1.
1) నమస్తే భగవన్దేవ దత్తాత్రేయ జగత్ప్రభో |
సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే ||
2) అనసూయా సుత శ్రీశః జనపాతకనాశన |
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ ||
3) భూతప్రేత పిశాచాద్యాః యస్య స్మరణ మాత్రతః |
దూరాదేవ పలాయంతే దత్తాత్రేయం నమామి తమ్ ||
4) యన్నామ స్మరణాద్దైన్యం పాపం తాపం చ నశ్యతి |
భీతర్గ్రహార్తి దుస్స్వప్నం దత్తాత్రేయం నమామి తమ్ ||
5) దద్రుస్ఫోటక కుష్టాది మహామారీ విషూచికాః |
నశ్యంత్యన్యేపి రోగాశ్చ దత్తాత్రేయం నమామి తమ్ ||
6) సంగజా దేశకాలోత్థాః తాపత్రయ సముద్దితాః |
శామ్యంతి యత్స్మరణతో దత్తాత్రేయం నమామి తమ్ ||
7) సర్పవృశ్చిక దష్టాణాం విషార్తానాం శరీరిణామ్ |
యన్నామ శాంతిదం శీఘ్రం దత్తాత్రేయం నమామి తమ్ ||
8) త్రివిధోత్పాత శమనం వివిధారిష్ట నాశనమ్ |
యన్నామ క్రూరభీతిఘ్నం దత్తాత్రేయం నమామి తమ్ ||
9) వైర్యాది కృత మంత్రాది ప్రయోగా యస్య కీర్తనాత్ |
నశ్యంతి దేహబాధాశ్చ దత్తాత్రేయం నమామి తమ్ ||
10) యచ్ఛిష్య స్మరణాత్సద్యో గతనష్టాది లభ్యతే |
యశ్చమే సర్వతస్త్రాతా దత్తాత్రేయం నమామి తమ్ ||
11) జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవమ్ |
భోగమోక్ష ప్రదస్యేమ పఠేద్దత్త ప్రియో భవేత్ ||
12) దేవనాథగురో స్వామిన్ దేశిక స్వాత్మనాయక |
త్రాహి త్రాహి కృపాసింధో పూర్ణ పారాయణం కురు ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీవాసుదేవానంద సరస్వతీవిరచిత దత్తాత్రేయశాంతిస్తోత్రం సంపూర్ణమ్ |
దత్తాత్రేయ శాంతిస్తోత్ర పారాయణేన భగవాన్ సర్వాత్మకం సర్వం శ్రీదత్తాత్రేయ పరబ్రహ్మార్పణమస్తు ||
__(())--
2. "చెరపకురా చెడేవు "
పూర్వం ఒక రాజు ఉండేవాడు...పరమక్రూరంగా , దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు..
అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేసాడు "నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధపెట్టను , అందరితో మంచిగా ఉంటాను , దయగా ప్రవర్తిస్తాను" అని...మాట ఇచ్చినట్టే , మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు..కొంతకాలానికి అందరూ అతన్ని దయగలమారాజు అనుకుంటున్నారు...
మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం , తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది , కారణం చెప్తారా అని అడిగాడు...
రాజు సమాధానం చెప్తున్నాడు..
నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతోంది...నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది...నక్క కుంటిది అయిపోయింది...
ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను..అక్కడ అదే వేటకుక్క ఉంది...
ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదకి విసిరాడు ...ఆ రాయి కుక్కకాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగింది....
అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది...అతను కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు...
ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది...ఒక గుంటలో పడి దాని కాలూ విరిగిపోయింది...
వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన తోచింది...
నక్క కాలు కుక్క కరిస్తే , కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది , మనిషి కాలు గుర్రం తన్నినందువల్ల విరిగితే..గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది...
ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకీ జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది...
అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో..వారందరి వల్ల నేనూ బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది...ఆ క్షణంలోనే నిజాయితీగా ఉండాలని నిర్ణయించు కున్నాను...ఎవ్వరినీ ఇంక కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు...
ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువయినట్టుంది...రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి..కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు..మెట్ల మీద జారి పడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు...రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరిమీద ఆధారపడేలా అయ్యాడు..ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకీ అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కధ సారాంశం..
