Sunday 13 February 2022

బుధవారం కధలు




🌹. మాఘ పౌర్ణమి, శ్రీ త్రిపుర భైరవి జయంతి శుభాకాంక్షలు 🌹
ప్రసాద్ భరద్వాజ

☘️. మాఘ స్నాన స్తోత్రం ☘️

"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ'' 

"దుఃఖములు , దారిద్య్రము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.

🍀. శ్రీ త్రిపుర భైరవీ స్తోత్రం 🍀

శ్రీ భైరవ ఉవాచ-
బ్రహ్మాదయస్స్తుతి శతైరపి సూక్ష్మరూపం
జానంతినైవ జగదాదిమనాదిమూర్తిమ్ |
తస్మాదమూం కుచనతాం నవకుంకుమాస్యాం
స్థూలాం స్తువే సకలవాఙ్మయమాతృభూతామ్  ౧ 

సద్యస్సముద్యత సహస్ర దివాకరాభాం
విద్యాక్షసూత్రవరదాభయచిహ్నహస్తాం |
నేత్రోత్పలైస్త్రిభిరలంకృతవక్త్రపద్మాం
త్వాం తారహారరుచిరాం త్రిపురాం భజామః  ౨ 

సిందూరపూరరుచిరాం కుచభారనమ్రాం
జన్మాంతరేషు కృతపుణ్య ఫలైకగమ్యాం |
అన్యోన్య భేదకలహాకులమానభేదై-
-ర్జానంతికింజడధియ స్తవరూపమన్యే  ౩ 

స్థూలాం వదంతి మునయః శ్రుతయో గృణంతి
సూక్ష్మాం వదంతి వచసామధివాసమన్యే |
త్వాంమూలమాహురపరే జగతాంభవాని
మన్యామహే వయమపారకృపాంబురాశిమ్  ౪ 

చంద్రావతంస కలితాం శరదిందుశుభ్రాం
పంచాశదక్షరమయీం హృదిభావయంతీ |
త్వాం పుస్తకంజపపటీమమృతాఢ్య కుంభాం
వ్యాఖ్యాంచ హస్తకమలైర్దధతీం త్రినేత్రాం  ౫ 

శంభుస్త్వమద్రితనయా కలితార్ధభాగో
విష్ణుస్త్వమంబ కమలాపరిణద్ధదేహః |
పద్మోద్భవస్త్వమసి వాగధివాసభూమి-
రేషాం క్రియాశ్చ జగతి త్రిపురేత్వమేవ  ౬ 

ఆశ్రిత్యవాగ్భవ భవాంశ్చతురః పరాదీన్-
భావాన్పదాత్తు విహితాన్సముదారయంతీం |
కాలాదిభిశ్చ కరణైః పరదేవతాం త్వాం
సంవిన్మయీంహృదికదాపి నవిస్మరామి  ౭ 

ఆకుంచ్య వాయుమభిజిత్యచ వైరిషట్కం
ఆలోక్యనిశ్చలధియా నిజనాసికాగ్రాం |
ధ్యాయంతి మూర్ధ్ని కలితేందుకలావతంసం
త్వద్రూపమంబ కృతినస్తరుణార్కమిత్రం  ౮ 

త్వం ప్రాప్యమన్మథరిపోర్వపురర్ధభాగం
సృష్టింకరోషి జగతామితి వేదవాదః |
సత్యంతదద్రితనయే జగదేకమాతః
నోచేద శేషజగతః స్థితిరేవనస్యాత్  ౯ 

పూజాంవిధాయకుసుమైః సురపాదపానాం
పీఠేతవాంబ కనకాచల కందరేషు |
గాయంతిసిద్ధవనితాస్సహకిన్నరీభి-
రాస్వాదితామృతరసారుణపద్మనేత్రాః  ౧౦ 

విద్యుద్విలాస వపుషః శ్రియమావహంతీం
యాంతీముమాంస్వభవనాచ్ఛివరాజధానీం |
సౌందర్యమార్గకమలానిచకా సయంతీం
దేవీంభజేత పరమామృత సిక్తగాత్రాం  ౧౧ 

ఆనందజన్మభవనం భవనం శ్రుతీనాం
చైతన్యమాత్ర తనుమంబతవాశ్రయామి |
బ్రహ్మేశవిష్ణుభిరుపాసితపాదపద్మం
సౌభాగ్యజన్మవసతిం త్రిపురేయథావత్  ౧౨ 

