Wednesday 16 November 2016

ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు-*1*

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
Hanan Foudah - Google+
సర్వేజనా సుఖినోభవంతు
ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు 
పార్ట్ -1 


ఇంటిముందు ముగ్గులు వేస్తున్నారు ఆడవారు, వారికి తోడుగా మొగవారు సహకారిస్తూ ముగ్గులందిస్తూ, ముచ్చట్లు చెప్పుతూ, సరదాగా నవ్వు కుంటూ ముగ్గులు పూర్తి చేసారు, అది ఒక పెద్ద కుటుంబము, ఇద్దరు కొడుకులు కోడళ్ళు, ఇద్దరు కూతుర్లు అల్లుళ్ళు అందరు కలసి సరదాగా వినాయక చవితి పండుగ జరుపు కుంటున్నారు.  ఇంటి పెద్ద చక్రధర్ గారు, శ్రీమతి శారద ఇంటిని  పద్ధతిలో నడుపు కుంటూ  ఎటువంటి ఇబ్బంది కలుగ కుండా పిల్లలకు చదువులు చెప్పించి, వారికి వివాహములు జరిపి సంతోషంలో ఉన్న కుటుంబము. 

ఆకుటుంబములో చిన్న కొడుకు రామకృష్ణ చదువు  అబ్బలేదు,  ఇష్టము వచ్చి నట్లు స్నేహితులతో తిరిగేవాడు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చు కుంటాడు, ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే తెలుసుకొని న్యాయం జరిగేదాకా శ్రాయ శక్తుల కృషి చేస్తాడు. చిన్న చిన్న విషయాలకే రెచ్చి పోతాడు, 

మొన్నటి మొన్న ఐస్ బండివాడు ఒక పిల్ల చేతిలో ఐస్ పెట్టాడు, ఆపాప పట్టుకోకుండా గభాలున క్రింద పడేసింది, మల్లి కావాలని ఏడ్చింది అప్పడు పాప ఏడుస్తున్నది కదా బండివానితో వేరొక ఐస్ ఇవ్వు అన్నాడు రామకృష్ణ. డబ్బులిస్తేనే ఇస్తాను ఇవ్వాటం కుదరదు అన్నాడు, ఎందుకు ఇవ్వటం కుదరదు ఇవ్వు డబ్బులిస్తా, ముందు డబ్బులివ్వు అప్పుడే ఇస్తా అన్నాడు, మాటలు పెరిగి బూతులుదాకా వచ్చేటప్పటికల్లా ఎడం చేతి వాటంతో చేయి చేసుకున్నాడు, అక్కడ చేరిన జనం అందరూ ఎవరి కిష్టము వచ్చినట్లు వారు మాట్లాడారు, అప్పుడే అటుగా వస్తున్న తండ్రి గమనించి గదా తీర్చి డబ్బు ఇచ్చి పంపించాడు.       
        
ఒకనాడు చక్రధర్ గారు కొడుకును పిలిచి నీ ప్రవర్తన మాకెవ్వరకూ నచ్చుటలేదు, కష్టము అంటే ఏమిటో నీకు  తెలియుట  లేదు, ఈ రోజు  నుంచి నీవు ఎక్కడైనా కష్టపడి డబ్బు సంపాయించి తె స్తేనే ఇంటిలో నీకు కూడు దొరుకుతుంది ఆలోచించుకో, లేదా నేనే ఎక్కడో ఒక్క చోట పనిచేసుకొని బ్రతుకుతాను అని నీకు ధైర్యము ఉంటె తక్షణం ఇంటినుండి వెళ్లి పోవచ్చు. ఇక్కడ నిన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు. ఇక్కడ భోజనం చేయాలంటే రోజూ ఎంతోకొంత సంపాయించి మీ అమ్మ చేతిలో డబ్బు పెట్టాలి, 

లేదా నేనే స్వతంత్రముగా బ్రతుకు తాను అని నీవు భావించి నట్లైతే ఆ బళ్లపై ఒక వైపు 10 వేళ నోట్ల కట్ట మరో వైపు  తల్లి తండ్రుల ఫోటో గోల్డు లాకెట్ ఉన్నది, నీకు ఏది ఇష్టమైతే అది తీసుకోని తక్షణం వెళ్లిపోవచ్చు అని చెప్పాడు చక్రధర్ . 

