Monday 22 June 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 1  / Sri Gajanan Maharaj Life History - 1 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
🌻. ప్రార్ధన - 1 🌻

శ్రీగణేశాయనమః ! 

శ్రీగణేశా, నీవు కరుణకు, వీరత్వానికి ప్రసిద్దుడివి. ఓ గౌరీపుత్రా మహామేధావులు, ప్రసిద్ధులు అందరూ కూడా ప్రతి పని ప్రారంభించేముందు నిన్ను స్మరిస్తారు. అన్ని విఘ్నాలు కూడా, నీ బలీయమైన ఆశీశులతో అగ్ని ముందు దూదిలా దూరమయి పోతాయి.

 అటువంటి ఆశీశ్శులే నాకు ఇచ్చి నేను అతి కమనీయమైన, శ్రేష్ఠమయిన కవితను చెప్ప గలిగేట్టు చెయ్యమని మీ పాదాలకు విమ్రతతో మొక్కుతున్నాను. ఏవిధమయిన కవిత్వం చెప్పేగుణాలు లేని, తెలివిలేని, బుద్ధి హీనుడను, అయినా మీఆశీర్వాదాలు ఉంటే కవిత రాసేపని తప్పక అవుతుంది. 

బ్రహ్మ నుండి ఉద్భవించిన మరియు కవులకు ప్రేరణ కలిగించే ఆదిమాయా సరస్వతి శారద కు ఇప్పుడు నానమస్సులు. నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టమని ఇప్పుడు జగదంబకు నానమస్సులు. ఈమె ఆశీర్వచనాలు ఎంత గొప్పవంటే వాటితో ఒక అవిటివాడుకూడా మేరుపర్వతం ఎక్కగలుగుతాడు మరియు ఒక అల్పబుద్ధివాడు కూడా మంచివక్త అవుతాడు. 

ఆ నమ్మకంతోనే ఈ శ్రీగజానన్ గ్రంధ వ్రాయడంలో దాసగణుకు సహకరించమని ప్రార్ధిస్తున్నాను. పండరిపురం పురాణపురుషుడయిన పాండురంగను తన కరుణావీక్షణాలు నాయందు ఉంచమని వేడుకుంటున్నాను.

ప్రతి చిన్నబిందువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతి దానిలో నిండిఉంటూ, ఈ విశ్వానికి నీవే ఆధారం. ప్రతి వస్తువు నీవల్లే ఉద్భవిస్తుంది, వాటి కదలికలు నీవే నిర్దేశిస్తావు. 

ఈప్రపంచము నీవే, ఇందులోని జీవ,నిర్జీవులు నీవే, తుది శక్తివీనీవే. సగుణ, నిర్గుణ, నాతండ్రి మరియు తల్లి నీవే. ఓ పురుషోత్తమా నీవెంత గొప్పవాడిఓ వర్నించడానికి నేను చాలాసూక్ష్మజీవిని. శ్రీరాముని ఆశీర్వాదాలతో కోతుల బలం పెరిగింది. గోకులం గొల్లపిల్లల విషయంలో అదేజరిగింది. 

మీ సహాయం పొందడానికి ధనం అవసరంలేదు, కానీ పూర్తిగా మీకే అర్పితమయిపోవాలి, అని ఋషులు కూడా చెప్పారు. నేను ఈకారణం వల్లనే మీద్వారం ముందుకు వచ్చాను. నన్ను నిరాశ పరచవద్దు అని ప్రార్ధిస్తున్నాను. ఓ పండరిపురి పాండురంగా మీరు నాలో పీఠం వేసుకొని ఈప్రఖ్యాత యోగి జీవితచరిత్ర వ్రాసేందుకు నాకు సహకరించండి. 

ఓభవానీవరా, నీలకంఠా, గంగాధరా, ఓంకారరూపా, త్రయంబకేశ్వరా నన్ను ఆశీర్వదించు. స్పర్శవేదమణి ఇనుముని బంగారంగా మారుస్తుంది, అదేవిధంగా నీకృప స్పర్శవేదమణ లాంటిది నేను ఇనుముని. దయతో సహకరించి నన్ను నిరాశపరచకు. నీకు అసంభవమయినది ఏదిలేదు, అందుకే ఇప్పుడు ఇంక ప్రతీది నీచేతులో ఉంది. దయచేసి త్వరగా వచ్చి మీఈసంతానం చేత ఈపుస్తకాన్ని రూపు దిద్దేందుకు సహకరించండి.
అన్ని శుభంగాజరిగేటట్టు ఆశీర్వదించమని కొల్హాపూర్లో ఉండే మా కులదేవతను వేడుకుంటూ ప్రార్ధిస్తున్నాను. 

తుల్జాపూర్ వాసి అయిన ఓ దుర్గామాతా, భవానీ మీ ఆశీర్వచనాలు నాశిరస్సుపై ఉంచమని వేడుకుంటున్నాను. శ్రీగజానన్ గొప్పతనాన్ని వర్ణించి పాడేందుకు స్ఫూర్తి కలిగించమని శ్రీదత్తాత్రేయుడుని వేడుకుంటూ మొక్కుకుంటున్నాను.

 మునీశ్వరులయిన శ్రీశాండిల్య, శ్రీవశిష్ఠ, శ్రీగౌతమ, శ్రీపరాసర మరియు
శ్రీశంకరాచార్యులకు నా వందనములు. నాచెయ్యి పట్టుకుని, నాచే ఈగ్రంధం పూర్తిచేయించవలసిందిగా అందరు మునులను, ఋషులను ప్రార్ధిస్తున్నాను. 

ఈజీవన వాహినిలో శ్రీగహిని, శ్రీనివృత్తి, శ్రీధ్యాణేశ్వర్, శ్రీతుకారాం ఓడ లాంటివారు వీరికి నా నమస్కారములు. ఓ షిరిడి సాయిబాబా మరియు వామనశా శ్రీ (దాసగణు కి గురువు) కరుణించి నన్ను పిరికి తనంనుండి ముక్తున్ని చెయ్యండి. 

మీ అందరి కృపాదృష్టివలనే నేను ఈగ్రంధం పూర్తిచేయగలను. కావున నన్ను కరుణించండి. పిల్లమీద ఉన్న ఏవిధమయిన సహజ ప్రేమవల్ల తల్లి మాట్లాడడం నేర్పిస్తుందో అదేవిధమయిన సంబంధం మీది నాది. 

కలం అక్షరాలు వ్రాస్తుంది, కాని అది కలం గొప్పతనంకాదు, వ్రాసేందుకు కలం ఓక ఉపకరణం మాత్రమే. అదేవిధంగా దాసగణు ఒక కలం, మునులందరినీ ఈకలం చేపట్టి ఈజీవతచరిత్రను అతిశ్రవణానంద కరంగా వ్రాయించమని ప్రార్ధిస్తునన్నాను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 3  /   Sri Gajanan Maharaj Life History - 3 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
🌻. పరిచయం - 2 🌻

పండరపూర్ లో రామచంద్రపాటిల్ నన్ను కలసి, శ్రీగజానన్ మహారాజ్ జీవితచరిత్ర వ్రాయమని కోరినరోజు కార్తీక ఏకాదశి. చాలారోజులుగా నాకు శ్రీగజానన్ స్తుతి చెయ్యాలని కోరిక ఉన్నప్పటికీ అవకాశం దొరకలేదు. 

నాకోరిక శ్రీమహారాజ్ కు అర్ధం అయింది అందువల్ల శ్రీరామచంద్రపాటిల్ ను నాకోరిక పూర్తి అయ్యేందుకు కారణభూతుడ్ని చేసారు. యోగులలో మాణిక్యంలాంటి శ్రీగజానన్ మహారాజ్ వంటి యొగుల కదలికలు ఎవరు తెలుసుకోలేరు.

 బ్రహ్మ ఎట్లా ఉద్భవించింది ఎలా అయితే ఎవరికి తెలియదో, అదేవిధంగా చారిత్రకంగా ఈయన జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఏఘనినుండి వచ్చింది అని ఆలోచించకుండా వజ్రాన్ని మెచ్చుకుంటామో, అదేవధంగా ఈయన తేజస్సును స్థుతించాలి. 

18వ శతాబ్దంలో మాఘ బహుళ సప్తమి రోజున శ్రీగజానన్ మహారాజ్ షేగాం లో ప్రకటించారు.

 శ్రీరామదాసస్వామి స్థలమయిన సజ్జన్ఘడ్ నుండి వచ్చారని కొందరు అంటారు. ఈ విషయం నమ్మడానికి సరిఅయిన దాఖలా లేకపోయినా కొంతవరకు అర్ధంఉంది. భ్రష్టాచారం, దరిద్రం బాగా వ్యాపించి ఉండడంవల్ల శ్రీరామదాస్ స్వామి, శ్రీగజానన్ మహారాజ్ రూపంలో పునర్జన్మ తీసుకుని ఉండవచ్చు. 

యోగులు ఎవరి లోనయినా ప్రవేశించగలరు. ఇంతకు ముందుకూడా అనేకమంది యోగులు ఈవిధంగా చేస్తారు. సాధారణ మనుష్య జన్మలా కాకుండా, గోరఖ్ చెత్తకుండీనుండి, కనీఫా ఏనుగు చెవినుండి మరియు చాంగ్డియొ నారాయణదోహ నుండి ఉద్భవించారు. 

యోగులలో రాజయిన శ్రీగజానన్ మహారాజ్ విషయంకూడా అలానే అయి ఉండవచ్చు. ఇకముందు ఈయన చేష్టలనుబట్టి శ్రీమహారాజుకు యోగ గూర్చిన క్షుణ్ణ అవగాహన ఉన్నట్టు తెలుస్తుంది. యోగకు మరి దేనితోను పోల్చలేని అనూహ్యమయిన ప్రత్యేకత ఉంది.

 పాపులను ఉద్ధరించడానికి శ్రీగజానన్ మాఘ బహుళ సప్తమినాడు ప్రగటించారు. షేగాంలో దేవీదాస్ పాటుర్కర్ అనే బ్రాహ్మణుడు తన కుమారుని ఋతుశాంతి విధి కారణంగా తన స్నేహితులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాడు. ఎంగిలిఅకులు మిగిలి పోయిన తినుబండారాలతో సహాఇంటి బయట పారవేసారు. ఆచోట శ్రీగజానన్ మహారాజ్ కూర్చుని ఉండగా చూడడం తటస్థించింది. అతని శరీరంపై జీర్నావస్థలో ఉన్నచొక్కా, 

నీరు త్రాగడానికి ఒక కమండలం మరియు పొగత్రాగడానికి ఒక మట్టితో తయారుచేసిన గొట్టం తప్ప మరిఇంక ఏమీలేవు. ఉదయించే సూర్యుని తేజస్సు కల శరీరం, నాశికాగ్రంపై కేంద్రీకృతమయిన కళ్ళు అతని యోగికశక్తిని తెలియ పరుస్తున్నాయి. ఆవిధంగా పారవేసిన ఎంగిలి ఆకులనుండి మిగిలిన మెతుకులను రోడ్డు ప్రక్కన కూర్చుని అతను తీసుకుంటున్నాడు. సాధారణమానవునికి, ఈఅన్నమే బ్రహ్మ అని సూచించటమే అతని ఈచర్యకి కారణం. సూక్తులు, ఉపనిషత్తులు కూడా ఈవిషయమే చెపుతాయి.

 బనకటలాల్ అగర్ వాల్ మరియు దామోదర్ పంత్ అతని ఈవిధమయిన ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు. 

నిజంగా ఆకలి వేసిఉంటే ఇతను పాటుర్కర్ లాంటిమంచి బ్రాహ్మణున్ని అర్జించి ఉంటే వెంటనే భోజనం పెట్టి ఉండేవాడుకదా అని వీరిద్దరు అనుకున్నారు. బనకట్ తన స్నేహితునితో అతని ఇకముందు కదలికలు చూద్దాము అని అన్నాడు. 

నిజమయిన యోగులు ఒక్కోసారి పిచ్చివారిగా ప్రవర్తిస్తారని వ్యాసుడు భాగవతంలో అన్నాడు. ఇతని విషయం కుడా అలాంటిదే కావచ్చు. అనేకమంది ఆదారినుండి వెళ్ళారు కానీ వీరద్దరే ఈవ్యక్తిని పరిశీలించేందుకు ఆకర్షితులయ్యారు. 

తెలివయిన మరియు ప్రజ్ఞావంతులు మాత్రమే గుళకరాళ్ళలోని వజ్రాన్ని వెతకగలరు. ఆ రోడ్డు మీద పడిన అన్నం ఎందుకు తింటున్నావు అని అడుగుతూ నేను మంచి భోజనం పెడతాను అని అతనితో బనకటలాల్ అంటాడు. దానికి సమాధానంగా శ్రీగజానన్ కేవలం వారివైపుచూస్తాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 3 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
🌻. Introduction - 2 🌻

It was Kartik Ekadashi day when Ramchandra Patil met me at Pandharpur and requested me to write the biography of Shri Gajanan Maharaj. It was in fact my long cherished desire to sing in praise of Shri Gajanan, but was not getting the opportunity. 

Shri Gajanan Maharaj seemed to have understood my wish and so made Ramchandra Patil a tool for the fulfilment of that desire. Nobody can know the designs of great saints like Shri Gajanan Maharaj who was a gem amongst the saints. 

Historically, nothing is known about His caste, creed or place of origin, like Brahma whose origin nobody knows. Like a brilliant diamond we should only appreciate its brilliance and not bother about the mine of its origin. 

Shri Gajanan Maharaj appeared at Shegaon on 7th Vadya Magh of 1800 Saka. Some say that he came from Sajjangad the place of Shri Ramdas Swami. Though there is no sufficient proof to accept this fact, it may have some sense in it. 

There was wide spread corruption and misery and it is possible that Shri Ramdas Swami, for the good of the people, took rebirth as Gajanan Maharaj. 

Yogis can enter anybody and many saints have done so in the past. Gorakh was born in dustbin, Kanifa in the ear of elephant and Changdeo in the Narayan Doha: all unlike the traditional human birth. 

Same may be the case of Shri Gajanan Maharaj - the king of Yogis. It will be seen from His actions that Shri Gajanan Maharaj had detailed knowledge of all yogic feats. Yoga has got a unique importance incomparable with anything else. 

Shri Gajanan appeared in Shegaon on 7th Vadya Magh for the spiritual liberation of the sinners. It so happened that there was one pious Brahmin named Devidas Paturkar at Shegaon and, to celebrate the puberty function of his son, he had arranged a lunch for his friends. 

The leftover food from the plates was thrown outside the house and Shri Gajanan Maharaj was seen sitting near that food. He had a worn out old shirt on His body, a dry gourd for drinking water, a pipe of clay for smoking and nothing else. 

His body was lustrous like the rising sun and eyes with concentrated at the tip of nose indicative of His yogic strength. Sitting by the roadside He was picking up particles of food thrown there. 

His action of picking up the food particles from the leaf plates lying on road was to convey to the common man that food is Brahma. Shruti and Upanishad say the same thing. 

Bankatlal Agrawal and Damodar Pant, who were passing by, were surprised to see His behaviour. They thought that had this man been really hungry, He would have begged for food and Shri Paturkar, being a pious man, would have given the food to Him.

Thinking thus, Bankatlal said to his friend, Let us watch His actions. Vyas has said in Bhagawat that real saints, many a times, behave like mad men, and this can be a case like that.” 

