Saturday 24 December 2022

1/2023 to 15-2023

 


01-01-2023

*మేము అరవై లో ఇరవై। *రెండురత్నాలు, *గాజు - వజ్రం కధ, *గజదొంగను మహర్షిగా మార్చిన నారదుడు, *10 వ తరగతి పబ్లిక్ పరీక్ష, *దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు * సరళమైన తెలుగులో అర్ధాలు. మా గుంటూరు కధ


*సులభశరణమాశ్రయో భయానాం   వనగహనం తిమిరం చ తుల్యమేవ౹

ఉభయమపి హి రక్షతేంధకారో   జనయతి యశ్చ భయాని యాశ్చభీతః ౹౹

(సంగ్రహః)

దట్టమైన అరణ్యము,చీకటి రెండూ ఒకే రకమైన భయాన్ని కలిగిస్తాయి.అంతేకాదు ఈ రెండూ భయాన్ని కలుగజేసే దొంగనన్ను,భయంతో పరుగులు పెట్టే మనిషిని తమలో దాచుకుంటాయి.

 ----
పాత్రవిశేషే న్యస్తం గణాంతరం వజ్రతి శిల్పమాధాతుః౹
జలమివ సముద్రశుతకౌ ముక్తఫలతాం పయోదస్య౹౹

స్తాన విశేషం తెలుసుకుని గురువులు నేర్పిన విద్య అత్యుత్తమ శిఖరం ఎక్కుతుంది.అలాగే,మేఘాలనుంచి కురిసిన నీరు సముద్రంలోని ముత్యాల చిప్పలో పడితే అది మంచి ముత్యం అవుతుంది.
****

" ఆంధ్రలోచెల్లనిదియ్యది యక్కజముగ

భారతమ్మునవెల్గునుభారమనక

వణిజులకుకల్గుశంకలువట్టివయ్యె

ఇప్పదికినెప్పుడందునో  ' ' యిజ్జతు ' గద ??? "

--

( నాకేకలిఁగిన.. అనుభవం.. మద్రాసు నగరంలో... దీనికి చక్కని ' చెలామణి ' .. ఉన్నది.. అంతే కాకుండా.. అన్ని ప్రాంతాల్లో కలదంట..

ఆంధ్రాలోనే..' నాస్తి '..) "


*మేము అరవై లో ఇరవై। 

పచ్చగా మెరిసే పండుటాకులమే గాని, చప్పుడు చేసే ఎండుటాకులం కాదు, కలలు పండినా పండకపోయినా

మేము తలలు పండిన తిమ్మరుసులం, కొరవడింది  కంటి చూపు గాని మందగించలేదు, ముందు చూపు అలసిపోయింది  దేహమే గాని మనసుకు లేనే లేదు, సందేహం ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా ఈ భూమికి కాబోము భారం

అరవై లో ఇరవై కాకున్నా అందని ద్రాక్ష కై అర్రులు చాచం

కుందేళ్ళమై పరుగులు తీయకున్నా, తాబేళ్లమై గెలుపు బాట చూపగలం చెడుగుడు కూతల సత్తా లేకున్నా।            చదరంగపు ఎత్తులు నేర్పగలం

దేహమ్ము తిత్తి గదరా తెలియంగ లేదా 

దాహమ్ము ముత్తి గదరా తరుణంబు రాదా 

వాహమ్ము మిత్తి గదరా పరువంబు పోదా 

సోహమ్ము చిత్తి గదరా సులభంబు గాదా 

సమయం ఎంతో మాకు లేకున్నా సమయమంతా మీకు సమర్పిస్తాం అనుకోకుంటే అధిక ప్రసంగం అనుభవ సారం పంచుకుంటాం వాడిపోయే పూవులమైనా సౌరభాలు వెదజల్లుతాం రాలిపోయే తారలమైనా కాంతి పుంజాలు వెదజల్లుతాం

____

02-01-2023  *రెండురత్నాలు

            

ఒక వ్యాపారి తాను ప్రయాణం చేయడం కోసం ఒక ఒంటెను కొనాలి అని అనుకున్నాడు.

ఒక వ్యక్తి దగ్గర బేరమాడి ఒక ఒంటెను కొనుక్కుని ఇంటికి చేరుకున్నాడు.

తన ఇంటి పనిమనిషిని పిలిచి     ఆ ఒంటెను శుభ్రంగా కడగమని చెప్పాడు.

యజమాని చెప్పినట్టే ఆ పనిమనిషి ఒంటెను శుభ్రం చేస్తుంటే ఒక చిన్న సంచి కింద పడింది.

అది తీసుకెళ్లి యజమానికి ఇచ్చాడు. అతను సంచి తీసి చూడగా నవరత్నాలు ధగధగా మెరిసి పోతున్నాయి.

’ఇది వెంటనే తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి!’  అన్నాడు.

ఆ పనివాడు ‘అయ్యా ఇది ఎవరికీ తెలిసే అవకామేశమే లేదు మీరే ఉంచేసుకోండి!’ అని చెప్పాడు. 

’మరి ఇది నాకు కూడా తెలియకుండా నువ్వు ఉంచుకోవలసింది కదా!’ అన్నప్పుడు…

’నేను మీరు నమ్మిన బంటును అయ్యా మిమ్మల్ని మోసం చేయలేను!’ అన్నాడు.

’నువ్వే నన్ను మోసం చేయలేను అన్నప్పుడు నన్ను నాకెలా మోసం చేసుకోను?’ అన్నాడు.

’ఆ రత్నాల మూటను తీసుకెళ్లి ఒంటెను అమ్మిన వ్యక్తికి ఇచ్చాడు.

అతను సంతోషంతో స్వాగతించి ‘మీ ఈ చర్యకు నేను ఆనందంగా ఉన్నాను, మీకు కావలసినన్ని రత్నాలు తీసుకోండి!’ అన్నాడు.

’మీకు ఇచ్చే ముందే రెండు రత్నాలను నేను ఉంచుకున్నాను!’ అన్నాడు.

ఈ వ్యక్తి ఇచ్చిన సంచిలోని రత్నాలను లెక్కపెట్టాడు ఆ రత్నాల యజమాని. ‘అన్నీ రత్నాలు ఉన్నాయి ఒక్కటికూడా తగ్గలేదు!‘ అన్నాడు.

అందుకు ఇతను నా రెండు రత్నాలు ‘నా నిజాయితీ, నా ఆత్మగౌరవం అన్నాడు.

*మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డ దారులు....! కానీ భయ పడుతూ బతకాలి!!

నిజాయితితో సాధించినా సంపాదించినా ఆ ధైర్యమే వేరు.

శుభం

****

03-01-2023 *గాజు - వజ్రం కధ

ఒక రాజ దర్బారు నిర్వహించబడుతోంది. శీతాకాలం కావడంతో దర్బారు బహిరంగ ప్రదేశంల్లో ఏర్పాటుచేయబడింది.

పెద్దల సభ అంతా ఉదయపు నీరెండలో కూర్చుని ఉన్నారు. రాజు సింహాసనం ముందు ఒక రాచరికమైన బల్ల ఉంది, దాని మీద కొన్ని విలువైన వస్తువులు పెట్టి ఉంచారు.

