Thursday, 17 April 2025

April మూ డవ వారం కథలు

*


ఇది పాత తరం స్నేహితులకు అంకితం.............. 


జారే అరుగుల ధ్యాసే లేదు

పిర్ర పై చిరుగుల ఊసేలేదు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

 వీధిలో పిల్లల అల్లరి లేదు

 తాతలు ఇచ్చే చిల్లర లేదు

 ఏడు పెంకులు ఏమైపోయే

 ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మన బాల్యం పై ఒక మిత్రుడు పంపిన కవిత..

🙏🙏🙏🙏🙏🙏

మేమే అదృష్టవంతులమ్*!           

1960-80 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!

[10/10, 21:01] BCB: ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం  శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు !!! కాబట్టి 504 గంటలను 24 గంటలు విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. నేను ఆశ్చర్యపోయాను. దీనిని ధృవీకరించడానికి, నేను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌లో శోధించాను. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని. నేను షాక్ అయ్యాను !!!! ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనము దసరా మరియు దీపావళిని జరుపుకుంటాము.

మీరు నన్ను నమ్మకపోతే, గూగుల్ సెర్చ్ చేయండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడు.  మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు గర్వపడండి!

జై శ్రీ రామ్ 🙏🙏🙏

****

           మౌనంగానే ఎదగాలి

వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.

అయిదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.

మౌనం మూడు రకాలు. ఒకటి, వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. మూడోది కాష్ఠమౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వంటి వారెందరో ఉన్నారు.

ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే ‘మౌనం’.

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!


*****

కృష్ణ’ శబ్దం మనోహరం.!!

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు. కారుణ్యశీలుడు. ఆదర్శ పురుషుడు. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి.

భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగ ధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్త్వాన్ని తెలియచెప్పిన మహనీయుడు. అలాంటి….  శ్రీకృష్ణ మంత్రం బాహ్యశత్రువులను, అంతఃశత్రువులను హరించే శక్తి కలది.

సకల వేదాంతాలందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది. సమస్త సంసార చింతనలను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునకు భక్తి పూర్వకముగా ఒక్కసారి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణుని త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించిన మాత్రానే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే సదానందము లేక సచ్చిదానందమని అర్థం.

కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటివారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. ఓంకారం మొదలు వేదాల వరకూ ‘కృష్ణ’ అనే రెండక్షరాలు సమస్త విఘ్నాలను హరించి మనోభిష్టాలను నెరవేరుస్తున్నాయి. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు.

మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్టశిక్షణ. కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు.

గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో కాళీయమర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం. సాక్షాత్తు శ్రీహరి అంశ అయిన కృష్ణునికి లెక్కలేనన్ని పేర్లు...                   ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు.

రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి భేదం లేదు. ఈ రెండు అవతారాలు సాక్షాత్తు శ్రీహరి అవతారాలే కావడంవల్లే ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్తు శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే ‘హరేరామ హరేరామ హరే కృష్ణ హరేకృష్ణ’ అంటారు.

ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.

నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని కల్గించిన అపురూప దైవం శ్రీకృష్ణ భగవానుడు.

కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు.

వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకొనిపోయే సహజశక్తి ‘కృష్ణ’ శబ్దానికి కలదు. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు ఆయా అక్షరాలకు స్థానాలగు దౌడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువు, శబ్దమూలమున శిరస్సునగల సహస్రార చక్రం వరకూ సహజసిద్ధంగా చేరుకొంటుంది.

అపుడు ‘వాయువు’ను అంటి చలించే స్వభావంగల వనస్సును, యోగప్రక్రియచే వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలువ వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ. మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది.

ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది.✍️

 .        

*****

ఐకమత్యమే బలం! 


ఐకమత్యం లోపించడం అనేది ప్రస్తుతం భారతీయుల్లో కనిపిస్తున్న 'ప్రధాన సమస్య. ఐకమత్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఐకమత్యం కంటే ప్రధానమైన విషయాలు పాత్ర వహిస్తాయి? అనేది కాస్త విచక్షణతో ఆలోచించాల్సిన విషయం. అందుకే పూర్వం కుటుంబంలో ఐకమత్యం బాగా నేర్పేవారు. 'వాడు నీ తమ్ముడురా! వాడిని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటావా! జాగ్రత్త చూసుకోవాలి కదా!' అని తల్లి అనేది. అప్పుడు అ కుర్రాడికి అర్థమయ్యేది. 'అన్నదమ్ములం, ఆక్కాచెల్లెళ్లం ఒక కుటుంబం. అందరం ఐకమత్యంగా ఉండాలి' అని ఈ కుటుంబపరమైన ఐకమత్యం. తరువాత వెంటనే దేశాన్ని చూపించారు. ఐకమత్యం ఉండాల్సింది. కులాల్లోనూ, మతాల్లోనూ, ప్రాంతాల్లోనూ కాదు. ముందు కుటుంబంలో, తరువాత దేశంలో! కుటుంబంలో ఐకమత్యం ఎలా ఉండాలో ధర్మరాజు మాటల ద్వారా నేర్చుకోవచ్చు.


పాండవులు అరణ్యవాసం చేస్తూ, అడవిలో ఆకులు, అలములు తిని జీవిస్తుంటే, అది కూడా వాళ్లకు దొరకడం నచ్చక దుర్యోధనుడు దండయాత్రలాంటి పనిచేశాడు. దానికి 'ఘోషయాత్ర' అని పేరు 'ఘోష' అంటే గొల్లపల్లె. చరిత్రలో దుర్యోదనుడిని మించిన ప్రతినాయకుడు ఉండడు. ధర్మరాజు ఏ నదీ తీరంలోనైతే యజ్ఞం చేస్తున్నాడో, ఆ నదీ తీరానికి అవతలి గట్టున తన మందీమార్బలం, సైన్యంతో మకాం పెట్టాడు దుర్యోధనుడు. జలక్రీడలు, విందులు, చిందుల్లో భాగంగా అక్కడున్న గంధర్వుల సరస్సులో స్నానానికి కౌరవులు దిగారు. అక్కడ కాపలావాళ్లు అభ్యంతరం చెప్పారు. దాంతో యుద్ధం జరిగింది. గందర్వుల సైనికులే కాదు, చిత్రసేనుడనే గంధర్వుడు కూడా వచ్చాడు. గంధర్వుల చేతిలో దుర్యోధనుడి సైన్యం ఓడిపోయింది. దుర్యోధనుణ్ణి రథ స్తంభానికి కట్టేసి లాక్కెళ్లారు. అప్పుడు కౌరవ సైనికులు వచ్చి దుర్యోదనుణ్ణి కాపాడమని పాండవుల కాళ్లు పట్టుకున్నారు. వెంటనే భీమార్జునులను ధర్మరాజు పిలిచి, "మన సోదరుడు దుర్యోధనుడికి ఆపద వచ్చింది. మీరు వెళ్లి కాపాడాలి" అని అన్నాడు. అప్పుడు భీముడు 'కాగల కార్యం గంధర్వులు తీర్చారు' అని అన్నాడు. ఈ సామెత అక్కడి నుంచి వచ్చిందే. మనను ఎన్ని కష్టనష్టాలకు గురిచేశాడు. అటువంటి వాడిపైన దయ ఏందుకు? మేం వెళ్లి రక్షించం' అని భీమార్జునులు అన్నారు. అప్పుడు భీముడిని ఉద్దేశించి ధర్మరాజు ఐకమత్యం అంటే ఏమిటో చెబుతాడు.


పరైః పరిభవేత్ ప్రాప్తే వయం పంచోత్తరం శతం |

పరస్పర విరోధేతు వయం పంచ శతం చ తే ||


ఒక తాత్వికమైన అవగాహన ఉన్న వారు జీవితాన్ని నిష్కల్మషంగా గడుపుతారు. అందుకే ధర్మరాజుని 'యుధిష్ఠిరుడు' అన్నారు. 'మనందరిదీ ఒకటే వంశం. 'పరస్పర విరోధేత్ మనలో మనకే గనక విరోధం వస్తే 'వయం పంచ"... మనం ఐదుగురం. శతంచతే... వాళ్లు వందమంది. అలా కాకుండా బయటి వాడు మనమీదకొస్తే 'పంచోత్తరం శతం' అంటే వాళ్లు వంద మంది, మనం ఐదుగురం. మొత్తం నూటా ఐదుగురం ఉన్నాం. కలిసి ఎదుర్కోవాలి' అని ధర్మరాజు అన్నాడు.


