Thursday 12 November 2020

 


ప్రాంజలి ప్రభ 

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

శ్రీనాథ కవి సార్వభౌముడు: సంక్షిప్త కధ 


శ్రీనాథుడు- రాజసంతో బతకడమెలాగో తెలిపిన కవిసార్వభౌముడు. కష్టాల్ని కూడా సరసంగా స్వీకరించడం తెలిసినవాడు. శ్రీనాథుడు జన్మించింది 1370లో కాల్పట్టణంలో. నేటి కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గరి ఊరు అది. నాటి కొండవీటి రెడ్డి రాజ్యంలోని ప్రాంతమది. తండ్రి మారయ్య. తల్లి భీమాంబిక.

శ్రీనాథుడి చిన్ననాటి మిత్రుడు ఆవచి తిప్పయ్యశెట్టి. ఇతడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి కొడుకు. అతనిది తమిళనాడు లోని కాంచీపురం. తండ్రితో పాటు తెలుగు ప్రాంతాలకు వస్తూండేవాడు. అప్పటికి శ్రీనాఽథుడి వయసు సుమారు 14 ఏళ్లు. ఆ చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే ‘మరుత్తరాట్చరిత్ర’ రచించాడు. ఆ పద్యాల్ని సెట్టికి వినిపిస్తూ ఉండేవాడు. ఇలాంటి బాలసరస్వతిని సంపన్నులకు పరిచయం చేస్తే ఫలం ఉంటుందనుకొన్నాడు సెట్టి. అలా శ్రీనాథుడికి ప్రెగ్గడయ్యను, సింగననూ పరిచయం చేశాడు.

స్నేహాన్ని బంధంగా మలుచుకోవడమెలాగో శ్రీనాథుడికి తెలుసు . అందుకే ‘మరుత్తరాట్చరిత్ర’ని వేమనకి అంకితమిచ్చాడు. కొన్నాళ్లకి ‘పండితారాధ్య చరిత్ర’ రచించి ప్రెగ్గడయ్యకి అంకితమిచ్చాడు.

రోజులు గడిచాయి. శ్రీనాథుడికి నూనుగు మీసాల నూత్న యవ్వనం వచ్చింది. ‘శాలివాహన సప్తశతి’ అనే శృంగార శతకాన్ని రచించి పెదకోమటి వేమారెడ్డికి అంకితమిచ్చాడు. అంతలో కొండవీటికి- వేమారెడ్డి రాజయ్యాడు. మామిడి సింగన మంత్రి అయ్యాడు. నిండు యవ్వనంలో శ్రీనాథుడు ‘శృంగార నైషధం’ రచించి సింగనకి అంకితమిచ్చాడు.

అంతలో ఓ రాచకార్యం శ్రీనాథుడిపై పడింది. రాజమహేంద్రవరం రెడ్డిరాజులతో కొండవీటి ప్రభువులకు యుద్ధ పరిస్థితి నెలకొంది. రాజమండ్రి రాజులకు విజయనగర చక్రవర్తుల అండ ఉండేది. ‘దీన్ని నివారించాలి’- అన్నది కొండవీటి రాజు ఆలోచన. అది అవచి తిప్పయ్యశెట్టికే సాధ్యం. ఎందుకంటే అప్పటికి సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో చక్రవర్తులందరికీ దగ్గరయ్యాడు. మరి తిప్పయ్యను ఒప్పించేదెవరు? - శ్రీనాథుడే!

అలా శ్రీనాథుడు కంచి వెళ్లాడు. అవసరమై వచ్చానంటే చిన్నప్పటి స్నేహితుడు చిన్నబుచ్చుకుంటాడు. అందుకే చూసిపోదామని వచ్చానన్నాడు. ఆనందించాడు సెట్టి. ‘‘అందరికీ అన్నీ అంకితమిచ్చావు. మరి నాకు’’ అని అడిగాడు సెట్టి. నిజానికి కవితలు, కాకరకాయలు రాయడానికి రాలేదు శ్రీనాథుడు. కార్యభారంతో వచ్చాడు. అయినా త్వరత్వరగా ‘హరవిలాసం’ అనే శైవప్రబంధం రచించి సెట్టి చేతుల్లో పెట్టాడు. ఇందుకు బదులుగా రాచకార్యం పూర్తి చేశాడు సెట్టి. విజయగర్వంతో కొండవీడు చేరాడు శ్రీనాథుడు. కృతజ్ఞతగా శ్రీనాథుడికి విద్యాధికార పదవి కట్టబెట్టాడు వేమారెడ్డి. ఈ మహోన్నత పదవిలో శ్రీనాథుడు 18 ఏళ్ల పాటు మహారాజ భోగాలు అనుభవించాడు. రాజుతో వెళ్లని ఊరు లేదు. పొందని అనుభవం లేదు. వర్ణించని అందం లేదు.

అంతలో 1420లో పెదకోమటి వేమారెడ్డి మరణించాడు. శ్రీనాథుడి పరిస్థితి తారుమారైంది. కొన్నేళ్లుగా ఒకే వంశాన్ని నమ్ముకొని, ప్రభువులకు తలలో నాలుకై, కొండవీటి శత్రువులకు తానూ శత్రువై, ఆపై అష్టైశ్వర్యాలు అనుభవించి. కవిరాజై వర్ధిల్లి, కవిపుంగవులకు సింహస్వప్నమై- ఇప్పుడు రాజాశ్రయం కోల్పోయాడు.

పైగా వయసేమో 50 ఏళ్లు. చేసేదిలేక కొండవీడు విడిచి పలనాడుకి పయనమయ్యాడు. పేదరికం తాండవించే ప్రాంతమది. వరి అన్నం లేదు. మంచినీళ్లు లేవు. విలాసాలు లేవు. చెప్పలేనన్ని బాధలు. అయినా ‘పలనాటి వీరచరిత్ర’ అనే అచ్చమైన దేశీకావ్యం రచించాడు.

ఇక రాజమహేంద్రవరం రెడ్డి రాజుల్ని ఆశ్రయించక తప్పలేదు. తాను వెళ్తున్నది శత్రురాజ్యానికి. అక్కడి వారంతా కొత్త. తనను చూస్తే కత్తులు దూస్తారు- కవులైనా, భటులైనా. ఫలించే పరిచయాలు ఉంటే తప్ప రాజదర్శనం జరగదు. అలాంటి హితుడు ఎవరున్నారా అని ఆలోచించాడు. ద్రాక్షారామలోని బెండపూడి అన్నయ అనే సఖుడు గుర్తొచ్చాడు. వెంటనే వెళ్లాడు. కబుర్లాడారు. తనకూ ఓ కావ్యం అంకితమివ్వమని కోరాడు అన్నయ. కాదనలేదు శ్రీనాథుడు. ‘భీమఖండం’ రచించి అన్నయకి అంకితమిచ్చాడు. తెలుగువారి పండగల్ని, పంటల్ని, వంటల్ని, పిండివంటల్ని, తత్త్వాన్ని, మనస్తత్వాల్ని, ఆచారాల్ని, కట్టుబాట్లని పిండారబోశాడు ఈ శైవ కావ్యంలో శ్రీనాథుడు.

ఇందుకు కృతజ్ఞతగా బెండపూడి అన్నయ శ్రీనాథుణ్ణి రాజమండ్రికి తీసుకెళ్లాడు ప్రభుదర్శనం కోసం. కానీ అక్కడి కవులు, శ్రీనాథుణ్ణి అడ్డుకొన్నారు. కాకుల్లా పొడిచారు. చివరకు ఇదే భూమికి అసమాన కీర్తిప్రతిష్ఠలతో తిరిగివస్తానని శపథం చేసి మరీ గోదావరి తీరాన్ని విడిచిపెట్టాడు.

ఇక మిగిలింది విజయనగర చక్రవర్తులు. వారి ప్రాపకం పొందాలంటే మరో చెలికాడు దొరకాలి. దొరికాడు. అతగానే వినుకొండ వల్లభరాయుడు. ఇతడు కడప జిల్లా పులివెందుల తాలూకా మోపూరు అధికారి. శ్రీనాథుడు వచ్చేసరికి ఇతడు ‘క్రీడాభిరామం’ రచిస్తూ ఉన్నాడు. కానీ రససమంచిత కవికాడు వల్లభుడు. అందుకే ఈ రచనని శ్రీనాథుడే చేపట్టి కవిగా వల్లభరాయుడి పేరే పెట్టాడు. ఉబ్బితబ్బిబ్బయ్యాడు వల్లభుడు. ఆ రుణం తీర్చుకొనేందుకు తానే స్వయంగా శ్రీనాథుణ్ణి విజయనగరానికి తీసుకెళ్లాడు.

అయినా విజయనగర ప్రౌఢదేవరాయల దర్శనం త్వరగా లభించలేదు. మళ్లీ కష్టాలు. రాచవీధుల్లో కాళ్లరిగేలా తిరిగాడు. నువ్వులపిండి తిన్నాడు. చల్ల అంబలి తాగాడు. చివరకు రాజు ఎదుట కవితాప్రదర్శనకి అవకాశం దక్కింది. డిండిమభట్టు కంచుఢక్కని పగలగొట్టించి, ‘కవిసార్వభౌమ’ బిరుదు పొందాడు. ప్రౌఢదేవరాయలు- తన ముత్యాలశాలలో సభా మధ్యమున ఉన్నతపీఠంపై శ్రీనాథుణ్ణి కూర్చోబెట్టి, శిరస్సుమీంచి జలధారగా దీనారటంకాల్ని గుమ్మరించి అలా నేలపై పడిన వాటిని కవి,పండితులకు పంచిపెట్టి- కనకాభిషేకం చేశాడు. అలాంటి సత్కారాల మోజుతో అక్కడే ఉండిపోలేదు శ్రీనాథుడు. రాయలసీమ నుంచి తన చూపు తెలంగాణపై వేశాడు. నల్గొండ దగ్గరి రాచకొండ రాజ్యానికి వెళ్లాడు. ఒకప్పుడు పెదకోమటి వేమారెడ్డిని రాచకొండ ప్రభువులు ఓడించి రెడ్డిరాజులు గర్వంగా భావించే కఠారిని తీసుకుపోయారు. ఇప్పుడు శ్రీనాథుడు దాన్ని తిరిగి దక్కించుకొన్నాడు తన పాండిత్య పాటవంతో!

తెలంగాణ నుంచి తిరిగి తన స్వస్థలాలకు బయలుదేరాదు. అసమాన కీర్తిప్రతిష్టలతో ఒకనాడు అవమానించిన రాజమండ్రిలో అడుగుపెట్టాడు. అక్కడి రాజు వీరభద్రారెడ్డి అక్కున చేర్చుకొన్నాడు శ్రీనాధుణ్ణి. ‘కాశీఖండం’ రచించి వీరభద్రారెడ్డికి అంకితమిచ్చాడు శ్రీనాథుడు. ఆ తర్వాత కొన్నాళ్లకి ‘శివరాత్రీమాహాత్మ్యం’ రచించాడు.


అవసానదశలో అష్టకష్టాలు పడ్డాడు శ్రీనాఽథుడు. కావ్యం రాసే ఓపిక లేదు. అంకితం తీసుకొనే రాజులేడు. ఆదరించే నాథుడు లేడు. భోగాలందించే ప్రభువు లేడు. పూటగడిచే పరిస్థితి లేదు. అయినా మరణిస్తూ శ్రీనాథుడు పలికిన మాటలు -‘‘ అదిగో స్వర్గంలోని కవులు కంగారుపడిపోతున్నారు- శ్రీనాధుడు వచ్చేస్తున్నాడని’’.


అదీ సంగతి!

వినుకొండ వల్లభామాత్యుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు, ప్రౌడ దేవరాయలు, సాంపరాయని మైలారురెడ్డి, తెలుగు రాయలు మొదలైన వారి ఆస్థానాలను సందర్శించి తన పాండిత్య ప్రదర్శనతో గౌరవం పొందిన వారు శ్రీనాథుడు.


--(())--


ప్రాంజలి ప్రభ ... అంతర్జాల హాస్యప్రభ (101)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


*డిస్కౌంటు


" ఏమండి ఏమండి 

ఆ గోకుడు ఆపి విషయం చెప్పు 

అసలే కరోనా కాలం భయంగా ఉందండి  

భయమెందుకు నేనునున్నానుగా 

అదేనండి నాకు భయం 

భయం వద్దు విషయం చెప్పు 

ఆ ఎం లేదండి " ఆక్సిజన్ డిస్కోట్  ఇస్తారటండి తీసుకుందామండీ  "

అది ఇప్పుడు దేనికే 

ముందు జాగర్తకండి 

ఎవరికోసమే 

మీకోసమే 

అదిగో మాట్లాడుతుంటే ఆయాసపడుతున్నారు "అసలే కరోనాలో కఱువు కాలం "

ఆ......   ఆ...   ఆ లేదు ఊలేదు  డబ్బులు మూటకట్టి ఎవరికోసం   


--(())--


* .డిస్కౌంటు


"క్వాలిటీ లేకుండా ఈచీర అంతా చిల్లులే అని అడిగింది సుబ్బలక్ష్మి "

అడిగింది షాపు యజమానితొ

ఇంత డిస్కౌంటు ఇచ్చి క్వాలిటీ ఎలా ఉంటుందనుకున్నారు  

అన్నాడు షాపు యజమాని.


--(())--


* .డిస్కౌంటు


సరోజా మావారు మొన్న కొన్న డిస్కౌంటులో చీర కట్టు కొమన్నారే

కట్టుకుంటే ఏమైంది గిరిజ

ఆ చిర కట్టుకున్నాక వాళ్ళంతా ముద్దులతో తడిపెసాడే

ఆ చీర అంత బావుందా

ఆ చీర అంతా చిల్ల్లులే అది చూసి ముద్దులే ముద్దులు           


--(())--

ప్రాంజలి ప్రభ 

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


మహా రాణా ప్రతాప్ *చరిత్రలో ఈ రోజు ?* 


మహా రాణా ప్రతాప్ గురించి మనకేవ్వరికి తెలియదు. కానీ ఒక్క సారి చదవండి.ప్రపంచంలోని చిన్న దేశాల. లో వియత్నాం ఒకటి. విచిత్రంగా ప్రపంచంలోనే అత్యంత బలశాలి అయిన అమెరికా మెడలు వంచింది ఈ చిన్ని దేశం.ఈ రెండు దేశాల నడుమ కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది వియత్నాం. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.విలేకరి: ఇప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలవగలిగారు.?విలేకరి అడిగిన ఆ ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం…” అన్ని దేశాలలోకెల్ల అత్యంత శక్తివంతం అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టుడు అయిన గొప్ప దేశభక్తిగల ఒక భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని వీరోచితగాథల నుండి, అతని జీవితం నుండిప్రేరణ పొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము.విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?విలేఖరి ఇలా అడగగానే వియత్నాం అద్యక్షుడు వెంటనే నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు.” అతడే… రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్”మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళు వీరత్వంతో వెలిగిపోయాయి.అంతే కాదు అతను ఇంకా ఇలా అన్నాడు“ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈప్రపంచాన్నే జయించేవారం.”అని.కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు. అయితే అతని సమాధి మీద ఇలా వ్రాసారు “ఇదిమహారణా ప్రతాప్ యొక్క శిష్యుని సమాధి ” అని .కాల క్రమేణా కొద్ది సంవత్సరాల తర్వాత వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు. ఆ తరువాత ఎర్రకోట,ఇంకా ఇంకా ఇలా చూపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.అప్పుడు ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు.విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికెడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసినభారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికికారణం అడిగాడు….”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడుమహారణా ప్రతాప్ సింహ్ గురించి మరి కొన్ని వివరాలు..అతని పూర్తి పేరు..-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణాప్రతాప్ సింహ్)జన్మదినం-9 మే,1540జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్పుణ్యతిది-29 జనవరి,1597తండ్రి – మహారాణా ఉదయ్ సింహ్ జితల్లి-రాణి జీవత్ కాంవర్ జిరాజ్య సీమా-మేవాడ్శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు)వంశం –సూర్యవంశంరాజవంశం-సిసోడియరాజపుత్రులుధార్మికం-హిందూధర్మంప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దంరాజధాని-ఉదయ్ పూర్శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అతనికి అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.అబ్రహం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి రావాల్సి ఉంది. అతను భారత్ కి బయలుదేరుతూ తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అడిగాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంతవిశ్వాస పాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభ పెట్టినా తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో చదువ వచ్చు.*మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు బరువు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.*డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహా రాణా ప్రతాప్ ని ఒకసారి ” తల దించి నా కాళ్ళ మీద పడితే సగం హిందూస్థాన్ కి రాజుని చేస్తా ” అని ప్రలోభపెట్టాడు.కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా భావించి తిరస్కరించాడు..*హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి* మహారాణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికిగుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.* మహారాణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ల వాళ్ళ ఇళ్లను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వాళ్ల దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను.* హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.* మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్ర వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు* మహారాణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.* హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు.వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపుత్ మరొక పక్క భీల్ ఉంటారు.* రాణా గుర్రం అయిన చేతక్ మహారాణాను 26 అడుగుల కందకం మీద నుంచి దూకి అది దాటిన తరువాత చనిపోయింది.అంతకంటే ముందే దానికి ముందు కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.*చేతక్ ఎంత బలమైనదంటే తన ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది. అది కూడా మహారాణాతో పాటుగా*మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.*శ్రీ మహారాణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల పదును ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన వద్ద ఉంచుకునే వాడు.*మిత్రులారా మహార ణా ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు ,అంతే కాదు అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.*అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంధంలో రాసుకున్నాడు.* అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే.మహారాణా ప్రతాప్ తో పాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట.* రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఒక్కత్తే మొఘలుల 13 ఏనుగులని చంపిందట.అలాగే దాన్ని పట్టుకోవడానికి7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట అని అల్ బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు.*బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగ దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు.ఆ ఏనుగు ఎంత స్వామి భక్తి కలదంటే 18 రోజులవరకు దాణా తినకుండా,నీళ్ళుతాగకుండా తన ప్రాణాలు కోల్పోయింది.తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ ” ఈ ఏనుగుని వంచ లేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతాను “అని అన్నాడట.* మన దేశంలో ఇలాంటి దేశభక్తుల్లో చేతక్,రాంప్రసాద్లాంటి జంతువులు కూడా ఉన్నాయి.Be proud to be INDIAN


--(())--



No comments:

Post a Comment