Thousands of people must have passed that way but only these two persons were attracted to observe Maharaj. Only wise men and experts can detect a diamond lying in the heap of pebbles. 

Bankatlal asked Him as to why He was eating the food lying on the road and volunteered to serve good food. In reply Shri Gajanan simply looked at them.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 5  / Sri Gajanan Maharaj Life History - 5  🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః 

చంద్రభాగ నదీతీరమున నివసించే భగవంతులకు భగవంతుడవు, పేదలపెన్నిధివి, రుక్మిణివరా నన్ను దయతో చూడు. 

ఓ భగవంతుడా నీకృప లేనిదే ప్రతీది వ్యర్ధం. జీవంలేని శరీరాన్ని ఎవరూ లక్ష్యపెట్టరు. చెరువులో నీళ్ళు ఉంటేనే దానికి అందం. పళ్ళలో ఉండే రసం వల్లనే వాటి తొక్కలకు కూడా ప్రాధన్యత వస్తుంది. మీఆశీస్సులు కూడా అటువంటి పండ్లరసం వంటివే. 

నామొర దయచేసి ఆలకించి, నాపాపాలను, విపత్తులను, దారిద్రమును దూరంచెయ్యండి. ఇంతకుముందు అధ్యాయములో శ్రీగజానన్ బనకటలాల్ను ఒక్కసారిగా వదలి వెళ్ళిపోవడం మనం చూసాము. అప్పటినుండి శ్రీగజానన్ను మరల చూసేందుకు బనకటలాల్ అతిఆకాంక్ష పడుతున్నాడు. 

తల్లికోసం దూడలాగ అతను ప్రపంచక విషయాలయిన తిండి నీరు కూడా మర్చిపోయి శ్రీగజానన్ గూర్చే నిరంతరం ఆలోచిస్తు ఉన్నాడు. ఈతను తన మానసికస్థితిని ఎవరితోనూ, తన తండ్రితోకూడా పంచుకోలేక పోయాడు. అతను షేగాం అంతా వెతికినా శ్రీగజానన్ ను కనుక్కోలేకపోయాడు. 

కానీ అతని తండ్రి తన యవ్వనకుమారుని ముఖంమీద కనిపిస్తున్న ఆతృత, నిస్పృహ గమనిస్థాడు. అతని ఈవిషయానికి కారణం అడుగుతాడు. ఎందుకంటే భగవంతుని ఆశీర్వచనాలతో జీవితంలో సుఖంగా ఉండేందుకు కావలసిన అన్ని వస్తువులు వారికి సమృద్ధిగా ఉన్నాయి. 

దానికి బనకటలాల్ సమాధానం చెప్పలేదు మరియు శ్రీగజానన్ గురించి వెతుకుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు తన ఇరుగు పొరుగున ఉండే శ్రీరామాజిపంత్ దేష్ముఖ్ అనే భక్తిగల వృద్ధుడికి శ్రీగజానన్ గూర్చి, అతనిని వెతకడం గూర్చి అన్నివిషయాలూ బనకటలాల్ చెపుతాడు. 

అవన్నీ బనకటరాల్ నుండి విన్న రాజీపంత్ అతను ఒక గొప్పయోగి అని, అటువంటియోగులను కలుసుకోవడం పూర్వజన్మలోని పుణ్యకార్యాల వల్లనే సంభవం అవుతుంది అని అంటాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 5 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 1 🌻

 Shri Ganeshayanamah! 

O lord of Rukmini residing on the bank of Chandrabhaga (river), God of Gods, Friend of the poor, kindly look at me. O God! Everything is futile without Your favour. 

No one cares for a lifeless body. Beauty of a lake is due to the water in it. Juicy core of a fruit gives importance to its husk. Same is the case with Your blessings. 

Kindly oblige me by removing all my sins, woes and poverty. In the last chapter we have seen that Shri Gajanan suddenly left Bankatlal and went away. 

Since then Shri Bankatlal was craving to see Shri Gajanan again. Forgetting all worldly things like food and water he was constantly thinking of Shri Gajanan only, like a calf for its mother. 

But he could not share his mental condition with anybody not even with his father. His search continued throughout Shegaon but could not find Shri Gajanan.

 His father however, noticed the anxiety and despair written large on the face of his young son. He asked him the reason for his unhappiness especially because God had blessed them abundantly with every thing required for a happy life. 

Bankatlal did not reply and continued his search for Shri Gajanan. At last Bankatlal told everything about Shri Gajanan and his search for Him to a neighbour Ramajipant Deshmukh, a pious old man. 

Hearing the details from Bankatlal, Ramajipant noted that He must be some yogi, and meeting with such yogis is possible only if one has to his credit a lot of good deed from the previous birth.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Gajanan Maharaj Life History - 1 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
🌻. Prayer - 1 🌻

 Shri Ganeshayanmah! 

Shri Ganesha, You are famous for your generosity and valour. O Gouriputra, all intellectuals and saints first remember you before starting any work. 

With your powerful Blessings all obstructions are just like cotton before fire. So I solemnly bow at your feet and invoke your blessings to bring out the best and the sweetest poetic recitation of my narration. 

I am ignorant, dull and have no qualities of a poet. But if you bless me, my work will be done. Now I give my obeisance to Adi Maya Saraswati-Sharada, who is born of Brahma and who is a great inspiration to the poets. 

Next I pay my obeisance to Jagadamba, to whom I pray for upholding my self-respect. Her blessings are so great that with her Ashis even a lame can climb a mountain and a dumb become a good orator. 

In keeping with that reputation kindly help Dasganu to write this book of Shri Gajanan. Now I beseech the Puran Purush Panduranga of Pandharpur to have an obliging glance at me.

You are the sole supporter of this universe and occupy every animate and inanimate object in it. You are the creator of everything, omnipotent and command all the actions in the universe. You are this world, the life in this world and also the ultimate power. 

You are Saguna, Nirguna, my father and also my mother. O Purushottama! You are so great that I am too small to comprehend You. Shri Rama blessed the monkeys who thereafter gained enormous strength. 

Same thing happened with the cowherd boys of Gokula. Saints have said that money is not required to receive Your favour, but a complete surrender at Your feet earns us Your support. That is why I have come to Your door. Please do not disappoint me. O Panduranga of Pandharpur, kindly help me write this great saint's biography, by residing in me. 

O Bhavanivara, Nilkantha, Gangadhara, Onkarrupa, Trimbakeshwara bless me. Paras changes iron into gold. Now Your favour is Paras and I am iron. Kindly help and do not disappoint me. Nothing is impossible for You since every thing is in Your hands. Kindly come quickly and help this child of Yours compose this book. Now I pay my obeisance to my family Deity who resides at Kolhapur. I beseech Her to bless me with everything auspicious. 

O Durgamata Bhavani of Tuljapur, I invoke Your blessings by having your hand on my head. Then I pay my obeisance to Lord Dattatraya and request Him for inspiration to sing in praise of Gajanan. Now I bow to the Saints of Saints Shri Shandilya, Shri Vashishta, Shri Goutam, Shri Parashar and Shri Shankaracharya the sun in the sky of wisdom. My obeisance to all the saints and sages who should, by holding my hand, get this writing done. 

Shri Gahani, Nivrutti, Shri Dyaneshwar, Shri Tukaram and Ramdas are dependable ships in the ocean of life. I bow to them. O Saibaba of Shirdi and Waman Shastri (Shri Dasganu's Guru) kindly free me of all fears. 

By the kind grace of You all only, I shall be able to write this book. So be kind to me. Only the real affection can teach a child to speak; and I share a relationship with you like that of a child with the mother. Pen writes letters, but receives no credit for writing them. 

A pen is only a means for writing; Dasganu is a pen and I beseech all the saints to hold it to write and make this biography melodious.

Continues.. 