దీన్ని గనుక మనం కుటుంబాలకు అన్వయించుకుంటే కుటుంబపరమైన ఐకమత్యం బాగుంటుంది. తరువాత అన్వయించాల్సింది దేశానికి మనదేశంలో తమిళ, కన్నడ, తెలుగు సోదరులకు ఏమైనా భేదాలొస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. =కత్తులు దూసుకోకూడదు. (అదే పాకిస్తాన్ వాడో, చైనా?వాడో మన మీద దాడిచేస్తే అందరం ఐకమత్యంగా వాడి మీదకు వెళ్లాల్సిందే. మనదేశంలో ఏవైనా లోపాలుంటే మనం మాట్లాడుకోవాలి. మనమే పరిష్కరించుకోవాలి. విదేశాలకు వెళ్లినపుడు వాటి గురించి మాట్లాడకూడదు. కుటుంబమైనా అంతే. దేశమైనా అంతే! ఒక సమర్థుడైన వ్యక్తి ఒక మంచి సంస్థలో ఉంటే అతని వల్ల సంస్థకు ప్రయోజనం. సంస్థ వల్ల అతనికి ప్రయోజనం, సమర్థులైన వారు స్వదేశంలోనే ఉండాలి. అది దేశానికి గౌరవం, వారికి గౌరవం. ఎలా అంటే... శ్రీకృష్ణుడు 'సంజయ రాయబార సందర్భంలో "పాండవులు, కౌరవులు కలిసి ఉండటం అవసరం. వాళ్లకు చెప్పవయ్యా" అంటాడు. 'ఆ అవసరం ఏముంది?' అని సంజయుడు ప్రశ్నించినప్పుడు...'ధృతరా ష్ట్రుడున్ పుత్రులున్ వనముల్... దృతరాష్ట్రుడు ఆయన పుత్రులు మహారణ్యంలాంటివారు 'కుంతీ నందనుల్ సింహముల్... పాండవులు ఐదుగురు సింహాల్లాంటివారు. అయితే సింహంలేని అరణ్యాన్ని జనాలందరూ వచ్చి నాశనం చేస్తారు. అరణ్యంలో సింహం ఉంటే ఒక్కడూ అడుగుపెట్టడు. అరణ్యంలో ఉండకపోతే సింహాలకు కూడా రక్షణ ఉండదు. అలాగే పాండవులు కౌరవులతో కలిసి ఉంటే మంచి సామ్రాజ్యంతో ఉంటారు. కౌరవులు కూడా పాండవులతో కలిసి ఉంటే బలంగా ఉంటారు. ఇద్దరూ బాగుంటారు' అని చెబుతాడు శ్రీకృష్ణుడు. 'ఐకమత్యం మహాబలం' అనడానికి ఇది మంచి ఉదాహరణ.

****

 గురుభక్తి

ఉపనిషత్‌ వాక్యం

గురురేవ పరో ధర్మో గురురేవ పరా గతిః

యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురౌ,

సబ్రహ్మవి త్పరం ప్రేయా దితి వేదానుశాసనమ్‌ (శాట్యాయనీయోపనిషత్‌)


'గురువే పరమ ధర్మం. గురువే పరాగతి… ఎవరికి దేవుడిపై, గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు' అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్య్రంతో బాధపడుతూ నైమిశారణ్యంలోని పుష్కర మహాముని దగ్గరికి వెళ్లి సాష్టాంగపడ్డాడు. ఆ బ్రాహ్మణుడికి ముని హనుమత్‌ మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్వజదత్తుడు రాత్రింబవళ్లు ఆ మంత్రజపం చేశాడు. గురువుపై విశ్వాసం లేక మంత్రసిద్ధి కాలేదు. కొన్నాళ్లకు వ్యాధిపీడితుడైన గాలుడనే వేటగాడు ధ్వజదత్తుడిని కలుసుకున్నాడు. తన బాధలు ఆయనతో చెప్పుకొన్నాడు. అప్పుడు ధ్వజదత్తుడు 'దైవం లేదు. మంత్రం లేదు. పుష్కరుడి నుంచి మాత్రం మంత్రం స్వీకరించకు' అన్నాడు. గాలుడు ఉత్సుకతతో పుష్కర మహర్షి దగ్గరికి వెళ్లి పరిచర్య చేశాడు. అతనిపై సందేహంతో మహర్షి ధ్యానించగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. 'గురుభక్తి ఉంటే సరి. ఉపదేశించవచ్చు' అని ఆజ్ఞ ఇచ్చాడు ఆంజనేయుడు.

మంత్రోపదేశానికి ముందు గాలుడిని పుణ్యతీర్థంలో స్నానం చేసి రమ్మన్నాడు పుష్కర ముని. అప్పుడు గాలుడు 'మీ పాద జలమే పుణ్యతీర్థం' అన్నాడు. గురువు హనుమంతుడిని ధ్యానించి తన పాదజలాన్ని అతనిపై చల్లి ద్వాదశాక్షర మంత్రోపదేశం చేశాడు. గురు సమీపంలోనే గాలుడు 108 సార్లు జపం చేయగానే సిద్ధి లభించింది. భూత భవిష్యత్తులను దర్శించగలిగాడు. గాలుడు ఇంటికి వెళుతూ ధ్వజదత్తుడిని చూశాడు. కానీ, అతను గురునింద చేస్తాడన్న భయంతో మరోదారి ఎంచుకున్నాడు. అది గమనించిన ధ్వజదత్తుడు గాలుడికి అడ్డువచ్చి, అతనిలో అపూర్వ తేజస్సు చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పుష్కరుడి దగ్గరికి వెళ్లి 'గాలుడికి ఎలా సిద్ధి కలిగింది? నాకు ఎందుకు కాలేదు?' అని నిలదీశాడు. అప్పుడు పుష్కరుడు 'నీకు దైవంపైనే గాని గురువుపట్ల నమ్మకం లేనందుకు' అన్నాడు. ధ్వజదత్తుడు పశ్చాత్తాపంతో పుణ్య నదీ తీరానికి వెళ్లి గురువు, దైవంపై సమాన విశ్వాసాన్ని దృఢతరం చేసి 108 సార్లు జపం చేయగానే అతనికి సిద్ధి కలిగింది. ఆంజనేయుడు ఉష్ట్ర వాహనారూఢుడై సువర్చలా సమేతంగా దర్శనమిచ్చాడు. ధ్వజదత్తుడికి అపార సంపదలతోపాటు మోక్షాన్ని కూడా ప్రసాదించాడు.

Wednesday, 2 April 2025

April రెండవ వారం కథలు

  


ఒక చిన్న కథ
అది ద్వాపరయుగం. ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు.
మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు.
ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు.
భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు. అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది. నా చేతికి చిక్కింది”అని గావుకేకలు పెట్టాడు.
అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన *ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను,* నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.
నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను. ఇది అతని ధర్మ ఫలం అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

కాళిదాసు***--

ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి.కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషం తో వుండసాగాడు.

రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు వుంది.కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని,కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్త్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.

వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి  పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు  "అయ  మాందోలికా దండ స్తవ బాధతి  కిం భుజే"కావాలనే తప్పుగా చదివాడు 'బాధతే' బదులుగా 'బాధతి' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు.రోజూఅదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.

ఐదవరోజు    ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు వుండబట్టలేక " "నాయమాం దోలికా దండ స్తవ 'బాధ తి' బాధతి"

ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ 'బాధతి' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము విని నంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించ మని వేడి  ఆపల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.

సంస్కృతం లో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.
అందుకే పెద్దవాళ్ళు 'లలితా సహస్ర నామము"విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునే టప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామము చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదు.అని. అలా చదవడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ అని చెప్తారు.
*****
               *కర్మ సిద్థాంతం*

*ఇది చాలా కఠినమైనది ఎవ్వరికీ అర్థంకాదు*

*మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది*

"కర్మను"  అనుభవించాలి ..... నిందిస్తే ప్రయోజనం లేదు .

