Wednesday, 21 July 2021

చందస్సు




Picture


కనక రత్న వజ్ర వైడూర్య మకుటమ్ము
కల్గి ఉన్న శోభ నిచ్చు కృష్ణ
తళుకుల సుమలలిత ఫాలదేశముజూపు
సురుచిర కర సుముఖ వెల్గు కృష్ణ  .... .... 1

లలిత ఫాల దేశ భ్రూలతా శోభితం
సుందర కనుగవ బెళుకుల కృష్ణ
లేత ముదురు మొగ్గ నాసిక మంద
స్మిత కనికరమును జూపు కృష్ణ   ... .... 2

రత్న దంత వెలుగు మధురాతి మధురమ్ము
రమ్య మైన బింబ ఆధారమ్ము
సిరులు ఒలక పుచ్చు చిన్నయా రూపమ్ము
పలువురి మనసులను దోచు కృష్ణ  ..... .... 3
--(())--



యస్మాన్నో ద్విజతేలోకో లోకాన్నో ద్విజతే చ యః

హర్ష మర్ష భయోద్వేగైః ముక్తోయ స్స చమేప్రియః

ఎవని వలన ప్రపంచము అనగా ప్రజలు భయమును పొందరో, లోకము వలన ఎవడు భయమును పొందడో, ఎవరు సంతోషము, క్రోధము, భయము, మనో వ్యాకులత మోదలగు నవి లేకుండా ఉంటారో అటువంటి వారు నాకు ఇష్టులు. స్త్రీ పురుషులు యైన శ్రీ రామ శ్రీ రామ అని జపంచెయ్యండి అక్కడే ఉండి మనస్సుకు శాంతి. 

ప్రకృతి పాఠము నేర్పు తుంది, సమయం సుఖము అంధిస్తుంది, లోకం ఆశ నేర్పిస్తుంది, స్త్రీ పురుషుల మనోభావాలు, శరీర ఆకృతులు, లక్షణ ధర్మాలు వేరైన పెళ్లి అనే

యోగం .. ఒక దానితో మరొకటి అనుసంధానమైతే యోగం అని అంటారు. అనగా స్త్రీ పురుషుల కలయకె కొత్త జీవితం, ఆకర్షణ, ఆలోచన, ఆత్మీయతా, ఆనందం, వ్యక్తం చేస్తారు, వారి కర్మాను ‌సారం బుద్ధులు ఉంటాయి, వారిని కాలమే మారుస్తుంది.

హఠయోగం - మన భౌతిక శరీరంతో మనం ఏకమై ఉండటం. (ఆసనాలు) ప్రవర్తన,  ఆశయ లక్ష్యం ఒకటే మాదిరి చూపు కళలు

 నాద యోగం - సంగీతంతో మనం ఏకమవడం. మనసు ఉల్లాసం, ఉత్సాహం, పలకులు ఏక 

మలుపు సుఖం సంగీతం మేలవింపు

 కర్మ యోగం - మనం చేసే కర్మలతో ఏకమవడం. వాద ప్రతిపాదన అనేది లేక నీ మాటే నామాట. నీతృప్తే నాతృప్తీ అనేయోగం

 జ్ఞాన యోగం - జ్ఞానంతో ఏకం అవ్వడం. సమవిద్యలతో నిత్యము బోధలు సల్పి జ్ణానం విస్తరణ చేయటే జ్ణాణయోగం..

 రాజ యోగం -  మన యొక్క అతీంద్రియ శక్తులతో ఏకమవడం. ఇరువురి శక్తులు ఒకేరకంగా, మాట, నడక, సర్వము ఒకే విధముగా రాజ యోగం.

 భక్తి యోగం - సకల చరాచర సృష్టి తో ఏకమై ఉండడం;  నేను, నాది అనేది తీసివేసి..


వ్యంగ్యం కాదండీ ... వాస్తవం వివరణల నద్యాలు

పూర్వము పెద్దోళ్ళు పెళ్లి కట్నం ఇచ్చే మోగాడంటే చాలు పడుచు పిల్లను పెళ్లి చేసేవారు.

 నోరం జేతులు రెండు చూపె భయమున్ నారీ సహాయమ్ము గా

సర్వాంగం పులకుంచి దాహము కళే స్వారీ ప్రమాదమ్ము గా

శ్రీ రమ్యం అణువంత పంచు దేహము కధే శ్రీ రంగ రాజ్యమ్ము గా

కారుణ్యం కమనీయ మే కలుయుటే కార్యమ్ము సౌఖ్యమ్ము గా


కలలు కనమనేను, కాల మందు, నెరవేర్చ మనేను 

చిలక పలుకులేను, చాల మేలుచేసి మనసునే దోచే   

పలక రింపులోను, పెద్ద చిన్న అనక అందరితో ప్రేమ. 

వలదు అనే పదము, వాదము అసలొద్దు, నిజము తెల్పు మహిళ


తెలుగు వెలుగు నేల తీపి రుచులు తోను ధైర్య ముంచ గలరు,  

కలుగజేయు ముదము కాలమందు బతుకు మృదుమధురము పొందు

విలువ లన్ని పెరిగి విరులు కమనీయత విధిని తెలుపు మహిళ  

చెలగు సాగు నంత చేరు వగుటకు కృషి  తెలుగు మల్లి కలలు     


అలుపు అనుకుంటే, మనసు చెప్పఁ లేవు, ఓర్పు చూపలేవు,

మలుపు వచ్చి తీరు మనుగడ బతుకులో మంచి జీవితమ్ము  .  

వెలుగు పొంది పంచి  వరుస కలిపి మంచి బోధ చేయు మహిళ 

కలుగు కళప్రేమ కధలు కాదు నిజము వలన సంతృప్తియె.


విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ


Feb 18, 2020 - This Pin was discovered by Út PhÚc. Discover (and save!) your own Pins on Pinterest.
  



శ్రీకృష్ణ రాయబారము లో పద్యం :.... 2 



"అలుగుటయే యెఱుంగని మహామహితాత్ము డజాతశత్రుడే 

యలిగిననాడు సాగరములన్నియు నేకము గాకపోవు, క 

ర్ణులు పదివేవురైన నని నొత్తురు చత్తురు రాజరాజ! నా 

పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకులఁ గావు మెల్లరన్." 

(పాండవోద్యోగ నాటకము - తిరుపతివేంకటకవులు) 



అర్థములు: అలుగుట = ఆగ్రహించుట; అజాతశత్రుడు = శత్రువులు లేనివాడు, ధర్మరాజు; అని = యుద్ధము; విపన్నులు = ఆపన్నులు, ఆపదకు లోనైనవారు; కావుము = కాపాడుము. 

భావము: కోపమును దరిచేరనీయక, సదా శాంతస్వభావులై సౌమ్యులుగా కనిపించేవారు లోకములో చాలా అరుదుగా ఉంటారు. అలాంటివారికి ఆగ్రహం కలిగితే, అది ప్రళయభయంకరమే అవుతుంది...... మహాభారతములో ధర్మజుని పాత్ర అటువంటిది. ఆయనను వైరివర్గములోనివారు సైతం గౌరవిస్తారు. అందుకే "అజాతశత్రుడు" అనే పేరు వచ్చినది.



దాయాదులైన తమ వద్దకు సంధిసందేశమును పంపిన ధర్మరాజు శక్తిసామర్థ్యములను శంకించిన దుర్యోధనుడు "పరాక్రమవంతులు పగవారి సముఖానికి రాయబారిని పంపిస్తారా?" అని అధిక్షేపిస్తాడు. అందుకు జవాబుగా శ్రీకృష్ణుడు పై పద్యములో అజాతశత్రుడు అలిగితే కలిగే అనర్థమును విస్తరించి చెప్పాడు. 



"సుయోధనా! ఆ ధర్మాత్ముడు కోపిస్తే, సప్తసముద్రములూ ఏకమై జలప్రళయం సంబవిస్తుంది సుమా! కర్ణుని అండ చూసుకుని నీవు అహంకరిస్తున్నావు. ఇలాంటి కర్ణులు పదివేవురైనా కదనరంగములో కన్నుమూయక తప్పదు. జాగ్రత్త!" అని హెచ్చరించాడు. రాధేయుని పరాక్రమమును కించపరచి మాట్లాడడం, మాధవుని భేదోపాయం; దుర్యోధనుని అంతరంగములో బెదురు పుట్టించడం. లోకులను "విపన్నులు" అనడంలో, రారాజు స్వార్థమునకు ఎంతమంది అమాయకప్రజలు మారణహోమం కాబోతున్నారో ఎత్తిచూపడం... ఇక, "నా పలుకులు విశ్వసింపుము" అని చెప్పుటలో, కురుపాండవపక్షములలో తనకు గల గౌరవమును, తన పరమాత్మతత్త్వమును పరోక్షంగా ప్రస్తావించడం! 

ధూర్తుడికి భయంచెప్పి, భక్తిని నేర్పే ప్రబోధశిల్పం పై పద్యములో ప్రతిధ్వనిస్తున్నది. "చెల్లియొ చెల్లకో" అనే మొదటిపద్యం ఎంత మెత్తగా ఉన్నదో, ఈనాటి ఈ రెండవపద్యం అంత గట్టిగా ఉన్నది.
Feb 18, 2020 - This Pin was discovered by Út PhÚc. Discover (and save!) your own Pins on Pinterest.



🚩🙏🙏🙏🚩



*శ్రీఆది శంకరాచార్య విరచితం శ్రీగోవిందాష్టకం*


*1) సత్యం ఙ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ |*

*గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ |*

*మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ |*

*క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*2) మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ |*

*వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ |*

*లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనా లోకమ్ |*

*లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*3) త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ |*

*కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ |*

*వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ |*

*శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*4) గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ |*

*గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలిత గోపాలమ్ |*

*గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ |*

*గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*5) గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ |*

*శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ |*

*శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ |*

*చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*6) స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ |*

*వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః|*

*నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ |*

*సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*7) కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ |*

*కాళిందీగతకాలియశిరసి సునృత్యంతమ్ ముహురత్యంతమ్ |*

*కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ |*

*కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*8) బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ |*

*కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ |*

*వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ |*

*వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ ||*


*9)గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః |*

*గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |*

*గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః |*

*గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ||*


--(())--


తెలియఁ జీఁకటి వెలుగు ల దీపము ప్రేమ వల్లె

వెలుఁగు లోపలి అందమే విపులమై సేవ లొలికె

చెలియ నీ సుఖ సంతోష జ్వాలలు నన్ను చేరె

అలక మానుము రాధ  మనసు నీదె యీ కృష్ణ ది


అర య నా‌ మనసుకు  కభయమ్ము గా ప్రేమ తెలుపు 

నాకు ఇరు వైపులను సుఖిఁ నీ కృప వలననే 

మరువ బోయెడు వానికి ప్రధమ సుఖము నిమ్ము 

దరిన వానిఁ సుఖం తీర్చు దారి రాధకు యె వుంది


వేకువ న నీకొరకు నమ్మియు వచ్చితి కళలు గా

మక్కవనె చూపి అంకితమును ఇచ్చె మనసు గా

ఒక్క మాట వేణువు నొదలీ చేరు సుఖము గా

ఇక అధిరె పెదవుల దాహమును తీర్చు శుభము గా


ఆరని కురులతో ఉన్నా ఆహ్వానము అందుకో

చీర తడిసింది యదలోన యందమును దోచుకో

కరుణ చూపుటకు దిగిరా కానిది ఏది కాదు

చురుకుగా సంగమ హృదిలో జాప్యము వలదులే


మనము ఒక జంట వలపుల పంటగా కలిసె ద

అణువు యదలో న సెగలు గా ఆకలి పిలిచెను

తనువు మనసున తపన ల తో ప్రేమ కదిలించు

చినుకు పెడుతుంది ఉడుకు ల చింతను తగ్గించుమా


నిత్య రాధ మాధవ కేళి నిర్మల మనస్సుతో

సతత హరిత వనమ్ము న సొగసులు అందపుచ్చె

సత్య వాదమ్ము  హృదయాన్ని చిగురించె ఈసమయం

కతలలో ప్రేమ కుశలమై కలలను తీర్చు చుండు


నువ్వుల రాజుగా నయనాల వెలుగు చూపు పరమాత్మా

రివ్వున సాగేటి రవ్వ ల వెలుగులే పంచు నల్లనయ్య

సవ్వమగు తృప్తీ సుఖము మెండు పంచు కృష్ణ పరమాత్మా

దివ్య మైనట్టిది వైభవం తో ధర్మాన్ని తెలియ పర్చు

                  





Monday, 19 July 2021








--(())__

కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే

దేహం ముందీ ఈశ్వరా నీ సేవకే

దాహం తీర్చూ ఈశ్వరా నీ దాసి గా


మానసమ్మూ  మాయ లో నే నుంటినే

దేహ బాధే తెల్ప కే నే నంటినే

దారి అంతా ధర్మ మే నీ సృష్టి గా

నేను చేసే న్యాయ మే ధ్యేయమ్ము గా


కానరాదే కండ్ల ముందా హాసమే

చెప్ప లేనే కాల మంతా నీదియే

ఒప్పు కున్నా జీవి తానా ధైర్యమే

పెంచు చున్న శక్తి నీదే ఈశ్వరా


వెన్నలయ్యా వెల్లకో యీ కాంతితో

దేశ మంతా నమ్మి ఉందీ ప్రేమతో

శ్వాస అంతా హాయి గొల్పే నిద్రతో

ప్రేమతోనే కల్చు చున్నా ఈశ్వరా


నిమ్మ కమ్మే భ్రాంతి అంతా తొల్గునే

నమ్మి కొల్చే కాంతి నంతా నీదిలే

భక్తి నంతా చూపు చున్నా యోగిగా

తప్పులున్నా కావు మయ్యా ఈశ్వరా


మన్ను నందే పుట్టి యున్నా  మాయకే

చిక్కి యున్నా నన్ను నీవే కావుమా

కాల మాయే ఉంది నన్నూ చూడుమా

సాహ సొమ్మే నాది కూడా ఈశ్వరా


బీద వానిన్ ప్రేమ తోడన్ చూడవా

ఆశ పాశమ్ తోనె ఉన్నన్ మార్చవా

సేయు సేవల్ దాన ధర్మమ్ సల్పితీ

భక్తి భావమ్ తెల్పు చున్నాన్ ఈశ్వరా


వ్యక్తి త్వం తో నీవు విలువల కళ చూపించూ 

యుక్తి త్వం తో ధైర్యముయె కలిగియు పోరాడూ

 రక్తి త్వం తో ఏపని సలపకయె సాగాలీ

శక్తి త్వం నీ లక్షమును తెలుపుటె ధర్మం మే


దురాశే కర్తృత్వం చరితము లకు సంభావ్యం పశుపతినాథ్

విరోధం దుర్మార్గం పెరుగుట వలనే భయ్యం పశుపతినాథ్

సరాగం సందర్భం మనుగడ కల శోకం పశుపతి నాథ్

జరా మిత్రా భావం కరుణ దయయు లేదే పశుపతినాథ్


నా లలాటము లో ఉన్న బ్రహ్మ వ్రాతను మార్చే శక్తి నీకే ఉంది పశుపతినాథ్


బిక్షమ్మే కరువై క్షమించు గుణమే ప్రేమ త్వ మే లేకయే

కక్షల్లో మనసే విశాల పరుగే కాట్లా ట దౌర్భాగ్య మే

కాంక్షల్తో బతుకే అగమ్య మగుటే కాఠిన్య మింకేలనో

రక్షించే శివుడే సమర్ధు డయినా క్రూరత్వ మయ్యేను లే


అనంతం ఆత్మీయం సహనమునకు దూరం పశుపతినాథ్

వినోదం విధ్వంసం వివరములకు భారం పశుపతినాథ్

అనేకం ఆశ్చర్యం కధ మలుపు న భోగం  పశుపతినాథ్

గణాంక శాస్త్రమ్మే కుడుములు వలె వైనం పశుపతినాథ్


దీనులను రక్షించుటలో నిపుణుడు వి మమ్ము రక్షించుటలో ముల్లోకాలలో మీకంటే మరొకరు ఎవరున్నారు 


ప్రభుత్వం తీర్మానం హృదయ పరబంధం పశుపతినాథ్

ప్రభావం ప్రాబల్యం మనుగడకు కష్టం పశుపతినాథ్

ప్రభంతే వైరాగ్యం కలుగుటయు నేస్తం పశుపతినాథ్

ప్రభా ప్రేమారోగ్యం కనుమరుగు వైనం పశుపతినాథ్


నాతప్పులన్ని నీచేతనే క్షమింప బడతగినవి.నా రక్షణార్ధం ప్రయత్నించడం నీకర్తవ్యం దేవాది దేవ పశుపతినాథ్


శుభం శోభిల్లే కాలం ఇదియే

భయం లోగిల్లో మోనం మదియే

వైనం సేవల్లో ఆశా విలియం

ప్రాణం గుప్పెట్లో కాలం సహనం


మీ విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ


*****

పార్వతీ కలియుగము కొంతవింతలతో అభివృద్ధి చెందుతున్నది

మనుష్యులలో మార్పు కనబడుతున్నది 


పేదగా పుట్టిన పేరును పొందు

వాదిగా మారిన వాదము నందు 

పొందిక ఉండియు సహనము చూపు  

ఆది మహాలక్ష్మి ఆరాధనులుగ


కష్టాలు నెట్టిన కాలము మార్చు

ఇష్టాలు చూపిన ఈశ్వర  తీర్పు  

నష్టాలు తెచ్చినా నాన్యథ ఓర్పు 

అష్టమ శని అన్న  ఆరాధ్య నేర్పు 


యువకుల భవితకు ఏర్పాటు చూడు 

సవరణ చరితను  సేవగా చూడు 

అవసర మవ్వును ఆకలి చూడు   

నవవిధ పూజలు భక్తిని చూడు    


బాలల ప్రగతిని బాధ్యతై చూడు  

కాలపు ప్రకృతిఏ కరుణను చూడు 

లాలన ప్రభలతో మనసును చూడు 

కాలము  ప్రతిభతో సుఖమును చూడు


భావాల కలయిక బంధము గాను

అనుభవ పలుకులు ఆనందం అగును

అనుభూతి కవితగా అలకలు మాను

ఆత్మీయత మనసు ఆకర్షణ గను


 గత కాల మసాధ్యం కాలము తీర్చు

జతకూడి సాధ్యము జాతి న నేర్పు

తాతచెప్పెడి మాట తధ్యము మార్పు

మాతపలుకులన్ని పూర్తిగా ఓర్పు


ఆవాహనలు నేర్పు అతిథిని మార్చు

నీవా మనసు మార్చి నియమాల తీర్పు

సేవా కథలు అచ్చ తెలుగులో నేర్పు

భావాల కధ తెల్పి కళలన్ని తెల్పు


ఆలోచనలే అవగాహనం పెంచు

ఆలాపనలే స్వభావము తెంచు

ఆవేదనలు అక్షర ము భాష యెంచు

సేవా సదనమందు భాషయే మంచు


భవబంధముయె ఇంధనమ్ముగా వుండు

అవకాశముయె బంధనమ్ముగా వుండు

నవరాగముయె నందనమ్ముగా వుండు

యువసఖ్యతయె చందనమ్ముగా వుండు


నిధి నిశ్శమున లబ్ధి పొందుటే జగతి

విధి శబ్ధ సమ్మతి చెందుటే ప్రగతి

తిధి శుభ ఫలితాలు కలిగించు వినతి

మదిలోన భావము తెలుపుటే సమితి


జన్మ సౌఖ్యమ గాను చిత్ర జగత్తు

కొన్ని ప్రేమలో వల్ల కాలము మత్తు

మన్న నంతయు మాయ భక్తిగా చిత్తు

అన్ని ఉన్నాను చిత్రంలో ఆశ గమత్తు





ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడే ఒక బైరాగి వచ్చి ఈవిధముగా చెపుతున్నాడు  ....

ఓ మనిషీ!  తెలుసుకో , ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో 


చేష్ట వెనుక చేవ ఎంతో?  ... ప్రేమ వెనుక ఆశ అంతే ?

మాట వెనుక భక్తి ఎంతో ?.... మంచి వెనుక చెడ్డ అంతే  ?

:

సారం వెనుక సాధన ఎంతో? ... వేషం వెనుక వేతన అంతే  ?

మౌనం వెనుక మోసము ఎంతో ? ... గానం వెనుక గాత్రము అంతే  ?


ప్రశంస వెనుక ప్రతిభ ఎంతో? .... ప్రలోభ వెనుక ప్రభొధమంతే ? 

ప్రవేశ వెనుక ప్రభవ మెంతో  ? ......ప్రమాద మె నుక  ప్రజలు అంతే ?  


అందం వెనుక పొందిక ఎంతో? .... దాహం వెనుక ఆకలి అంతే ? 

లాభం  వెనుక నష్టము ఎంతో ? ..... స్నేహం వెనుక దానము అంతే ?  


పంట వెనుక పరిశ్రమ ఎంతో?......మంట వెనుక ఒకక్రియ అంతే ?  

వంట వెనుక  నిజభృతి  ఎంతో ... గంట వెనుక గనస్రుతి అంతే ?  


కథనం వెనుక మథనం ఎంతో?.... రిపం వెనుక వినయం అంతే ? 

పరువం వెనుక  నరకం ఎంతో ?  ... ప్రణయం వెనుక ప్రళయం అంతే ?  


విజయం వెనుక వినియోగం ఎంతో?.... ఫలితం వెనుక పనియోగం అంతే ? 

చరితం వెనుక కధయోగం ఎంతో ? ..... వినయం వెనుక విధియోగం అంతే ? 


ప్రగతి వెనుక ప్రయాసం ఎంతో?  .... ప్రతిన వెనుక  ప్రమాదం అంతే ? 

ప్రజల వెనుక ప్రమోదం ఎంతో  ..... ప్రతిభ వెనుక ప్రయోగం అంతే ? 


