Sunday 30 April 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 28

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
నిరుద్యోగి ప్రయాణం - 3
మాధవ్ నడుస్తున్నాడు, ఒక మధ్య రకం మనిషి వచ్చి, నేను నిన్ను ఎక్కడో చూసాను అన్నాడు, నేను ఇప్పుడే వస్తున్నాను, నన్ను చూసి ఉండరు మీరు అన్నాడు మాధవ్ . ఆ  గుర్తుకు వచ్చింది మా రామారావుగారి కొడుకు ఒడుగుకి వచ్చావు నీవు,  అక్కడ యజ్నోపవీతం గురించి చక్కగా చెప్పావు బాబు. మంచి విషయాలు తెలుసు కోవటానికి చిన్న పెద్ద, మతము కులము ఆచరించ వద్దు అని చెప్పారు మా గురువుగారు.

అవును ఎందుకు మీరు నాతో నడుస్తూ మాట్లాడుతున్నారు అని అడిగాడు మాధవ్ . నాకుటుంబం లో అంతా చీకటి కమ్మి నట్లు ఉన్నది, ఏది చేసిన ఫలించుట లేదు ఏదన్న పూజలు చేయాలా అని అడిగాడు వెంట ఉన్న "శ్రీధర్ ".

చూడండి పండితులను సంప్రదించండి వారు చెప్పినట్లు ఆచరించండి అన్నాడు.

కాదు బాబు నీవు ఏదన్న చెప్పు నేను చేస్తున్న పని మంచో,  చెడో తెలియుట లేదు అని అడిగాడు.

చుడండి ఆకురాలేకాలంలో ఆకులు రాలుతాయి, వానలు పడగానే చిగురిస్తాయి. ఎండిపోతున్నాము అనుకోవు ఆచెట్లు,  అట్లే మీకు ఉన్నట్టి కష్టాలు శాస్వితము కాదు ఓర్పు వహించండి, మంచి రోజులు తప్పక వస్తాయి అదే సంకల్పముతో బ్రతకాలి.

రామాయణంలో హనుమంతుడు సీతాకోసం లంక అంతా వెతికాడు సీత కానరాక చాలా బాధపడ్డాడు అప్పుడే ఆలోచన అవసరమని మనకు భోదించారు, వచ్చిన పని కాకపోతే ఎవరికి నష్టం అని తెలుసుకొని  ఓర్పుతో వెతుకుతాను అనుకున్నప్పుడే  శుభశకునాలు రావటం అశోకవనంలో సీతను కలవటం, సీత విషయం రామునకు చెప్పఁటం  దుర్మార్గం పై రాముడు దండయాత్రచేయటం జయం పొందటం మనకు తెలిసినదే.  .

ఒక్కసారి హనుమంతుని తలుచుకోండి మీకు మంచి మార్గం చూపుతారు అన్నాడు మాధవ్.

అయినా ఒక కధ చూపుతాను వినండి  అంటూ మొదలు పెట్టాడు మాధవ్ శ్రీధర్ తో        
        
పిడికెడు ఉప్పు (ఒక నీతి కథ).

ఒక యువకుడి తన గురువు దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు..

"స్వామీజీ...నా జీవితమంతా కష్టాలే..
ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను..
దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."
.
అప్పుడు గురువు ఆ యువకుడి వైపు చూశాడు..
.
ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు..
యువకుడు అలాగే చేశాడు...
ఇప్పుడు ఆ నీటిని "తాగు" అన్నాడు గురువు..
.
యువకుడు గ్లాసు పైకెత్తాడు..ఆ నీటిని తాగాడు...
వెంటనే ఉమ్మేశాడు...
"అబ్బ... భరిoచలేని ఉప్పు...."
.
ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని...
ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు..
.
"ఈ ఉప్పు ఈ చెరువులో వేసి ఈ నీళ్ళని తాగు అని చెప్పాడు గురువు..
.
ఆ యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు..
.
"ఎలా ఉన్నాయి ఈ నీళ్ళు..??" అడిగాడు గురువు..
"నీరు తీయగా ఉంది" చెప్పాడు ఆ యువకుడు..
.
"అదే పిడికెడు ఉప్పు, అప్పుడెందుకు భరించలేకపోయావు..??
ఇప్పుడెలా భరించావు..?? అడిగాడు గురువు..
.
అప్పడు ఆ యువకుడు ఇలా చెప్పాడు..
.
అది తక్కువ నీరు...
గ్లాసుడు నీరు...
అందుకే ఉప్పగా ఉంది.
ఇది చెరువు..
అంటే ఎక్కువ నీరు..
అందుకే ఉప్పదనం లేదు... " అన్నాడు యువకుడు..
.
అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడు..
.
"నాయనా...
సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి...
అది గ్లాసులోనూ పిడికెడే...
చెరువులోనూ పిడికెడే...
.
కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా...
చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి...
.
నీ ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది...
ఆ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది" అన్నారు గురువు. పరిస్థితి అవగాహన చేసుకొని జీవితాన్ని నందనవనం చేసుకున్నాడా యువకుడు.

