Thursday 1 April 2021

02042021 శుక్రవారము




*శ్రీ కృష్ణ శరణాష్టకం*

ఓం శ్రీ రామ్ఓం....శ్రీమాత్రే నమః..ప్రాంజలి ప్రభ


*1)సర్వసాధన హీనస్య పరాధీనస్య సర్వతః!*

*పాప పీనస్య దీనస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*2) సంసార సుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతః!*

*వహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణః శరణం మమ!!*


*3) సదా విషయ కామస్య దేహా రామస్య సర్వథా!*

*దుష్ట స్వభావ వామస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*4) సంసార సర్వ దుష్టస్య ధర్మ భ్రష్టస్య దుర్మతేః!*

*లౌకిక ప్రాప్తి కామస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*5)విస్మృత స్వీయ ధర్మస్య కర్మ మోహిత చేతసః!*

*స్వరూప జ్ఞాన శూన్యస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*6) సంసార సింధు మగ్నస్య భగ్న భావస్య దుష్కృతేః!*

*దుర్భావ లగ్న మనసః శ్రీకృష్ణః శరణం మమ!!*


*7) వివేకధైర్య భక్త్యాది రహితస్య నిరంతరం!*

*విరుద్ధ కరణాసక్తేః శ్రీకృష్ణః శరణం మమ!!*


*8)విషయాక్రాంత దేహస్య వైముఖ్య హృతసన్మతేః!*

*ఇంద్రియాశ్వ గృహితస్య శ్రీకృష్ణః శరణం మమ!!*


*9) ఏతదష్టక పాఠేన హ్యేత దుక్తార్థ భావనాత్!*

*నిజాచార్య పదాం భోజసేవకో దైన్య మాప్నుయాత్!!*


*ఇతి శ్రీహరి దాసవర్య విరచితం శ్రీకృష్ణ శరణాష్టకం సంపూర్ణం*
OoooooooO


సీతాపతీ పద్య కావ్యము

సీసము

ప్రేమయే మనిషికి పెట్టని కోట నౌ

ప్రేమను పొందియు ప్రేమ పంచు

తల ఎత్తు దించకు - దింపేను లోకము

ధర్మము తప్పకు - ధరణి నమ్ము

కష్టాలు తప్పవు - కాష్టంలకాలేను

కొమ్మలు ఒంగితే .. కోరి కొద్దు

సహనం చూపుతూ సమభావ ముంచుము

లక్ష్మణా కళలకు లొంగి ఉండు

ఆటవెలది

వాన నీరు వీలు వాలును బట్టియు 

మనిషి ఓర్పు నేర్పు మనసు బట్టి

రకరకాల పంట దిగుబడి జరుగును

ధనము కూర్చి ఆశ దారి పోకు.............103

--(())--


సీసము

ఏకాగ్రత వలన - ఏదైన సాధించు

ఎంత తరుణమైన - ఎనక ముందు

సవ్యసమర్ధత - శాంతము కలిగించు

ఆట లాడుచు ఉన్న - ఆశ పెరుగు

పనులన్ని చేయుచూ - ప్రీతిని కల్పించు

యజమాని యైయుండి - యదను పంచు

వదలక మెదలక - ఏర్పాటు చేసిన

లక్ష్మణా రుచులేలు - లలిత మగును


తేటగీతి

క్షణమొక యుగం అవసర క్షణము ఏది

ఒక అలక్ష్యంమ్ము జీవితం మొకటి మార్చు

జీవ జవసత్వాలుగా జాడ్య మవ్వు

నీదు లక్ష్యము మరువక నిలకడుంచు

--(())--


నాతో నా శ్రీమతి... ప్రాంజలి ప్రభలు.. (11)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఏమిటండి ఈరోజు చాలా నీరసంగా ఉన్నారు.
ఇమీ లేదు, నీరసం లేదు కానీ నువ్వొక్కదానివే కష్టబడుతుంటే, కొంత బాధనిపించింది. నీకు ఎటువంటి సహాయము చేయకుండా ఊరికినే కూర్చొని తింటున్నా అందుకనే 