సర్వే జనా సుఖినోభ వంతు
--(())--
శ్రీమతి మాటలు కొన్ని పరిస్థితిలో ఉద్రేకం తెప్పించ వచ్చు, మరో పరిస్థితిలో శాంతింపచేయవచ్చు అయినా మానముమాత్రం తక్కవేమతినలేదు, వారినిఉడికిసాం ఏఏడిపిస్తాం, నవ్విస్తాం అన్నీ చేస్తాం శ్రీ మతి మాత్రం భర్తే దైవం అని తనపని తాను చేసు కుంటుంది।
అయినా ఉదయానికే ఉషదయ అరుణ కిరణాలు లేపినట్లు లేపి మొఖం కడుక్కోండి కాఫీ త్రాగుదాం అంటుంది, చూచేటప్పుడు ఆమె సౌందర్యం నయన సుందరిని మించినట్లు కనిపిస్తుంది, ఏమైనా మాటలు మాట్లాడె డప్పుడు శ్రీవాణి గా ప్రవర్తిస్తుంది, సహనములో పుడమి తల్లిని మించి పొయ్యేది, ఆహారపదార్ధాలు తయారీలో, వడ్డనలో, అన్నపూర్ణను గుర్తు చేస్తుంది।
ఆమె నడుస్తున్నప్పుడు ఒక హంస నడిచినట్లే ఉంటుంది, నవ్వుచున్నప్పుడు ప్రసన్న లక్ష్మి వచ్చినట్లు, మన మనస్సు అర్ధం చేసుకొని నవ్వించే హాసిని ఆమె।
చేసేపనికి ఎప్పుడూ స్పూర్తి దాయకమైన స్థితిలో ఉంటుంది, ఏ పని చేయడానికి అయినా ముందు స్పందన చేస్తూ, హెచ్చరిస్తూ, మంచి చెడులు తెలియ పరిచేది, మంచి పనిలో పవిత్రతగా, ఇష్టంగా చేసే పనికి ప్రీతిగా, నిజాలు బోధించేటప్పుడు సత్యవతిగా, మనస్సు శాంత పరిచేటప్పుడు నిర్మల గా, అబద్ధాలు మాట్లాడినపుడు కల్పనగా, పిల్లలకు చదువు నేర్పేటప్పుడు సరస్వతి గా, వ్యాపారంలో చేరి ప్రతిభగా అభివృద్ధి పరచి దేశ ప్రగతికి సహకరించి ఒక మాములు గృహిణిగా, అద్దంలో చూసైనా ప్రత్యక్షంగా చూసినా మొగవాని మనసుకు సుందరి శ్రీమతి।
సరిగమలు నేర్పునప్పుడు సంగీత లక్ష్మీగా, పాటలు పాడునపుడు శృతి కలిపి మధుర మనిపించే కోకిలగా, తాళం వేయునపుడు లయగా, సాహిత్య గోష్టిలో సాహిత్య దేవతగా, నగరాన్ని కాపాడుతూ, ప్రకృతి వనరులను అందించే స్త్రీ గా శ్రీమతి ।
జీవిత గమనంలో మనతో విద్యాభ్యాసంలో పిల్లలకు విద్యావతిగా, సంపాద నప్పుడు సహాయ సహకారము అందించు లక్ష్మిగా, మనిషి విసుగురానియ్యకుండా, సంతోషము కల్పిస్తూ, ఇంద్రియాల కొరియాకును తీరుస్తూ, చేసేవృత్తిలో ప్రేరణ కల్పిస్తూ, పని చేసి వచ్చాక భర్తకు ఉపశమన శాంతి కల్పిస్తూ, అన్ని వయసులలో లాలన, పాలన సాగిస్తూ, మధ్యవయస్సులో వయస్సుని ఉడికిస్తూ, ముసలితనంలో కరుణ, మమతను చూపిస్తూ జీవితాంతం మనతో ఉండే స్త్రీ గా శ్రీమతి ।
నీరు త్రాగునపుడు గంగ లా సహకరించేది, సాయింత్రం వేళలో సంధ్యా దేవిగా, చీకటైతే అందరికీ వెలుగుఅందెంచె జ్యోతిగా, రాత్రి మత్తును తాగించే నిషాగా, పడుకున్నాక స్వప్న సుందరి।
ఆలోచనలప్పుడు ఊహాగా ఆలోచనలు తీర్చేటపుడు భావనగా సంతోషంలో సంతోషి గా।
కోపంలో కనింపించే రుద్రకాళిగా, మనసులో ఉండే భైరవిగా, ఆటలాడునప్పుడు ఆనందినిగా , గెలుపు కోసం అహర్నిసాలు ప్రోచ్చాహం కల్పించి జయమును కల్పించే విజయ లక్ష్మీగా।
గెలిచిన తర్వాత కీర్తి ప్రతిష్టలు పెపుచేసేట్టు సహధర్మచారిణి ।
విశ్వాసం ఉంటె చాలు - మనసు అర్ధమవటానికి
నమ్మకం ఉంటే చాలు - రహస్యం తెల్పటానికి
ఆశయం బ్రతకటానికి - సహనమ్ము ఉంటే చాలు
గుండె వికసించటానికి - ఆశలు లేకుంటె చాలు
మోక్కలు నాటితే చాలు - పుడమి పులకించటానికి
మలయమారుతమ్ము చాలు - జీవిగా బతకటానికి
మంచి పలకరింపు చాలు - మనిషి గుర్తించటానికి
ఎడారిలొ నీరు చాలు - నరకం తప్పించటానికి
నీలొ త్యాగ బుద్ధి చాలు - నలుగురు మెచ్చటానికి
నీలొ ధర్మగుణం చాలు - నలుగురు బత్కటానికి
సమాజమ్ము బాగు చాలు - మానవత్త్వ నిలయానికి
శ్రమతొ విద్య ఉంటె చాలు - లెక్క గౌరవ సంపదకి
ఒక్క చూపు చూపు చాలు - మాయను చేర టానికి
ఒక్క పలుకు పల్కు చాలు - జీవితమ్ము మార డానికి
స్త్రీలో ఎన్ని లక్షణాలు ఉన్నా స్త్రీ మనస్సును తెల్సు కున్నప్పుడు, ఆ మనస్సు అర్ధమైనప్పుడు మగవానికి సుఖము సంతోషము శాంతి ఉంటుంది, అర్ధం కాకపొతే నరకం ఇంతకన్నా గొప్పగా ఉంటుందా అని ఆలోచించాలి।
స్త్రీ ఆత్మగౌరవం దెబ్బతీయకుండా మనిషిగా మన్నన పొందుతూ ఉండాలి।
--(())--
*అమృతస్య పుత్రా:*
*4- అన్నమయ్య జీవిత చరిత్ర*
గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు.
నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు.
చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.
నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచేసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది.
నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు.
నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు.
నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం.
పాము కరవలేదు సరికదా ! నారాయణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది.
నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఒళ్ళో చేర్చుకొని వూరడించింది.
"ఎందుకు బాబు ఈ అఘాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది.
అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్ళపాక చేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు.
సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి - నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును.
నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దవఠం తాలూకాలో వున్నది.
అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.
*అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం*:
భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు.
"మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు.
ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.
లక్కమాంబ, నారాయణసూరి తిరుమలచేరారు. స్వామి మందిరం ప్రవేశించారు.
గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అదృశ్యమైంది.
వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.
||నారాయణాచ్యుత గోవిందా
గోవింద నామా గోవిందా శ్రీవిష్ణు దేవా గోవిందా
శ్రీ దామోదర గోవిందా||
గోవిందా హరి గోవిందా, వేంకటరమణా గోవిందా గోవిందా హరి గోవిందా వేంకట రమణా గోవిందా||
ఓం నమో వేంకటేశాయ!!
మనకి తెలిసిన, మనం చెప్పుకొనే సామెత :-
*ఇల్లు ఇరకాటం - ఆలి మర్కటం.
అంటే ఇల్లు ఇరుకుగా ఉండాలి. భార్య కోతిలా ఉండాలి.
ఇల్లు ఇరుకుగా ఉంటే ఎవరూ మన ఇంటికీవచ్చి, ఎక్కువ రోజులు తిష్ట వెయ్యరు. భార్య కోతిలా ఉంటే ఆమెని ఎవరూ పట్టించుకోరు.
అని ఎవరో చేతకాని వాళ్ళు అసలు సామెతకి చేతబడి చేసేసారు.
కానీ అసలు ఈ సామెత వెనకాల మన సంస్కృతీ సంప్రదాయలు నిబిడీకృతమై ఉన్నాయని ఎంత మందికి తెలుసు????
నేను కూడా చాలా చాలా ఆలోచించగా,,,,, చించగా,,,,, నా బుర్రకు తట్టింది మీకు తెలియజేస్తున్న.... నచ్చి, నిజమనిపిస్తే అసలు సామెత నే వాడుకలోనికి తీసుకురండి. మన సామెతల్ని ఎగతాళి చేసే అవకాశం ఇవ్వకుండా దాని అంతర్యాన్ని అందరూ గ్రహించాలని నా ఉద్దేశ్యం.
అసలు సామెత :-
" *ఇల్లు ఇరు కవాటం - ఆలి మరు కవాటం*. "
అనగా " ఇంటికి ముందు, వెనుక రెండు(ద్వారాలు)తలుపులుండాలి.- భార్య తలుపు చాటుగా ఉండాలి. " అని దాని అర్థం.
ఇరు = రెండు.
మరు = చాటు, వెనుక.
కవాటం = తలుపు.
'వాస్తు రీత్యా కానీ, భద్రతా రీత్యా కానీ ప్రతీ ఇంటికీ ముందు వైపు, వెనుక వైపు కూడా ద్వారం ఉండాలి.'
ఇంటికి అతిథి కానీ, వేెరెవరైనా కానీ వచ్చినపుడు 'ఇల్లాలు ఎపుడూ కూడా తలుపు వెనుక నుండే సంభాషించాలి.'
ఇంత అర్థ వంతమైన సామెత. దీనిని మనం ఎంత వికృతమైన అర్థం లో వాడుతున్నామో కదా! హతోస్మి.
__(())--
No comments:
Post a Comment