Friday 13 May 2022




----
🧘‍♂️101-ఉపనిషత్ సూక్తి 🧘‍♀️
101. వట బీజస్థమివ దత్తబీజస్థంసర్వం జగత్||

(దత్తాత్రేయోపనిషత్)

- మఱ్ఱి విత్తనములో మఱ్ఱి చెట్టున్నట్లే దత్తబీజమున ఈ జగత్తంతయును ఉన్నది.

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!




🧘‍♂️విచక్షణ🧘‍♀️

నన్ను ప్రేమతో ఆరాధిస్తూ , నాయందే మనస్సు నిలిపిన వారికి బుధ్ధి యోగాన్నిస్తాను; దాని ద్వారా వారు నన్ను సంపూర్ణంగా పొందగలరు.
భగవాన్ కృష్ణ  / భగవద్గీత లో

ॐ卐సుభాషితమ్ॐ

గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం

5)  క్షమా మండలే భూపభూపాలబృన్దైః | సదాసేవితం యస్య పాదారవిన్దమ్ |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||

అర్ధము:-  ఒక దేశానికి మహారాజు అయినప్పటికీ, ఎందఱో రారాజులు పాదాక్రాంతులై సేవిస్తున్నప్పటికీ, గురుని పాదపద్మములపై లగ్నంకాని మనస్సు వుంటే వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

మహారాజులతో పాటు సామాన్య వ్యక్తులు కూడా భావించేది ఏంటంటే, ఈ విషయభోగాలతో మేము ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం, ఎంతోమంది నుండి గౌరవమర్యాదలను నిత్యం పొందుతున్నాం, వీటితో ఆనందము కలగదని చెప్పడం శుద్ధఅబద్దం, జ్ఞానగురువులు చెప్పే ఆత్మానందము అంటే ఏమిటో మాకు తెలియదు! అది లభిస్తుందన్న నమ్మకం కూడా లేదు! అందుచేత ఈ ఇంద్రియసుఖమును వదలుకొని, అస్సలు తెలియని ఆత్మసుఖము కోసము ప్రయత్నించడం తెలివితక్కువ పని అవుతుంది కదా??

మంచి భావనే, కానీ కొంచెము ఆలోచిస్తే, ఇక్కడ సుఖమన్నది బయట పదార్ధములలో లేదు, మనలోనే వుంది, మనమే అనుభవిస్తున్నామని అర్ధమవుతుంది. ఎందుచేతనంటే కొందరికి సుఖమును కలిగించిన వస్తువు, వేరొకరికి కలిగించపోవచ్చు. ఆ పదార్ధముద్వారా పొందిన ఆనందం దానిని అనుభవించిన కొన్నాళ్ళకు పోయి విసుగు కలగవచ్చు, అప్పుడు ఆనందము కోసము ఇంకో కొత్తవస్తువును వెతుక్కుంటాము. అది దొరక్కపొతే అసహనం, కోపము కలిగి అశాంతికి లోనౌతాము.

అంటే మునుజులు పొందుతున్న ఆనందము, అసహనం, కోపము వారిలోనే వున్నాయి కానీ వస్తువులలో లేదన్న విషయము బోధపడుతుంది. ఒకవేళ ఆ సుఖము వస్తువులోనే ఉంటే, అది అందరికి అన్ని వేల యందు ఆనందాన్ని కలిగించాలి కదా! అందుకే “కడుపునిండితే గారెలు చేదు" అన్నారు పెద్దలు. మనుజులలో నున్న అజ్ఞానమే, బాహ్య వస్తువులందు సుఖభ్రాంతికి కారణము.

మానవుడు గాఢనిద్రలో నున్నప్పుడు, బాహ్యవస్తువులను మరచి, వాటియందు ఆసక్తిని విడచి, తన దుఃఖములను కూడా మరచి, తనయందే అమితసుఖమును పొందుతున్నాడు కదా! ఈ తాత్కాలిక ఉపశమనము(సుషుప్తి) యందే ఇంత సుఖమును అనుభవిస్తే, ఇక జ్ఞానముతో కూడిన శాశ్వత ఉపశమనరూపమగు సమాధిస్థితియందు ఎంత ఆనందమును పొందగలడు? కావునా శాశ్వతానందం పొందుటకు, తాత్కాలిక వస్తుసుఖమును పరిత్యజించాలి.

ఎవడు రాగద్వేషములకు వసుడుకాడో, ఎవడు వేషభాషలకు ప్రాధాన్యత ఇవ్వకా ద్వందాలను అతిక్రమిస్తాడో అతడే గురువు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!

అటువంటి సద్గురుని పాద పద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!

___


. మిత్రులందరికి నృసింహ జయంతి శుభాకాంక్షలు 

. శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం 


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |

యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧ 


బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |

లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౨ 


సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |

త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౩ 


సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |

ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౪ 


సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |

దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౫ 


సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |

ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౬ 


సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |

నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౭ 


సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |

ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౮ 


సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |

వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౯ 


సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |

ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౦ 


సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |

ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౧ 


బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |

ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౨ 


లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |

బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౩ 

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |

వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౪ 

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |

మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౫ 

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |

భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్  ౧౬ 

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |

యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్  ౧౭

***



*అమృతస్య పుత్రాః*
*శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 5*

భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలన్నీ అటు ఆధ్యాత్మికోన్నతికే కాక, నిత్యజీవన వికాసానికి కూడా దీపాలై వెలుగుచూపిస్తాయనడంలో సందేహంలేదు. 
రామకృష్ణులు ఎంతటి సంక్లిష్ట భావజాలాన్నైనా, సరళంగా నీతికథల రూపంలో వివరించి, విశ్లేషించేవారు. అలా మనస్సు చేసే మాయాజాలంతో మనిషి ఎలా తన పతనాన్ని తనే కొనితెచ్చు కుంటాడో ఒక మారు సోదాహరణంగా వివరించారు ఆ అవతార పురుషులు. 

మనస్సు కోరే గొంతెమ్మ కోరికలకు మనిషి లొంగిపోతే, విపరీత పరిణామాలకు దారితీస్తుంది. మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా ఉండాల్సిన మనస్సుకు సరైన శిక్షణనివ్వకపోతే అదే మనకు పరమశత్రువై నాశనం చేస్తుంది. నిజానికి మన జీవితానికి సంబంధించిన విజయ వైఫల్యాలన్నీ మనస్సుకు ఏ విధంగా శిక్షణనిచ్చామన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.

ఈ పరమ సత్యాన్ని పరమహంస కథగా చెప్పి, మనల్ని సున్నితంగా హెచ్చరించారు.

గంటల తరబడి ప్రయాణించి, ప్రయాణించి అలసిపోయిన ఓ బాటసారి నిలువనీడ లేక విలవిల్లాడిపోతున్నాడు. నడి నెత్తిన సూరీడు. దాహంతో నోరు ఎండిపోతోంది. ఎడారి లాంటి మైదానంలో చివరకు ఓ చెట్టు కనిపించి, బ్రతుకు జీవుడా అనుకుంటూ దాని నీడన చతికిలపడ్డాడు. 

“అబ్బా! ఎంత అలసిపోయాను. ఇప్పుడు మంచి భోజనం లభిస్తే, ఎంత బాగుంటుంది” అనుకున్నాడు. అనుకున్నట్లే పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన భోజనం అతని ముందు ప్రత్యక్షమైంది. 'ఇప్పుడు ఒక చక్కని పరుపు, మంచం ఉంటే ఎంత బాగుండు! ఎంచక్కా నిద్ర పోయేవాణ్ణి'అనుకున్నాడు. ఆశ్చర్యంగా వెంటనే చక్కని మంచం ప్రత్యక్షమైంది. ఆ బాటసారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

ఇక మనస్సు పరిపరివిధాల పరుగెత్తడం ప్రారంభించింది. ఎంచక్కా మంచంపై పడుకున్న బాటసారి మనస్సు ఆశలు తొడగడం ప్రారంభించింది. 'భలే! భలే! ఇదే వేళ అందమైన యువతి వచ్చి నాకు సపర్యలు చేస్తే ఎంత బావుంటుంది' అనుకున్నాడు. అద్భుతం! వెంటనే పదహారేళ్ళ అందమైన అమ్మాయి, ఆ బాటసారి పాదాల దగ్గర ప్రత్యక్షమై కాళ్ళు పట్టి సపర్యలు చేయడం ఆరంభించింది. 

