ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - (జి .కే - 8)
సేకరణ/ రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
1 .మని షి కి ఉండవలసిన మూడు లక్షణాలు ఏమిటో చెపుతారా?
నాదృష్టిలో మని షి కి ఓర్పు ఓదార్పు ఒరవడి మరియు దానము, భోగము ఆధ్యాత్మికము ఉండాలి
2 . నిజమైన సుఖి, యోగి, రోగి, ఎవరో చెప్పగలరా ?
కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచగల సాధకుడే " సుఖి, యోగి " అనుమానము, ఆశతో ఉండి తృప్తి లేని వాడు రోగి.
త్రీ. మనసుకు మందు, మమతకు పొందు, కులుకుకు చిందు, పదాల భావమేదో ఎవరైనా చెప్పండి ?
నాదృష్టిలో ప్రశాంతత కొరకకు మాత్రమే.
4 . నిరీక్షణ అనగా నేమి ?
నాదృష్టిలో నిరీక్షణ అనగా "సాధన కొరకు, ఆనందం కొరకు, కోరిక కొరకు " వేచి ఉండుట, అర్ధం లేని నిరీక్షణ కాలాన్ని వ్యర్థం చేస్తుంది, ఆలోచనా భారం పెంచుతుంది
5 . స్థితి ప్రజ్నుడు అనగా ఎవరో తెలియ పరచండి ?
దు:ఖములకు క్రుంగి పోని వాడును, సుఖములకు పొంగి పోని వాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడిన వాడును అయినట్టి మననశీలుడు
6. మనిషికి, సూర్యభగవానునికి, ఒక పోలిక ఉన్నది, అది ఏమిటో చెప్పా గలుగు తారా?
సూర్యుడు ప్రపంచానికి వెలుగును పంచి అస్తమించి ఉదయిస్తాడు, మనిషి దేశం కోసం, కుటుంబం కోసం సహాయం అందించి మరణిస్తాడు పుడతాడు కదా
*7 . పత్రికలూ, టివిలో ప్రోగ్రాములు ఎంత వరకు ఉపయోగపడతాయి ?
మేధావులు చెప్పే మంచి విషయాలు, కళాకారలు నటనా సామర్థ్యంతో మనసుకు హత్తుకొనేవి ఉన్నాయి, కొందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి, మంచిని చూసే శక్తి తెలుసుకొనే శక్తి భగవంతుడిచ్చాడు కాబట్టి "రెండు" అవసరము, సమయం వ్యర్థం కాకుండా ఉండగలిగితే మంచిది.
8 . త్రిగుణా తీతుడు ఒకే స్థితిలో ఉండుటకు ఏమిచేయగలడు ?
సత్వగునరూపమైన ప్రకాశము, రజొగునకార్యరూపమైన ప్రవ్రుత్తి,తమొగునకార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగునాతితుడు ద్వేషింపడు, అనగా విచారించాడు,వాటికి కాంక్ష పడడు కనుక ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండును.
9 . చదువుకున్న వాడికి, చదువు కోని వాడికి కొద్ది తేడా ఉంటుంది అది ఏమిటో మీరు చెపుతారా?
చదువుకున్న వాడికి ఎం మాట్లాడాలన్నా ఆలోచన అడ్డు పడుతుంది, చదువుకోని వాడికి తెలుసుకున్న మాట చెప్పందే నిద్రపోడు.
సహాయం పొందినవారు నోరెత్తరు, గిట్టనివారు నోరెత్తి ఈర్ష్యతో కాకిలాగా అరుస్తారు, ప్రభుత్వంవారు అక్రమసంపాదన అని తెలిస్తే తీసుకుంటారు, నిరూపించే వ్యక్తే ధైర్యంతో ముందుకు వచ్చి ఆధారాలు చూపితే మంచిది
10 . డ్రగ్స్ గురించి సినిమానటులను, మరికొందరిని విచారిస్తున్నారు, ఫలితమేమన్న ఉంటుందా ?
అనుమానంతో ప్రశ్నలు వేసి దోషులను నిర్ధారించటం, నల్లమందు అరికట్టడం ప్రభుత్వధర్మం - ముందున్నది అంతా మంచి కాలం అని సమర్ధించుకోవటం మానవుల నైజం
No comments:
Post a Comment