పండితులు, మంత్రులు, దివానులు అందరూ అక్కడ ఉన్నారు. రాజ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరాడు. 

అతను లోపలికి ప్రవేశించి, రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు, " మహారాజా! నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి, నేను వివిధ రాజ్యాలు తిరిగి అక్కడ  ప్రతీ రాజుకు వాటిని చూపించాను, కానీ ఎవరూ వాటిని సరిగ్గా పరీక్షించలేకపోయారు. అందరూ ఓడిపోయారు, నేను విజేతగా అన్నీ చోట్లకు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను మీ రాజ్యానికి వచ్చాను.".

" ఏమిటవి ?", అని రాజు కుతూహలంగా అడిగాడు.

అతను ఆ రెండు వస్తువులను రాజగారి బల్ల మీద పెట్టాడు. అవి రెండూ సరిగ్గా ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో, ఒకే రూపురేఖలతో, ఒకేలా  ప్రకాశిస్తూ, అన్నీ వైపులా నుండీ, అన్నీ రకాలుగా ఒకేలా ఉన్నాయి.

రాజు వెంటనే, "ఈ రెండూ వస్తువులూ ఒకటే" అన్నాడు.

దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "అవును, అవి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ఒకటి చాలా విలువైన వజ్రం, మరొకటి కేవలం ఒక గాజు ముక్క.

కానీ వాటి స్వరూపం, వాటి రంగు ఒకే విధంగా ఉంటాయి; ఇప్పటి వరకు ఏది వజ్రమో, ఏది గాజు ముక్కో ఎవరూ గుర్తించలేకపోయారు... ఎవరైనా వాటిని పరీక్షించి ఇది వజ్రం అని, మరొకటి గాజు అని చెప్పవచ్చు. ఎవరైనా సరిగ్గా గుర్తించగలిగితే, నేను ఓటమిని అంగీకరించి, ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాలో నిక్షిప్తం చేస్తాను.

కానీ షరతు ఏమిటంటే, ఎవరైనా దానిని గుర్తించలేకపోతే, ఈ వజ్రం విలువతో సమానమైన మొత్తాన్ని మీరు నాకు ఇవ్వాలి. నేను చాలా రాజ్యాల నుండీ  ఇప్పటికి ఇలా  మొత్తాన్ని గెలుపొందాను”.

" నేను దానిని పరీక్షించలేను",అన్నాడు రాజు.

దివాన్లు కూడా, "రెండూ సరిగ్గా ఒకేలా ఉన్నందున మేము కూడా ధైర్యం చేయలేం."

ఓడిపోతామనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఓడిపోయిన తర్వాత చెల్లించవలసిన డబ్బు, అంత సమస్య కాదు, ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనం ఉంది. అయితే రాజుగారి పరువు పోతుందేమోనని అందరూ భయపడి, ఎవరూ గుర్తించదానికి ముందుకురాలేకపోయారు

హఠాత్తుగా, ఆ ప్రదేశానికి ఒక మూలన చిన్న అలజడి మొదలయ్యింది.

ఒక గుడ్డివాడు చేతిలో కర్ర పట్టుకుని ముందుకొచ్చాడు. "నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను ఇందాకటి నుండీ ఈ విషయాలన్నీ వింటున్నాను, అలాగే ఈ వజ్రాన్ని ఎవరూ పరీక్షించలేకపోతున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి", అన్నాడు.

 ఒక వ్యక్తి సహాయంతో రాజు వద్దకు చేరుకుని, రాజును ఇలా అభ్యర్థించాడు, "నేను పుట్టుకతో అంధుడిని, అయితే దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తద్వారా నేను కూడా నా తెలివితేటలను ఒకసారి పరీక్షించుకోవచ్చు. బహుశా నేను విజయం సాధించవచ్చునేమో .... ఒకవేళ  నేను విజయం సాధించలేకపోయినా, మీరు ఎలాగూ పందెం ఓడిపోతున్నారు కాబట్టి అంతకుమించి వేరే కోల్పోయేదేమి ఉండదు."

అతని మాటలు రాజుకి అర్ధం అయ్యి ఒక అవకాశం ఇచ్చినందువల్ల నష్టం లేదని భావించాడు. రాజు తన ఆమోదం తెలుపుతూ, “సరే” అన్నాడు.

ఆ తర్వాత ఆ వృద్దుడికి ఆ  రెండు వస్తువులను తాకించి, వీటిలో ఏది నిజమైన వజ్రం, ఏది గాజుముక్క అని అడిగారు.

ఒక్క క్షణంలో, ఆ వ్యక్తి,  'ఇది విలువైన వజ్రం, ఆ రెండవది  కేవలం గాజుముక్క!' అని చెప్పాడు.

అన్నీ రాజ్యాలలో గెలిచి వచ్చిన వ్యక్తి నమస్కరించి, "అది నిజమే, నువ్వు బాగా గుర్తించావు.. నువ్వు చాలా గొప్పవాడివి...ఇచ్చిన మాట ప్రకారం ఈ వజ్రాన్ని నీ రాజ్య ఖజానాకి ఇచ్చేస్తున్నాను", అన్నాడు*.

అందరూ చాలా సంతోషించారు. వచ్చిన వ్యక్తి కూడా వజ్రాల నిజమైన నాణ్యతను గుర్తించేవారు కనీసం ఒకరైనా  ఉన్నారని చాలా సంతోషించాడు.

వచ్చిన వ్యక్తి , రాజు, ఇతర ప్రజలందరూ ఒకే ఉత్సుకతను వ్యక్తం చేస్తూ, ఆ అంధుడిని ఇలా అడిగారు, "నీవు కనీసం చూడలేవు కదా, ఇది వజ్రం, ఇంకోటి గాజు అని ఎలా గుర్తించావు?"

అంధుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, "అది చాలా తేలిక, ప్రభూ, మనమంతా ఇందాకటి నుండీ ఎండలో కూర్చుని ఉన్నాం. అలాగే ఈ రెండూ కూడా చాలాసేపటి నుండి ఎండలో ఉంచబడ్డాయి. రెండింటినీ ముట్టుకున్నాను. చల్లగా ఉన్నది నిజమైన వజ్రం. .. *వేడెక్కింది గాజు... అంతే."

జీవితంలో కూడా, ప్రతి చిన్న విషయానికి వేడెక్కిపోయినవారు, చిక్కుబడిపోతారు, బంధింపబడిపోతారు  ... ఆ వ్యక్తులు"గాజు" వంటివారు. ప్రతికూల పరిస్థితులలో కూడా చల్లగా (శాంతంగా, స్థిరంగా) ఉండేవాడు ... ఆ వ్యక్తి  మాత్రమే "విలువైన వజ్రం"లాంటివారు.

మనం ఎలా ఉండాలో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం.

మనం కూడా వజ్రంలా తయారవుదాం.

శుభోదయం 

----

04-01-2023 *గజదొంగను మహర్షిగా మార్చిన నారదుడు

  ఒకానొకప్పుడు రత్నాకరుడు అనే గజదొంగ ఉండేవాడు. ఒక అరణ్య మార్గాన్ని స్థావరంగా ఎంచుకుని దారిదోపిడీలనే వృత్తిగా చేసుకుని జీవించేవాడు. అడవి దారిలో ప్రయాణించే బాటసారులను నిర్దాక్షిణ్యంగా చంపేసి, వారి వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను దోచుకునేవాడు. రత్నాకరుడి పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒంటరిగా అడవి దారిలో వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు.ఒకనాడు నారద మహాముని ఆ అడవి మార్గం మీదుగా వెళుతుండగా, రత్నాకరుడు ఆయనను అడ్డగించాడు. డబ్బు దస్కం ఏమేమి ఉన్నాయో బయటకు తీయమని గద్దించాడు.నారద మహాముని అతడి మాటలకు ఏమాత్రం బెదిరిపోలేదు. ప్రశాంతంగా అతడి వైపు చూసి...ఎందుకిలా దారికాచి ప్రజలను దోచుకుంటూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు?’ అని ప్రశ్నించాడు.  ‘నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ఇలా దోపిడీలకు పాల్పడుతున్నాను.’ అని బదులిచ్చాడు.నీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు?’ అడిగాడు నారద మహాముని.నేను, నా భార్య, నా కొడుకు... ఇంకా వయసుమళ్లిన నా తల్లిదండ్రులు... వాళ్లందరి బాగోగులు నేనే చూసుకోవాలి’ బదులిచ్చాడు రత్నాకరుడు.వాళ్లందరి బాగోగులు చూసుకోవడం కచ్చితంగా నీ బాధ్యతే! అయితే, అందుకోసం అమాయకులను చంపి దోచుకోవడం పాపం కదా! ఇందుకు నరకంలో శిక్షలు తప్పవు. నీ కుటుంబంలో ఎవరైనా నీ పాపాలకు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారేమో కనుక్కో’ అన్నాడు నారద మహాముని.సరే... నా ఇంట్లో వాళ్లను కనుక్కుంటాను’ అని బయలుదేరడానికి రత్నాకరుడు సిద్ధపడ్డాడు. అయితే, తాను తిరిగి వచ్చేలోగా నారద మహాముని ఎక్కడికైనా పారిపోతాడేమోనని భావించి, ఆయనను ఒక చెట్టుకు కట్టేశాడు. నేరుగా ఇంటికి వెళ్లాడు.నిన్ను పెళ్లి చేసుకున్నాక... నిన్ను బాగా చూసుకోవడానికి దారిదోపిడీలు చేస్తున్నాను. నన్ను ఎదిరించిన అమాయకులను చంపేస్తున్నాను. ఈ పాపాలకు నరకంలో నాకు శిక్షలు తప్పవు. నా బదులుగా నువ్వు నరకంలో శిక్షలు అనుభవిస్తావా..?’ అని భార్యను అడిగాడు.నన్ను పోషించడం భర్తగా నీ ధర్మం. అందుకు నువ్వు ఏ పాపం చేసినా ఫలితం నువ్వు అనుభవించాల్సిందే’ తేల్చి చెప్పింది భార్య.తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు... ‘వృద్ధులైన మిమ్మల్ని పోషించడానికి దారిదోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నా పాపాలకు నరకంలో శిక్షలు ఉంటాయి. మీ కోసమే ఇవన్నీ చేస్తున్నాను కదా..! నా పాపాలకు మీరు నరకంలో శిక్షలు అనుభవించడానికి సిద్ధపడతారా?’ అని అడిగాడు.నిన్ను కన్న తర్వాత నిన్ను పెంచి పెద్ద చేయడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వయసు మళ్లిన దశలో కాటికి కాళ్లు చాచుకుని ఉన్నాం. ఈ దశలో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే. నీ పాప పుణ్యాల ఫలితం నువ్వే అనుభవించాలి గానీ, మేమెలా అనుభవిస్తాం’ అన్నారు.చివరిగా కొడుకును అడిగాడు. ‘నిన్ను పెంచి పెద్దచేయడానికి దోపిడీలు, హత్యలు చేస్తున్నాను. నరకంలో నా బదులుగా శిక్షలు అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా?’ససేమిరా అనేశాడు కొడుకు. ‘నన్ను కన్నందుకు పెంచి పోషించాల్సిన బాధ్యత తండ్రిగా నీపై ఉంది. నీ పాప పుణ్యాలతో నాకేమీ సంబంధం లేదు. వాటి ఫలితాన్ని నువ్వు స్వయంగా అనుభవించాల్సిందే’ అన్నాడు.అప్పుడు జ్ఞానోదయమైంది రత్నాకరుడికి. హుటాహుటిన అడవికి చేరుకుని, చెట్టుకు కట్టేసి ఉన్న నారద మహామునిని బంధ విముక్తుడిని చేశాడు. ఆయన కాళ్లపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు.భగవన్నామ స్మరణతోనే పాపాలు నశిస్తాయని, ఇక నుంచి మంచిగా బతకమని సెలవిస్తాడు నారద మహాముని. ఇక అప్పటి నుంచి రత్నాకరుడు దైవధ్యానంలో మునిగి మహర్షిగా మారాడు. ఆయనే వాల్మీకి మహర్షి.

____

05-01-2023 *10 వ తరగతి పబ్లిక్ పరీక్షల ' మూల్యాంకనం ' లో అధికమార్కులు వేస్తే నష్టం ఏమిటి ? 

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ,  విద్యార్థులు జవాబు పత్రాలలో జవాబులు అసలు  వ్రాయకపోయినా / కొద్దిగా వ్రాసినా  , తప్పులు వ్రాసినా  valuation లో  అధిక మార్కులు వేస్తున్నారు. దీనిని Grade Inflation / Inflation of Marks అంటారు . ( తెలుగు లో దీనిని మార్కుల ఉల్బణం / మార్కుల వాపు అని అనవచ్చు ). 

దేశ ఆర్థికవ్యవస్థ ను ద్రవ్యోల్బణం ఎలా నాశనం చేస్తుందో , పేద - మధ్యతరగతి - సామాన్యుల జీవితాలను ద్రవ్యోల్బణం ఎలా అతలాకుతలం చేస్తుందో ;  అంతకన్నా " పదింతలు "  విద్యావ్యవస్థ లో ఉన్న  Inflation of Marks వలన విద్యార్థుల మరియు దేశ భవిష్యత్తు నాశనమవుతున్నది. 

Inflation of Marks వలన దేశ ఆర్థిక రంగం పై ప్రభావం ఏమిటి ? జీడీపీ ఎలా పతనం అవుతుంది ? పెట్టుబడుల పై దీని ప్రభావం ఎంత ? Knowledge  Based Economy లో ఆర్థిక వ్యవస్థకు నిజమైన  చోదకశక్తులు అయిన " సృజనాత్మకత  మరియు Self Initiation " ను ఈ అధిక మార్కులు ఎలా చంపేస్తున్నాయి ? ఈ ఉచిత మార్కులు ( అధిక మార్కులు వేయటం ) విద్యార్థుల ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ? రాష్ట్రం లోని యువత లో కష్టపడేతత్వాన్ని ,  పని సంస్కృతి ని దెబ్బతీయడం లో సామాజిక మాధ్యమాల కన్నా , ఉచిత మార్కుల పథకం ఎలా ప్రధాన కారణం అయ్యింది ?  " 

అనే పై  సంక్లిష్టమైన అంశాల విశ్లేషణ లోకి వెళ్లకుండా   .... సులభంగా అందరికీ అర్థం అవ్వటం కోసం "  రెండు యదార్ధ సంఘటనలను ఉదాహరణలుగా తీసుకొని వివరిస్తాను ". 

