Monday 10 February 2020

speach



చావు, నిద్ర, ధ్యానం ఇవన్నీ మన స్థూల శరీరాన్ని వదిలే చర్యలే.

 చావులో మనం శాశ్వతంగా శరీరాన్ని వదిలేస్తాం.

నిద్రలో మనకు తెలియకుండా శరీరం నుండి బయటకు వచ్చి కొన్ని గంటల తర్వాత తెలియకుండానే తిరిగి దేహప్రవేశం చేస్తాం.

ధ్యానంలో మనం పూర్తి ఎరుకతో శరీరం వదలి సూక్ష్మ దేహయాత్రల తరువాత పూర్తి జ్ఞానంతో తిరిగి స్థూల దేహప్రవేశం చేస్తాము.

✨⚡✨⚡✨⚡

ఏదైతే లేదో దానినే 'మాయ' అని పిలుస్తారు.

ప్రపంచంలో రెండే రెండు వస్తువులు మాయ.

ఒకటి - చావు అనే భావన;

రెండు - నువ్వు వేరే, నేను వేరే అనే భావన.
 


✨⚡✨⚡✨⚡

ధ్యానం వలన కలిగే ఒక ముఖ్య ప్రయోజన మేమిటంటే:-

"సమస్య నా మనస్సుకే ఉంది కానీ., నాకు కాదు" అని అవగతమౌతుంది.

✨⚡✨⚡✨⚡

    రోడ్డు స్థిరం - బండి అస్థిరం,

 తెర గుడ్డ స్థిరం - బొమ్మ అస్థిరం,

   నీవు స్థిరం - నీ దేహం అస్థిరం.

🕉🌞🌎🌙🌟🚩

"ఏమాత్రం సంబంధంలేని ఆలోచనలు వచ్చి మనసును ఘర్షణ పెట్టకుండా పరిష్కారం చెప్పండి ?"

సాధన చేస్తున్నప్పుడు ఏకాగ్రత కుదరకపోతే (ఇతర ఆలోచనలు వస్తుంటే) ఎవరికైనా అశాంతి కలుగుతుంది. ఒక పనిలో నిమగ్నమైన వ్యక్తికి ఇతర ఆలోచనలు వచ్చినా ఇదే సమస్య ఎదురవుతుంది. జపమైనా, పనైనా మనం చేస్తున్నదాంతో అసలు సంబంధంలేని ఆలోచనలు మనసులోకి రావటం వల్ల ఘర్షణ వాటిల్లుతుంది. ఇదే అందరికీ సమస్యగా ఉంది. అయితే ఈ సమస్యకు కారణం తెలుసుకోగలిగితే అందుకు పరిష్కారం కనుక్కోగలుగుతాం. మనం కోరుకున్న ఆలోచనపై మనసు నిలపటాన్ని ధ్యానం అంటున్నాం. ఆ స్థితిని సంపాదించటం కోసం అనేక ప్రక్రియలను ఆశ్రయిస్తున్నాం. మన ధ్యాసను మంత్రం లేదా శ్వాసపై నిలిపే ప్రయత్నంలో ఇతర ఆలోచనలు మనసుకు ఏకాగ్రత కుదరనివ్వవు. దీంతో ధ్యానం సాధ్యపడక మనసు సంఘర్షణకు గురవుతుంది. ఏకాగ్రత కుదరకపోవటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ధ్యానం చెయ్యాలనుకున్న విషయంపై శ్రద్ధ లేకపోవటం, రెండోవది ఇతర విషయాలపై ఇంతకంటే ఎక్కువ ఇష్టం ఉండటం. నిత్యజీవితంలో మనకు అవసరమైన విషయంపై ఇష్టాన్ని పెంచుకొని, ఇతర విషయాలపై ఆసక్తి తగ్గించుకుంటే పనిలోనైనా, సాధనలోనైనా సఫలీకృతులం అవుతాము !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'పవిత్రతే మన ధర్మం-ఆచరిస్తే అదే ధ్యానం !'- (అధ్యాయం-58)

🕉🌞🌎🌙🌟🚩

 --(())-- 



🙏మనలోని ఆసుర లక్షణాలు తొలగించడానికి.🙏

దంభము --- తనకు లేని దానిని ఉన్నట్లుగా ప్రదర్శించటము,
దర్పము -- తాను అందరికన్నా గొప్పవాడిని అని భావించటం,
దురభిమానము -- ఇతరులు తనకన్నా తక్కువ వారు నేనే ఉన్నతమైన వాడిని అని భావించటం, దీర్ఘకాలము ప్రదర్శించే క్రోధము, 

పరుషత్వము -- మాట ద్వారాగానీ ,చేష్ట ద్వారా గానీ ఎదుటివాడిని గాయపరచే లక్షణము,
మూర్ఖత్వము ---దేశకా వ్యవస్థలగురించి తనగురించి ఇతరుల గురించి ఇంగితము లేకుండా ఉండటం ఆసుర లక్షణాల గురించి భగవానుడు చాలా చక్కగా వివరించారు... 

కలికాలంలో ఎక్కువగా కనబడేది ఆసురప్రవృత్తియే ! మనలోకి మనం తొంగి చూసి ఆ లక్షణాలు పెరుగుతున్నప్పుడలా కత్తిరించుకోవడమే మన కర్తవ్యము ....

అందుకు సత్సంగమే మార్గమని ఆదిశంకరులు కూడా బోధించారు

🙏శ్రీ మాత్రే నమః🙏

--(()0--

మోహం కధ

ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..

ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.
సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.
మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని,
" ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు.

వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.

యజమాని కంగారుపడుతూ.
" అలా ఎలా కుదురుతుంది ??
పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు.

సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.
ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.

మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి...
వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని జవాబు కొంచెం విసుగ్గా.." పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు..

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి
సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .
అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.
ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..

సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్రజలం దాని మీద జల్లి ,
" ఏమిటి నీ పిచ్చి మోహం ???!కుక్క గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను "
అన్నాడు.. యజమాని " ఆ మాట మాత్రం వినలేను..
ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ  పాము గా...
మంత్రజలం చల్లి, " ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ???
అన్నాడు.

ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..

సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో " మీ నాన్న ఆ చెట్టు కింద ధనం దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,,

కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు
కానీ అప్
[12:04 pm, 28/02/2020] +91 72870 25099: పటికే చాలా ఆలస్యమైంది

నీతి
గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా ఎంతవరకూ మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.

ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి .... !!!

🐆
[12:43 pm, 28/02/2020] +91 90942 22931: చాలా మంచి సందేశం. 🙏🙏
[12:49 pm, 28/02/2020] Bhavanl10: Tq 🌷 Uma ji
🙏🙏🙏🙏🙏💐


జ్ఞానం అంటే ఏమిటి?

జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. దీనినే చాల మంది వేరే వారిని అవహేలనగా కూడ, తమాషాగా కూడ మాట్లాడుకుంటారు.అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది.

 కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం?
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం.

అంతే కాని మనం ఇప్పుడు చదివిన BB.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.    
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.

జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రకృతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.
శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చూడండి.

1.      ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.

2.      జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.

3.      అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలే ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.

4.      ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.

5.      అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.

6.      పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.