Wednesday, 28 February 2024




085.. ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
ఆనడం - ఆరోయం - ఆద్యాత్మికం

ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ
ఆది శంకరులు రచించిన భజగోవిందం శ్లోకాల భావాన్ని తేట తెలుగు లో తెలియ పరుస్తున్నాను.

భజగోవిందం -1
జీవితమనేది ఉషోదయం లా ఉత్సాహం అస్తమయం లా విశ్రాంతి ప్రతి ఒక్కరికి అవసరం. అన్నీ వషయాలలో వ్యాకరణ పాఠాలు వల్లె వేయుట వలన ప్రయోజనము లేదు. ఓ మూఢమతి ప్రాణావ సాన సమయమున చదివిన విధ్య రక్షించదు. కనుక గోవిందుని నిత్యము స్మరించండి. మృత్యు సమయంలో కూడా గోవిందుని నామమే రక్షించును.

భజగోవిందం - 2 (ప్రాంజలి ప్రభ)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

మానవ జీవనానికి అతి ముఖ్యమైనది బ్రతుకు సార్ధకము చేసు కొనుటకు ఉపయోగపడేది ధనము. అవివేకి వలే ధనము కోసం అతిగా కష్ట పడకూడదు, లక్ష్మి యెంత వరుకు సహకరించునో అంతవరకే లభించును. పేరాశకు పోకుండా మంచి బుధ్ధితో బ్రతకటం నేర్చు కోవాలి. మన గత కర్మల ఫలితముగా మనకు లభించిన ధనముతో తృప్తి పడి జీవించటము వలన మన: శాంతి కలుగును ఆది శంకరులు తెల్పిన భజగోవిందం.

భజగోవిందం-3 (ప్రాంజలి ప్రభ)
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ

ఆకర్షణలకు లొంగని మానవులు ఉండరు. మాయా ప్రపంచంలో బతకటం నేర్చు కోలేని వారు మనుష్యులగా గుర్తించటం కష్టం. పరమాత్ముడు స్త్రీ కి ప్రత్యేక రూపం కల్పించాడు, స్త్రీ ల వక్షోజములను, నాభి ప్రదేశమును చూచి, మోహా వేశము నొందకము. నీకు సుందరముగా కన్పించు ఆ అవయవము లన్నియు కేవలము మాంసము క్రొవ్వు మోదలగు వాని మారు రూపాలే అని స్పష్టముగా గ్రహింపుము. మితిమీరిన వ్యామోహం అనర్ధ దాయకం ప్రేమించి ప్రేమ పొందటమే జీవితం


086.. ప్రాంజలి ప్రభ భజగోవిందం -4
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

మానవులకు బుధ్ధి నిలకడ ఉండదు. అది తామరాకు పై నీటి బొట్టులా కదులుతూ ఉంటుంది. చూడలేని గాలి కదలికలు యెలా మనలో ప్రవేసిస్తాయో అలాగే మనలో బుధ్ధులు చంచలముగా మారి వ్యాధులకు, దురభి‌ మానమునకు, దేహము ఆధీన మవుతుంది. లోకమంతా శోక మయ మగుటకు ఋధ్ధే కారణమవు తుంది. కనుక బుధ్ధి నిలకడగా ఉంచి, దేహతృప్తి కోశం ఆశ పడక ఉన్న జీవితమే నిజమైన జీవితం

మంత్రిగారూ! తమరేమీ అనుకోరంటే ఓ మాట!

ఏమీ అనుకోను, చెప్పవోయ్!

మీ కింద ఊడిగం చేసేవాడికి అప్పనంగా ఇరవై లక్షలు చేతిలో పెట్టి ఓ పదిమందిని రోజూ ఇస్తానని చెప్పి ఎం. పి గా పోటీ చేయమన్నారు, అదంత అవసరమా అని?