🌹 🌹 🌹 🌹 🌹




ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:  ...... 5 
సుందరాకాండఎందరో మహానుభావులకు వినయపూర్వకముగా మనవి చేస్తున్నాను రామాయణ మాహా కావ్యాన్ని ఎందరో మహాను బావులు రచించారు నేను నాకున్న పరిజ్ఞానముతో అచ్చు తెలుగులో గద్యభాగముగా 2012     నుండి వ్రాసిన సుందరకాండను పొందు పర్చ దలిచాను ప్రతిఒక్కరుచదివి కనీసం ఒక్కరికి చదవమని చెప్పండి  సీతా రామ పఠాభిషేక  పటమును, రామభక్త జ్ఞాన స్వరూప ఆంజనేయ స్వామి పటమును,  పూజామందిరమున ఉంచి  చేయగలరని ఆశిస్తున్నాను  నా నా వ్రాతలలో ఏమైనా తప్పులుదొర్లిన క్షమించగలరు  ఆ పరమాత్ముని సంకల్పమని భావిస్తూ పొందు పరుస్తున్నాను .     

 ఆదికవి వాల్మీకి రచన  ఆధారముగా వ్రాయుటకు సంకల్పించినాను  నేను వ్రాయలేదు నేను  ఆరాధించే హనుమంతుడే వ్రాయించాడని అనుకుంటున్నాను. 
శ్రీ సీతారామాంజనేయ నమో నమ:

ముందుగా క్లుప్తముగా 

సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు) గా విభజింప బడింది.
                                                                                    ......... 6 


* అద్భుతాల మహాక్షేత్రం! - పూరి జగన్నాథం
* స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్
* అన్నమయ్య సంకీర్తన
 శంకర విజయము 
*  శ్రీరమణీయం
*  "అమర చైతన్యం" 
*  "ఋభుగీత "(32)
🌞🌎🌙🌟🚩


* అద్భుతాల మహాక్షేత్రం! - పూరి జగన్నాథం
- సామవేదం షణ్ముఖశర్మ

పూరీ జగన్నాథ మహాక్షేత్రం ఒక పుణ్య స్థలం, విశ్వాస కేంద్రమే కాదు- అత్యంత ప్రాచీన చారిత్రక ప్రశస్తి కలిగిన వైభవ భూమి.
ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో, ఈసారి రథయాత్రను నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ- నిన్న కీలక నిర్ణయం వెలువడింది. తగిన నియమనిబంధనలతో రథయాత్ర జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలపడం అసంఖ్యాకులకు ఆనందదాయకం.

సముద్రతీరంలో శ్రీ జగన్నాథ బలభద్ర సుభద్రామూర్తుల భవ్య మందిరం నీలాచలమనే చిన్న కొండపై నెలకొని ఉంది. నీల మాధవుడిగా నారాయణుడు అనాదిగా ఇక్కడ వేంచేసి ఉన్నాడని స్కాందాది పురాణాల కథనం.

ఒకే నారాయణ స్వరూపం నాలుగు మూర్తులుగా వ్యక్తమైందని స్కాందపురాణ ‘పురుషోత్తమ ఖండం’ చెబుతోంది. దారు(కర్ర)వులతో ఏర్పడిన మూర్తులు గల ప్రసిద్ధక్షేత్రం ఇదొక్కటే. ఎన్నో ప్రత్యేక లక్షణాలు కలిగిన ఈ ఆలయ విధులన్నీ విలక్షణమైన ఆగమాలను అనుసరించి నిర్వహిస్తుంటారు.

జగన్నాథమూర్తి యందు పురుష సూక్త మంత్రాలతోపాటు శ్రీ నృసింహ అనుష్టుప్‌ మంత్రశక్తిని బ్రహ్మ ప్రతిష్ఠించాడని వ్యాసుడి వచనం. వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రంతో బలభద్రుడు ప్రతిష్ఠితుడయ్యాడని, దేవీ సూక్తులతో సుభద్రాదేవి స్థాపితమైందని పురాణం వివరించింది. ఈ ముగ్గురితోపాటు సుదర్శన మహామంత్రాలతో ప్రతిష్ఠ పొందిన సుదర్శనదేవుడి మూర్తి కూడా గర్భగృహంలో కొలువై ఉంటుంది.
పురుషోత్తమ క్షేత్రంగా పురాణ ఋషులు చెప్పిన ఈ క్షేత్రంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. పన్నెండేళ్లకోసారి విగ్రహాలను మార్చే ప్రక్రియే అద్భుతంగాను, మార్మికంగాను ఉంటుంది. ఏ క్షేత్రంలోనూ లేని ప్రత్యేకత ఇది.

అదే విధంగా ప్రసాద మహిమ మరొక వైశిష్ట్యం. ఇక్కడి అన్నం, శాకపాకాలు- అత్యంత పవిత్రమైనవి, మహిమ కలవని అనాది విశ్వాసాచారం.
ఆదిశంకరులు, జయదేవుడు, చైతన్య మహాప్రభువు వంటి మహాత్ములు ఈ క్షేత్రంలో స్వామిని తనివితీరా సేవించుకున్నారు. శంకరుడు భారతదేశపు తూర్పు పీఠాన్ని ఈ క్షేత్రంలో నెలకొల్పారు. ఇది ఋగ్వేద పీఠం. కృష్ణభక్తి సంప్రదాయ ప్రవర్తకుడు శ్రీ చైతన్య మహాప్రభువు ఈ క్షేత్రంలోనే స్వామి దర్శన తాదాత్మ్యంలో లీనమై సిద్ధిని పొందారు.
వైశాఖ శుక్ల అష్టమినాడు పుష్యయోగంతో కూడిన గురువారం నాడు ఈ దేవతామూర్తుల ప్రతిష్ఠ జరిగిందని స్కాందం చెబుతోంది. రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియనుంచి పదిరోజులు జరిగే బ్రహ్మాండమైన మహోత్సవం.

నందిఘోష అనే జగన్నాథ రథం, తాళధ్వజ నామం గల బలభద్రుడి రథం, దేవదళన(దర్పదళన) పేరున్న సుభద్రా రథం- మూడింటికీ దేని ప్రత్యేకత దానిదే. నిర్మాణం పూర్తయ్యాక, రథాలపై వివిధ స్థానాల్లో వేర్వేరు దేవతా శక్తులను ఆవాహన చేస్తారు. ప్రత్యేక హవిస్సులతో హోమం చేసి, రథాలను శక్తిమంతం చేశాక, మూలమూర్తులను వైభవంగా తీసుకువచ్చి ఆరోహింపజేస్తారు.

అటుపై విశేష పూజల అనంతరం మహారాజ వీధిలో యాత్ర సాగుతుంది. దివ్య కోలాహలాలతో, సంగీత నృత్యోత్సవాలతో సాగే రథం గుండిచా మందిరానికి చేరాక, విగ్రహాలను దింపి ఆ మందిరంలో పదిరోజులు ప్రజా దర్శనార్థం ఉంచి, తిరుగు రథయాత్ర ద్వారా మళ్ళీ పూర్వ మందిరానికి తీసుకువస్తారు.
ప్రపంచంలోనే అరుదైన మహోత్సవంగా అభివర్ణించదగిన ఈ రథయాత్ర మన మహా సంస్కృతికి సంకేతం.
-
-(())--

Swami Vivekananda's Wisdom for Daily Inspiration - June 22.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 22.

The infinite power of the spirit, brought to bear upon matter evolves material development, made to act upon thought evolves intellectuality, and made to act upon itself makes of man a God.

ఆత్మ యొక్క ఈ అనంతశక్తిని భౌతిక ప్రపంచం మీదికి ప్రసరింపజేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది.  ఆలోచనా విధానంపై ప్రసరింపజేస్తే బుద్ధిని వికసింపజేస్తుంది. మనస్సు మీద ప్రసరింపజేసి, మనస్సునే పనిచేయిస్తే మనిషిని దేవుణ్ణి చేస్తుంది.