బాబు చిన్నవాడవైన మంచి కధ చెప్పావు "ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది".

బాబు నాలో మనో ధైర్యం కల్పించావు, నీవు చదువు కున్నవాడివిలాగా కనబడుతున్నావు. నాకొచ్చిన కష్టం చెప్పుకుంటా, దానికి పరిష్కారం మీరే చెప్పాలి.

నేను ఇచ్చే ఈ  పారితోషకాన్ని తీసుకోండి అన్నాడు.

చూడండి నేను నిరుద్యోగిని, ఉద్యోగ వేటలో ఉన్నాను, ఉద్యోగము  దొరికేదాకా నా ప్రయాణము ఆగదు అన్నాడు.

బాబు నేను యిచ్చే డబ్బు తీసుకోకపోతే నాకు ఒక సహాయము చేయి, మా ఇంటికి వచ్చి మా పరిస్థితిని గమనించి   నీ  అమూల్య సలహా మాకు తెలియ పరుచు అది చాలు  అన్నాడు.

సరే పోదాం పదండి మీ ఇంటికి అన్నాడు,

వెంటనే శ్రీధర్ ఆటో పిలిచాడు ఎక్కారు ఇద్దరూ .

ఇంటికి చేరగా అందరూ దిగులుగా ఉన్నారు, ఏమండి ఏమండి మీగురించి ఇప్పటిదాకా భోజనం కూడా చేయక ఉన్నాము, అనేక ఆలోచనలతో మాకు భయం ఏర్పడినది అన్నది శ్రీమతి "శాంతి ".

మన కష్టాలు యిక తొలిగి పోతాయా అని అడుగుతూ , ఇదుగోనండీ మంచి నీళ్లు త్రాగండి అని ఇచ్చింది ఇద్దరికీ .

అమ్మా నమస్కారమమ్మా అన్న పిలుపుకు మాధవన్ చూసింది శ్రీమతి శాంతి

రా బాబు రా యిలా కూర్చో అన్నది.

బాబు నీవు నాకొడుకు లాంటి వాడవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, అందరూ భోజనం చేసిన తర్వాత మాట్లాడు కుందాం, తన పిల్లలను చూపి అన్నది.

చూడు బాబు నేను కూడా చెపుతున్నా భోజనం చేద్దాం పదా అన్నాడు.

అందరూ భోజనమ్ చేసాక .

మాధవ్ ఇట్లా అన్నాడు.

అర్ధం అయ్యేలోపు దూరమయ్యేది "కల " 

అర్ధం అయిన వప్పుకోలేనిది  "వాస్తవం "  

అర్ధం అయ్యేకొద్దీ దగ్గరయ్యేది " స్నేహం "

అర్ధం తెలిసిన సరికొత్త అర్ధం తెలిపేది "ప్రేమ" 

అర్ధం అయినట్లు కనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్ధం కాదు "జీవితం"

నీ గురించి నువ్వుకాని ,, నిన్ను కన్న తల్లి కానీ, నిన్ను ప్రేమించే వారుకానీ  ఏదో క్షణమున మరచి పోవచ్చు కానీ ఆభగవంతుడు మాత్రం మరవలేడు.

భగవంతుడు ఆడించినట్లు ఆడటమే తప్పా,  కానీ ప్రాణాలు తీసుకోవటానికి ముందుకు రావటం తప్పు అన్నాడు. చీకటి తరమే వెలుగు వస్తుంది అది గమనించి మనం ముందుకు పోదాం అన్నాడు మాధవ్  ....... ..... .....

అప్పుడే గుడి గంట మ్రోగింది .........                              

 సమస్యలను తరువాత భాగంలో పరిష్కరించు కుందాం

1 comment: