*
ఇది పాత తరం స్నేహితులకు అంకితం..............
జారే అరుగుల ధ్యాసే లేదు
పిర్ర పై చిరుగుల ఊసేలేదు
అమ్మ చేతి మురుకులు లేవు
అలసట లేని పరుగులు లేవు
ఎత్తరుగులు మొత్తం పోయే
రచ్చబండలూ మచ్చుకు లేవు
వీధిలో పిల్లల అల్లరి లేదు
తాతలు ఇచ్చే చిల్లర లేదు
ఏడు పెంకులు ఏమైపోయే
ఎద్దు రంకెలు యాడకి పోయె
ఎక్కడా వెదురు తడికెలు లేవు
ఏ తడికకీ భోగి పిడకలు లేవు
కూరలమ్మే సంతలు లేవు
పెరుగులమ్మే ముంతలు లేవు
బువ్వా లాటల విందే లేదు
గవ్వలాటలు ముందే లేదు
కుప్పిగంతులు లేనే లేవు
కళ్ళ గంతలు కానే రావు
డ్రింకు మూతల గోలే లేదు
బచ్చాలాడే ఇచ్చా లేదు
కోతి కొమ్మచ్చి ఏమైపోయే
అవ్వా అప్పచ్చి ముందే పాయె
గూటీ బిళ్ళా గూటికి పోయే
తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె
గచ్చకాయలు మచ్చుకు లేవు
చింత పిక్కలు లెక్కకూ లేవు
ధారగా కారే ముక్కులు లేవు
జోరుగా జారే లాగులు లేవు
కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు
కొండముచ్చుని కెలుకుడు లేదు
బట్టన మురికి అంటక పోయె
మనసుకి మురికి జంటగ చేరె
కాకి ఎంగిలి కరువై పోయే
భుజాన చేతులు బరువై పోయె
అన్ని రంగులూ ఏడకో పోయె
ఉన్న రంగులూ మాసికలాయె
దానికితోడు కరోనా వచ్చె
బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె
బడిగంటల ఊసే లేదు
బడికి పోయే ధ్యాసే లేదు
మూతులన్నీ మాస్కుల పాలు
చేతులన్నీ సబ్బుల పాలు
ఆన్ లైన్ లో పాఠాలాయె
అర్థం కాని చదువులాయె
ప్రశ్నలకు జవాబులుండవు
కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు
ప్రస్తుత బాల్యం వెలవెల పోయె
దానికి మూల్యం ప్రస్తుత మాయే
రేపటి సంగతి దేవుడి కెరుక
నేటి బాలలకు తప్పని చురక
బాలానందం లేని జీవితం
మానవాళికే మాయని మరక.
మన బాల్యం పై ఒక మిత్రుడు పంపిన కవిత..
🙏🙏🙏🙏🙏🙏
మేమే అదృష్టవంతులమ్*!
1960-80 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు.
ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము.
పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత
గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి.
దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.
*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.*
పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.*
దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!
ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.
ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.
మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.
మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట
రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం
ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!
అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.
*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*
*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!
[10/10, 21:01] BCB: ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు !!! కాబట్టి 504 గంటలను 24 గంటలు విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. నేను ఆశ్చర్యపోయాను. దీనిని ధృవీకరించడానికి, నేను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్లో శోధించాను. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని. నేను షాక్ అయ్యాను !!!! ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనము దసరా మరియు దీపావళిని జరుపుకుంటాము.
మీరు నన్ను నమ్మకపోతే, గూగుల్ సెర్చ్ చేయండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడు. మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు గర్వపడండి!
జై శ్రీ రామ్ 🙏🙏🙏
****
మౌనంగానే ఎదగాలి
వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.
అయిదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.
మౌనం మూడు రకాలు. ఒకటి, వాక్మౌనం. వాక్కును నిరోధించడమే వాక్మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. మూడోది కాష్ఠమౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.
మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో పరివర్తన తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వంటి వారెందరో ఉన్నారు.
ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.
రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.
ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.
ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే ‘మౌనం’.
ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!
*****
కృష్ణ’ శబ్దం మనోహరం.!!
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు. కారుణ్యశీలుడు. ఆదర్శ పురుషుడు. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి.
భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగ ధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్త్వాన్ని తెలియచెప్పిన మహనీయుడు. అలాంటి…. శ్రీకృష్ణ మంత్రం బాహ్యశత్రువులను, అంతఃశత్రువులను హరించే శక్తి కలది.
సకల వేదాంతాలందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది. సమస్త సంసార చింతనలను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునకు భక్తి పూర్వకముగా ఒక్కసారి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణుని త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించిన మాత్రానే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే సదానందము లేక సచ్చిదానందమని అర్థం.
కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటివారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. ఓంకారం మొదలు వేదాల వరకూ ‘కృష్ణ’ అనే రెండక్షరాలు సమస్త విఘ్నాలను హరించి మనోభిష్టాలను నెరవేరుస్తున్నాయి. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు.
మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్టశిక్షణ. కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు.
గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో కాళీయమర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం. సాక్షాత్తు శ్రీహరి అంశ అయిన కృష్ణునికి లెక్కలేనన్ని పేర్లు... ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు.
రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి భేదం లేదు. ఈ రెండు అవతారాలు సాక్షాత్తు శ్రీహరి అవతారాలే కావడంవల్లే ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్తు శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే ‘హరేరామ హరేరామ హరే కృష్ణ హరేకృష్ణ’ అంటారు.
ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని కల్గించిన అపురూప దైవం శ్రీకృష్ణ భగవానుడు.
కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు.
వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకొనిపోయే సహజశక్తి ‘కృష్ణ’ శబ్దానికి కలదు. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు ఆయా అక్షరాలకు స్థానాలగు దౌడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువు, శబ్దమూలమున శిరస్సునగల సహస్రార చక్రం వరకూ సహజసిద్ధంగా చేరుకొంటుంది.
అపుడు ‘వాయువు’ను అంటి చలించే స్వభావంగల వనస్సును, యోగప్రక్రియచే వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలువ వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ. మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది.
ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది.✍️
.
*****
ఐకమత్యమే బలం!
ఐకమత్యం లోపించడం అనేది ప్రస్తుతం భారతీయుల్లో కనిపిస్తున్న 'ప్రధాన సమస్య. ఐకమత్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఐకమత్యం కంటే ప్రధానమైన విషయాలు పాత్ర వహిస్తాయి? అనేది కాస్త విచక్షణతో ఆలోచించాల్సిన విషయం. అందుకే పూర్వం కుటుంబంలో ఐకమత్యం బాగా నేర్పేవారు. 'వాడు నీ తమ్ముడురా! వాడిని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటావా! జాగ్రత్త చూసుకోవాలి కదా!' అని తల్లి అనేది. అప్పుడు అ కుర్రాడికి అర్థమయ్యేది. 'అన్నదమ్ములం, ఆక్కాచెల్లెళ్లం ఒక కుటుంబం. అందరం ఐకమత్యంగా ఉండాలి' అని ఈ కుటుంబపరమైన ఐకమత్యం. తరువాత వెంటనే దేశాన్ని చూపించారు. ఐకమత్యం ఉండాల్సింది. కులాల్లోనూ, మతాల్లోనూ, ప్రాంతాల్లోనూ కాదు. ముందు కుటుంబంలో, తరువాత దేశంలో! కుటుంబంలో ఐకమత్యం ఎలా ఉండాలో ధర్మరాజు మాటల ద్వారా నేర్చుకోవచ్చు.
