Thursday 26 April 2018

Pranjali Prabha (27-04-2018)

ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ: 
  (ఆరోగ్యం - ఆనందం - ఆధ్యామికం ) 
అందించటమే  ప్రాంజలి ప్రభ లక్షణం  


సర్వేజన సుఖినోభవంతు 
ఈరోజు  జూపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాక్షలు 

అల్లరితో, ఆకర్షణతో, అనుకోని ఆనందంతో 
ఆకతాయితనముతో,  కొత్త కొత్త మాటలతో
సరదా కబుర్లతో, వింత వింత కోరికలతో 
అమ్మ కొంగు వీడని బిడ్డలా,  కోరికతో అలకలా 
కోపాలను మరిచి కొత్త కొత్త ఆలోచనల కళా 
నైపుణ్యముతో రంగ రంగ వైభవముగా 
అందరికి ఆనందం పంచుతూ  నలుగురూ 
బాగుండాలని అమాయకత్వముతో ఉన్న 
కొత్త బట్టలు ధరించి ఉన్న, తల్లి తండ్రుల దీవెనలను 
పొందు తున్న ప్రతి ఒక్కరికి ప్రాంజలి ప్రభ 
తరుఫున అందరికి శుభాకాంక్షలు 


నేటి పద్యం (జీవన జ్యోతి )
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

నవ్వుల పువ్వుల మాలను వాడ నీకు -  అడుగులు జారనీకు నీ వెప్పుడు     
అర్ధపు ప్రార్ధన  ఎప్పుడు  మార  నీకు -  మనసును మారనీకు నీ విప్పుడు
స్వార్ధము కోపము ఎప్పుడు వద్దు నీకు -  మమతను  జాలిచూపు నీ  ఒప్పుడు 
నిత్యము నూత్నము  ఎప్పుడు జార నీకు -  కలయిక  ఓర్పు చూపు నీ కాలమె   



నిత్యము నవ్వులు ఇంటిలో ఉంటె ఆయిల్లు స్వ ర్గమని పెద్దలు అన్నారు, ఇంటి ఇల్లాలు అడుగు జారకుండా, ఇతరులను జార నీకుండా ఎప్పుడు ఉండాలి. మనసు మనసులో  ఉంచుకొని ప్రార్ధన ఫలితము ఉంటుందని గమనించాలి,    మమతా జాలి ఉన్న చోట స్వార్ధము, కోపము దరిదాపుల్లోకి రావు . ఒకరికొకలు కలిసికొని నిత్యం నూతన ఆలచనలతో ఉండుట నిజమైన ఓర్పు అందరికి.   
    

ప్రేమతో - ప్రేమ లేఖ (2)


నీ మెసేజ్ అందింది, నాలో కలవరం మొదలైనది, నీకు మెసేజ్ పంపాలని తాపత్రయం పెరిగింది, ల్యాబ్ టాప్ తీసాను, నాకు తెలిసిన విధముగా ప్రేమ లేఖను వ్రాస్తున్న, నీకు నచ్చుతుందని నేను ఆశిస్తా, నీ రూపు రేఖలు నా కాంతిలో చిక్కి ఉన్నాయి. నాప్రేమ నంతా రంగరించి, నిన్ను మరువ లేక, నేను ఉండలేక వ్రాస్తున్నాను, ఇదే నాకు కొంత మన:శాంతి.

పరిమళించే పరువపు రెమ్మవు, ఎమన్నా పట్టించుకోక తనువును అర్పించిన బొమ్మవు, రతిని మించిన రసరూపమ్ము చూపించి తన్మయ పరిచే అతిలోక దివ్య సుందరివి, పలుక నేర్చిన చిలుకవు, నడక నేర్చి, నాట్య మాడే, పలకరించి నాట్య మయూరివి, కనులతో కవ్వించి, పెదాలతో పలకరించి, నడకను వయ్యారంగా చూపించి, జడ తిప్పుతూ కదిలే వయ్యారివి.

నిన్ను అర్ధం చేసు కోవటానికి చాలదు నాజీవితం, త్రిగుణాల సమ్మేళనమే నీ గుణం, మొగవాడ్ని గుప్పెట్లో పెట్టుకొనే బ్రహ్మాస్త్రం ఉన్నదానివి, అలసి వచ్చిన వానికి సేద తీర్చే నీలో ఉంది కరుణాస్త్రం,  గాలిద్వారా మనసును ఆకర్షించి చిరు నవ్వును చూపి మనసును దోచే పవనాస్త్రం ఉన్నదానివి, ఎన్ని కష్టాల్లో ఉన్న మనసును రంగ రించి, మొహాన్ని పంచే సమ్మోహనాస్త్రం ఉన్నదానివి, అన్ని సమయములలో ఓర్పు వహించి ఓదార్పు చూపించే సహనాస్త్రం గలదానివి, ఇట్లా ఎన్నో అస్త్రాలు నీలో నిండి ఉన్నాయి. అందుకే నేను నిన్నుఅంటాను  సర్వాస్త్ర సుందరివి.

చీకట్లో కూడా కనిపించే తెల్లని మంచు తెరగల దేహంగా, తళ తళా మెరుస్తూ నిలకడగా ఉన్న నదిగా, వెచ్చని వేడి నందించి చల్లని మనసుకు హాయిగా , ఆహ్లదంగా, ఊరట కల్పించే దిశగా, నిశ్చలముగా, నిర్మలంగా, నిలకడగా స్వశ్చంగా సుఖాన్ని అందించే నా కలల సుందరివి.

అంటూ ప్రేమ లేఖను (మెసేజ్)  రాధకు వ్రాసాడు మాధవ్

ఆ మెసేజ్ చూసి రాధ మాధవ్ కు మెసేజ్ పెట్టింది.
నవమన్మధాకారా రూపంతో, ధ్రుడకాయముతో, ఆరడుగుల ఎత్తుతో తెల్లని పంచ లాల్చీ ధరించి, చేతులకు ఉంగరాలతో, మేడలో బంగారు గొలుసుతో నా మనసునుని దోచిన నటనాగ్రేసుడవు నీవు, నా ఊహలన్నీ నీమీదే
నీమాటలకు చిక్కి నీవు ఆడమన్నట్లుగా ఆడి, నీకు ఉల్లాసము కల్పించి ఉత్సాహము పెంచి, సమయాన్ని సద్వినియోగము గా శకలం అర్పించాను ఆనాడు, ఆతీపి గుర్తులే నాకు బంధువులు.

నన్ను అస్త్రాలతో పోల్చి మూలగచెట్టు ఎక్కించావు ఎందుకు, నేను ఎప్పుడు నీమాట జవదాట లేదు, నేనెప్పుడూ నీ నీడగా వెనకాలే ఉండేదాన్ని, ఒక చెట్టులాగా ఎదిగి చెట్టు చేసిన ఉపయోగాలన్నీ నేను నీకు చేసాను. కాలంతో మారకుండా నాకోసం వేచిఉన్నావని సంతోషముగా ఉన్నది. నిన్ను తలవని రోజు లేదు, నీకోసం ఎదురు చూడని రోజులేదు, నీవు చేసే సమాజ సేవకు నీ చేదోడుగా ఉండి సహాయము చేసిన రోజులు ఇంకా గుర్తు ఉన్నాయ్.

రాగాలన్నింటిలో అనురాగము గొప్పది, బంధాలన్నింటిలో అనుబంధం గొప్పది, స్వేశ్చవాయువుల్లో వెలుగుబాట గొప్పది, పున్నమి వెన్నెలలో పూల పరిమళాలు గొప్పవి, నువ్వు నువ్వుగా గుర్తింపు తెచ్చుకోవటం అన్నింటికన్నా గొప్పది. మగవానికి సహజంగా ఉండే అహంకారము లేకుండా ప్రేమను పంచే తత్వం నీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషము మరియు నిత్యం ధరిత్రియందు నాకోసం ఎదురు చూపులతో ఉన్నందుకు నేనే నీకు సర్వం అర్పించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాను.

కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, క్షమయా ధరిత్రిగా, కులధృమ పత్నిగా, మన కుటుంబానికి నేనొక ఆశాకిరణంగా నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను
నిమెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాను మాధవా                  
Written By. మల్లాప్రగడ రామ కృష్ణ


ప్రాంజలి ప్రభ - (జి.కె -3)

ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు అడిగారు. 

వాటికి ధర్మరాజుగారు ఇచ్చిన జవాబులు: 

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
 (బ్రహ్మం) 

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
 (దేవతలు) 

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? 
(ధర్మం) 

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
 (సత్యం) 

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
 (వేదం) 

6. దేనివలన మహత్తును పొందును?
 (తపస్సు) 

7. మానవునికి సహయపడునది ఏది?
 (ధైర్యం) 

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
 (పెద్దలను సేవించుటవలన) 

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును?
 (అధ్యయనము వలన) 

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? 
(తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.) 

ప్రవ ర్తన                                                                                    

   జైలర్ : మీ సత్ ప్రవర్తనకు శిక్ష తగ్గించ్చారు
           ఈ రోజే నిన్ను విడుదల చేస్తున్నాము
           ఇదిగో నీకు రావలసిన పైకము, గుడ్డలు
           ఇంటికి వెళ్లి హాయ్ గా బ్రతుకు అన్నడు దొంగతొ

దొంగ:  మీ మర్యాదలను మరువ లేనండి
           ఇక్కడైతే నాకు వేలకు భోజనం దొరుకుతుంది
           దయచేసి నన్ను ఇక్కడే ఉంచండి,
           దొంగలు,దగాకోరులు, మోసకారులు ఉన్న లోకంలో
           బ్రతకలేను, అందుకే ఈ రాడ్తో మిమ్మి కొట్టి
           ఇక్కడే ఉంటానండి  ఏమనుకోకండి ..............  



10. పచ్చగా
టీచర్ : రామకృష్ణ  నీవుచేప్పు తెల్లజుట్టు నల్లగా మారాలంటే ఏంచేయాలి
           ఏముంది టీచర్ కాస్త తారు పూసుకుంటే సరిపోతుందికదా టీచర్
           ఒకటే నవ్వులు
టీచర్ : శ్రీదేవి నువ్వు చెప్పమ్మా నల్లటి చ\జుట్టు తెల్లగా రావాలంటే  ఏంచేయాలి
           ఏముంది టీచర్ కాస్త ఫెవికాల్  పూసుకుంటే సరిపోతుందికదా టీచర్  ఒకటే నవ్వులు

టీచర్ : తలకు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగాను, నలుపురంగు వేసు కుంటే నల్లగాను జుట్టు మొత్తం తీసి గుండు చేసుకుంటే తెల్లగాను దానిమీద గంధం వ్రాసు కుంటే పచ్చగాను చల్లగాను ఉంటుంది తెలుసు కోండి 
బ్రహ్మం: మరి టీచర్ బట్టలు లేకుండా ఆకులు కప్పుకుంటే పచ్చగా ఉంటాము  గదండి  ఆమాటలకు ఒకటే నవ్వ్వులు ...........  


   
Korisepati Balakrishna Reddy
26 April at 16:51
ఎవరో వస్తారని....
---------------------

పలుగు పార తీసుకొంటే
బండరాయి భయంగా వణికింది

రాయి రాయి ఒరుసుకొంటే
చీకటి రేయి తోక ముడిచింది

కంటిరెప్ప పైకి లేచినప్పుడే
కలిమికి లేమి గుర్తొస్తోంది

చెదిరిన గుండె గాండ్రించినప్పుడే
చెవిటికి శంఖం వినిపిస్తోంది

చెమ్మగిలిన కనులు చెలరేగినప్పుడే
చరిత్ర పేజీ... విస్తరిస్తోంది

చేలాంచలాలు బిగిసినప్పుడే
జాతి జాతకం మారుతోంది

గడ్డపారలు ఎలాగూ చిగురించవు
మట్టిబెడ్డల ముద్దుబిడ్డలు ...
గరికపోచలే స్పందించి
కరుణా కుసుమాలు పూస్తాయి

ఎత్తైన కొండలెప్పుడు చలించవు
పిల్లవాగులే వాటి గుండెలపై నుండి కదిలి
పేదల హృదయంలోకి ప్రవహిస్తాయి

ఎండ మావులేనాడు దాహం తీర్చవు మండుటెండలే చెలరేగి
ఉప్పెన జండాలు ఎగరేసుకొంటూ
ఏరువాకల్ని మోసుకొస్తాయి.
*** *** **** 
  





ॐॐॐ వేంకటేశ్వర నామములో అంతరార్ధం
వేం = పాపములను
కట = ఖండించు వాడై
ఈశ్వరుడు = ఆ చంద్రార్కం శాశ్వతుడై శుభములను ప్రసాదిం
చువాడు,,,,,
వేం + కట + ఈశ్వరుడు = పాపములను తొలగీంచీ శుభముల
ప్రసాదించు శాశ్వతుడైన దైవం,,,,
 తిరుపతి + తిరుమల నామములో అర్ధము
తిరు =పరమ పవిత్రమైన
పతి = భర్త ( తండ్రి ) భరించువాడు దైవం
తిరుపతి = భూ భారములను భరించు పవిత్రమైన తండ్రి
తిరు = పరమ పవిత్రమైన
మల = కొండ శిఖరం ఎత్తైనప్రదేశం గుట్ట
తిరుమల = పమపవిత్రమైన కొండ
వేంకటేశ్వరుడు సదా మంగళములు సర్వులకు ఇచ్చు గాక
హరిఃఓం హరిఃఓం హరిఃఓం

1 comment: