Thursday 17 February 2022

శనివారం -19-02-2022*

 


"వేణునాదః ( ర న జ భ న స ..18/10 )..

శ్రీధరం కమలధవంసుశీలవిబుధజననుతం ,

శ్రీధవం విమలదయాబ్ధిశీతలఫలదహృదయమ్..

మాధవం విపులధరాత్మమానితభరణ పురుషం ,

గోధరం శ్రవణసునామగుహ్యవరదమను భజే !!! 

****
నేటి జీవిత సత్యం.

🌷గొడ్డలి కట్టెలను కొడుతుంది. అది గొడ్డలి గొప్పతనం కాదు!* 

 🌷కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. అది కలం గొప్పతనం కాదు!! 

 🌷మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. అది మన గొప్పతనం కాదు..!!! 

 🔥అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే        
  ఆ గొప్పతనం! ‘మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లo.* 

  🌷అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరుని యందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి. 

 🌷ఒక రోజు.. కాశి వెళ్ళే ట్రైను కదిలింది. ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ ఒక పల్లెటూరి వ్యక్తి రెండు పెట్టెలు నెత్తిమీద పెట్టుకొని ఎలాగో శ్రమపడి రైలు ఎక్కాడు. అతడు రొప్పుతూ రోజుతూ, చెమటలు పట్టి ఉన్నాడు. అటూఇటూ చూచి ఒకచోట సీటు ఉంటే కూర్చున్నాడు. కూర్చొని తాను తెచ్చిన పెట్టెలను తన తలపై ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు. 

 🌷ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఈ పల్లెటూరు ఆసామిని అడుగుతున్నాడు. “అయ్యా! ఆ పెట్టెలను ఎందుకు నెత్తిమీద పెట్టుకొని మోస్తున్నావు..? నీ సీటు క్రింద పెట్టుకోవచ్చు గదా..!” అన్నాడు. 

 🌷దానికా పల్లెటూరి ఆసామి అంటున్నాడు.. "బాబూ! నేను నాకే టికెట్టు తీసుకున్నాను. వీటిని రైలు మోస్తుందో మోయలేదో తెలియదు గదా.. అందుకే నేనే మోస్తున్నాను!” అని అన్నాడట. 

 🌷దానికా వ్యక్తి అతడి అమాయకత్వానికి నవ్వి.. “నాయనా! నిన్నూ, నీ పెట్టెలను అన్నింటిని ఆ రైలే మోస్తుంది. నీవు నెత్తిమీద పెట్టుకున్నా వాటి బరువును రైలే మొయ్యాలి. ఎందుకు అనవసరంగా నెత్తిన పెట్టుకొని హైరాన పడతావు.. క్రింద పెట్టుకో.. ఏం ఫరవాలేదు!” అన్నాడు. 

 🌷అలాగే ... అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమ పడుతూ ఉండరాదు. అన్నీ నావల్లనే జరుగుతున్నవి అనుకోరాదు. ఇదంతా ఒట్టి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది. 

 🌷 కనుక కర్మలన్నింటిని ఈశ్వరుని యందే విడిచిపెట్టాలి.        

 🌷అంటే... ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు. ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు. 

 🌷 ఈశ్వరుని స్మరణతోనే కర్మలను ముగించు..! 

 🌷కర్మఫలాలను గురించి ఆలోచించకు. 
 🌷 లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు. 🌷నేను నిమిత్తమాత్రుడను అని భావించు. 
 🌷 కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు. 

 🌷ఏమి జరిగినా నిశ్చితంగా ఉండు. 
 🌷 నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. 

 🌷ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను ఈశ్వరుని లో సన్యసించుట. 