నిజం వెనుక నిజాయితీ ఎంతో?  ..... గళం  వెనుక సరాగమే  అంతే ? 

దళం వెనుక దయాగుణం ఎంతో ?..... భయం వెనుక మనోజపం అంతే ?  


జీవితం వెనుక జీవితార్థం ఎంతో? ..... కీలకం వెనుక కామితార్ధం అంతే 

లోలకం వెనుక లోభితార్ధం ఎంతో .... భోజనం వెనుక ఆశపాశం  అంతే ? 


ఓ మనిషీ!  తెలుసుకో  , ఓ మనిషీ!! తెలుసుకొని మసలుకో 


**** *** *****

ప్రేమికుల మధ్యే నిస్సహాయంగా చూస్తూ


శాంతి లేదు నిన్ను చూడగా  - బ్రాంతి చెందె నీవు ఉండినా

కాంతి రాదు మానసమ్మునా  -- వెల్తి నాలో వేద నమ్ముగా


నవ్వు లేక నల్గి పోతినే   - పువ్వు చూసి ముర్సి పోతినే 

ఇవ్వు అన్న ఇవ్వ పోతినే  - కొవ్వు అన్న నోరు విప్పనే 


ప్రేమ నీదె సృష్టికిన్ సదా - వాణి నీవే  విధ్యకిన్  సదా

జ్యోతి  నీవే భూతలమ్ము పై - స్వాతి నీవే మబ్బు లమ్మపై


సిద్ది పొందలేక ఉంటినే  - బుద్ధి చిన్న బోయి ఉంటినే   

చద్ది తిన్న భీతి గొంటినే  - ఇచ్చి పుచ్చు కున్న నిప్పునే  


వట్టి మాట ఇప్పు డేందుకే - గట్టి మూట పట్టి పట్టకే 

తట్టి నువ్వు నిద్ర లేపకే....  మట్టి నమ్మి బత్కు నెట్టకే


జ్యోతి నీవె భూతలమ్ముపై - భాతి నిచ్చు భాస్కరా రవీ

హేతువీవె సృష్టికిన్ సదా  - చేతనమ్ము జీవితమ్ములో


మాటలొద్దు నన్ను చూడవే - చేత లొద్దు విందు చేయవే 

ఆట లొద్దు సేవ చేయవే -  లేత బుగ్గ సద్దు చేయవే


*"**"""**


తొలకరిజల్లుకే తొలి వలపు లు పొంది తన్ను తాను మరచె

అలసట లేకయే ఆది ఆనందం పొంది సంత సించె

తలుపు లన్ని మెరసి తప్పులుచేయకే హృదయ మివ్వదలచె

మలుపు తిరుగుతున్న మదిని తెల్యపరిచి సుఖము మెండు అనెను


అధిక దుఃఖం రోగార్తునకు ఔషదంబు సురచిరంబుగు భార్యే

మదిలొ భయ్యం దాహార్తునకు  ఔషదంబు విషయవాంఛకు భార్యే

నది గ సాగే స్నేహార్తును గ ఔషదంబు కడలి తృప్తి కి భార్యే

విధిగ ఉండే దేహార్తునకు ఔషదంబు మగని రంభగభార్యే


ఆనందం వాస్తవానికి దుఃఖానికి మధ్య విరామమే

అన్యూన్యం కాల నిర్ణయ దాహానికి మధ్య విరామమే

సన్మార్గం ఆశ పాశము దేహానికి మధ్య విరామమే

విన్యాసం ప్రేమ బంధము ధర్మానికి మధ్య విరామమే


చిలకలకే చెప్పు చిరు నగవులతోను చెప్పు పాఠ మయ్యే

కలల కోకిలయే కాలపాటలన్ని నేర్పు పుస్తకమ్ము

మెళుకువ పాఠాలు మేలు చేయూతలు పెంచు చదువు తల్లి

కళలు నేర్పటయే కధలు తెల్పు వనిత జీవ రక్షణగా


కామిత ఫలములు ఘటియించు కల్పవృక్షపు రెమ్మగా 

ఆమని కలలను మనసు తో మందు ఇచ్చియు తీర్పుగా

భామిని సుఖము ను వయసుతో పంచి పొందుట నేర్పుగా

కోమలి సహనము వరము గ సేవ ధర్మము భర్తకే


మెచ్చినా పెళ్ళా మే అలుక మిథ్యయె సేవలనందు చూడగన్

వచ్చినా కళ్ళల్లో మెరుపు మిథ్యయె అప్పులు పొందు వానికిన్

మచ్చికా చేతుల్లో కదులు మిథ్యయె తప్పులు చేయు లక్షణమ్

మెచ్చే వ్రాయు బ్రహ్మలిపి మిథ్యయె లోకమునందు చూడగన్


సహాయం సమ్మోహం సమ కరుణయె నా మనసు లో 

విహా రమ్మే పొందే సుఖమనుట యూబీ  వయసు లో 

స్వహాసం మ్మే నాకే భయములను తెచ్చే విషయ మే 

స్వహస్తా లతో భాగ్యం పదములను పట్టే తరుణమే


తమవిధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ




అందరి దగ్గర నుండి అన్ని ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి.

సమయం క్షణమైనా వృధా ఎప్పుడూ చేయ కుండా ఉండాలి  .

శక్తి అణుమాత్రమైనా వృధా ఎప్పుడు చేయ కుండా ఉండాలి.

ఈ వర్తమాన జన్మనే దానధర్మాలు చేస్తూ ఆఖరి జన్మగా చేసుకోవాలి

 ఇది కలియుగ ధర్మం మనిషి మనిషిగా చూడాలి, మనిషిని తృప్తి పరచి, తృప్తి పొందుట, అసలు జీవితం అనగా ప్రేమ ఒక్కటే, మాట ఒక్కటే, గమ్యం ఒక్కటే, ప్రాణం ఒక్కటే అని భావించే భారతీయుల సంప్రదాయ సంసారము.       

మిడి మిడి ఆధ్యాత్మిక జ్ఞానం కలవారు - గమ్యం ఒక్కటే, దారులు వేరు వేరు అని అంటారు.

సరైన ఆధ్యాత్మిక విజ్ఞానం ఏమిటంటే - గమ్యం ఒక్కటే, దారి ఒక్కటే.

మహా పరినిర్వాణం అనునది నిశ్శబ్దం (ధ్యానం, తపస్సు) ద్వారానే సాధ్యం.

పుడమి తల్లికి నీరు పెట్టి విత్తనాలు నాటాలి 

కడలి పొంగుల గాలి చేను చేరు చుండ చూడాలి  

తడిక లల్లిన తీరు వచ్చి విన్నపాలు చూపాలి  

మడిమ తిప్పిన మేలు మార్పు వచ్చు చుండాలి     


సుగుణ వల్లికి ప్రేమ చేసి సద్దు చేసి కోరాలి 

నగల మోజున మాయ వీడి ఒప్పు చేసి తీరాలి 

మగణి మాటకి మాయ వీడి మంచి చేయు చుండాలి  

వగల మారికి ప్రేమ వళ్ళు కళ్ళు విప్పి ఉండాలి  


అరకు ఆశను తీర్చి వేటు నుంచి మార్పు తేవాలి 

మరక పట్టిన మోటు వేటు పొంటి ఉండి తీర్చాలి    

చెరకు తీపియు చూసి ఘాటు ప్రేమ తీర్పు ఇవ్వాలి 

మరుపు మార్పుయు చేసి దియా ప్రేమ ఘాటు పొందాలి 


మమత అంతయు చూపి కాల మార్పు అందు కోవాలి     

సమత బంధము చూసి ధర్మ నేర్పు పొందు చేరాలి     

కలల పంతము మాని అన్న దాత ప్రేమ పండాలి

కళలు చూపియు నిత్య సేవ సల్పి ప్రేమ పొందాలి 


ప్రేమ వళ్ళనేను పెద్దల నొప్పించి పెళ్లి చేసుకున్నా  

ప్రేమ ఆర్భాటము పలుకు సరస మైన రాగ మధురిమలై   

ప్రేమ మల్లెల తో పడక పుణ్య మగును వరద నదుల పొంగు 

ప్రేమ లస్వర్గమే మదిన ఉల్లాసం  వళ్ళ ఉత్త్సాహం 


--(())--


ప్రణయం మూలంబు ఆశ పాశము మర్మం 

తృణమే భాగంబు వీడ మన్నను యుద్ధం  

మనమే మౌనంబు వీడి  పోరుకు సిద్ధం

సమమై ధైర్యము తోను పొందుట ధర్మం

ధనమే మూలంబు రక్తి దారికి మార్గం


చూపులే వలయమ్ము గ చట్టి యుండిన మౌనికా

తాపమంతయు తెల్పియుండియు తృప్తి పొందుము వెంటనే

ఓప్పుతప్పులు నాకు తెల్వదు ఓర్పు చూపితి ఇంకయూ

పాప మేనని భావ మోద్దుయు భార్య భర్తల ఆటయే


ఇద్దరం ఒక తాడుపైనను ఈప్సితమ్ము గ ఆశతో 

సద్దు చేయక చిల్కకొట్టని సొంత సొమ్ముని చూడవా

తొందరొద్దని చెంత వున్నను వేచి వుండుము అంటివా

అద్దమందు న చూచి వుంటివి ఆర్తి అంతయు ముద్దగా


రెండు తాళ్ళను కల్పి చూడుము ‌‌రొక్కమాదిరి గుండునే

రెండు మేనులు కల్సి పోయిన రమ్య గుండెను ఎందుకో

రెండు కత్తుల నిప్పు రవ్వలు  రేగు చుండును కోపమై

రెండు మూడు గ మారు మార్గము రంజు గుండును బత్కులో


స్వేచ్ఛ కోరును  నిత్య వెన్నల సంత సమ్ము న తృప్తిగా

స్వచ్ఛ మైనవి నువ్వు పువ్వులె సంద డంతయు చేయగా

ఇచ్చి పుచ్చును ఒక్కరొక్కరు ఈశ్వ రేచ్ఛ గ జీవితం

ఇచ్చ కంబుగ ఆశతీర్చియు ఈమనస్సుకు హాయిగా


ऊँ!

----

"కౌసల్యప్రముదాత్మజాప్తహనుమా కాకుస్త్థ భక్తాగ్రణీ !

ఆసౌమిత్రివరాప్తసోదరసమా ! ఆశ్చర్య దేహాంచితా !

ఆసాధ్వీమణిజానకీసుతసమా ! ఆచాంత శాస్త్రజ్ఞుఁడా !

