Thursday 18 May 2023

 


Joyride – Aartique

1🙏🤝మన కర్మలకు 🙏🤝మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు🙏


🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...

🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,

నన్ను ఎవరూ గమనించడం లేదు’

అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .

🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి

నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .

🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .

🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,

🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .

🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .

🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .

🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .

🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .

🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .

🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .

 🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .

🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .

🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .

🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .

కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .

 🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .

 🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .

🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .

 🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋.

🚩🙏🙏🙏🚩🙏



2. 🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...

🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,

నన్ను ఎవరూ గమనించడం లేదు’

అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .

🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి

నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .

🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .

🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,

🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .

🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .

🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .

🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .

🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .

🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .

🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .

 🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .

🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .

🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .

🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .

కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .

 🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .

 🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .

🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .

 🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋.
***
03. పరమ శివుడు ఇదిగో చూడు..... 4

ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే 👉 "నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు" అని ప్రకటించాడు.

రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా, అప్పుడు ఇంద్రుడు "సరే... పరమ శివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే, అప్పుడు వర్షం కురుస్తుంది" అని వరమిచ్చినట్టే ఇచ్చి, వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు డమరుకం వాయించ వద్దని రహస్యంగా శివునికి చెప్పాడు. 

రైతులు పరమ శివుడి దగ్గరకు వెళ్లి ఎంత బతిమాలినా... పన్నెండు సంవత్సరాల తరువాత మాత్రమే డమరుకం వాయిస్తానని చెప్పాడు.

రైతులు ఏమి చేయాలో తెలియక, పన్నెండు సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు. 

కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు వెక్కిరిస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కి దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే వున్నాడు.

మూడు సంవత్సరాల తర్వాత, ఎప్పటి లాగానే ఆ రైతు పంట వేశాడు. మిగిలిన వారు అందరూ కలసి వెళ్లి "వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరియూ శ్రమ వృధా చేస్తున్నావూ" అని అడగ్గా...

దానికి ఆ రైతు "వర్షం లేకుంటే పంట పండదు అని నాకూ తెలుసు, కానీ తీరా పన్నెండు సంవత్సరాల తరువాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మరిచి పోకుండా వుండేటందుకే ఈ పనులు చేస్తున్నాను" అని చెప్పాడు. 

ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి... తమరు డమరుకం వాయించడం మరచి పోలేదు కదా, అన్నది చమత్కారంగా. 
అంతట పరమ శివుడు ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరుకం వాయించాడు.

తక్షణమే వర్షం కురిసింది. దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా... మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది.

కాబట్టి మిత్రులారా...... 

ఈ లాక్ డౌన్ ఎత్తి వేయడానికి వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, లేదా సంవత్సరం పట్టొచ్చు. కానీ మనం ఏ వృత్తి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా దానికి సంబంధించిన విషయాలలో (లాక్ డౌన్ తో సంబంధం లేకుండా) నైపుణ్యాన్నీ మరియూ జ్ఞానాన్నీ పెంచుకునేందుకు  నిరంతర ప్రయత్నం చేయాలి. 

ముగింపు : ఎదురు చూస్తూ సమయం వృథా చేయకుండా... రేపటి రోజున (లాక్ డౌన్ ఎత్తి వేసిన రోజున) ఏమి చేయాలో దానికి సన్నద్ధం కావాలి.

                  ***

"సాధనమున పనులు సమకూరు ధరలోన"

🙏

04.  వృద్ధుల కు  సలహాలు ...5
వృద్ధులు  సలహాను తీవ్రంగా పాటించండి.

🦋 యునైటెడ్ స్టేట్ లో  జరిపిన 
ఒక అధ్యయనం ప్రకారం 51% పైగా వృద్ధులు
 మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారు. ప్రతి సంవత్సరం చాలా మంది అమెరికన్లు మెట్లు ఎక్కేటప్పుడు పడి చనిపోయారు.
                                                                             🦋నిపుణుల రిమైండర్: 60 సంవత్సరాల తరువాత ఈ 10చర్యలకు దూరంగాఉండాలి.
1) మెట్లు ఎక్కవద్దు.మీరు తప్పక ఎక్కితే, మెట్ల కేసు రైలింగ్‌లను గట్టిగా పట్టుకొని ఎక్కండి.
2) మీ తలను వేగంగా తిప్పకండి. కళ్ళు బైర్లు కమ్మి మీరు క్రింద పడిపోవచ్చు, 
3) మీ కాలి బొటనవేలును తాకడానికి మీ శరీరాన్ని వంచవద్దు. మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి.
4) మీ ప్యాంటు ధరించడానికి నిలబడకండి.  
కూర్చుని మీ ప్యాంటు ధరించండి.
5) నిలబడి ఒక్కసారి గా పడుకోకుండా మీ శరీరం యొక్క ఒక వైపు (ఎడమ చేతి వైపు, లేదా కుడి చేతి వైపు) నుండి కూర్చోని పడుకోండి.
6) వ్యాయామానికి ముందు మీ శరీరాన్ని ట్విస్ట్ చేయవద్దు. మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి.
7) వెనుకకు నడవకండి, వెనుకకు పడటం వలన తీవ్రమైన గాయం అవుతుంది.
8) భారీ బరువును ఎత్తడానికి నడుము వంచవద్దు. మీ మోకాళ్ళను వంచి, సగం చతికిలబడినప్పుడు వస్తువును పైకి ఎత్తండి. 
9) మంచం మీద నుండి వేగంగా లేవకండి.  మంచం నుండి లేవడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి. 
10) వాష్‌రూమ్‌లో అధిక శక్తిని ఉపయోగించ వద్దు. ఇది సహజంగా రావనివ్వండి. 

 🤷‍♂️ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి మరియు సానుకూలంగా ఆలోచించాలి.

--(())--
05. కాళిదాసు గర్వభంగం   .......  1   

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.
 మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.
 బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.
 ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.
ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది.
నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...
 ‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు: 
‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?
 పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.*
అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...
 ‘మీరు అసత్య మాడుతున్నారు.
 ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.
వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది. 
అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...
 ‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.
 ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు.
 అయినా ఆ బాలిక కనికరించదు.
 ‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ 
అని అడుగు తుంది. బాలిక.*
 ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు.
 ‘మళ్లీ అసత్య మాడుతున్నారు.
 బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.
 మీరేమో అలిసి పోయారు కదా.
 ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.
 వారే సూర్యచంద్రులు!’
అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.
దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి.. 
‘మాతా నీళ్లు ఇవ్వండి.
 దాహం తో చనిపోయేలా ఉన్నాను..’ 
అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. 
లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...
 ‘మీరెవరో సెలవివ్వండి...
 నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా...
 ‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు.*
 ‘మీరు అసత్యం చెబుతున్నారు.
 ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.
 ఒకటి ధనం, రెండోది యవ్వనం.
 ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది.*
 కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు.*
 కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.
 ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.
ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.
ఓపిక నశించిన కాళిదాసు..
 ‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. 
ఆ అవ్వ నవ్వుతూ...‘
ఇదీ అసత్యమే.
ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.
 ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.

 ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది.
 ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.
ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. _
ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది._

 👉‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!

 కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష అని జలమును అనుగ్రహిస్తుంది
💥🌹🙏 ఓం తత్సత్🙏💥

06. ❤️ సత్య భామ శ్రీకృష్ణునితో ఒకసారి’ స్వామీ ! రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ అని అడిగింది.

💓 ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడుడు “ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?”అన్నాడు.

💞 పక్కనే ఉన్న సుదర్శనుడు (సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా! అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.నాతో సరితూగు వారెవరు స్వామీ ? అన్నాడు.

💝 ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.

💞 దీర్ఘంగా ఆలోచించి..

💕 సత్యా, నువ్వు సీతగా మారిపో…నేను రాముణ్నవుతాను.

💕 గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.

💕 చక్రమా !నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు

💓 ~అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.

❤️ గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు.

💕 హనుమ ఆనందంతో పుల కించిపోతూ ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు.

💞 ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు.

💖 *కానీ.. *

💞 ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.

❤️ ఇంతలో..’హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు.

💞 ’లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా ?’అని అడగ్గా..

హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.ఎన్ని చెప్పినా వినక పోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు.


💖 సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు.

♦️ ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై పడి ‘స్వామీ !మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.

💝 అలా కృష్ణపరమాత్ముడు ముగ్గురిలోనూ మొగ్గతొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలువేమిటో తెలియ చెప్పాడు.