నాన్న గారు మీరు ఇప్పటిదాకా నా మీద ప్రేమ ఏంతో  చూపారు, నాకు చాలా సంతోషము అమ్మా అని పిలిచాడు రామకృష్ణ 

ఏమిటిరా  బాబు అంటూ వచ్చింది, అమ్మా నాన్న నన్ను దీవించండి లోకంలో బ్రతకటం నేర్చుకొని మీకు మల్లి కనిపిస్తాను, మీరు నన్ను దీవించి పంపండి అని పాదాలకు నమస్కారించాడు. అన్నా వదినలకు, అక్కాబావలకు నమస్కరించి బయటకు  బయలు దేరాడు,  బాబు అన్నం తినిపోరా ఎప్పుడు తిన్నావో అన్నది తల్లి శారద. 
                                                                                               
                                                                         తరువాత భాగము రేపు చదవండి .... 


ఈ పండగ నాడు ఎక్కడికి పోయి బ్రతుకుతావురా ఇక్కడే ఉండు మీ నాన్న గారిని వప్పిస్తాను ఇక్కడే ఉండురా, ఇక్కడే ఉండి చదువుకో , నాన్నకు చెప్పు నేను బాగా చదువుకుంటాను ఇప్పుడు క్షమించు-  అని అడగారా , పంతానికి పోకురా , దేశములో బ్రతకటం చాలాకష్టం నీవు తొందర పడవద్దు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోరా. 
అమ్మా ఈ పండుగ నాడు నేను   ఎక్కడకు పోవుటలేదు రేపటి లోపు నా నిర్ణయం అందరికి చెప్పి ఇంటిలో ఉండుట లేదా బయటకు వెళ్లి బ్రతకటం చెప్పగలను. 

ఆమాటలకు అందరూ సంతోషించి అందరూ కలసి భోజనం చేసి సరదా సరదా గా ఆడుకుంటూ, పాడుకుంటూ కాలం గడిపారు ఆరోజు అందరూ.

రామకృష్ణ కు రాత్రి నిద్ర రాలేదు, అమ్మ చెప్పినట్లు విని నేను ఇక్కడే ఉన్నట్లయితే నాన్న చేత రోజూ తిట్లు తినాలి, నాన్న చెప్పి నట్లు ఇంటి నుండి బయటకు వెళితే ఎలా బ్రతకాలి అని ఎంత  సేపు ఆలోచించిన  పరిష్కారం దొరకలేదు , తెల్లవారు జామున నిద్ర పెటింది.
ఏమిటీ ఆ బడుద్దాయి ఇంకా నిద్ర లేవలేద, తెల్లవారు జామున లేచే అలవాటు ఉంటేగా, అలా వాకింగ్ పోదాం, సూర్యనమస్కారాలు చేద్దాం అని ఒక్కరికి లేదు అంటూ చక్రధర్ గారు ఒక చిన్న చాప వేసుకొని ,దానిపై చిన్న గుడ్డ వేసుకొని పద్మాసనం వేసి ముక్కును పట్టుకొని కూర్చున్నాడు.
నాన్న అప్పుడే అష్టోత్తరం మొదలైంది ఇక నా నిర్ణయం చెప్పే సమయ మైనదని అనుకున్నాడు రామకృష్ణ .

