Thursday 27 August 2015

ప్రాంజలి ప్రభ - వరలక్ష్మి వ్రతం


                     ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం

                        ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక కధ
                             సర్వేజన సుఖినోభవంతు

శ్రావణమాసంలో అతిముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. లక్ష్మి దేవి ని ఆవాహనం చేసి , మన తాహత మేరకు ఆమెకు ఉపచారాలు చేసి, సౌభాగ్యం, సంపద, అందరి క్షేమం కోసం పూజ చేస్తాం. ఈ వ్రతం రోజు కొందరు కలిశం పెడతారు, ఆ పద్ధతి లేని వారు అమ్మవారి పటానికి పూజ చేస్తారు.

స్కంద పురాణం లో వరలక్ష్మి వ్రతం గురించి పరమశివుడు, పార్వతి దేవికి వివరిస్తారు. చారుమతి యొక్క కదే ఈ వ్రత కధ. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి కి ముందే వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి.

ఏ పూజ మొదలుపెట్టాలన్న, ముందుగా గణపతిని పూజించాలి. ఆ ప్రకారం ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసి, అమ్మణి ఆవాహనం చేయాలి. కలిశా పూజ చేసి అమ్మవారిని ఆహ్వానించాలి. లక్ష్మి అష్టోత్తరం చేసాక, తొమ్మిది ముడులతో కూడిన తోరాలకు తోరపు పూజ చేయాలి. వరలక్ష్మి వ్రత కధ చదివి, అమ్మకి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి, పూజలో పెట్టిన తోరం కట్టుకొని, ముత్తైదువలకు తాంబూలం ఇవ్వాలి. అమ్మవారి ప్రసాదం అందరు తీసుకోవాలి.
వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా పసుపు కుంకుమలకు, సౌభాగ్యానికి ప్రతీక. అమ్మవారి దయను పొందాలని ప్రతి ముత్తైదువ అమ్మవారిని ప్రార్ధిస్తుంది. మనం చేయడమే కాదు, వ్రతం తెలియని వారికి చెప్పి చేయిస్తే మంచి పలితం ఉంటుంది.
అమ్మ వారి పూజలో పెట్టిన తోరమే మనకు శ్రీ రామ రక్షగా ఉండి కాపాడుతుంది.

వరలక్ష్మి మనని వీడిపోకుండా ఉండాలంటే మనం చేయకూడని పనులు అలాగే ఎలాంటి చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అందరిని ఆవరలక్ష్మిదేవి సదా కాపాడాలని, మనస్పూర్తిగాకోరుకుంటూఅందరికి వరలక్ష్మిఅమ్మనికోరుతూ...

వరలక్ష్మీ నమోస్తుతే...వరలక్ష్మీ నమోస్తుతే.!
.
"లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం. శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం ..లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః .. బ్రహ్మేంద్ర గంగాధం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం.. వందేముకుందప్రియామ్"
.
శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అందుచేత శుక్రవారం వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్య దినాన్ని విశేషంగా జరుపుకుందాం..

శ్రీ వరలక్ష్మీ వ్రతం సందర్భం గా మిత్రులు అందరికీ శుభోదయం మరియు శుభాకాంక్షలు......




Sunday 23 August 2015



ప్రాంజలి ప్రభ 
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తిరుమల లో వున్న జయ విజయులు ఎవరు ! 

వైకుంఠథామమున శ్రీ మహావిష్ణు మందిరమునకు కావలివారు జయ విజయులు. ఒకనాడు సనక, సునంద, సనత్క్ మార, సనత్సుజాతులను బ్రహ్మమానసపుత్రులు ఐదే౦డ్ల బాలకులైన శ్రీహరిని జూచుటకు వచ్చిరి. జయవిజయులు వారిని లోనికి బోనియక అడ్డగించారి. వారు బ్రహ్మజ్ఞానులైన మమ్ము మీరు అడ్డగించుట యముకాదనిరి . ఐనను వారు వినలేదు. మునులు వారిని భూలోకంలో రాక్షసులై పుట్టమని శపించిరి. శ్రీహరి వచ్చి విషయము తెలిసుకొని సనకాదులను లోనికి తీసుకుని వెళ్ళేను . 

తరువాత ద్వారపాలకులు మాధవునకు నమస్కరించి నిలిచిరి. విష్ణువు వారినోదార్చి మూడు జన్మము లెత్తి నాకే సంహరింపబడి తరువాత వైకుంఠమునకు వచ్చేదరులేమ్మని చెప్పెను. వారు మొదట జన్మమున హిరణ్యాక్షహిరణ్యకశిపులు, రెండోజన్మమున రావణకుంభకర్ణులు, మూడవజన్మమున శిశుపాల దంతవక్త్రలుగా పుట్టిరి. మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు. ఉన్నది ఒకే మట్టి. అలాగే నురగలు, కెరటాలు, బుడగలు మొదలైన బుడగలన్నీ సముద్ర లక్షణాలు.. కానీ ఆ సముద్రం మాత్రం ఏకైకమైనదే.. ఇదే  తరహాలో "వాస్తవానికి దృశ్య పదార్థాలన్నీ శివ స్వరూపాలే". 

నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న నా రుద్రమూర్తీ ఇవన్నీ ఏకస్వరూపాలే. వీటిలో ఏ బేధం లేదని" విష్ణువుతో పరమేశ్వరుడు తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. దితి ఒకప్పుడు సంతానము గోరి భర్తయగు కశ్యప ప్రజాపతి జేరెను. ఆమెకు హిరణ్యాక్షహిరణ్యకశిపులు కవలపిల్లలుగా జన్మించిరి. వారు బ్రహ్మను గూర్చి ఉగ్రతపము చేసి అనేక వరములు సంపాదించిరి .ఆ వరగర్వముతో లోకములకు పిడ కలిగించుచు౦డిరి. హిరణ్యాక్షుడు మరింతగా లోకములను బాధించుచు తన్నెదిరించువారు కనిపించక వరుణునిమీదకి దండయాత్రకుబోయను. వరుణుడతనిని గెలుచుట తనవలన గాదని గ్రహించి,''నిన్నెదిరించువాడు ఒక్క విష్ణువు కావున వైకుంఠమునకు పొమ్మనెను. వాడు అచటికివెళ్ళి, విష్ణువు యజ్ఞవరాహమూర్తియై రసతలమున నున్నాడని విని అచ్చటికి పోయెను.

Friday 21 August 2015

ప్రాంజలి ప్రభ - తిరుమల వైభవం









   
మిత్రులు శ్రీపరిటాల గోపీకృష్ణ గారు మా "తెలుగుభక్తిపేజీలు" గ్రూపు నందు వ్రాసిన వ్యాసము. 






శుభోదయం!

తిరుమల వైభవం – అన్నమయ్యపదాలలో
శ్రీశైల గరుడాచల వేంకటాద్రి
నాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

అచలం లేక అద్రి అంటే కొండ. శేషాచలం, గరుడాచలం, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే ఏడు పర్వతశ్రేణుల మధ్య, దేవతలు, మునులు, సిద్ధులు, కిన్నర, కింపురుషాదులు విహరించే బంగారు పుడమిపై, ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును, గతి యీతడే చూపె ఘనగురుదైవము’ గా ఆ అఖిలాండనాయకుడు సప్తగిరీశుడై వెలుగొందుతున్నాడు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిపొందిన ఈ తిరుమలగిరి ఒక్కొక్కయుగంలో ఒక్కొక్కపేరుతో ప్రభవించింది.

కృతే వృషాద్రిం వక్ష్యంతి
త్రేతాయాం అంజనాచలమ్
ద్వాపరే శేషశైలతే
కలౌ శ్రీ వేంకటాచలమ్

నామాని యుగభేదేన
శైలస్యాస్య భవంతి హి.

కృతయుగంలో వృషాద్రని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపరయుగంలో శేషాద్రని, కలియుగంలో వేంకటాద్రని ఈ దివ్య క్షేత్రం బాసిల్లుతోంది. ఇక్కడి ప్రతి పర్వతానికి ఒక విశిష్టత, ఒక పురాణగాథ ఉన్నాయి. ‘వేం’ అంటే పాపాలు ‘కటః’ అంటే దహించేది. చూచిన తోడనే మనలోని పాపాలను నశింపచేసే క్షేత్రమే వేంకటాద్రి. ఆదిశేషుడే తన పదివేలతలలపై మోస్తున్న క్రీడాద్రే ఈ శేషాచలము. అటువంటి భూలోక వైకుంఠాన్ని అన్నమయ్య తనివితీరా కీర్తించి గానం చేశాడు.

కట్టెదురు వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయె మహిమలే తిరుమల కొండ ||

వేదములే శిలలై వెలసినదీ కొండ
ఏదెస పుణ్యరాశులే ఏరులైనదీ కొండ
గాదలి బ్రహ్మాదిలో కములకొనల కొండ
శ్రీదేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ ||

సర్వ దేవతలు మృగ జాతులై సంచరించే కొండ
నిర్వహించే జలధులే నిట్టచఱులైన కొండ
ఉర్వితపసులే తరువులై నిలిచిన కొండ
పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ ||

వరములు కొటారులై వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సో బనపుకొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
సిరులైన దిదివో శ్రీ వేంకటపు కొండ ||

అంజనాదేవి తపఫలము వల్ల హనుమంతుడు పుట్టిన ఈ గిరి అంజనాద్రి అయితే, జ్ఞాన సంపదలను పెంపొందించే జ్ఞానాద్రై, వరాహమూర్తి ఆజ్ఞానుసారం గరుడు తీసుకొచ్చిన వేంకటాద్రి కావున గరుడాద్రి అయింది. ఇలా స్వామివారి లీలావిలాసాలకు నెలవై కోరిన కోరికలు తీర్చే చింతామణై వెలుగొందుతున్న హరినివాసాన్ని చూచి తరించమని అన్నమయ్య ఈ దిగువ కీర్తనందించాడు.

అదివో అల్లదిగో శ్రీ హరివాసము
పదివేల శేషుల పడగలమయము ||

అదె వెంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు డదెమ్రొక్కు డానందమయము ||

చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము ||

కైవల్య పదము వేం కటనగమదివో
శ్రీవేంకటపతికి సిరలైనది
భావింప సకల సంపదరూపమదివో
పావనముల కెల్ల పావనమయము ||




Tuesday 11 August 2015

*ప్రాంజలి ప్రభ - గృహస్తాశ్రమం !

ప్రాంజలి ప్రభ.కం 
ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణా యనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 


గృహస్తాశ్రమం !

ప్రస్తుత కాలంలో , మధ్యతరగతిలో (దిగువ, ఎగువ), ధనిక తరగతులలో ఒక విశ్వాసం ప్రబలినట్లు కనిపిస్తున్నది. అదేంటంటే, గృహస్తాశ్రమం కన్నా బ్రహ్మచర్యం గొప్పది, అని. బ్రహ్మచర్యం అనేది ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పటం లాంటిది. ఈదినప్పుడు కదా ఈతలో మజా తెలిసేది. 

ఈతలో కష్టాలు నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఈదను, మీరు కూడ ఈదకండి. నేను ఈదను కాబట్టి మీకన్నా గొప్ప వాడిని. మీకు బోధించే అర్హత నాకు వస్తుంది. నేను పరమహంసను.  

మీరు నా కాళ్ళమీద పడుతుంటే, నేను మీ నెత్తి మీద చేతులు పెట్తూ ఉంటాను అనే ప్రవృత్తి మనదేశంలో బుధ్ధుడి కాలం నుండీ ప్రబలి ఉన్నది. అదేంట్రా నాయనా అంటే, నా కాషాయ గుడ్డలే, నా మంత్రదండమే, నా అర్హతలు. ఇలాగా అన్ని మతాలలోని బోధకులు గృహస్తుల నెత్తిన కూర్చోటం అలవర్చుకున్నారు. 
''వినదగు నెవ్వరు చెప్పిన'' అన్నట్లుగా, మహాభారతంలో ధర్మరాజు గారికి మంచి వినికిడి ఓపిక ఉన్నది. మహాభారత యుధ్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయాక, తాతలు, గురువులు, అందరినీ చంపాక, ధర్మరాజు గారికి కిల్బిష భయం (పాప భీతి) పట్టుకుంది. నేను సన్యాసం పుచ్చుకుంటానంటాడు. ఆసమయంలో ఆయనకు ఉద్ బోధ చేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు. 

సాధారణంగా, నకుల సహదేవులకి ఉద్ బోధలు చేసే ఛాన్సులు రావు. శాంతి పర్వంలో, ప్రథమాశ్వాసంలో, నకులుడికి అలాంటి ఛాన్స్ ఒకటి వచ్చింది. నకులుడు, సన్యాసం తీసుకోవద్దు, గృహస్తాశ్రమమే మిన్న అని ధర్మరాజుకి ఉద్ బోధ చేశాడు. ఆ ఉద్ బోధలోంచి కొన్ని పద్యాలను ఈక్రింద ఇస్తున్నాను. 
(తిక్కన ప్రణీత శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతి పర్వం,) 

కంద పద్యం. 
తక్కిన మూడాశ్రమములు 
నొక్క దెస, గృహస్థ ధర్మ మొక దెసఁ తులయం 
దెక్కింప వానితో న, 
య్యొక్కటి సరి తూఁగె నందురు ర్వీశ బుధుల్. 
తెలుగు సారం: 
గృహస్థాశ్రమాన్ని త్రాసులో ఒక పళ్ళెంలో వేసి, రెండవ పళ్ళెంలో మిగిలిన మూడాశ్రమాలను అంటే బ్రహ్మచర్య, వానప్రస్థ (అడవులలో ఉండటం), సన్యాసాశ్రమాలను పడేస్తే, మొగ్గు గృహస్తాశ్రమం వంకే ఉంటుంది అని పండితులు చెప్తారు. 
81 వ పద్యం. కందం. 
పరుల వధింపక యెవ్వడు, 
ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోఁ 
బొరయరు పాపము సుగతిక, 
యరిగిరి వా రీవు నట్ల యగు టొప్పు నృపా. 
తెలుగు సారం: ఓ రాజా, పూర్వపు రాజులలో, ఇతరులను చంపక ఏ రాజు భూమిని యేలాడు చెప్పు, వారు సుగతికి అంటే మంచి లోకాలకే వెళ్ళారు, నీవు కూడ అలాగే వెళ్తావు. 
82 వపద్యం. కందం. 
రక్ష ప్రజ గోరు నిజయో 
గ క్షేమార్ధముగ జన సుఖ స్థితి నడపన్ 
దక్షుడగు రాజు నడప కు 
పేక్షించినఁ పాపమొందడే కురు ముఖ్యా. 

ఓ కురు ముఖ్యా, జనం తమ యోగ క్షేమాలు చక్కగ సుఖంగా గడచి, రక్షణ కావాలని కోరుతుంటే సమర్ధుడైన రాజు పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉంటే, పాపం పొందడా? 
83 వపద్యం. తేటగీతి. 
గోవులను ఘోటకంబులఁ, కుంజరముల 
దాసులను ప్రీతి నిమ్మెల్ల ధాన్యములను 
గ్రామముల మందిరముల నిష్కముల వేడ్క 
నొసగు తత్తత్ సుపాత్రత్వ యుక్త విధుల. అర్ధము 

తెలుగు సారం: గోవులంటే ఆవులు. ఘోటకాలు అంటే గుర్రాలు. కుంజరాలు అంటే ఏనుగులు. దాసులంటే సేవకులు. ధాన్యాలు, గ్రామాలు, ఇళ్లు, నిష్కాలు అంటే ఆనాటి నాణెములు, ఇలాగా అన్నిటినీ వేడుకతో, ప్రీతితో, రాజు, సుపాత్రులు అంటే అర్హులైన వారికి తగినట్లుగా ఇస్తాడు.
--((**))--


Monday 10 August 2015

ప్రాంజలి ప్రభ - దేశభక్తిగీతాలు

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ 
సరేవేజనాసుఖినోభావంతు

Pranjali Prabha.com

           అమ్మడూ! తమ్ముడూ!మన పతాక పైకెత్తి
             వందేమాతరమంటూ నినదించి సాగాలి
        వందేమాతరం. . .వందేమాతరం ~ అమ్మడూ ~

           అహింసనే ఆయుధాన్ని చేసిన మన గాంధీజీ!
            జైజవాన్! జైకిసాన్! నినాదాల బహదూర్ జీ!
         ప్రపంచాన మన దేశపు ప్రగతికి బాటలు పరచిన
    కలాంజీని యెదనుంచి కదలిరండి కదంత్రొక్కి ~ అమ్మడూ! ~

         తెలుగువాడు సృష్టించిన తిరంగాల మన జెండా
          త్యాగం, నిస్వార్ధగుణపు ప్రతీకరా మన జెండా!
           ధర్మాశోకుని చక్రపు ధగధగరా మన జెండా!
సమధర్మపు సంస్కృతికి మరోరూపు మన జెండా! ~ అమ్మడూ! ~


దేశభక్తిగీతాలు - 



స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు! 
మాదీ స్వతంత్రదేశం లలితగీతాన్ని రచించినది స్వరపరచినది డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు. బిలహరి రాగం ఆది తాళంలో (కహరువా తాళం హిందూస్తానీలో) కూర్చారు. టంగుటూరి సూర్యకుమారి గానం చేయగా ఎంతో ప్రాచుర్యం పొందింది. 

పాట సాహిత్యo 

పల్లవి: 
మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి 
భరతదేశమే మా దేశం - భారతీయులం మా ప్రజలం || మాదీ స్వతంత్ర దేశం || 

చరణం 1: 
వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి 
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి || మాదీ స్వతంత్ర దేశం|| 

చరణం 2: 
ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం 
మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం || మాదీ స్వతంత్ర దేశం || 

చరణం 3: 
అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర 
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు || మాదీ స్వతంత్ర దేశం || 

చరణం 4: 
స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు


Pranjali prabha .com 


రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఓ పిల్ల లార రండి ! 
ఓ తల్లు లార రండి ! 
ఓ తండ్రులార రండి ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 

రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఎందరో యోధుల ధైర్య ఫలము ! 
ఎందరో వీరుల పోరాట ఫలము ! 
ఎందరో అమరుల త్యాగ ఫలము ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 

రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఓ బాల బాలిక లారా రండి ! 
ఓ యువతీ యువకు లార రండి ! 
ఓ భారత పౌరులారా రండి ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 




స్వాతంత్య దిన శుభాకాంక్షలు 

Pranjali prabha .com 


రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఓ పిల్ల లార రండి ! 
ఓ తల్లు లార రండి ! 
ఓ తండ్రులార రండి ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 

రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఎందరో యోధుల ధైర్య ఫలము ! 
ఎందరో వీరుల పోరాట ఫలము ! 
ఎందరో అమరుల త్యాగ ఫలము ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 

రండోయ్! రండి !! 
రండోయ్! రండి !! 
ఓ బాల బాలిక లారా రండి ! 
ఓ యువతీ యువకు లార రండి ! 
ఓ భారత పౌరులారా రండి ! 
మన స్వాతంత్ర దినోత్సవము నేడే నండి !! 




పల్లవి. శుభము, శుభము, శుభము భారత దేశమా! 
ఆభివృద్ది పథములో యిక ముందు సాగుమా! || శుభము || 


అనుపల్లవి. నభము నంటునులే నీ దివ్య చరితము, 
ప్రబుధుడు మోడి పట్టెలే పగ్గము! ||శుభము || 

బంగారు పంటలు పండులే నీ యింట, 
సింగారపు సిరులు ఒలుకులే సర్వత్ర, 
రంగు రంగుల ప్రభలు పొంగారు ప్రతిచోట, 
రంగు రంగుల జెండా ఎగురులే నింగంత. ||శుభము || 

శ్వాశలు నింపుకొని ఆర్ధిక రంగము, 
కాసుల రాసులు కొల్లలుగ నింపులే, 
దేశ దేశము లందు నీ కీర్తి కౌముది, వి 
కశించి వెన్నెలై విద్యోత మగులే!. ||శుభము || 

ఆరోగ్య, విద్య, వ్యాపార రంగములు, 
ధరణిలో దివ్యముగ దేదీప్య మగులే, 
కార్మికుల, రైతుల, సైనికుల, సేవకుల, 
నిర్మలానందము నయనముల వెలుగులే ! ||శుభము || 

అవినీతి సమసి, ఆనందము వెలసి, 
భువిన భారతము స్వర్గ సీమగులే, 
కవుల, వైతాళికుల, గాయకుల కీర్తనలు, 
అవిరళముగ వెలసి అంతట నిండులే! ||శుభము || 

రమాకాంతరావు చాకలకొండ శుక్రవారం, 15 ఆగస్టు 2015


స్వాతంత్య దిన శుభాకాంక్షలు 
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినవాడ నీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో
నినుమోసె ఈ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేదురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల ఝండాలు ఆడునందాక

అందాక గల ఈ అనంత భూతల్లిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ గీతములు

తమ తపస్సుల్ ఋషుల్ ధారవోయంగా
శౌర్య హారము రాజ చంద్రులర్పింప
రాగ దుగ్ధము భక్త రక్తముల్ పిదుక
భావ సూత్రము కవి ప్రభువు లల్లంగా

దిక్కులకెగదన్ను తేజములు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ
రాళ్ళు తేనియలూరు రాగాలు సాగ
సౌన్దర్య మెగబోయు సాహిత్య మలర

వేలగిండీ దివ్య విశ్వము పుత్రా
అవమానమేలరా అనుమానమేల
భారత పుత్రుండనచు భక్తితో బలుక
పాడరా నీతల్లి వీర గీతములను

రాయప్రోలు సుబ్బారావు






మాదీ స్వతంత్రదేశం లలితగీతాన్ని రచించినది స్వరపరచినది డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు. బిలహరి రాగం ఆది తాళంలో (కహరువా తాళం హిందూస్తానీలో) కూర్చారు. టంగుటూరి సూర్యకుమారి గానం చేయగా ఎంతో ప్రాచుర్యం పొందింది.

పాట సాహిత్యo

పల్లవి:
మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి
భరతదేశమే మా దేశం - భారతీయులం మా ప్రజలం || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 1:

వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి || మాదీ స్వతంత్ర దేశం||

చరణం 2:

ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 3:

అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు || మాదీ స్వతంత్ర దేశం ||

చరణం 4:

స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు
జననీ ఓ స్వతంత్ర దేవీ కొనుమా నివాళులు మావి || మాదీ స్వతంత్ర దేశం ||








1.ప్రవచనం 

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినవాడ నీ స్వర్గఖండమున
ఏ మంచి పూవులన్‌ ప్రేమించినావో
నినుమోసె ఈ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేదురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల ఝండాలు ఆడునందాక

అందాక గల ఈ అనంత భూతల్లిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ గీతములు

తమ తపస్సుల్ ఋషుల్ ధారవోయంగా
శౌర్య హారము రాజ చంద్రులర్పింప
రాగ దుగ్ధము భక్త రక్తముల్ పిదుక
భావ సూత్రము కవి ప్రభువు లల్లంగా

దిక్కులకెగదన్ను తేజములు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ
రాళ్ళు తేనియలూరు రాగాలు సాగ
సౌన్దర్య మెగబోయు సాహిత్య మలర

వేలగిండీ దివ్య విశ్వము పుత్రా
అవమానమేలరా అనుమానమేల
భారత పుత్రుండనచు భక్తితో బలుక
పాడరా నీతల్లి వీర గీతములను

రాయప్రోలు సుబ్బారావు

హిమనగమే అండగా సముద్రాల సాక్షిగా 

అలరారే అనురాగమే మన దేశం ~ హిమ ~ 

భిన్నభిన్న సంస్కృతులకు వేదికగా నిలచి 
నీవు, నేను వాదాలను ప్రక్కకు త్రోసి 
మనమంతా, జనమంతా ఒకే జాతియని చాటే 
ఈ దేశం మనదిరా! ప్రపంచాన మణిదీపం ~ హిమ ~ 

కష్టాలను ఎదురొడ్డిన శ్రీరాముడే మన నేత 
నేరానికి శిక్షన్నది తప్పదన్న ఆ "గీత" 
సంస్కర్తల ప్రవచనాల స్పందించే మన "జనత" 
సత్యానికి, త్యాగానికి ప్రతీకైన పతాకతో 

హిమనగమే అండగా సముద్రాల సాక్షిగా 
అలరారే అనురాగపు మనదేశం 
" సత్యాహింస"ల స్ఫూర్తి విజయానికి చిహ్నమని 
నిరూపించి చూపినట్టి సందేశం 
"వందేమాతరం. . వందెమాతరం. .వందేమాతరం!"






2.నినాదం Pranjali Prabha.com

           అమ్మడూ! తమ్ముడూ!మన పతాక పైకెత్తి
             వందేమాతరమంటూ నినదించి సాగాలి
        వందేమాతరం. . .వందేమాతరం ~ అమ్మడూ ~

           అహింసనే ఆయుధాన్ని చేసిన మన గాంధీజీ!
            జైజవాన్! జైకిసాన్! నినాదాల బహదూర్ జీ!
         ప్రపంచాన మన దేశపు ప్రగతికి బాటలు పరచిన
    కలాంజీని యెదనుంచి కదలిరండి కదంత్రొక్కి ~ అమ్మడూ! ~

         తెలుగువాడు సృష్టించిన తిరంగాల మన జెండా
          త్యాగం, నిస్వార్ధగుణపు ప్రతీకరా మన జెండా!
           ధర్మాశోకుని చక్రపు ధగధగరా మన జెండా!
సమధర్మపు సంస్కృతికి మరోరూపు మన జెండా! ~ అమ్మడూ! ~


--3--



పల్లవి.వీధి వీధులలో వన్నెల జెండ, వినువీధులకు ఎగరాలి, 
మేదిన యింతకు మించిన జండ, లేదని ప్రగతితో చాటాలి.||వీధి|| 

అనుపల్లవి.నిరత సుందర త్రివర్ణ జెండ నాట్యము చేయుచు ఎగరాలి, 
భారత జాతికి మించిన సంతతి భువిలో లేదని తెలపాలి.||వీధి|| 

1. త్యాగముతో, బలి దానముతో, నెత్తురు ఒలకగ, యిచ్చి ప్రాణములు, 
భక్తిగ ఎందరో తెచ్చిన జెండ, ప్రగితి మార్గమున ఎగరాలి, 
ఖగ రాజు వలే విశ్వములోన, ఖ్యాతిని గొప్పగ చాటాలి 
నిగ నిగ లాడగ నింగి పతంగమై, పతాక మెత్తుగ ఎగరాలి.||వీధి|| 

2. దేశ మాతకై శిరములు యిచ్చి త్యాగ ధీరులు తెచ్చిన జండ, 
అశయాలతో, అవిరళ కృషితో, అమర వీరులు నిలిపిన జండ, 
మొసులెత్తిన మన ఆశలను, మేదిన తీర్చెడి ఘనమగు జండ, 
విశ్వశాంతికై, ప్రేమ నిరతితో, విజయ పథములో సాగాలి.||వీధి|| 

3. అన్న దమ్ములై అన్ని జాతులు, కుల, మత భావము కూల్చాలి, 
వెన్న ముద్దకై పీకులాటలు, దొమ్మి, దగాలు ఆపాలి, 
అన్నము, గుడ్డ, గూడు, నీరు సమముగ అందరికందాలి, 
మన్నన పొందే మంచి మార్గమున జాతి ఒక్కటిగా సాగాలి.||వీధి|| 

4. సహనము శాంతి, స్నేహ భావము అదర్శముగ మారాలి, 
దేహము ఒకటని, అన్ని రాష్ట్రములు దేశమును కాపాడాలి, 
మోహము వీడి, త్యాగము పెంచి, సమత భావం నిలపాలి, 
జై హింద్, జైహింద్, జైహింద్ అంటూ సింహ గర్జన చేయాలి.||వీధి|| 

రమాకాంతరావు చాకలకొండ 15 ఆగస్టు 2010

  

దేశభక్తి గీతాలు  బై సోమసుధ . ఓ పాలకుడా 


రాజ్యమేలుతున్నావని రాజసాలు పోవద్దు 
స్వార్ధంతో ప్రజలలోన చిచ్చును రగిలించొద్దు 
మనోరంగ తీరాల "మన" తత్వం ఎగరాలి 
తిరంగాల మన జెండా తరంగాలు రేపాలి ~ రాజ్య ~ 

ఆంగ్లేయుల గుండెల భీతిని కలిగించారు 
మనవాళ్ళు . . .మనవాళ్ళు. . 
అండమాను చెరశాలలో తనువుల నెరవేశారు 
స్వేచ్ఛ కొరకు. . స్వేచ్ఛకొరకు 
ప్రాణాలను బాణాలుగ చేసి పోరు సలిపారు 
"సర్వకళల కాణాచి"కి స్వతంత్రాన్ని తెచ్చారు ~ రాజ్య ~ 

రాజనీతి పేరుతో రాక్షసాలు చేయొద్దు 
పాలకుడా! . . పాలకుడా! 
త్యాగధనుల దేశంలో విషబీజాలేయొద్దు 
నాయకుడా!. . .నాయకుడా! 
భిన్నత్వంలోనే మనం ఏకత్వం చూపాలి 
అవనిలో తలమానికమై మనదేశం నిలవాలి ~ రాజ్య ~







--5--

పల్లవి. జాతి ఘనత దెలుపు జాతీయ జెండా, ప్ర 

గతికి, రీతికి, ప్రతీకైన జెండా. ||జాతి|| 

అనుపల్లవి. మూడు రంగుల వెలయు ముచ్చటైన జెండా, 
నడుమ చక్రము గల నయగారపు జెండా! ||జాతి|| 

1. ధీర స్వభావము చాటు కాషాయముతో, 
వీర రస ప్రబోధ విద్యోత జెండా, 
ధరణి మాతకై ప్రాణ త్యాగము చేసెడి, 
శూరల దేశమని తెలుపు నీ జెండా! ||జాతి|| 

2. శాంతి పధతమును జూపి, ధవళ 
కాంతుల మెరయు, దేదీప్యమాన రంగుల జెండ, 
ఎంత ఆపదనైన సత్యమే పల్కమని, 
అందరికి తెలిపెడి అందమైన జెండా! ||జాతి|| 

3. నమ్మకము తోటి నలుగురు చల్లగ, 
ధర్మ పథము లోన సాగుమను జెండ, 
సమానత్వము, మంచి, కరుణ స్వభావ, 
సమ సమాజ ఉనికి తెలుపు మన జెండా. ||జాతి|| 

4. అశోక చక్రము అందముగ అమరుండ, 
దేశ ప్రగతిని చాటు దీప్తుల జెండా, 
శ్వాశ పీల్చి యిచట న్యాయము, ధర్మము, 
వాసముండేనని తెలుపు నీ జెండా! ||జాతి|| 

రమాకాంతరావు చాకలకొండ మంగవారం, 14 ఆగస్టు 2015


--6--


ఎగరాలి ఎగరాలి - జాతీయపతాకం ఎగరాలి 

ఆకాశాన అలుపు నెరుగక - వికాసించు విజ్ఞానవీధిలో ~ ఎగరాలి ~ 

నదీతీరమే నాదనిలయమై విలసిల్లే యీ వేదభూమిలో 
ఆగమనుతుల ఆలయాలతో అలరారే మన పుణ్యధాత్రిలో ~ ఎగరాలి ~ 

పచ్చదనాల పంటభూమితో ముచ్చట గొలిపే ముద్దుసీమలో 
ధర్మచక్రము నెదలో నుంచి ప్రగతిబాటను పరుగులు తీస్తూ ~ ఎగరాలి ~ 

గలగల పారే పుణ్యనదులతో శాంతిగీతాల సంధానములో 
మేదినికే మేలుబంతిగా నిలచిన యీ హిమనగ సీమలో ~ ఎగరాలి ~




పల్లవి. వచ్చింది స్వాతంత్యం భరత భూమికి, 

తెచ్చింది ఆనందం తర తరాలకి! ||వచ్చింది|| 

అనుపల్లవి. యిచ్చింది పరిపాలన ప్రజల చేతికి, 
వచ్చిందా సమానత వీధి వీధికి? ||వచ్చింది|| 

1. ఝాన్సీ రాణి వంటి వీర వనితలు, 
ప్రాణాలు ఫణ మొడ్డిన రామ రాజులు, 
తనువులను అర్పించి భగత్ సింగులు, 
మన చేతికి అందించిన స్వాతంత్యము! ||వచ్చింది|| 

2. లాల్, బాల్, పాల్ వంటి దేశ భక్తులు, 
లాల్ బహాదూరు, పటేల్, సావర్కర్లు, 
కలిమి, బలిమి అర్పించిన త్యాగ శీలురు 
కలిసి తెచ్చినారు మనకు స్వాతంత్యము! ||వచ్చింది|| 

3. గాంధీజీ, నేతాజి, రాజాజీలు, 
చంద్రశేఖరాజదులు, రాజేంద్రులు 
ఆంధ్ర నేత టంగుటూరి, అమర వీరులు, 
ఎందరో సాధించిన స్వాతంత్యము. ||వచ్చింది|| 

4. తర తరాలు వంశ మొకటే గద్దె లెక్కగా, 
కుల, మతాల క్రౌర్యములు నింగి నంటగ, 
కలిమి, లేమి అంతరము పెరిగి పోవగ, ఆ 
కలి బ్రతుకులు అలముటా స్వాతంత్యము? ||వచ్చింది|| 

5. నోట్ల తోటి ఓట్లు కొనే రాజకీయము, 
తిట్ల తోటి గద్దె లెక్కు మంత్రి వర్గము, 
పొట్ట పట్టు కొని బ్రతుకు ప్రజానీకము, 
పాట్లు పడే బీదరికమా స్వాతంత్యము!? ||వచ్చింది|| 

6. పాత్ర మరచి ప్రవర్తించు పాత్రి కేయము, 
నీతి తప్పి ప్రజల నేలు అధికారము, 
మూతి గట్టి పాలు పితుకు మంత్రి జనము, 
చేత గాని చదువులా స్వాతంత్యము? ||వచ్చింది|| 

7. కలలు గన్న స్వాతంత్యం యిదే యిదేనా? 
అలవఱచిన ఆదర్శం యిదే యిదేనా? 
అలరారే సమానత ఒట్టి కలేనా? 
అలోచన అణగారుటా స్వాతంత్యము? ||వచ్చింది|| 

8. సమానత లేని నాడు స్వాతంత్య యేల, 
అమానుషం నిండినపుడు గణతంత్ర యేల? 
ప్రమతి ఏలు రాజ్యమే ప్రజా స్వామ్యము, (ప్రమతి = యదార్ధ ఙ్ఞానము) 
కిమ్మనవు ఎందులకీ స్వాతంత్యము? ||వచ్చింది|| 




అదిగదిగో - అదిగదిగో 

అదిగదిగో ఘనకీర్తితో ఎగురుతోంది చూడరా 
మువ్వన్నెల మన జండా దిగంతాల నిండా - 
అదిగదిగో! అదిగదిగో! ~ అదిగదిగో ~ 

కళలకూ, కాలాలకు దర్పణమై నిలచింది 
అశోకుని ధర్మచక్ర మాగుండెల నిండా 
వందేమాతరం! వందేమాతరం! ~ కళలకూ ~ 
త్యాగధనం, నిర్మలత, పచ్చదనం సైదోడుగ 
తిరంగాల, తరంగాల తలవంచక గర్వంతో 
అదిగదిగో - అదిగదిగో 
మువ్వన్నెల మనజండా దిగంతాల నిండా 
అదిగదిగో ఘనకీర్తితో ఎగురుతోంది చూడరా! 

పింగళి వెంకయ్య మదిని విరబూసిన ఆలోచన 
పురుడించి, పున్నమించి అలరారిన మన జండా 
వందేమాతరం! వందేమాతరం! ~ పింగళి ~ 
జాతీయత, సౌభ్రాత్రం పరిమళించు తెలుగుదనం 
భరతమ్మకు నివాళితో అర్పించిన తెలుగు ' ధనం ' 
అదిగదిగో - అదిగదిగో 
మువ్వన్నెల మన జండా దిగంతాల నిండా 
అదిగదిగో ఘనకీర్తితో ఎగురుతోంది చూడరా ~ అదిగదిగో ~ 

(ఈ గీతానికి సంగీత ప్రాణప్రతిష్ట జేసి 'బొబ్బిలి ' సీమలో ఎగురవేస్తున్న సోదరుడు " ఆకొండి భగవతీ ప్రసాద్"కి కృతజ్ఞతలు) 
( ఓ తెలుగువాడా! ఈ దేశానికి నువ్వేమిచ్చావని ఎవరైనా అడిగితే గర్వంగా తల పైకెత్తి జాతీయ జండాని చూపి " ఇది మా తెలుగుదనం,మాతెలుగు "ధనం" అని చెప్పండి)








… …