❤️ ॐశ్రీవేంకటేశాయ నమః

*~శ్రీరామ్

07 *స్వర్గానికి రోడ్డు మార్గం

పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.
భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు.... అనడానికి, భూమి మీద ఉన్న ఏకైక మార్గం ఇదే....

   బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం......⬇️

.....🔚🔚🔚భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 🔙🔙🔙

ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది.

ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక, అలకనంద నదితో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కూడా ఉంటుంది.

ఈ సరస్వతి నది పక్కన  భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.

పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.
ఈ రాతిమీద భీమసేనుని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.

ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.

ఇక్కడ  నుండి చట్మోలి 8km......

మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది.

తరవాత "మాతమూర్తి ఆలయం" కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కూడా చెప్తారు.
ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

తర్వాత "కుబేర్ మకుట్ "అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక "వసుధార జలపాతం" వస్తుంది.

ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు.
ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.

ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది.
అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.

చట్మోలి:-

తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం.

పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.

ఇక్కడే "సతోపంత్"  మరియు "భగీరధ్ కర్క్" అనే రెండు నదులు   ( హిమానీనదాలు ) కలిసి "అలకనంద" గా ఏర్పడతాయి.

అక్కడి నుండి ముందుకు వెళితే "ధనో హిమానీనదం" కు చేరుకుంటాం. 

చట్మోలి నుండి లక్ష్మివన్ 1km ( 12600 అ ఎత్తు లో ).........

తర్వాత లక్ష్మి వన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. 

ఇక్కడే లక్ష్మి మాత మరియూ విష్ణు భగవానుడు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు.

ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది అని  చెప్తారు.   

ఇక్కడి నుండి 2km ప్రయాణించాక  బంధర్ అనే ప్రాంతం కు చేరుకుంటాం. 

ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు.

బంధర్ నుండి సహస్రధార 4km ( 14000 అఎత్తులో).........

సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km (15000 అ ఎత్తులో)........

చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సు గా చెప్తారు.

ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు.

చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km........

ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు.
ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే  సరస్సు.

ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని చెప్తారు.

ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.
ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్  నుండి స్వర్గారోహిణి 8 km......

ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సహం గాను చెప్తారు.

మార్గ మధ్యం లో చంద్రకుండ్ మరియూ సూర్యకుండ్ అనే సరస్సులు...భట్టాచార్య... ఉంటాయి.

ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే, కుక్క తోడు రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు. 

నిజానికి స్వర్గారోహిణి అనేది  6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది.
ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి  చెందినది. 
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది. 

ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే  మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి  పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.

    "స్వర్గారోహిణి పర్వత సమూహాలు" అన్నవి అతి పురాతనమైన పర్వత సమూహాలు. ఇవి గర్వాల్ హిమాలయాల లోని సరస్వతి హిమ శ్రేణులలో కలవు. నేటి "ఉత్తరాఖండ్" రాష్ట్రం లో గల "ఉత్తర కాశీ" జిల్లాలో కలవు. ఇవన్నీ మరల గంగోత్రి హిమ శిఖరాలు. ఇవి మరల నాలుగు శిఖరాలు. 1. స్వర్గారోహిణి - 1 అన్నది ప్రధాన శిఖరం.

    ఈ పర్వతం సముద్ర మట్టానికి 6,247 మీటర్ల ఎత్తులో కలదు.

     "స్వర్గారోహణ"....అన్న పదం, మన ఇతిహాసమైన "మహాభారతం" నుండి వచ్చింది. "స్వర్గారోహణ పర్వం"....మహాభారతమందలి పర్వాలలో ఒకటి కదా! మహాభారతంలో....చివరి అంకంలో ధర్మరాజాదులు, తమ రాజ్యాన్ని వదలి స్వర్గం వైపు ప్రయాణం కడతారు. ఈ "స్వర్గారోహిణి" పర్వతాలు, స్వర్గానికి నిచ్చెనలాంటివి అని పురాణ కథనం. కానీ పాండవాగ్రజుడైన, ధర్మ రాజు మాత్రమే స్వర్గాన్ని చేరుకుంటాడు. హిందూ ఐతిహ్యాల ప్రకారం........ఈ స్వర్గారోహిణి పర్వతాలే, స్వర్గానికి సశరీరంగా వెళ్ళడానికి మార్గంగా ఉన్నాయని, ఐతిహ్యాలు చెబుతున్నాయి. ఇందులోని మార్మికత ఏమిటో?

భట్టాచార్య



No comments:

Post a Comment