🕉🌞🌎🌙🌟🚩

SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...
GIVE UP SUPERSTITION

This is the only prayer we should have... to tell ourselves, and to tell everybody else that we are divine, And as we go on repeating this, Tam divine, "I am divine," I am divine,"  strength comes. He who falters at first will get stronger and stronger, and the voice will increase in volume until the truth takes possession of our hearts, and courses through our veins, and permeates our bodies.

స్వామివివేకానంద-ధీరయువతకు...
మూఢవిశ్వాసాలను త్యజించండి

మనం దైవస్వరూపులమని మనకు మనం చెప్పుకోవడమూ, ఇతరులకు తెలియజెప్పడమే మనకు కావలసిన ఏకైక ప్రార్థన. 'నేను దైవాన్ని' అని మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూంటే శక్తి వస్తుంది. ముందు తడబడిన వ్యక్తి కూడా తరువాత శక్తిని పుంజుకుంటాడు. సత్యం (ఆత్మ చైతన్యం) మన హృదయంలోనికి ప్రవేశించి (జాగృతమై) రక్తనాళాల ద్వారా శరీరమంతటా వ్యాపించే వరకూ మన గళం పెరుగుతూ పోతూ ఉంటుంది.

🕉🌞🌎🌙🌟🚩
4- కంచి మహాస్వామి వారి ' శంకర విజయము '
🕉🌞🌎🌙🌟🚩

ఆదిశంకరుల అవతారోద్దేశ్యమూ, వారి చరిత్రలోని ముఖ్య ఘట్టాలను గురించి కంచి మహాస్వామి చంద్రశేఖర సరస్వతీ స్వాములు చేసిన వివరణలోని కొన్నిభాగాలలోని విషయాలు, రోజూ భక్తి శ్రద్ధలతో మననం చేసుకుందాం. ఇది వ్యాసాలుగా ఉంటుంది. జీవిత చరిత్ర లాగా వుండదు. గ్రహించగలరు.


కాలగమనంలో కర్మయోగం క్షీణదశ .

పూర్వంనుంచీ కొందరు నివృత్తి మార్గమూ, మరికొందరు ప్రవృత్తి మార్గమూ అనుసరిస్తూనే వున్నారు అని చెప్పుకున్నాము 
కదా !  ప్రవృత్తి మార్గానికైనా లక్ష్యం ఈశ్వరుడే  !   కనుక నియమిత పద్ధతులలోనే కర్మయోగం ప్రవృత్తి మార్గంలోని వారు ఆచరించేవారు.  ఆ తరువాత చిత్తశుద్ధిని పొంది నివృత్తి మార్గాన్నిఅవలంబించి మోక్షాన్ని పొందుతూ వుండేవారు.  


అందుకే కదా, గృహస్థాశ్రమం తరువాత వానప్రస్త  సన్యాస ఆశ్రమాలు  ధర్మశాస్త్రాలు చెప్పాయి.  మొదట్లో యే ప్రాణి అయినా ఇంద్రియ తృప్తి కోసం కర్మలను చేసినా, ఆ తరువాత నిష్కామ కర్మయోగులై, ప్రాణాలను విడిచేవారు.    దానినే కాళిదాసు లాంటి వారు తమ కావ్యాలలో, '  రఘువంశంలో రాజులు చివరకు యోగులై శరీరాలను విడిచిపెట్టారు. ' అని చెప్పేవారు.  


ఏనాడైనా, కర్మయోగుల కంటే, జ్ణానయోగులకే జనాదరణ అధికంగా వుండేది.  రాను రాను ఫలాల కోసమే కర్మలు చేయాలనీ, సన్యాసమార్గం తప్పని భావించారు.   ఈశ్వరుడు, ఆత్మసాక్షాత్కారం అనే మాటలకు స్వస్తి చెప్పి, వేదంలో చెప్పిన యజ్ఞయాగాదులు చేస్తే అవే మానవజన్మలో ఫలితాలకు దోహద పడతాయనే  స్థితికి వచ్చారు.    ఈశ్వరుడు ఫలదాత అనే మాట విసర్జించి, కర్మలు చేస్తే వచ్చే స్వర్గప్రాప్తి అంతిమ లక్ష్యంగా అనుసరించారు.    స్వర్గం కంటే మోక్షం ఎక్కువది అనేది తెలిసినా, మోక్షం మీద అంత దృష్టి పెట్టేవారుకాదు.  


అందుకనే వేదాలలో కర్మభాగం పూర్వమీమాంస జనాలను ఎక్కువ ఆకర్షించింది.  ఉత్తర మీమాంస అయిన ఉపనిషత్తులు జ్ఞానమార్గం చెప్పడం వలన వాటిపైన ఆసక్తి అంతగా ప్రబలలేదు.  


రెండుమార్గాల ఉపదేశాలు. 

నివృత్తి మార్గానికి దక్షిణామూర్తి ముఖ్య గురువు అయితే,  విష్ణువు కూడా హంస, దత్తాత్రేయ, హయగ్రీవ రూపాలలో జ్ఞానం ప్రసాదించాడు.   అయితే తన శక్తులను దశావతారాలలో చూపించినట్లు, విష్ణువు ఈ అవతారాలలో పూర్తిగా చూపించలేదు.  ఇక దక్షిణామూర్తి మౌఖికంగా ఏమీ ఉపదేశించలేదు గానీ,   మౌన వ్యాఖ్యానంతో ఆత్మానుభవం భక్తులు పొందేటట్లు చేసాడు.  


నివృత్తి మార్గానికి పరమశివుడిని మార్గ దర్శకుడుగా కీర్తిస్తారు, అందుకే.   నివృత్తి మార్గం సామాన్యులకు అందేదికాదు.   అందుకే పరమశివుడు ఎందరో మహాత్ములను పంపి తానూ స్వయంగా దిగివచ్చి ఉపదేశాలు చేసాడు.   విష్ణువే శ్రీకృష్ణావతారంలో భగవద్ గీత ద్వారా, కర్మఫలాలను ఆశించకుండా కర్మలు చేయాలనీ, అపుడు అది కర్మయోగం అని పిలువ బడుతుందనీ చెప్పాడు.    మరి భక్తి యోగం మాటేమిటి ?  


జ్ఞానయోగంలో కర్మానుష్టానం లేదు. ధ్యానము, ఆత్మ విచారణే వుంటాయి.  భక్తిలో పూజ, జపము మొదలైనవి ఉంటాయి.  ఇదే సాధన కర్మలు లేని ధ్యానంలో పెడితే, నిర్వికల్ప సమాధి అవుతుంది.   అనగా పరమేశ్వరునితో ఐక్యం అన్నమాట ! 

🕉🌞🌎🌙🌟🚩

శ్రీరమణీయం - (565)
🕉🌞🌎🌙🌟🚩

"ప్రశ్న : మనసమయ్యాకే ప్రపంచం వ్యక్తమౌతుందన్నారు.  నిద్రలో మనస్సులేదు. ఆ సమయంలో ఇతరులకు కూడా ఈ ప్రపంచం ఉండదా ? ప్రపంచం మనఃకల్పితమైతే అదేదో విశ్వమానసం కానక్కర్లేదా ? ఇప్పుడు ప్రపంచం స్వాప్నికమని, యదార్థం కాదని ఎట్లా అనగలం ?"