అట్లా అనుకోకండి స్త్రీ పురుషుల ధర్మాలు ఉన్నాయి. ధర్మాలనేవి అందరికీ సమానము కానీ శ్రీ పురుష శరీరసౌష్టమును బట్టి  కొన్ని ధర్మాలు ఎవరికీ వారు పొందేవి ఉన్నాయి 
అందుకే  నే చెపుతున్నా   
అనుకోని సంఘటనలు (కొందరి వల్ల చెడుగా)  జరిగినప్పుడు మనమంచికే జరిగాయని భావించాలి 
ప్రతీకారవాంఛ జోలికి పోకండి జరిగేవన్ని కర్మ అని భావించండి.   
శ్రీవారు వింటున్నారా 
ఆ వింటున్నా 
ప్రతీకార వాంఛ నీ మనసుకు రానీకు, నీకున్న అమూల్యమైన   సమయం వృధా చేసుకో వద్దు 
వాటికోసం అనగా నిన్ను మానసిక ఇబ్బంది చేసినా దయా గుణం వహించు మనిషి కర్మ తనపని తను చేసుకుంటుంది.

చీమలను పక్షి తింటుంది అది చనిపోతే పక్షిని చీమలు తింటాయి

 ఎవరు బలవంతులూ అంటే ఇద్దరూ కాదు అందరికంటే సమయమే బలవంతుడు.

ఒక మనిషి ఒంటరిగా జన్మిస్తాడు ఒంటరిగా మరణిస్తాడు

 మనుష్యుల మంచిచెడుల ద్వారా చేసిన ఫలితమే మీకు స్వర్గానికి అయినా నరకానికి అయినా కర్మ ఆధారంగానే వెళ్తాడు
ఒక మంచి ఆటగాడు కూడా ఒకసారి ఒక అద్భుత ఆటగాడి ముందు బొమ్మలా మారిపోతాడు 
అదే కర్మ
నువ్వు వెళ్లిపోవాలి చెడు నుండి మంచికి, నువ్వు మంచిగా ఉంటే ఎప్పుడు అన్నీ నిన్నే అనుసరిస్థాయి, నీ మంచే నీకు గెలుపును ఇస్తుంది దురదృష్టం పైన.
నువ్వు ప్రపంచానికి మంచిని ఇస్తే అది తిరిగి మళ్లీ మంచిగానే నీ దెగ్గరకు తెస్తుంది.

మంచిఆ జీవనమంటే తెలియపరుస్తావా ... ఆ తెలియపరుస్తాను మధురిమలుగా వినండి 

*పవిత్రుడే నిజమైన - జీవితాన్ని సాగిస్తు 
ఇతరుల మేలుకోరైన - నిస్వార్థంగ సేవిస్తు

*పావనాత్ముడై అయిన - అధికారాన్ని చూపిస్తు 
తన మాటె వినాలనిన -  వత్తిడి నిరాకరిస్తు 
 
*సత్యము అనుష్ఠించిన -   అందరికి సహకరిస్తు 
స్వార్ధమే లేకుండిన -  వాంఛించేదియు చేస్తు
 
* ఆధ్యాత్మికము వలన -  బాధను వ్యక్త పరుస్తు
 సహజంగా తరుణాన -  ఉన్నతమైనది చేస్తు 

*పవిత్రమైనది కరుణ -  దివ్యమై సహకరిస్తు
 ఆకాంక్ష యే ఉండిన - అంతరమే మర్ధిస్తు

*ఈ సారవంతమైన - భూమాతను సేవిస్తు
 ఆధ్యాత్మిక రంగాన - విత్తనమై  జీవిస్తు

*ఫలితమే లేకుండిన - సంసారం సాగిస్తు 
  నిర్మలమైన మనసున - నిజ ప్రేమ చూపిస్తు
  
సాగేదే జీవనం 
అసలు 

ధర్మమును పాటించకుండా, ధర్మానికి వ్యతిరేకముగా పనిచేయడం వలన బలము తగ్గి,  మనలో ఉన్న శక్తి తిరోధానము చెందుతూ ఉంటుంది. ప్రేమ అంటూ చుట్టూ తిరగకుండా ఎంత దైవారాధన చేస్తుంటే అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. మన శక్తిని పదార్ధము వైపు గాకుండా పరమార్ధము వైపు మరల్చాలి.

*పరమార్ధము వైపు మన ప్రజ్ఞను పెంచుకోవాలంటే మనము ఏ మూలము నుంచి వచ్చామో, ఆ మూలముతో అనుసంధానం చెందాలి. ఆరాధన వలన, చక్కని ప్రవచనము వినడము వలన మనకు శక్తి పెరుగుతుంది. ధర్మముతో కూడిన కార్యక్రమముల వలన  మనలో చైతన్యము వికాసము చెంది, శక్తికి బలము చేకూరుతుంది. 
శుభం భూయాత్

చిన్న మాటకు పెద్ద సందేశమే తెలియపరిచావు  
అంతా మీరు నేర్పిన విధ్యే కదండీ 
మాటలు బాగా నేర్చావే 
అన్ని మీ దగ్గరేనండి అసలు విషయం మరిచా కొబ్బరికాయ తెచ్చారా షాపుకు పోయివచ్చారుగా 
ఆ మర్చి పోయానే ఇప్పుడే తెస్తా టీ  త్రాగి రాకండి కాఫీ కలుపుతా 
అలాగే ......................... అలాగే  
--(())--

సమ్మోహనాలు .. కోయిలా 


తెల్లారె కోకిలా కోకిల కూయనెలా 

కూయగానె సంతోషం గలిగె ఈశ్వరా 

 

అదియు వసంత పిలుపు పిలుపే  మేలుకొలుపు 

మేలుకొలుపు తోను ఆనందం ఈశ్వరా 


తరువులే చిగురించు చిగురుతొ సంతసించు 

సంతసము కోయిల పంచుకొనును ఈశ్వరా 

 

మాటకు మాట లాగ  మాటల కూతలాగ

కూతతోనె పిలిచే కోయిలా ఈశ్వరా 


రూపము చూడ నలుపు  నలుపు తో మైమరపు

మైమరపు గానముతొ కోయిలా ఈశ్వరా 

  

చల్లని వేళయనీ   వేళలొ  పిలుపులనీ  

పిలుపులు హాయిని గొలుపు మనసుకు ఈశ్వరా 


ప్రకృతి పరవశముతో   పరవశ ప్రేమతో 

ప్రేమ పిలుపు కోయిల రాగమే ఈశ్వరా 


కోయిల రాగాల తొ  రాగ అనురాగముతొ

అనురాగము కుహు కుహు అనిపిలుచు ఈశ్వరా 

 --(())--

 శివుడుని కపాలీశ్వరుడు అని ఎందుకు అంటారు స్మశానంలో ఎందుకు నివసిస్తాడు🙏

శివ అనే పదానికి శుభం, మంగళకరం, కళ్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి. అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటివి శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఆయన శ్మశానంలో నివసిస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు. విషసర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. అయినప్పటికీ ఆయన మంగళ ప్రదాత, మంగళస్వరూపుడు. సర్వదేవతా వంద్యుడు.

ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు బూడిదగా మారాల్సిందే! అలాంటి వస్తువులపై మమకారం తగదన్న విషయాన్ని ఆయన పూసుకునే విభూది సూచిస్తుంటుంది. ఈ భస్మం కూడ సామాన్య మానవులు ధరించే భస్మం వంటిది కాదు. 

మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం.

ఈ విభూతి మహిమ అమోఘం. ఈ విభూతితోనే అరుంధతి, మృత విప్రుడిని బ్రతికించింది. బూడిద రాశులుగా మారిన కశ్యపాది మహర్షులను వీరభద్రుడు భస్మం చల్లి తిరిగి బ్రతికించాడు. దుర్వాసమహాముని శివుడు ప్రసాదించిన విభూతిని ధరించి, బ్రహ్మ హత్యాపాతకాన్ని నివారించుకున్నాడు. కుంభీపాక నరకంలో పడ్డ పాపాత్ములు, దుర్వాసమహాముని ధరించిన విభూతి రేణువులు పడగానే పుణ్యాత్ములుగా మారిపోయారు.

తన జీవితమంతా డబ్బు సంపాదించడం కోసమని,భార్య ,పిల్లలు,పరువు,ప్రతిష్టలంటూ క్షణం కూడా తీరిక లేకుండా,తీరిక ఉన్నా ఇంక సంపాదించాలన్న కోరికతోనూ జీవితాన్ని గడిపిన మనిషి,చనిపోయి స్మశానంలో పూడ్చిపెట్టాక,మిగితావి ఏవి పట్టకుండా సుఖంగా నిద్రిస్తాడు. అప్పటివరకు నావి,నావే అనుకున్న మనిషి “నా”అనుకున్న వాటిని వదిలేస్తాడు. ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది.. శ్మశానం అంటే ఎటువంటి భయాలు, ఆశలు, కోరికలు, కోపాలు, ఆందోళనలు, బంధాలు లేని ప్రదేశం. అక్కడున్న శరీరాలు ఎండకు, చలికి, వర్షానికి దేనికి కూడా చలించవు. ఎవరు ప్రతి కర్మను కర్తవ్యంగా చేస్తారో, నిత్యం ప్రశాంతంగా ఉంటారో, సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో, ప్రతి విషయానికి ఆవేశ పడరో, అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగా దేనికి చలించకుండా ఉంటుంది.అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్ధం. భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు. అందుకే శివుడు స్మశానవాసి అన్నారు.

అంతేకాదు ఎంతగొప్పవాడైనా, బీదవాడైన, ఎంత తప్పించుకుందామన్న ఆఖరున చేరేది స్మశానానికే. అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో, ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో, ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో, ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్ధం. ఆలయంలో ఆడంబరాలు వుంటాయి. పూజా విధానాలు వుంటాయి. కాని శ్మశానంలో ఏమి ఉండవు. కాలుతున్న శవాలు, బూడిద తప్ప. ఆ బూడిదే సత్యం. అందుకే శివుడు ఎప్పుడూ బూడిద ధరిస్తాడు. అదే ఆయన ఆభరణం. అందుకే ఆయన నివాసం శ్మశానం.

__(())--

ఓం నమః శివాయ🙏

 ఆచమనం విశిష్టత 

మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.. 

మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి.. 🙏

 అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి. ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొదలైనవిగా విభజించారు. ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది.. 🙏

అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది.. 🙏

 నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.. 🙏

ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. ‘కే’  శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.. 🙏

మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది, మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది.. 🙏 

ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.. 🙏

ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు..🙏

!! ఓం నమో వేంకటేశాయ !! 🙏

!! సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు !! 🙏

 ప్రదోషము

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం.

ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల  (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు

. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. 

మహా ప్రదోషం రోజున శివ భక్తులు  ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. 

ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది. 

ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. 

ప్రదోష  సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు.   నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి. 

ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,

సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, 

మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, 

బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, 

గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, 

శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, 

శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. 


వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే  శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు.

సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.

🍁🍁🍁🍁🍁



🌹 . శ్రీ శివ మహా పురాణము - 379🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః  🌴 
అధ్యాయము - 13

🌻. పార్వతీ పరమేశ్వర సంవాదము - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆమె సాంఖ్య శాస్త్రాను సారముగా పలికిన ఈ మాటలను విని శివుడు వేదాంత సిద్ధాంతము నాశ్రయించి శివా దేవితో నిట్లు పలికెను (22).

శ్రీ శివుడు ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! నీవు సాంఖ్య సిద్ధాంతమునను సరించి ఇట్లు పలుకుచుంటివా? ఓ అందమైన పలుకులు గలదానా! అట్లైనచో, నీవు ప్రతి దినము నా సేవను చేయుము. నాకు నిషేధము లేదు (23). నేను మాయా లేపము లేని వాడను, పరమేశ్వరుడను, వేదాంతములచే తెలియదగు పరబ్రహ్మను, మాయను వశము చేసుకున్నవాడను అయినచో, అపుడు నీవేమి చేయగలవు? (24)

బ్రహ్మ ఇట్లు పలికెను-

భక్తులను రంజింపజేసి, అనుగ్రహించు ఆ ప్రభుడు పార్వతితో నిట్లు పలికి, తరువాత హిమవంతునితో నిట్లనెను (25).

శివుడిట్లు పలికెను-

ఓ పర్వత రాజా! నేను ఇచట నీ ఈ అతి సుందర పీఠ భూమి యందు మహా తపస్సును చేసెదను. అనందఘనము, పరమతత్త్వము, సద్ఘనమునగు ఆత్మ స్వరూపమును దర్శించుచూ ఈ భూమి యందు సంచరించెదను (26). ఓ పర్వతరాజా! నేను ఇచట తపస్సును చేసుకొనుటకు అనుజ్ఞనిమ్ము అనుజ్ఞ లేకుండగా నీ ఈ స్థానమునందు ఏ విధమైన తపస్సునైననూ చేయుట సంభవము కాదు (27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవదేవుడు, త్రిశూలధారి యగు ఆ శివుని ఈ వచనమును విని, హిమవంతుడు శివునకు నమస్కరించి ఇట్లు పలికెను (28).

హిమవంతుడిట్లునెను-

దేవతలు, రాక్షసులు, మనుష్యులతో గూడిన జగత్తు అంతయూ నీదే. హే మహాదేవా! నేను అత్యల్పుడను. నీతో నేనేమి చెప్పగలను? (29)

బ్రహ్మఇట్లు పలికెను-

హిమవంతుడిట్లు పలుకగా, లోకములకు మంగళమునిచ్చే శంకరుడు నవ్వి హిమవంతునితో సాదరముగా 'నీవు వెళ్లుము' అని చెప్పెను (30). హిమవంతుడు శంకరుని అనుమతిని పొంది తన ఇంటికి వెళ్లెను. ఆయన ప్రతిదినము పార్వతితో గూడి శంకరుని దర్శించుచుండెను (31). భక్తి తత్పరురాలగు ఆ కాళి ప్రతి దినము తండ్రి రాకపోయిననూ, ఇద్దరు చెలికత్తెలతో గూడి సేవకొరకై శంకరుని సమీపమునకు వెళ్లుచుండెను (32). వత్సా! మహేశుని ఆజ్ఞను పాలించే పవిత్ర హృదయుడగు నందీశ్వరుడు, ఇతర గణములు శివుని ఆజ్ఞచే ఆమెను వారించలేదు (33). 

జాగ్రత్తగా పరిశీలించినచో శివాశివుల మధ్య భేదమే లేదు. అట్టి వారిద్దరు క్రమముగా సాంఖ్యవేదాంత మతములననుసరించి చేసిన సుఖకరమగు సంవాదమును వివరించితిని. ఈ సంవాదము సర్వదా మంగళములను కలిగించును (34). జితేంద్రయుడగు శంకరుడు పర్వతరాజు నందు గల గౌరవముచే ఆతని మాట ప్రకారంగా ఆతని కుమార్తెను తన వద్దకు వచ్చుటకు అంగీకరించెను (35). జితేంద్రియుడగు శివుడిట్లు పలికెను. ఈ కాళి సఖరాండ్రిద్దరితోగూడి ప్రతిదినము నన్ను సేవించి వెళ్లవచ్చును. మరియు ఇచట నిర్భయముగా నుండవచ్చును (36). ఇట్లు పలికి, వికారములు లేనివాడు, మహాయోగీశ్వరుడు, అనేక లీలలను ప్రదర్శించువాడునగు శివ ప్రభుడుఆ దేవిని సేవకొరకై స్వీకరించెను (37).

ధీరులగు తపశ్శాలురకు విఘ్నములు వచ్చుచుండును. కాని అవి వారి తపస్సును భంగము చేయజాలవు. అదియే వారికి గల గొప్ప ఐశ్వర్యము (సామర్థ్యము) (38). ఓ మహర్షీ ! అపుడు పర్వతరాజు సేవకులతో గూడి తన పురమునకు మరలివచ్చెను. ఆతడు మనస్సులో గొప్ప ఆనందమును పొందెను (39). శివుడున్నూ విఘ్నముల పీడలేని తన మనస్సుతో ధ్యానయోగము నభ్యసించుచూ, ఆత్మ రూపమును ధ్యానించుచుండెను (40). కాళీ దేవి సఖురాండ్రిద్దరితో గూడి ప్రతిదినము అచటకు వచ్చి చంద్ర భూషణుడగు మహాదేవుని సేవించి మరలు చుండెను (41). ఆమె శంభుని పాదములను కడిగి ఆ పాదోదకమును త్రాగెడిది. మరిగించిన నీటిలో శుభ్రము చేయబడిన వస్త్రముతో శివుని శరీరమును తుడిచెడిది (42).

ఆమె ప్రతి దినము శివుని యథావిధిగా షోడశోపచారములతో పూజించి, మరల మరల నమస్కరించి తండ్రి గృహమునకు మరలుచుండెడిది (43). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

1 comment:

  1. మీ అభిప్రాయాలు తెలపండి

    ReplyDelete