Sunday 30 April 2017

మల్లాప్రగడ రామకృష్ణ కధలు - 27

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:


నిరుద్యోగి ప్రయాణం -2

మాధవ్ ఒక్కసారి తనదగ్గర ఉన్న పైకాన్ని చూసుకున్నాడు, ఎం చేయాలో అని ఆలోచిస్తున్నాడు, అక్కడ దగ్గరలో బ్యాంకు ఉన్నది, అక్కడ విద్యార్ధులు చాలా మంది ఉన్నారు, కొందరు డబ్బు కట్టే వారు మరికొందరు తీసేవారు ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి బ్యాగ్ లో కొంత పైకము పెట్టుకొని స్కూటర్ వద్దకు వచ్చాడు బ్యాగ్ ముందు పెట్టుకున్నాడు, స్కూటర్ లో గాలి లేదే అని వెనక్కు చూసాడు, ఒకతను ముందు పెట్టుకున్న బ్యాగ్  పట్టుకొని పరుగెత్తడం మాధవ్ చూసాడు, వెంటనే అతన్ని వెంబడించాడు, అతను పారిపోతూ మాధవ్ పై బ్యాగ్ మొఖం పై  విసిరేసి చూడకుండా పరుగెత్తాడు. బ్యాగ్ ను తీసుకోని వెనక్కి వచ్చి ఇచ్చాడు.

బాబు నీవు నా ప్రాణాలు నిలబెట్టావు, నాప్రాణాలేకాదు నాకుటుంబప్రాణాలు నిలబెట్టినవాడివి, ఈరోజు మాబాబు ఒడుగు ఏర్పాటు చేసుకున్నా అందుకే డబ్బుడ్రాచేసాను అన్నాడు రామారావు.  ఇదిగో ఈ డబ్బు తీసుకో అని ఇవ్వగా సాటి వ్యక్తిగా దొంగని పట్టుకోవటానికి ప్రయత్నిమ్చా, అతన్ని కూడా పట్టుకుంటే మంచిదయ్యేది, నాకు డబ్బు ఏమీ ఇవ్వవద్దు అని అన్నాడు.  

బాబు ఇంతకీ నీవెవరు అని అడిగాడు, నేను ఒక నిరుద్యోగిని, ఉద్యోగము కోసం పల్లెటూరు నుండి బస్తీకి వచ్చాను నాపేరు మాధవ్ అని చెప్పాడు.
నీవు ఏమి అనుకోకపోతే ఈరోజు మా ఇంటికి రా బాబు భోజనం చేసి మేము ఇచ్చే తాంబూలము తీసుకోని పోవచ్చు అన్నాడు. సరే అని స్కూటర్ ఎక్కాడు.

ఇద్దరూ కలసి ఇంటికి చేరారు, ఇంటివద్ద మేళాలు మ్రోగుతున్నాయి
బాబు ఇక్కడే ఉండు లోపలకు పోయి వస్తా అంటూ గబగబా లోపలకు పోయి జరిగిన దంతా భార్యకు చెప్పి  తిరిగివచ్చి రా బాబు రా అంటూ అక్కడ ఉన్న బ్రాహ్మణుల వద్ద కూర్చోబెట్టాడు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు.
 ప్రధాన పూజారిని ‘యజ్ఞోపవీతం’ గురించి వివరంగా చెప్పండి అని రామారావు అడిగాడు, వచ్చిన బ్రాహ్మణులు ఆలోచిస్తున్నారు, అక్కడే ఉన్న మాధవ్ మీకు అభ్యంతర లేక పోతే నాకు తెలిసినది తెలియపరుస్తా అన్నాడు. ఇదిగో బాబు నీవు ఇలా రా ఈ మైకు ముందు కూర్చొని చెప్పు అన్నారు ప్రధాన పంతులుగారు.
మాధవ్ చెప్పటం మొదలు పెట్టాడు.     

‘యజ్ఞోపవీతం’        
వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యం’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు.

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ్ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -

‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
 ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’

ఈ శ్లోకంలో తాతపర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’
నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.
యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.

’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.
యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. ఇదే యజ్ఞోపవీత మహిమ!
మా గురువుగారు నాకు చెప్పినది నేను మీకు ఉదాహరించాను అన్నాడు మాధవ్
అందరూ మెచ్చుకున్నారు,  బాబు నీవు చాలా బాగా తెలియపరిచావు ప్రధాన పూజారి మెచ్చుకున్నాడు.                ఒడుగు పూర్తికాగానే సంభావన ఇచ్చారు అందరికి మాధవ్ కు ఇచ్చిన దానిలో అక్కడఉన్న బ్రాహ్మణుల కందరికి సమభాగములుచేసి వారికీ ఇచ్చి ఇదే తనభాగమని తీసుకున్నాడు.
బ్రాహ్మణులందరూ ఆశ్చర్య పోయారు.

ఇది కూడా మీకే చెందవలసినది, నేను రావటము వల్ల మీకు తాగించి నాకు ఇచ్చారు అన్నాడు. అప్పుడే రామారావ్ కలగ చేసుకొని వారికీ ఇద్దామనుకున్నది ఇచ్చాను, నా తృప్తి కోసం నీకు ఇచ్చాను అన్నాడు. అందుకనే రామారావుగారు మాతృప్తి కోసం నాభాగమే తీసుకున్నాను.
బ్రహణులతో భోజనం చేసి వెళ్ళండి అని తెలియపరిచాడు, మాకు వేరే పూజలున్నాయి అని చెప్పి వెళ్లారు. మాధవ్ వద్దకు వచ్చి నీవుకూడా వెళుతున్నావా అని అడిగాడు, నేను ఉంటానండి.
భోజన వడ్డనలో నేను సహాయపడతాను అన్నాడు.
నీవు సహాయము చేస్తానన్న మాట చాలు అంట క్యాటరింకు ఇచ్చాము అన్నాడు రామారావు.
భోజనాలు అందరి ఆయినాయి ఎవరి దారి వారు వెళ్లిపోయారు.
రామారావుగారు నాకు అనుమతిస్తే నేను బయలు దేరుతాను అన్నాడు.                    



No comments:

Post a Comment