బాబు మొఖం కడుక్కో కాఫీ తీసుకోని వచ్చి ఇస్తా అన్న తల్లి మాటలకు నిద్ర     లేవక  తప్పలేదు.
                                      
తల్లి ఇచ్చిన కాఫీ త్రాగుతున్నాడు, అప్పుడే ఎరా అబ్బాయి, నీవు నాకుచెప్పి అప్పుడే కొన్ని గంటలు దాటి పోయినాయి, ఏమి నిర్ణ యించు కున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు, ఒక వేళా నీవే వేరేగా బ్రతకాలను కుంటే, మన వంశం  పేరుగాని, నాపేరు గాని ఎక్కడా ఉపయోగించు కోకూడదు,  ఎవరు ఏమన్నా పట్టించు కోకూడదు మంచి మాటలు మాత్రం  గుర్తుంచుకో , ఎవ్వరి వద్ద ఎటువంటి అప్పు తీసుకో కూడదు, నీవు ఏ పని చేసినా నాకు ఇష్టమే .

డ్రైనేజ్ శుభ్రం చేయబడును అని పాంప్లెట్ పొద్దున్నే పేపర్లో చూసా ఆ ఆపని చేసినా నాకు  అభ్యంతరం లేదు, లేదా నాన్న నేను ఈ వ్యాపారామ్ చేస్తా అని చెప్పు దాని లాభ నష్టాలు అంచనా వేసి నాకు సబబు ఐతే వ్యాపారం  పెట్టిస్తా, నాకు ఇష్టమ్ లేకపోతే నీకు చిల్లుగవ్వకూడ ఇవ్వను ఆలోచించుకో  అని చెప్పి కాఫీ త్రాగుట సగం లో అపావు పూర్తిగా త్రాగు ఏనాడన్న కష్టపడితే గా అంటూ లోపలకు సాగాడు చక్రధర్ .......... 2..... తరువాత భాగము రేపు చదవండి .... 



అప్పుడే తల్లి వచ్చి ఇంకా కాఫీ త్రాగలేదు ఏమిరా మళ్ళీ వేడికాఫీ తెచ్చి ఇస్తా ,

ఉండూ అమ్మా కాఫీ కేం తొందర లేదు ఇటు కూర్చోమ్మా , నాకు ఏదన్నా సలహా ఇవ్వమ్మా అని అడిగాడు రామకృష్ణ .

ఏనాడైనా ఎప్పుడైనా సలహాలు ఇచ్చానా, వండానా అందరూ భోజనం చేశారా అని ఆలో చించాను తప్పా, అన్నీ నిర్ణయాలు మీనాన్న చెప్పినట్లు చేస్తేనే నాకు ఇంత కూడు దొరుకుతుంది లేక పోతే ఏనాడో  ఈ కుటుంబం ముక్కలయ్యేది, మీనాన్న చెప్పిన దాట్లో తప్పు ఎక్కడా  నాకు కని పించుట లేదు, నేను ప్రపంచములో బ్రతక గలను అని ఆత్మవిశ్వాసం ఉంటే తక్షణం బయట ప్రపంచంలో బ్రతికి నలుగురిని బ్రతికించు, నేను పెద్దగా చదువు కోలేదు ఇంతకన్నా నేను నీకు ఏమి చెప్పలేను, నాన్నే గదా అరిచింది వంటిమీద పడ్డ దుమ్ము దులుపు కున్నట్లు దులుపుకొని ఉండ దలుచు కుంటే నిత్యమూ మానసిక సంఘర్షణలకు చిక్కుతావు అది మాత్రం గుర్తుంచుకో నేను మీనాన్నకు తోడు , నాకు మీనాన్న తోడు తప్పదు. నేను ఒకటే చెప్పగలను ప్రతి రోజు అద్దం శుభ్రంగా తుడుచుకొని ముఖం చూడమన్నారు పెద్దలు. ఎందుకో తెలుసా నిన్న జరిగిన విషయాలన్నీ మరచి పోయి కొత్త ముఖంతో ఉండాలనేదే ఇందులో ఉన్న నీతి.
             
నా ఈజీవితము లో సగం పైన సుఖదుఃఖాలు అను భవించాను, ఇది మాకు శేష జీవితము.
నీవు వయసు లో ఉన్నావు, కష్ట పడగలవు ఆలోచించుకొనే శక్తి నీకు ఉన్నది అని చెప్పి లోపలకు వెళ్ళింది తల్లి......