***********

1. 2017-18 లలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు , ఇంజనీరింగ్ విద్యార్థుల సమూహం తో జరిపిన ఒక బహిరంగ సమావేశం లో,  ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఈ విధంగా మాట్లాడింది 

" నమస్తే జగనన్న ! నా పేరు ..... , ..... కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. అన్నా! ఎంతో మంది గొప్ప గొప్ప సివిల్ ఇంజనీర్లు , ఆర్కిటెక్ట్ లు ఉన్న దేశమన్నా మనది. అటువంటిది,  మన వాళ్ళను కాదని రాజధాని నిర్మాణం ఎక్కడో ఉన్న సింగపూర్ కి అప్పగించారు. మళ్లీ ఇప్పుడేమో రాజమౌళి అంటున్నాడు!  సినిమాల కోసం టెంపరరీ సెట్లు వేస్తాడు - తీస్తాడు రాజమౌళి .  అన్నా !  చంద్రబాబు కూడా ఓట్ల కోసం ఏమన్నా టెంపరరీ రాజధాని కడదామని అని ఆలోచిస్తున్నాడా అన్న ! నాకు మాత్రం చాలా భయంగా ఉందన్న! 

నాలాంటి వేల మంది సివిల్ ఇంజనీర్లు ఇక్కడ ఏమి చేయాలన్నా ! 

అప్పట్లో ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చాలా కాలం చక్కర్లు కొట్టింది . ఆత్మవిశ్వాసం తో మాట్లాడిన ఆ అమ్మాయి వీడియో  చూసిన మేధావులు కరక్టే కదా! అని అడిగారు . సామాన్యులు , మధ్యతరగతి వారు కూడా అదే భావన !

కొంతమంది అయితే " ఒకప్పుడు విద్యార్థులు ఆడతా పాడతా చదివేవారు. అందుకని అప్పుడు మార్కులు సరిగా వచ్చేవి కాదు ... ఇప్పుడు విద్యార్థులు ఎంతో కష్టపడుతున్నారు . అందుకనే వేల మందికి ,  ఇంజనీరింగ్ లో 80% పైగా మార్కులు వస్తున్నాయి. కొద్దిమంది అయితే " మైకు పట్టుకొని మాట్లాడిన ఆ అమ్మాయి  ఆత్మవిశ్వాసం చూసి , ఆ అమ్మాయి లో   ఇంజనీరింగ్ లో ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన తెలుగు తేజాలు అయిన  శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు , శ్రీ కె. ఎల్. రావు గార్లను మించిన ప్రతిభ ఉందేమో !! అని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. నిజానికి ఆ అమ్మాయి కూడా తన తెలివితేటలు , తన నైపుణ్యం అంతర్జాతీయ స్థాయి అని నమ్మింది! .  

వాస్తవం :- ఆ అమ్మాయి ఇప్పుడు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తుంది. పాఠశాల స్థాయి నుండి  ఇంగ్లీష్ మీడియం చదివిన ఈ సివిల్ ఇంజనీర్( B.tech ) , గడచిన రెండు - మూడు సంవత్సరాలుగా  " గ్రామ/ వార్డ్ వాలంటీర్ " గా పనిచేయడం ఏమిటి ? 

తనకు వచ్చిన మార్కుల వాపు  ( inflated marks ) చూసి ,  ఆ ఆమ్మాయి కూడా తనలో ఆ స్థాయి నైపుణ్యం ఉందని నమ్మింది .  కానీ వాస్తవం వేరు . 

**********

06-01-2023 *దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.

2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.

3. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.

4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.

5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.

7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.

8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.

9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.

10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.

11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.

12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది

14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.

15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.

పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…

వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.

---

07-01-2023

*మీకు తెలుగు భాష పై ఎంత పట్టు ఉందో తెలుసుకోండి..!!!* 

👍కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరా!!?.

1.పిపీలికము = 

2. మశికము =  

3. మార్జాలము = 

4. శునకము = 

5. వృషభము = 

6. మహిషము = 

7. శార్దూలము = 

8.మత్తేభము = 

9.మకరము = 

10.మర్కటము = 

11. వాయసము = 

12. మూషికము = 

13.జంబుకము = 

14. వృకము =   

15.తురగము =  

16. గార్ధభము = 

17. వరాహము = 

18.పన్నగము = 

19. కుక్కుటము = 

20. బకము = 

21. ఉష్ట్రము = 

22. శుకము = 

23. పికము =  

24.శలభము = 

25. కీటకము = 

26. మత్స్యము = 

27. హరిణము = 

28. మత్కుణము = 

29. మయూరము = 

30.కూర్మము = 

31. మకుటము =  

32. మకరందము = 

33. వానరము = 

34. వావురము = 

35. ఉరగము =

 *కనీసం 25 చెప్పగలిగితే పాస్...

*30 chepte good total chepte great 


1.Chima(ant) చీమ , 2.dhoma(mosquito)దోమ  ,

3.pilli(cat), పిల్లి  4.kukka(dog), కుక్క 5.edhdhu(ox),

6.dhunnapothu,7.puli(tiger),8.enugu(elephant),9.mosali(crocodile), 10.kothi(monkey) ,11.kaki(crow),12.eluka(rat), 13.nakka(fox), 14.thodelu(wolf),15.gurram(horse), 16.gadidha(donkey),17.pandhi(pig),18.paamu(snake), 19.kodipunju(rooster),20.konga(crane),21.onte(camel), 22.ramachiluka(parrot),23.koyila(koila),24.enugu(elephant),25.purugu(insect), 26.chepa(fish),27.jinka(deer),28.nalli(bedbug),29.nemali(peacock), 30.thabelu(tortoise),31.kireetamu(crown👑),32.thene(honey), 33.kothi(monkey),34.kaaki(crow), 35.paamu(snake)

08-01-2023 *మా గుంటూరు కధ

*ఎవరు బాబాయ్ గుంటూరోళ్ళ గురించి తక్కువగా మాట్టాడేది?.*

*అసలు గుంటూరు జిల్లా గొప్పదనం మీకు తెలుసా..ఓసారి ఓపిగ్గా ఇది చూడండి..*

 పేరులో 'ఊరు' ఉందని గుంటూరును ఊరనుకున్నారేమో. అది వట్టి ఊరు కాదండీ బాబూ..

*మాచర్లలో సహారాఎడారి, తెనాలిలో కేరళ తేమ, పొన్నూరులో కోనసీమ మాగాణీ, తాడికొండలో టిబెట్టు పీఠభూమి, పిడుగురాళ్ళలో కొలరాడో క్యాన్యన్స్, వినుకొండలో యాండీస్ పర్వత శ్రేణులు, బాపట్లలో మయామీ బీచ్, మంగళగిరిలో సుమత్రా పర్వతాలు, తుళ్ళూరులో ఒండ్రునేలలూ, సత్తెనపల్లిలో బ్లాక్ కాటన్ సాయిల్*

 ఇలా అన్ని టైం జోన్లనూ, వాతావరణాలనూ,  మృత్తికా రూపాలనూ కలగలుపుకున్న ఒక భూగోళం ఇది..

యకసెక్కాలాడతారు,యటకారం తప్ప ఇంకేమీ లేని వాళ్ళనుకున్నారా?? పులిహోర, బిస్కెట్టు, మావూలుగా వుండదు.. కెవ్వు కేక లాంటి ప్రయోగాలను  సృష్టించి సినిమాలకూ, స్కిట్లకూ, సాహిత్యానికీ, సంగీతానికీ నుడికారాలూ, జాతీయాలూ, పడికట్టు పదాలూ, పంచులూ అందించి కలం పట్టుకున్న ప్రతీ వాడి నోటికీ నాలుగు మెతుకులు అందించే అన్నపూర్ణ ఈ గుంటూరు... 

ఎర్రిబాగులోళ్ళూ, ఎచ్చులోళ్ళు అనుకున్నారేమో...రాయలసీమలో వేటకొడవళ్ళు ఉంటాయో లేవో తెలియదు కానీ.. పదేళ్ళ క్రితం వరకూ పల్నాడులో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరికీ స్వాగతం చెప్పింది నాటుబాంబే..

 ఎలక్షన్ గెలవాలన్నా, గెలిచిన సీటు ఐదేళ్ళూ నిలబెట్టుకోవాలన్నా *నరసరావు పేట నడి సెంటర్లో నిలబడి తొడకొట్టడమే కాదు*, టిఫిన్ క్యారియర్లో తెచ్చిన బాంబును తీసి ధణేల్మని నేలకు కొట్టినోడే ఇక్కడ లీడర్..

డబ్బాలు కొట్టుకోవడం, సెంటర్లలో బాతాఖానీ వెయ్యడమే తెలుసు అనుకుంటున్నారా!! చరిత్ర తెలియని అమాయకులనుకుంటున్నారా లేక అసలు చరిత్రే లేని అభాగ్యులనుకుంటున్నారా!!..

*క్రీస్తుకు అయిదు వందల సంవత్సరాల పూర్వమే ప్రతిపాలపుత్ర రాజ్యం మా సొంతం. దాన్నే ఇవాళ బట్టిప్రోలు అంటున్నారు.కుభేరుడు మా రాజు. శాతవాహనులూ, ఇక్ష్వాకులూ, పల్లవులూ, ఆనంద గోత్రికులూ, విష్ణుకుండినులూ, కోట వంశీయులూ, వేంగీ చాళుక్యులూ లాంటి అనేక రాజ పరంపరలకు ఆశ్రయం ఇచ్చిన నేల ఇది.*

 చరిత్ర చెప్పుకునే ఖర్మ మాకు లేదు. .

నాటుగా ఉంటారూ, మోటుగా మాట్లాడతారూ ఆధునికత తెలియని అనాగరికుల ఊరు ఇది అనుకుంటున్నారా..

*వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరం ఉన్న తెలుగునేల అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు మొదట దిగి స్కూళ్లు కాలేజీలు కట్టించడానికి అనువైన ప్రదేశం అని ఎంచుకున్న జిల్లా ఇది..*

 మీరు దేశాలు దాటవచ్చు. కానీ దానికి కావాల్సిన చదువుల్ని ఇచ్చింది గుంటూరు తల్లే. దేశంలో మొదటి కోచింగ్ సెంటర్ గుంటూరుదే. మీరు ఇవాళ్ళ అనుభవిస్తున్న కార్పోరేట్ విద్యకు బొడ్డుకోసి పేర్లు పెట్టిందే గుంటూరు.అసలు మీరు విమానాలు ఎక్కి ఖండాతరాల్లో సుఖంగా బతకడానికి మోసుకు వెళ్ళే కారాలూ, పచ్చళ్ళూ, పొడులూ ఎయిర్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చెయ్యడం నేర్పింది గుంటూరే..

 *పాకిస్థాన్ ప్రధాని పేరుతో నిలువెత్తు జిన్నా టవర్ కట్టిన విశ్వనగరం గుంటూరు.  జగజ్జేత చంఘీజ్ ఖాన్ పేరుతో కొండవీడు దుర్గం క్రింద ఒక పేటను కట్టిన ఎల్లలు లేని జిల్లా గుంటూరు..*

 అసలు గుంటూరు ఒక ఊరు కాదు... అదొక వడ్డించిన విస్తరి.. గోదావరిఖని నుండీ సూళ్ళూరుపేట వరకూ విస్తరించిన తెలుగునేల నుండి పట్టెడు అక్షరం మెతుకులు వెతుక్కుంటూ వచ్చే విద్యార్ధుల కోసం స్టూడెంట్ మెస్సుల్లో చెమటలు కక్కే ఆంటీయే గుంటూరు. 

*ఘాటైన మిరపకాయలు పండిస్తూనే తీయనైన అంగల కుదురు సపోటాలూ తినిపిస్తుంది ఈ గుంటూరు. ఊరి నడిబొడ్డున మిర్చీ యార్డ్, ఊరి గుండెల నిండా మాల్పూరీ కోవా దట్టించుకున్న వైభోగమే ఈ గుంటూరు..*

 గుంటూరు ఒక చెట్టు.నిలబడిన చోట కదలకుండా వుంటూనే రెండు రాష్ట్రాల్లో వేల కొలది గుంటూరు పల్లెల్ని వూడలు వేసిన మహావృక్షమే ఇది. రెండు రాష్ట్రాలూ విడిపోతుంటే కూడా ఆ తిరస్కారంలో *గుంటూరూ గో బ్యాక్ - గోంగూర గో బ్యాక్* అనే కీర్తిని విని ముసిముసిగా నవ్వుకున్న ఒక సుయోధన సార్వభౌముడి వంటి మెచ్యూర్ విలన్ గుంటూరు..

గుంటలో వుంటుంది, బురదలో ఈదుతుంది అనుకుంటున్నారేమో...

*నల్లరేగడి భూముల్లో మొదటిసారి శ్రీనాధుడి చేత వ్యాపార పంటల్ని పండించిన నేల ఇది. వానొస్తే మోకాలు లోతున దిగిపోయే భూముల్లో పుగాకు, పత్తీ పండించి బ్రిటన్ మార్కెట్టును గుప్పెట్లో పెట్టుకున్న చరిత్ర కలిగిన భూములు ఇవి.*

 అంతెందుకు.. ఎందుకూ పనికిరాని భూములకు సైతం రియల్ ఎస్టేట్ విలువను అద్ది ఎందరో జేబుల్ని నింపి మరెందరో కడుపుల్ని నింపింది గుంటూరు మనుషులే..అసలు రెండు రాష్ట్రాలలో ఇవాళ్ళ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పునాదులు వేసింది గుంటూరని మర్చిపోతే ఎలా?..
888

*గుంటూరంటే పొద్దున్నే నాలుగున్నరకు నిద్రలేచి తలుపులు తెరుచుకునే పల్లెటూరి కిరాణా షాపు, రాత్రి రెండు గంటలకు కూడా ఇడ్లీలు వడ్డించే సిటీ రైల్వేస్టేషన్.*

గుంటూరు కళ్ళాపి వాసనల కుగ్రామం, హైటెక్ ఆసుపత్రుల మెట్రో పొలిస్. 

*వానొచ్చినా వరదొచ్చినా, కరువొచ్చినా, గత్తరవచ్చినా సాయంత్రం ఆరైతే తోటి మనుషుల్ని కలుసుకోడానికి ఎన్ని అడ్డంకులనైనా ఎదిరించి సెంటర్లో నిలబడే స్నేహనగరం.*

 ఇది పునుగుల సరాగం, బజ్జీల అనురాగం, పచ్చళ్ళ అనుబంధం, పలావుల దాంపత్యం. మీరు పైకి గేళి చేస్తున్నా ఇవన్నీ మాకు లేవే అని లోలోన కుళ్ళుకుంటుంటే చూసి కిసుక్కున నవ్వుకునే కన్నెపిల్ల గుంటూరు..

*దేశం మొత్తం మతాల పేరుతో అల్లకల్లోలం అవుతూ ఉంటే  ఖాశిం భాయ్ పలావు లేనిదే కాశీనాథ్ ఇంట్లో పెళ్ళి జరగని నగరం గుంటూరు. కాలే మస్తాన్ దర్గా వురుసు కమిటీ సభ్యులంతా మందిరం నుండే సరాసరి వస్తారు.*

 గుంటూరు ఒక కటింగ్ చాయ్ ప్రేమ, గుంటూరు ఒక సినిమా పిచ్చి , గుంటూరు ఒక బిర్యానీ అడిక్షన్, గుంటూరు ఒక మిర్చీబజ్జీల ఉన్మాదం, గుంటూరు అసలు సిసలు జీవితం..

*ఇక్కడ పుట్టి ఎక్కడో మీడియాలో పెరిగి, మళ్ళొచ్చి ఇక్కడి గొప్పదనం తెలుసుకున్న ఓ గుంటడి గుంటూరు అభిమానం ఇది...*
----

09-01-2023 *మట్టిని నమ్మిన మనిషి 

మట్టిని నమ్ముకో, మట్టిని అమ్ముకోకు,  మట్టిని నమ్ముకో విజయం నీదే,
మహాత్ముడివవు తావు, మహనీయుడివవుతావు, మహామహులవుతావు, ఆదర్శమూర్తి అవుతావు, అంతటా అన్నిటా నీవే వెలుగై వేల్పువై వెలుగుతావు!

పుట్టింది మట్టిలోనే పెరిగింది మట్టిలోనే కలిసేదీ మట్టిలోనే మణిమాణిక్యాలు మట్టిలోనుండే మహిమలన్నీ మట్టిలోనే గిరులు తరులు వరాలు వనరులు సర్వం ఆ మట్టిలోనుండే తనువుమనసంతా మట్టిలోనుండేమనందరంఅక్కడినుండే

ధనం అక్కడే ధర్మం అక్కడే ధర్మదాతలు అక్కడే స్వరం అక్కడే మనం అక్కడే మననం అక్కడే స్మరణం అక్కడే మట్టిని అ మ్ముకోకు మనసును అమ్ముకోకు మట్టిని నమ్ముకో మనిషిని నమ్ముకో మనసును నమ్ముకో!

సంపద అక్కడే సమస్యలు అక్కడే సంచలనాలు అక్కడే గాలి కొరకు కలహాలు కనువిందులున్నాయో లేదో తెలియదు నీటి కొరకై నిత్యం వీధులనుండి విహారాలదాకా వివాదాలు వివాదాలతో విచారాలేగాని సుఖసంతోషాలెక్కడ?

పుడమిని పుణీతగానెంచి భక్తి తత్పరతతో పూజలెన్నో అంగుళ స్థలమైనా ఇచ్చేదే లేదంటూ కసి రగిల్చినవారెందరో నాదీ నీదని చెప్పే ఇలవైకుంఠపురి ఈ వసుధనేగా ఆమె ప్రేమలో ప్రేరణలో పులకరించే ధన్యజీవులెందరో!

నా ఇల్లు నా ఊరు నా చేను చెలక నా సర్వస్వం ఈ మట్టేగా ఈ మట్టి నేర్పిన అనుభవ పాఠాలన్నీ జీవిత పాఠాలేగా జీవితపాఠం నేర్పుతున్నది ఈమట్టి మణిమాణిక్యాలునావేనని ఈ మట్టిలోనే పరిమళించమని పరవశించమని నా మనసు!

విశ్వాంతరాలు విహరించినా విలువలన్నీ ఈ మట్టిలోనేనని పంచభూతాల సాక్షిగా పరిమళించేది ప్రస్తుతించేది మట్టినే ప్రతిజీవి పరవశించేది పచ్చటి ప్రకృతి ఒడిలోనేగా నేర్చిన నేర్పరితనమంతా ఈ మట్టిసొగసులతోనేగా!

అంబర చుంబనాలెన్నో అంగణ చుంబనాలెన్నో చేరిన కీర్తి శిఖరాలెన్నో చేర్చుకున్న కీర్తికిరీటాలెన్నెన్నో సంతృప్తి సమాగమం సందేశం అంతా ఆ మట్టే
అందుకే మట్టిని అమ్ముకోకు మట్టిని నమ్ముకో జయంనీదే!
___

సైన్స్ : తద్దినం ఎందుకు ?  మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.

ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.

దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...

ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం... ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.
కూతురంటే అతనికి ప్రాణం. 

ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.
తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.

అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.

అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.
అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.

ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.
ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.

పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.

అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.

ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.

పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.

మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.

ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.

ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.

ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.

ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పర మాయలో పడుతున్నారు.  మన తరువాత ఎప్పుడో వచ్చిన  మాయలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.
****
10-01-2023
చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే ...........నేత్ర వైద్యుడు
మౌనంగానే మనసు పాడిన ప్రేమగానమును వింటినే......... Cardiologist
అందంగాలేనా..అసలేం బాలేనా.........Cosmetologist
గాలివానలో, వాననీటిలో పడవ ప్రయాణం.......... ENDOCRINOLOGIST
మాటరాని మౌనమిది..........ENT
ఈనాటి ఈ బంధమేనాటిదో........ ORTHOPEDIC
చీమకుట్టిందా...చిరచిరలాడిందా.........SKIN
చట్టానికి, న్యాయానికి జరిగిన సంగ్రామంలో..........PULMANOLOGIST
చినుకు చినుకు పడుతూఉంటే........UROLOGIST
ఇది తీయని, వెన్నెల రేయి..Diabetologist
ఆకలుండదు...దాహముండదు.........GASTEROENTEROLOGIST
సిరిమల్లె పువ్వల్లె నవ్వు.........DENTIST
జగమేమాయ బతుకేమాయ........PSYCHIATRIST
ఏమోఏమో ఇది.నాకేదోఏదో అయినదీ........ GENERAL PHYSICIAN
****
11-01-2023
1. ఆధ్యాత్మిక గురువులు, వారి వారి లక్షణాలను హిందూ సంప్రదాయం ఇలా నిర్వచించింది .
2. సూచక గురువులు : ప్రకృతిలో లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు . భక్తీ జ్ఞాన వైరాగ్య భొదలు చేసి సాధన చతుష్టయ సంపత్తి కలిగిని భక్తులను తయారు చేస్తారు వీరు... 
3.  వేద గురువులు: వేద పురాణేతిహాసాలు చదివి, చదివించి, ధర్మ మర్మాలను విశదీకరించి ఆచరింపజేస్తారు వీరు. .
4.  నిషిద్ద గురువులు : సర్వ యంత్ర-తంత్రములు ఉపాసనలు చేయించి వాటి ధర్మాలను భోదిస్తారు వీరు.
కామ్యక గురువులు : ధర్మ దాతలుగా సప్త సాధనాలు భోధిస్తారు. త్యాగమూర్తులుగా, భక్తులుగా తన భక్తులను తయారు చేస్తారు.
5.  భోధక గురువులు: వేదాంత గ్రంధ పరిచయం కలిగిస్తారు . భోధక గురువులలో మళ్ళీ ఆరు రకాలైన గురువులు వున్నారని చెప్తున్నారు. వారు... 
6. నాద గురువులు : వీరి స్వరం ఎప్పుడైతే శిష్యునికి చేరుతుందో అప్పుడే ఆతడు జ్ఞాన వంతుడుగా మారతాడు .
7. చాయానిది గురువులు : చాయానిది ane ఒక పక్షి వుందట . దాని నీడ ఎవరిపై పడుతుందో వారు చక్రవర్తులు అవుతారట. ఈ గురువు అనుగ్రహం ఎవరిపై ప్రసరిస్తుందో వారు ఆధ్యాత్మిక చింతన పరులు అవుతారు . 
8. పరమ గురువులు : వీరు పరుసవేదిలా శిష్యుని తన దివ్య స్పర్శతో భక్తిజ్ఞానాల్ని ప్రసాదిస్తారు 
.చందన గురువులు: చందన వృక్షంలా జ్ఞాన సుగుణాలను పంచుతారు వీరు. 
9.  క్రౌంచక గురువులు: :దూరంగా వుండి కూడా తన గ్రుడ్లను పొదగా గలిగే శక్తి క్రౌంచక పక్షికి వుంటుందట . అదే విధంగా క్రౌంచక గురువు దూరాన వున్నా తన శిష్యులను ప్రయోజకులను చెయగలడు. 
10.  .. . వాచక గురువులు : సాంఖ్య ఉపదేశాలు భోధించి, పరమాత్మ సత్యమని , దేహం అశాశ్వత మని తెలిపి గమ్యం గుర్తు చేస్తారు. 
12 . కారణ గురువులు : ఆసనాలు, ప్రాఞాయామాలు చేయించి చివరకు జీవ బ్రహ్మైక్య సంధానం భోదించి అద్వైత స్థితి ని కలిగిస్తారు.
13  సద్గుగురువులు గురువు-శిష్యుడు ఒక్కటే అని తెలియజేస్తారు
పరి పూర్ణమును చూపించి జన్మ రహితునిగా చేస్తారు. 
గురు స్థానం పరమ పవిత్రమైనది. అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానమనే వెలుగును నాలుగు వైపులకు నడిపించే శక్తి ఒకా గురువుకే వుంది...
.
కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.

|| ఓం నమః శివాయ ||,
(సేకరణ)
12-01-2023
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత (త్రీ) 
రచాయిట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
విశ్వాంతరాళంలోని మనకు తెలిసిన లేక తెలియని సమస్త చరాచర జీవుల సుఖానుభవం లేక దుఃఖానుభవం ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ "సరాసరి"  లెక్కన అనుభవించటం జరుగుతుంది.
మన ఆలోచనలు ప్రతివిషయం  లో తేలికభావం అనుకోకండి  కష్టము కాదు,  అయ్యిందేదో మంచికే.,  అవుతున్నదేదో అది మంచికే .అవ్వపోయేది కూడా మంచికే అనుకోవాలి . ఈనాడు నీవు నాసొంతం అనుకున్నదంతా, నిన్న ఇంకొకరి సొంతం కద, మరి రేపు మరొకరి సొంతం కాగలదు.. 
 అందువల్ల నీ సుఖం, నీ శాంతి నీ ఒక్కని స్థితిపై ఆధారపడి లేదు.  జగత్తు యొక్క మొత్తపు సుఖం మీద ఆధారపడి ఉంది.
కావున జరిగేదేదో జరుగకమానదు..జరిగింది ఎన్నటికీ మారదు.. అనవసరంగా ఆందోళన పడకు 
ఆందోళన అనారోగ్యానికి మూలం.. 'ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు. ఉపకారం చేయలేకపోయినా, అపకారం తలపెట్టకు..మతిని సిద్ధంచేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు..దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండగలదు..
"అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, కర్మేంద్రియాలు" వీటన్నింటిని ఏకకాలంలో అనుభవించగలిగే ఏకైక వస్తువు  మనిషి. పుట్టుటకు గిట్టుటకు మనిషే మూలం . మనోధైర్యం తో  ఉండగలిగి ఏకాగ్రతతో  పలికే పలుకు లు సత్యాలు. 
--(())--
13-01-2023*ప్రజ్ఞానంబ్రహ్మ

నేతి నేతీతి వాక్యేన శేషితం యత్పరంపదమ్‌!

 పరిత్యక్తు మశక్తత్వా త్తదస్మీతి సుఖీభవ!! 

తా:- "ఇది కాదు", "ఇది కాదు" మున్నగు వాక్యములద్వారా వస్తువు లన్నిటిని తొలగించి వేసినచో తొలగించుటకు వీలుకాని ఏ పరమాత్మ వస్తువు శేషించునో అదియే నీవని భావించి సుఖముగ యుండుము.

వ్యాఖ్యానము:- ఆత్మ నెరుగుట ఎట్లో ఇట సులభోపాయము తెలుపబడినది. ఆత్మ కానట్టి వస్తువులన్నిటిని “ఇది కాదు, ఇది కాదు” అని తొలగించి వేసినచో తుదకు ఆత్మ మిగులును. అపుడు అదియే తానని భావించి సుఖముగా యుండవలెను.

 ప్రప్రథమమున అనాత్మ వస్తువులన్నిటిని తొలగించి వేయవలెను. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిదాభాసుడు, పంచమహాభూతములు ఇవన్నియు అనాత్మ స్వరూపములు. వీటికి సాక్షిగా యున్న ఆత్మయే తాను. అవియే తన యొక్క నిజస్వరూపము.

కాని జడమైన పైన తెలిపిన వస్తువులు కాదు. ఇట్లు ఆత్మ విచారణ చేసి క్షేత్రక్షేత్రజ్ఞ విభాగము గావించవలెను. భగవద్గీత 13వ అధ్యాయములో ఈ విషయమును గూర్చి విపులముగా చెప్పబడినది. 

ఓం ఓం  సోఽహం, సోఽహం, శివోఽహం, శివోఽహం, చిదానందరూప శ్శివోఽహం శివోఽహం!

***

 


* బ్రాహ్మణుల పేర్ల చివర ఉండే సంభోదాలు, ప్రాంతీయంగా ఉండే వాటి వివరణ

**********

శర్మ - SHARMA

శాస్త్రి - SASTRI                       

సోమయాజులు - SOMAYAJUL

దేశ్ ముఖ్ - DESH MHUK, 

దేశ్ పాండె.- DESHPANDEY. 