మాసాయమ్ముగనీవెయుండుమనిలాత్మాంశోద్భవా.. దండముల్ !!! "


 

"త్యాగమయుండునౌనరుఁడు తారకరామునిఁగొల్వనెంచుచున్

రాగవిదూరుఁడై మదిని రక్తినిఁద్రెళ్ళుచు నిగ్రహుండునై
నాగశయానుఁడౌ హరికి నర్మిలిఁబూజగ కీర్తనాసుధల్
త్రాగెడు వారలెల్లరకుఁదానగనెప్పుడు రామరక్షయై !!! "
--
( ఇందులో.. చివరి పాదమే..సమస్య )



Saturday, 17 July 2021

హాస్యప్రభ


 



శ్రీ శివ మహాపురాణం - 251 వ అధ్యాయం

అవధూతేశ్వరావతారము

నందీశ్వరుడు ఇట్లు పలికెను -


బ్రహ్మపుత్రుడవగు ఓ సనత్కుమారా ! నీవు ఇపుడు పరమేశ్వరుని అవధూతేశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధిని గాంచిన అవతారమును గురించి వినుము. ఈ అవతారములో శివుడు ఇంద్రుని గర్వమును అణచినాడు. ఓ మహర్షీ! పూర్వము ఇంద్రుడు సకలదేవతలతో మరియు బృహస్పతితో గూడి శివుని దర్శనము కొరకై కైలాసమునకు వెళ్లెను. అపుడు అనేకలీలలను చేసే శంకరుడు, ఆ ఇంద్రబృహస్పతులు ఇద్దరు తన దర్శనమునందు ప్రీతితో నిండిన మనస్సులు గలవారై బయలు దేరినారని తెలిసి వారి భక్తిని పరీక్షించుట కొరకై అవధూతరూపమును దాల్చెను. దిగంబరుడగు ఆ అవధూత జ్వలించే అగ్ని వలె ప్రకాశిస్తూ గొప్ప భయమును గొల్పుచుండెను. సత్పురుషులకు శరణు అగు శంభుడు ఆ అవధూత రూపములో ప్రకాశించువాడై మార్గమునకు అడ్డుగా నిలిచెను. ఆయన భుజమునుండి ఉత్తరీయము వ్రేలాడుచుండెను. అపుడు శివుని సన్నిధికి వెళ్లుచున్న ఆ ఇంద్రబృహస్పతులు మార్గమధ్యములో ఆశ్చర్యమును కలిగించే ఆకారముతో భయమును గొల్పుచున్న ఒక పురుషుని చూచిరి. అపుడు తన అధికారముచే గర్వించియున్న ఇంద్రుడు తన దారికి అడ్డుగా నిలబడియున్న పురుషుడు శంకరుడేనని తెలియక, ఆయనను ఇట్లు ప్రశ్నించెను.


శుక్రుడు ఇట్లు పలికెను -


దిగంబరాకారుకడవగు ఓయీ అవధూతా! నీవెవరివి? ఎక్కడనుండి వచ్చితివి? నీప్రసిద్ధమైన పేరు ఏది? నాకు వెంటనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము. శంభుడు తన స్థానములోనున్నాడా? లేక ఇప్పుడు ఎక్కడికైన వెళ్లినాడా? నేను దేవతలతో మరియు బృహస్పతితో గూడి ఆయన దర్శనము కొరకై వెళ్లుచున్నాను.


నందీశ్వరుడు ఇట్లు పలికెను -


లీలా కొరకై ఆ అవధూతవేషమును దాల్చియున్న ఆ శంకరప్రభుడు ఇంద్రుని గర్వమును అణచవలెనని తలచెను. ఇంద్రుడు ఈ విధముగా ప్రశ్నించగా, ఆయన బదులు చెప్పలేదు. ఎవ్వరి చేతనైననూ తెలియబడని స్వరూపము గలవాడు, గొప్ప ఉత్కంఠను రేకెత్తించే లీలలను ప్రదర్శించువాడు నగు శంభుడు దిగంబరాకారములోనున్నవాడై, ఇంద్రుడు మరల ప్రశ్నంచిననూ సమాధానము చెప్పలేదు. ముల్లోకములకు అధిపతి, స్వర్గలోకాధ్యక్షుడు అగు ఇంద్రుడు మరల ప్రశ్నించెను. కాని గొప్ప లీలలను ప్రదర్శించే ఆ మహాయోగి మిన్నకుండెను. ఈవిధముగా ఇంద్రుడు ఆ దిగంబరుని పలు మార్లు ప్రశ్నించిననూ, ఇంద్రుని గర్వమును అణచవలెనని తలపోసిన భగవానుడు ఏమియు సమాధానమును చెప్పలేదు. అపుడు తన ఐశ్వర్యమును చూచి గర్వించియున్న, ముల్లోకములకు అదిపతియగు ఇంద్రుడు కోపించి జటాధారియగు ఆ అవధూతను భయపెడుతూ ఇట్లు పలికెను.


ఇంద్రుడు ఇట్లు పలికెను -


ఓ మూర్ఖా! దుర్బుద్ధీ! నేను అడుగుచున్ననూ నీవు సమాధానము చెప్పకుంటివి. కావున, నేను నిన్ను వజ్రముతో సంహరించెదను. నిన్ను రక్షించువాడు ఎవడు గలడు?  వజ్రధారియగు ఇంద్రుడు ఇట్లు పలికి, ఆ దిగంబరుని కోపముతో చూచి వజ్రమును సన్నద్ధము చేసెను. నిత్వమంగళస్వరూపుడగు శంకరుడు వజ్రమును చేతబట్టియున్న ఆఇంద్రుని చూచి వెంటనే ఆ వజ్రపు దెబ్బ తనపై పడని విధముగా స్తంభింప జేసెను. అపుడు భయంకరమగు ఆకారము గల ఆ పురుషుడు క్రోధముతో వికటముగా నున్న కన్నులు గలవాడై, తన తేజస్సుతో వెనువెంటనే తగులబెట్టనున్నాడా యన్నట్లు మండిపడెను. చేయి స్తంభించుటచే కలిగిన కోపము గల శచీపతియగు ఇంద్రుడు మంత్రముతో అడ్డుకొనబడిన పరాక్రమము గల పాము వలె లోలోపల మండి పడెను. బృహస్పతి మాత్రము, తన తేజస్సుతో గొప్పగా ప్రకాశించుచున్న ఆ పురుషుని చూచి వెంటనే ఆయన శివుడేనని గుర్తు పట్టి నమస్కరించెను. అపుడు గొప్ప బుద్ధిమంతుడగు బృహస్పతి చేతులను జోడించి ఆ ప్రభునకు సాష్టాంగనమస్కారమును చేసి, భక్తితో స్తుతించెను.


బృహస్పతి ఇట్లు పలికెను -


ఓ దేవదేవా! మహాదేవా! శరణు పొందినవారియందు వాత్సల్యము గలవాడా! ఓ గౌరీపతీ! సర్వేశ్వరా! నీకు నమస్కారము. ప్రసన్నుడవు కమ్ము. బ్రహ్మ, విష్ణువు మొదలగు వారు అందరు కూడా నీ మాయచే మోహమును పొందుచుందురు. నీ స్వరూపమును వారు యథార్థముగా తెలియకున్నారు. ఒక వేళ తెలిసిననూ, అది నీ అనుగ్రహాము మాత్రమే.


నందీశ్వరుడిట్లు పలికెను -


అపుడా బృహస్పతి శంకరప్రభుని ఈ విధముగా స్తుతించి, ఇంద్రుడు ఆ ఈశ్వరుని కాళ్లపై పడునట్లు చేసెను. ఓయీ కుమారా! తరువాత గొప్ప బుద్ధిమంతుడు, దేవతలకు ఆచార్యుడు, జ్ఞాని అగు బృహస్పతి చేతులను జోడించి వినయముతో వంగి ఇట్లు పలికెను.


బృహస్పతి ఇట్లు పలికెను -


ఓ దీనప్రభూ! మహాదేవా! నీ పాదములను నమస్కరించే నన్ను ఉద్ధరించుము. కావున, నీవు కోపమును చేయకుము. ప్రేమను చూపుము. ఓ మహాదేవా! తుష్టుడవు కమ్ము. శరణు పొందిన ఇంద్రుని రక్షింపుము. ఇదిగో! నీ లలాటమునందలి నేత్రమునుండి అగ్ని పుట్టి మా వైపు వచ్చుచున్నది.


నందీశ్వరుడిట్లు పలికెను -


కరుణాసముద్రుడగు శంకరప్రభుడు మంచి లీలలను చేయుచుండును. అవధూతరూపములో నున్న ఆయన బృహస్పతియొక్క ఈ మాటను విని నవ్వుతూ ఇట్లు పలికెను.


అవదూత ఇట్లు పలికెను -


కోపము వలన నా కంటినుండి బయటకు వచ్చియున్న తేజస్సును మరల ముందుకు రాకుండా నిలబెట్టుట ఎట్లు సంభవమగును? పాము విడిచిపెట్టిన కుబుసమును మరల ఎట్లు ధరించగల్గును?


నందీశ్వరుడిట్లు పలికెను -


బృహస్పతి ఆ శంకరుని ఆ మాటను విని, భయముతో ఆందోళనను చెందియున్న మసస్సు గలవాడై, మరల చేతులను జోడించి, ఇట్లు పలికెను.


బృహస్పతి ఇట్లు పలికెను -


ఓ దేవా! భగవన్‌! నీవు ఎల్లవేళలా భక్తులపై దయను చూపదగును గదా ! ఓ శంకరా ! నీకు భక్తవత్సలుడను పేరు గలదు. దానిని నీవు సార్థకము చేయుము. ఓ దేవదేవా! మిక్కిలి భయంకరమగు నీ తేజస్సును మరియొక చోట పారవేయుము. భక్తులందరినీ ఉద్ధరించే నీవు ఇంద్రుని ఉద్ధరించుము.


నందీశ్వరుడిట్లు పలికెను -


బృహస్పతి ఇట్లు పలుకగా, భక్తవత్సలుడు అని ప్రసిద్ధిని గాంచినవాడు, నమస్కరించువారి కష్టములను పారద్రోలువాడు అగు రుద్రుడు దేవగురువుతో నిట్లనెను.


రుద్రుడు ఇట్లు పలికెను -


ఓ దేవగురూ! నీపై నాకు ప్రీతి కలిగినది. నీకు ఉత్తమమగు వరమునిచ్చెదను. నీవు ఇంద్రుని జీవితమును కాపాడితివి. కావున, నీకు జీవుడు అను పేరు ప్రసిద్ధిని పొందగలదు. నా లలాటనేత్రమునుండి పుట్టిన ఈ అగ్నిని దేవతలు సహించలేరు. ఇది ఇంద్రుని ఏ మాత్రము పీడించని విధముగా, దీనిని నేను దూరముగా విడిచి పెట్టెదను.


నందీశ్వరుడిట్లు పలికెను -


ఆ శంకరుడు ఇట్లు పలికి, లలాటమునందలి నేత్రమునుండి పుట్టిన తన తేజోరూపమగు అగ్నిని చేతితో పట్టుకొని ఉప్పుసముద్రమునందు పారవైచెను. శివుని లలాటమునందలి నేత్రమునుండి పుట్టి ఉప్పు సముద్రములో పారవేయబడిన ఆ శివుని తేజస్సు వెంటనే పిల్లవాడుగా మారెను. రాక్షసనాయకుడగు ఆ సముద్రపుత్రునకు జలంధరుడు అను పేరు ప్రసిద్ధిని గాంచెను. దేవతలు పార్థించగా మహేశ్వరప్రభుడు ఆతనిని సంహరించెను. లోకములకు మంగళములను కలిగించే శంకరుడు ఈ విధముగా అవధూతరూపమును దాల్చి చక్కని లీలను ప్రకటించి, తరువాత అంతర్ధానమయ్యెను. దేవతలు అందరు పూర్తిగా భయమును విడనాడి సుఖమును పొందిరి. ఇంద్రబృహస్పతులు భయమునుండి విముక్తిని పొందినవారై, ఉత్తమమగు సుఖమును అనుభువించిరి. ఆ ఇంద్రబృహస్పతులు ఏ ఈశ్వరుని దర్శనము కొరకు బయలు దేరిరో, అట్టి ఈశ్వరుని దర్శించుకొని కృతార్థులై ఆనందముతో తమ స్థానములకు వెడలిరి. పరమానందస్వరూపుడగు పరమేశ్వరుడు దుష్టులను శిక్షించును. ఆయనయొక్క అవధూతేశ్వరావతారమును నేను నీకు చెప్పితిని. పవిత్రమైనది, కీర్తిని స్వర్గమును భుక్తిని మరియు ముక్తిని ఇచ్చునది, కోరికలనన్నిటిని ఈడేర్చునది అగు ఈ దివ్యమగు గాథను ఎవడైతే నిత్యము వినునో, లేదా ఏకాగ్రమగు మనస్సుతో వినిపించునో, అట్టివాడు ఇహలోకములో సకలసుఖములను అనుభవించి, మరణించిన పిదప శివుని సాయుజ్యమును పొందును.




శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందు అవధూతేశ్వరావతారమును వర్ణించే ముప్పదియవ అధ్యాయము ముగిసినది.

పండితుని తెలివి

                 ➖➖➖✍️



వెయ్యిన్ని ఎనిమిది రకాలు కూరలు ఉన్నాయా?అసలు మామూలు దినమైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయా? 

ఒక వేళ ఉన్నా ఎవరైనా అన్ని కూరలు వంటలో వాడుతారా? వడ్డిస్తారా?ఒక వేళ వడ్డించినా అన్ని ఎవరు తినగలరు?.

ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు .

దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు.

మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు.శ్రాద్ధ దినము రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చినారు. 

వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది. 

వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు.దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? అన్నారు.

దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను.మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నారు.

వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది

 కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే 

దాని అర్థము శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. మరియు వజ్రవళ్ళి [ నల్లేరు ]  పచ్చడి మూడు వందల కూరలకు సమానము.పనసపండు ఆరు వందల కూరలకు సమానము.

ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు.ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను అంది నమస్కరించి వినయముతో.

అది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై నోటమాట రాక భోజనము చేసి  వెళ్లారుట.


__(())__


గ్రేట్ ఫిలాసఫీ.

చచ్చిపోయేమనుకో.! అప్పుడు ఏమవుతుందంటావ్.?'

'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది.'

'సరే పోనీ. నేనేచచ్చిపోయేననుకో. అప్పుడు ఏమవుతుందంటావు?'

'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!. మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'

'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసాను కదా.!. స్వర్గానికి పోతానంటావా.?'

'స్వర్గం అంటే ఏమిటో.?'

'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, ఊర్వశి, మేనకా డాన్సాడుతూంటారూ.!.'

'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు.?'

'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, ఊర్వశి, మేనకా వెయిటింగన్నారు.?'

రంభా, ఊర్వశి, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ.? పైకొచ్చే మగ వెధవలందరి కోసం కాసుక్కూచోడానికి.? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం, ఎవరో తెలీని ఆడదానితో సరసాలాడటానికా.?'

'మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని.?'

'సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా.? '

'ఛఛ... మా ఆవిడ పతివ్రత.!.'

'అంటే.. నువ్వు వెధవ్వన్నమాట.?'

'సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా.?'

'నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి.? పోనీ.. వేయించేడే అనుకో.. వేయించి ఏం చేస్తాడూ.? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు కదా..'

'అంటే వేయించడంటావా.?'

'ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా.? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి.? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా.?'

'అంటే.. స్వర్గం,

 నరకం లేవంటావు.?'

'ఎందుకు లేవూ.?. స్వర్గం, నరకం చస్తే ఉండవు. బతికుండగానే ఉంటాయి.

ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం.. 

అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో.!. అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.. అది నరకం.

--(())__   


Thursday, 15 July 2021

16/07/2021***




మూడు మూల ప్రతిపాదనలు :
(Three fundamental proposiitions) : 

 మొదటి ప్రతిపాదన :- 

సర్వవ్యాపి, శాశ్వతం , హద్దులు లేనిది సుస్థిరము అయిన ఒకే ఒక్క తత్వం కలదు .. అదీ మాటలకు అందనిది .. మనసు , బుద్ధికి దొరకనిది . ఊహాతీతమైనది . ఈ తత్త్వాన్ని `` అగ్రాహ్యం , అవాచ్యం , అలక్షణం , అచింత్యం  అని మాండూక్యోపనిషత్తు వివరించింది .‌ (అవాఙ్మానస గోచరం)ఈ తత్వాన్ని గురించి మరింత లోతుగా పరిశీలిద్దాం .. వ్యక్తమైన సృష్టికి పూర్వం ఉన్నది ఒక్కటే ఒక్కటి.. అది అనంతం . మూలకారణం . దీన్ని పాశ్చాత్య తత్వవేత్తలు rootless root ( కారణములేని కారణమూ, వేరులేని వేరు ) అనీ unconscious , unknowable ( ( నా ప్రజ్ఞం , అగ్రాహ్యం ) అని వర్ణించారు . తత్వతః దీనికి , వ్యక్త ప్రపంచానికి , ఎటువంటి సంబంధం లేదు . దీన్నే ప్రాజ్ఞులు సత్ అన్నారు .. ఇది అచింత్యం . దీన్ని being అనడం కంటే be- Ness అస్తి , అనడము సబబుగా ఉంటుంది. ఈ be - Ness ది సీక్రెట్ డాక్ట్రిన్ లో ద్విరూపిగా ప్రస్తావించబడింది .  అవ్యక్తాకాశం లేక మహాకాశం ( absolute abstract space )

 2 .  అవ్యక్తమైన సంచలనం ( absolute abstract motion ) ఈ రెండు విషయాలు మానవుని మేధస్సుకు అందనివి . అట్లని ఇవి లేవు అని చెప్పజాలం . చలనం ఉన్నచోట చైతన్యం లేక ప్రజ్ఞ ఉండే తీరుతుంది చలనం వున్నప్పుడు మార్పు తప్పనిసరిగా ఉండే తీరుతుంది . కనుక చలనం , పరివర్తన ఈ రెంటికీ అవినాభావ సంబంధం ఉంది. ఆదిలో సంచలనం అవ్యక్త పరబ్రహ్మ సంకల్ప ప్రభావంతో కలిగింది. ఈ మహాసంకల్పాన్నే మహా నిశ్వాసము ( the great breath ) అని అన్నారు .. ది సీక్రెట్ డాక్ట్రిన్ చేసిన మెదటి ప్రతిపాదన ఉన్నది ఒక్కటే . ఈ ఒక్కటీ పరిపూర్ణమైంది . ( One  absolute be ness ) దీనినే అస్తి అనవచ్చు . ఇదే సృష్టికి కారణం . ఈ ఒక్కటే ఒక్కటిగా చెప్పబడే తత్వ్తమే పరబ్రహ్మ . ఇది రసస్వరూపం . సృష్టికి దీనికి సంబంధం లేదు. అయినా సృష్టి అంతా దినికి పరిమితమైన ప్రతీక . ఇది అద్వితీయము . ఇది కాదు ఇది కాదు ( నేతి నేతి ) అని విచారిస్తూ పోగా , ఒక స్థితిలో ప్రకృతి - పురుషుడు , శక్తి , ద్రవ్యం అనేవి రెండు వైపులు మాత్రమే . ఈ రెండు సృష్టికి ఆధారం . అవ్యక్త స్థితిలో మూల ప్రకృతి , మూల పురుషుడు , వ్యక్త స్థితిలో ఇవి పదార్థం - శక్తిగా గోచరిస్తాయి .. మూలప్రకృతి చరాచరసృష్టిలో నామ రూపాలకు మూలమలనట్లు అవ్యక్త స్థితిలోని మూలపురుషుడు ( విరాట్ పురుషుడు ) చైతన్యానికి ప్రజ్ఞకు మూలాధారము ... అవ్యక్త స్థితి నుంచి , ఈశ్వర సంకల్పానురూపమైన జగత్తు వ్యక్తము కావసినప్పుడు , ప్రకృతి పురుషుల సంయోగం కావాలి . కేవలం పురుషునొక్కని వలనగాని , కేవలం ప్రకృతి వలన కానీ సృష్టి జరగదు . ప్రకృతి పురుషుల సంయోగానికి , ఒక సంధాన సూత్రం కావాలి. ఈ సంధాన సూత్రం ఫోహాత్ ( fohat ) అని పేరొందింది .. ఈ ఫోహాత్ ప్రబావం వల్లనే ప్రకృతి పురుషుల సంయోగం జరిగి సృష్టి వ్యక్తమైంది. పరబ్రహ్మ రాజసశక్తియే ఫోహాత్ . ఈ శక్తి , ధ్యానచోహనుల ద్వారా ప్రకృతి పురుషుల సంయోగం జరిపింది . ధ్యాన చోహానులను విశ్వకర్మలు అనవచ్చు ( architects of the universe ) వీరి ప్రమేయము చేతనే ప్రకృతి పురుషుల సంయోగం జరిగి , ఉపాదులు నిర్మించబడ్డాయి . ఈ ఫోహాత్ శక్తియే మనసుకు పదార్థానికి సంబంధం కలుగజేస్తుంది. ఇంతే కాకుండా ప్రతి పరమాణువునకు జీవాన్ని అందజేస్తుంది .. 
ఈ పై వివరించిన విషయాల సారాంశం :- 
🕉️ వేదాంత పరిభాషలో పేర్కొన్న పరబ్రహ్మ తత్త్వము, సత్యము ఒక్కటే . దీన్నే సత్ అని కూడా అంటారు. ఇదే సత్ - అసత్ కూడా (absolute being and non - being ) 

🕉️ ఆదిలో ఈ పరబ్రహ్మ , ఈశ్వరుడుగ విరాట్ పురుషుడుగ (unmanifest logos ) వ్యక్తమయినాడు . ఇది సగుణబ్రహ్మ అవతరణకు పూర్వపు స్థితి .
🕉️ తదుపరి ప్రకృతి - పురుషుడు ( spirit- matter ) వ్వక్త మయింది . దీనినే జీవం అనవచ్చు .
🕉️ తదుపరి మహాత్తత్వ్తము ప్రకటితమైనది . ఇదియే చిత్ లేక విశ్వాత్మ ( universal soul ) ఇదే ప్రకృతికి దోహదం చేసే తత్వం .
🕉️ గుణాత్మకమైన విశ్వమందు అంతా వ్యాపించి ఉన్న ఈ పరమ తత్త్వం ద్వంద్వ రూపంగా ప్రకటితమైంది ..
                                                                                                                                   con...


Wednesday, 14 July 2021

***

 

సుప్రభాత సమయం, క్రమం మీకు తెలుసా?

 ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి వెళ్తారు. వారు కూడా స్నానసంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తిచేసుకుని సన్నిథిగొల్ల రాకకోసం ఎదురు చూస్తుంటారు. సన్నిథిగొల్ల శ్రీవారి ఆలయానికి విచ్చేయమని ఆయన్ను స్వాగతిస్తారు. అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనాన్ని తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిథిగొల్లని అనుసరిస్తూ మహాద్వారం వద్దకు చేరుకుంటారు. 

    అర్చకస్వాములు మహాద్వారం వద్దకు రాగానే 'నగారా' మండపంలోని నౌబత్ ఖానా (పెద్ద పలకగంట)ని హెచ్చరికగా మోగిస్తారు.

    ఆ ఘంటారావం తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు.

    సన్నిథిగొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వార దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు.

    తమ వద్ద ఉన్న 'కుంచెకోల'ను, తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు.

    వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు.

    సన్నిథిగొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్తారు.

  ఆ సమయానికి జియ్యంగారు కానీ వారి పరిచారకుల్లో ఎవరైనా ఏకాంగి కానీ సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని తోడ్కొని సన్నిథిగొల్ల ఆలయానికి వెళ్తారు.

    సరిగ్గా ఆ సమయానికి ఆలయ అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు అందరూ బంగారు వాకిలిముందు సిద్ధంగా ఉంటారు.

    తాళ్ళపాక అన్నమయ్య వంశం వారిలో ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు.

   సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు. పైన పేర్కొన్న వారందరి ముందు అర్చకులు తమ దగ్గరున్న తాళం చెవితో గడియకు వేసిన తాళాన్ని తీస్తారు.

    సన్నిథిగొల్ల పేష్కారు వద్దనున్న సీలువేసిన చిన్న సంచిలో ఉన్న తాళం చెవులతో, సీలువేసి ఉన్న మూడు పెద్ద తాళాలను తీస్తారు. తీసే సమయంలో అక్కడున్న అందరికీ చూపించడం ఆనవాయితీ.

    తాళాలు తీసిన తర్వాత సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో "కౌసల్యా సుప్రజా రామా ...'' అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.

    ఆ తర్వాత మహంతు, మఠం వారు తెచ్చిన 'పాలు, చక్కర, వెన్న, తాంబూలం' ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకొని వెళ్తారు.

    వారటు లోనికి వెళ్ళగానే బంగారు వాకిలిని దగ్గరకు వేస్తారు.

    బంగారు వాకిలి ముందునున్న వేదపండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనాను కొనసాగిస్తారు.

    సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు.

     సన్నిథిగొల్ల వద్దనున్న దివిటీ వెలుగులో అర్చకులందరూ రాములవారి మందిరానికి వేసిన తలుపు తాళాలను తీసి శయన మండపంలో పానుపుపై ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు.

    దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిథిగొల్ల 'కులశేఖర పడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు.

    ఆ తరువాత అర్చకులు, ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.

    తరువాత సన్నిధిలోని దీపాలను వెలిగిస్తారు. అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేస్తారు.

    తరువాత శయన మండపంలో బంగారుపట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు.

    ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో ... మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు.

     ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు.

    మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి, స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు.

    బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు (సుప్రభాతం) మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. 'నవనీత హారతి' అంటే నివేదనాంతరం ఇచ్చే కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు.

    అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని 'విశ్వరూప సందర్శనం' అని భక్తితో పిలుస్తారు.

__(())__

: "శార్దూలము..

సత్యజ్ఞానమొసంగుదివ్యుఁబిలుతున్ సాయమ్ముకైయెప్పుడున్

నిత్యైశ్వర్యముఁగాంక్షగానడిగెదన్ నీరేజసంజాతనున్

సత్యమ్మో పదదర్శనమ్మునుమదిన్ సత్యాశ్రితానందినిన్

పథ్యమ్మౌనగునీడ్యదర్నమునే భాగ్యమ్ముగానెంచఁగా !!! "

----------------------------------------

 🌼సుభాషితమ్🌼


శ్లో|| యాత్యధోఽధో వ్రజత్యుచ్చైర్నరః స్వైరేవ కర్మభిః।

కూపస్య ఖనితా యద్వత్ ప్రాకారస్యేవ కారకః॥

తా|| "మానవులు తమ తమ కర్మలవల్లనే అధోగతికో ఉచ్చైర్గతికో వెళ్తున్నారు. ఎట్లనిన బావి త్రవ్వువాడు అంతకంతకూ క్రిందకూ, గోడ కట్టువాడు అంతకంతకూ పైకి వెళ్లడం చూస్తున్నాం కదా!"

__(())__


 పడుచు స్త్రీలు సన్యసించుటకు హిందూ ధర్మం సమ్మతించదు, ఎందుకు? 

సనాతన ధర్మాన్ని అనుసరించి, యవ్వనంలో ఉన్న స్త్రీలు కాషాయాంబర ధారులై సవ్యసించుట, సరియై -నది కాదు. ఋతుస్రావము స్త్రీలోని కామవాంచమ సూచించునవి విశ్వాసం. 

యవ్వన మరియు ప్రౌఢ దశ పూర్తయి ఋతుస్రావం ఆగిపోయిన అనంతరం స్త్రీలు భవబంధాలను వదలుకొని సన్యాసిగా మారి పోవచ్చు. ఈ విషయాన్ని మీరు స్త్రీ జాతిని కించపరచడమని తప్పుగా అర్థం చేసుకోవద్దు. 

యవ్వన మరియు ప్రౌడ దశ పూర్తయ్యేత వరకు స్త్రీకి సన్యసిం చడం వీలుకాదు అని మాత్రమే మన ధర్మం చెబుతు న్నది కానీ బాల్య, యవ్వన మరియు ప్రౌఢ దశల్లో ఆధ్యాత్మిక సాధన చేయరాదని మాత్రం చెప్పడం లేదని గుర్తించండి. 

సన్యసించి సాధించే దాని కంటే సంసారిగా ఉండియే అంతకు వెయ్యిరెట్లు ఆధ్యాత్మిక ఉన్నతిని కఠిన సాధనల ద్వారా సాధించవచ్చని మరవకండి. 

సంసారియైన పార్వతీ దేవి తన తపస్సుతో భువనాలను ఏలే భువనేశ్వరియై, జగన్మారై, విశ్వనియంత్రణా శక్తికి అధిష్టాన దైవమై విలపిల్లు తోందని మనం మరువరాదు.

యవ్వనంలో ఉన్నప్పుడు పన్యసించి చెట్లు వెంట, పుట్టల వెంట, సమాజంలోనూ తిరుగుట స్త్రీకి ఎంత వరకు వీలవుతుంది! ఏకాంతంగా పంచ -రించే తను కామాంధుల కళ్ళ నుండి ఎంతకాలం తనని తాను రక్షించుకోగలదు! 

కావున సన్యాసియై దేశదిమ్మరిగా తిరుగుట తనకు వీలు కాదు కాబట్టి సంఘములోనే అవివాహితగా ఉండి (వివాహం ఇష్టం లేకపోతే) తన స్వయంపోషనకు కావలసిన వనరులు ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించుకోవచ్చు.

ఓక యువతి తాను తప్పకుండా సన్యసిస్తానని ధృఢనిశ్చయము కలిగి వుంటే అందంగా కనపడు కునట్లుగా గుండు గీయించుకొని లేదా వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకొని, సంఘరహితయై, నిత్య సంతుష్టురాలై, కామం విషయంలో చలించని మనసు కలిగి వుండి, ఈశ్వరుడిని ఆరాధిస్తూ జపధ్యానాలలో మునిగిపోవచ్చు. 

సన్యాసి అంటే సర్వస్వాన్ని త్యాగం చేసి దేశదిమ్మరియై, బిక్షపై ఆధారపడి తపస్సు చేయువాడు. కాషాయ వస్త్రం కట్టుకొని నాలుగు పూటలా తింటూ సుఖభోగ జీవితాన్ని గడుపుతున్న స్వామాజీలు కాదని మీరు గుర్తించాలి. 

వారిని పెండ్లి కాని పూజారులు లేదా బ్రహ్మచారులు అని అనడం సమంజసం. పంసారుల కంటే సుఖంగా జీవితాన్ని గడుపుతున్న వీరు సన్యాసు లుగా పిలువబడడం నిజంగా హైందవ మతానికి చెదరని అపకీర్తి.

అలాంటి కఠినమైన సవ్యాస దీక్షను తట్టుకో -లేక పంచల క్రింద తలదాచుకొని, జనానికి పురా - ణకాలక్షేపం చేస్తూ, నాలుగు రాళ్ళు వెనకేసుకు టూ పురుషులే వేషగాళ్ళ మాదిరి బ్రతుకుతుంటే, ఇక ప్రకృతి తత్వం కలిగి వున్న స్త్రీలు సన్యాస దీక్షను ఎలా తట్టు కోగలరు.

ఈ కారణం చేతనే పడుచు స్త్రీ సన్యాసానికి తగదని ఋషివాక్కు.

__(())__


#🎾_ఎడమ వైపు నిద్ర పోవడం

భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి .

# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది .

పడుకునే విధానం :----

ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .

# దీనిని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు .

# మన శరీరంలో సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .

# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .

ప్రయోజనాలు ( Benefits ) :--

1 . గురక తగ్గి పోవును .

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .

3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .

4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .

5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .

8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .

9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .

10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .

11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .

12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .

13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .

14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .

15 . ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి .

ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును .

ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .

మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి

గమనిక : ----

తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .

# ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది ...

సేకరణ


“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”

*ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు అంకితం... 

నా మనస్సును కదిలించింది. నాన్న గొప్పదనాన్ని వచ్చే తరానికి,యువతకు తెలియాలి. నా బాధ్యత గా మీకు షేర్ చేస్తున్నాను. మీరు షేర్ చెయ్యండి. మంచిని  పెంచుదాం.

మానస సరోవరం 

ఆయుష్షు చెప్పటం అవసరమా ఆరోగ్యం ఉన్న అం తకాలం, నా అన్న వారు లేరు నాకన్నా బలవంతులు లేరు అనివీర్రా వీగిపోతారు దూదిపింజంలా ఎగురుతుంటారు గాలికి వెళ్ళ్లే మేఘంలా కదులుతూ వార్షమ్ కురుస్తూ బతుకుతారు.

ఆదాయాదులు : సంపద  

 ఆయుష్షు, ఆదాయాదులు, ఇంటిలోని కలహాలు, వ్యక్తిగత రహస్యాలు (తనకు మాత్రమే తెలిసిన లోపాలు) మంత్రం, ఔషథం, తపస్సు, దానం, అవమానం అను ఈ తొమ్మిది విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి...అదే ఉదేశ్యం ఆనందం .. ఆరోగ్యం  ... ఆధ్యాత్మికం . మా ఉద్దేశ్వ౦ 

మీ సహకారమే మాకు ఆదర్శం అదృష్టం మీస్నేహమే మాకు పెన్నిధి   .

***

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే
పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం
తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.
ఆయుర్వేదేన నిర్ణీత మౌషధం రోగిణాం
జ్ఞానం తదైవ నిర్ణీతం సర్వేషాం భవ రోగిణాం
అర్థము: ఆయుర్వేదము రోగముగల సర్వ మానవులకొఱకు ఎట్లు యేర్పడినదో అలాగున అజ్ఞాన రోగముగల సర్వ మానవులకు
బ్రహ్మ జ్ఞానమను ఔషధము భవరోగము లను తగ్గించుట కొఱకు వేదము చే నిర్ణయింప బడి నది.
యాంతి ధర్మ ప్రవృత్తస్య తిర్యం చోపి సహాయతాం
అపంథానంతు గచ్చానం సోదరోపి విముంచతి.
అర్థము:-ధర్మ మార్గమున నడచు వానికి పశు పక్ష్యాదులు కూడా సహాయ పడతాయి.అధర్మ నార్గం లో నడిచే వానిని సోదరుడు కూడా విడిచి పెడతాడు.(సోదరుడు విడిచి పెట్టినా వానికి పాపము అంటదు)(రామునికి కోతులు సహాయము చేశాయి కదా!)
ప్రాంజలి ప్రభ 

 – శ్రీ గోవింద నామాలు --

శ్రీ శ్రీనివాసా గోవిందా | శ్రీ వేంకటేశా గోవిందా |
భక్తవత్సల గోవిందా | భాగవతప్రియ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |
గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

నిత్యనిర్మలా గోవిందా | నీలమేఘశ్యామ గోవిందా |
పురాణపురుషా గోవిందా | పుండరీకాక్ష గోవిందా |

నందనందనా గోవిందా | నవనీతచోర గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా | పాపవిమోచన గోవిందా |

శిష్టపరిపాలక గోవిందా | కష్టనివారణ గోవిందా |
దుష్టసంహార గోవిందా | దురితనివారణ గోవిందా |

వజ్రమకుటధర గోవిందా | వరాహమూర్తివి గోవిందా |
గోపీజనప్రియ గోవిందా | గోవర్ధనోద్ధార గోవిందా |

దశరథనందన గోవిందా | దశముఖమర్దన గోవిందా |
పక్షివాహన గోవిందా | పాండవప్రియ గోవిందా |

మత్స్యకూర్మా గోవిందా | మధుసూదనహరి గోవిందా |
వరాహనరసింహ గోవిందా | వామన భృగురామ గోవిందా |

బలరామానుజ గోవిందా | బౌద్ధకల్కిధర గోవిందా |
వేణుగానప్రియ గోవిందా | వేంకటరమణ గోవిందా |

సీతానాయక గోవిందా | శ్రితపరిపాలక గోవిందా |
దరిద్రజనపోషక గోవిందా | ధర్మసంస్థాపక గోవిందా |

అనాథరక్షక గోవిందా | ఆపద్బాంధవ గోవిందా |
శరణాగతవత్సల గోవిందా | కరుణాసాగర గోవిందా |

కమలదళాక్ష గోవిందా | కామితఫలదాతా గోవిందా |
పాపవినాశక గోవిందా | పాహిమురారే గోవిందా |

శ్రీముద్రాంకిత గోవిందా | శ్రీవత్సాంకిత గోవిందా |
ధరణీనాయక గోవిందా | దినకరతేజా గోవిందా |

పద్మావతిప్రియ గోవిందా | ప్రసన్నమూర్తి గోవిందా |
అభయహస్తప్రదర్శక గోవిందా | మత్స్యావతార గోవిందా |

శంఖచక్రధర గోవిందా | శార్ఙ్గగదాధర గోవిందా |
విరజాతీర్థస్థ గోవిందా | విరోధిమర్దన గోవిందా |

సాలగ్రామధర గోవిందా | సహస్రనామా గోవిందా |
లక్ష్మీవల్లభ గోవిందా | లక్ష్మణాగ్రజ గోవిందా |

కస్తూరితిలక గోవిందా | కాంచనాంబరధర గోవిందా |
గరుడవాహన గోవిందా | గజరాజరక్షక గోవిందా |

వానరసేవిత గోవిందా | వారధిబంధన గోవిందా |
ఏడుకొండలవాడ గోవిందా | ఏకస్వరూపా గోవిందా |

శ్రీ రామకృష్ణ గోవిందా | రఘుకులనందన గోవిందా |
ప్రత్యక్షదేవా గోవిందా | పరమదయాకర గోవిందా |

వజ్రకవచధర గోవిందా | వైజయంతిమాల గోవిందా |
వడ్డికాసులవాడ గోవిందా | వసుదేవతనయా గోవిందా |

బిల్వపత్రార్చిత గోవిందా | భిక్షుకసంస్తుత గోవిందా |
స్త్రీపుంసరూపా గోవిందా | శివకేశవమూర్తి గోవిందా |

బ్రహ్మాండరూపా గోవిందా | భక్తరక్షక గోవిందా |
నిత్యకళ్యాణ గోవిందా | నీరజనాభ గోవిందా |

హాతీరామప్రియ గోవిందా | హరిసర్వోత్తమ గోవిందా |
జనార్దనమూర్తి గోవిందా | జగత్సాక్షిరూప గోవిందా |

అభిషేకప్రియ గోవిందా | ఆపన్నివారణ గోవిందా |
రత్నకిరీటా గోవిందా | రామానుజనుత గోవిందా |

స్వయంప్రకాశక గోవిందా | ఆశ్రితపక్ష గోవిందా |
నిత్యశుభప్రద గోవిందా | నిఖిలలోకేశ గోవిందా |

ఆనందరూపా గోవిందా | ఆద్యంతరహితా గోవిందా |
ఇహపరదాయక గోవిందా | ఇభరాజరక్షక గోవిందా |

పరమదయాళో గోవిందా | పద్మనాభహరి గోవిందా |
తిరుమలవాసా గోవిందా | తులసీవనమాల గోవిందా |

శేషాద్రినిలయా గోవిందా | శేషసాయినీ గోవిందా |
శ్రీనివాస శ్రీ గోవిందా | శ్రీవేంకటేశ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

శ్లో|| ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం

రహస్యం మన్త్రమౌషథమ్|

తపో దానావమానే చ 

నవ గోప్యాని కారయేత్||


హితోపదేశః


తా|| ఆయుష్షు, ఆదాయాదులు, ఇంటిలోని కలహాలు, వ్యక్తిగత రహస్యాలు (తనకు మాత్రమే తెలిసిన లోపాలు) మంత్రం, ఔషథం, తపస్సు, దానం, అవమానం అను ఈ తొమ్మిది విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి....

__(())__

 

# తప్పు అని తెలుసు - కానీ చేయకుండ ఉండలేము


1) మనకు అన్నీ తెలుసు

2) ఇది మంచి పని అనీ తెలుసు

3) ఇది చెడ్డ పని అనీ తెలుసు


4) ఇది చేస్తే పుణ్యం వస్తుంది అనీ తెలుసు

5) అయినా పుణ్య కర్మ చేయం

6) ఇది చేస్తే పాపం వస్తుంది అనీ తెలుసు

7) అయినా పాప కర్మ చేస్తాం - చేయకుండా ఉండలేము


8) అన్నిటికీ మొదటి కారణం మనస్సు

9) మనస్సును అదుపు చేయడం చాలా కష్టం

10) ఎన్నో కోట్ల జన్మల నుండి వస్తున్న వాసనా బలం

11) రెండో కారణం ఇంద్రియాలు

12) ఇంద్రియాలకు చాలా చాలా శక్తి ఉంటుంది

13) ఇంద్రియాలను జయించడం చాలా కష్టం


తప్పు చేయకుండా ఉండాలంటే -


14) శివుడి కాళ్లు పట్టుకోవాలి

15) నీ బలహీనత నీవు శివుడి ముందు చెప్పుకోవాలి

16) నీ ఇంద్రియాలను నిగ్రహించమని శివుడిని అడగాలి

17) అవి నిన్ను పట్టుకున్నాయి - నీవు వాటిని పట్టుకోలేదు.

18) అందుకే వాటిని ఎవడు నీకు పట్టించాడో వాడి కాళ్ళు పట్టుకుంటే - అవి నిన్ను వదులుతాయి

__(())__

 శ్రవేంకటేశ్వర: తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి? 🌻


🍃🌺భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు. మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు. ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు. పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది.

🍃🌺కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది. సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?

🍃🌺మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు. సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవా…
[7:32 am, 27/06/2021] శ్రవేంకటేశ్వర: దేవీభాగవతం - 55
శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు
చతుర్థ స్కంధము - 15
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
లలితా సహస్రనామ శ్లోకము -54

మహారూపా, మహాపూజ్యా, మహాపాతకనాశినీ!
మహామాయా,మహాసత్త్వా, మహాశక్తి, ర్మహారతిః!!

శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
 54వ  భాగములో....
భూదేవి మొర చదువుకున్నాము.
🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏
అమ్మ దయతో......  ఈ రోజు
శ్రీహరి పరాధీనత
దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం
చదువుకుందాం.
🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏

 శ్రీహరి పరాధీనత

భూదేవీ ! బ్రహ్మాది దేవతలారా ! ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేనే కాదు బ్రహ్మదేవుడూ శివుడు ఇంద్రుడూ దిక్పాలకులు చంద్రుడు సూర్యుడూ అగ్ని - ఎవ్వరూ స్వతంత్రులు కారు.
సృష్టి అంతా యోగమాయావశంవదం. బ్రహ్మాదిస్తంభపర్యంతమూ గుణసూత్ర గ్రథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్ఛ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటే అలా చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశులమే.

నేను స్వతంత్రుడినే అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగానూ ఒక తాబేలుగానూ జన్మిస్తానా ? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా ? పోనీ అంటే, క్షుద్రజంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా ? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యానంటారు ? ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ - ఎవరైనా ఎన్నడైనా ఇష్టపతారా ? ఇరవైయొక్క సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడుగా నెత్తురుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం ! ఎంత నీచం ! గర్భస్థ శిశువులనుకూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా ? తరవాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాలలో నివసించాను. జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాలలో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న (పచ్చి) మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా, సిగ్గు పడవలసిన విషయమా ? మీరే చెప్పండి.

బంగారులేడి కనపడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటిరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడుకూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు. నామాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు భిక్షురూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతోంది. అడవులన్నీ మారుమ్రోగేట్టు విలపించాను. కార్యవశాత్తూ సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞచేసి వాలిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను.

నేనూ నా సోదరుడూ నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్య పోయినవారే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాము. అప్పుడు నేనెంత దిగులుపడ్డానో మీకు తెలుసా ! దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు, ప్రియ భార్య అపహరించబడింది, కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడనై అసహాయుడనై పాదచారినై భార్యతో కలిసి పధ్నాలుగేళ్ళు గాఢారణ్యాలలో గడిపాను.

క్షత్రియుడనై పుట్టి బోయవాడుగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగిపొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలం ! లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్యా వియోగ దుఃఖం. వద్దు, పగవారికైనా వద్దు. కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది.

రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి.

చతుర్వదనా ! నీకు తెలుసును గదా ! నువ్వూ రుద్రుడు ఇంద్రుడూ అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు అధీనులమే.
(అధ్యాయం - 18, శ్లోకాలు - 60)

దేవతలారా ! మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. జగద్గురువును స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడూ శాంతుడూ అయిన పరమపురుషుడిని మర్చిపోతున్నాం. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడను - అని అహంకరించి మోహితులమవుతున్నాం. అతి సనాతనమూ పరాత్పరమూ అయిన వస్తువును తెలుసుకోలేకపోతున్నాం. ఐంద్రజాలికుడి చేతిలో కొయ్యబొమ్మలాగా నేనూ ఇంతే. ఎప్పుడూ మాయామోహితుడినై ప్రవర్తిస్తూంటాను.

పద్మసంభవా ! కల్పారంభంలో నువ్వూ నేనూ శివుడూ కలిసి వెళ్ళి క్షీరసముద్ర మధ్యభాగాన మణిద్వీపంలో మందార తరుచ్ఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాంకదా ! సర్వకామప్రద అయిన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి. మనస్సుల్లో స్మరించండి.

శ్రీమహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకలభువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్తకంఠంతో స్తుతించారు.

జగన్మాతా ! సాలీడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీనుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తు అంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరీ ! ఓ కరుణాసముద్రమా ! నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు సంవిద్రూపవు (జ్ఞాన రూప). దేవీ ! మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మీ ! ఓ మహాశక్తి ! మమ్ము నడిపించు.

ఓ భువనార్తి హారిణీ ! అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావుకదా ! కంస కేశి సాల్వ జయద్రథాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వారినందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు. త్రిమూర్తులకుకూడా లొంగని మహామహాదానవులను నువ్వు ఒక కేళీవిలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చెయ్యలేరుగదా ! అనంతుడు ఈ భూమిని ధరించలేడుగదా ! ఓ చంద్రకళావతంసా ! మా విన్నపం ఆలించి మా దైన్యం తొలగించు - అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు. అభ్యర్థించారు.

జగన్నాయకీ ! సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతి లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చినదానవు నువ్వేకదా - అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు.

ఓ త్రిలోకీ ! నీ కళావైభవాన్ని మాకు అందించావు కనక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం. ప్రభుత్వం చెలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే - అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు.

జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులికించింది. దేవతలారా ! పని ఏమిటో చెప్పండి. ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైనా సురల కోరిక తీరుస్తాను. మీకుగానీ ఈ భూదేవికిగానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి - అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు.

భువనేశ్వరీ ! పాలకులందరూ దుష్టులై పీడిస్తూంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరికి వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్ధురాలవు నువ్వే అని నిన్ను ప్రార్ధించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు. దుష్టులను వెంటనే సంహరించు. ఇదివరలో నువ్వు మహిషాసురుడిని సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ నిశుంభ రక్తబీజ చండముండ ధూమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళాది మహాదైత్యవీరులను క్రూరాతిక్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్టభూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లీ !

దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పెట్టున నవ్వింది. కన్గొసలు ఎరుపెక్కాయి. మేఘగంభీర స్వరంతో పలికింది -

 దుష్టశిక్షణకు జగన్మాత వ్యూహం

దేవతలారా! ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీమీ అంశలతో భూలోకంలో జన్మించాలి. భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను.

కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో అనకదుందుభి గా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగుశాపం ఉంది కనక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడుగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతాకార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణీ గర్భసంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్టసంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడూ, అశ్వినీ దేవతల అంశలతో నకులసహదేవులూ, అష్టమవసువుగా (వసు అంశంతో) భీష్ముడూ జన్మించి శత్రుబలాలను క్షీణింపజేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది.

మీరంతా నిమిత్తమాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీష, మోహమూ, కామమూ మొదలైన దోషాలతోనూ, బ్రాహ్మణశాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాపకారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీమీ అంశలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు. అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.

(అధ్యాయం - 19, శ్లోకాలు - 46)


(రేపు.... వ్యాసకృత యోగమాయా ప్రశంస )

 🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే .......‌‌‌‌‌‌‌.🙏
                                  ..... సశేషం
శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌹 ఓం నమో వేంకటేశాయ గ్రూపు సబ్యులకు అందరికీ నమస్కారం.

🌹ప్రస్తుతం గ్రూపులో ఉన్న సభ్యులు కొంతమంది మేసేజ్ లు చూడకుండా కొంతమంది సభ్యులు వున్నారు. వీరికి మెసేజ్ డెలివరీ అవుతుంది. కానీ వాళ్ళు మెసేజ్ చదవడం లేదు. ఇలాంటి వారిని గ్రూపులో నుంచి తొలగించడం జరుగుతుంది.

🌹వీరిని తొలగించడం వలన కొత్తగా కొంతమంది సబ్యులకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

🌹మరొక్క విషయం వ్యక్తి గత కారణంగా రేపటి నుంచి ప్రస్తుతం ఉన్న గ్రూపులు అన్నింటినీ డిలీట్ చేసి కొత్తగా ఓం నమో వేంకటేశాయ గ్రూపు మొదలుపెట్టడం జరుగుతుంది.

🌹కొత్త గ్రూపులో యాక్టివ్ గా ఉన్న వారు మాత్రమే జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది.

🌹కొత్తగా గ్రూపు మొదలు పెట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న గ్రూపులలో మెసేజ్ లు పంపడం జరగదు గమనించగలరు.

🌹మీ యొక్క
పేరు:
ఊరు:
వర్క్ (ఏమి చేస్తుంటారు): ఈ విషయాలు తెలిపితేనే గ్రూపులో జాయిన్ చేయడం జరుగుతుంది.

🌹మీ పేరు ఇలాంటివి తెలపడానికి ఇష్టం లేని వారు గ్రూపులో నుంచి లెఫ్ట్ అవ్వచ్చు.
--
గురుపాదము గొలుచుకొమ్ము
గురుసేవల సలుపుచుండి
కరుణన్ గని సకల జనుల
తరుణమ్మున సాయమిడుము
--
అమలమ్ముగ నుంచి యెడఁద
సమభావముఁ బెంచుకొమ్ము
గమనించుచు సృష్టి రచన
ప్రముదమ్మునఁ బ్రణతులిడుము
--
నిరుపేదల నిరసించకు
ఒరులెవ్వరి దూరఁబోకు
గరిమమ్మిడు గుణముఁ బెంచు
సరసంబగు బాసలాడు
--
అతిగానెటఁ బల్కఁ బోకు
మతినుంచుము మాతనెపుడు
స్తుతిసేయకు దుష్టజనుల
గతిమార్చకు మాశమీఱి
--
ప్రాప్తమైనదానితోడఁ
దృప్తి గలిగి బ్రతుకనగును
ఆప్తవాక్యమంచునెంచి
జ్ఞప్తినుంచ సూక్తి మేలు
--
వెంటరావు కాసులేవి
జంటయగును గర్మమొకటె
మంటలోన బూడిదగుచు
మంటిలోనఁ గలయఁ దనువు
--
పాపభీతిఁ గలిగి యుండు.
ఆపలేని వాఁడననుచు
వేపఁబోకు పెచ్చుమీఱి.
తాపమిడును యముఁడు పిదప
--
మర్మముంచఁబోక మదిని
ధర్మమార్గమందె సాగి
కర్మఫలము విభునికిడుము
వర్మమగును దైవమతఁడె
--
ఆశలెన్ని యున్నఁగాని
నాశనమునుజేయకొరుల.
పాశమెపుడొ తగులుకొనును
క్లేశమొదవ నీకుఁ గూడ
--
మోసగించి బ్రతుకఁబోకు
హాసములను బయికిఁ జిమ్మి
దాసజనము మెచ్చఁబోరు
మాసిపోవునున్న పేరు
--
పిల్లపాపలందఱలర
మెల్లఁగాను దరికిఁ దీసి
చల్లఁగాను గాయుచున్న
నిల్లె స్వర్గమగును జూడ
--
కల్లలాడఁ గాదు ముద్దు
చెల్లదెపుడు దాట హద్దు
అల్లరవఁగ నెమ్మి రద్దు
తల్లి చెప్పుదొకటె కద్దు
--
చల్లనైన తల్లి యగుట
నెల్లరొకటె కనఁగఁ దలికి
నుల్లసిల్లు నేకమయిన
kaalamaay tapp dika
--((***))--
 

 

మనోరమ ముద్దు కోసం... కవిత

మను వాడ గా వచ్చితి నే సహనమ్ము తొ
తను వంత యు తాపము దాహము దేహము
విను మాటలు నచ్చితి వే మన సైనది
కనుక సైగలు చేయుము కాలము నీదియు

అటులే ఇక నాకు యు నీ కును శోభ యె
చిటికేసిన పిల్పు కు వచ్చె ద వెంట నె
కటి నేల ను తాకి యు ఉంటిని ఆశలు
ఇటు తీర్చు ము వేడి కి చల్లగ ఉండును

కళగా ఇచటే కొలువే మనకుందిలె
ఇలలో కలిసే తెలిపే వరసుందిలె
కలలో కదిలే కథలే శుభ కాంక్షలె
వలలో మనమే ఒకటై సుఖముందిలె

తనువే తపనే కలిగే ఇక ఏలిక
మనసే బిగువై వరదై ఇక పొంగులె
మనువే ఇకలే కలలే ఇక తీర్చుకొ
అణువైనవి సేవకులుగా మనకుందిలె

తరుణం ఇదియే శరణం అనుచుంటిని
పరువం మనదీ పదిలం ఇక విదితం
సరళం సుముఖం సహనం మన జంటకు
కరుణా లయమే కథనం చిరు శాంతిగ

0
నేటి ఛందస్సు ...  

కోరు వయసులోన - కొరికే తృప్తిగా  
చేష్టలగను - కలలు తలపు గాను  
సేవ బలము - వర్ణ మవ్వుటే జీవితం  
ప్రేమ బ్లు చూపుటే

చేరు తనువులోన - తాపమే  తృప్తిగా
కష్టములను - కళల వలపు గాను  
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  
కాల కలలు తీర్చుటే  

అమ్మ పలుకు లోన - బ్రేమయే మానసం
అన్ని తెలుపు - మనసు కదలయయ్యె
కాని పనులు వద్దు - భావమే మానసం
నన్ను మరువటేల నీవు    

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా
కన్నె మనసు - కలల కవనమయ్యె
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా
నన్ను కనవదేల నీవు

ప్రేమ తలపులోన - బంధ బాంధవ్యమే
ప్రేమ చెలిమి - మాన్సు తలపు గాను
ప్రేమ మనసుచేరి - బ్రేమనే పంచుటే
ప్రేమ అనునదే ఇదీ    
 
కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను
నష్ట మనునదేది - చేయకే ఉండుటే
ఇష్ట మనునదే ఇదీ