బయట  నుండి అమ్మా ఇంత గంజి ఉంటే పోయండమ్మా, చద్ది ఉంటే  పెట్టండమ్మా, 2000 రూపాయలకు చిల్లర ఉంటే ఇవ్వండమ్మా అని అరుస్తున్నాడు ఒక బిచ్చగాడు,

బాబు బాబు అని తల్లి పిలుపుకు రామకృష్ణ తల్లి వద్దకు చేరాడు, ఒక్కసారి బయటకు పోయి రాత్రి పూరీలు తీసుకుంటాడేమో అడుగు నాయనా అన్నది  . అమ్మా ఇవ్వు నేను  ఇస్తా, వద్దు బాబు ముందు అడిగిరా మనం పెట్టిన వాటిలో కొద్దిగా వాసన వచ్చినా వారి నోటికి వచ్చి నట్లు తిడతారు అది గుర్తు పెట్టుకో సరేనమ్మా వెళ్లి అడిగి వస్తా.

రాత్రి పూరీలు తీసుకుంటావా, తీసుకుంటాను బాబు అన్నాడు.మరి చిల్లర ఉంటే కూడా సర్దు బాబు.

మీదగ్గర  చాలా చిల్లర ఉంటుంది అంటారుగా. అవును బాబు నిన్నటి దాకా ఉండేది, మా ఇంటి పక్క బాబుకు ఆరోగ్యం బాగుండక పోతే ఉన్న చిల్లరంతా ఆస్పత్రిలో  కట్టినాను 2000 రూపాయల నోటు తీసుకున్నా అయినా నేను ఉంచిన  చిల్లర ఒక ప్రాణికి సహాయ పడినందుకు నాకు సంతోషముగా ఉన్నది బాబు.  2000 చిల్లర అడుగుతున్నాను అన్నాడు.       

ఏమిట్రా బిచ్చగానితో సంభాషణ ముందు ఇవిపెట్టు అతనికి అని అన్నది తల్లి. 

రామకృష్ణ  వెంటనే పూరీలు పెట్టి వెనుకకు వచ్చాడు.   ......   3  .......    



*ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు(serial) పార్ట్ -4


బాబు ఈరోజు మనం గుడికి వెళ్లుతున్నాము, అక్కడ భగవద్గీత గురించి ఉపన్యాసము చెపుతున్నారు,  కూర్చొని విని  వద్దాము. 

అట్లాగేనమ్మా 

 గుడికి చేరారు ఆ పరమాత్ముని దర్శనము చేసుకున్నారు, అమ్మా వెల్దామా అన్నాడు రామకృష్ణ  బాబు కాసేపు భగవద్గీత విని పోదాము, నాకు అర్ధం కాదు కదమ్మా,  మంచి విషయాన్ని తల ఎక్కించు కోవటం అందరికి కష్టం అయినా వినటం తప్పు కాదు అన్నది తల్లి. 

అప్పుడే ఉపన్యాసము మొదలు పెట్టారు   

ఈ  లోకములో ప్రతి ప్రాణి ప్రతి జీవి యొక్క యదార్ధ స్వరూపము బ్రహ్మమే, ఐతే ఆవిషయాన్ని తెలుసుకొనే అర్హత మానవుడికి మాత్రమే ఉన్నది, కనుక ప్రతి మానవుడు పరమాత్మను దర్శించగలడు. 

ప్రపంచములో అన్ని వస్తువులు దివ్య విభూతులూ కాదు, అవి సామాన్యలందు విభూతులుగా ఆవరించి ఉంటాయి అవి తేజస్సు, బలం, ఐశ్వర్యం, విద్య, శక్తి,  కాంతి.
కొన్ని సాత్వికమైనవి, కొన్ని రాజసికమైనవి, కొన్ని ఆమసికమైనవి. 

గంగ సాత్త్విక విభూతి, సింహం రాజసిక విభూతి, జూదం తామసిక విభూతి. 

ఆయితే భగవద్ స్వరూపాలు గల ఉప్పు నీరు త్రాగ గలమా, పాములను ప్రక్కలో ఉంచు కోగలమా

పరమాత్ముడు మనకు మంచి చెడు తెలుసుకొనే తెలివి ఇచ్చాడు దాని అనుకరించి పంచభూతా ల సహాయముతో జీవించాలి. 

కళ్ళుమూసుకొని ధ్యానం చేస్తే భగవంతునితో సంభంధం కళ్ళు తెరచి చూస్తే లౌకిక విషయాలే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి వాటి నుంచే మనం జీవిస్తూ  ఉండాలి. 

కొందరిలో కళ్లుమూస్తే రాముడు , కళ్ళు తెరిస్తే కాముడు కనిపిస్తాడు. మరి కొందరిలో తీర్ధానికి తీర్ధం తీసుకుంటారు ..   ప్రసాదానికి ప్రసాదం పొందుతారు. చెప్పుకోవటానికి వేదాంతం ... చెయ్యటానికి వ్యవహారం అని గమనించాలి అందరు. 

భగవంతుని స్మరించటం - పరమార్ధం, యోగం 
యద్ధం చేయటం - వ్యవహారం, విభూతి    
         .బుద్ధి

ఆత్మబుద్ధి సుఖాన్ని కోరు
గురుబుద్ధి  హితాన్ని కోరు 
సమబుద్ధి సత్యాన్ని కోరు 
నీచబుద్ధి ద్వేషాన్ని కోరు 

బంధ విముక్తియే హితం కోరు 
దు:ఖనివృత్తియే హితం కోరు
నిత్య  ప్రాప్తియే హితం కోరు 
జ్ఞాన ప్రాప్తయే  హితం కోరు 

శ్రేష్టమైన మాట మనసు చేరు 
మాతృ హృదయం బిడ్డ చేరు 
బుద్ధిహీనం చేత భయం చేరు 
తపస్సే మనస్సుకు శాంతి చేరు

రాగి తీగలో విద్యుత్  చేరు 
గాలివాటమున పడవ మారు
ఆశా మొహాలు మనిషని చేరు    
మనిషి ప్రతి క్షణం సుఖం కోరు
--((*))-- 

ప్రేమ రెంటిని ఒకటి చేస్తుంది - అహంకారం ఒకటి రెండు చేస్తుంది,  అంటూ ఉపన్యాసము చెపుతున్నారు. .                 ........ 4....       
     
                                                                                                          
    బాబు మనం ఇంటికి పోదాం, పదమ్మా అంటూ చేయి పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నాడు అప్పుడే వేగంగా ఒక బైక్ మీద ముగ్గురు కుర్రవాళ్ళు పగలు త్రాగి నడుపు కుంటూ వచ్చి దభీ మని వెనుక వైపు పడ్డారు, బాబు ఎవరో స్కూటర్ మీద నుంచి పడ్డట్టున్నారు వెళ్లి స్కూటర్ లేపారా అట్లా చూస్తూ ఉన్నావేమి అన్నది తల్లి, లేదమ్మా వాళ్లకు ఇప్పుడే సహాయం చేస్తాను అంటూ స్కూటర్ పైకి తీసాడు, టాన్క్స్ అని చెప్పి మరీ బైక్ మీద వెళ్లి పోయారు.
వాళ్ళు ఎట్లా పడ్డారో నీకు తెలుసా, ఆ తెలుసమ్మా, వాళ్ళు మనకు ఇబ్బంబ్రతికించిందిది కలగకుండా షడన్ బ్రేక్ వేశారు పడ్డారు అని చెప్పాడు రామకృష్ణ.
అది నిజమేరా మనం చేసిన పుణ్యం మనల్ని  అది మాత్రం గమనించు అని పలికింది తల్లి. నెమ్మదియా ఇంటికి చేరారు ఇద్దరు.          

