్వరంనర్మదాతీరంలో ఒకనగరం. బాణలింగం మహారాష్ట్రంలో ఉన్న ఓంకారం. శ్రీశైలం, రామేశ్వరం. ఇవి పన్నెండూ పన్నెండుక్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలలోని జోతిర్లింగాలనూ శ్రీ శంకరాచార్యులవారు నాలుగుపాదాలు కల మూడు శ్లోకాలలో ఇట్లా స్తుతించారు.

02 ఓం నమః శివాయ: “జగద్గురు బోధలు” (3b )
శ్రీ కంచి పరమాచార్య వైభవం

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లిఖార్జునమ్,
ఉజ్జయిన్యాం మహాకాల మోంకార మమలేశ్వరే.
పరల్యాం వైధ్యనాథం చ డాకిన్యాం భీమశంకరం,
సేతు మధ్యే తు రామేశం నాగేశం దారుకావనే.
వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే,
హిమాలయే తు కేదారం ఘుసృ (ధిష) ణేశం శివాలయే.

వీనినేకాక ప్రతిక్షేత్రంలోనూ ఉండే లింగాలను గూర్చిన్నీ వేరువేరుగా వ్రాశారు. పల్లవులకాలంలో కట్టిన కాంచీనగర దేవాలయంలో ప్రతిష్ఠించిన ద్వాదశలింగాలనూ చూడవచ్చు. మనప్రాంతంలో ఆవిధంగా ఎక్కడాలేదు. శివాలయం అంటే అభిషేకమే.


ఇత్థం శీతం ప్రభూతం తవ కనక సభానాథ సోఢుం క్వ శక్తిః ?

ప్రభూతమంటే ఎక్కువ. అపరకార్యాలలో అన్నం ఎక్కువగా వండి చేసే కర్మకు ప్రభూతబలి అని పేరు.

'అధికమయిన ప్రభూతమయిన చలిని-సోఢుర్సఓర్చు కోడానికి, కనక సభానాథుడవైన మహాప్రభూ! తవ్సనీకు. వ్వశక్త్సిఃశక్తియేదీ?


'ఇంతటి చలిని ఎవడున్నూ ఓర్చుకోలేడే! తలమీద గంగనేకాక చంద్రునికూడా పెట్టుకొని ఒంటిమీద చలికొట్టే పాములను చుట్టుకొని ఎడమతట్టున మంచుగొండ కూతురిని అతికించుకొని యీ యింత చలిని ఎలా నీవు ఓరుస్తున్నావయ్యా? అని కవి ప్రశ్నిస్తాడు.


ఈ ప్రశ్నకు స్వామి ఏమి బదులు చెపుతాడు? నిరుత్తరుడై ఆనందమూర్తియైనర్తకనిమగ్నుడై ఉంటాడు. అనృత్యం క్షణమాత్రం చూచిన కవికి బదులు దొరికింది,-


సరి. దీనికి నిన్ను ప్రశ్నించడం ఎందుకు? నీవు ఇలాంటి ఇంత చల్లదనమూ ఓర్చుకోడానికి మూలకారణం నావద్దనే ఉన్నది. నీవు అంతటనూ ఇంత ఎడము లేకుండా వెలసిన మహాప్రభువవు. నీవు లేనిచోటే లేదని అంటారు. ఎవరో స్వామి ఉన్నచోటు చూపమని ఒకరిని అడిగారట. అలా అడిగితే ఆయన స్వామి ఉన్నచోటు చూపుతా''నని అన్నాడుట. అట్లా నీవు సర్వాంతర్యామివై ఉన్నావు. నీవు నాహృదయమునందున్నూ ఉన్నావు. అందొక్క క్షణముంటే చాలు. ఎంతటి చలిన్నీ పరారు కావలసినదే. నా హృదయం అంత నిర్వేదంతో తుకతుకలాడి పోతుంది. అది తాపాలకు నెలవు. దుఃఖాలకు ఆలయము. నేను బహుజన్మలను చూచిన అనాదిని నీవున్నూ అనాదివే. నా హృదయంలో ఉంటే ఎంత శైత్యమయినా ఓర్చుకోగలవు, అని కవిబహుసుందరంగా చమత్కరించాడు.

జీవుల హృదయతాపాలను పోగొట్టే శక్తి ఒక్క పరమేశ్వరునకే ఉంది. మన హృదయతాపాలు పోకార్చడానికి ఆయనను చల్లని ప్రభువుగా భావించి శైత్యోపచారాలు చేయాలి. ఆయన హృదయంలో గనుక ఉంటేసర్వతాపాలూ పోతై. తాపంలో తలతలలాడే మన హృదయాలలో ఆదైవం వసించడానికి వారికి శైత్యోపచారాలుచేయడమే ఆర్ద్రాదర్శనతత్త్వం అని ఈశ్లోకంవల్ల తెలుస్తున్నది.

'వణకుతూ మాటలాడతా వేమయ్యా!' అని ఎవరైనా ప్రశ్నిస్తే వణికే ఆ మనిషి భయంతో మాటాడుతున్నాడని అర్థం. భయవిదారకుడు ఈశ్వరుడు. చల్లని ఆ ప్రభువును వేదనతో విలవిలలాడే హృదయాలలో ఒక్కక్షణం ధ్యానిస్తే చాలు, మన వేదనలన్నీ విడిపోయి హృదయం చల్లనౌతుంది.


🕉🌞🌏🌙🌟🚩

03. దక్షిణామూర్తి తత్వం  (2)

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

దక్షిణామూర్తి తత్వం  (2/a )

ఆ రూపాలు వరుసగా….

శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

దక్షిణామూర్తి స్తోత్రం (2/బి )

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్

ఆధ్యాత్మిక కధలు (1)

04, నైవేద్యం ప్రత్యక్షంగా తినే శ్రీకృషుని దేవాలయము.... (1)

మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.
📿 గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.
📿 అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.
📿 ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.
📿 గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.
📿 నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాలం పోయినా, గొడ్డలితో తాలాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.
📿 కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.
📿 కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .
📿 గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.
📿 సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది! 🙏 


 సర్వంశ్రీకృష్ణార్పణమస్తు 🙏
05. గృహస్థాశ్రమ ధర్మములు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

గృహస్థుడు తన సమస్త భోగసామాగ్రిని కుక్కలు, నిమ్నజాతులవారు మొదలగు ప్రాణులకు యథాయోగ్యముగా పంచియిచ్చి, పిదప వాటిని తాను ఉపయోగింపవలెను. తనకు ఆత్మీయురాలైన భార్యకు కూడ అతిథులు మొదలగు వారి సేవలయందు నియమింపవలెను.

మానవుడు తన భార్యకొరకై తన ప్రాణములను గూడ త్యజించుటకు సిద్ధపడును. ఒక్కొక్కసారి తన తల్లిదండ్రులను, గురువునుగూడ ఆమె కొఱకై హతమార్చును. భార్యయందుగల తన వ్యామోహమును విడిచి పెట్టినవాడే, ఒటమినెరుగని భగవంతునిపైగూడ విజయమును సాధించును.

తుదకు క్రిములు, మలము, బూడిదరాశిగా మార్పును చెందునట్టి తుచ్ఛమగు ఈ శరీరమెక్కడ? ఆ శరీరమునందు ప్రీతిగల భార్య ఎక్కడ? ఆకాశమువలె వీటన్నిటికి అతీతమైన ఆత్మ ఎక్కడ? (ఆత్మ శరీరము కంటెను, ప్రేమాస్పదులగు భార్యాపుత్రులకంటెను, అతీతమైనది).

గృహస్థుడు తన ప్రారబ్ధము మేరకు ప్రాప్తించిన ఆహార పదార్థములను పంచయజ్ఞములకు వినియోగించిన పిదప, మిగిలిన దానితో తన జీవితమును గడపవలెను. అంతేకాని, ప్రాజ్ఞుడు దేనిపైననూ ఇదినాది అను భావము కలిగియుండరాదు. అప్పుడు అతనికి సత్పురుషులు పొందు పదవి లభింపగలదు.

గృహస్థుడు తన వర్ణాశ్రమ ధర్మముల ద్వారా ప్రాప్తించిన సంపదతో ప్రతిదినము దేవతలు, ఋషులు, మనుష్యులు, ప్రాణులు, పితృగణములు, ఇతర ప్రాణులు, మొదలగువాటిని తృప్తిపరచుటద్వారా ఆరాధింపవలెను. అట్లే తన ఆత్మను  గూడ సేవింపవలెను. తద్ద్వారా 

వేర్వేరు రూపములలో గల భగవంతుని ఆరాధించినట్లగును.
గృహస్థుడు తన యోగ్యతను అనుసరించి, యజ్ఞములను అవసరమగు వస్తువులను అన్నింటిని సమకూర్చుకొన గలిగినప్పుడే గొప్ప గొప్ప యజ్ఞములద్వారా, 
అగ్నిహోత్రాదుల ద్వారా భగవంతుని ఆరాధింపవలెను.

ధర్మరాజా! సకల యజ్ఞములకును భోక్త భగవంతుడే. కాని, బ్రాహ్మణుని ముఖముద్వారా అర్పింపబడిన హవిష్యాన్నముతో తృప్తిపడినంతగా, అగ్నిద్వారా సమర్పించిన హవిస్సుద్వారా ఆ పరమాత్మ తృప్తి చెందడు.