రమణ మహాశయలు వారు ప్రతిదినము  స్నానం కొరకు  నదికి పోతుండేవారు.

ఆయన వెంట కృష్ణా  అను భక్తుడు పోయెడివాడు.

ఒకనాడు రమణ మహాశయులు నదికి పోతుంటే ఉన్నట్టుండి , తన వెనుకనున్న కృష్ణా  తో  "కృష్ణా ! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు". అని అన్నారు. కృష్ణా కు అర్ధం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు మీద పడినది . కాలి వేలు చితికింది . రక్తం కారుతోంది  . ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు, ష్ణా అప్పుడు గ్రహించాడు, వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన గుర్తించి , రమణ మహాశయులతో "మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా !   మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ?"  అని ప్రశ్నించాడు.

అప్పుడు రమణమహాశయులు కృష్ణా తో … "ఆలా జరగదు కృష్ణా పక్కకితప్పుకొంటే , ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే!

రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచింది కదా !" అని అన్నారు.

కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించ వలసిందే.✍️
                       🌷🙏🌷


*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

ధర్భల మహిమ.....*

తులసి, ధర్భలు, బిల్వదళములు వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

ఒక విధమైన  గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు శ్రీ రాముని  స్పర్శ చేత  పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది.
ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ.   జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి  ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి వుంచడం గమనించవచ్చును.

ధర్భలని సంస్కృతం లో 'అగ్ని గర్భం' అంటారు. కుంభాభిషేకాలలోను యాగశాలలో ని కలశాలలోను‌ ,బంగారు, వెండి తీగలతో పాటుగా
ధర్భలను కూడా  తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.

ధర్భలలో కూడా స్త్రీ , పురుష  , నపుంసక జాతి ధర్భలని మూడు రకాలు వున్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరికొసదాకా సమానంగా వుంటాయి. పై భాగంలో  దళసరిగా వుంటే అది స్త్రీ ధర్భ గా గుర్తిస్తారు. అడుగున దళసరిగా వున్న ధర్భను నపుంసక ధర్భ గా తెలుసుకోవచ్చును.
ధర్భల దిగువ భాగంలో   బ్రహ్మకు ,  మధ్యస్థానంలో  మహావిష్ణువుకు , శిఖరాన  పరమశివునికి   నివాసంగా భావిస్తారు.

దేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలు ధర్భ కొసలతోను,  మానవులను  తలచి యిచ్చే తర్పణాలలో ధర్భల మధ్యభాగం నుండి, పితృదేవతలను  తలచుకొని యిచ్చే తర్పణాలలో ధర్భను మడిచి కొసలతోనూ  తర్పణాలు సమర్పించడం విధాయకంగా వుంది.

వైదికకార్యాలలో "పవిత్రం" అనే పేరుతో ధర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి  ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు .ఈ వ్రేలిలో కఫనాడి వుండడం వలన యీ ఉంగర ధారణవలన  కఫం శుభ్రం  చేయబడుతోంది.

ప్రేత కార్యాలలో  ఒక ధర్భతోను, శుభ కార్యాలలో  రెండు ధర్భలతోను, పితృ కార్యాలలో మూడు ధర్భలతోను , దేవ కార్యాలలో నాలుగు ధర్భలతోను‌,  ఆ ధర్భ ఉంగరాన్ని  ముడి వేస్తారు.
దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం  వంటి కార్యాలలో ధర్భతో చేసిన  'పవిత్రం'అనే యీ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.

ధర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు వుండడం వలన రాగి విగ్రహాలను , బూడిద  ధర్భలు ఉపయోగించి  శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెప్తోంది. ఇందు వలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి  తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా వుంటాయని శాస్త్రజ్ఞులు చెపుతారు.

ఆదివారమునాడు కోసిన ధర్భలను ఒక వారముపాటు ఉపయోగించవచ్చును. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే
ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును.
పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చును.

శ్రావణమాసం లో కోసిన ధర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చును.  భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరు మాసాలు ఉపయోగించ వచ్చును. శ్రాధ్ధ కార్యాలకోసం తెచ్చిన ధర్భలను ఏ రోజు కా రోజే  ఉపయోగించాలి. తిరునల్లారు శైవక్షేత్రంలో  ధర్భలే స్ధల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవైయున్న ఈశ్వరుని పేరు ధర్భారణ్యేశ్వర🙏🙏🏻

*****
*నేటి జీవిత సత్యాలు*

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ

ఎవరికి ఎవరో సొంతము, ఎంతవరకీ బంధము, ఎదలో ఆలోచనలు ఎటు పోతాయో, ఏ విధంగా ఇటు మారుతాయో, ఎవరికి ఎరుక, ఏ విధంగా తెలపా, పాదయాత్ర వలన పదవి రావచ్చును, కాశీ యాత్ర వలన గతులు మారవచ్చును, సూత్రాల వలన యాత్రలు అంటే భవిష్యత్తు దగ్గరగా ఉండవచ్చును, భూమి మహావేగముగా తిరుగుతుండగా, నెమ్మదిగా కదులుతున్నదా,   ఎలా చెప్పగలరు, మొక్కలు పెరుగుతూనే ఉంటాయి, కాలం కదులుతూనే ఉంటుంది, శ్రీ మాతా కన్నులు సమస్తము వీక్షించును, పర్యవేక్షించును, రక్షించును, కన్నులతో సమస్త సృష్టి గావించి, పోషించగలుగుతుంది.

ప్రతి ఒక్కరికి శత్రువులు, మిత్రులు, వెంటపడే ఉంటారు కాలంతో పాటు, కదలిక తో వారు వెన్నంటే ఉంటారు, శ్రమ, శక్తి, భక్తి, యుక్తి, నేర్పు, మార్పు, కూర్పు, బట్టి జీవితంలోకి వచ్చి పోతూ ఉంటారు. ఎవరు ఎంతవరకు ఉంటారో ఎవరు చెప్పలేరు, సూర్యోదయం వెంటనే మనిషి ఆలోచనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో ఎవరూ చెప్పలేరు.

భగవద్గీతలో 16 వ అధ్యాయంలో భగవంతుడే ఈ విధంగా తెలియపరిచాడు ఇతర శత్రువులు కూడా వధించబడుదురు. నేనే భోక్తను పూర్తి శక్తివంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని.

ప్రాణం వల్ల స్వభావాలు వ్యవహారాలు తారుమారు కావు. అన్ని యధావిధి గానే ఉంటాయి మరి మార్పు వచ్చేది అవగాహన మాత్రమే ఆలోచన మాత్రమే, ఆదర్శం మాత్రమే, ఆకర్షణ మాత్రమే,ఆరోగ్యం మాత్రమే, అనుభవం మాత్రమే, ఆత్మీయులలో వచ్చే కలహాల పర్యవసానం మాత్రమే, జీవితం నల్లేరు తీగల కదులతూ, భయభ్రాంతుల మధ్య, సుఖశాంతుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెలు మధ్య ఆదర్శాలు తక్కువగా ఉండి మనిషి మనిషి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండి, కాలు ఏ దిక్కున నడిపిస్తుందో ఎవరు ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చెప్పలేరు, అనేది తెలియకుండా మానవత్వాన్ని నిలబెట్టడానికి కారణాలు ఏమిటో, తెలియకుండా జీవితం సాగిపోవటమే, శక్తిలో అందరూ ఉన్నారు.

కాబట్టి అందరిలోనూ శక్తి ఉన్నది నేను అనే పరమాత్మ అందరిలో ఉన్నారు కాబట్టి అందరిలోనూ జీవాత్మ జీవమై ఉన్నది జగతి రూపంగా ఉన్నది దేవుడైన గ్రహించు ఈ ప్రపంచాన్ని ఎంత మేలు చేయగలవు చెయ్యి, అదంతా భగత్సేవేనని భావించు.

కధ కంచికి మనం ఇంటికి
అనేది ఒక ఆలోచన కాదు, కంచి అనగా భూలింగం, "కథ కంచికి అనగా " మరణించిన మన భౌతిక దేహాన్ని ఈ భూలోకంలోని వదిలేస్తామని గ్రహించాలి. మనం ఇంటికి అనగా" ఆత్మ పదార్థం తన స్వస్వరూపమైన మహా మూల చైతన్యానికి చేరుతుందని అంతరార్థం తెలుసుకోలేనటువంటి మానవ జన్మ అవటం వలన తెలపలేకపోతున్నాము.