దర్శనం బాగా జరిగిందా అని ఎదురువచ్చి మరి అడిగాడు చక్రధర్, బాగా జరిగిదండి, మరి ఎందుకు అలస్యమైనది, అక్కడ ఉపన్యాసం చెపుతుంటే కాసేపు కూర్చొని వచ్చాము. మన పుత్ర రత్నం ఎం నిర్ణమయము తీసుకున్నాడు, కనీసాము నీకైనా చెప్పాడా, ఏమిటండి ఆ మాలు ఏ విషయానికైనా పట్టు విడుపు ఉంటుంది, సూర్యడి కి గ్రహాణం  పట్టిందని కాసేపు భాద పడ్డాము తర్వాత గ్రహణం విడిన తర్వాత అంతాసుఖ మయం. ఎవరో చప్పారు కధ, ఒక ఇంటివారు కొన్ని జంతువులను పెంచారు పిళ్లిని పెంచారు, కుక్కను పెంచారు, కోళ్లను పెంచారు, మేకలను పెంచారు చివరికి నక్కలను పంచారు. కానీ నక్కకు ఆశ పుట్టింది ఎట్లైనా సరే జంతువులన్నీ తినాలని తన తెలివి అంతా ఉపయోగించి జంతువులన్నీ మూగ జీవులు వాటిని పెంచటం మహా పాపం వాటిని స్వేశ్చగా వదిలేయ్ అని చెప్పింది, పాపం పుణ్యం ఎరుగని అమాయకుడైన ఇంటి యజమాని జంతువులను వదిలేసాడు, అవి వెళ్లి పోయాక ఆకలికి కూడా అలమటించి పోయాడు. 

ఏమిటే అసలు నీ ఉద్దేశ్యం, కొడుకును వెనక వేసుకొస్తున్నావు పెద్దకొడుకులు ఇద్ద రూ ప్రయోజకులయ్యారు వీడు అప్రయోజకుడు, నా దృష్టిలో వీడికి తిండి కూడా దండగ, నేను ఈ అమాయకుడిని కాదు, నా ఉద్దేశ్యం లోకంలో కి వెళితేనే బాగు పడతాడని మంచి చెడు తెలుసు కుంటాడని.


చాళ్లేండీ మీ మాటలు మన అబ్బాయి ఎక్కడికి పోడు ఇక్కడే ఉంటాడు అని గట్టిగా చెప్పింది శారద.
సరే ఈ రోజుకు నేను ఊరుకుంటున్నాను, మనవాడు ఒక చిన్న తప్పు చేసినా నేను అరచి బయటకు పంపిస్తా అప్పటికి అడ్డు పడితే మంచిది కాదు.
వేరేయ్ రామకృష్ణ సంచి తీసుకో కూరలు తీసుకు వద్దాము.

అట్టాగే నాన్న అంటూ వెనుక నడిచాడు                  

ఇద్దరూ నడచి వెళుతున్నారు అప్పుడే చక్రధర్ స్నేహితుడు శ్రీధర్ కలిసాడు, బాగున్నారండి అని అడిగాడు, వెంటనే బాగున్నాము కాబట్టే నిన్ను కలుసుకోగలిగాను, మీ అబ్బాయి ఏదన్నా ఉద్యోగము సంపాయించాడా, లేదు

నేను అన్నానని అనుకోవద్దు మీదగ్గర ఉంటే కనీసం ధైర్యంగా ఉండటం కూడా ఉండటం కూడా నేర్చుకోలేడు అన్నాడు................

ఏంచేద్దాం కాలమే నిర్ణయింస్తుంది, తండ్రిగా బాధ్యత వహించక అప్పుడు కదా, అది నిజమే అనుకో అయినా ఒక కధ చెపుతా విను        

"ఒక ధనవంతుడికి పెళ్ళికాని అందమైన కూతురుండేది. ఆయన తన బంగళా వెనుక ఒక కొలనులో భయంకరమైన మొసళ్ళను పెంచేవాడు. ఒక రోజు ఆయన పెద్ద పార్టీని ఏర్పాటు చేసి చాలా మందిని ఆహ్వానించాడు. అందులో ఇలా ప్రకటించాడు.... “ఇక్కడున్న యువకులందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైతే ఈ సరస్సులో దూకి మొసళ్ళ నుండి తప్పించుకుని బయటకు ఈదుకుని వస్తారో వారికి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను లేదా ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను”. ఆయన మాటలు పూర్తి కాక ముందే ఎవరో నీళ్ళలో దూకిన చప్పుడైంది. నీళ్ళలో ఒక యువకుడు తన శాయశక్తులా ఈదుతూ వస్తున్నాడు. పార్టీకి విచ్చేసిన అతిథులంతా అరుస్తూ అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. చివరికి చిన్న చిన్న దెబ్బలతో, చిరిగిపోయిన చొక్కాతో అవతలి ఒడ్డుకి చేరుకున్నాడా యువకుడు.... ఆ ధనవంతుడు ఆశ్చర్యంతో దగ్గరికి వచ్చి ” నాకు నిజంగా నమ్మశక్యం కాకుండా ఉంది. పరమాద్భుతం.... ఇది ఎవరూ పూర్తి చేస్తారని అనుకోలేదు. కానీ నేను మాట తప్పను.
చెప్పు. నీకు మా అమ్మాయి కావాలా? ఒక మిలియన్ డాలర్లు కావాలా?”
“నాకు నీ కూతురూ వద్దూ, ఆ మిలియన్ డాలర్లూ వద్దు....
ముందు నన్ను నీళ్లలో తోసిన వాణ్ణి చూపించండి... ..."

కధ బాగుంది అరదః మైందా, ఎందుకు అర్ధం కాలేదు, ఆ నీళ్లల్లో తోసింది కన్న తండ్రే అని తెలుస్తున్నది.
నేను చేయమని చెప్పను కొడుకుకి ధైర్యం వస్తే ఏదైనా సాధిస్తాడు అని తెలుస్తున్నది.
నాకొడుకుకు ఎందుకు ధైర్యము లేదు ఇటు రా చూపిస్తా అంటూ మార్కెట్ లోకి వెళ్ళాడు. అందరూ ఎటు పడితే  అటు పరిగెడుతున్నారు అక్కడ ఎం జరుగుతున్నదో ఇద్దరూ దూరంగా నుంచొని చూస్తున్నారు.   
     

ఆ  మార్కెట్లో అనేక షాపులు ఉన్నాయి, ఒక వైపు కూరకాయల షాపులు, ఆకు కూర షాపులు, మరో వైపు పండ్ల షాపులు ఉన్నాయి అక్కడ ఒక మూల ఒక మందుల షాపు ఉన్నది,  అక్కడే గొడవ మొదలైనది. ఒక 16 ఏళ్ళ పడుచుపిల్ల ఒక చీటీ మందులు కొన్నది, తన దగ్గర ఉన్న 2000 రూపాయల నోటు ఇచ్చింది, చిల్లర లేదు మందుల అక్కడ  పెట్టి పోమ్మా పొద్దున్నే బారం అని  గోనుకుంటున్నాడు,  ఆమె అతన్ని బ్రతిమాలాడు తున్నది,   ఎంత బతిమ లాడినా వప్పు కోవటం లేదు అప్పుడే రామకృష్ణ అక్కడకు చేరి చిల్లర ఇమ్మన్నాడు, ఇవ్వము నీ వెవరవయ్యా నన్ను  అడగ టానికి నీ దారి నీవు చూసుకో అని అరిచాడు, అప్పుడే సరిగా మాట్లాడం నేర్చుకో, నేనొక భారతీయ పౌరుడుగా అడిగే హక్కు ఉన్నది , ముందు చిల్లర తీసి ఆమెకు ఇవ్వు , ఏమిటి బాబు నీకు ఆ అమ్మాయికి ఏమిటి సంభంధం నీ దారి నీవు పోక. ఏమిటి మాటా మారుస్తున్నావు, పేలుతున్నావు అని గట్టిగా అడిగాడు అప్పుడే  పది మంది చుట్టూ మూగారు. 

2 comments: