Saturday 13 July 2019

అంశం..వెంకటేశుని సప్త గిరులు  .

ఉపవాసముతో ఏడుకొండలు ఎక్కి
మెట్టు మెట్టుకు బొట్లు పెట్టి
ఏకాగ్ర చిత్తముతో మొక్కు కట్టి
నీచెంతకు చేరితిమి తిరుమలేశా..

వాయుదేవుడే కదిలించి
స్వర్ణముఖీ చెంతజేర్చిన..
ప్రధమాద్రి శేషాద్రిని ఎక్కితిని

అహంకార విసర్జనగా
నీలాంబరి తలనీలాలర్పించిన..
ద్వితీయాద్రి నీలాద్రిని ఎక్కితిని 

ఉపవాసముతో ఏడుకొండలు ఎక్కి
మెట్టు మెట్టుకు బొట్లు పెట్టి
ఏకాగ్ర చిత్తముతో మొక్కు కట్టి
నీచెంతకు చేరితిమి తిరుమలేశా..

దాయాదులజంపి పాపపరిహార్ధమై..
గరుక్మంతుడు కొలువున్న..
త్వితీయాద్రి గరుడాద్రిని ఎక్కితిని

వాయుఫలప్రసాదముగా ఆంజనేయునికి..
జన్మనిచ్చిన అంజనమ్మపేరున్న.
చతుర్ధాద్రి అంజనాద్రిని ఎక్కితిని

ఉపవాసముతో ఏడుకొండలు ఎక్కి
మెట్టు మెట్టుకు బొట్లు పెట్టి
ఏకాగ్ర చిత్తముతో మొక్కు కట్టి
నీచెంతకు చేరితిమి తిరుమలేశా..
 
మహాశివునికి నైవేద్యముగా..
నరికిశిరసునుంచిన వృషభునిపేరున్న..
పంచమాద్రి వృషభాద్రిని ఎక్కితిని

నారాయణమహర్షి తపఫలము..
విధాత దీవెనఫలము..
షష్టాద్రి నారాయణాద్రిని ఎక్కితిని శ్రీనివాసా..

పాపములు హరించుతూ.. కలియుగదైవంగా
నీవుకొలువున్న..
సప్తమాద్రి వెంకటాద్రిని ఎక్కితిని .

మెట్టుమెట్టు ఎక్కుతూ
ఒక్కొక్కమెట్టు మొక్కుతూ..
ఏడుకొండలు ఎక్కితిని శ్రీనివాసా..
నీ మొక్కుతీర్చ వచ్చితిని తిరుమలేశా..

No comments:

Post a Comment