సర్వార్థభావిభువనం సృజతీందురూపా
యాతద్బిభర్తి పునరర్క తనుస్స్వశక్త్యా |
బ్రహ్మాత్మికాహరతితం సకలంయుగాంతే
తాం శారదాం మనసి జాతు న విస్మరామి  ౧౩ 

నారాయణీతి నరకార్ణవతారిణీతి
గౌరీతి ఖేదశమనీతి సరస్వతీతి |
జ్ఞానప్రదేతి నయనత్రయభూషితేతి
త్వామద్రిరాజతనయే విబుధా పదంతి  ౧౪ 

యేస్తువంతిజగన్మాతః శ్లోకైర్ద్వాదశభిఃక్రమాత్ |
త్వామను పాప్ర్యవాక్సిద్ధిం ప్రాప్నుయుస్తే పరాంశ్రియం  ౧౫ 

ఇతితే కథితం దేవి పంచాంగం భైరవీమయం |
గుహ్యాద్గోప్యతమంగోప్యం గోపనీయం స్వయోనివత్  ౧౬ 

ఇతి శ్రీరుద్రయామళే ఉమామహేశ్వర సంవాదే పంచాంగఖండ నిరూపణే శ్రీభైరవీస్తోత్రమ్ |
🌹 🌹 🌹 🌹 🌹
సుమతీ శతకము.!.......లో కొన్ని పద్యాలు 

 పూర్వ కాలంలో ఈ సుమతీ శతకం లోని పద్యాలు రాని వారు తెలుగునాట ఉండేవారు కారు.కాని ఇప్పుడు ఇంగ్లీషు Rhymes ను తమ పిల్లల చేత పాడించుకుంటూ తన్మయం లో మునిగిపోయి , మమ్మీడాడీ లమై పొయిన మనం ఈ నీతిశతకాలను మరచి పోవుచున్నారు.
అందుకనే నావంతుగా ఇందు పొందు పరుస్తున్నాను 

ప్రింట్ తీసుకొని చదివించగలరు 
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా
నెక్కినఁ బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ ! .....  1-09-2020

ఓ సుమతీ.! అవసర సమయం లో వచ్చి సహాయ పడని బంధువు , నిత్యము పూజలు చేసినా కష్టాలొచ్చినపుడు ఆదుకోని దేవుడు , యుద్ధరంగము లోకి దూకిన తరువాత పరుగెత్తని గుఱ్ఱము , ఇవి ఉండి కూడ ప్రయోజనం లేనివి కాబట్టి వీటిని వెంటనే వదలివేయాలి.

బంధము వలన ఏర్పడేదే బంధుత్వము . వారి పిల్లను మనం చేసుకోవడమో , మన పిల్లవాడిని వారికివ్వడమో ఇటువంటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాల మూలంగా ఏర్పడే వాళ్ళే బంధువులు . మంచి చెడ్డలకు కలిసి వస్తారనే కదా వారిని మనం కలుపు కొనేది. మరి అవసర సమయం లో ఉపయోగని ఆ బంధము ఉన్నా లేకపోయినా ఒకటే కదా.!

                                                                    *****
కొలువు

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్
వడిగల ఎద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ !

ఓ సుమతీ.! సమయానికి జీతమివ్వక పోగా అవసరమొచ్చిందని అడిగినా జీతం ఇవ్వని మిడిసిపాటు గల యజమానిని సేవించడం కంటే మంచి ఎడ్ల జతను కూర్చుకొని , వ్యవసాయం చేసుకొని బ్రతకడమే ఉత్తమమైన పని.

అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయబొకు కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దోడరయకొంటి నరుగకు సుమతీ !

ఓ మంచి బుద్ధిగలవాడా! ఒక మాట అనుకోకుండా ఎంతో కొంత ఇస్తారులే అనో , ఎప్పటికో అప్పటికి శాశ్వతమౌతుందనో ఆశ పడి ఉద్యోగం లో చేరడం , దేవాలయాధికారిగా పెత్తనం చేయడం , చెడ్డవారి తో స్నేహం చేయడం , అడవి లో తోడులేకుండా ఒంటరి గా ప్రయాణం చేయడం అనేవి మంచివి కావు . అనగా బుద్ధిమంతుడు ఆచరించ దగ్గవి కాదు.

అధరము గదలియుఁ గదలక
మధరములగు భాష లుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ !



ఓ సుమతీ ! పెదవి కదిలీ కదలనట్లు అంటే మాట వినబడీ వినబడనట్లు మాట్లాడుతూ , మౌనాన్ని పాటిస్తూ , అధికారమనే రోగము చే నిండిన అధికారిని చూడటం చెవిటి ,గుడ్డి శవాన్ని చూసినంత పాపము.
అప్పు

అప్పుగొని సేయు విభవము


ముప్పునఁ బ్రాయంపు టాలు, మూర్ఖుని తపముం
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీదఁ గీడుఁ దెచ్చుర సుమతీ !

ఓ సుమతీ ! అప్పు చేసి తెచ్చుకొని అనుభవించే విలాసాలు , ముసలితనం లో యవ్వన వంతురాలైన భార్య , సంపూర్ణ జ్ఞానము లేని మూర్ఖుని తపస్సు , అంటే తానెందుకు తపస్సు చేస్తున్నానో కూడ నిర్ణయించుకోకుండా చేసే మూర్ఖుని తపస్సు, , తప్పులు చేసిన వారిని గుర్తించి , దండించలేని రాజు గల రాజ్యము , అనేవి సహించరానివే కాదు తదనంతర కాలంలో అనేక ఆపదలకు కూడ కారణాలౌతాయి.

అప్పిచ్చువాడు , వైద్యుడు,
నెప్పుడు నెడతెగక పాఱు నేఱున్ , ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ !

ఓ సుమతీ.! అత్యవసర మొచ్చినపుడు డబ్బును అప్పు గా ఇచ్చేవాడు , రోగం వచ్చినపుడు మందు ఇచ్చే వైద్యుడు , ఎల్లవేళలా ప్రవాహం కలిగిన నది , మంచి చెడ్డలు చెప్పడానికి , చేయించడానికి బ్రాహ్మణుడు ఉన్న ఊరిని మాత్రమే బుద్ధిమంతుడు నివసించడానికి ఎన్నుకుంటాడు. ఇవి లేని గ్రామం నివాసయోగ్యం కాదు.

ఈ పద్యం సంస్కృతం లోని ఒక నీతి శ్లోకానికి ఛాయానువాదం గా భావిస్తున్నారు .
“ ఋణ దాతా చ వైద్యశ్చ శ్రోత్రియ స్సుజలా 
యత్ర హ్యేతే నవిద్యంతే నతత్ర దివసం వసేత్ !! అనేది దీని మూల శ్లోకం

ఆకలి

ఆకొన్న కూడె యమృతము
తాఁ కొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోఁ కొర్చువాడె మనుజుడు
తేఁకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !

ఓ సుమతీ.! ఆకలివేసి నప్పుడు తిన్న అన్నము అమృత తుల్యం గా ఉంటుంది. ముందు వెనకాడక , శ్రమ అని భావించక దానం చేసిన వాడే దాత . కోపాన్ని నిగ్రహించుకొని ఓర్పు వహించగలవాడే మనిషి. ధైర్యము ,తెగింపు గలవాడే కులదీపకుడు వంశోద్ధారకుడు అయి ఇంటిపేరు నిలపెడతాడు..

ऊँ!

 కమలములు నీట బాసిన ‌‌సోకె కమ్మ నైన నిత్య గమలాప్తు రాసిమి నిలకడైన కమిలె మిత్రులు 

గుడి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువున్నిసాలగ్రామ శిలలకు రుద్ర నమకచమకాలతో, పురుష సూక్తం ,పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు భగవానునకు పుజచేయు వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్ర యందువుంచి, స్నపనము చేసిన జలము కుడా కలిపి ( తులసీదళ సహితమై ,పవిత్రమునూ, పాపహరమునూ అగునీరము తీర్ధము అనబడును) ఇస్తారు.

ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలిబాహ్యశుద్ధి, అంతశ్శుద్ధి అని శుద్ధి రెండు రకాలు. తీర్థము అంతశ్శుద్ధికి కల్పించబడింది. మనం ప్రతిరోజు స్నానమాచరించి బాహ్యశుద్ధి చేసుకోగలం. కామ, క్రోధ, లోభ, మహ, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములను జయించినవాడే పరమ పదమును పొందలడు. ఈ అంశ్శత్రువులను జయించుటకు మనస్సు శుద్ధి చేసుకొనుటకోసం తీర్థము గ్రహించాలి. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.

భక్తులు ఆలయానికి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత అర్చకుడు భగవంతునికి నివేదించిన తీర్థాన్ని అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు. పరమాణు సమానమైన ఈ తీర్థాన్ని సేవించడం వలన పంచ మహాపాతకాలన్ని తొలగిపోతాయని అర్చకులు చెపుతుంటారు. ఇంతటి పవిత్రమైన తీర్థాన్ని భక్తులు కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి. ఒక వేళ తీర్ధం నేల మీద పడితే అది ఎనిమిది రకాల పాపాలు చుట్టుకుంటాయని భక్తుల నమ్మకం. తీర్థం తీసుకోవడం వలన కలిగే లాభాలు.. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని, పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు. భగవంతుడిని నైవేద్యంగా పెట్టిన తీర్థాన్ని భక్తలు తీసుకుంటే వారికి సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం సిద్దిస్తుంది చెపుతుంటారు. అంతే కాక ఆ భగవంతుని ఆశ్వీర్వాదాలను పొందుతారని పురాణాల్లో తెలిపారు. అదే విధంగా తులసితో కూడిన సాలగ్రామ తీర్థాన్ని తీసుకోవడం వలన అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. భగవంతునికి నైవేద్యంగా పెట్టే తీర్థంలో ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం అనే తొమ్మిది పదార్థాలను కలుపుతారు.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలితీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. ద్వితీయంగా స్వీకరించే తీర్థం ధర్మసాధన కోసం, తృతీయంగా తీసుకునే తీర్థం మోక్షము సిద్ధించేందుకు. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుంది.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలితీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.

శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు. ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

తీర్ధమును ఎలా తీసుకోవాలి?

మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత ,అనంతా ,గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి. తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు.తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి. ఇకపోతే అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఓ విశేషం ఉంది. హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది. అదేవిధంగా చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది. అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్నిఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ, అవి అన్నీ దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పట్టి తీర్థం తీసుకుంటారు. గుళ్లో తీర్ధం తీసుకోగానే... ఆ చేతిని తలకు రాసుకోవడం చూస్తూ ఉంటాం. చాలామంది ఇలాగే చేస్తారు. నిజానికి అది చాలా తప్పు. కారణం తీర్థం తీసుకోగానే.. చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలిని తలపై రాసుకోకూడదు. తలపై సహస్రర చక్రం ఉంటుంది. సప్త రుషీ మండల స్థానం కూడా. అందుకే.. ఎంగిలితో  తలను అపవిత్రం చేయరాదు.

తీర్థాల రకాలు తెలుసుకుందాం…

జలతీర్ధం, కషాయ తీర్ధం, పంచామృత తీర్ధం, పానకా తీర్ధం జల తీర్ధం ఈ తీర్ధం సేవించడం ద్వార అకాల మరణం, సర్వ రోగాలు నివారించాభాడుతాయి. అన్నికష్ట్టలు ఉపసమానాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .

కషాయ తీర్ధం

ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు. రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కని కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.

పంచామృత అభిషేక తీర్థం

పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

పానకా తీర్ధం

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునిడికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు.

పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది . దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది . రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు.ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది.

జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ది చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఇవేకాకుండా తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు. వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.

....,....,

మన మహాత్ముడు..

గుజరాత్ రాష్ట్రంలో పుట్టి,

బారిస్టర్ పట్టాను చేపట్టి,

దక్షిణాఫ్రికా లో అడుగెట్టి,

అవమానాలను ఎదురొడ్డి,

అహంకారాన్ని తరిమికొట్టి,

ప్రక్షాళనను చేపట్టి.......!


ఆసేతుహిమాచలం దర్శించి, హింసావాదాన్ని వ్యతిరేకించి, అహింసామార్గాన్ని ఎంచి, గ్రామస్వరాజ్యాన్ని స్థాపించి, సంసమాజాన్ని నిర్మించి , బానిస సంకెళ్లను తెంచి, నవభారతాన్నీ రచించి, బోసినవ్వుల బాపూజీ, భావిభారత దిక్షుచి.....!

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, మనుషులను మనిషిగా చూడని సమాజం,

తారతమ్యాలు లేని సరికొత్త భారతం, శాంతి,అహింసలే తన ఆయుధం,

బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణం, స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి కేతనం...!


ఒంటరిగా పోరాడిన వీరుడు, హింసను విడనాడిన ధీరుడు, అహింసను చేపట్టిన దేవుడు, ఐక్యతను చాటిన నాయకుడు, ఐన్ స్టీన్ కు ఆదర్శప్రాయుడు, హిట్లర్ ను ఆలోచింపచేసిన ఘనుడు, గ్రామగ్రామాలలో, వాడవాడలలో, స్వదేశంలో,

విదేశంలో వినుతి కెక్కిన విశ్వవిఖ్యాతి మన మహాత్ముడు.......!

....


No comments:

Post a Comment