శ్రీరమణమహర్షి : ప్రపంచం వ్యక్తి మనఃకల్పితమో, విశ్వమానవ కల్పనో అదిగా నీకు చెప్పదు. ప్రపంచం వ్యక్తి మనసుకే గోచరిస్తుంది. ఆ మనసు లేనప్పుడు ఆ ప్రపంచమూ లేదు ! కలలో ఒకడు 30 ఏళ్ల క్రితం చనిపోయిన తండ్రిని చూశాడు. తనకు నలుగురు అన్నదమ్ములు ఉన్నట్లు, తండ్రి వారందరికీ కూడా ఆస్తిని పంచి పెట్టినట్లు కలలో తగువు వచ్చింది. వారంతా కలిసి అతడిని చితకమోదారు. భయంతో వాడు మేల్కొన్నాడు. అంతట వానికి తెలిసింది తనకు ఏ సోదరులూ లేరని, తానొక్కడినేనని, తండ్రి చనిపోయి చాలా కాలమైందని. అంతట వాని భయం వదిలిపోయి తృప్తి కలిగింది. చూశావా.. ఆత్మను చూసినప్పుడు ఈ ప్రపంచంలేదు. ఆత్మనే మరిచితివా (కలలోనైనా- ఇలలోనైనా) ప్రపంచ బంధనాలు తప్పడం లేదు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
కలకు-ఇలకు ఆధారం ఆత్మ !'- (అధ్యాయం -69)

🕉🌞🌎🌙🌟🚩

శ్రీరమణీయం
: "అమర చైతన్యం" 
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩

 ప్రశ్న: ఒకవేళ ఈ ఆలోచన ఒక వస్తువు గురించిన కోరికైతే ..

జవాబు: దృశ్యము లెన్నియున్నా, ద్రష్ట ఒక్కడే. ఎవరికి కోరిక అని విచారించు. ఇలాగే విచారించు. ఏకాగ్రత, అభ్యాసము ఇవన్నీ అనాత్మను తొలగించుకునేందుకు. అజ్ఞానాన్ని తొలగించేందుకు తమ అస్తిత్వాన్ని ఎవరూ కాదనలేరు.

సత్యము, జ్ఞానము, ఎరుక అంటే అజ్ఞానము లేకపోవడమే. అయినా మనుషులు బాధపడుతున్నారు. ఎందుకని వారు మేము ఇది, మేము అది అని అనుకొనుటచేత. అదే తప్పు. నేను ఉన్నాను - నేను అనునది మాత్రమే సత్యం కానీ నేను ఇది నేను అది అనునది తప్పు. ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే అంటే పూర్ణ సత్యమును గ్రహించగలిగితే అది సరియే. అలా కాకుండా దానిని ప్రత్యేకంగా అదిగానో ఇదిగానో చూస్తే అది తప్పు. అదే అసలు పూర్ణసత్యం. ఎవరైనా తనను తాను తెలుసుకునేందుకు అద్దము చూసుకోవాలా.. తను వున్నట్లు తనకు తెలియును. కాని అది శరీరమే తాను అని భ్రమ చెందుతాడు. గాఢనిద్రలో శరీరం లేకపోయినా తాను వున్నాడు. ఆ ఎరుకను పట్టుకో. నీ కళ్ళను నీవు చూడలేవు. అలాగని అవిలేవా.. అలాగే ఆత్మను దృశ్యంగా చూడకపోయినా నీకు తెలియును. ఆత్మను ఎవరు తెలుసుకోవాలి. శరీరం తెలుసుకుంటుందా.. నీవు వుండడమే నీ స్వభావము అంతేగాని అదిగా, ఇదిగా కాదు. ఇదంతా కూడా నిశ్చలముగా ఉండుము అని చెప్పుటయే. మిధ్యా నేనును నశింపచేసుకో. ఎందుకంటే రూపమే దుఃఖకారణము. నేను 'నేను' గా ఉంటే సరియే. అదిగా ఇదిగా కాదు. అదృశ్యమయ్యేది అహం. ఆత్మ (అసలు నేను) ఈ ప్రశ్నలు అడగదు, అడగలేదు. ఇలాంటి చర్చంతా కూడా నీ అహగాహన పెంచేందుకే..

🕉🌞🌎🌙🌟🚩


శ్రీరమణీయం
: "అమర చైతన్యం" 
: "ఋభుగీత "(32)
🕉🌞🌎🌙🌟🚩

2వ అధ్యాయము

మనసు శూన్యత అర్ధమైతే బ్రహ్మీస్థితి అర్ధమౌతుంది !

మనం బ్రహ్మమే. కానీ ఇది మనకెప్పుడు అర్ధమవుతుందంటే మనసు యొక్క శూన్యత అర్ధమైనప్పుడు. చంటి పిల్లల మనసులేని స్థితిని గమనిస్తే శూన్యత అంటే ఏమిటో కొంత తెలుస్తుంది. చంటి పిల్లాడిలో ఎరుక ఉంది. కానీ అది శూన్యతగా ఉంది. ఒక వస్తువు కనిపించగానే దాన్ని ఎవరు చేశారనే ప్రశ్న వస్తుంది. అసలు చూసేవాడు లేకపోతే ప్రశ్నించే అవకాశం ఎక్కడిది. మన సమస్యలు సందేహాలన్నీ మనం గుర్తిస్తున్న ఈ ప్రపంచం గురించే. గుర్తింపు అర్ధమైతే దానికి ముందున్న శూన్యత, దాని వెనుక ఉన్న బ్రహ్మీస్థితి అనుభవంలోకి వస్తాయి !

🕉🌞🌎🌙🌟🚩
* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩

రేకు: 140-3
సంపుటము: 2-174
రేకు రాగము: వరాళి.

ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
మతి వారూఁ తమవంటి మనుజులే కాక !!

చేరి మేలుసేయఁ కీడుసేయ నెవ్వరు కర్తలు
ధారుణిలో నరులకు దైవమే కాక
సారెఁ తన వెంటవెంటఁ చనుదెంచేవారెవ్వరు
బోరునఁ చేసిన పాపపుణ్యాలే కాక !!

తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు
గుడికొన్న తనలోని గుణాలే కాక
కడుఁ కీర్తి నపకీర్తి కట్టెడివారెవ్వరు
నడచేటి తనవర్తనములే కాక !!

ఘన బంధ మోక్షాలకుఁ కారణమిఁక నెవ్వరు
ననిచిన జ్ఞానాజ్ఞానములే కాక
తనకు శ్రీవేంకటేశుఁ తలపించేవారెవ్వరు
కొనమొద లెఱిఁగిన గురుఁడే కాక!!

🕉🌞🌏🌙🌟🚩

భావము :-

     తమకు చిక్కు లెదురై నందుకు ఊరక ఇతరులను నిందించుట వలన ప్రయోజనమేమి? తమ విషయములో మరొకరెవ్వరైన ఏమి చేయగలరు ? వారు గూడ మతి తలపోసిన తమవంటి సాధారణ మనుజులే కదా!

1. ఇలలో మనుజులకు మేలు సేయుటకైనను, కీడు సల్పుటకైనను దైవమే కర్తగాని ఇతరు లెవ్వరును కారు. తన్ను వదలక వెంటబడి వచ్చునవి తాను వడిగా చేసిన పాపపుణ్యములే గాని మరి పరులెవ్వరును రారు.

2. తన్ను చుట్టుముట్టిన గుణ దోషములే తన భూషణ దూషణములకు ముఖ్య హేతువులగుచున్నవి గాని వేరెవ్వరును గారు. తనకు కీర్తి కల్గుటకైనను, అపకీర్తి కలుగుటకును తాను నడచు నడతలే కారణములు గాని అన్యులు గారు.

3. తనకు బంధమైనను, మోక్షమైనను గల్గుటకు తనలో పెంపొందిన జ్ఞానాజ్ఞానములే హేతువు లగుచున్నవి గాని తదితరములు గావు. తనచే శ్రీ వేంకటేశ్వరుని స్మరింపజేసి తద్వారా సుగతి గల్గించువాడు సర్వము తెలిసిన తన ఆచార్యుడే గాని మరొకడు లేడు.

విశేషాంశాలు:-  

     ఏవైనా ఆపదలు కల్గినప్పుడు ఇతరులపై నిందలు మోపి వారిని దూషించుట మానవ స్వభావము. ఇది తగదనుచు ముందు తన ప్రవర్తనను తాను చక్కదిద్దుకొనవలెనని పదకవితా పితామహుడుడిట ప్రబోధించుచున్నాడు.

🕉🌞🌏🌙🌟🚩
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు గురించి మీకు తెలియని వాస్తవాలు..
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రముఖ ప్రవచన కర్తగా మనందరికీ తెలుసు.. లక్షలాదిమంది అభిమాన ఘణం. చాగంటి వారి ధార్మిక ఉపన్యాసాలు వినడానికి జనం ఎగబడతారు అనటంలో అతిశయోక్తి లేదు.. అయితే తన ప్రవచనాలతో ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నప్పటికీ ఇసుమంతైనా గర్వం ఏర్పడని సున్నిత స్వభావులు.. మన ఇతిహాసాల గురించి, సంస్కృతీ సంప్రదాయాల గురించి అద్భుతంగా ఇప్పటి జనరేషన్ కు అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరిస్తారు.. పురాణాలను పుక్కిట పట్టినట్లుగా చాగంటి వారు చేసే వివరణ వారిని అగ్రస్థాయిలో నిలిపింది. సొంత లాభాపేక్షతో సందుకో స్వామీజీ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో కూడా చాగంటి వారు చెప్పే ప్రవచనాలకు ఎటువంటి ధనాన్ని ఆశించరు. అంతే కాదు ఇలా పదిమందికి ఉపయోగపడేలా నాలుగు మంచిమాటలు చెప్పటం నా అదృష్టం అని చెప్తారు.. తనకున్న అపారజ్ఞానాన్ని ధనం కోసం తాకట్టు పెట్టని మహర్షి చాగంటివారు. తన విద్యను రాజులకు అమ్ముకోని వారిలో అప్పట్లో బమ్మెర పోతన తరవాత చాగంటివారే అని చెప్పాలి.. చాగంటి వారు చేస్తున్న సేవలకు గానూ చైన్నైలోని భారతీయ సాంస్కృతిక పీఠం నిర్వాహకులు ‘ప్రవచన బ్రహ్మ’ బిరుదును ప్రదానం చేశారు. అయితే బిరుదులంటే బెరుకుగా ఫీలయ్యే చాగంటి గారు చైన్నైలోని భారతీయ సాంస్కృతిక పీఠం తల్లిలాంటిదని, అమ్మప్రేమత్వాన్ని తలపించేలా ‘నా బంగారు కొండ’ అంటూ తల్లి తన బిడ్డను ముద్దాడినట్టుగా భావించి ఈ బిరుదును స్వీకరిస్తున్నానని ఆ సమయంలో పేర్కొన్నారు. ఇలా చాగంటి వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి మనం ఇపుడు తెల్సుకుందాం..

చాగంటి వారు ప్రభుత్వ ఉద్యోగి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. మరి ఎప్పుడూ అక్కడా ఇక్కడ ప్రవచనాలు చెప్తుంటారు.. ఆఫీస్ కి ఎప్పుడు వెళ్తారు అనే సందేహం కలుగక మానదు.. అయితే చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. ఇక కుటుంబ వివరాలకొస్తే చాగంటి వారి సతీమణి వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. వీరికి ఒక కుమారుడు. ఇటీవలనే అతడికి వివాహం జరుగగా… కొడుకు, కోడలు హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులోనే తండ్రి గారు గతించారు. ఆయనకు ముగ్గురు తోబుట్టువులు.. ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కష్టపడి నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేసారు… వారికి ఆస్తిపాస్తులు లేవు. కడు పేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అని తెల్సుకున్న చాగంటి వారు అహోరాత్రాలు కష్టపడి విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు. ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు అన్నీ తానై తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. ఈరోజు వరకు తనకంటూ బ్యాంకు బాలన్స్ ఉంచుకోలేదంటే ఎవరు నమ్మరు.. కానీ అదే నిజం.. ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు. ఈరోజు వరకు ఆయన మధ్యతరగతి జీవే. అలా ఉండటానికే ఇష్టపడతారు
చాగంటి వారు తనకున్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచినట్లైతే ఈపాటికి ఆయన కొన్ని వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలకు ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్పించి నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఇంతవరకు ఆయనకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. చాగంటి వారు పని చేసే ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు. అయినా చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఎప్పుడు వాటిని వాడుకోరు.. సెలవు పెట్టరు.. వారాంతపు సెలవు దినాల్లో మాత్రమే ప్రవచనాలు చెప్తుంటారు
చాగంటి వారేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు అవపోసన పట్టారని చాలామంది పొరపడతారు. కానీ అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అని, ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పాలి.. ఎందుకంటే ఎంత సాధన చేసిన ఇలాంటి విషయాలు ఎక్కువకాలం గుర్తుండవు.. కానీ చాగంటి వారి లాంటి వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.
కాకినాడలోని అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అందుకే ఆయనకు అభిమానులు పెరిగారు. అభిమానులు అనేకంటే భక్తిగా ఆరాధిస్తారు అనాలేమో.. 1998 లో వారి తల్లిగారు స్వర్గస్తులు అయ్యాక చాగంటి వారు బయటప్రాంతాల్లో ప్రవచనాల్ని ఇవ్వటం ప్రారంభించారు
తాను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకోకుండా చాగంటి వారిని కలిసిన పీవీ నరసింహారావు గారు “మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను” అని అడుగగా.. చాగంటి వారు నవ్వేసి “మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు.” అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.
ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు మాత్రమే.. త్వరలో చాగంటి వారు రిటైర్మెంట్ కానున్నారు..

చాగంటివారికి బీపీ, మధుమేహం, మోకాళ్లనొప్పులు ఉన్నాయి. ప్రవచనాలు చెప్పీ చెప్పీ ఆయన కంఠనాళాలు దెబ్బతిన్నాయి. ప్రవచనాలను తగ్గించుకోమని డాక్టర్లు సూచించానప్పటికీ . ప్రవచనాలు చెబుతూ కన్నుమూస్తే అంతకంటే కావలసింది ఏముంది? అని అలాగే తన ప్రవచనాల్ని కొనసాగిస్తున్నారు..

చాగంటి వారికీ చాదస్తం పాలు ఎక్కువ అని కొందరు అభిప్రాయపడతారు. చాగంటివారు ఏది చెప్పినా దానికి శాస్త్రమే ప్రమాణం తప్ప స్వకపోలకల్పితం కాదు. తన ప్రవచనాలను వినమని ఆయన ఎవ్వరిని బలవంతం చెయ్యడం లేదు. ఇష్టమైనవారు వింటారు లేనివారు లేదు. ఆనాటి ఆచారాలు, పద్ధతులు ఆయన చెబుతారు.

 ఇష్టమైన వాళ్ళు పాటిస్తారు.. చాగంటి వారంటే గిట్టనిఈర్ష్య పరులు FCI ఉన్నతాధికారులకు చాగంటివారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఆకాశరామన్న ఉత్తరాలు కూడా రాసేవారట.. అయితే చాగంటి వారి రికార్డు తెలిసిన యాజమాన్యం ఆ లేఖలు ఏమాత్రం పట్టించుకోలేదు

ఇక ప్రవచనాలను ఇలా ఉచితంగా ఇవ్వద్దని, ఎంతోకొంత పుచ్చుకోమని, బంధువులు, మిత్రులు చాగంటివారిపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ . ససేమిరా అన్నారు చాగంటివారు. ఆయన ప్రవచనాలను కాసెట్లుగా, సీడీలుగా అమ్ముకుని లక్షలరూపాయలు ఆర్జించాయి కొన్ని కంపెనీలు. కనీసం వాటికీ కూడా రాయల్టీ ఆశించని మహానుభావులు.. చాగంటివారికి ఏర్పడిన ప్రజాదరణను చూసి, ఆయనను ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించారు చంద్రబాబు. కానీ పదవితో వచ్చే భోగాలను, సౌకర్యాలను అందుకోలేనని.. ఈ రోజుకి ఆ పదవిని స్వీకరించలేదు.. దేవాదాయశాఖామంత్రి స్వయంగా ప్రభుత్వ కారును, సెక్యూరిటీని స్వీకరించమని కోరినా తిరస్కరించారు. అంతటి మహానుభావులైన చాలా సామాన్య జీవితాన్ని మాతరమే కోరుకుంటారు

--(())--

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 8  /  Sri Gajanan Maharaj Life History - 8 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 4 🌻

ఇంటికి చేరుతున్న ఆవులు శ్రీకృష్ణుడు అనుకుని శ్రీగజానన్ చుట్టూచేరాయి. దుకాణుదారులు సాయంత్రం దీపంపెట్టే సమయంలో శ్రీమహారాజును బనకటలాల్ తమ ఇంటికి తెస్తాడు. 

యోగిని చూచినంత మాత్రంలోనే అతి ఆనందంతో భవానీరాం అతనికి మొక్కి కూర్చునేందుకు ఒక చెక్కపీట ఇచ్చి ఇలా అన్నాడు: శివుని అవతారం అయిన మీరు ఈవిధంగా సాయంత్రం మాయింటికి విచ్చేసారు, నేను భోజనం పెడదామనుకుంటున్నాను, దయచేసి అంగీకరించండి. ఈవిధంగా సాయంత్రం సమయంలో మిమ్మల్ని ఇంటి దగ్గర పొందడానికి నేను చాలా అదృష్టవంతుడను. 

సాయంత్రం సమయంలో శివుని ఆరాధించే అవకాసం దొరకడము చాలా అదృష్టమని స్థందపురాణంలో కూడాచెప్ప బడింది. ఈవిధంగా అంటూ శ్రీమహరాజును భిల్వ పత్రంతో పూజిస్తాడు. బనకటలాల్ తండ్రి శ్రీమహరాజును భోజనానికి అయితే ఆహ్వనించాడు కానీ భోజనం ఇంకా తయారుకాలేదు. 

ఒకవేళ భోజనంతయారు అయ్యేవరకు ఈయోగి ఆగకపోతే చాలానిరాశ అవుతుంది. ఎందుకంటే భగవాన్ శివుడు ఈవిధంగా భోజనం తీసుకోకుండా తన ఇల్లు వదలి వెళ్ళిపోవడం. అందుచేత ఏమి చేయాలనే సంస్జిద్ధంలో పడ్డాడు. 

ఆలోచించి శ్రీమహరజుకు ఉదయం తయారుచేసిన పూరీలు పెడదామని నిర్ణయించాడు, కారణం వేగించిన వస్తువులు పాచి పట్టినవిగా భావించరని. దీనికంటే ముఖ్యంగా తను నిష్కల్మమయిన మనస్సుతో ఈవిధంగా భోజనం కోసం మహరాజును ఆహ్వనించాను అని అతనికి తెలుసు. 

అందుకని పూరీలు, బాదములు, ఎండు ద్రాక్షలు, అరటిపండ్లు మరియు నారింజలు ఒక పళ్ళెంలోతెచ్చి శ్రీమహారాజు ముందు పెడతాడు. నుదుటికి విభూధి పెట్టి మెడలో ఒకపూలహారం కూడావేసాడు. 

శ్రీగజానన్ వడ్డించిన ప్రతి వంటకం తింటూ, కనీసం ముగ్గురు తినగలిగే అహారంతిని ఆరాత్రికి బనకటలాల్ ఇంటిలోనే బసచేసారు. మరుసటి రోజు ఉదయం వంద బిందెలనీళ్ళతో బనకటలాల్ శ్రీగజానన్ కు మంగళ స్నానం చేయించాడు. 

పురుషులు, స్త్రీలు ఆయనకు సుగంధ తైలమర్దనం చేసి, సబ్బుతోతోమి, కడిగి స్నానం చేయించారు.స్నానం తరువాత మంచిఖరీదయిన కాషాయవస్త్రం ధరించేందుకు ఇచ్చి ఒకఎత్తయిన అలంకరించిన ఆసనంమీద కార్చుండబెట్టారు. 

తులసీదళాలు ఉన్న పూలహారాలు ఆయన మెడలో వేసి గంధం నుదుటి మీదపెట్టి, పండ్లు, మిఠాయిలు తినడంకోసం ఇచ్చారు. 

ఆవిధంగా బనకటలాల్ ఇల్లు భక్తులకు ద్వారకలా అయింది. న ఇచ్చారా ఆ వ్య యంత్రం, ఇళ్ళారా నవ్వేకరించి తిన్న తరువా ఆరోజు సోమవారం మహాశివునికి ప్రియమయిన రోజు. 

ఒకేఒక వ్యక్తితప్ప, మిగిలినవారు శ్రీగజానన్ను ఆరాధించి కోరిక నెరవేర్చుకున్నారు. ఆవ్యక్తి బనకటలాల్ కుటుంబీకుడయిన ఇఛ్ఛారాం. అతను శివభక్తుడు మరియు ఆరోజు శివుని ప్రియమైన సోమవారం కావడంవల్ల శ్రీగజానన్ శివస్వరూపం కాబట్టి సాయంత్రం పూజించాలని కోరుకున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 8 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 4 🌻

Cows returning home, gathered around Shri Gajanan thinking Him to be Shri Krishna.

Shopkeepers were preparing to light the lamps when Shri Bankatlal brought Shri Gajanan Maharaj to his house.

 Bhavaniram, overjoyed at the sight of a saint, prostrated before Him, offered Him a wooden Pata to sit on and said You are an incarnation of Shri Shankar, coming to us at the evening. I wish to offer You food, so please kindly accept it. 

I am really very fortunate to have You at my place in the evening. Skandhapurana says that it is a great fortune to worship Lord Shankar in the evening.

 Saying so, he respectfully worshipped Shri Gajanan Maharaj with Bilwapatra. 

Bankatlal's father was now worried because he had requested Shri Gajanan Maharaj to accept the food at his house; however, in fact the food was not yet ready, and if this saint did not wait till the food gets ready, it would be a great disappointment, as this would mean that Lord Shankar going away, without taking any food in the evening from his house. 

So he was in a fix. What to do? He thought over the matter and decided to offer Shri Gajanan Maharaj puris which were prepared in the morning, as fried food is not treated as stale. Moreover he knew that his mind was pious and sincere in offering food to Shri Gajanan. 

Accordingly he brought a thali full of puris, almonds, dates, bananas, and oranges and put it before Shri Gajanan. He applied Bukka on His forehead and put a garland around His neck. 

Shri Gajanan ate everything that was served, consumed about three seers of food and stayed that night with Bankatlal. Next morning Bankatlal gave Shri Gajanan a ceremonious bath with one hundred pitchers of water. Men and women washed Him with soap and massaged His body with scented oils. 

After the bath, a very costly Pitambar (yellow robe) was given to Him to wear and made Him sit on a well-decorated high seat. Garlands of flowers and Tulsi were put around His neck, Kesar paste was applied on His forehead and fruits and sweets were offered to Him to eat. Thus Bankat's house became Dwarka for all the devotees. 

That was Monday, the auspicious day of worshipping Lord Shankar. All the people fulfilled their desire of worshipping Shri Gajanan except one. 

That was Ichharam, a cousin of Bankatlal. He was a devotee of Lord Shankar and it being a Monday, the day of Lord Shiva, he wished to worship Shri Gajanan at evening time by treating Him to be Lord Shiva.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment