Tuesday 18 September 2018

నేటి ఆలోచనా తత్త్వం (1 / విశ్వబ్రహ్మోపనిషత్



--------------శుభోదయం--------సుభాషితాలు---------------------
వయ మిహ పరితుష్టా వల్కలై స్త్వం దుకూలై:
సమ యిహ పరితోషో నిర్వితోషో విశేష:
స తు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే, కోర్థవాన్ కో దారిద్ర:
ఓ రాజా!మేము నారచీరలతో సంతృప్తి చెందుచున్నాము. నీవు పట్టుబట్టలతో సంతోషపడుచున్నావు. మన యిద్దరికీ సంతోషము సమానము.అంతరమును బట్టి
(మన ఆనందములో) హెచ్చుతగ్గులేమియు లేవు. తీర్పరాని ఆశ కలవాడు దరిద్రుడైనా
కావచ్చును. మనస్సు సంతృప్తి చెందిన తర్వాత ధనవంతుడెవరు? దరిద్రుడెవరు?
(భర్తృహరి సుభాషితము)
స్వాయత్త మేకాంతహితం విధాత్రా
వినిర్మితం ఛాదన మజ్ఞతాయా:
విశేషతః సర్వవిదాం సమాజే
విభూషణం మౌన మపండితానాం.
అజ్ఞానమును కప్పిపుచ్చుటకై తప్పక ఉపకరించునది, తమ చేతిలోనే వున్నది యగు ఒక
ఉపాయము బ్రహ్మచే యేర్పరుపబడినది అది యేదనగా అన్ని విషయములు బాగుగా
తెలిసినవారున్న సమాజములో (సభలో) మాట్లాడకుండా మౌనము వహించుటయే
ఆపండితులకు అలంకారము. . (భర్తృహరి సుభాషితము)
దీపములేని యిల్లు నుపదేశము లేని జపంబు, మంజులా
లాపములేని కావ్యము. విలాసములేని వధూటి; విక్రమా
టోపములేని భూపతి; పటుత్వము లేని యురోజపాపాళి ; ప్ర
స్తాపము లేని మాటలు; వృత్తాలు సదాశివసద్గురుప్రభూ!
నేరిచి బుద్ధిమంతుడతి నీతి వివేకము దెల్పినం జెడం
గారణ మున్నవాని కాది గైకొన గూడదు నిక్కమే, దురా
చారుడు రావణాసురు డసహ్యము నొందడె చేటుకాలముం
జేరువయైనవాడు నిరసించి విభీషణుబుద్ధి భాస్కరా!
భాస్కరా! దురాత్ముడగు రావణుడు తనకు బోగాలము సమీపించుట చేత దమ్ముడగు
విభీషణుడు చెప్పిన నీతిని తిరస్కరించెను. అట్లే లోకములో తనకు జేటుకాలము సమీపించినప్పుడు బుద్ధిమంతులు చెప్పిన హితవచనములను విననిష్టపడడు.
వయోని ర్నాపి సంస్కారో న శ్రుతం న చ
కారణాని ద్విజత్వస్య వృత్తమే తస్య కారణం
అర్థము:-- పుట్టుక కానీ, సంస్కారము కానీ, పాండిత్యము కానీ, సంతతి కానీ ద్విజత్వమునకు (బ్రాహ్మణత్వమునకు) కారణములు గావు. నడవడి యొక్కటే దానికి కారణము. నడవడి మంచిది కానట్టయితే బ్రాహ్మణుడు కూడా శూద్ర సమానుడే.