పక్షులకు ఆకాశమే బలము, చాపలకు జలమేయ బలము, అడుగు వర్గం వారికి రాజే బలము, పసిపాపలకు ఏడుపే బలము, బ్రాహ్మణులకు సంధ్యావందనము బలము మరియు ఐశ్వర్యము.

మనిషి తన మనుగడని మర్చిపోతున్నాడు అతి తెలివి గర్వము పొగరు నాకేంటి అనే అహంకారంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ మృగాలని తలపిస్తున్నాడు.

అందుకే నేమో రోజురోజుకీ పతనం అయిపోతుంది సమాజంలో మానవ వ్యవస్థ.

ఎవడి ఇల్లు వాడికి దిద్దుకోవడం చేతకాదు పక్కింట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి కావాలి,

ఈర్ష ద్వేషాలతో నిండిపోయి జీవితాన్ని అతలంకుతలం చేసుకుంటూ, పక్కవాడిని కూడా ప్రశాంతంగా బతకకుండా చేస్తున్నారు.

పశువుల కూడా ఒక నీతి ఉంటుంది, ఒకదానికి కష్టం వస్తే పోలో మంట్ అవి వచ్చి జేరతాయి,

ఈ మనుషులేంటి,ఇంతలా దిగజారిపోతున్నారు స్వార్థంతో కూలిపోతున్నారు. మనం ఎలా ఆలోచిస్తే మనకు అలాగే జరుగుతుంది.

ఈరోజు సమాజంలో రేపు మీ ఇంట్లో ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు ఒకసారి ఊహించి చూడు.

ప్రకృతి ప్రళయాలు ఏ క్షణంలో ఎలా ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అయినా ఆశ దురాశ నేనింతే అనుకున్నప్పుడు మరొకరిని వేలెత్తి చూయించకు.

మళ్లీ చెప్తున్నాను నువ్వు ఏదైతే ఇస్తావు అదే తిరిగి నీకు వస్తుంది. ఇంతై అంతయి అనంతమై.

యవ్వనంలో మొటిమలు సహజం, ముసలి తనలో ముడతలు సహజం, యవ్వనంలో " స్త్రీ " చేయి పట్టుకోవాలని ఆశపడతాం, ముసలితలను ఎవరి చేయి పట్టుకుంటారో అని ఎదురు చూస్తాం, యవ్వనంలో ఒంటరిగా వదిలేస్తే బాగుంటుందనుకుంటాం, వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారే అని బాధపడతాం, యవ్వనంలో సలహాలు ఇస్తే చికాకు, వృద్ధాప్యంలో సలహాలు పాటించలేని పరిస్థితిగా వాక్కు, యవ్వనంలో అందాన్ని ఆస్వాదిస్తాము, వృద్ధాప్యంలో అందాన్ని దైవంలో చూసుకుంటూ బ్రతకాలని ప్రయత్నిస్తాము. యవ్వనంలో ప్రతిక్షణం పండుగగా భావిస్తాము, వృద్ధాప్యంలో తీపి జ్ఞాపకాలు నెమరు వేస్తూ జీవితాన్ని సాగించాలని  ప్రయత్నం చేస్తూ ఉంటాము. జీవితమనేది ఆటుపోట్ల సంగ్రామం, ధైర్యంగా శక్తిగా యుక్తిగా జీవిత లక్ష్యంగా జీవనాన్ని గడిపిన వాడికి జీవితంలో కష్టం అనేది తెలియక సుఖంగా జీవించగలుగు తాడనేది సర్వ ప్రకృతి అనుకూలిస్తుందని, నిజమైన జీవితా అనుభవం తెలియపరుస్తుంది.

యవ్వనంలోనైనా ముసలితనంలోనైనా ఉన్న సత్యాన్ని గ్రహించే జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుందనేది అందరి యొక్క నమ్మకం అదే నిజం అదే నిజం అదే నిజం.

   ఇంకా వుంది.

******

ఒక వ్యక్తికి 4 భార్యలు 4వ భార్య అంటే చాలా ప్రేమ అతనికి, ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు.అపురూపంగా చూసుకునేవాడు.
మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర చెప్పేవాడు కాదు. తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో..

2వ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు.ఆమెకూడాఅతని సమస్యను తీర్చి పంపేది.

*మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు. ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి*

అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద, ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.

నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను.నిన్ను చాలా ప్రేమగా  చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్. మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అని అన్నాడు. 4వ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది.

ఆశ్చర్య చకితుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు.3వ భార్య ఇలా అంది. ఇన్ని రోజులు నీతోనే,నీ దగ్గరే ఉన్నాను.నీ అవసరాలన్నీ తోర్చాను
ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:"

బాధతో ఏడుస్తూ తన 2వ భార్యను ఇలాగే అడిగాడు. నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను
తరువాత నేను వెళ్ళిపో్తాను.నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను.అంది.

ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా

*మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను.మీరేమీ బాధపడకండి"*

అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.కాబట్టి మనిషి దేన్నీ, ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ
తెలియదు.పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.

నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????

*4వ భార్య, మన శరీరం*
*3వ భార్య, సంపద, ఆస్థిపాస్తులు*
*2వ భార్య నేస్తాలు, బంధువులు*
*మొదటి భార్య, మన ఆత్మ*

నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి. పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి.సరేనా!
****
            *ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి. కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషంతో ఉండసాగాడు.*

             *రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు ఉంది. కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని, కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.*

              *వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి  పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు*

      *"అయ  మాందోలికా దండ స్తవ బాధతి  కిం భుజే"*

          *కావాలనే తప్పుగా చదివాడు ''బాధతే'' బదులుగా ''బాధతి'' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు. రోజూ అదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.*

              *ఐదవరోజు ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు ఉండబట్టలేక "*

*"నాయమాం దోలికా దండస్తవ ''బాధ తి'' బాధతి"*

           *ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ ''బాధతి'' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము వినినంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించమని వేడి  ఆ పల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.*

         *సంస్కృతంలో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.*

          *అందుకే పెద్దవాళ్ళు ''లలితా సహస్ర నామము,విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునేటప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామం చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదుఅని. అలా చదవడం వల్ల పొందాల్సిన ప్రయోజనం పొందలేకపోతాం!*

*🌹🌹🌹*

సద్వినియోగం
ఒకరోజు బుద్దుడికి ఒక దుప్పటి కనుగోలు చేస్తున్న ఒక యువకుడు కనిపించాడు. ఈ "దుప్పటి కొన్నాళ్ళకు చినిగిపోతుంది కదా!అప్పుడు దాన్నేం చేస్తావన్నాడు" బుద్దుడు." దీన్ని రెండు ముక్కలుగా చింపి అంగవస్త్రంగా వాడుకుంటాను."అన్నాడు ఆ యువకుడు.మరి అవి కుాడా చినిగిపోతే అన్నాడు బుద్దుడు." ముక్కలుగా చేసి ఇల్లు తుడవడానికి వాడుకుంటాను.అన్నాడు.

అది కుాడా ముక్కలైపోతే అన్నాడు బుద్దుడు.!

ఆ ముక్కలన్నింటిని మట్టితో పిసికి బొమ్మలు చేస్తాను.ఆ బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బు తో మరో కొత్త దుప్పటి కొనుక్కుంటాను" అన్నాడు నవ్వుతూ ఆ యువకుడు.

ఈ మాటలకు బుద్దుడు సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదేమరి అని తన శిష్యులకు చెప్పాడు..!!

మహాత్మాగాంధీ కుాడా సద్వినియోగం చేసుకోవడం సబర్మతి ఆశ్రమంలో వుండే తన సహచరులకు ఎప్పుడుా చెపుతుండేవారట.

ఒకనాడు చిటికెన వేలంత పెన్సిల్ కనపడలేదు..పుస్తకాలకింద అలసిపోయెాదాక వెదుకుతూ వున్నారంట..అప్పుడు ఒక శిష్యురాలు వచ్చి " బాపు ఇదిగో కొత్త పెన్సిల్ తీసుకోండి..అంది…"నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే?!

నా పెన్సిల్ కోసం వెదుకుతున్నాను..అన్నారట మహాత్ముడు .

బాపు చిన్న కాగితం కుాడా వ్యర్దం చేసే వారు కాదట.తనకు వచ్చిన ఉత్తరాల వెనకాల వున్న ఖాళీ ప్రదేశంలో ఏదో ఒకటి రాసే వారట.

బాపు కాగితాలు చాలా వున్నాయి వాడుకోండి అంటే " వద్దు..పేపర్ కోసం వాడే వెదురు చెట్లు బౌవిషిత్ తరాలకు అయిపోవచ్చు..అందుకని కాగితాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి.

అనవసరమనిపిస్తే ఉప్పు కుాడా ఎక్కువగా వడ్ధీంచుకోవద్దు…అని ఆశ్రమం గోడ మీద రాసి వుంచే వారంట.

వస్తువుల్ని సద్వినియోగం చేయడం చాలా మంచి అలవాటు …ఎందుకంటే భౌవిషిత్ తరాలకి అన్ని అందక పోవచ్చు తరిగిపోవచ్చు…ఆ లక్ష్యం మనసులో వుంటే ఆహారం నీరు వ్యర్థం చేయము.

ప్రతి వస్తువు అయిపోయాక ఏదో ఒక పనికి ఉపయెాగపడుతుంది…కొనడం మాసిపోయిందనీ పాత ది అయిందనీ పారేయడం వలన వాతావరణం ప్రకృతి కాలుష్యం అవుతుంది …బుద్దుడి కధ లో లాగా అది చివరికి మట్టిలో కలిసే వరకు ఉపయెాగించడం వలన ఎంతో ఉపయెాగముంటుంది.

మహాదేవుడు శివుడు కుాడా ఒక సంధర్భంలో అడవుల్ని కొట్టి వేసి జంతువుల్ని చంపివేసేవారికి తాను కఠిన శిక్ష వేస్తాన నీ చెప్పారు. ఈ జగత్తును పాలించే శివుడు కుాడా జనులకు ఐశ్వర్యము ప్రసాదించే వారైనప్పటికి….పట్టుపీతాంబరాలు ధరించక….

పులి లేదా ఏనుగు మరణించిన తరువాత లభింే వాటి చర్మం ధరిస్తాన నీ చెప్పారు…బ్రతికిన దాన్ని చంపి దాని చర్మం నేను ధరించను…అని వారే స్వయంగా రుషులకు జ్ఞాన త త్సంగంలో చెప్పెవారు…

విచ్చలవిడిగా వస్తువుల్ని నీటిని ఆహారాన్ని ప్రకృతి ని వ్యర్దం చేయడం తనకు ఆగ్రహం తెప్పిస్తుందనీ చెప్పెవారు..!!

మన వంతు బాధ్యత గా ప్రకృతి ని కాపాడుకోవాలి…మితంగా జీవిస్తుా పరిమితంగా వస్తువుల్ని వినియెగించుకోవాలి.ఎందుకంటే… రాబోయే తరాల కోసం…

అలాగే కాలాన్ని కుాడా సద్వినియోగం చేసుకోవాలి…కాలాన్ని సద్వినియోగం చేయకుండా సోమరితనం నిద్ర తో వ్యర్దపు మాటలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారికి కాలసర్పదోషం తగులుతుందనీ జ్యోతిషులు అంటారు..అదే కాలసర్ప దోషమంటే…!

కాలసర్ప దోషానికి పరిహారం కేవలం కాలాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి పనులు మంచి మాటలు , వారి వారి బాధ్యతల్ని ధర్మం గా నిర్వహించడమే…భగవంతుని ధ్యానం , జపం పుాజ యెాగ సాధన , ఆధ్యాత్మిక సాధన చేయడం…పరోపకారం పరమ ధర్మంగా భావించడమే ..కాలాన్ని సద్వినియోగం చేయడం…!
*******

*మాతృప్రేమ*

               ➖➖➖

*మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు..!*

*శివాజీ  రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది.*

*ప్రొద్దున ఆఱింటికి తెఱిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి.*

*ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు.*

*ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ!*

*రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు.*

*ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడదు.*

*’హీరాకానీ’ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలుపోయటానికి వచ్చేది.*

*అందఱికీ తనకు చేతనైన సహాయం చేసేది.*

*ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ.   ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది.*

*పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.*

*కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు.*

*“అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది.*

*హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్ఞ మేము మీఱలేము. ఈ ఒక్క పూటకి  ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం అవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊఱడించినారు.*

*మఱునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు.*

*అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది.*

*పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది.*

*ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు.*

*ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.*

*ఇంతలో ‘హీరాకానీ’ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్రార్థించింది హీరాకానీ.*

*శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. ‘హీరాకానీ’కి అందఱూ చూస్తుండగా         సాష్టాంగ వందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ.*

*ఇప్పటికీ ఈ బురుజు ‘హీరాకానీబురుజు’ అనే పిలవబడుతోంది.*🙏
*****విధి... చక్కని సందేశం...

ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది.

ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.

ఆ మాటా విన్న ఇంద్రాణి పరుగుం పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి, "మీరేం చేస్తారో నాకు తెలియదు. నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చని*పో*తాను" అని కన్నీరుపెట్టుకుంది..!

దానికి ఇంద్రుడు... “దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మా? కదా.! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను. నువ్వేం దిగులు పడకు… అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.

ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ.! "నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు.! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం "పద.." అంటూ బయలుదేరారు.

వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.

"నిజమే ప్రా*ణాలు కాపాడేవాణ్ణి నేనే…! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది.! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం.! మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి... " అన్నారు.

అందరూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.

ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రా*ణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను.. మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! అంటూ అందరూ బయలుదేరారు.

ఇంద్రుడు, బ్రహ్మ విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.

"అయ్యో.. అదేమి పెద్ద పనికాదు. మాములుగా చా*వుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను, వారు ఎలా చని*పోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చని*పోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..!" అని అన్నాడు.

యముడు, అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో. చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆకుపై చిలుక మర ణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!

ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక
మర ణిస్తుంది. అని వ్రాసి ఉంది.

ఇదే విధి…! విధిని ఎవ్వరూ మార్చలేరు!!
******

April మొదటి వారం కథలు

 

ప్రాంజలి ప్రభ.. కథలు.. (5)


వేసవి కాలం ఎండలు బాగా మండుతున్నాయి ఎవరైనా ఇంటికి వస్తే కూల్ డ్రింక్స్ ఇవ్వకుండా ఇంటిలో తయారు చేసే పానియాలను వాడుదాం...........

సహజ పానీయాలనే తాగుదాం :

*నిమ్మరసం* : మంచినీటిలో నిమ్మకాయ పిండి, చక్కెర, ఉప్పు కలుపుకుని నిమ్మరసం (షర్బత్) చేసుకొని త్రాగవచ్చు. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చెరకు రసం : ముప్పావు లీటరు చెరకురసం గిన్నెలో వడ పోసుకుని 3 చెంచాల నిమ్మ రసం కలుపుకొని, ఆతర్వాత కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని చల్ల బరచుకుని తాగొచ్చు.

మసాల మజ్జిగ : ఒక వంతు పెరుగు, నాలుగు వంతులు మంచినీరు కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఒక మిర్చి కొద్దిగా అల్లం తురుము తాజా కరివేపాకులు, కొంచెం నిమ్మరసం, తగినంత ఉప్పు కలుపు కుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన మసాల మజ్జిగ రెడీ ఔతుంది.

దీనిలో పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం, రైబో ఫేవిన్, విటమిన్ బి-12 పుష్కలంగా లభిస్తాయి.

కొబ్బరి నీళ్లు : లేత కొబ్బరి నీళ్లు సహజ తియ్యదనం, రుచి కల్గిఉండి చల్లదనాన్నిచ్చి, జీర్ణ వ్యవస్థకు, మూత్ర వ్యవస్థకు మేలు చేస్తుంది.

గంజితో షర్బత్ : అన్నం వండేటప్పుడు వార్చినాక చిక్కని గంజి వస్తుంది.

దానిలో కొంచెం ఉప్పు వేసుకొని మజ్జిగ కలుపుకుని తాగితే

ఎండా కాలం వడ దెబ్బ సోకకుండా రక్షిస్తుంది.

రాగి అంబలి : 100 గ్రాముల రాగుల పిండిని కొద్దిపాటి నీళ్లలో

మెత్తని పేస్టులా (గడ్డలు లేకుండా) చేసుకోవాలి. దీనిని సుమారుగా అరలీటరు నుండి లీటరు మరిగే నీళ్లతో కలిపి సన్నని మంటలో 3 నుంచి 5 నిమిషాల సేపు కలుపుతూ ఉడికించాలి. చల్లారిన తర్వాత ఉప్పు లేదా బెల్లం (ఇష్టాన్ని బట్టి) మజ్జిగ కలుపు కోవాలి. వేసవితాపాన్ని చల్లార్చే ఆరోగ్యకరమైన రాగి అంబలి రెడీ.

వేసవి పానకం : పావుకేజి తురిమిన బెల్లం గిన్నెలో తీసుకుని ఒకటిన్నర

లీటరు మంచినీరు పోసుకుని బాగా కలిపి, బెల్లం కరిగే వరకూ ఉంచాలి. 25 గ్రాముల మిరియాలు, ఆరు యాలకులు పొడిగా చేసుకుని ఇందులో కలుపుకోవాలి. వేసవిలో చలవనిచ్చే ఆరోగ్యకరమైన పానకం రెడీ.

ఇవే కాకుండా పుచ్చకాయ, నారింజ, బొప్పాయి, దానిమ్మ, అనాస, ద్రాక్ష, సపోటా వంటి పండ్లరసాలు  కూల్డ్రింక్స్ కంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
*****
ప్రాంజలి ప్రభ....కథలు..(4)       4/2025

*_వృద్ధాప్యం.. నిప్పు లేకుండా హృదయాన్ని కాల్చే రక్త బంధాలు !!_*

రాధాకృష్ణారావు గారికి కీసర దగ్గర లంకంత కొంప ఉంది...

అదృష్టవశాత్తూ తన తండ్రికి ఒక్కడే కొడుకు కావడం...
దానికి తోడు ఇంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తనకు పుట్టిన పిల్లలనిద్దరిని ఉన్నత చదువులు చదివించారు...
ఇప్పుడు రాధాకృష్ణారావుకు డెబ్భై  ఏళ్ళు...
పెళ్లయి యాభై సంవత్సరాలు...

"ముత్తైదువగా పోవాలి"
అని భార్య జానకి ఎప్పుడు అనుకునేది...
షుగర్ బీపీ ఉన్న రాధాకృష్ణారావు రాయిలా ఉన్నాడు కానీ ఆరోగ్యంగా
ఉన్న జానకి హఠాత్తుగా కన్ను మూసింది...

ఉన్నాన్నాళ్ళు చీటికి  మాటికి భార్యతో తగువు పెట్టుకున్న రావు గారు...
ఆమె పోయాకా ఆమె లేని లోటు అణువణువు కనబడుతుంది...
ఆఫీస్ ఉన్నప్పుడు హాయిగా సాగిన  సంసారం...
ఆయన రిటైర్ అయ్యాకా తన బీపీ అంతా భార్య మీద చూపించే సరికి ఎన్నో సార్లు 
అలగి గదిలో తలుపు బిగించుకునేవాడు...
జానకి మళ్ళీ బ్రతిమాలాడుతూ

ఆ జ్ఞాపకాలు...
ఆమె బుజ్జగించిన ఆ రోజులు అన్ని రావు గారికి గుర్తుకు వస్తున్నాయి...

ఎటూ చూసిన ఇల్లంతా జానకి ప్రతిరూపం కనబడుతుంది...
ఉన్నాన్నాళ్ళు కూర బాగాలేదని పచ్చడి బాగా లేదని ఆమెను వేధించుకు తిన్న రోజులు గుర్తుకు వచ్చి రావు కన్నీళ్లు ధారగా విలపిస్తున్నారు..
యాభై ఏళ్ళ వైవాహిక జీవితంలో ఇద్దరిదీ ఒకే మాట...
రిటైర్ అయ్యాకా మాత్రం కాస్త నోటి దురుసు రావు గారికి ఎక్కువైంది...

బయటకు వెళితే "బీపీ టాబ్లెట్స్ వేసుకున్నారా?" అని అడిగేది...
టిఫిన్ చేసి ముందు "టాబ్లెట్స్ వేసు కొండని" ఫోన్ లో చెప్పేది...
ఇంట్లో ఉంటే ఎప్పుడో తెల్లవారి ఝామున లేచి పూజ పునస్కారాలు చేసి తొమ్మిదికల్లా టిఫిన్ రెడీ చేసి భర్తకు పెట్టీ ఆమె తినేది...

*ఎప్పుడైతే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయో అప్పట్నుంచి ఆమెకు రావు గారికి వైరం* మొదలైంది...
వాళ్ళ ఉద్యోగాలు హైటెక్  సిటి వైపు వాళ్లకు వచ్చే జీతం ఏమి సరిపోతుంది అని ఉన్న రెండెకరాల అమ్మి అమ్మాయికి అబ్బాయికి రెండు ఇళ్ళు కోనిచ్చే వరకు జానకి పోరు ఆగలేదు! పిల్లలకు సిటీలో ఇళ్ళు కొన్నకా ఇద్దరూ వాళ్ళ దగ్గర ఇమడ లేక సిటికి దూరంగా ఇలా ఒంటరి జీవితం గడుపుతున్నారు...
పైగా "నేను ముందు పోతే మీకు చేసే వారు ఉండరు" అని ఏడిపించేది...

ఎంత గిల్లి కజ్జాలు పెట్టుకున్నా కూడా భార్య భర్తలు ఒక గంట సేపటి తరువాత మాట  పట్టింపులు పక్కన పెట్టి దగ్గరయ్యేవారు...
రావు గారిదే ఎప్పుడు తప్పు అయ్యేది. జానకి ఓపిక వల్ల సంసారం ఇంత వరకు సాగింది...
పిల్లల పెంపకం...
వాళ్లకు ఉద్యోగాలు ...
వాళ్లకు ఇళ్లు పెళ్ళిళ్ళు అయ్యే సరికి ఉన్న ఆస్తి మొత్తం అయి పోయింది...
ఇప్పుడు తన పూర్వీకుల కట్టించిన ఇల్లు...
పెన్షన్ తప్పా రాధాకృష్ణారావుకు ఏమి మిగలలేదు!!

ఈ తరం పిల్లల అభిరుచులు వేరు,  దంపతులు ఇద్దరు ఉద్యోగాలు... తీరిక లేని పనుల వల్ల తల్లి దండ్రులను చూసే ఓపిక వారికి లేదు...
పైగా తన కన్న వాళ్ళని స్కూలుకు పంపడం...
తీసుకురావడం...
ఇదే ఒత్తిడితో ప్రతి కుటుంబంలో వృద్ధ తల్లి దండ్రులు పిల్లల దగ్గర ఇమడలేక పోతున్నారు...

వాళ్ళు తినే తిండి...
ఆచార వ్యవహారాలు....
వాళ్ళ వస్త్ర ధారణ ఇప్పడి పేరంట్స్ కు నచ్చడం లేదు...
పైగా మనవలు మనవరాళ్లుతో అన్యోన్యంగా ఉందామన్నా కూడా
"పిల్లల చదువు పాడై పోతుంది"
"మీరు గారాబం చేయకండి" అనే మాట కొడుకు - కూతురు నుండి రావడం..

తన పిల్లలకు కొన్న ఇల్లులో కూడా తనకు *స్థానం*, లేదని  తెలిసి వచ్చే సరికి ఆప్యాయత అనురాగం అంతా కనుమరుగై పోతుంది...

కన్న కొడుకు ఇంట్లోనే
తల్లి తండ్రులు కాందిశీకుల్లా బ్రతుకుతున్నారు...
ఇప్పుడు కన్న తల్లి దండ్రులు పిల్లలకు *బరువు*!!
అందుకే పండుటాకులుగా మిగిలి పోయి "దేవుడు ఎప్పుడు తీసుకెళతాడా?"
అని చూస్తున్నారు
రాధా కృష్ణారావు గారు. ఇవ్వాళ ఎంతో బాధకు గురయ్యారు..." ఛ...  ఇలాంటి పిల్లలను కన్నందుకా నేను ఇంత శ్రమ పడింది.. దానికి కారణం తనను కొడుకు అన్న మాటలు బాధించాయి...

"మనసు బాగాలేక దైవ దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్లి వస్తా" అని పిల్లల ఇద్దరికీ చెప్పాడు...
తానే రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాడు...
ఈ నాలుగు రోజుల్లో *ఎలా ఉన్నారు నాన్న* అని పిల్లల నుండి ఫోన్ లేదు...
తిన్నారా? పడుకున్నారా? అని బాగోగులు కూడా అడిగిన పాపాన పోలేదు...
రావు గారికి పిల్లల పట్ల ద్వేష భావం ఏర్పడడానికి బోలెడు సంఘటనలు జరిగాయి...
ఒక రోజు కొడుకు ఇంట్లో ఉంటే అర్ధరాత్రి రాజమండ్రి నుండి దిగిన అత్తా మామను తీసుకురావడానికి కొడుకు కారులో వెళ్లి తీసుకువచ్చాడు...
తాను రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి అంటే క్యాబ్ లో వెళ్ళమని ఆఫీస్ కు వెళ్లి పోయాడు...
వారింట్లో ఉంటే  పిల్లలకు వాళ్ళు టిఫిన్ లు క్యారేజ్ లు కట్టి అటు ఆఫీస్ కు ఇటు స్కూల్ కి పిల్లలను పంపాకా "నాన్నా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఉంది... తినండి" అని కొడుకు ఫోన్ చేసి చెప్పాడు... ఇంట్లో ఉన్న రెండు రోజుల్లో కోడలు "ఎలా ఉన్నారు మావయ్య" అని కూడా అడగలేదు... పైగా మనవరాలు మనవడితో గదిలో పడుకుందామని అనుకుంటే హాల్లో మంచం వేసి పరుపు వేసి పడుకోండి... అని కొడుకు అన్నప్పుడే అదే అర్ధరాత్రి తన ఇంటిలో వెళ్లి పోదామని కోపం వచ్చింది రావు గారికి..
అయిన తమాయించుకొని ఉన్నాడు...
తెల్లవారే తన బట్టలు సర్దుకొని *వెళ్లి వస్తా బాబు* అంటే *సరే నాన్నా* అన్నాడు తప్ప ఉండమని అనలేదు! తాను క్యాబ్ మాట్లాడుకొని కూతురు ఇంటికి వెళితే వెళ్ళిన రోజు బాగానే చూసింది... మరో రోజు ఉందామని అనుకొని తాను టీవీ చూస్తుంటే "నాన్నా అల్లుడు గారి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ బంధువులు వస్తున్నారు... వాళ్ళు మూడు నాలుగు రోజులు ఉంటారట... మీరు అన్నయ్య ఇంట్లో ఈ మూడు రోజులు ఉండండి తిరిగి నా దగ్గరికి రండి" అన్న మాట కూతురు నోట వినగానే  స్నానం చేయకుండానే ప్యాంట్ షర్ట్ వేసుకొని బ్యాగ్ సర్దుకొని *సరే అమ్మా ఆరోగ్యం జాగ్రత్త* అని లిఫ్ట్ దిగాడు...

వెంటనే ఆటో మాట్లాడుకొని పబ్లిక్ గార్డెన్ వెళ్లి ఒక చెట్టు చాటుకి వెళ్లి బోరున విలపించాడు...
తాను - జానకి ఏ యాత్రలకు వెళ్ళిన కూడా పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకొని చలి పెడుతుందేమో అని రగ్గులు కప్పి పొదివి పట్టుకొని పెంచిన వీళ్ళు *మా ఇంట్లో పడుకోవడానికి స్థానం లేదు* అని నిర్మోహమాటంగా అనడం రాధాకృష్ణా రావు గారు జీర్ణించుకోలేక పోతున్నా రు...!!
జ్వరాలు రోగాలు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళు స్వస్థత చేకూరే వరకు ఆసుపత్రి వరండాలో పడుకొని పిల్లలను పెంచితే ఇదా వాళ్ళు చేసే నిర్వాకం! తన లాగే పబ్లిక్ పార్కుల్లో మూగ రోదన చేస్తున్న తన వయసు వాళ్ళు కనబడ్డారు రావు గారికి...
భారతీయ కుటుంబ వ్యవస్థ ఇంత చిన్న భిన్నం కావడానికి కారణం
ఈ సాఫ్టు వేర్ జాబులా? 
లేక
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు పాటించక పోవడానికి
మా తరమే కారణామా?! అన్న ప్రశ్న రావు గారిలో  మొదలైంది..
అసలు జీవితం అనే రైలు ప్రయాణంలో ఫ్లాట్ ఫాం ఫ్రెండ్ గా పిల్లల్తో ఉండాలి...
స్టేషన్ రాగానే దిగిపోయే ప్రయాణికుడిలా మనం మారాలి...
అన్న దృఢ నిశ్చయం రావులో మొదలు అయింది...

వెంటనే తన ఫోన్ లో నుండి కొడుకు కూతురు కాంటాక్ట్ నెంబర్లు తీసేశాడు...
తన ఇంటికి చేరి ఇల్లంతా పని వాళ్ళతో శుభ్రం చేయించి కేవలం జానకి ఫోటో మాత్రమే ఇంట్లో తనకు కనబడేలా...
బెడ్ రూంలో పెట్టాడు...
పక్కనే హోటల్ వానీ దగ్గరికి వెళ్లి ఉదయం టిఫెన్, మధ్యాన్నం భోజనం రాత్రి రెండు చపాతీలు పంపేలా ఏర్పాట్లు చేసుకున్నాడు.
పక్కనే ఉన్న టీ కొట్టు వాడితో ఉదయం సాయంత్రం కాఫీ తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాడు...
తన సెల్ లో టైమ్ ప్రకారం ట్యాబ్ లెట్స్  వేసుకునేలా అలారమ్ పెట్టుకున్నాడు...
నెలకు పది రోజులు ఇండియా టూర్ ట్రావెల్స్ వాడికి టికెట్ బుక్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు...
ఇపుడు పిల్లలు ఫోన్ చేసిన ఎత్తడం లేదు...
భవ బంధాలు అన్ని తెంపుకుని తనకు నచ్చిన జీవితాన్ని గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు!

ఒంటరి తనం అనేది మనసు మాట! *తన మాటే మనసు వినేలా,* మనో నిబ్బరం తెచ్చుకున్నాడు! ఇప్పుడు ఆయన రోగాలు తగ్గు ముఖం పట్టాయి!

తొంబై ఏళ్ళ వయసులో కూడా చలాకీగా ఉన్న తన దగ్గరికి రిటైర్ అయి ఫారిన్ లో సెటిల్ అయిన తన కొడుకుల దగ్గర ఇమడలేక తండ్రి పంచన చేరిన తన కొడుకు హాల్లో టీవీ చూస్తుంటే గదిలో నుండి వచ్చిన రావు గారికి తన కోడలు కొడుకుతో మట్లాడుతున్న సంభాషణ వినపడింది... "ఏమండీ నేను అమెరికాలో ఇమడలేక పోతున్నాను *ఇక్కడ మన పిల్లలు పని మనుషులకన్నా హీనంగా చూస్తున్నారు నేను మీ దగ్గరికి  వస్తాను* అన్న భార్య మాటలకు చూసావా వృద్దాప్యం ప్రాయ చిత్తం ఏమిటంటే...
భార్యా వియోగం, (స్త్రీలు భర్త అని అన్వయించుకోవాలి) లోక నింద, రుణభారం (అప్పులు), నీచులకు తగ్గి ఉండాల్సిన పరిస్థితి, దారిద్ర్యం అనుభవిస్తున్న తరుణంలో ఇష్టమైనవారు వచ్చి పలకరించడం - ఇవన్నీ తట్టుకోలేని బాధలు.
ఈ ఐదు అంశాలు నిప్పు అవసరం లేకుండా హృదయాన్ని కాల్చేస్తాయి. అవమానభారంతో దహించుకుపోతారు !!

_*కాబట్టి వృద్ధ తల్లితండ్రులు... ప్రతిదానికి కుచించుకుపోయి, "బేలగా" బ్రతక్కండి... నిబ్బరంగా ఉంటూ కనీసం ఇప్పుడైనా మీకోసం.. ఒకరి కోసం ఒకరు సుఖంగా సంతోషంగా  బ్రతకండి..!!!*
*****
01-04-2025 ప్రాంజలి ప్రభ కథలు.. 1

*వృద్దులంటే వృద్ది చెందినవారు*

అవంతీనగరంలో అరవై సంవత్సరాలు నిండిన వారిని చంపేయాలనీ రాజ్యం పరిపాలించే రాజు ఆజ్ఞ జారి చేసాడు…వృద్దులు పని చేయలేరు…వాళ్ళ ఉపయెాగం లేదని అతని భావన….అంతే కాదు పాత వస్తువులు వుండ కూడదనీ…అవి శని కి సంకేతం అని కుాడ జారి చేసాడు…శని వుంటే రాజ్యానికి అరిష్టం అని భావించేవాడు…!

రాజ్యం లో చాలామంది తమ పుార్వీకుల జ్ఞాపకం గా దాచుకున్న పాతవిలువైన వస్తువులు విసిరి పారేయలేక …చాలా మనస్తాపం పొందేవారు…!!

కావున ఆ రాజ్యం లో వృద్దులు కానీ పాత వస్తువులు కానీ కనపడవు..శాంతమ్మకి ఈ మధ్య 60వ సంవత్సరం వచ్చింది … ఆమె కొడుకులు ఆమెను ఒక చోట రహస్యం గా 01-04-2025భటులకి కనపడకుండా దాచి వుంచారు.

ఒకనాడు అడవిలో సింహం ఒకటి ఊరిమీద పడి దొరికిన వారిని దొరికినట్లు దాడి చేయసాగింది.ప్రజలు భయబ్రాంతులైనారు.సింహఽ గర్జిస్తుా ఊరంతా …అడవిలో తిరిగినట్లు తిరుగుతుంది .ప్రజలు కు ఏమి చేయాలో తొిచలేదు…దాన్ని అడ్డుకోవడానికి వెళ్లి నభటులను అది దుాకి చంపేసేది.

శాంతమ్మ కి విషయం తెలిసింది.కొడుకుల్ని పిలుపిచ్చుకొని సింహం పీడ విరగడ కావలంటే…సున్నం నీళ్ళ లో ముంచిన మేకపిల్లను ఆహారం గా వేయమనీచెప్పిఽది…కొడుకులు ఆ పని చేసారు..ఆకలితో వున్న సింహం అమాంతం మేక పిల్లను తినేసింది. అది సున్నం తిన్నందు వలన కళ్ళు తిరిగి సృహ కొల్ల్పోయి పడిపోయింది …అప్పుడు భటులు వచ్చి దాని మీద వల వేసి పట్టుకొని భోనులో పెట్టారు.

ఇంత మంచి సలహా ఇచ్చిందెవరనీ రాజు విచారించాడు….శాంతమ్మ రహస్యంగా దాగిన విషయం తెలిసి రాజు ఆమె తెలివి కి మెచ్చుకొిని పెద్దలను వృద్దులను చంపకుడ దని…వాళ్ళ సలహాలు సుాచనలు అనుభవాలు విలువైనవనీ వృద్దుల అవసరం ఎంతో వుందని …వృద్దులను చంపే శాసనం రద్దు చేయించాడు…

అంతే కాదు….పుార్వీకులు జ్ఞాపకంగా దాచుకున్న వస్తువులు ఏదో ఒక సమయంలో ఉపయెాగపడతాయనీ దాచుకోమనీ రాజు ఆఙ్గ జారీ చేసాడు…!!
******

అపూర్వ శాస్త్రాలు *..ప్రాంజలి ప్రభ..-2-- 4/2025

నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

🌼 1.అక్షరలక్ష:

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి

మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

🌼 2.శబ్దశాస్త్రం:

రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

🌼 3.శిల్పశాస్త్రం:

రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101

రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

🌼 4.సూపశాస్త్రం:

రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

🌼 5.మాలినీ శాస్త్రం:

రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

🌼 6.ధాతుశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార. సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.

మిశ్రమలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

🌼 7.విషశాస్త్రం:

32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,

విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

🌼 8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):

రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు
ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే
ప్రక్రియ చెప్పబడింది.

🌼 9.మల్లశాస్త్రం:

రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు
చెప్పబడ్డాయి.

🌼 10.రత్నపరీక్ష:

రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను
పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం, బరువు మొదలగు తరగతులుగా
విభజించి తర్కించారు.

🌼 11.మహేంద్రజాల శాస్త్రం:

సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. నీటిపై నడవడం,గాలిలో
తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

🌼 12.అర్థశాస్త్రం:

రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో
వివరించారు.

🌼 13.శక్తితంత్రం:

రచయిత అగస్త్యముని. ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

🌼 14.సౌధామినీకళ:

రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

🌼 15.మేఘశాస్త్రం:

రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల
పడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

🌼 16.స్థాపత్యవిద్య:

అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం, కుమారస్వామి రచించిన గజశాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి , ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద? వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​ . ఇందులో ఒక్క శాస్త్ర0 కూడా నాకు తెలవదు ,  ఇంతవరకు చదవలేదు, పుస్తకాలు ఉంటె తెలుపగలరు

🌼 ఓం నమః శివాయ
******

ప్రాంజలి ప్రభ కథలు.. భక్తి పాశము..(6)

భక్తి యందు క్రమము, అక్రమము అను రెండు విధానము లున్నవి. క్రమము లేని ఆరాధన పూర్ణభక్తి కాజాలదు. మంత్రహీనత, క్రియాహీనత, భక్తిహీనతలతో ఆరాధించు భక్తులు కోకొల్లలు. వీరు అసంపూర్ణముగనే జీవించు చుందురు. ఇట్టి వారికి శ్రీమాతయే సంకల్ప రూపమున క్రమమును నేర్పును. క్రమమును నేర్చిన భక్తులు క్రమముగ పూర్ణు లగుదురు. భగవద్గీత యందు కూడ ఈ విషయమే తెలుపబడినది.

శాస్త్రము విధించిన  ననుసరించి పూజించు వారికి సాన్నిధ్యము లభించునని, శాస్త్రము నుల్లంఘించు వారికి రజస్సు తమస్సు దోషము లంటి పూర్ణత్వము కలుగదని తెలుపబడినది. ఆరాధనకు సదాచారము, సంప్రదాయబద్ధత ప్రధానము. అవి అవసరము లేదనుట మెట్ట వేదాంతము. చిత్తశుద్ధి కలుగు వరకు విధానము ప్రధానము.

పశుపాశముల నుండి విమోచనము కలిగించునది శ్రీమాత అని అర్థము. తన మూలము తాను తెలియనివాడు పశువు. తాను అను ప్రత్యగాత్మకు మూలము పరమాత్మయే. పరమాత్మయే తానుగ నున్నాడు, ప్రత్యగాత్మగ నున్నాడు. ఈ అభేదస్థితి మరచుట మాయ. దీనినే అవిద్య అందురు. ఈ తెలియక పోవుటయే జీవులను పశువులుగ కోరికల వెంటపడి జీవించునట్లుగ చేయును. తాను వేరు, దైవము వేరు అనుకొనుచు ఉపాసించువారు పశువులని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పుచున్నది.

దైవము లేక తాను లేడు. తాను లేకున్నను దైవ మున్నాడు. దైవము నుండి స్థితి భేదము చెందినవాడే జీవుడు. పిండి నుండి యేర్పడిన రొట్టెవంటి వాడు. పిండిలేని రొట్టె లేదు. కాని రొట్టె వేరు, పిండి వేరుగ గోచరించును. పిండిలో లేని గుణములు రొట్టెకు వచ్చును. అట్లే జీవుడు కూడ గుణములతో కూడినవాడై వేరుగ గోచరించును. ఇది స్థితి భేదమే గాని మూల మొక్కటియే.