అందువలన బ్రాహ్మణులు, దేవతలు, మనుష్యులు మున్నగు ప్రాణులయందు అంతర్యామి రూపములో విరాజిల్లుచున్న భగవంతుని యథాయోగ్యముగా ఉపయుక్తములైన పదార్థముల ద్వారా పూజింపవలెను. వీరిలో బ్రాహ్మణులే ముఖ్యులు.

ధనికుడైన బ్రాహ్మణుడు తన యొద్దనున్న ద్రవ్యమును అనుసరించి, భాద్రపదమాసమునందలి, కృష్ణపక్షమున  తన తల్లిదండ్రులకును అట్లే, ఇతర బంధువులకును (అనగా పితామహ, మాతామహాదులకును)  మహాలయ శ్రార్ధమును ఆచరింపవలెను.

***

: 🌹. శ్రీమద్భగవద్గీత - 429   / Bhagavad-Gita - 429 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 38 🌴

38. త్వమాదిదేవ: పురుష: పురాణ
స్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప ||

🌷. తాత్పర్యం : 
నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయము. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్యశరణ్యుడవు. ఓ అనంతరుపా! ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడియున్నది. 

🌷. భాష్యము  : 
సమస్తము శ్రీకృష్ణభగవానునిపై ఆధారపడియుండుటచే అతడు పరమాధారమై యున్నాడు. 

“నిధానం” అనగా సమస్తము (చివరకు బ్రహ్మతేజస్సు సైతము) ఆ దేవదేవుడైన కృష్ణుని పైననే ఆధారపడియున్నదని భావము. ఈ జగమందు జరుగుచున్నదంతయు అతడు సంపూర్ణముగా నెరుగును. 

ఇక జ్ఞానమునకు అవధియన్నది ఉన్నచో అతడే సర్వజ్ఞానమునకు పరమావధి. కనుకనే తెలిసినవాడు మరియు తెలియదగినవాడు అతడే. సర్వవ్యాపియైనందున జ్ఞానధ్యేయమతడే. 

ఆధాత్మిక జగత్తులో అతడే కారణము కనుక దివ్యుడైనవాడతడే. ఆలాగుననే ఆధాత్మికజగమునందు ప్రధానపురుషుడు ఆ శ్రీకృష్ణభగవానుడే.
🌹 🌹 🌹 🌹 🌹


 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 217  / Sripada Srivallabha Charithamrutham - 217 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీ రాజరాజేశ్వరీ దేవి 🌻

తరువాత మేము భాస్కరశాస్త్రిని రాజరాజేశ్వరీదేవి గురించి తెల్పమని ప్రార్థించాము. 

"రాజరాజేశ్వరిదేవి మన మనస్సుకు, ఇచ్ఛకు పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలై ఉంటుంది. ఆలోచించే మన మనస్సు సాధారణంగా మేధాశక్తిగా మారు తుంది. ఆ మేధాశక్తిని వివేకవంతం చేయడానికి ఈ దేవి సహాయం చేస్తుంది. సాధారణంగా శక్తి, వివేకం కలిసి ఉండవు. 

కాని రాజరాజే శ్వరీదేవి శక్తితో కూడిన వివేకాన్ని, వివేకయు తమైన శక్తిని ప్రసాదిస్తుంది. రాజరాజేశ్వరీ శక్తిని పెంపొందించు కున్న సాధకులు తమ వివేకబలంతో విరోధి శక్తులను నిర్మూలించ గల్గుతారు. 

ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే, అసురు లను, రాక్షసులను, పిశాచాలను కూడా తన బిడ్డలుగానే పరిగణి స్తుంది. ఆమె శక్తికి ఙ్ఞానమే కేంద్రం. అందువల్ల ఆమె అనుగ్రహం కలిగితే సత్యబోధ కలుగుతుంది. 

నేను శ్రీపాదుల దయకు పాత్రుడనైనందున నాకు రాజరాజేశ్వరీ దీక్షలో సఫలత ప్రాప్తించింది," అని దేవి గురించి వివరించి శ్రీపాదులు ఎలా పీఠికాపురంనుండి సంచారానికి బయలు దేరారో తరువాత చెప్తానని, మేమిద్దరం అక్కడకు చేరే ముందే శ్రీపాదులు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చి తాను చేసిన పులిహోర కొద్దిగా స్వీకరించారని, శ్రీపాదులు సాక్షాత్తు మహాసరస్వతీ, మహాలక్ష్మి, మహాకాళీ, రాజరాజేశ్వరీ స్వరూపులని చెప్పి ఆ ప్రసాదాన్ని మాకు కూడా ఇచ్చారు. తరువాత మేము ముగ్గురం ధ్యానస్థులం అయ్యాము.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
🌹 🌹 🌹 🌹 🌹


: 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 97 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 13 🌻

వాడు బాధపడ్తూనే మర్నాడు మళ్ళీ అంతే నంటారా? ఇంక లాభం లేదంటారా?" అని అడిగాడు. "లాభం లేదురా అప్పా మోక్షం రాదు. పోవలసినది బంధం తప్ప రావలసినది మోక్షం కాదు." 

మనం ఏ దరిద్రాలనయితే కొని తెచ్చిపెట్టుకున్నామో, అవి తొలగించుకొనుటే కావాలి కానీ, కొత్తగా వచ్చేదేమీ లేదు. ఇంతకు ముందున్న స్థితినే మోక్షం అని పిలుస్తున్నావు. 

దుఃఖం నీవు తెచ్చుకొని అంతకుముందున్న సవ్యస్థితిని సుఖమని పిలుస్తున్నావు. సుఖం రావాలి. సుఖం రావాలి అని కోరితే వచ్చేదేముంది? (దుఃఖం తప్ప) చోటులో ఇల్లు కట్టుకుని ఇంటిలో చోటు కోసం వెతుక్కుంటుంటే చోటు పరిమితంగానే ఉంటుంది. అంతకు ముందున్నది చోటు. మధ్యన మనం కట్టుకున్నది ఇల్లు. 

మోక్షం వచ్ఛేదేమీ లేదు బంధము పోవటమే కావలసిన స్థితి. మనం సాధన చేస్తున్నప్పుడు ప్రశాంత స్థితికొచ్చిన కొద్దీ వాతావరణము నందు మనస్సు వంగుతుంది. (వాతావరణమునకు మనస్సు లొంగుతుంది.) 

వాతావరణములోని విఘ్నములు తొలగుతాయి. మనకు ఎదుటివాడి వలన ఏం ప్రయోజనముందని అనుకొనిన (కోరిన) కొద్ధీ వాతావరణమునకు (పరిసరములకు) దాస్యం చేయుట సంభవించును. 

ఈ రెండూ ప్రస్తుతం ఉన్న భారతీయుడు తెలిసికొనవలెను. భారతదేశంలో ఉన్న ఎక్కువమందిమి విషాదయోగంలోనే ఉన్నాము. సాంఖ్య యోగం నుండి ప్రారంభించి మోక్ష సన్న్యాసయోగం దాకా రావాలి.
...✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
: 🌹. నారద భక్తి సూత్రాలు - 36 🌹 
ప్రథమాధ్యాయం - సూత్రము - 23

🌻 23. తద్విహీనం జారాణా మివ 🌻

            గోపికాంగనల ప్రేమ భగవంతుని మాహాత్మ్యం తెలియనిదైతే అది వ్యభిచారమే అవుతుందేమో ? అని సంశయం.

            ఒకవేళ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను వారికంటే వేరుగా, కేవలం గొప్ప వాడిగా చూచినట్లైతే, ఆ శ్రీకృష్ణుని కీర్తిస్తూ, పూజిస్తూనే ఉండిపోయేవారు. వారి భక్తి అప్పుడు కాయిక, వాచిక భక్తి అయ్యుండేది. 

కాని ఆ గోపికాంగనలు శ్రీ కృష్ణుని హృదయాంతరంగలో పెట్టుకుని తన్మయులై ఉన్నారు కదా ! శరీరధారిగా అవతరించిన పరమాత్మను భగవంతుడిగా భావించి ఆలింగనం చేసుకుంటే అది జారత్వ మెలాగవుతుంది? 

అవతార్‌ మెహెర్‌ బాబాను భగవంతునిగా నమ్మిన స్త్రీ భక్తులు ఆయనను ఆలింగనం చేసుకోలేదా ? ఇరువురూ అజ్ఞానులైతే అది జారత్వ మౌతుంది గాని ఒకరు భగవంతుడైనప్పుడు రెండవ వాడైన అజ్ఞానిలో దివ్యత్వం ప్రకాశింప బడుతుంది. 

అప్పుడు ఆ భగవంతడు ఒక్కడే పురుషోత్తముడు ఇతరులు స్త్రీలైనా, పురుషులైనా సరే, అందరూ స్త్రీలతో సమానం.

   కనుక గోపికాంగనల భక్తిని కామంతో కూడినదిగా శంకించ నవసరం లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
: 🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత  జీవన్ముక్తిగీత  - 6  / DATTATREYA JIVANMUKTA GITA - 6 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

21. సోఽహం స్థితం జ్ఞాన మిదం
సూత్రేషు మణివ త్పరమ్‌
సోఽహం బ్రహ్మ నిరాకారమ్‌
జీవన్ముక్త స్స ఉచ్యతే ll      

భావము: 
ఈ ‘సోఽహం’ అనెడి జ్ఞానము సూత్రము నందలి మణి వలె నిలిచియున్నది. ‘సోఽహం’ అనెడి బ్రహ్మ తత్త్వము ఆకారము లేనిదై యున్నది. ఈ విధముగా సత్యము నెరిగిన వాడే ‘జీవన్ముక్తుడు’.