పాండవులు అరణ్యవాసం చేస్తూ, అడవిలో ఆకులు, అలములు తిని జీవిస్తుంటే, అది కూడా వాళ్లకు దొరకడం నచ్చక దుర్యోధనుడు దండయాత్రలాంటి పనిచేశాడు. దానికి 'ఘోషయాత్ర' అని పేరు 'ఘోష' అంటే గొల్లపల్లె. చరిత్రలో దుర్యోదనుడిని మించిన ప్రతినాయకుడు ఉండడు. ధర్మరాజు ఏ నదీ తీరంలోనైతే యజ్ఞం చేస్తున్నాడో, ఆ నదీ తీరానికి అవతలి గట్టున తన మందీమార్బలం, సైన్యంతో మకాం పెట్టాడు దుర్యోధనుడు. జలక్రీడలు, విందులు, చిందుల్లో భాగంగా అక్కడున్న గంధర్వుల సరస్సులో స్నానానికి కౌరవులు దిగారు. అక్కడ కాపలావాళ్లు అభ్యంతరం చెప్పారు. దాంతో యుద్ధం జరిగింది. గందర్వుల సైనికులే కాదు, చిత్రసేనుడనే గంధర్వుడు కూడా వచ్చాడు. గంధర్వుల చేతిలో దుర్యోధనుడి సైన్యం ఓడిపోయింది. దుర్యోధనుణ్ణి రథ స్తంభానికి కట్టేసి లాక్కెళ్లారు. అప్పుడు కౌరవ సైనికులు వచ్చి దుర్యోదనుణ్ణి కాపాడమని పాండవుల కాళ్లు పట్టుకున్నారు. వెంటనే భీమార్జునులను ధర్మరాజు పిలిచి, "మన సోదరుడు దుర్యోధనుడికి ఆపద వచ్చింది. మీరు వెళ్లి కాపాడాలి" అని అన్నాడు. అప్పుడు భీముడు 'కాగల కార్యం గంధర్వులు తీర్చారు' అని అన్నాడు. ఈ సామెత అక్కడి నుంచి వచ్చిందే. మనను ఎన్ని కష్టనష్టాలకు గురిచేశాడు. అటువంటి వాడిపైన దయ ఏందుకు? మేం వెళ్లి రక్షించం' అని భీమార్జునులు అన్నారు. అప్పుడు భీముడిని ఉద్దేశించి ధర్మరాజు ఐకమత్యం అంటే ఏమిటో చెబుతాడు.
పరైః పరిభవేత్ ప్రాప్తే వయం పంచోత్తరం శతం |
పరస్పర విరోధేతు వయం పంచ శతం చ తే ||
ఒక తాత్వికమైన అవగాహన ఉన్న వారు జీవితాన్ని నిష్కల్మషంగా గడుపుతారు. అందుకే ధర్మరాజుని 'యుధిష్ఠిరుడు' అన్నారు. 'మనందరిదీ ఒకటే వంశం. 'పరస్పర విరోధేత్ మనలో మనకే గనక విరోధం వస్తే 'వయం పంచ"... మనం ఐదుగురం. శతంచతే... వాళ్లు వందమంది. అలా కాకుండా బయటి వాడు మనమీదకొస్తే 'పంచోత్తరం శతం' అంటే వాళ్లు వంద మంది, మనం ఐదుగురం. మొత్తం నూటా ఐదుగురం ఉన్నాం. కలిసి ఎదుర్కోవాలి' అని ధర్మరాజు అన్నాడు.
దీన్ని గనుక మనం కుటుంబాలకు అన్వయించుకుంటే కుటుంబపరమైన ఐకమత్యం బాగుంటుంది. తరువాత అన్వయించాల్సింది దేశానికి మనదేశంలో తమిళ, కన్నడ, తెలుగు సోదరులకు ఏమైనా భేదాలొస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. =కత్తులు దూసుకోకూడదు. (అదే పాకిస్తాన్ వాడో, చైనా?వాడో మన మీద దాడిచేస్తే అందరం ఐకమత్యంగా వాడి మీదకు వెళ్లాల్సిందే. మనదేశంలో ఏవైనా లోపాలుంటే మనం మాట్లాడుకోవాలి. మనమే పరిష్కరించుకోవాలి. విదేశాలకు వెళ్లినపుడు వాటి గురించి మాట్లాడకూడదు. కుటుంబమైనా అంతే. దేశమైనా అంతే! ఒక సమర్థుడైన వ్యక్తి ఒక మంచి సంస్థలో ఉంటే అతని వల్ల సంస్థకు ప్రయోజనం. సంస్థ వల్ల అతనికి ప్రయోజనం, సమర్థులైన వారు స్వదేశంలోనే ఉండాలి. అది దేశానికి గౌరవం, వారికి గౌరవం. ఎలా అంటే... శ్రీకృష్ణుడు 'సంజయ రాయబార సందర్భంలో "పాండవులు, కౌరవులు కలిసి ఉండటం అవసరం. వాళ్లకు చెప్పవయ్యా" అంటాడు. 'ఆ అవసరం ఏముంది?' అని సంజయుడు ప్రశ్నించినప్పుడు...'ధృతరా ష్ట్రుడున్ పుత్రులున్ వనముల్... దృతరాష్ట్రుడు ఆయన పుత్రులు మహారణ్యంలాంటివారు 'కుంతీ నందనుల్ సింహముల్... పాండవులు ఐదుగురు సింహాల్లాంటివారు. అయితే సింహంలేని అరణ్యాన్ని జనాలందరూ వచ్చి నాశనం చేస్తారు. అరణ్యంలో సింహం ఉంటే ఒక్కడూ అడుగుపెట్టడు. అరణ్యంలో ఉండకపోతే సింహాలకు కూడా రక్షణ ఉండదు. అలాగే పాండవులు కౌరవులతో కలిసి ఉంటే మంచి సామ్రాజ్యంతో ఉంటారు. కౌరవులు కూడా పాండవులతో కలిసి ఉంటే బలంగా ఉంటారు. ఇద్దరూ బాగుంటారు' అని చెబుతాడు శ్రీకృష్ణుడు. 'ఐకమత్యం మహాబలం' అనడానికి ఇది మంచి ఉదాహరణ.
****
గురుభక్తి
ఉపనిషత్ వాక్యం
గురురేవ పరో ధర్మో గురురేవ పరా గతిః
యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురౌ,
సబ్రహ్మవి త్పరం ప్రేయా దితి వేదానుశాసనమ్ (శాట్యాయనీయోపనిషత్)
'గురువే పరమ ధర్మం. గురువే పరాగతి… ఎవరికి దేవుడిపై, గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు' అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్య్రంతో బాధపడుతూ నైమిశారణ్యంలోని పుష్కర మహాముని దగ్గరికి వెళ్లి సాష్టాంగపడ్డాడు. ఆ బ్రాహ్మణుడికి ముని హనుమత్ మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్వజదత్తుడు రాత్రింబవళ్లు ఆ మంత్రజపం చేశాడు. గురువుపై విశ్వాసం లేక మంత్రసిద్ధి కాలేదు. కొన్నాళ్లకు వ్యాధిపీడితుడైన గాలుడనే వేటగాడు ధ్వజదత్తుడిని కలుసుకున్నాడు. తన బాధలు ఆయనతో చెప్పుకొన్నాడు. అప్పుడు ధ్వజదత్తుడు 'దైవం లేదు. మంత్రం లేదు. పుష్కరుడి నుంచి మాత్రం మంత్రం స్వీకరించకు' అన్నాడు. గాలుడు ఉత్సుకతతో పుష్కర మహర్షి దగ్గరికి వెళ్లి పరిచర్య చేశాడు. అతనిపై సందేహంతో మహర్షి ధ్యానించగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. 'గురుభక్తి ఉంటే సరి. ఉపదేశించవచ్చు' అని ఆజ్ఞ ఇచ్చాడు ఆంజనేయుడు.
మంత్రోపదేశానికి ముందు గాలుడిని పుణ్యతీర్థంలో స్నానం చేసి రమ్మన్నాడు పుష్కర ముని. అప్పుడు గాలుడు 'మీ పాద జలమే పుణ్యతీర్థం' అన్నాడు. గురువు హనుమంతుడిని ధ్యానించి తన పాదజలాన్ని అతనిపై చల్లి ద్వాదశాక్షర మంత్రోపదేశం చేశాడు. గురు సమీపంలోనే గాలుడు 108 సార్లు జపం చేయగానే సిద్ధి లభించింది. భూత భవిష్యత్తులను దర్శించగలిగాడు. గాలుడు ఇంటికి వెళుతూ ధ్వజదత్తుడిని చూశాడు. కానీ, అతను గురునింద చేస్తాడన్న భయంతో మరోదారి ఎంచుకున్నాడు. అది గమనించిన ధ్వజదత్తుడు గాలుడికి అడ్డువచ్చి, అతనిలో అపూర్వ తేజస్సు చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పుష్కరుడి దగ్గరికి వెళ్లి 'గాలుడికి ఎలా సిద్ధి కలిగింది? నాకు ఎందుకు కాలేదు?' అని నిలదీశాడు. అప్పుడు పుష్కరుడు 'నీకు దైవంపైనే గాని గురువుపట్ల నమ్మకం లేనందుకు' అన్నాడు. ధ్వజదత్తుడు పశ్చాత్తాపంతో పుణ్య నదీ తీరానికి వెళ్లి గురువు, దైవంపై సమాన విశ్వాసాన్ని దృఢతరం చేసి 108 సార్లు జపం చేయగానే అతనికి సిద్ధి కలిగింది. ఆంజనేయుడు ఉష్ట్ర వాహనారూఢుడై సువర్చలా సమేతంగా దర్శనమిచ్చాడు. ధ్వజదత్తుడికి అపార సంపదలతోపాటు మోక్షాన్ని కూడా ప్రసాదించాడు.