 🌷ఇలా సర్వ కర్మఫలాలను ఈశ్వరునికి సమర్పించి, ఈశ్వరుని ధ్యానము నే లక్ష్యంగా పెట్టుకోవాలి...✍️

 సేకరణ.👏


శీర్షిక : మల్లె వెలుగు

పట్టుదలే ఉన్న ప్రగతి సాదనమ్ము 
ప్రకృతి సహాయమే మెట్టు విజయ శక్తి, 
మౌన మంటు సాగి పంచు సంతోషం  
గుట్టు భావ మేను గుణము తెలుప గలిగి 

భాష విలువ పెంచె రట్టు కాని బ్రతుకు 
రవ్వ వెలుగు ధైర్య ముంచి 
బ్రతుకు నేర్పు నవ్వ మనెడి మనసు 
నాట్య మాడ దలచె నటన మేధస్సే
     
సవ్య లక్ష్య మేను సామ దాన బేధ 
సమయ తీర్పు లాయ భవ్య విషయ వాంఛ 
బంధ మాయ నేర్పు భాగ్య బ్రతుకు లోన 
మువ్వ లాగ శబ్ద ముత్య మల్లె వెలుగు 
ఇష్ట మైన మనసు 
****

శ్రీ ఆదిశంకరచార్య  విరచితం శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం

ఓంశ్రీమాత్రే నమః


1) మత్తరోగ శిరోపరిస్థిత నృత్య మాన పదాంబుజం!

భక్త చింతిత సిద్ధి కాల విచక్షణం కమలేక్షణం!

భుక్తి ముక్తి ఫలప్రదం భువి పద్మజాచ్యుత పూజితం!

దక్షిణా ముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!


2) విథ్థత ప్రియ మర్చితం ఘృతా కృశా తీవ్ర తపో వ్రతై:!

ముక్తికామి భిరాశ్రితైర్ ముహూర్ ముణిభిర్ ధృడ మానసై:!

ముక్తిదం నిజ పాద పంకజ సత్కమానస యోగినాం!

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!


3) కృత్త దక్ష మఖాది పంబర వీరభద్ర గణే నభై:!

యక్ష రాక్షస మర్త్య కిన్నెర దేవ పన్నగ వందితం!

రత్నభుగ్గణనాధ భృత్ భ్రమరార్చితాంఘ్రి సరోరుహం!

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!


4) నక్తనాథ కళాధరం నగ జాపయోధరం మండలం!

లిప్త చందన పంజ్ఞ కుంకుమ ముద్రి తామల విగ్రహం!

శక్తి మందమ శేష సృష్టి విదానకే సకలం ప్రభుమ్!

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!


5) రక్త నీరజ తుల్య పాదపయోజసధ్మణి నూపురం!

బంధన త్రయ భేదపేశల పంకజాక్షసలీ ముఖం!

హేమశైల శరాసనం పృధుశింఛినీ కృత దక్షగం!

దక్షిణాముఖమాశ్రయే మమ సర్వ సిద్ధి తమీశ్వరం!!


6) యః పఠేచ్ఛ దినే దినే స్తవః పంచరత్నం!

ఉమాపతే పురాతలే మయాకృతం నిఖిలాగమ  మూల మహానలం!

తస్య పుత్ర కళత్ర మిత్ర ధనాని సంతు కృపాఫలాత్!

తే మహేశ్వర శంకరాఖిల విశ్వనాయక శాశ్వతా !!

*****

 మత్స్యావతార వర్ణనము - 2 

అద్భతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది ఇట్లు పలికెను.  "నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయ చేత నీవు నన్నీవిధముగ ఏల మోహపెట్టుచున్నావు?"

మను వీ విధముగా పలుకగా ఆ మత్స్యము ప్రజలకు పాలించుట యందు ( లేదా తనను రక్షించుటయందు) ఆసక్తి గల ఆతనితో ఇట్లనెను- "ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింప చేయటకును అవతరించినాను".

"(నేటినుండి) ఏడవ దివసమున సముద్రము ఈ జగత్తును ముంచివేయును. అపుడు నీదగ్గరకు వ్చచిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షిసమేతుడవై బ్రహ్మనిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టి వేయుము".

ఇట్లు పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా అపుడు నావను ఎక్కెను. ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములు గల బంగారు మత్స్యము (వచ్చెను). దాని కొమ్మునకు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మాత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను. 

కేశవుడు బ్రహ్మనుండి వేదములను అపహరించిన హయగ్రీవు డను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారం ధరించెను.

అగ్ని మహాపురాణములో మత్స్యావతారమను ద్వితీయాధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment