Friday 8 March 2019




మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు

మనస్సును శాంతింప చేసేందుకు
మనో నిగ్రహాన్ని అందించేందుకు
మనస్సును రంజింప చేసేందుకు
ప్రధాన పాత్ర మహిళలకే ఉన్నది

మమకారంతో సుఖం పంచేందుకు
అధికారంతో కఫ్టాలు ఎదుర్కొనెందుకు
సహకారంతో ప్రయానించెందుకు
ప్రధాన పాత్ర మహిళలకే ఉన్నది

జీవితం సశ్యశ్యామళంగా మారెందుకు
కుటుంబం గౌరవమర్యాదలను నిలిపేందుకు
వినయం విధేయత పదికాలాలు బతికేందుకు
ప్రధాన పాత్ర మహిళలపై ఉన్నది

కన్న బిడ్డలను చదివించి సాకేందుకు
ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు
మన్ననతో మానవత్వాన్ని బతికించేందుకు
ప్రధాన పాత్ర మహిళలపై ఉన్నది

కళను వృధ్ధి పరిచేందుకు
కళ ద్వారా ఉళ్ళాస పరిచేందుకు
కళతో కార్యోన్ముఖునిగా మార్చేందుకు
ప్రధాన పాత్ర మహిళలపై ఉన్నది
మహిళలను గౌరవించి ఆదరించుటకు
ప్రధాన పాత్ర మగవారికి కూడా ఉన్నది
--((**))--


మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు 
మల్లాప్రగడ రామకృష్ణ

త్యాగానికి మారు పేరు, 
తనమయత్వానికి మరో పేరు
తారతమ్యం చూపక ప్రేమ పంచే పేరు
తామరాకుపై నీటిబిందువు బతుకు పేరు
తనకతానే సర్వం అర్పించుకునే వారు
మహోన్నత శక్తిని పంచే మహిళలే వారు

మగవాని హృదయంలో దాగి ఉండేవారు
మగవాని అర్థ శరీరంలో దాగి ఉండేవారు
మగవాని నాలుకపై దాగి ఉండేవారు
మగవాని తో జీవితాన్ని పంచి ఉండేవారు
మహోన్నత యుక్తిని పంచే మహిళలే వారు

నిద్దురలేస్తు యంత్రంలా తిరిగే వారు
వంటచేసి అందరి ఆకలి తీర్చేవారు
బిడ్డలను బడికి పంపి ధైర్యం చెప్పేవారు
బిడ్డలను చదివించి భర్తను నిద్రపుచ్చే వారు
మహోన్నత ముక్తిని పంచే మహిళలే వారు

--((**))--

Sunday 3 March 2019



ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...

సంపాదించిన "అస్థి పాస్థులు" ఏమి లేవు "పరమేశ్వర"
అనుగ్రహించే "ఐశ్వర్యం" తప్ప.....
పోగొట్టుకున్న "బంధాలు" "అనుబంధాలు" ఏమి లేవు...
ఈశ్వరుని సేవాకు అంటకమైన "సంకెళ్ళు" తప్ప....
పుణ్యకార్యములాచరిస్తూ, చిత్తమంతయు నీపై ఉంచుట తప్ప 
మనస్సు సక్రమ మార్గంలో ఉంచవా ఓం నమః శివాయ

అంటూ ఉపనిషత్తులు, భగవద్గీత మున్నగు ప్రామాణిక గ్రంధములందు గల ధర్మ రహస్యములను సర్వ జనులకు అర్ధమయ్యే విధముగా "తత్వసారము" లను 
ఆ పరమేశ్వరుడు తెలిపినంతవరకు తెలపాలని మహాశివరాత్రి సంధర్బముగా వ్రాయుటకు సంకల్పించాను  చక్కగా మననము చేసుకొని ఆనందానుభూతిని బడయగలరని విశ్వసించు చున్నాను. 
        
ప్రాంజలి ప్రభ  "ఆత్మీయ" మిత్రులందరికీ, మరియు ప్రతిఒక్కరికి మహా శివరాత్రి శుభకాంక్షలు
                                                                     
                                                                     మీ మిత్రుడు..
                                                               మల్లాప్రగడ రామకృష్ణ 
                                                                    ప్రాంజలి ప్రభ 

ప్రాంజలి ప్రభ - తత్వసారము (1 ) 


తత్వసారము తెలుసుకోరన్నా 
సద్గురినిచేంత, నిజము కనుగొని లాభమొందన్నా ....2 

ఆలుబిడ్డలు వెంట రారన్నా 
నిజమెఱిగి నీవు, బంధుజాలపు మమత విడన్నా  ....

తనువు నిత్యము కాదురోరన్నా 
ధరణిపై నది ఎల్లకాలము ఉండబోదన్నా ....

గీత సతతము ఆశ్రయించన్నా 
ఉపనిషత్తుల సారమే యది తెలుసుకోరన్నా ..... 

పాముకాదు తాడురోరన్నా
దీప కాంతిలో, సత్య విషయము తెలుసుకోరన్నా ....

తనువు చూసి మురిసిపోకన్నా 
మట్టిబొమ్మది అందమేమియు లేదు లేదన్నా ..... 

మట్టి వంటిది దేహమోరన్నా        
జడమైనది యది, చిత్వరూపము కాదు కాదన్నా ....

