Tuesday 23 April 2019



24 - 4 - 2 ౦ 1 9 ప్రపంచం గతిని మార్చింది -పుస్తకం. మానవాళికి ఆలోచించడం నేర్పింది – అక్షరం. పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడం ఆకాశాన్ని కొలవడం వంటిదే. పుస్తకాలు లేని ప్రపంచాన్ని ఊహించాలంటేనే పరమ చేదుగా ఉంటుంది. అందుకే పుస్తకాన్ని ప్రపంచ ప్రజలంతా ఒకే క్షణంలో ఆరాధించే ఒక కార్యక్రమాన్ని యునెస్కో రూపొందించింది. అదే ప్రపంచ పుస్తక, కాపీరైట్‌ దినోత్సవం.


ఓం నమః శివాయ ..
శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. 
శివుడు అభిషేక ప్రియుడు. 

హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. 
ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు.

అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం.

ధారాభిషేకం:
కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’.
ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం.

ఆవృత్త్భాషేకం:
జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల రూపధారియైన శివునికి ఆవృత్త్భాషేకం ఎంతో ప్రీతి. ఆవృత్త్భాషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరం చేస్తాడు భక్తవత్సలుడు.

రుద్రాభిషేకం:
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరడు ‘తేజోలింగం’. 
తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలూ చేకూర్చుతాడు పరమదయాళువు.

శతరుద్రాభిషేకం:
చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ‘ఆకాశలింగం’. ఆకాశరూపధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శత రుద్రాభిషేకం వల్ల పుత్ర పౌత్రాభివృద్ధిని ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు.

ఏకాదశ రుద్రాభిషేకం:
శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు ‘వాయులింగం’. వాయురూపధారియైన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాదాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది.

లఘురుద్రాభిషేకం:
ఒరిస్సాలోని కోణార్క్‌లోని శివలింగం ‘సూర్యలింగం’. సూర్యరూపధారియైన శివునకు లఘు రుద్రాభిషేకం ప్రీతి. లఘురుద్రాభిషేకం చేస్తే పునర్జన్మ ఉండదని 
శాస్త్ర వచనం. 

మహారుద్రాభిషేకం:
భటగావ్‌లోని శివలింగం చంద్రనాధ లింగం. ‘చంద్రలింగం’. చంద్రరూపధారియైన శివునకు మహా రుద్రాభిషేకం ఇష్టం. మహారుద్రాభిషేకంతో జ్ఞానాభివృద్ధి .

అతిరుద్రాభిషేకం:
ఖట్మండువద్ద త్రినాధ క్షేత్రంలోని పశుపతి లింగం ‘యజలింగం’ 
సర్వరూపధారియైన శివునకు అతి రుద్రాభిషేకం ప్రీతిని కలిగిస్తుంది. 
అతిరుద్రాభిషేకంవల్ల అఖండ పుణ్యం, ముక్తి చేకూరుతుంది.

శివలింగానికి ఆవుపాలతో సంతాన ప్రాప్తి , బిల్వపత్రం ఉంచిన నీటితో ఆయువు 
ఆరోగ్య అభివృద్ధి. స్వచ్ఛమైన నీటితో సకాల వర్షాలు,కొబ్బరినీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం, నేయి లాంటివాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం.

శివాభిషేకంలో..మహన్యాసం, లఘున్యాసం, నమకం,చమకం, పురుష సూక్త, శ్రీసూక్త, మన్యుసూక్త మంత్రాలు, దశ శాంతుల మంత్రాలు అది ఏకవార అభిషేకం అయినా, ఏకాదశ రుద్రాభిషేకమైనా విధిగా చెప్పాలి.

శివపూజకు బిల్వపత్రాలు వినియోగించాలి. మారేడు చెట్టునే బిల్వవృక్షమని, 
శ్రీ వృక్షమని అంటారు. కాని ఎండిపోయిన బిల్వపత్రిని కూడా శివుడు ఆనందంగా స్వీకరిస్తాడు. 

ఈ బిల్వపత్రాలతో శివపూజ చేసిన వారికి మరుజన్మ ఉండదు. 
ఒక్క మారేడు దళం లక్ష బంగారు పువ్వులకు సమానమని శివపురాణంఅంటుంది. 

బిల్వ వృక్షాన్ని పెరట్లో పెంచితే అశ్వమేధ యాగం చేసిన ఫలం చేకూరుతుంది. 
వెయ్యిమందికి అన్నదాన ఫలం లభిస్తుంది. నిత్యం బిల్వపత్రితో శివుని పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు. 

మారేడు చెట్టుకింద కూర్చుని ‘నమఃశివాయ’ పంచాక్షరీ మంత్రం జపం చేస్తే మంత్రసిద్ధి లభ్యం అవుతుంది.ఆరోగ్యరీత్యా మారేడు చెట్టు వేరు, ఆకు రసము, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతి, జఠర దీప్తిని కలిగిస్తుంది. 
జ్వరము హరిస్తుంది. మూత్రరోగాలు నయం చేస్తుంది. గుండె దడ నివారిస్తుంది. 
విరేచన మందం పోగొడుతుంది. దోరగా పండిన మారేడు పండు గుజ్జు పంచదార కలిపి తీసుకుంటే గ్రహణి, రక్తగ్రహణికి ఎంతో మేలు చేస్తుంది. పండు రసం పుండ్లను మాన్పుతుంది. 

రుద్రుడు, శంకరుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు,పశుపతి, ఈశానుడు, మహాదేవుడు, ఇలా శివునకు ఎన్నేన్నో నామాలున్నాయ. 
వీటిలో ఏది పిలిచినా శివుడు అభయం ఇచ్చి తీరుతాడు. 
అసలు శివా అనే రెండు అక్షరాలు పలికితే చాలు శివసాయుజ్జం లభించినట్లే. 
ఈశ్వరుడు పంచకృత్యపారాయణుడని వాయుపురాణం అంటుంది. 

సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం అనేవి 
ఈ పంచకృత్యాలు. భక్తసులుభుడైన శివుడిని అటు మానవులు 
ఇటు దానవులే కాదు శ్రీరాముడు అనుక్షణం శివధ్యానం చేస్తుంటాడు.

శివలింగం మీద నీళ్లు చిలకరించి కొద్దిగా పత్రి భక్తితో పడవేసిన వారు కల్పవృక్షానికీ, కామధేనువుకూ అథిపతి అవుతారని శివభక్తులంటారు. 

ప్రదోషకాలంలో శివుని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ప్రదోష కాలంలో దేవతలందరూ శివుని సన్నిధిలోనే ఉండి శివతాండవం వీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో శివపూజ మహాఉత్కృష్టమైనదని శివపురాణం చెప్తోంది.

--((**))--


ప్రాంజలి ప్రభ నిత్య సత్యాలు  
 ప్రకృతి సత్యం


ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 
పశ్చాతాపులను క్షమించాలి. 
 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
--((**))--


ప్రాంజలి ప్రభ నిత్య సత్యాలు  
 ప్రకృతి సత్యం

ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.

బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.
ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.

అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే
ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం. 

ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.
చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.

సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..

కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.

అందుకే కదా
భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.

యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.

మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.
--((**))--


రాజకీయాలకు పెన్షన్ వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయబడింది.

ఈ విషయాన్ని సపోర్ట్ చేయండి మరియు షేర్ చేయండి 

ఇప్పుడు నాయకుల నాయకుడు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు, మీ అంచనా కోసం దీనిని పంపుతున్నారు ..

భారతదేశం యొక్క ప్రియమైన / గౌరవనీయమైన పౌరులు ... మీరు ఈ సందేశాన్ని చదవడానికి అభ్యర్థించబడ్డారు మరియు మీరు అంగీకరించినట్లయితే దయచేసి మీ సహకారం తో అందరు వ్యక్తులకు పంపండి మరియు వారందరు ప్రతి ఒక్కరికి  పంపమని అడుగుదాం.

మూడు రోజుల్లో, ఈ సందేశం మొత్తం భారతదేశంలో అందరికీ అందాలి. ప్రతి పౌరుడు భారతదేశంలో తన స్వరాన్ని వినిపించాలి. __

2018 అభివృద్ధి చట్టం

ఎంపీలు పింఛను పొందరాదు .ఎందుకంటే రాజకీయాలు అనేవి ఉద్యోగం లేదా ఉపాధి కాదు, కానీ ఉచిత సేవ. - మాత్రమే 
రాజకీయాలు అనేవి పబ్లిక్ రిప్రజెంటేషన్ చట్టం ప్రకారం ఎన్నికలు, దాని పునర్నిర్మాణంపై పదవీ విరమణ లేదు, కానీ వారు అదే పరిస్థితిలో తిరిగి ఎన్నిక అవుతారు. (ప్రస్తుతం 5 సంవత్సరాల సేవ తరువాత వారు పింఛను పొందుతున్నారు).

ఈ విషయంలో మరొక సమస్య ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక కౌన్సిలర్ గా ఎన్నిక అవుతాడు, తరువాత శాసన సభ్యుడుగా అవుతాడు మరియు శాసన సభ్యుడు అవుతాడు, అప్పుడు అతను ఒకటి కాదు, మూడు పెన్షన్లు పొందుతున్నాడు.

 వెంటనే ఈ ACT ని ఆపడానికి    దేశం లో ఉన్న పౌరులు పాల్గొనాలి. ఇది ఆపటానకి ప్రయత్నం చేయక పోతే అది ఒక గొప్ప ద్రోహం అవుతుంది....

సెంట్రల్ పే కమిషన్ తో, MP ల జీతం, భత్యం సవరించబడింది .... ఇది ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురావాలి ....

 ప్రస్తుతానికి, ఎంపీలు వారి వేతనాలు మరియు అనుమతులను తమకు ఓటు వేయడం ద్వారా పెంచుతారు, ఆ సమయంలో అన్ని పార్టీలు ఐక్యమయ్యాయి.

MP లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి తొలగించబడాలి .. ప్రస్తుతం వారి మరియు భారత ప్రజల ఆరోగ్యం వంటి ఆరోగ్య సంరక్షణ  చికిత్స విదేశాల్లో జరుగుతుంది ఇతర పౌరునికి లా శ్రద్ధ తీసుకోవాలి .. వారు విదేశాల్లో కాకుండా పూర్తి గా , తమ సొంత ఖర్చుతో జరిగేలా చట్టం రావాలి .

విద్యుత్తు, నీరు మరియు ఫోన్ బిల్లు వంటి అన్ని రాయితీలు అంతం కావాలి. (వారు అటువంటి అనేక రాయితీలను తొలగించి  వారు కూడా క్రమంగా తప్పకుండా కట్టేలా చూడాలి.)

క్రిమినల్స్ ఎన్నికలలో పోటీ చేయకూడదు అనుమానాస్పద వ్యక్తులను నిరోధించడం చేయాలి, శిక్షాత్మక రికార్డులు, నేరారోపణలు మరియు నిర్ణయం, గతంలో ఉంటే వారిని  ప్రస్తుత పార్లమెంటు నండి నిషేధించాలి.

కార్యాలయంలోని రాజకీయవేత్తల కారణంగా వారి వలన జరిగే ఆర్థిక నష్టాన్ని కూడా వారి నుండి తిరిగి పొందవచ్చు, వారి నామినీలు, ఆస్తులు - MP లు సాధారణ పౌరులకు వర్తించే అన్ని నిబంధనలు కూడా అనుసరించాలి.

పౌరులచే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ ఎటువంటి డీడక్షన్ MPలు, MLAలు, ఇతర సబ్సిడీలు, పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ ఆహారాలతో సహా వెనక్కి తీసుకోవాలి.

పార్లమెంటులో పనిచేయడం ఒక గౌరవం, దోపిడీ కోసం ఒక లాభదాయక వృత్తి కాదు.

ఉచిత రైలు మరియు విమానం ప్రయాణం ఆపాలి.

సామాన్య మానవుడు వారి సరదాలను ఎందుకు భరించాలి?

ప్రతి వ్యక్తి కనీసం ఇరవై మందితో కమ్యూనికేట్ చేస్తే, భారతదేశంలో చాలా మంది ప్రజలు ఈ సందేశాన్ని పొందడానికి మూడు రోజులు మాత్రమే సమయం ఉంది .

ఈ సమస్యను తొలగించటానికి ఇది సరైన సమయం కాదా?

మీరు దీనిని అంగీకరిస్తే, ఈ మెసేజ్ ను forward చేయండి.

లేకపోతే, దీన్ని తొలగించండి.

మీరు నా 20+ మందిలో ఒకరు, దయచేసి దీన్ని కొనసాగించండి ...

ధన్యవాదాలు. జైహింద్ వందే మాతరం ... 🙏

--((**))--


అన్నీ ఉచితం ! అంతా ఉచితం !
✍🏻
45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి
45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను 
ఇంక జీవితంలో లేదు టెన్షన్,
.
ఆకలేస్తే అన్న క్యాంటిన్
రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు
నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,
చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !
.
అంతా బాగానే ఉన్నది !
భూతల స్వర్గం భారతదేశం !
.
అన్న క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?
రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?
ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?
.
వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా !
.
సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?
Is it worth living !
.
ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే "సంఘర్షణ"
ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే "సంఘర్షణ "
తన కలలు పండించుకోవడానికి  ఒక "కలామ్ " పడ్డది "సంఘర్షణ "
మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!
.
పథకం చూడటానికి గొప్పదే !
.
ఇప్పటికే ప్రతి రంగం పని చేసేవారు లేక కుదేలయిపోయింది !
.
వ్యవసాయానికి కూలీలేడు 
కొట్లోకి గుమాస్తా దొరకడు !
పనికి రమ్మంటే ఒక్కడూ రాడు !
.
మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి ! కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !
.
ఎవరికి ఉచితమివ్వాలి ?
పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు అభాగ్యులకు !
వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను రూపొందించండి ! 
.
అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !


పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది.

ఒక్కసారి ఆలోచించండి....

వాట్స్ అప్  లో నిది ప్రాంజలి ప్రభ కు పంపారు 

--((**))--


హార్ట్ ఎటాక్ అనే చింత,  టెన్షన్లను ఇప్పుడిక వదిలివేయండి. 
ఒక శుభవార్త 
ఈ క్రింది వీడియో జాగ్రత్తగా చూడండి 
ఒక క్రొత్త టెక్నిక్ తో కేవలం ఐదు వేల రూపాయలతో మాత్రమే గుండెలోని బ్లాకేజీలను  ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా  తొలగించుకోవచ్చును 
.......ఈ గొప్ప అవకాశము బాంబేలోని జేజే హాస్పిటల్ లో కలదు .ఇంతటి అద్భుతమైన శుభ సమాచారాన్ని మరియు ఈ వీడియోని అన్ని గ్రూపులకు ,నీకు తెలిసిన అందరికీ వెంటనే షేర్ చేయగలరు షేర్ చేయగలరు .ఇలాంటి మంచి సమాచారాన్ని పదిమందికి తెలిపి అందరి మరియు దేవుని ఆశీర్వాదాలు పొందగలరు 🙏🙏

No comments:

Post a Comment