22. మన ఏవ మనుష్యాణాం
భేదా భేదస్య కారణమ్‌
వికల్ప నైవ సంకల్పమ్‌
జీవన్ముక్త స్స ఉచ్యతే ll   

భావము: 
మనుష్యులలోని భేదాభేదములకు మనస్సే కారణముగా తెలియుచున్నది. అయితే ఎవరిలో సంకల్ప వికల్పాదులు అదృశ్య మగుచున్నవో అతడే ‘జీవన్ముక్తుడు’.

23. మన ఏవ విదుః ప్రాజ్ఞాః
సిద్ధ సిద్ధాన్త ఏవ చ
సదా దృఢం తదా మోక్ష
జీవన్ముక్త స్స ఉచ్యతే ll    

భావము: 
మనస్సు నిశ్చలముగా నుండుటయే మోక్షమని విజ్ఞులు, ప్రాజ్ఞులు సిద్ధాంతీకరించియున్నారు. ఈ సత్యమును తెలిసిన వాడే ‘జీవన్ముక్తుడు’.

24. యోగాభ్యాసీ మనశ్శ్రేష్ఠః
అంతస్త్యాగీ బహిర్జడః
అంతస్త్యాగీ బహిస్త్యాగీ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll                    

భావము: 
యోగాభ్యాసి యైనవాడు, శ్రేష్ఠమైన మనస్సు గలిగినవాడు అంతస్త్యాగి యనబడును. అతడు బాహ్యమునకు జడుని వలె యుండును. వాస్తవానికి అతడు బాహ్యాభ్యంతరముల యందు త్యాగియై యున్నాడు. అతడే ‘జీవన్ముక్తుడు’.

వేదాంత కేసరి యగు శ్రీ దత్తాత్రేయులు రచించిన “జీవన్ముక్తగీత” సమాప్తము
ఓం తత్‌ సత్‌
ఓం శాంతిః శాంతిః శాంతిః
🌹 🌹 🌹 🌹 🌹

: 🌹. శివగీత  - 2 / The Siva-Gita - 2 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
🌻. భక్తి నిరూపణ యోగము  - 1 🌻

సూత ఉవాచ :
01. అధాత స్సం ప్రవక్ష్యామి - శుద్ధ కైవల్య ముక్తిదమ్,
అనుగ్రహాన్మ హేశస్య- భవ దుఃఖ స్య భేషజమ్ 1

శ్రీ శౌనకాది మహర్షుల గూర్చి సూతుం డిట్లు వాక్రుచ్చెను:

ఓయీ ముని పుంగవులారా! శ్రీ పరమాత్మ పరశివ మూర్తి యొక్క  అనుగ్రహము వలన, పరమ పునీతమగు, సంసార మనెడు ఔషధ ప్రాయమైన బ్రహ్మ స్వరూప కైవల్యమును మోక్ష ప్రదమగు జ్ఞానమును  నేను మీకు బోధించు చున్నాను.

02. న కర్మణా మనుష్టానై - ర్న దానై స్వపపాసివా,
కైవల్యం లభతే మర్త్య ! - కింతు జ్ఞానేన కేవలమ్ .2

ఎటువంటి పుణ్య కర్మల ననుష్టిం చుట వలనను,  ఎలాంటి తపో నుష్టాన ముల జేయుట వలనను  కైవల్య పద ప్రాప్తిని పొందలేడు. ఐతే కేవల మొక దివ్య జ్ఞానము వలననే కైవల్య ప్రాప్తి కలుగును .

03. రామాయ దండకారణ్యే - పార్వతీ పతినా పురా ,
యాప్రోక్తా శివ గీతాఖ్యా - గుహ్యా ద్గుహ్యాత మాపిసా 3

04. యస్యా శ్శ్రవణ మాత్రేణ - నృణాం ముక్తి ర్ద్రువా భవేత్,
పురా సనత్కుమారాయి - స్కందే నాభి హిఆ హి సా 4 

పూర్వ కాలమున దండ కారణ్యములో శ్రీరామునకు శంకరుని  చేత ఏదైతే ప్రధమమున బోధించ బడినదో, ఏదైతే పరమ గోప్యంబగు నదియు , దేనినీ ఆలించుట చేతనే మానవులకు  నిత్య (శాశ్వత) కైవల్యము లభించునో అట్టి శివ గీతను సనత్కుమారునకు షణ్ముఖ స్వామి బోధించెను.

05. సనత్కుమార : ప్రోవాచ - వ్యాసాయ ఋషి సత్తమా ,
మహ్యం కృపాతి రేకేణ - ప్రదదౌ బాధ రాయణః 5

తరువాత నా సనత్కుమారుడు వ్యాసునకు బోధించిన వాడయ్యెను. అట్టి వ్యాస మహర్షి నా యందు అనుగ్రహము కలవాడై  నాకు బోధించి యున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

: 🕉🔯 ఓం   నమో వేంకటేశాయ 🕉🔯
*రోజుకో అన్నమయ్య  సంకీర్తన *
ఎదుట నున్నాఁడు వీఁడె యీ బాలుఁడు...
రేకు            : 370-1
సంపుటము: 11
సంకీర్తన      : 415
రాగము      : సాళంగం
తాళం         : ఆది
గానం : శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారు

పల్లవి
ఎదుట నున్నాఁడు వీఁడె యీ బాలుఁడు
మదిఁ దెలియ మమ్మ యే మరులో కాని

చరణం 1
పరమపురుషుఁ డట పసులఁ గాచె నట
సరవు లెంచిన విన సంగతా యిది
హరియే తా నటముద్దు లందరికిఁ జేసె నట
యిర వాయ నమ్మ సుద్దు లేఁటివో కాని

చరణం 2
వేదాల కొడయఁ డట వెన్నలు దొంగిలె నట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూల మితఁ డటా ఆడికెల చాఁత లట
కా దమ్మ యీసుద్దు లెట్టికతలో కాని

చరణం 3
అల బ్రహ్మతండ్రియట యశోదకు బిడ్డఁడట
కొలఁ దొకరికిఁ జెప్ప గూడునా యిది
తెలిపి శ్రీవెంకటాద్రిదేవుఁడై నిలిచె నట
కల దమ్మ తన కెంత కరుణో కాని

🕉🔯 ఓం   నమో వేంకటేశాయ 🕉🔯
🔺 శ్రీ ఆది శంకరాచార్య       _విరచిత __
💎 వివేక చూడామణి.
స్వామీ చిన్మయానందుల వ్యాఖ్యానం.
ఆడియో నం.157

💎💥💎💥💎💥💎
: తోటకాచార్య విరచిత / తోటకాష్టకమ్
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి                                  🕉🌞🌏🌙🌟🚩
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్|| నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్||


1) విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిత్కథితార్థనిధే|
హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణమ్||

సకలశాస్త్ర సుధాబ్ధిని చిలికి తదంతర్గమైన మకరందమాధుర్యాన్నితాను గ్రహించి ఇతరులందరికీ పంచాలని అహర్నిశలు పరితపించిన ఓ శంకరా! భావితరాలని ఉద్ధరించాలన్న ఏకైక కారణంచేత వేదాంతోపవనాల్లో నిక్షిప్తమైన ఉపనిషత్తులలో దాగున్న నిధులని శేకరించి భాష్యాలుగా ప్రకటించి పంచిపెట్టినట్టి ఓ శంకరా! నా మదిలో విమలమైన నీ చరణాలని స్థాపించి అనునిత్యము పూజించుకుంటాను. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

2) కరుణావరుణాలయ పాలయ మాం భవసారదుఃఖ విదూన హృదమ్|
రచయాఖిదర్శన తత్త్వవిదం భవశంకర దేశ…

: 🕉🌞🌎🌙🌟🚩

Swami Vivekananda's Wisdom for Daily Inspiration - July 16.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూలై 16.

Be not in despair; the way is very difficult, like walking on the edge of a razor; yet despair not, arise, awake, and find the ideal, the goal.

మార్గం, పదునైన కత్తి అంచులా నిశితమై, ఎన్నో అవరోధాలతో కూడుకొని ఉంది. అయినా నిస్పృహ చెందకండి. లేవండి, మేల్కొనండి. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి.

🕉🌞🌎🌙🌟🚩
: 🕉🌞🌎🌙🌟🚩

సాక్షిగా తన జీవితాన్ని తాను చూడగలిగితే చాలు., అంతకు మించిన ఆధ్యాత్మికత లేదు.

⚡️✨⚡️✨⚡️✨

బోధను గ్రహించి బోధకుణ్ణి వదిలేయాలి. చెప్పినవాడు 'మాయం' కావడమే, చెప్పిన బోధ సఫలం అయినట్లు లెక్క.

⚡️✨⚡️✨⚡️✨

మాకు సంస్కృతం తెలియదు, మాకు శాస్త్ర పరిచయం లేదు.

మా అనుభవమే మాకు శాస్త్రం, మా అనుభవమే మాకు ప్రమాణం.

⚡️✨⚡️✨⚡️✨

రామకృష్ణ:- ముక్తికి సిద్ధులు ఆటంకమా?

సద్గురు:- నామ రూపాలు లేని 'తాను', నామరూపాలు కలిగిన 'రామకృష్ణ' గా ఉండడమే తొలి సిద్ధి.

"రామకృష్ణయే" ప్రధాన ఆటంకం ముక్తి కి.

⚡️✨⚡️✨⚡️✨

సత్యాన్ని తెలుసుకో అంటే :--

హేమ 'సత్యాన్ని' తెలుసుకోమని కాదు,'హేమయే అబద్దం' అనే సత్యాన్ని తెలుసుకో అని.

⚡️✨⚡️✨⚡️✨

 'కలలో మెలకువ'గా ఉన్నాము ఇప్పుడు.

 'మెలకువలో కల'గా ఉండాలి ఎప్పుడు.

⚡️✨⚡️✨⚡️✨

రమేష్:- కర్త ఈశ్వరుడే, మరి నేనేమీ చేయడం లేదా?

సద్గురు:-రాజాస్థానంలో పనిచేసే రాజోద్యోగి స్వయంగా తానే అన్ని పనులను నిర్వహిస్తున్నట్టు కనబడిన, ఆ నిర్వహణలో అంతర్లీనంగా రాజ ఉత్తర్వు ఉంటుంది.  అట్లే జీవుల సంకల్పములతో కూడిన సకల కర్మలు కూడా 'పరా'ధీనములే సందేహము లేదు.

--(())--

బ్రాహ్మణత్వము గురించి భీష్ముణ్ణి...ధర్మరాజు ఇలా అడిగాడు.. 24=06=2021

పితామహా ! బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రాహ్మణత్వము పొందవచ్చునా ! అని తన సందేహం వెలిబుచ్చాడు. 

భీష్ముడు ధర్మనందనా ! బ్రాహ్మణత్వము పొందడం చాలా దుర్లభం.ఎన్నోజన్మలు ఎత్తిన తరువాత కాని బ్రాహ్మణజన్మ లభించదు. 

ఈ విషయము గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండే వాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెడుతున్నాడు. 

దారిలో అతడు ఒక గాడిదపిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తనతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో  అమ్మా ! ఇతడు చంఢాలుడు, క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది. 

గాడిద మాటలను అర్ధము చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అన లేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్ధము ఉంది. లేకుంటే అలా ఎందుకు అంటుంది? అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యము చెప్పమని అడిగాడు. 

గాడిద విప్రకుమారా ! నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞముకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో  తండ్రీ ! నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. 

ఆ గార్ధభము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది. లేకున్న ఈ నా జన్మరహస్యము ఎలా తెలుస్తుంది?. తండ్రీ ! నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు.

మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా ! నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు ? నీ కోరిక ఏమిటి  అని అడిగాడు. మతంగుడు దేవా ! నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని అడిగాడు. 

ఇంద్రుడు కుమారా ! బ్రాహ్మణత్వము మహత్తరమైనది. ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. మతంగుడు అయ్యా ! నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి. నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు. 

ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటి కాలి మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. 

ఇంద్రుడు కుమారా ! నీ పట్టు విడువక ఉన్నావు! శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! 

ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక చంఢాలుడు శూద్రుడు కాలేడు. 
దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. 
దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. 
దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. 
దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము విడిచి పెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. 

అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా ! చెప్పు అన్నాడు. ఒక వేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టము.

 ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కాని బ్రాహ్మణజన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు ఔతాడు. 

తిరిగి బ్రాహ్మణజన్మ రావడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అటువంటి బ్రాహ్మణజన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు. నీ కిష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు. 

మారుమాటాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళి పోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యేవరకు తపస్సు చేసాడు. 

అతడి శరీరము శిధిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరు వరములు అడిగి సుఖపడు అన్నాడు. 

మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చంఢదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల. పూజలందుకుని వారి వలన నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. 
కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు.

అటువంటి ఉత్కృష్టమైన, పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం మన బ్రాహ్మణులదే.


&&&&

 

ప్రాంజలి ప్రభ 

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 


రండు ననుఁగూడి యోపరివ్రాట్టులార!


వత్సలత గల్గి మీరేల వత్తురయ్య!

పరమ నిర్భాగ్యుఁడైన నాపజ్జఁబట్టి

కటకటా! సౌఖ్యజలరాశిఁ గాశిఁబాసి.

ఆగస్త్యముని కాశీనగరాన్నివదలి వెళ్ళేసందర్భంలో శ్రీనాధుని "కాశీఖండము" నుండి.


నీకతంబునఁ గాదె లోకభీకరులైన, త్రిపుర దానవుల మర్ధింపఁ గలిగె


నీకతంబునఁ గాదె కాకోల విషవహ్ని, యలవోకయును బోలె నార్ప గలిగె

నీకతంబునఁ గాదె నిరవగ్రహస్ఫూర్తి, నంధకాదుల గర్వ మడఁపఁగలిగె

నీకతంబునఁ గాదె నేఁడు వారాణసీ, సంగమోత్సవ కేళి సలుపఁ గలిగె


నాత్మజుఁడవన్న మిత్త్రుండ వన్న భటుఁడ


వన్న సచివుండవన్న నాకెన్న నీవ

నిన్ను నెబ్భంగి వర్ణింప నేరవచ్చు?

కంఠపీఠాగ్ర కరైరాజ! డుంఠిరాజ!

శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి.

__(())__

కమలలోచన మనుజుఁ డొక్కటిఁదలంప


దైవమొక్కటిఁ దలఁచు టెంతయు నిజంబు

కాశిఁ బెడఁ బాయనని యేను గదలకుండఁ

గాశిఁ బెడఁబాపె దైవంబు కరుణలేక

శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


53. షేవింగ్

ఏమిటిరా మొఖమంతా గాటులు

ఏమిలేదు నేను షేవింగ్ చేసుకొనేటప్పుడు

ఇంట్లో సమస్సలు అన్ని చెపుతుంది మా ఆవిడ

అంటే తలకా తిరిగిపోతుంది  గాటులు రాక ఎమివస్థాయి 


54. అంతా శూన్యం

పెద్ద విషయాలను ఆలోచించాలని అనుకోకు

ఆలోచన రావటమే పెద్ద విషయం

ఆలోచనవస్తే అంతా శూన్యం 


55. రైట్

టీచెర్: ఏ  ప్రస్నకు సమాధానము రైట్ గా వ్రాయలేదు ఎందుకు  రాము

రాము: ఐతే ఆప్రస్నకు లెఫ్ట్ వ్రాస్తాను ఇవ్వండి  



నేటి ఛందస్సు కవిత (2 ) భందముఖే

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


కాలము ఏది అందముకు   

గాళము ఏది పొందుటకు 

గొళ్ళెము ఏది బీగముకు 

గంధము ఏది భందముఖే 


ఆకలి యేది పంతముకు 

వాకిలి ఏది పోరులకు 

రోకలి ఏది పోటుటకు 

తాకిడి ఏది భందముఖే 


ఆశయ మేది ఆకలికి 

శాసన మేది పోషణకి 

మాటయు ఏది పొంతనకి 

కాలము ఏది భందముఖే 


తాపము లేదు మౌనముకు 

వాటము లేదు వంతెనకు 

వాదము లేదు పంతముకు 

భేదము లేదు భందముఖే


సాధన లేదు బాధ్యతకు 

శోధన లేదు వేదనకు 

వాదన లేదు వైద్యముకు 

ఛేదన లేదు భందముఖే


సమ్మతి పొందు తప్పదులె 

నమ్మిన చేదు ఒప్పునులె 

కమ్మిన  ఆశ ముప్పునులె 

వద్దన లేను  భందముఖే


నాలో నేను ... తేటగీత పద్యాలు (2 )

రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


నేనెవరు అనే ప్రశ్నను వేసు కుంటె 

నేను శాశ్విత ముక్తుడు అనియు అన్న 

ఉనికి ఏమిటో తెలియని మనసు ఖాళి 

అప్పుడు మనసు తేలిక ఊహ లల్లు 

 

మనము దేనిని అనుకుంటె అదియె గుర్తు 

రామ అనుకుంటె రాముడు గుర్తు కొచ్చు 

కృష్ణ అనుకుంటె గీతయు గుర్తు కొచ్చు 

సృష్టి లోని త త్వాలకు ఇదియె గుర్తు 


నియమితము గాను ఆహారములను తీస్కొ

నియమ అభ్యాస ముమనిషి శుద్ధియగును 

ప్రాణ వృత్తి ప్రవృత్తియు కదిలి ఉంచు 

బుద్ది వలననే పాపక్షాళనము జరుగు 


భార్య భర్తకు వండి పెట్టినను తృప్తి 

భర్త ఆర్జన చేసియు తృప్తి నిచ్చు 

సంపదయు మనుషుల బుద్ధి మారకుండు 

లోక మాయకు శ్రేయస్సు లొంగి ఉండు 

--(())--

నేటి తేటగీతి పద్యాలు ... నాలో నేను (3)
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

విద్య నొసగిన ఫలములు విచ్చు చుండు
యిలలొ ఫలమేగ ధనముచే రుటయు తృప్తి
ధనము దండిగ కూర్చిన దాత అనును 
గర్వ ము చేరియు కన్నులు కాన కుండు

పరిణయపు సమయ సమయాలన్ని చేరు
సమయ సందర్భాలు మనసు కలత చెందు
పతికి సేవలు చేసియు బతుకు వనిత
సతికి సహకార సహనము చూపు భర్త

ఊహలు తెలిపె కౌమార దశయు మేలు
విధి విహారం మనసునకు మేలుచేయు
వీధిని పడక నిజము తెల్పుటయు మేలు
కళలు చూపియు బతుకించు టయును మేలు

తప్పటడుగుల నడకలు తిప్పలొచ్చు
ముందు వేసేటి అడుగుయే బతుకు మార్చు
తోడు నీడల వెలుగులు మార్పు తెచ్చు
తల్లి తండ్రుల సేవ సుతులకు మేలు

అమ్మ ఒడియు హృదయ వెత లన్ని తొలగు
వేదనల భాద వచ్చిన మనసు మార్చి
అమ్మ సహకార మిచ్చియు ఆదు కొనుట
ప్రకృతి ధర్మము పెద్దల్ని చూచు మేలు
--(())__

నాలో నేను .. ప్రాంజలి ప్రభ (4 )

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


సప్త వర్ణ సుశోభితం జీవితమ్ము 

చేతి రేఖలు మారుట సహజ మేను

మనసు సౌందర్యము ను పంచు భావ ముండె 

మది వివవశమౌ రీతిన బతుకు సాగె 

  

ప్రకృతి ఒడిలోన నలిగియు ఉన్న నేను 

కళలు బతికించు మార్గము తెలవ కున్న 

సందడియు చేయు చున్నను ఫలిత మేది

పచ్చ పచ్చని చెట్లను పెంచు చున్న 

  

మాయ తెలిసిన భయమేది ఉండకుండు 

తెలిసి తెలియని వానికి ఉండు చుండు 

లేని దాన్ని ఊహించు ట మాయ తెలుపు 

మాయవల్లే గురువుల తో పనియు జరుగు 


నీరు కదులుచు సంద్రము చేరు చుండు 

వేరు భూమిన నీటిని త్రాగుచుండు 

వారు నీటిని అమ్మిన బాధ పొందు 

బుద్ధి నిలకడ నీరులా కదులు చుండు 


అలల నురుగులా అజ్ఞాన ముండ కుండు 

అన్య ఆలోచన అజ్ఞాన మువ్వు చుండు 

ఏక మవుబుద్ధి జ్ఞానము పెంచు చుండు 

వేరు వృక్షము గామారి గాలి పంచు  


ఎదురు వచ్చు ప్రత్యక్ష కనులు కలుగు 

ఎవరు పరోక్ష వాక్కులు వినుట వద్దు 

దర్శనములేని అపరోక్ష మేను మేలు 

నేను పరోక్ష ప్రత్యక్ష మధ్య నలుగు 

  

ఒకరి కొకరుగా విలువలు పంచు కుంటు 

ఒకరి వెంట తోడుగ నుండి కష్ట నష్ట 

ములను సంతృప్తి గా అనుభ వించు చుండు 

ఆడియె భారత సంతతి గొప్ప తనము 


ఎవరికి ఎవరు తోడు అనక యె అలసి 

కలసి మెలసియు ఒక్కరుగాను ఉండి 

ఒడిదు డుకుల నుజయించి నిర్మలమ్ము 

గాను సంతసములు తెల్పు సహన జీవి 


నాలో నేను ... ప్రాంజలి ప్రభ (5 )

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ధర్మ మునగాను మనసును ఇచ్చి ఉండి  

ధర్మ సాక్షికి ప్రేమను పంచు చుండి  

కన్య దానము కర్మను సరియు చేసి  

ఇరువు రిని ఏక పరుచుట ధర్మ మౌను 


భార్య భర్తను, భర్త భార్యను కలియుట

సహజ ధర్మము, విడవని భంద మున్ను 

నమ్మకముగాను ఓదార్పు గాను ఉండి 

సుఖము అందించి పొందుట ధర్మ మౌను 

        

మిత్రుని కలసి సహనము చూపు చుండి 

సానుకూలము చేయూత నిచ్చి యుండి 

కష్ట నష్టములకు సహకార ముండి 

విడువలేని భందముగాను చెలిమి ఉండు    


పురుష అహమును వదలియుఁ నిత్య కర్మ 

సత్పురుషుని స్వధర్మాను సరిగ ఉండి 

బుద్ధి కుశలత భార్యను గౌరవించి 

ఓర్పు ఓదార్పు చూపేటి చెలిమి ఉంచు     


చదువు కున్నట్టి సాహిత్య సామ రస్య 

ధోరణిగ సకలము విద్య బోధ చేసి 

ధరణి తలముపై ధర్మము తెలియ బరచి 

గురువు బాధ్యత దేశము నందు ఉండు 

   

నాలో నేను ... ప్రాంజలి ప్రభ (6 )

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

         

పసితనం జ్ఞప్తి లేదును నిలయ మందు 

బాల్య ములొ ఆట పాటలు నేర్చినాను 

యవ్వనములోన ఆకర్షణ లకు లొంగి 

ఏది తెలుసుకో లేనట్టి వయసు దుడుకు 


నిన్ను తలవని మనసుతో జీవితమ్ము 

యవ్వన దుడుకు పెళ్ళికి దారితీసె 

పెళ్లితో మొదలయ్యేను సుతులు పెరిగె 

నిన్ను తలవని బుద్ధిని కరుణ చూపు 


చెప్పిన పలుకు నిలుపుకో హాయి గుండు 

నేను మానవతాధర్మ ములను  నిలిపి 

ఉన్న దానితో సంసార సుఖము పంచి 

వృత్తి ధర్మాన్ని అనుకరించి దయ చూపు 

 

బిడ్డలుగ తల్లి తండ్రుల సేవచేసి 

ఎట్టి బాధ కలుగకుండ చూసి యుండి 

అవసరసహకా రముచేసి సహకరించి 

కన్న వారిపే రుప్రతిష్టలను చూసె 


అమ్మ అనుటలో ఆప్యాయత కని పించు 

నాన్న అనుటలో నమ్మకము కనిపించు 

తాత అనుటలో తన్మయత్వమని పించు 

బామ్మ అనుటలో అభిమాన దయయు పంచు 

 

అత్తను అనుట ఆదరణ మనసే  అనిపించుఁ 

మామను మనుట లోననే మమకార  ముకని పించు 

అన్న అనుటలో అభయము ఆదర్శ మనుటయేను  

చెల్లికి చేయూత ఇచ్చుట అనుటలో చులకనొద్దు    


అక్కను అనుట లోననే అనురాగ మనిపించు 

బావలో భావ మనుటలో ప్రేమత్వ ము కనిపించు 

మరదలు అనుట మర్యాదలు కనిపించు 

మరిది అనుటలో మానవత్వముయు చూపు 


విద్య చోరులు దోచుకో లేని దగును 

విద్య రాజ్యాల  పాలన చూపు దగును 

విద్య పంచుకో లేనిస్థిర మగు ఆస్తి 

విద్య ప్రయాణ బరువుగ ఉండ నిదియు 


విద్య క్రమక్రమముగాను పెరుగు ధనము 

విద్య పంచిన కొద్దియు పెరుగు ధనము 

విద్య తరిగేది కాఁదుపెరుగుచు ఉండు 

విద్య నాటికీ నేటికీ బలము పెంచు      

    

--(())--

     


*శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ గౌరీదశకం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩

   

*శ్రీ గౌరీ దశకము*

*ॐॐॐॐॐॐॐॐॐॐॐ*


*1)లీలారబ్ధస్థాపిత లుప్తాఖిలలోకాం !!*


*లోకాతీతైర్యోగిభిరన్త శ్చిరమృగ్యామ్ !!*


*బాలాదిత్య శ్రేణిసమాన ద్యుతిపుంజాం !!*


*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*


*తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్య సమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను.*




*2) ప్రత్యాహార ధ్యానసమాధిస్థితి భాజాం!!*


*నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్!!*


*సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం!!*


*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*


*ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అను యోగముల నాచరించు యోగుల మనస్సు నందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మ రూపములోనున్నదీ, పద్మముల వంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*




*3)చన్ద్రాపీడానన్దిత మన్దస్మితవక్త్రాం !!*


*చన్ద్రాపీడాలంకృత నీలాలకశొభామ్ !!*


*ఇంద్రోపేంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం !!*


*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*


*చంద్రచూడుడగు శివునిచే ఆనందింప చేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*




*4) ఆదిక్షాన్తా మక్షరమూర్త్యా విలసన్తీం!!*


*భూతేె భూతే భూతకదంబ ప్రసవిత్రీమ్!!*


*శబ్దబ్రహ్మానంద మయీం తాం తటిదాభాం!!*


*గౌరీమంబామంబురుహాక్షీమహమీడే !!* 


*’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మ స్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించు చున్నాను.*




*5)మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం !!*


*సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్ !!*


*యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం !!*


*గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే !!*


*సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాధారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పింగళా' నాడుల యందు విహారించునదీ, తేజోమూర్తి యైనదీ, సూక్ష్మమైన పదార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించు చున్నాను.*




*6)నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః !!*


*సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ !!*


*విశ్వత్రాణక్రీడన లోలాం శివపత్నీం !!*


*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*


*నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి,ప్రపంచ రక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించు చున్నాను.*




*7) యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం !!*


*భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ !!*


*పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం !!*


*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*


*గౌరీదేవి గర్భము నందున్న సమస్త లోకములు మరల మరల పుట్టు చుండును. లీనమగు చుండును. భర్తతో కలిసి వెండి కొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబ యైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*




*8)యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా !!*


*సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ !!*


*తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం !!*


*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*


*చరాచర రూపమైన ఈ ప్రపంచమంతయు,దారము నందు మణులవలే గౌరీ దేవియందు  అల్లుకుని ఉన్నది. అధ్యాత్మజ్ఞాన మార్గముచే తెలుసుకొనదగినదీ,పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*




*9)నానాకారైః శక్తికదమ్బైర్భువనాని !!*


*వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా !!*


*కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం !!*


*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*


*గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించు చున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మముల వంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*




*10)ఆశాపాశక్లేశవినాశం విదధానాం !!*


*పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్!!*


*ఈశామీశార్ధాఙ్గహరాం తామభి రామాం!!*


*గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే !!*


*తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశముల వలన కలుగు బాధలను నశింప చేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.*




*11)ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా- !!*


*ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః !!*


*వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం !!*


*తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి !!*


*ఎవరైతే శుద్ధమైన హృదయమును కలవారై భక్తితో ప్రాతః కాలము నందు ఈ గౌరీ దశకమును స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.*


*!!జయ జయ శంకర !! హర హర శంకర !!*


🕉🌞🌏🌙🌟🚩

॥ శ్రీ శంకరాచార్య కృతః సువర్ణ మాలాస్తుతిః ॥

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

1) అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో ।

 సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ! నీ గుణములలో కొన్నిటితో ఏదో విధముగా నానాలుకను పవిత్రము చేసెదను. జగన్మాతతో కలిసిఉన్నవాడా! ఎల్లపుడూ శుభము నిచ్చువాడా! శంభో! మంగళము కలుగచేయువాడా! నీ చరణ యుగళము నాకు శరణము.

2) ఆఖణ్డల మదఖణ్డనపణ్డిత తణ్డుప్రియ చణ్డీశ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఇంద్రుని మదమనణుచుటలో నిపుణుడైన నందీశ్వరునకు ప్రియమైనవాడా! చండీశుడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

3) ఇభచర్మామ్బర శమ్బరరిపువపురపహరణోజ్జ్వలనయన విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

గజ చర్మము ధరించినవాడా! శంబరుని శత్రువగు మన్మథుని దహించిన ఉజ్జ్వల నేత్రముగలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

4) ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

లోకములను పాలించువాడా! కైలాసముపైనుండు వాడా! మానవుల నేలువాడా! పరాశక్తికి పతియైనవాడా! మహేశా! సర్పాభరణములు కలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

5) ఉమయా దివ్యసుమఙ్గలవిగ్రహయాలిఙ్గితవామాఙ్గ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

దివ్యమణ్గళ విగ్రహముకల పార్వతిచే ఆలింగనము చేయబడిన శరీరపు ఎడమభాగము కలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

6) ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ స్వామీ! తెలివిలేనివాడను మరియు అనాథను అగు నన్ను దరిచేర్చుకొని నా పాపములను దూరం చేయుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

7) ఋషివరమాన సహంస చరాచర జననస్థితిలయకారణ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఋషిశ్రేష్టుల మానసములో చరించు ఓ హంసమా! చరాచరముల జననము, స్థితి మరియు లయలకు కారణమైనవాడా ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

8) ౠక్షాధీశకిరీట మహోక్షారూఢ విధృతరుద్రాక్ష విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

నక్షత్రనాథుడగు చంద్రుని కిరీటముపై ధరించువాడా! మహావృషభము నధిరోహించినవాడా! రుద్రాక్షలు ధరిమ్చినవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

9) ఌవర్ణద్వన్ద్వమవృన్తసుకుసుమమివాఙ్ఘ్రౌ తవార్పయామి విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ! తొడిములులేని మంచి పుష్పములవలే ఉన్న ఌ, ౡ అను అక్షరములను నీపాదమునందు సమర్పించుచున్నాను. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

10) ఏకం సదితి శ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ శివా! " ఏకం సద్విప్రాబహుధా వదన్తి"( ఒకే పరమాత్ముని విజ్ఞులు బహువిధములగా వర్ణించుచున్నారు) అను శృతిలోని సుద్రూపము ( పరమాత్మ) నీవే అని ఉపాసించు చున్నాము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

11) ఐక్యం నిజభక్త్యేభ్యో వితరసి విశ్వమ్భరోఽత్ర సాక్షీ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ ప్రభూ! నీ భక్తులను నీలో ఐక్యము చేసుకొనుచున్నావు. దీనికి విశ్వంభరుడగు నీవే సాక్షి. ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

12) ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయాఽస్మాకం మృడోపకర్త్రీ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

సుఖకరుడవగు ఓ దేవా ! మాయాస్వరూపమైన ఓంకారము నిన్ను నిర్దేశించుచూ మాకు ఉపకారము చేయుచున్నది.ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

13) ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగమ్బరతా చ తవైవ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ ! నీ దిగంబరత్వము నీకు సుఖముల పట్ల ఉదాశీనతను స్పష్టము చేయున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

14) అన్తఃకరణవిశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ! చిత్త శుధ్ధిని మరియు నీయందు స్థిరభక్తిని ప్రసాదించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

17) అస్తోపాధి సమస్తవ్యస్తై రూపైర్జగన్మయోఽసి విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ ప్రభూ! నిరాకారుడ వైననూ నీవు చరాచరములు రూపములతో ప్రపంచమమ్తా నిండి ఉన్నావు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

18) కరుణా వరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో న హి భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ కరుణాసముద్రుడా! దాసుడనైనా నాపై నీవు ఔదాసీన్యము వహించుట ఉచితము కాదు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

16) ఖలసహవాసం విఘటయ సతామేవ సఙ్గమనిశం భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ స్వామి! నాకు దుష్టసహవాసమును తెగగొట్టి సజ్జనమైత్రిని సదా కల్పించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

18) గరళం జగదుపకృతయే గిలితం భవతా సమోఽస్తి కోఽత్ర విభో । 

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ ప్రభూ! ప్రపంచమునకు ఉపకారముచేయుటకై నీవు విషము మింగితివి. నీతో సమానుడెవడు? సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

19) ఘనసార గౌరగాత్ర ప్రచుర జటాజూటబద్ధగఙ్గ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥ 

ఓ ప్రభూ! ముద్దకర్పూరము వలే తెల్లని శరీరము కలవాడా! దట్టమైన జటాజూటముతో గంగను ధరించిన వాడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

20) జ్ఞప్తిః సర్వశరీరేష్వఖణ్డితా యా విభాతి సాత్వం భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ స్వామి ! శరీరములన్నిటిలో ఒకటిగా వెలుగొందు చైతన్యము నీవే. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

21) చపలం మమ హృదయకపిం విషయద్రుచరం దృఢం బధాన విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ! ఇంద్రియ సుఖములచే చెట్టుపై సంచరించు చపలమైన నా హృదయమనే కోతిని ధృఢముగా బంధించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

22) ఛాయా స్థాణోరపి తవ పాపం నమతాం హరత్యహో శివ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ స్వామి! నీవు స్థాణువు అని పిలువబడుచున్నావు. (స్థాణువనగా స్థిరమైనవాడు మరియు కొమ్మలు లేని మోడు అని రెండర్థములు) ఐననూ నీనీడ భక్తులు సంతాపనము పోగొట్టుచున్నది. ఓ సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

23) జయ కైలాసనివాస ప్రమథగణాధీశ భూసురార్చిత భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ! కైలాశ నివాసా! ప్రమథ గణాధీశా ! బ్రాహ్మణులచే పూజింపబడువాడా! నీకు జయమగుగాక. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

24) ఝణుతకఝిఙ్కిణుఝణుతత్కిటతకశబ్దైర్నటసి మహానట భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

నటరాజువగు ఓ దేవా ! ఝణుతక ఝంకిణు ఝణుతత్కిటకిట అను తాళధ్వనితో నీవు నటించుచున్నావు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

25) జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురూస్త్వమేవ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ ప్రభూ! చాంచల్యములేని స్థిరమైన జ్ఞానమునుపదేశించుము. నీవే గురువవు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

టఙ్కారస్తవ ధనుషో దలయతి హృదయం ద్విపామశనిరివ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ స్వామీ! నీ ధనుష్టంకారము పిడుగువలే శత్రుహృదయమును భేదించుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

27) ఠాకృతిరివ తవ మాయా బహిరన్తః శూన్యరూపిణీ ఖలు భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ దేవా ! ఠ అను అక్షరము వలే నీ మాయ బయట మరియు లోపల శూన్యముగా ఉన్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

*28) డమ్బర మమ్బురుహామపి దలయత్యనఘం త్వదఙ్ఘ్రియుగలం భో । *

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ స్వామీ! నీ పాదముల జంట పాపమనే బురద అంటనిదై పద్మముల ఆడంబరమును అణుచుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

29) ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కర భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఢక్క, రుద్రాక్షమాల, శూలము మరియు బ్రహ్మకపాలములతో విరాజిల్లు హస్తములు కల ఓ స్వామి! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

30) ణాకారగర్భిణీ చేచ్ఛభదా తే శరణగతిర్నృణామిహ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ స్వామీ! ’ణ’ అను అక్షరము మధ్యలో ఉన్న నీ బాణగతి ఈ లోకములో మానవులకు శుభమునిచ్చుచున్నది. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

31) తవ మన్వతిసఞ్జపతః సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ దేవా! నీ మంత్రములు ఎక్కువగా జపించుటవలన మానవుడు సంసారసాగరమును తరించుచున్నాడు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

32) థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ! నీ నామము జపించనివాడి ముఖము "థూత్" అని చీత్కరించబడుగాక.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

33) దయనీయశ్చ దయాళుః కోఽస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ స్వామీ! నీ కంటే దయకలవాడు మరియు నా కంటె దయనీయుడు ఈ లోకములో ఎవరున్నారు? సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

34) ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష గురో దక్షయజ్ఞశిక్షక భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ దేవా ! ధర్మస్థాపనలో సమర్ధుడా! ముక్కంటీ ! గురువైనవాడా! దక్షయజ్ఞనాశకుడా!సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

35) ననుతాడి తోఽసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ ! బుధ్ధిమంతుడైన అర్జునునిచే నీవు పూర్వము ధనస్సుచే కొట్టబడితివి.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

36) పరిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోఽసి విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ ! బ్రహ్మదేవుడు కూడా నీ స్వరూప మిటువంటిదని వర్ణించలేడు. కనుక నీవు శ్రేష్టములైన వాటి కంటే శ్రేష్ఠుడవు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

37) ఫలమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనేశ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ! సనాతనుడైన ఈశ్వరా! ఈ లోకములో మానవునిగా జన్మించినందుకు ఫలము నీ పాద సేవయే. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

38) బలమారోగ్యం చాయుస్త్వద్గుణరుచితాం చిరం ప్రదేహి విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ! బలమును, ఆరోగ్యమును, ఆయుష్షును, నీ గుణములందు ఇష్టమును చిరకాలము అనుగ్రహించుము. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

39) భగవన్ భర్గ భయాపహ భూతపతే భూతి భూషితాఙ్గ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ భగవంతుడా! శివుడా ! భయమును పోగొట్టువాడా! భూతపతీ! విభూతితో అలంకరించబడిన శరీరము కలవాడా ! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

40) మహిమా తవ నహి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

పార్వతీ పతియైన ఓ స్వామీ ! నీ మహిమ వేదములలో ఇముడుటలేదు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

41) యమనియ మాదిభిరఙ్గైర్యమినో హృదయే భజన్తి స త్వం భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ స్వామీ ! యతులు నిన్ను యమనిమాది అష్టాంగములతో తమ హృదయములో సేవించుచున్నారు.సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

42) రజ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగన్తి భాన్తి విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ ప్రభూ ! తాడుతో పామువలే మరియు మృత్యువు చిప్పలో వెండివలే నీలో ఈ జగత్తులో ఆ భాసించుచున్నవి. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

43) లబ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ దేవా! నీ అనుగ్రహముతో చక్రాయుధమును పొంది విష్ణుమూర్తి లోకములన్నిటినీ రక్షించుచున్నాడు. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

44) వసుధాతద్ధరచ్ఛయరథమౌర్వీశరపరాకృతాసుర భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

ఓ స్వామీ! భూమిని రథముగానూ, సర్పమును వింటి త్రాడుగానూ, విష్ణువును బాణముగానూ చేసుకొని త్రిపురసంహారము చేసితివి. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

45) శర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వత్తగర్వహరణ విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ సర్వరూపీ ! దేవా! సర్వోత్తమా! అన్నిటినీ ప్రసాదించువాడా! దుష్టుల గర్వమును హరించువాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

46) షడ్రిపుషడూర్మిషడ్వికారహర సన్ముఖ షణ్ముఖజనక విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

కామము- క్రోధము - లోభము- మోహము -మదము- మాత్సర్యము అను ఆరు శత్రువులను, అట్లే ఆకలి- దప్పిక- శోకము- అజ్ఞానము- ముసలితనము- మరణము అను ఆరు కష్టములను, మరియు ఉండుట- పుట్టుట- పెరుగుట- క్షీణించుట- నశించుట అను ఆరు వికారములను హరించువాడా! సుందరముఖుడా! షణ్ముఖుని జనకుడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

47) సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మేత్యేతల్లక్షణలక్షిత భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

" సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" అను వాక్యముచే తెలియజేయుబడువాడా! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

48) హాహాహూహూ ముఖసురగాయకగీతాపదానవద్య విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

హాహా హూహూ మొదలైనదేవగాయకులు పొగడు కీర్తి గలవాడా! ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

49) ళాదిర్న హి ప్రయోగస్తదన్తమిహ మఙ్గలం సదాఽస్తు విభో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ॥

"ళ" అను అక్షరముతో ఏ పదమూ మొదలవదు.ఆ అక్షరం చివరగా ఉన్న ’మంగళం’ ఎల్లప్పుడూ కలుగుగాక. ఓ ప్రభూ! సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

50) క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకః శివ భో ।

సామ్బ సదాశివ శమ్భో శఙ్కర శరణం మే తవ చరణ యుగమ్ ॥

ఓ స్వామీ! నీ పాదసేవామహోత్సవము నందు ఉత్సాహము కలవాడు దినములను క్షణమువలే గడుపును. సాంబా! సదాశివా! శంభో! శంకరా! నీ చరణ యుగళము నాకు శరణము.

॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతః సువర్ణమాలాస్తుతిః సమ్పూర్ణః ॥

--00((--


Swami Vivekananda's wisdom for daily inspiration 

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి .

Unselfishness is more paying, only people have not the patience to practise it.

స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.


Inspiring Sayings of Swami Vivekananda / స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.

Great enterprise boundless courage, tremendous energy and, above all. perfect obedience - these are the only traits that lead to individual and national regeneration.

అఖండమైన ఉత్సాహం, అప్రతిహితమైన ధైర్యం, అప్రతిహితమైన శక్తి... అన్నింటినీ మించి పరిపూర్ణ విధేయత - ఈ లక్షణాలే ఒక వ్యక్తినిగాని, ఒక దేశాన్నిగాని పునరుజ్జీవింప చేయగలవు.

 భాగవతము ... శ్రీగురుభ్యోనమః

5. శివుడు - నియుత్తు. శివశక్తి  దేనినైనా నియమించగలదు. శివారాధన చేసేవాడు దేనినైనా నియమించే శక్తి గలవాడుగా ఉంటాడు. తనను తాను నియమించుకోగలిగిన వాడే ఇతరులను నియమించగలడు. ఈ శక్తి శివుడిస్తాడు.

నియుత్తు అంటే చక్కగా వినియోగించడం.నియుత్తు తెలిసినవారికి ఎవరికి, ఏవిషయమందు, ఏరకముగా నియుత్తం చేయాలో తెలుసు. అలా కానప్పుడు తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మొత్తము సృష్టిలో సమస్తమైన వనరులను లేక శక్తిని చక్కగా సద్వినియోగము చేసే శక్తిగా 5 వ రుద్రుడు పని చేస్తుంటాడు.

 శ్రీరమణీయం - (726)

"భావం ఆత్మసాక్ష్యాత్కారానికి ఏవిధంగా అడ్డు అవుతుంది !?"

మనిషిలో ఏర్పడే తొలి భావమే నేను అనే తొలి తలపుగా ఉంది. ఆ భావమే ఆత్మసాక్షాత్కారానికి అడ్డుగా ఉంది. అయితే ప్రపంచంతోనూ, మన కష్టసుఖాలతోనూ మనను అనుసంధానం చేసేది భావమే. భావం అంటే మనో సంభాషణ. ఒక జంతువుకు దాహం వేస్తే వెళ్ళి నీరు త్రాగుతుంది. అదే మనిషి అయితే దాహం వేయగానే 'దాహంవేస్తోంది' అని అనుకుంటాడు. ఇలా అనుకునే మనో సంభాషణే భావం అంటే. అది బయటికి చెబితే భాష అవుతుంది. అంటే లోపల భావంగా ఉన్నదే బయటకు భాషగా వ్యక్తమౌతుంది. భాషకు ముందు మనసులో జరిగే సంభాషణే భావం. జంతువుకు దాహం తీర్చుకోవడానికి సహజ ప్రేరణ సరిపోతుంది. ఏ భావంతో అవసరంలేదు. దానికి ఏ భావం లేదు కనుకనే 'నేను' అనే భావం కూడా రాలేదు. ఇప్పుడు మనం భావాలతో ఉన్నాం కనుక నేను దేహాన్ని, నేను ఫలానా అని అనుకుంటూ ఉంటాం. ఆత్మసాక్షాత్కారం అంటే నేను ఆత్మను అని అనిపిస్తుందేమోనని అనుకుంటాం. కానీ అలాకాదు. ఆత్మసాక్షాత్కారం అంటే తాను దేహం అనిగాని, ఆత్మనని గానీ అనుకోని స్థితి. అది అసలు అనిపించడమే లేని స్థితి. నిద్రపోయేవాడు తాను నిద్రపోతున్నాను అనుకుంటున్నాడంటే తను నిజంగా నిద్ర పోవటం లేదని అర్థం. అలాగే ఆత్మానుభవం పొందినవాడు నేను దేహాన్ని అనుకోన్నట్లే నేను ఆత్మ స్వరూపుడిని అని కూడా అనుకోడు. ఏదీ అనుకోకుండా ప్రకృతి ప్రేరణతో కదులుతాడు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"

"భగవదానుభవానికి భావ దూరంలోనే ఉన్నాము !''- (అధ్యాయం -89)

 "ఋభుగీత "  (193)

సర్వసిద్ధాంత సంగ్రహము

14వ అధ్యాయము

సత్యం అర్థమైతే ఇక బంధమోక్షాలతో నిమిత్తం లేదని తెలుస్తుంది !!

వేదాంతంలో సాధన, శోధన... అంతా మనసే. దాని సమస్త కదలికలు అర్థం అయితే అనుక్షణం ఆత్మే మనసుగా ఎలా చరిస్తుందో, మనసే ఆత్మగా ఎలా నిలుస్తుందో అర్థమవుతుంది. మనసులోని ప్రియత్వం గానీ, ప్రపంచహీనత్వం గానీ రెండూ ఆత్మ స్వభావాలేనని తెలుస్తుంది. దేహవివర్జితము అంటే దేహంలేదని గుర్తించమనే కానీ, దేహాన్ని విస్మరించమని కాదు. నేను అనేది దేహం కారణంగా తెలుస్తున్నా అది కేవలం దేహానికే పరిమితమైందని కాదని తెలిస్తే మనం దేహవివర్జితులం ఎలా అవుతామో అర్థమవుతుంది. అలాగే మనం దేహవివర్జితులమన్న సత్యం అర్థమైతే ఇక బంధమోక్షాలతో నిమిత్తం లేదని కూడా తెలుస్తుంది ! 

 🌷85-మంద్రగీత🌷అధ్యాయము-7

🥀 శాస్త్రవిజ్ఞానము🥀

5. ఈ ఎనిమిది ప్రకృతులు నా ప్రకృతి అనబడు తొమ్మిదవ దాని యందు పలకలపై సున్నాలు చుట్టినట్లు వర్తించుచున్నవి. ఈ తొమ్మిదవది పరాప్రకృతి లేక ఉత్తమ ప్రకృతి. మిగిలిన ఎనిమిదియు దీనినుండి వేరై వర్తించి దీనిలోనికి ప్రవేశించుచున్నవి. ఈ తొమ్మిదవ ప్రకృతి యందు, దానికన్న మొదటి వాడుగ నేనుందును. నేనే దాని యందు జీవుడుగ దిగివచ్చుచున్నాను, కనుక దీనికి నేను మొదటి వాడను. సృష్టిగా పదవ వాడను. ఈ విధముగా నేను దిగి వచ్చుట పది అంకెలలో జరుగుచున్నది.

తొమ్మిదవ ప్రకృతి జీవము అనబడును. దానిచే ధరించి పోషింపబడి మిగిలిన ఎనిమిదియు జీవులు అగుచున్నవి.

6. ఈ తొమ్మిదియు నా ఉత్పత్తి ద్వారములు అని ఎరుగుము. అవే అంకెలు. వాని యందు నేనుందును, వాని ఉత్పత్తి, లీనము నేనే!

7. నాకన్నా పైన ఇంకేమియు లేదు. నా యందు ఈ తొమ్మిదియు దారమునందు పూసలవలె కూర్చబడియున్నవి. కన్ను, ముక్కు, చెవి, మనస్సు, బుద్ధి నావి అనబడును. మానవుడు నా మనస్సు అని వ్యవహరించుటలో "నా" అను దారమునకు ఇవి అన్నియు గ్రుచ్చబడి ఉన్నవని తత్వము.

 98) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

షష్టము: చిత్రదీప ప్రకరణము

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

యథా చిత్రపటే దృష్టమవస్థానాం చతుష్టయమ్ ౹ పరమాత్మని విజ్ఞేయం తథాఽ వస్థాచతుష్టయమ్ ౹౹1౹౹

1.  చిత్రపటములు చిత్రీకరించుటయందు నాలుగు అవస్థలను మనము గమనించినట్లే పరమాత్మపై జరుగు జగద్రచన యందు కూడా నాలుగు అవస్థలను తెలియవలెను.

వాఖ్య:అవ్యక్తము అంచిత్యము అగు బ్రహ్మమునకు బదులు ఇంద్రియ గోచరము అపారవైవిధ్య సంపన్నము అగు ఈ జగత్తును మనము చూచుచుండుట ఎట్లు జరుగుచున్నది?

ఆరోపించుట వలన.

తెల్ల కాగితముపై గాని వస్త్రముపైగాని వివిధ వర్ణములను ఆరోపించుట వలన మనము ఇక కాగితమును గాని వస్త్రమును గాని చూడము.

వానిపై ఆరోపించబడిన పర్వతములను నదులను వృక్షములను ప్రాణిజాతమును చూచుచు

 "ఎంత మనోహరమైన చిత్రము"

అని ఆనందించుచు మైమరచి పోవుదుము.

శ్రద్ధాయుతమగు వివేచన వలనగాని ఆ చిత్రమంతా శుద్ధ వస్త్రము పైని రంగురంగుల విన్యాసమే అని మనస్సునకు తోచదు.అట్లే జనన మరణములు జరావ్యాధులు సుఖదుఃఖములతో నిండి మనలను సమ్మోహపరచు ఈ జగత్తు కూడా శుద్ధము ఆనందస్వరూపము అగు బ్రహ్మముపై ఆరోపింపబడిన అజ్ఞానపు విన్యాస వైచిత్ర్యమే.

వస్త్రమును రంగులను వివేచించినట్లే బ్రహ్మమును అజ్ఞానవికారములను వివేచించి తత్త్వమును తెలియవలెను.

ఈ రెండు ప్రక్రియలకే 

అద్వైత శాస్త్రమున

"అధ్యారోపము-అపవాదము"అని పరిభాష.

జగద్రచనలో శుద్ధ బ్రహ్మము, అంతర్యామి,సూత్రాత్మ ,విరాట్టు అను నాలుగు అవస్థలు గలవు.

అధ్యారోప అపవాదమును 

శంకర భగవత్పాదులు ఇలా చెప్పుచున్నారు-

"బ్రహ్మమునందు దేహేంద్రియాది ప్రపంచమున్నదని ఆరోపణచేసి అటుపై అపవాదము అనగా ఇదిగాదు ఇదిగాదు అని నిషేధించగా ఆత్మ తత్త్వము తెలియబడుచున్నది".

ఈ విధముగా ఆత్మయందు లేక బ్రహ్మమునందు ఆరోపింపబడిన జగత్తు సత్యముగాదు.శుక్తియందు రజితమువలె,రజ్జువందు సర్పమువలె బ్రహ్మము యందు జగత్తుయున్నది.

ఎంతవరకు స్వస్వరూపమైన బ్రహ్మము తెలియబడదో అంతవరకు ఈ బ్రహ్మమే జగద్రూపముగా తోచుచున్నదేగానీ నిజముగా లేదు.

ఆత్మ తన మాయ ద్వారా తనలో వివిధ ఆకారముల,రజ్జువు పై జూడబడు సర్పాది స్వరూపముల వలె కల్పించు కొనును.కాన ఈ జగత్తు మిథ్యయే.బ్రహ్మము తెలియనందువల్ల కనబడు ఈ జగత్తు సృష్టించ బడినదని చెప్పుట అవివేకి దృష్టి ననుసరించియేగానీ, వివేకిదృష్టి ననుసరించి చెప్పబడలేదు.

--(())--

ప్రాంజలి ప్రభ 

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 


కం. ఒక వర్ష శతంబున నొం


డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము

బొక దివసంబున నానం

ద కాననము నందు సర్వదా సిద్ధించున్! (121)

తా. కాశీ కంటే వెరొక తీర్ధమునందు ఒక నూరు సంవత్సరములకు లభించెడి ప్రయోజనము ఆనందదాయకమైన కాశీ యందు ఒక్క దినమునందే యెల్లప్పుడూ సిద్ధించును.


కం. నేమంబున నొక ప్రాణా


యామంబున నరుడు పడయునట్టి ఫలశ్రీ

సామాగ్రి యొండెడ ముని

గ్రామణి ! సాష్టాంగయోగ గతి గనరు నరుల్! (122)

నేమంబున = నియమముతో; ఒండెడన్ = వెరొక తీర్ధమునందు.

తా.కాశీ క్షేత్రములో ఒక్క ప్రాణా యామము వలన మనుష్యుడు పొందెడి సమగ్ర ఫలసమృద్ధిని అన్య క్షేత్రమునందు అష్టాంగసహిత యోగ మార్గమున కూడా పొందజాలరు.

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


45. బామ్మగారు

బామ్మగారు నెమ్మదిగా నడుస్తూ ఇంట్లోకి రండి

మా అబ్బాయి నునె పారబోసాడు, కాసేపు ఉండండి

సర్ఫు వేసి తుడుస్తా బామ్మతో అన్నది ఆ ఇల్లాలు

పిల్లలు చేసినపని అని కొట్టకండి అంటూ ముందుకు నడిచింది బామ్మగారు

అంటే జారి క్రింద పడింది, నా నడుం ఇరిగినంటుంది కొడకా ....

లోపలనుమ్చి పిల్లవాడి ఒకటే నవ్వు ...............  


46. ఖచ్చితముగా

నువ్వు ఖచ్చితముగా లక్ష రూపాయలు ఇవ్వకపోతే మీ ఆవిడను

చంపేస్తామని  ఫోన్ చేసారు కిడ్నాపర్సు

నేను ఖచ్చితముగా మాట నిలబెట్టుకోలేను

మీరైన ఖచ్చితముగా మాట నిలబెట్టుకొండి అని భర్త చెప్పి ఫోన్ పెట్టేసాడు 


47. కొత్త మోజు

చూడండి వాళ్ళు చిలకా గోరింకలుగా ఉన్నారు అంది భర్తతో భార్య

ఏముందే  మనలో లేని ప్రచ్చేకత వాళ్ళల్లో అన్నాడు భర్త

వాల్లావిడ కోసం కారు తలుపు తెరిచి ఎలా  పట్టుకున్నాడో అంది భార్య

కారు అయినా కొత్తది అయి ఉండాలి, లేదా పెళ్ళైన కొత్త మోజు అయినా

ఉండాలి అన్నాడు భర్త భార్యతో .................. 


48. నాలుగోనెల

అమ్మ నేను ఒక పిల్లవాడిని ప్రేమిస్తున్నాను అంది కూతురు

అబ్బాయి వయసెంతా, ఏమ్చేస్తున్న్నాడు, అని అడిగింది తల్లి

నాలుగోనెల నాపొట్టలో  ఉండి  తంతున్నాడు అంది కూతురూ ..........