ఆ బాటసారి ఆనందానికి అంతే లేదిక! ఇంకేముంది, తాను ఏమనుకుంటే అవి  తీరిపోతున్నాయని ఉబ్బితబ్బిబ్బైపోయాడు ఆ అమాయక జీవి. అనూహ్యంగా సంభవిస్తున్న ఈ వింతలను చూసి, ఆ
బాటసారి మనస్సులో మరో సందేహం కలిగింది. 
'అవును! ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఈ నిర్జన ప్రదేశంలోఅకస్మాత్తుగా ఓ పులి వస్తే నా పరిస్థితి ఏం కాను?”అని అనుకున్నాడు. 

అంతే! ఎక్కడి నుంచి వచ్చిందో, ఓ పులి రానే 
వచ్చింది. ఆ అభాగ్యుడిపై పంజా విసరడం, రక్తం తాగడం క్షణాల్లో జరిగిపోయింది. ఇలా మనస్సును యథేచ్ఛగా స్వైరవిహారం చేయిస్తే పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో ఈ బాటసారి కథలో శ్రీరామకృష్ణ పరమహంస సుందరంగా ఉదాహరించారు.

మనస్సును సరైన దిశలో పయనింపజేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కానీ దానికి దిశానిర్దేశం చేయడంలో మన వివేకం, విజ్ఞతను ఉపయోగించకపోతే, కళ్ళాలు లేక అదుపు తప్పిన అశ్వంలా పరుగెడుతుంది. 

ఆధునిక మానసిక విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు తరచూ ఉటంకించే Mind management, Mind maping అంశాలపై ఆనాడే శ్రీరామకృష్ణులు, దివ్యజనని శారదామాత అద్భుతమైన సూచనలు ఇచ్చారు. 

మనస్సు పైనే సమస్తమూ ఆధారపడి
 ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రాథమికంగా మనస్సుకు సకారాత్మకమైన, ఆరోగ్యకరమైన రీతిలో శిక్షణనిస్తే అది నిరంతరం మన అదుపులోనే ఉంటూ, మన పురోగమనానికి సహకరిస్తుంది.

.......

*🌹. ఈ క్రింది 26 దోషాలు మనుష్యుని నరకం వైపు పయనింపచేస్తాయి - 1 🌹*

*🌻. భవిష్య పురాణం 5వ అధ్యాయము 🌻*

సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

*ఈ మనుష్యులెవరనగా*

*(1) అధముడు (2) విషముడు (3) పశువు (4) పిశునుడు (5) కృపణుడు (6) పాపిష్టుడు (7) నష్టుడు (8) రుషుడు (9) దుష్టుడు (10) పుష్టుడు (11) హృష్టుడు (12) కాణుడు  (13) అంధుడు (14) ఖండుడు (15) చండుడు (16) కుష్టు (17) దత్తాపహారకుడు (18) వక్త (19) కదర్యుడు (20) దండుడు (21) నీచుడు (22) ఖలుడు (23) వాచాలుడు (24)చపలుడు (25)మలీమసడు  (26)స్తేయి.*

*(ఈ దోషాలు స్త్రీలకున్నా దోషాలే... )*

*ఈ ఇరవై ఆరుదోషాల్లోనే మళ్ళా భేద, ప్రభేదాలు చెప్పబడ్డాయి.*

*అందుకే వాటిని ఒక్కొక్కటిగా సంగ్రాహంగానైనా వివరించి చెప్పవలసి వుంది. ఇలా :*

*(1) గురువుల వద్దకూ దైవసన్నిధికి చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చుని యుండుట, పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్యధర్మాచరణను చేయుట- ఇవన్నీ అథమసంజ్ఞక దోషాలు.*

*(2)  పైకి ప్రియంగా మధురంగా మాట్లాడుతూ హృదయంలో మాత్రం హాలాహలాన్ని కలిగియుండి చెప్పేదొకటిగా చేసేదొకటిగా జీవించేవాడు విషముడు.*

*(3) మోక్షమును గురించి అసలు ఆలోచించకుండా, ప్రాపంచిక విషయవాంఛలలోనే మునిగితేలుతూ, హరి సేవ వూసే తలపక, ప్రయాగలో వుంటూ ఇంకెక్కడో స్నానం చేస్తూ, ప్రత్యక్ష దైవాలను విస్మరించి అదృష్టభాగ్యాన్ని వెతుకుతూ, శాస్త్రసారాన్ని బొత్తిగా పట్టించుకోకుండా వుండేవాడు పశువు.*

*(4) బలంతోగాని, వేషంతోనో మోసంతోనో గాని, మిథ్యా ప్రేమను ప్రదర్శించి గాని మనుష్యులను తన లాభం కోసం ఆపదలలో ముంచేసేవాడు పిశునుడు.*

*(5)  దేవ, పితృ కార్యాలలో మంచి అన్నం పెట్టే స్తోమతు వుండీ కూడా మ్లానమై అశుభ్రమైన అన్నాన్ని భోజనాలలో వడ్డించే దుర్బుద్ధియైన మానవుడు కృపణుడు. వానికి స్వర్గమూ దొరకదు; మోక్షమూ లభింపదు.*

*అప్రసన్నమైన మనసుతో కుత్సిత వస్తువులతో దాన కర్మలను గావిస్తూ కోపంగా మొహం మాడ్చుకొని పూజలను చేసేవాడూ కృపణుడే. శరీర విక్రయదారులు కూడా కృపణులే.*

*(6) మాతాపితలను, గురువులను వారి కర్మకు వారిని వదలివేసి హోమ-యజ్ఞాల నిర్వహణలో కూడా లోపం చేసేవారు పాపిష్టులు.*

*(7) సాధనాచరణను పరిత్యజించి, అసత్యపు సేవాప్రదర్శన చేయువాడు, వేశ్యాగామి, దేవధనం ద్వారా స్వంత పబ్బం గడుపుకొనేవాడు, భార్యచేత వ్యభిచారం చేయించి బతుకు నిలుపుకొనేవాడు, కన్యలను తెచ్చి అమ్ముకొనో మరే విధంగానో మొత్తానికి స్త్రీధనం ద్వారానే  అపసవ్యంగా అక్రమంగా బతికేసేవాడు పురాణ పరిభాషలో నష్టుడన బడతాడు.*

*(8) మనసులో ఎప్పుడూ క్రోధమే తప్ప మరో మనోవికారమూ, సరాగమూ వుండనివాడు, తన హీనతను తానే తలచుకొని మరీ కోపం తెచ్చేసుకుని చల్లటి వాతావరణాన్ని మంట సెగలపాలు చేసేవాడు  (ఉడుకుమోతువాని ముఖాన కునుబొమలు శాశ్వతంగా ముడివడే ఉంటాయి. చిరునవ్వన్నది వుండదు ) - ఇలాంటి వాడు రుష్ఠుడు*

*(9) అకార్య లేదా నిందిత ఆచరణ ద్వారానే జీవించే వాడు. ధర్మకార్యమేదీ పూర్తిగా చేయని వాడు.*

*నిద్రాళువు, దుర్వ్యసనాలపై ఆసక్తిగలవాడు, మదిరాలోలోడు, స్త్రీలను సేవిస్తుండేవాడు, ఎల్లపుడూ దుష్టులుగా జగత్రసిద్ధులైన వారి సాంగత్యంలోనే తిరుగుతుండేవాడు దుష్టుడనబడతాడు.*

*(10) మధుర, మృష్టాన్న భోజనాన్ని తానొక్కడే తినేవాడు, వంచకుడు, సజ్జనులను నిందించేవాడు, శుకర (మద్యశాల వంటి వాటిని శుభ్రపరచుట)తో సమానమైన వృత్తి చేసేవాడు పుష్టుడు.*

*(11) నిగమాగమాలను అంటే వేదతంత్రాలను అధ్యయనం చేయకపోగా, వినడానికి కూడా రానివాడు హృష్టుడు*

*(12, 13) శ్రుతులు, స్మృతులు బ్రాహ్మణ్యానికి రెండు కళ్ళు. ఒకటి లేనివాడు కాణుడు, రెండూలేనివాడు అంధుడు.*

*(14) అన్నదమ్ములతో కయ్యమాడేవాడు, మాతాపితలను అప్రియవచనాలతో బాధించువాడు ఖండుడవుతాడు.*

*(15) శాస్త్రనింద జేయువాడు, చాటున కొండెములు చెప్పేవాడు, రాజ్ మాగీ, శూద్రసేవకుడు, శూద్రపత్నులతో అనాచర చేసేవాడు, శూద్రగృహంలో వండబడిన అన్నాన్ని ఒకమారు తిన్నా, శూద్రగృహంలో అయిదు రోజులు నివసించినా... వాడు చండుడనబడతాడు.*

*(16) కుష్టుడు :*

*ఎనిమిదిరకాల కుష్టురోగాలు కలవాడు, లేదా మూడురకాలైనా వున్నవాడు, శాస్త్ర నిందులతో కలిసి తిరిగేవాడు కుష్టుడు*

*(17) దత్తాపహారకుడు :*

*కీటకంలా తెగ తిరిగేవాడు, కుత్సిత దృష్టితోనే వ్యాపారం చేసేవాడు, దత్తాపహారకుడన బడతాడు.*

*(18) వక్త :*

*కుపండితుడై, అజ్ఞానియై ఉండి కూడా ధర్మోపదేశాలు చేసేస్తుండే వాడు వక్త. (వక్త అనే మాటకి ప్రస్తుతం మాత్రం మంచి అర్థముంది. అదే రూఢి)*

*(19) కదర్యుడు :*

*గురుజనుల వృత్తులను అపహరించడానికి ప్రయత్నించేవాడు. కాశీ నివాసి అయివుండి కూడా కాశినొదిలేసి బహుదినాలు బయటి ఊళ్ళల్లో వుండేవాడు కదర్యుడు.*

*(20) ఉద్దండుడు :*

*మిథ్యాక్రోధాన్ని ప్రదర్శిస్తూ, దండవిధానంలో, అమలులో కల్పించుకొని జనులను దండించేవాడు దండదోషి లేదా ఉద్దండుడు.*

*(21) దురాచారి :*

*బ్రాహ్మణ, రాజ, లేదా దేవ సంబంధి ధనాన్ని అపహరించి మరొక బ్రాహ్మణునికో దైవానికో పెట్టేవాడు, ఆ ధనంతో భోజనాలు పెట్టేవాడు, అక్షరాభ్యాసముండి చదవడానికి గాని, బలవంతాన చదివినా అర్థం చేసుకోవడానికి గాని ప్రయత్నించని వాడు, అనాచారి, దురాచారి నీచుడు.*

*(22) ఖలుడు :*

*గుణవంతులలో సజ్జనులలో దోషాలు వెతకడమే పనిగా పెట్టుకొనేవాడు ఖలుడు.*


*(23) వాచాలుడు :*

*భాగ్యహీనులను పరిహాసయుక్తంగా, వెటకారంగా సంబోధించి వేధించేవాడు, చండాలురతో మరీ బహి రంగంగా సల్లాపము లాడేవాడు వాచాలుడు.*

*(24) చపలుడు :*

*పక్షులను పెంచి అమ్ముకొనేవాడు పిల్లిపిల్లీ తగువులాడుకొని కోతి దగ్గరకు ధర్మంకోసం వెళితే రెండిటినీ మోసం చేసిన కోతిలాగా మానవద్రవ్యాలను భక్షించేవాడు, మాంస భక్షకుడు, అన్యాంగనాసక్తుడు, మట్టిపెళ్లలను పగులగొట్టేవాడు (వ్యంగా) చపలుడనబడతాడు.*

*(25) మలీమసుడు :*

*నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి పోసుకోవడం వంటి శరీరశుద్ధికర్మ ఏనాడూ చేసుకోనివాడు, నిత్యశరీర శుభ్రతకర్మలేవీ చేపట్టనివాడు మలీమసుడు.*

*(26) స్తేయి :*

*చోరుడు దొంగతనం చేయడమేకాక మాతా పితలను పోషించకుండుట, గురువును గౌరవించకుండుట, మంచి ఆలోచనేదీ మనసులో లేకుండుట స్తేయి లక్షణాలు.*

*🌻. ఈ దోషాలలో ఏ ఒక్కటీ లేనివాడే నిజమైన మనిషి 🌻*

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment