Monday 23 May 2022

ధర్మో రక్షతి రక్షితః


           ధర్మో రక్షతి రక్షితః

* జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు.

* మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. 

* మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే.

* ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది.

* ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి.

* ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతోంది.

* శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటాడు.

* అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి.

* అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు.

* మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో విపులంగా వివరించి చెప్పింది మహాభారతం.

* ఏ కర్మలైతే మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో ఆచరించకూడదు.

* అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ చెబుతాడు.

* వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పినవాటిని అర్ధశ్లోకంలో వివరిస్తున్నానని ఈ విధంగా ఉపదేశిస్తారు.

* ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది. ఇదే అసలైన ధర్మసూక్ష్మం.

* ధర్మాచరణమే పరమధర్మమని, సచ్ఛీలమే తపస్సని, సచ్ఛరిత్రమే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు.

* బ్రహ్మచారి అయిన శ్రవణ కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూ, వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రుల సేవచేస్తూ ఆత్మశక్తిని పెంపొందించుకున్నాడు.

* ధర్మవ్యాధుడు స్వధర్మ ఆచరణతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు సేవచేస్తూ వేదవిహిత కర్మలతో తపోశక్తిని సాధించిన కౌశికుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేశాడు.

*  కుక్కుటముని తనకు సమీపంలో ఉన్న గంగను, కాశిని సేవించక తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు.

* అందుకే మనిషి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి.

* ధర్మాచరణతో అందరికీ తోడ్పడాలి.

* భోగాలను విడిచి త్యాగగుణం పెంచుకొమ్మంటుంది ధర్మం.

* అహంకారం వదిలి ఆత్మతత్వం గ్రహించమని చెబుతుంది.

* యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడు తల్లిదీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించమంటాడు.

* అప్పుడు గాంధారి, ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని దీవిస్తుంది.

* ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు.

* ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతిలో ఇలా వివరిస్తాడు. ..

* మానవుడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమిపైన, గోసంపదను పశువుల శాలలో విడిచి మరణిస్తున్నాడు. భార్య ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది. మిత్రులు శ్మశానం వరకు వచ్చిపోతారు. ఎంతో ప్రేమగా పోషించుకున్న శరీరం చితిమంటల్లో భస్మమైపోతుంది. జీవుడితో వెళ్లగలిగేది ధర్మం ఒక్కటే.

* తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమధర్మం. నిస్సహాయులకు, వృద్ధులకు సహాయం అందించడం మానవతా ధర్మం.

* ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని నీవు ఇతరులకు చేయడం నిజమైన ధర్మం.

* ధర్మాన్ని అనుసరించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

* ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది.

* ఎంతటి క్లిష్ఠపరిస్థితుల్లోనూ ధర్మం విడవకూడదని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.

      *లోకాసమస్థాః సుఖినోభవంతు*

*****

అధముల కధికారముయే

మదమెక్కినదైన రాజ్యమేఇది భయ్యమ్

విధిరాతలుమార్చరులే

మదిలో మెదిలే అనేకమైన వి కధలే

చమత్కార పద్యం

ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం

అంచిత చతుర్ధ జాతుడు

పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్

గాంచి, తృతీయం బక్కడ

నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!

భావం:

గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.... 

ఏమీ అర్థం కాలేదు కదా!? ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం. 

ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి. 

చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు,

 పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము,

ప్రధమ తనూజ అంటే భూమిపుత్రి సీత,

 తృతీయము అంటే అగ్ని ,

 ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి ఇప్పుడు భావం చూడండి.... 

హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం 

ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.!!! 

 *****


0 Com

దొరికేసింది  శ్లోకము.. ప్రధమాంకము లో ఉన్నది..

అద్వైతం సుఖ దుఃఖయో రనుగతం సర్వాస్వవస్థాసు య

ద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్న హార్యో రసః

కాలేనావరణాత్య యాత్పరిణతే యత్స్నేహ సారే స్థితం

భద్రం తస్య సుమానుషస్య కధమప్యేకం హి తత్ప్రార్ధ్యతే

సుఖ దుఃఖయో = సుఖములందు దుఃఖములందు

యత్ అద్వైతం =  ఏకముగా ( రెండు కానిది )ఉండేది ఏదో

సర్వాసు అవస్థాసు = అన్ని అవస్థల యందునూ 

( కలిమి లేమి మొదలగు )

యత్ అనుగతం = ఏది అనుసరించునదో

యత్ర = దేనియందు

హృదయస్య = మనస్సునకు

విశ్రామః = విశ్రాంతి యో

యస్మిన్ = దేనియందు

జరసా = ముసలి తనము చే

రసః = ప్రీతి

అహార్య = హరింప బడదో

కాలేన = కాలముగడచు టతో

ఆవరణ అత్యయాత్ = అ రమరికలు తొలగి పోవుట వలన

పరిణతే = పరిపక్వత నందిన

ప్రేమ సారే = ఉన్నత మైన అనురాగము నందు

యత్ స్థితం = ఏది నిలుచునో

తస్య సుమానుషస్య = ఆ మానవ దాంపత్య మునకు

తత్ ఏకం భద్ర = ఒకే ఒక భద్ర స్థితి

కధమపి = ఎట్లైననూ

ప్రార్ధ్యతే హి = అభిలషింప బడు తున్నది

సుఖ దుఃఖాలను ఇద్దరూ కలిసి ఒకటి గా అనుభవించటం, కలిమి లేమి లలో కలిసి పయనించటం, మనస్సులను పరస్పరము ఊరడిల్లచేసుకోటం, ముసలి తనం లో కూడా ప్రీతి తగ్గక పోవటం, కాలము గడుస్తున్న కొద్దీ అరమరికలు పోయి ప్రేమసారంగా గాఢ పరిపక్వత చెందటం ఇవన్నీ ఉత్తమ దాంపత్య లక్షణములు..

ఇలాంటి ఈ దాంపత్యానికి అన్ని విధాల భద్రమగును గాక అన్నది ఒక్కటే నేను కోరుకుంటున్నాను...

ఇది కూడా శ్రీ రామచంద్రుడు చెప్పినట్టే భవభూతి చెప్పారు...ఉత్తర రామ చరిత లోనే....

ఏమాట కామాట అదిరింది శ్లోకము...

ఇంక doubt లేదు..this is final..మీ మిత్రునికి forward చేసేయ్....

*****

No comments:

Post a Comment