విశ్వబ్రహ్మోపనిషత్ (పూర్తి పాఠము) 
( బ్రహ్మాత్మవిజ్ఞానోపనిషత్ ) 
VISWABRAHMOPANISHAD (Text ). 
~*~ 
శాంతిమంత్రము: 
ఓం సహనావవతు, సహనౌభునక్తు, 
సహవీర్యం కరవావహై, తేజస్వి 
నా వధీత మస్తు, మా విద్విషావహై, 
ఓం శాంతి: శాంతి: శాంతి: ఓం || 
* * * 
ఉపనిషత్ - 
1. ఓం సత్ చిత్ ఏకం బ్రహ్మా సదేవ ఏక:విశ్వకర్మా 
సహ్యేవ కర్మాధ్యక్ష: సాక్షీ సర్వ భూతాంతరాత్మా || 
* * * 
2. యో దేవానాం ప్రభవ శ్చోద్భవశ్చ 
విశ్వాధిపో విశ్వకర్మా మహానాత్మా 
హిరణ్యగర్భం పశ్యత స్వయంభువమ్ 
సనో శుభయాz త్మ బుద్ధ్యా సంయునక్తు || 
~*~ 
3. యుజేవాం పంచబ్రహ్మణేభ్య స్సహ పూర్వ్యం నమోభి ర్యజ్ఞేషు 
శృణ్వన్తు అమృతస్య పుత్రా: ఆ యే ధామాని దివ్యాని తస్థు || 
* * * 
4.అగ్నిర్యత్రాభిమధ్యతే వాయుర్యత్రాభిరుధ్యతే 
సోమో యత్రాతిరిచ్యతే తత్ర సఞ్జాయతే మన: || 
~*~ 
5. ఋచో అక్షరే పరమేవ్యోమన్ యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదు: 
యస్తన్న వేద కి మృచా కరిష్యతి యఇత్తద్విదు స్త ఇమే సమాసతే|| 
~*~ 
6. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం 
నేమా విద్యుతో భాంతి కుతోऽయమగ్ని: | 
తమేవ భాంతి మనుభాతి సర్వం 
తస్య భాసా సర్వమిదం విభాతి || 
*** 
7. న తస్య కార్యం కరణం చ విద్యతే, 
నతత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే 
పరాస్య శక్తి ర్వివిధైవ శ్రూయతే, 
స్వాభావికీ జ్ఞాన బల క్రియా చ || 
** ** 
8. న తస్య కశ్చిత్పతి రస్తి లోకే నచేశితా నైవచ తస్య లిఙ్గమ్ 
న కారణం కరణాధిపాధిపో నచాస్య కశ్చిజ్జనితా నచాధిక: || 
* * * 
9.అఖణ్డానన్ద చిద్ జ్యోతిం బ్రహ్మపురే ప్రతిష్ఠితమ్ 
తం దేవం విశ్వకర్మాణం భజ విజ్ఞాన స్సిద్ధయే || 
* * * 
10. ధ్యాయేత్సతతం తం జగద్గురుం శ్రీ విశ్వకర్మాణం 
యోవిరాజత్ సుషుమ్నాంతరాళే షడాధారమధ్యే || 
* * * 
11. స ఏవ మూలాధారే గణాధ్యక్ష: స ఏవ స్వాధిష్ఠానే ప్రజాపతి: 
స ఏవ మణిపూరకే విష్ణుశ్చ స ఏవ అనాహతే మహేశ్వర: || 
* * * 
12. స ఏవ విశుద్ధాంతరే జీవాత్మా స ఏవ ఆజ్ఞాంతరే పరమాత్మా 
స ఏవ సహస్రారే జగద్గురు: స ఏవ పరబ్ర్రహ్మా అమృతాత్మా|| 
* * * 
13. ఏకో హగ్ంసో భువనస్యాస్య మధ్యే 
స ఏవాగ్నిస్సలిలే సన్నివిష్ట: 
తమేవ విదిత్వాz తి మృత్యుమేతి 
నాన్య:పంథా విద్యతేzయనాయ || 
* * * 
14. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ 
విశ్వానిదేవ వయునాని విద్వాన్ | 
యుయోధ్యస్మ జ్జుహురాణ మేనో 
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ || 
* * * 
15. విశ్వకర్మా త్వమేవైకో నాన్యోస్తి జగత: పర : 
తవైష మహిమా యేన వ్యాప్తమేత చ్చరాచరమ్ || 
* * * 
16. ఏష విశ్వబ్రహ్మణ శ్చత్వారి స్థానాని భవంతి 
నాభిర్ హృదయం కంఠంచ మూర్ధాచైవ విద్యతే.|| 
* * * 
17.తత్ర జాగరితేవిభాతి బ్రహ్మ, స్వప్నేవిష్ణు, స్సుషుప్తౌ 
రుద్ర స్తురీయ మక్షరమ్ ప్రణవమిత్యేవ విశ్రుతమ్ || 
* * * 
18. యేతు జ్ఞానవిద శ్శుద్ధ చేతస స్తే z ఖిలం జగత్ 
జ్ఞానాత్మకం ప్రపశ్యంతి త్వద్రూపం పారమేశ్వరమ్ || 
* ** 
19. జాగ్రత్స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ప్రకాశతే 
తద్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ర్విముచ్యతే || 
* * * 
20. నమే భూమి రాపో వహ్ని రనిలో z స్తి నచాంబరం 
సర్వం చిన్మయం బ్రహ్మాహమితి ధ్యాతవ్యో యోగినా || 
* * * 
21. బ్రహ్మైవేద మమృతం దిక్షు సర్వేషు ప్రసృతంచ 
చిన్మయ మద్వయం తదేతత్పరమం బ్రహ్మసత్యం || 
* * * 
22. యో వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి 
తరతి శోకమాత్మవిత్ తథాz మృతత్వ మశ్నుతే || 
~*~ 
ధ్యాన మంత్రములు. 
23. ఓం సత్ చిత్ ఏకం బ్రహ్మా| స దేవ ఏక:విశ్వకర్మా 
యో దేవానాం నామధా ఏక ఏవ పరమాత్మావిశ్వకర్మా 
అంత శ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వష్టా 
స బ్రహ్మ సశివ సహరి స్సేంద్ర స్సో ऽక్షర: పరమ స్వరాట్ || 
* * * 
24. ఓం భూర్భువ స్సువ: తత్ సవితుర్వరేణియం 
భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయా ऽ త్ | 
పరోరజసి సావదోం ఓం | ఓం నమో విశ్వకర్మణే ఓం || 
* * * 
* ఇత్యజుర్వేదీయ విశ్వబ్రహ్మోపనిషత్ సమాప్తా.




Pranjali Prabha.com నేటి ఆలోచనా తత్త్వం (1 ) రచయత: మల్లాప్రగడ రామకృష్ణ ఏమి చెప్పాలి వేంకటేశా ? ఎలా చెప్పాలి వేంకటేశా? జ్ఞానమన్నది ఏమిటో తెలియలేదు అజ్ఞానం తొలగించుకొనే మార్గం లేదు కన్న వారిని పోషించ లేక, కన్న బిడ్డలకు విద్య నేర్పలేక, తుమ్మ చెట్టు లా ఉండలేక, దొండ పండులా పండ లేక, సూర్య చంద్రుల్లా తిరగలేక, ఇంద్రధనస్సులా ఉండలేక, రంగులు మారుస్తున్నా ఏమి చెప్పాలి వేంకటేశా ? ఎలా చెప్పాలి వేంకటేశా ? జ్ఞానమన్నది ఏమిటో తెలియలేదు అజ్ఞానం తొలగించుకొనే మార్గం లేదు పెద్దల మాటలు నమ్మలేక, పిన్నల మాటల తట్టుకోలేక, భార్య మాటలు ఒప్పుకోలేక, ఆశ్రమ జీవితం గడపలేక, ముద్దు మాటలకు చిక్కలేక, మొద్దు తరువులా ఉండలేక, రంగులు మారుసున్నా ఏమి చెప్పాలి వేంకటేశా ? ఎలా చెప్పాలి వేంకటేశా ? జ్ఞానమన్నది ఏమిటో తెలియలేదు అజ్ఞానం తొలగించుకొనే మార్గం లేదు కన్న వారితో ఉండలేక, కొత్తవారిని పోషించలేక, బంధమన్నది ఏమిటో తెలుసుకోలేక, గద్దరి చేష్టలు మానలేక, ప్రేమను పంచి బతకలేక, దాహంతో ఎడారి లాంటి జీవితం గడపలేక, రంగులు మారుసున్నా ఏమి చెప్పాలి వేంకటేశా ? ఎలా చెప్పాలి వేంకటేశా ? జ్ఞానమన్నది ఏమిటో తెలియలేదు అజ్ఞానం తొలగించుకొనే మార్గం లేదు కలుష యతిలా ఉండలేక, ఉన్న సతితో పండలేక, జాలి యనేది మనసుకు రాక, కొత్తవారి పొందిన చేరలేక, ఉన్న దాంట్లో తృప్తి చెందలేక, పశువు కన్నా హీనంగా బ్రతక లేక, రంగులు మారుసున్నా ఏమి చెప్పాలి వేంకటేశా ? ఎలా చెప్పాలి వేంకటేశా ? జ్ఞానమన్నది ఏమిటో తెలియలేదు అజ్ఞానం తొలగించుకొనే మార్గం లేదు కరుడు కట్టిన గుండెను ఓదార్చలేక, అహంతొ మంచిని గమనించ లేక, నేరములు చేస్తూ నీ నామమును చదవలేక, మూగ వానిలా మౌనం వహిచలేక, ఒక్క భామనే పోషించలేక రంగులు మారుసున్నా ఏమి చెప్పాలి వేంకటేశా ? ఎలా చెప్పాలి వేంకటేశా ? జ్ఞానమన్నది ఏమిటో తెలియలేదు అజ్ఞానం తొలగించుకొనే మార్గం లేదు చెడ్డవారి స్నేహమును వదలలేక, మంచి వారి స్నేహమును పొందలేక, శరీరం నీటి బుడగ లాంటిదని తెలిసే తామరాకుపై ఉండలేక, ఏది శాశ్వితమో తెలుసుకోలేక, పిచ్చివానిలా ఉండ లేక రంగులు మారుసున్నా ఏమి చెప్పాలి వేంకటేశా ? ఎలా చెప్పాలి వేంకటేశా ? జ్ఞానమన్నది ఏమిటో తెలియలేదు అజ్ఞానం తొలగించుకొనే మార్గం లేదు --((**))--

Pranjali Prabha.com నేటి ఆలోచనా తత్త్వం (2 ) రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నిను చేర మనసాయ స్వామీ, కనులారా వీక్షించ చేరితి స్వామీ ఈ భక్తుడ్ని కనుము స్వామీ, నాకు నీడ నీ చెంతనే స్వామీ విందులకు చిక్కి చిందులు వేసితి, ముందుగ వచ్చి నీకు మొక్కితి, చేసిన అల్లరి తెల్పితి, మనసుతో చెప్పితి , నీ పొందుకు మక్కువ చూపితి, మదిలోన మాటతో కోరితి, నీ అనుమతి కోరితిని గదా స్వామీ ఓ వేంకటేశా అమ్మవారి అనుమతి తీసుకోవయ్యా, మా మతి, గతిఁ. స్థితి తెల్పవయ్యా. నిన్నే నమ్మితి, నీకే మొక్కితి, నీ చెంతను చేరి, చిక్కితి నయ్యా కాపాడవయ్యా . నిను చేర మనసాయ స్వామీ, కనులారా వీక్షించ చేరితి స్వామీ ఈ భక్తుడ్ని కనుము స్వామీ, నాకు నీడ నీ చెంతనే స్వామీ పన్నీరు చల్లతి, గంధము పూసితి, పూల మాలలు వేసితి, నామాలు పెట్టితి, నూతన వస్త్రాలు కట్టితి, సకల ఆభరణాలను ఏర్పాటు చేసితి, హారతి అద్ధితినయ్యా , ఓ వేంకటేశా అమ్మవారి అనుమతి తీసుకోవయ్యా, మా మతి, గతిఁ. స్థితి మార్చవయ్యా స్వామీ . చల్లని గాలి ఏర్పరిచితి, చామరం తిప్పితి, ఛత్రం పట్టితి, వింజామరం వీచితి, తులసి మాల వేసితి, చిత్త శుద్ధితో నిత్య, దూప, దీప, నైవేద్య ఏర్పాటు చేసితి, కెరటంలా వచ్చితి, పరిమళాల జల్లులతో తడిపితి, సావధానముగా వేడుకుంటున్నమయ్యా. ఓ వేంకటేశా అమ్మవారి అనుమతి తీసుకోవయ్యా, మా మతి, గతిఁ. స్థితి మార్చవయ్యా స్వామీ నిను చేర మనసాయ స్వామీ, కనులారా వీక్షించ చేరితి స్వామీ ఈ భక్తుడ్ని కనుము స్వామీ, నాకు నీడ నీ చెంతనే స్వామీ --((**))--


సంధ్యావందనము

శ్రీ గాయత్రీ మహామంత్రము మానవకోటికి దివ్యౌషధము.

ఇది విశ్వామిత్ర కల్పములోనిది.

ఇది ఎంతో పరమ పవిత్రమై మానవ లోకాన్ని పునీతం చేస్తున్నది.

గాయత్రీ మంత్రము గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా వివరణ తెలిపి చేతులు దులుపుకుంటున్నారు.

కాని గాయత్రీ మంత్ర రహస్యం అసలు విషయాన్ని తెలియజేసే గ్రంథాలు అరుదు.

ఇది నిర్దిష్టమైన శాస్తజ్ఞ్రానం కలిగిన గురుముఖ తెలిసికొని మంత్ర జపము చేయాలి.

గాయత్రీదేవి మంత్రోపాసన చేయాలంటే అపరిమితమైన ‘శక్తి’ని సంపాదించాలంటే మనిషిలో ఎంతో పవిత్రత అవసరం.

పవిత్రత అంటే ‘మడి’ అనే బాహ్య పవిత్రత కాదు. వ్యక్తి పవిత్రత అనగా త్రికరణశుద్ధి. అంటే మనోవాక్కాయ కర్మల పవిత్రతే అంతఃపరిశుద్ధి.

మానవబుద్ధికి అందని కొన్ని నిగూఢ రహస్యాలు ప్రకృతిలో దాగి ఉన్నాయి.

వాటిని ప్రాచీన ఋషులు దేవ రహస్యాలుగా పరిగణించారు. దివ్యమైన జీవితం అలవరచుకొని ఆధ్యాత్మిక భావనలతో జీవించేవారికి బయటకు కనిపించి ప్రకృతికి గోచరించని ఈ రహస్యాలు అందుతాయి.

స్వార్థంలేనివారికే ఇది సాధ్యం. మనుధర్మశాస్తమ్రు ప్రకారము బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి ఇతరులనుండి ఏది ఆశించనివాడు బ్రాహ్మణుడు.

ఆర్థిక దృక్పథంతో సామాజిక దృష్టితో సుఖం కోరి బ్రతికేవాడు శూద్రుడు. విజయాన్ని, అధికారాన్ని కాంక్షించేవాడు క్షత్రియుడు.

ప్రతి కోణములో లాభాన్ని, డబ్బును అంచనా వేసేవాడు వైశ్యుడు అని మనువు తెలియజేశాడు.

ఈ చాతుర్వర్ణాలవారు కూడా నిజాయితీగా, త్రికణశుద్ధితో, పట్టుదలగా గాయత్రీ మంత్రంతో ఆధ్యాత్మిక రహస్యాలను అందుకొనవచ్చును.

దైవానుగ్రహం, గురువుల దయతోపాటు శ్రద్ధ ఉంటే ఈ దేవ రహస్యాలు సామాన్య రహస్యాలౌతాయి.

గాయత్రీ మంత్రానుష్టానములో అనేక విషయాలు సమ్మిళతమై యున్నవి. అందులో నిత్య సాధనకు సంబంధించినవి ఆచమన యోగనిధి.

ప్రాణాయమ యోగనిధి, మార్జన యోగవిధి, అర్ఘ్యదానయోగవిధి, ఆవాహన యోగవిధి, త్రికాల జపయోగవిధి, న్యాసవిధి, విలోమగాయత్రీ అస్త్ర మంత్రము.

ఇకపోతే బ్రహ్మాస్త్రంగా గాయత్రీ మంత్రం ఉపయోగించే పద్ధతి బ్రహ్మశీర్షాస్తమ్రు, బ్రహ్మశిరోనామ అస్తమ్రు అనునవి పారమార్థికతకు సంబంధించిన విశేషములు.

హిందూమతములో ఉపనయన సంస్కార సమయములో ఈ గాయత్రీ మంత్రమును ఉపదేశిస్తారు.

ఉపనయనం అంటే మూడవ కన్ను. గాయత్రీ మంత్రోపదేశం చేసే పవిత్ర సంస్కారమే ఉపనయనం.

వేదకాలములో ఋషులు, ఈ గాయత్రీ మంత్రము అర్థము, నియమాలు, జపించే విధానం నేర్పి శిక్షణతో యోగ దీక్షను ఇచ్చేవారు.

ఈ మూడవ కన్నుతో ద్విజత్వం అంటే రెండవ జన్మ వస్తుంది.

ఈ దివ్య నేత్రంతో, యోగ దీక్షతో కంటికి కనిపించని దివ్య వస్తువులను, దేవతలను, ఋషులను, సిద్ధులను, భూత ప్రేత పిశాచాలను కూడా చూసే శక్తి కలుగుతుంది. అందుకే ఉపనయనం అంటే జ్ఞాననేత్రం.

సంధ్యావందనము:సంధ్య అనగా సంధి, రాత్రి అంతమొంది పగలు ప్రాంభమయ్యే సమయం ప్రాతః సంధ్య. అట్లే పగలు అంతమై రాత్రి ప్రారంభమయ్యేది సాయం సంధ్య.

ప్రాతః సంధ్యాకాలానికి అధిపతి బ్రహ్మదేవుడు. అందుకే దీనిని బ్రహ్మముహూర్తం అని వ్యవహరిస్తారు.

సాయం సంధ్యకు విష్ణువు అధిపతి. కావున విష్ణు సహస్ర నామ పారాయణమునకు సాయంత్రమే అనువైన కాలమని పెద్దలు నిర్ణయించారు.

ఇక మిట్టమధ్యాహ్నం రుద్రాత్మకమైన సంధి. సూర్యభగవానుడు ఈ మధ్యాహ్న సంధియందు సర్వరుద్రులను మండిస్తాడు.

కావున ‘బ్రహ్మస్వరూపముదయే, మధ్యాహ్నేతు మహేశ్వరః సాయంధ్యయేత్సదా విష్ణుః త్రిమూర్తిశ్చదివాకరః’ అని త్రికాల సూర్య దర్శనం పరిపాటియైనది.

ఉపనయన సంస్కారముతో బ్రహ్మచారికి మూడో కన్ను తెరుచుకొని దానితో మానవులకు దివ్య పురుషులను చూడగలిగే శక్తి లభిస్తుంది.

ఈ వందనమే సంధ్యా+వందనము=సంధ్యావందనము.

అందుకే సంధ్యావందన మంత్రాలతో బ్రహ్మచారి ‘ఋషిభ్యశ్చనమః’ ‘పితృభ్యశ్చనమః’, ‘దేవీభ్యశ్చనమః’ అని దేవతలకు, ఋషులకు, పితరులకు నమస్కారం అని కనబడిన ఒక్కొక్కరికి వందనములు సమర్పించి వారివలన అందరి ఆశీస్సులు పొంది దీర్ఘాయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి అని మనుధర్మశాస్తమ్రులో చెప్పబడినది.

ఇన్ని విశేషములు కలిగియుండుటవలన గాయత్రీ మంత్రము, సంధ్యావందనము అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి.
View Post on Facebook · Edit Email Settings · Reply to this email to add a comment.



No comments:

Post a Comment