మనసుపైన జయము పొందన్నా 
ఇంద్రియంబుల, టక్కు చూసి మోసపోకన్నా 

పాము పాము అని కేక వేయకురన్నా
పాము కాదది, చేదబావి త్రాడు మాత్రమేరన్నా 


ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...
--((**))--   

ప్రాంజలి ప్రభ - తత్వసారము (2 )

ఓం నమః శివాయ...

మనసుతోటి పోరు సలపన్నా 
మలినచిత్తము ముక్తిపథమున అడ్డుయగునన్నా ....

విషయమందున ఆశవలదన్నా 
అనుభవించినకొలది ఆశపెరుగు తరగిపోదన్నా....

దేహనౌకను కొంటివోరన్నా
విలువగలిగిన వస్తువియ్యది తెలిసికోరన్నా .....

రేపు రేపని పలకవద్దన్నా 
తల్లితండ్రుల సేవలో వాయిదావేయవద్దన్నా .....

సుఖము వెలుపల లేదురోరన్నా
ఎల్లసుఖము ఆత్మానందంలో కలదురోరన్నా ....

దృశ్యమందున ప్రీతియుంచకురన్నా 
దృక్స్వరూపమునందు ప్రితికలిగియుండురన్నా ...

ఆయువేమియు స్థిరముకాదన్నా
త్వరగ దేవుని పాదకమలము శరణువేడన్నా ....

పామరత్వము పారద్రోలన్నా 
దైవ విద్య లేమిచె మానవత్వము వ్యర్ధమగునన్నా ....

జీవబ్రహ్మము లేకమేయన్నా 
వారి ఐక్యము తెలసి బంధము తొలగద్రోయన్నా ....

ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...


--((**))--

ప్రాంజలి ప్రభ - తత్వసారము (3 )
ఓం నమః శివాయ...

మట్టిబొమ్మవు నీవు కాదన్నా 
పరమార్ధపు సత్యము జాగుచేయక తెలిసికోరన్నా .......

కామదాసుడు కాకుమోరన్నా 
కామంబు శత్రువని గీతాశాస్త్రము పలుకుచున్నాదన్నా......  

విశ్వమంతా దేవుడే ఉన్నారన్నా 
నీహృదయంలో నాహృదయంలో ఉన్నారని తెల్సుకోరన్నా.....

రామనామము నీకు శరణమన్నా 
యెల్లఁవేళల తారకంబును జపము చేయుమురన్నా ....

ప్రణవమంత్రము జపము చేయరన్నా 
ఓంకారనాదము ఇల్లదిక్కుల మారుమ్రోగురన్నా ....

దైవనామము ఉచ్చరించురన్నా 
తారకంబది భవసాగరంబును దాటవేయరన్నా ....

రక్త మాంసపు తోలుబొమ్మన్నా 
కాయమందున సారమైనది ఒకటి లేదన్నా .... 

జన్మ జన్మకు కర్మ అంటురన్నా 
నరజన్మమునందు కర్మ జ్ఞాన భక్తి  వైచుమురన్నా ...

తత్వ మర్మము తెలుసుకోరన్నా 
బ్రహ్మ సత్యము అచంచలము పలుకుమొరన్నా .... 


ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...

--((**))--

ప్రాంజలి ప్రభ - తత్వసారము (4 )


ఓం నమః శివాయ...

భోగములకై  ఆశపడకన్నా  
భోగంబుచేతను యోగమంతయు దూరమగునన్నా ...  

సజ్జనంబుతే మైత్రి చేయరన్నా
దుర్జనంబును దూరదూరము విడిచిపెట్టన్నా ....

భారమేమియు లేకయుండన్నా    
దృశ్యవస్తువు భారమేయని తెలిసికోరన్నా ....

దృశ్యవస్తువు నమ్ముకొనకన్నా
కనిపించువస్తువు కాలమందున లీనమగునన్నా .... 

బింబసుఖమును కోరుకనుమన్నా 
ప్రతిబింబసుఖము, ఎంతయైనా విలువలేదన్నా .....

బ్రతుకు పరిమితి అల్పమోరన్నా 
చిగురాకు అంచును అంచుబొట్టును పోలి యుందన్నా ... 

మాయవలలో చిక్కుపడకన్నా 
బహుజాగరూకతతో దానిజాడలు తెలుసుకోరన్నా ....

విషయసుఖము కోరబోకన్నా 
ఆత్మశాంతికి భంగకరమే యగును ఒరన్నా ...

పుణ్యకార్యము వదలబోకన్నా 
పుణ్యంబుచేతను పాపమంతయు భస్మమగునన్నా ...


ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...

--((**))--

ప్రాంజలి ప్రభ - తత్వ సారం (5)

ఓం నమ: శివాయః

జ్ణాన యోగము నాశ్రయించన్నా
జ్ణానసిధ్ధికి భక్తి కర్మలు సాయపడురన్నా ......

మాయ యోక్క మర్మమెరుగన్నా
ఉన్నదానిని లేనిదానిగ చూపునో రన్నా......

ధ్యాన నిష్టను అభ్యసించన్నా
ధ్యాన మందును చిత్త మిటునటు కదల రాదన్నా......

ఎన్ని తిన్నను తృప్తి లేదన్నా
భోగ జాలపు అనుభవానికి అంతు లేదన్నా...

మనిషి కాయువు అల్పమోరన్నా
నూరు ఏడుల వయసు కలదని మురిసి పోకన్నా....

కాలమంతయు విలువ గలదన్నా
బహుజాగరూకతతో దానినంతను గడుపుకోరన్నా.....

జీవితం బతి చంచలంబన్నా
విశ్వమందున చెంచలత్వము లేనీదేదన్నా...

నిన్ను నీవు తెలీసికో రన్నా
నిన్ను తెలియక ఏది తెలిసిన వ్యర్థమేనన్నా....

పంచకోశములోన యుందన్నా
ఆత్మ దీపము తెరల వెనుక దాగియుందన్నా.....
(అన్నమయ, ప్రాణమయ,మనోమయ, విజ్ఞానమయ,ఆనందమయ..పంచకోశములు)

--((**))--

 ప్రాంజలి ప్రభ - తత్వ సారం (6)
ఓం నమ: శివాయః

గర్వభావము వదిలి వేయన్నా 
సృష్టి లోన భూమియంతో స్వల్పమగునన్నా ...

దైవచింతన కలిగి  యుండన్నా 
నిద్ద్రలేవగా దైవనామము స్మరణ చేయన్నా .... 

ఎట్టిప్రాణికి కీడు వలదన్నా 
కీడుచేసిన నిన్ను నీవే కొట్టినట్లన్నా ....

దేహమందున సొగసు లేదన్నా
సొగసు అంతయు ఆత్మలోఁ కలదురోరన్నా ....  

క్షణికమైనది జీవితంబన్నా 
పరమార్థ తత్వము జాగుచేయక తెలుసుకోరన్నా ...

దివ్యమంత్రము జపము చేయన్నా 
పరమాత్మ కృపచే సాధనంబులు సుళువు అగునన్నా ...

కాలమెంతో విలువ కలదన్నా 
క్షణమైనా దానిని ఖచేయకు భోగమందన్నా 

గీతవిద్యను చదువు కోరన్నా 
అద్దానియందున, ఉపనిషత్తుల సారముందన్నా ...

సాధనంబును చేయవలెనన్నా 
అనుభూతియంతయు సాధనంబుచె గట్టిపడునన్నా ...  


ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...ఓం నమః శివాయ...

--((**))--

--((**))-- 


Image may contain: 2 people



Saturday 2 March 2019

గ్రహణం గురించిన అద్భుతమైన వ్యాసం. తప్పకుండా చదవండి.
Courtesy: వీర నరసింహ రాజు గారు
భారతీయ గ్రహణ శాస్త్ర విషయంలో హేతువాదుల వాదనలో లోపాలు, కారణాలు
గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఆధునిక శాస్త్రజ్ఞులూ తెలియచేస్తున్నారు అలానే మన పంచాంగ కర్తలూ తెలియ చేస్తున్నారు. అయితే, గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమ నిభందనల గురించి మాత్రం కేవలం భారతీయ శాస్త్రం మాత్రమే చెప్తుంది. పాశ్చాత్య శాస్త్రం ఆ విషయం గురించి ఏమీ చెప్పదు
రాహు, కేతువులు సర్ప రూపంలో సూర్య, చంద్రులని మింగేయ్యడం వలన గ్రహణాలు ఏర్పడతాయి, అని మన పురాణాలలో ఉన్న కథ చాలా మందికి తెలుసు. మన పురాణాలలో ఉన్న అసంబద్ధమైన విషయాలకి దీనినో ఉదాహరణగా చూపుతారు హేతువాదులు. రాహు, కేతువుల కథ అసంబద్దం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. పాములు వచ్చి, సూర్య చంద్రులని మింగడం వలన గ్రహణం వస్తుంది అని నమ్మడం కన్నా మూర్కత్వం ఇంకోటి లేదు. ఈ విషయం అర్దం కావడానికి పెద్దగా మేధస్సు కూడా అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయట పడతాయి. అసలు ముందు గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం
సూర్య గ్రహణం: సూర్యుడికి, భూమికీ మధ్య చద్రుడు వస్తే, అప్పుడు చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది. ఆ నీడ లో ఉన్నవారికి సూర్యగ్రహణం.
చంద్ర గ్రహణం: సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వస్తే, భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. సూర్యుడి కాంతి వల్లనే చంద్రుడికి ప్రకాశం కనుక, ఆ సమయం లో చంద్రుడు కనపడదు, చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
రెంటిలోనూ నీడ పడటం ప్రధానం. రాహు, కేతువులని ఛాయ గ్రహాలూ అంటారు. ఛాయ అంటే నీడ, అంటే గ్రహణ సమయం లో భూమి మీద, చంద్రుడి మీద పడే నీడలనే మన వాళ్ళు రాహువు, కేతువు అన్నారు, అన్నది స్పష్టం అవుతుంది. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, మన వాళ్ళు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే గ్రహణ సమయాలని వేల సంవత్సరాలుగా చెప్తున్నారు. ఎన్నో పురాణాలలో, రామాయణ, భారత, భాగవతాలలో గ్రహణాల గురించి ఆ సమయాలలో గ్రహ స్థితుల గురించి కనబడుతుంది. ఖగోళ శాస్త్రం మీద ఇంత లోతైన అవగాహన ఉన్నవారు, పాములు సూర్య చంద్రులని మిగేయ్యడం వలన గ్రహణం వస్తుంది అని ఎలా నమ్మరు, అనే అనుమానం సహజం
వివిధ శాస్త్రాలని, కథల సహాయంతో చెప్పడం అనే ప్రక్రియ మన పురాణాలలో చాలా ఎక్కువగా కనబడుతుంది. భారతీయ విద్యా విధానం మీద అవగాహనా ఉన్న వారికి ఈ విషయం బాగా తెలుసు. దీనినే సంకేత వాదం అంటారు. మన పురాణాల నిండా ఇవే కనబడతాయి. పులి కుక్కతో మాట్లాడినట్లు, నక్క బాతుతో మాట్లాడినట్లు ఉన్న కథలు ఇటువంటివే. ఒక విషయాన్ని సులభంగా అర్ధమయ్యేలా చెప్పే ప్రక్రియే ఈ సంకేత వాదం. ఈ రాహు కేతువుల కథ కూడా ఇటువంటిదే.
గ్రహణ సమయంలో నియమాలు
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి హిందువులలో చాలా మందికి తెలుసు. గర్భిణీ స్త్రీలచే ఈ నియమాలని మన పెద్ద వాళ్ళు తప్పక పాటిమ్పచేస్తారు. గ్రహణం ఉన్న రోజున కొన్ని చానళ్లలో పండితులు గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి చెప్తుంటే, మరి కొన్నిటిలో హేతువాదులు ఇవాన్నీ మూఢ నమ్మకాలని వాటిని పాటించనక్కర లేదని చెప్తారు. నిజమే, గ్రహణ సమయంలో నియమాలు పాటించకపోతే కలిగే నష్టాల గురించిన ఏ ఆధారమూ లేదు. అయితే నష్టాలు ఉండవు అని నిరూపించడానికి కూడా ఏ ఆధారాలూ లేవు
గ్రహణ సమయలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, ఆ మార్పు వలన భూమి మీద కొన్ని మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. సముద్రపు అలలు ఎగసి పడటం ఇందులో ఒకటి. అటువంటప్పుడు గ్రహణ ప్రభావం మనిషి మీద, అలానే కొన్ని ఆహార పదార్ధాల మీద మాత్రం ఎందుకు ఉండకూడదు? ఉంటుది అని నేను అనడం లేదు, కానీ ఉండటానికి అవకాసం ఉంది అని అంటున్నా. ఈ విషయంమై ఎటువంటి పరిశోధనా జరిగినట్లు నాకు తెలియదు. మరి అలాంటప్పుడు జన విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంఘాలు వీటిని మూఢనమ్మకాలు అని ఎలా నిర్ధారించాయి?
ఈ ప్రశ్నకి వారు చెప్పే సమాధానాలు ఇవి
1. గ్రహణ సమయంలో నియమాలు పాటించక పోతే నష్టాలు కలుగుతాయి అని ఏమిటి రుజువు?
2. మేము ప్రతీ సారీ గ్రహణ సమయాలలో బయట భోజనం చేస్తాం. గర్భిణీ స్త్రీలు కూడా ఎందరో అలా చేస్తారు వారికేమీ కాలేదు.
నిజమే, నష్టాలు జరుగుతాయి అని సాక్షాలు లేవు, అయితే నష్టాలు లేవు అని కూడా సాక్షాలు లేవు కద? ఇటువంటి స్థితిలో రెండు వాదాలకీ సామాన ప్రాధాన్యతనివ్వడం విజ్ఞులు చెయ్యాల్సిన పని. హేతువాదులు, ఏవిధమైన హేతువూ లేకుండానే వీటిని మూఢ నమ్మకాలు, అని కొట్టి పారెయ్యడం కేవలం వారి పక్షపాత బుద్దికీ లేదా అజ్ఞానానికీ సాక్ష్యం.
"మరి గ్రహణ సమయాలలో బోజనాలు చేసిన వారికి ఏమీ కాలేదు కదా, దాని సంగతి ఏంటి", అని అడగవచ్చు. సాధారణంగా హేతువాద సంఘాల వారు, గర్భిణీ స్త్రీలతో సహా గ్రహణ సమయంలో భోజనాలు చేసి, చూసారా మాకేమీ అవ్వలేదు, కాబట్టి ఇవన్ని మూఢ నమ్మకాలు అంటుంటారు. నేను కూడా ఒక వంద మందితో రాత్రంతా మధ్యం తాగించి తరువాత రోజు నిద్ర లేపి, ఇంటికి పంపి, "చూసారా ఎంత తాగినా ఏమీ అవ్వలేదు కాబట్టి తాగడం వలన నష్టం లేదు, అది మూఢ నమ్మకం", అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వెర్రి వాడు అంటారు. హేతువాదుల వాదన కూడా ఇలాంటిదే.
గ్రహణ సమయంలో తినడం వలన ఎం నష్టాలు కలుగుతాయి అని శాస్త్రాలలో చెప్పారో తెలుసుకొని, తరువాత శాస్త్రీయ అధ్యయనం ద్వారా, అవి కలగలేదు అని గణాంక సహితంగా నిరూపిస్తే, అది కూడా ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగితే లేదా ఏదైనా ప్రముఖ మెడికల్ జర్నల్ లో ప్రచురితం అయితే, అప్పుడు దానికి ఏదైనా విలువ, విశ్వసనీయత ఉంటుంది. అంతే కానీ వారికి వారే చేసేసుకొని, ఫలితాల్ని ప్రకటించేస్తే, వారికి అనుకూలమైన టీవీ చానాళ్ళ వాళ్ళు చూపిస్తే చూపించవచ్చు కానీ, ఇటువంటి వాటికి శాస్త్ర ప్రపంచంలో విలువ ఏమీ ఉండదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం, అహేతుకం
అయితే మరి హేతువాదులం అని చెప్పుకునే వారు, ఇంత ఆహేతుకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వీళ్ళందరూ హిందూ ద్వేషులనో, దేశ ద్రోహులనో అనుకోవడం పొరపాటే. ఎవరో ఒకరిద్దరు తప్పించి హేతుబద్దంగా ఆలోచించడానికి ప్రయత్నించే వారిలో చాలా వరకూ నిజాయితీ పరులే ఉంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి కారణం ఏమిటి? దీనికి మూలాలు మన విద్య విధానంలో ఉన్నాయి.
విద్యా విదానం
శాస్త్రీయ ప్రగతి సమాంతరము, ప్రగతి శీలము అనేది చాలా మంది నమ్మకము. అంటే మొన్నటి కన్నా, నిన్న; నిన్నటి కన్నా ఈ రోజు శాస్త్ర పరంగా ప్రపంచం ముందు ఉంటుంది అనేది ఈ నామ్మకం సారంశం. ఇది నిరంతర ప్రక్రియ అనేది కూడా ఈ నమ్మకంలో భాగమే. ఈ సిద్ధాంతం ప్రకారం, ఇప్పటి కాలం వారి కంటే గత కాలం వారికి, ఏ అంశంలోనూ, శాస్త్రీయ అవగాహన మెరుగ్గా ఉండే అవకాసం లేదు. మన విద్యా విధానం వలన, తమకు తెలిసో తెలియకో ఈ సిద్ధాంతం వలన ప్రభావితం అయిన వారు, "మన పూర్వీకులు కొన్ని రంగాలలో ఇప్పటి కాలం కన్నా ముందుండే వారు", అంటే, కనీసం ఇందులో నిజం ఎంత, అని పరిశీలించడానికి కూడా సిద్ధ పడరు. ఒక విధంగా దీనిని వారి అజ్ఞానంగా లేదా వారిలో వారికే తెలియకుండా ఉన్న ఒక్క చీకటి కోణంగా మనం పరిగణించవచ్చు. ఒక పరిమిత కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఈ సిద్ధాంతం నిజమే. దీర్ఘకాలం లో మాత్రం కాదు.
భారతీయ శాస్త్రాలు కాలాన్ని చూసే విధానం దీనికి పూర్తిగా విరుద్ధం. మనం కాలాన్ని సలళము అనము, చక్రీయము అంటాము. అందుకనే మన దగ్గర "కాలచక్రం" అనే మాట ఉంది. అందుకే మన పూర్వీకులు, కనీసం కొన్ని రంగాలలో అయినా, ప్రస్తుత కాలం కంటే ముందుండే వారు అంటే మనకి మూర్కత్వం అనిపించదు. ఇప్పటికి ఎన్నో నాగరికతలు కాల గర్భం లో కలిసిపోయాయి. వాటితో పాటే వారు సాధించిన శాస్త్రీయ ప్రగతి కూడా. ఒక నాగరికతని మాత్రమే పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు శాస్త్ర ప్రగతి, ప్రగతిశీలంగానే కనిపిస్తుంది, దానిని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే నాగరికతలకి అతీతంగా శాస్త్ర ప్రగతిని చూసినప్పుడు అది సరళము అనుకోవడం, తార్కికం అనిపించుకోదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన నాగరికతల శాస్త్రీయ పరిజ్ఞానం ఏమిటి అనేది మనకి పూర్తిగా తెలియడానికి అవకాసం లేదు. అందువలన వారు ప్రస్తుత నాగరికత కంటే అన్ని రంగాలలోనూ వెనకబడే ఉన్నారు అనుకోవడం తార్కికం కాదు.
శాస్త్ర ప్రగతి సరళము అనే వాదానికి ప్రతికూల ఉదాహరణలు మనకి ఎన్నో కనిపిస్తాయి, అందులో యోగా ఒకటి. 40-50 సంవత్సరాల క్రితం వరకూ కూడా యోగ విద్యని ఒక మూడ నమ్మకంగా పరిగణించేవారు. ఆయుర్వేదం మరో ఉదాహరణ. థైరాయిడ్, నడుము నొప్పి లాంటి పాశ్చాత్య వైద్య విధానం నయం చెయ్యలేని ఎన్నో వ్యాధులని ఆయుర్వేదం ఏంతో సులభంగా, చాలా తక్కువ ఖర్చుతో నయం చెయ్యగలదు. అలా బాగుపడ్డ వారు ఎందరో నాకు స్వయంగా తెలుసు. యోగ విద్య, ఆయుర్వేదం వంటివి, శాస్త్ర ప్రగతి చక్రీయం అని నిరూపించే సాక్షాలు. కనీసం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి శాస్త్రాలు నేటి ఆధునిక శాస్త్రాల కంటే మెరుగైనవి అంటే, శాస్త్ర ప్రగతి సరళం కానట్లే కద. ఇవి మనకి తెలిసిన శాస్త్రాలు. ఇదే విధంగా మనకి అసలు తెలియని, కేవలం పేర్లు మాత్రం తెలిసిన ఎన్నో ఇతర శాస్త్రాలు ఉండటానికి అవకాసం ఉంది. అయితే కేవలం మన పురాణాలలోనో ఇంకో దగ్గరో ఈ శాస్త్రాల ప్రస్తావన ఉంది కాబట్టి వాటిని నమ్మాలి అని నేను అనడం లేదు. ఏ విధమైన పరిశోధనా చెయ్యకుండా, వాటిని మూఢ నమ్మకాలు అని కొట్టి పారేయ్యడాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను.
అందువలన గ్రహణ కాలంలో నియమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కేవలం అవి ఇంతక ముందు కాలానికి చెందినవి అనో, పాశ్చాత్యులు ఇంకా గుర్తించలేదు అనో మూఢ నమ్మకాలు అనుకోవడం, మన మూఢత్వమే అవుతుంది కానీ హేతుబద్దమైన ఆలోచన అనిపించుకోదు.
దీనికి మరో కారణం ఆత్మన్యూనత. ఇటువంటి వారికి తెలిసో, తెలియకుండానో పాశ్చాత్యుల కంటే మనం తక్కువ అనే భావన ఉంటుంది. ఐరోపా దేశాల వలస పాలనలో ఉన్న అన్ని దేశాలలోనూ ఈ పరిస్థితి ఉంటుంది. దీనికి భారతదేశం మినహాయింపు కాదు. అయితే మనకి గొప్ప చరిత్ర, సంస్కృతి, హిందూ ధర్మం ఉండటం వలన ఈ జాడ్యం నుండి, బహుశా త్వరగానే బయటపడతాం.
కాబట్టి భారతీయ గ్రహణ శాస్త్రంలో చెప్పిన అన్ని అంశాలూ నిజామా కాదా అనేదిప్రస్తుతానికి మనకి తెలియదు. అయితే నిజం అవ్వడానికే సంభావ్యత ఎక్కువగా ఉంది. నా కారణాలు
1. గ్రహణ సమయంలో ప్రకృతిలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది, దాని ప్రభావం వలన సముద్రపు అలలు ఎగసి పడటం మనం చూస్తున్నాం. కాబట్టి గ్రహణ ప్రభావం మనుషుల మీద అలానే ఇతర పదార్ధాల మీద కూడా ఉండే అవకాశం ఉంది
2. యోగ శాస్త్రం, ఆయుర్వేదం వంటి ఎన్నో గొప్ప శాస్త్రాలని ఇచ్చిన, గ్రహణ సమయాన్ని ఈరోజుకీ చిన్న కాగిత కలం సహాయంతో లెక్కించడానికి వీలైన పరిజ్ఞానాన్ని ఇచ్చిన సంస్కృతే ఈ గ్రహణ నియమాలని కూడా చెప్తోంది.
3. వందల వేల సంవత్సరాలుగా ఈ నియమాలు మన సంస్కృతిలో భాగం అయిపోయాయి. కాబట్టి ఒక బలమైన, శాస్త్రీయమైన కారణం లేకుండా వాటిని తప్పు అని తెల్చేయ్యడం మూర్ఖత్వమే అవుతుంది
4. ఈ నియమాలు పాటించడం వలన, లాభం సంగతి పక్కనబెడితే, నష్టమైతే లేదు.
ఈ కారణాల వలన, ఈ నియమాలు తప్పు అని పూర్తి ఆధారాలతో నిరూపితం అయ్యే దాకా మనం నియమాలని పాటించడమే ఉత్తమం. నియమాలని పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగతం. అయితే, తమ మిడి మిడి జ్ఞానం తో ఇవన్ని తప్పు అని ప్రచారం చెయ్యడం మాత్రం తప్పు. ఈ పని ఎక్కువగా చేసే జన విజ్ఞాన వేదిక వారు కొంచెం పునరాలోచించు కోవాలి.

Friday 1 March 2019

శివమానస పూజా స్తోత్రం!

శివమానస పూజా స్తోత్రం!

-

ఆది శంకరాచార్యుడు వ్రాసిన అన్ని స్తోత్రాలలో లాగానే ,ఇందులో కూడా భక్తితో పాటు గొప్ప సాహిత్యం కూడా ఉంది!
ప్రకృతినే మనకు ప్రసాదించిన భగవంతుడికి, నిజానికి మనం ఏమి ఇవ్వగలం?
ఆత్మసమర్పణే అసలైన పూజ అని దీని అంతరార్ధం!
చాలా గొప్ప భావన!!
-
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం ఛ దివ్యామ్బరం
నానా రత్న విభూషితం మృగమదా మోదాన్కితం చందనం
జాతీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ, ధూపం తథా 
దీపం దేవ! దయానిధే! పశుపతే!హృత్కల్పితం గృహ్యాతాం || 1 ||
-

ఈశ్వరా ! రత్నములతో కూడిన అమర్చిన సింహాసనం అమర్చాను, వచ్చి కూచో! 

చక్కని, చల్లని నీటితో స్నానం సమర్పిస్తున్నాను,దాన్నీ స్వీకరించు. దివ్యమైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను ,దాన్నీ స్వీకరించు. 

మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు, కస్తూరి, చందనం … వీటన్నిటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను! జాజి, సంపెంగలతో పాటుగా నీకు అమిత ప్రీతిపాత్రమైన మారేడు దళాలను సమర్పిస్తున్నాను ! 
సువాసన గల అగరు ధూపాలను స్వీకరించు స్వామీ! 
దీపం కూడా వెలిగించాను. ఇదంతా హృత్కల్పితం, 
అంటే, “మనసులో నేను కల్పించుకొన్నది. ” నేను మానస పూజను మాత్రమే చేయగలను, ప్రత్యక్షంగా పైన చెప్పినవన్నీ సమకూర్చి నీకు పూజచేయలేను!
స్వామీ! కరుణా సింధూ!! దయతో నా ఈ పూజని గ్రహింఛి నన్ను కనికరించు!
-

సౌవర్ణే మణిఖండ రత్నరచితే పాత్రే, ఘృతం పాయసం

భక్ష్యం పంచవిధం, పయోదధియుతం, రంభాఫలం, పానకం

శాకానామయుతం, జలం, రుచికరం, కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం, భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
-

గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అని ప్రత్యక్ష పూజలో అయిదు రకాల ఉపచారాలున్నాయి .అవి కూడా చేసినట్లే భావించు స్వామీ! తదుపరి ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను ,అదీ స్వీకరించి నన్ను కరుణించు దేవా! 

మణులు పొదిగిన బంగారు గిన్నెలో నెయ్యి, పాయసం, పంచభక్ష్యములూ (భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాలు) ఎన్నో కూరలూ , అమర్చాను. పాలు, పెరుగూ, అరటి పండూ, మధ్య మధ్య రుచికరమైన పానకమూ, అన్నిటినీ ఆరగించు స్వామీ! 

మంచి నీటిని తాగు. కర్పూరముంచిన తాంబూలాన్ని మనసుతో చేసాను , స్వీకరించు దేవా!
(ఇది కూడా హృత్కల్పితమే,మనసులో అనుకుంటున్న పూజే,ప్రత్యక్ష పూజ కాదు) 
-
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
-

భుక్తాయాసంగా ఉందేమో, భోజనానంతరం కాసేపు విశ్రాంతిని

తీసుకో స్వామీ! 

ఎండ తగలకుండా ఛత్రం(గొడుగు) పడతాను! మధ్య మధ్య చామరం(విసనకర్ర లాంటిది,చెమట పోయకుండా –గాలి వీయటానికి వాడుతారు) వీస్తాను, లీలా విహారంలో అందం చెడకుండా అద్దం కూడా చూసుకోవటానికి అమర్చాను! నీ మనసును రంజింప చేయటానికి వీణావాదన వినిపిస్తున్నాను!
దానికి ధీటుగా భేరీ నినాదాలూ, మృదంగ తాళాలు , గానమూ నాట్యమూ నీ కోసమే అమర్చాను! నిజానికి ఈ కళలన్నిటికీ నీవే అధిపతివి!నీవి నీకే సమర్పిస్తున్నాను!! అన్ని కళారూపాలు నీకు సర్వ సమర్పణం చేస్తూ నాకు తెలిసిన కళారూపాలతో చేసే ఈశ్వరార్చన ఇదే! సాష్టాంగదండప్రణామం చేస్తున్నాను మనసులో. 
(ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!)
-
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
-

నేను నీకు బాహ్యపూజలు చేయలేని అజ్ఞానిని,పేదవాడిని . 

నీవే నా ఆత్మ! నా బుద్ధి పార్వతీ దేవి! నా విషయ వాంఛలు, నా అనుభూతులూ నీకు ప్రేమతో చేసే పూజలనుకో!నేను ఆదమరచి నిదురించినప్పుడు కూడా, నీ ధ్యాన నిష్టలో సమాధిస్థితిలోనే ఉన్నాననుకో !

నా వృధా పరుగులాటలు, నీకు చేసే ప్రదక్షిణలుగా, నా పిచ్చిప్రేలాపనలు నీ స్తోత్రరత్నాలుగా, నా కర్మఫలితాలన్నీ నీ సేవగా భావించి నన్ను క్రుతార్ధుడిని చేయి స్వామీ!
(ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!)
-

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |

విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||
-

సముద్రంలో నీరు ఎలా అనంతమో అలాగే నీ కరుణ కూడా అంతే ! 

సముద్రం పదే పదే అలలతో ఎలా నన్ను తాకుతుంటుందో ,

అదే విధంగా నీ కరుణ కూడా నన్ను నిత్యం స్పర్శిస్తూనే ఉంటుంది. నా కరచరణాదికములతో, వాక్కుతో, దృక్ శ్రవణేంద్రియములతో, మనస్సులో, తెలిసీ తెలియక చేసిన మహాపరాధాలనన్నింటినీ, 
పెద్ద మనసుతో క్షమించమని కరుణాసముద్రుడవైన నిన్ను వేడుకుంటున్నాను.(ఇది కూడా మనసులోనే!ప్రత్యక్షంగా కాదు!)

శుభం భూయాత్!

మహాశివరాత్రి:



మహాశివరాత్రి: ( 04 - 03 -2019 , సోమవారం, మాఘ బహుళ చతుర్దశి )
మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజున వచ్చే శివరాత్రి ఇది. ఈ రాత్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాధనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఎందుకంటే అది అన్ని శివరాత్రులలో కెల్లా మహత్తరమైనది, శక్తివంతమైనది. మనలోని శక్తులు ఉప్పొంగే రాత్రి మహాశివరాత్రి!

ఒకనాడు పార్వతీదేవి శివుడితో "ప్రాణేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ధ కర్మలతో చాలా బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞ యాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి ముక్తిని కలుగేటట్లు చేయండి" అని పార్వతి అన్నది. అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రి వ్రతము అనే వ్రతము ఒకటి ఉంది. ఆ ప్రతము సర్వ యఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను విను...

పూర్వము ఒక పర్వత ప్రాంతమున వ్యాధుడనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది. ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క మృగము కనపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్పక, చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు సరస్సు వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ సరస్సు వైపు చూస్తూ కూర్చున్నాడు.

మొదటి జామునకు ఒక లేడి నీరు త్రాగటానికి ఆ సరస్సు దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయాడు. "వ్యాధుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నా వలన నీ కుటుంబానికి సరిపడే భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు. కాసేపట్లో ఇంకో జింక ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అన్నది.



సరే నన్నాడు వేటగాడు. రెండవ జామునకు ఇంకో జింక కనిపించింది. మొదటి జింకే అనుకున్న వేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ వ్యాధుడా! నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మాంసములు లేవు. నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగా బలిసిన మగజింక ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు వ్యాధుడు మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు. బలిసిన మగజింక రానే వచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే బాణము విడవబోయేంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలిని కూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ వేటగాడా! రెండు జింకలు ఇక్కడకు వచ్చాయా? అవి ఎటు పోయాయి? వాటిని నువ్వు చంపావా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి లానే ఆశ్చర్యపడి రెండు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాయి. నిన్ను నాకు ఆహారంగా పంపాయి అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది. ఇంతలో ఇంకొక జింక తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది. ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయం అయింది. వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాధుని ఎదుట మోకరిల్లాయి. జింకల సత్యసంధతకు వ్యాధుడు ఆశ్చర్యపడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు.



వ్యాధుడికి తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. ఈ విధంగా మృగాలను వేటాడి బంధించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమ నికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దయ చూపడం కూడా సత్యఫలమే" అన్నాడు. వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు చక్కని విమానంలో వచ్చి "ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున వలన నీ పాపము  నశించింది. నీవెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న స్వయంభూలింగాన్ని పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.




ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి "దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో


ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపాడు భోళాశంకరుడు.భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవులకాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన... సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా


దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి.

ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది.ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే ఆంధ్రప్రదేశ్ లో వీటి జాబితా చాలానే ఉంది.గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగాచెక్కబడ్డాయి. -వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూస్తంభాలూఅన్నీఆకొండరాయితోనే మలచ గలగడం 

విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. 

అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి. శివలింగాలన్నీ ఒక్కచోటే.. ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్లోని అమరనాథ్లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం)

రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు. ఒకేచోట త్రిమూర్తులు... -ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.





పల్లవ గుహాలయాలు... -ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం...వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్నగుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి. కోనకు ఇలా వెళ్ళాలి... భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబ వరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం  నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంద     అందరూ దయచేసి ఇది మీ కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి, షేర్ చెయ్యండి. అమూల్యమైన లింక్ మీకు అందిస్తున్నాను.


శివరాత్రి .."శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''
వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.

అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికంతటికీ పర్వదినం అయింది.
అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.
ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.అభిషేకం ఎందుకు చేయాలి ?"అభిషేక ప్రియం శివః'' అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.
ఇందులో అంతరార్థం ఏమిటంటే -"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం.
అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో
"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''
శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం'' అంటేనే శివునకు ప్రీతికరం.

అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం. ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.
ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది.
ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే"జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి.
నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో"శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ'' అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి"శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం'' చెబుతుంది.
"వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.
అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.
"శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||
శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలోఅభిషేకం తప్పనిసరిగా చేయాలి.
తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి. నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు, 
"ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.

బిల్వపత్రాల విశిష్టత.
శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం.
మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.
సాలగ్రామ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,
వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని"బిల్వాష్టకం''లో చెప్పబడింది.
"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.
ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
జాగరణ ఎందుకు చేయాలి..
క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది.
"జాగరణ'' అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు. శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు.
మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది. శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.
ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను "ఆదిభిక్షువు'' అన్నారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. ఆయన నివాసస్థానము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.
ఈ "నిర్జనుడు'' మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.ఈశ్వర భక్తుడైన "రావణుడు'' ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.
బ్రాహ్మణ వంశంలో జన్మించి, వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శివపూజ చేసి, శివప్రసాదం తిన్న "గుణనిధి'' మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.
అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే"శివరాత్రి'' మహత్యం.
రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో "సైకతలింగ'' ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు. ఆ క్షేత్రమే "రామేశ్వరం''.
శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రాలతో అర్చించిన "తిన్నడు'' భక్తకన్నప్పగా వాసికెక్కాడు.
ఇలా చెబుతూ పొతే ఎందరోమహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి. అట్టి నిరాకార, నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ "నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలులేనిది ఆయన మమకారం. "శివా''అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.
దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.
దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర... "నీకు నేనున్నారురా దిక్కు'' అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు "శివుడు'' ఒక్కడే. పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ... ఆ పరమేశ్వరుడు ఒక్కడే..
ఇది చాలదా మన జన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?- భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.- ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప. తృప్తిగా "నమశ్శివాయ'' అంటూ నమస్కరించడం తప్ప.
అందుకే "మహాశివరాత్రి''నాడైనా మహాదేవుని స్మరిద్దాం. మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం
"ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..