కులకర్ణి - KULKARNI 

జ్యోషి - JYOSHI 

బెహరా  - BEHARA

ఆచార్యులు - ACHARYA


#రాజస్థాన్_RAJASTHAN

********                                               

తివారీ -THIVARI 

బెంగాల్ - BENGAL 

బెనర్జి - BANARJEE

భట్టాచార్య - BHATTACHARYA

ఛటర్జీ - CHATTERJEE

గంగూలి - GANGULI

ముఖర్జీ - MUKHERJEE

   

#బీహార్_BIHAR

***** 

ఝా - JHA

మిశ్రా - MISHRA

   

#గుజరాత్_GUJARAT

********

భట్నాగర్ - BHATNAGAR

పాండ్య - PANDYA

త్రివేది - TRIVEDI

తివారి - TIWARI

   

#జమ్ము_కాశ్మీర్_JAMMU&KASHMIR*

**********

కర్ - KAR

పండిత్ - PANDIT

శర్మ - SHARMA

   

#కర్నాటక_karnataka 

******** 

ఆడిగ - ADIGA

ఐథల్ - AITHAL

భట్ - BHAT

దేశ్ పాండె - DESHPANDE

హెబ్బార్ - HEBBAR

అయ్యర్ -  IYER

అయ్యంగార్ -  IYENGAR

కరంథ్ - KARANTH

సోమయాజులు - SOMAYAJI

శర్మ - SHARMA

శాస్త్రి - SHASTRI

బింద్రె - BENDRE

   

#కేరళ_KERALA

*****

నంబూద్రి - NAMBOODARI


#మహారాష్ట్ర_MAHARASTRA

**********

అథవాలె - ATHAVALE

భట్ - BHAT

భావే - BHAVE

దతర్ - DATAR

దాతయ్ - DATEY

దేశ్ పాండె - DESHPANDE,         

దేష్ ముఖ్ - DESH MHUK,                               

దీక్షిత్ -  DIXIT

గోఖలే - GOKHALE

జోషి - JOSHI

పండిత్ - PANDIT

పట్వర్దన్ - PATWARDHAN

కులకర్ణి - KULKARNI,   


#ఒడిషా_ODISHA

*******

కనుంగొ - KANUNGO

కర్ - KAR

మిశ్రా - MISHRA

సత్పతి - SATPATI

 

#పంజాబ్_PUNJAB

******

శర్మ - SHARMA

  

#రాజస్థాన్_rajasthan 

********

శర్మ SHARMA

వ్యాస్ VYAS


#తమిళనాడుTAMILNADU

*********

అయ్యర్ -  IYER

అయ్యంగార్ - IYENGAR

   

#ఉత్తరప్రదేశ్_UTTAR_PRADESH

**********

చతుర్వేది - CHATURVEDI

ద్వివేది - DWIVEDI

జోషి - JOSHI

మిశ్రా - MISHRA

శర్మ - SHARMA

త్రిపాఠి - TRIPATHI

వాజపేయి - VAJAPAYEE

ఇవి ఎక్కువగా అందరి నోళ్ళల్లో నిత్యం మెదిలేవీ మాత్రమే ఇక్కడ అందించానని భావించకండి. ఇంకా ఎన్నో ఇంటిపేర్లతో కూడినవి కూడా  ఉన్నాయి... అవి👇

Trivedi, Dubey, Chaubey, Tripathi, Tiwari,, Joshi, Pandey, Shukla, Deekshit, Pathak, Agnihotri, Tyagi, Ojha, Bharadwaj, Sharma, Dutt, Kaul, Mattoo, Haksar / Hak, Tikkoo, Labroo, Bindroo, Raina, Razdan, Vyas, Bhat/Bhatt, Desai, Apte, Gokhale, Ranade, Lele, Nene, Kulkarni, Chitale, Vaidya, Deshpande, Mukherjee, Banerjee, Chatterjee, Ganguly, Bhattacharjee, Chakrabarti, Sanyal, Lahiri, Bagchi, Bhaduri, Maitra, Ray Chaudhuri, Ghoshal, Tagore/ Thakur, Rath, Kar, Dash, Mahapatra, Satapathy, Acharya, Panda, Goswami, Borthakur, Barua, Gayen, Iyer, Iyengar, Shastry, Chari, Adiga, Joshi, Kulkarni, Hegde, Desai, Shenoy, Bhat, Pai, Prabhu, Kamath, Benegal, Shanbhag, Shirali, Padukone, Dixitulu, Bhattu ..లాంటివి.

వాటి పుట్టు పూర్వోత్తరాలు:

ఒకతను పాట్నాలో  వేదం-వల్లె వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని "ఎందుకండీ ఇలా బట్టీ పట్టిస్తున్నారు? చేతికి పుస్తకం ఇస్తే... చూసి జాగ్రత్తగా చదువుతారు కదా! అని అడిగితే....

దానికి ఆయనిచ్చిన సమాధానం..

"నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన మహమ్మదీయ రాజు కాలంలో కాల్చి వేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళి ఆ వేదం విద్యనూ గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రూరంగా హింసించి చంపేయ్యడం జరిగింది!

ఇది ముందే గమనించిన  మనవిద్యావేత్తలు  వేదాన్ని ఏనాటి నుండో... కంఠస్థం చెయ్యడం అలాగే మరికొంత మందికి కంఠోపాఠంగా నేర్పడం మొదలుపెట్టారు - అలా చాలావరకు వేదాధ్యయనం ముఖతము గానే కొనసాగింది, అందువల్లే వేదాన్ని కంఠస్థం చెయ్యడం అలవాటుగా మారింది.

★4 వేదాలు నోటికి వచ్చిన వారిని చతుర్వేది, అని

★3 వేదాలు వచ్చినవారిని త్రివేది, అని

★2 వేదాలు వచ్చినవారిని ద్వివేది, అని

★1 వేదం నేర్చినవారిని ఉపాధ్యాయ, అని

★శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి, అని

★మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని మిశ్రా, అని

★శాస్త్రీయ కర్మ, విధి విధానాలను నేర్చిన వాడిని శర్మ, అని .... ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది!

"మరి.. ఇప్పుడు రాయచ్చు కదండీ.. ఇప్పుడు మనం స్వతంత్రులం కదా?" అని అడిగారు.

ఆయన నవ్వేసి.."ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని? గత 70 ఏళ్లుగా గమనిస్తున్నాను.. ఒక్కడంటే ఒక్క  మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మీద దృష్టి పెట్టనేలేదు! ఇప్పటికీ మనం మొఘల్ రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే... ఇతర మతగ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం!  

దీనర్థం—ఇతరులకు ఇంకా భయపడుతున్నట్లే కదా!" అన్నారు.

ఇక బ్రాహ్మణుల పుట్టుపూర్వోత్తరాలు ఎలా ఉన్నా... వేదాలను, శాస్త్రాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.... ఇప్పటికీ మనం ఎన్నో గ్రంథాలను దక్కించుకోలేకపోయాము🙏🏽🇮🇳😢

సేకరణ:-

    🕉#శుభమస్తు🕉

లోకా సమస్తా సుఖినోభవంత్

   ❤🙏❤🙏❤🙏❤



No comments:

Post a Comment