ఓరి పిచ్చోడా! ఇంతకాలం నాతో తిరిగావు గానీ రాజకీయాలు వంట పట్టించుకున్న పాపాన పోలేదు.
గత మూడు సార్లు మనకు ఎదురు లేదు కాబట్టి నెగ్గుకొచ్చాము, ఇప్పుడా పరిస్థితి లేదు, ఇక్కడ సరిసమానముగా రెండు వర్గాలున్నాయి!
ఇప్పుడు మనది కాని వర్గము మనిషి పోటీ చేయబోతున్నాడు, ఆ వర్గానికి చెందిన ఈ నా అనుచరుడిని బరిలోకి దింపుతున్నాను, వీడికి, వీడి వర్గంలో మంచోడనే పేరుంది, వీడు వీడి వర్గం నుండి నాలుగో వంతు వోట్లు రాబట్టుకున్నా నా గెలుపు సునాయాసము!

087..చేగోడీ కంప్యూటర్‌కంపెనీ(కథ) (సేకరణ) 

సాహితీమిత్రులారా! 
శివరాం కి సాధారణంగా కోపం రాదు. కానీ హైదరాబాదులో విమానం ఎక్కిన్యూయార్క్‌లో దిగేదాకా ఒళ్ళు మండుతూనే వుంది. ఎప్పుడు ఇండియా వెళ్ళినా, వచ్చినా, Air India లో ముసలి గుజరాతీ తల్లిదండ్రులు, పిల్లలకి గుళ్ళూ,గోపురాలూ చూపించి భారత లేదా తెలుగూ కల్చర్‌నాలుగు వారాల్లో crash course యిచ్చేద్దామనుకునే మధ్యవయసు భారతీయులే తప్ప ఇటువంటి ప్యాసెంజెర్లని చూడలేదు. విమానం నిండా వాళ్ళే… తనొక్కడు తప్ప. 

“ఏమిటి చేశారు .. విజ్వుల్‌బేసిక్కా? ఫరవాలేదు. నేనా! ఆరేకల్‌ ఆర్నెల్లు training తీసుకున్నాను… ఆరేకల్‌డి బి ఏ యా లెక financials నా? ఎందుకైనా మంచిదని రెండూనూ… ఈ మధ్య AS/400, PeopleSoft కి విపరీతంగా demandఉందండీ.. అవి చేసే బదులు ఏకంగా SAP చేస్తేనే మంచిది. ఏనుగు కుంభస్థలంకొట్టొచ్చు…” 

ఈ పై విధంగా ఆ Air India plane లో మాట్లాడుకునే వాళ్ళ భాషలో శివరాంకిఒక్క మాట కూడా అర్థం అవలేదు. అసలు ఆ టాపిక్‌ఏమిటో కూడా తెలియటం లేదు. పొరపాటున ఈ ఖగోళం నుంచి మరో సివిలిజేషన్‌కి వెళ్ళిపోయామేమో అనుకుంటూ పక్కనే కూచున్న చౌదరి గారికేసి చూశాడు. మన హైదరాబాదు మనిషి లాగే వున్నాడు. చౌదరి మెడలో ఒక లాకెట్‌వేలాడుతోంది. అందులో ఒక గెడ్డపాయన ఫోటో వుంది. చౌదరి గంటకొకసారిఆ గడ్దపాయన ఫోటో కళ్ళ కద్దుకుని దణ్ణం పెట్టుకుంటున్నాడు. 

ఎవరండీ ఆయన? కొత్తగా వెలిసిన స్వామీజీ గారా! అనడిగాడు శివరాం ఉండబట్టలేక. ఈయన స్వామీజీ కాదు సార్‌! చెంద్రబాబు నాయుడు. ఆయనే మా అందరికీ నాయకుడు. ఎవరూ! chief minister ఫోటోయా? అవును సార్‌! నాయుడు గారు ఆంధ్రాని అమెరికా కంటే పెద్ద కంప్యూటర్‌ దేశం చేసి పారేద్దామని వ్రతం పట్టాడు. Bill Gates అంతటివాడు నాయుడుగారిని చూసి డంగై పోతున్నాడు. మా అందరికీ అసలు స్వామీజీ నాయుడు గారే! 

“మా అందరూ” అంటే? 

అదేనండీ .. ఈ విమానంలో ఉన్న వాళ్ళం అందరం కంప్యూటర్‌ software గాళ్ళం.మేమే నేటి బాలలం .. రేపటి పౌరులం. దేశానికి డబ్బు, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే వీరులం. ఆవేశపడి పోతున్నాడు చౌదరి. 

అప్పటికి అర్థం అయింది శివరాం కి ఇందాకా వాళ్ళు మాట్లాడుకుంటున్న భాషకంప్యూటర్‌భాష అని. మెల్లిగా వివరాలు తెలిశాయి. చౌదరితో బాటు మరొక నలుగురు ఆ విమానంలోనే కత్తిపూడి, కాపవరం,కైకలూరు వగైరా ఊళ్ళలో computer training తీసుకుని H1 వీసాల మీద అమెరికా వస్తున్నారు. 

ఆముదాలవలస నుంచి అనకాపల్లి దాకా ఆంధ్రాలో అన్ని ఊళ్ళలోనూ, ప్రతి జంక్షన్‌దగ్గరా ఒకకిళ్ళీ కొట్టూ, పక్కనే కంప్యూటర్‌సెంటర్‌ఉండటం చూసి శివరాం నవ్వుకున్నాడు మొన్నమొన్ననే.చౌదరి sponsoror … అంటే H1 వీసాలు సంపాయించి అమెరికా తీసుకు వెళ్తున్న ఆసామీ పేరు క్రిస్‌మర్టీ ట. కంపెనీ అమెరికాలోచాలా పేరున్న పెద్ద కంపెనీ .. పేరు చేగోడీ కంప్యూటర్స్‌. 

చేగోడీ … ఆ మాట విని, చేగోడీలు తిని అనేక యుగాలు అయిందే అని కొంచెంగింజుకుంటున్న శివరాంని చూసి, క్రిస్‌గారికి చేగోడీ లంటే చాలా ఇష్టం అనీ, అమెరికా వాళ్ళు ఆనియన్‌రింగ్స్‌ని ఆంధ్రాచేగోడీ నుంచి కాపీ కొట్టారని క్రిస్‌గారి అభిప్రాయం అనీ, మా ఈ కంప్యూటర్‌బ్యాచ్‌వాళ్ళందరినీ డల్లాసులో ఒక బ్రహ్మాండమైన guest house లో వుంచి projects లో పనిచేయిస్తూ నెలనెలా జీతం ఇస్తూ అఖండ గౌరవం చేస్తారనీ చౌదరి ఎంతోకుతూహలంగా వివరించాడు. విమానంలో వున్నరావు, మూర్తి, రెడ్డి, రాజు వగైరా కంప్యూటర్‌కళాకారులందరూ పైకి ఆర్భాటంగాసూటూ బూటూ వేసుకుని ఎప్పుడుఅమెరికాలో దిగుదామా అని భయం భయంగా ధైర్యం నటిస్తున్నారు. 

Air India విమానం న్యూయార్క్‌లో దిగగానే కస్టమ్స్‌వాళ్ళు ప్యాసింజెర్లందరినీలైనులో నుంచోబెట్టారు. విజువల్‌బేసిక్‌ వాళ్ళంతా తెల్ల లైను, C, C++, java గాళ్ళందరూ నల్ల లైను, PeopleSoft, AS/400, గాళ్ళు ఎర్ర లైను, SAPవాళ్ళు మటుకు, ఇదుగో ఈ gold carpet మీద లైన్లలో నుంచోండి అని హెచ్చరికలు చేశారు. శివరాం కి మళ్ళీ ఒళ్ళు మండింది. తను అమెరికా వచ్చి పాతికేళ్ళయింది. తన గురించి ఒక్క కస్టమ్స్‌ఆఫీసరూ పట్టించుకోలేదు.తన ఒళ్ళు మంట ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూండగానే ఒక నల్ల దొర వచ్చి… దూకుడుగా .. ఏం ఇక్కడే నుంచున్నావు అని కోప్పడ్డాడు. ఎక్కడ నుంచోవాలో తెలీక అన్నాడు శివరాం. 

నువ్వేమిటి? విజువల్‌బేసిక్కా, యూనిక్సా, విండోసా … అని అడుగుతున్న ఆ జాన్సన్నిచూసి అయామ్‌ ఎ మెకానికల్‌ ఇంజనియర్‌ అన్నాడు శివరాం. 

ఇంజనియర్‌వా … ఐతే ఇక్కడ నిలబడు అన్నాడు జాన్సన్‌జాలిగా . ఆ లైనులోతనొక్కడే ఉన్నాడు. ఆఖరివాడిగా, మిగిలిన కంప్యూటర్‌లైన్లన్నిటికీ వెనకాల. 

మొత్తానికి ఆ కంప్యూటర్‌వాళ్ళందరూ న్యూయార్క్‌నుంచి Dallas, Chicago, Raleigh, Atlanta, ఎవరి దారిన వాళ్ళు పోగా తను హ్యూస్టన్‌ flightతీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రాణం పోయినా మళ్ళీ హైదరాబాదు నుంచి బయలుదేరే Air Indiaలో ప్రయాణం చెయ్యనని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకున్నాడు. 

DFW – Dallas – Fort Worth విమానాశ్రయం లో విమానం ఆగింది. చౌదరి,రావు, రెడ్డి, రాజు, శాస్త్రి ఐదుగురూ అర్జంటుగా వేసుకున్న సూట్లు సద్దుకుని, పౌడరు, సెంటు పూసుకుని ఎర్రగా బుర్రగా పొడుగ్గా హాయ్‌హౌ ఆర్‌యు అని అమెరికన్‌ఇంగ్లీషులో మాట్లాడే క్రిస్‌మర్టీ గారికి ఎలా షేక్‌హండ్‌ఇవ్వాలా, ఎవరు ముందు మాట్లాడాలా అని ఆ పంచ పాండవులు తర్జన భర్జన పడుతుండగా … ప్యాసెంజెర్స్‌ని రిసీవ్‌చేసుకోవటానికివచ్చిన నల్ల, తెల్ల, పసుపు .. అంటే చైనా దొరలందరూ వెళ్ళిపోయారు. 

క్రిస్‌గారు ఎలా ఉంటారో తెలియక ఇప్పుడెలాగరా భగవంతుడా అని చౌదరికంగారు పడుతుండగా,క్రిస్‌మర్టీ వచ్చి హలో అయామ్‌క్రిస్‌మర్టీ అనిపరిచయం చేసుకున్నాడు. అతని మొహం చూసి చౌదరి రావు మొహం, రావు రెడ్డి మొహం, రెడ్డి రాజు మొహం, రాజు శాస్త్రిమొహం చూసుకున్నారు. ఇలా మొహాల వీక్షణ కార్యక్రమం పూర్తయ్యాక పంచపాండవులు కలిసి క్రిస్‌ మొహం కేసితీవ్రం గా చూశారు. గోధుమ రంగులో, పొట్టిగా, గుజరాతీ వాళ్ళలా గిల్టు బంగారు రంగు కళ్లద్దాలతో ఉన్న క్రిస్‌ వాళ్ళకి క్రిస్‌లా కనబడలేదు. మర్టీలా కనబడలేదు. క్రిస్‌మర్టీలా అసలు కనబడలేదు. 

ఆర్యూ క్రిస్‌మర్టీ సార్‌? అని అడిగాడు చౌదరి ధైర్యం చేసి. అవునండీ welcome to America అన్నాడు తెలుగుఇంగ్లీషులో క్రిస్‌మర్టీ. క్రిస్‌మర్టీ అంటే … నసిగాడు రావు. ఓ అదా! నా అసలు పేరు కృష్ణమూర్తి లెండి. అమెరికా కదా … అంచేత వాళ్ళకిఅర్థమయ్యే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది.. 

సరే, క్రిస్‌గారు పంచపాండవుల్ని తన లెక్సస్‌, అనగా చిన్న ఖరీదైనకారులో ట్రంకులో సామాను అంతా పట్టకపోతే తాడు వేసి కట్టి guest house కి తీసుకెళ్ళాడు. Guest house అంటే ఆంధ్రా గవర్నర్‌గారి ఇల్లు లాగానో రామోజీ రావు గారి ప్రపంచ ప్రఖ్యాత స్టూడియో guest house లా డజనుమంది వంటవాళ్ళు, కార్లు, డ్రైవర్లతో ఉంటుందనో, కనీసం కాలవ మీదకి ఖాకీ టోపీ పెట్టుకుని నిక్కర్‌వేసుకుని ఉప్పాడ కాలవ inspection కి వచ్చే సివిల్‌ఇంజనీరు గారి రాదారి బంగళాలా ఉంటుందనోఅనుకున్న చౌదరి ఊహాశక్తి చాలా దెబ్బ తినేసింది. డల్లాస్‌లో అతిబీద నల్ల వాళ్ళూ, మరియుమెక్సికన్‌వాళ్ళూ ఉండే సందులు గల్లీల్లో ఒక బిల్డింగ్‌లో ఎనిమిదో అంతస్తులో ఉండే రెండు గదులఫ్లాట్‌ అనగా అపార్టుమెంట్‌నే కంప్యూటర్‌ వాళ్ళందరూ guest house అంటారని తెలిసి పంచపాండవులులక్క ఇంటిలో ధర్మరాజు, అర్జునుడూ, భీముడు, మరియు అన్ని సినిమాలలోనూ ఒక్క డైలాగు కూడా లేకుండాకేవలం తలకాయలు పైకీ కిందికీ ఊపుతూ అభినయించే నకుల సహదేవులు లాగా ఫీలయిపోయారు. 

పాపం పండి అమెరికా వచ్చి పడ్డామని పాండవులకి తెలియడానికి పాతికరోజులు పట్టలేదు. ఒక్కొక్కడి దగ్గరా లక్ష రూపాయలు trainingకనీ, వీసా ఖర్చులనీ డబ్బు పుచ్చుకున్నచిన్నారావు క్రిస్‌మర్టీ గారి స్వయానా రెండో బావమరిది అని తెలిసిపోయింది. వైజాగ్‌కరపాంమార్కెట్‌లోనూ, కాకినాడబోగందాని చెరువు పక్కనూ, అనకాపల్లి బెల్లం దుకాణాల మధ్యలోనూ ఉన్నకంప్యూటర్‌ training centers కీ, చేగోడీ కంప్యూటర్‌ కంపెనీకి ఉన్నది డబ్బు పంచుకోడం తప్ప అసలువ్యాపార సంబంధం ఏమీ కాదని తెలిసి పోయింది. Project మాట దేవుడెరుగు, నెలనెలా జీతం మాటదేవుడెరుగు, ఆరుగురు ఉన్న guest house లో telephone కూడా లేదనీ అందరికీ కలిపి మనోవర్తి, అంటే ప్రాణం పోకుండా తిండి ఖర్చులు మటుకు చేగోడీ కంప్యూటర్‌వారు కేవలం రెండు నెలలు భరిస్తారనీ, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు పోవచ్చు అని అంటారని తెలిసిపోయింది. డబ్బు పుచ్చుకుని,అమాయకులైన కంప్యూటర్‌ ప్రోగ్రామర్లని అమెరికా తీసుకు వచ్చి, నడిరోడ్డులో వాళ్ళని వదిలెయ్యడం మాత్రమే ఇటువంటి చేగోడీ కంపెనీల వ్యాపారమని తేలిపోయింది. 

మామూలు కంటే గట్టిగా టెలిఫోన్‌మోగింది. 

“హల్లో” అన్నాడు శివరాం 

ఓ! what a surprise, ఎలా ఉన్నారు? 

ఎలా ఉందండీ మా దేశం? 

అదేమిటి! నా మొహంలా వుందీ, అంటే! 

ఓ … really! 

… నిజంగానా! అంత మోసం చేస్తారా ఈ కంప్యూటర్‌ కంపెనీ వాళ్ళూ … too bad. 

… I am sorry! 

…ఓ పని చెయ్యండి, మా హ్యూస్టన్‌ వచ్చెయ్యండి. కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండొచ్చు 

… అబ్బే పరవాలేదు. మా ఆవిడ చాలా understanding మనిషి. 

… ఫరవాలేదు. Greyhound లో డల్లాస్‌లో ఎక్కితే హ్యూస్టన్‌ ఐదారు గంటల్లోవచ్చేస్తారు. నేను వచ్చి pick-up చేసుకుంటాను. Don’t worry. We will work it out చౌదరి గారూఅనిఫోన్‌ పెట్టేశాడు శివరాం. 

శివరాం కి ఒళ్ళు మండిపోతోంది. ఈ శనివారం చౌదరి డెల్లాస్‌నుంచి వస్తాడు.పాపం, పంచపాండవులకి ఎంత మోసం జరిగిందీ … ఆంధ్రా వాళ్ళ కంప్యూటర్‌ వ్యాపారం ఇంత అధ్వాన్నంగాఉంటుందని అందరికీ తెలియదు కదా అని అనుకుంటూ Monica Lewinsky latest news విందామని TV remote కోసం సోఫా వెనకాల వెదుకుతూ ఉండగా శివరాం భార్య అర్జంటుగా గెంతులేసుకుంటూ వీధి తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. వస్తూనే “ఏమండోయ్‌.. I finally did it ” అంది. 

ఏమిటి ఏంచేశావు? 

ఇదుగో చూడండి, అని కాయితాలు శివరాం మొహం మీద పడేసింది. 

అదేనండీ, మీరు ఇండియా వెళ్ళి వచ్చిన దగ్గర్నుంచీ ప్రాణం తీశారుగా ఏదోకంప్యూటర్‌కోర్స్‌లో చేరమనీ, I finally did it. 

శివరాం కి మళ్ళీ ఒళ్ళు మండింది ఆ కాయితాలు చూడగానే. 

ఏమిటీ, SAP లో జేరమన్నారుగా! చూడండి This is an excellent deal.మొత్తం ఖరీదు $10,000. రెండు వారాలు training. ఎక్కడనుకుంటున్నారు … హైదరాబాదులో! వాళ్ళే ticket పెట్టి అక్కడికి తీసుకెళ్ళి training ఇస్తారట. అటు ఇండియా వెళ్ళినట్టూ ఉంటుంది. రెండువారాలు training కి మూడు నెలలు training అయినట్టు సర్టిఫికెట్‌ ఇస్తారుట. చూశారా, అన్నీలాభాలే. వెనక్కి వచ్చాక గంటకి 150 డాలర్లు ముందు అంటే ఏడాదికి $300,000 – ఆ తర్వాత 200 డాలర్లు… ఇక మీరు ఉద్యోగం మానెయ్య వచ్చు, నేను సెటిల్‌అయాక మీరు కూడా SAP లో … 

శివరాంకి సాధారణంగా కోపం రాదు. ఇవాళ మటుకు ఒళ్ళు మండి పోతోంది. 

ఏమిటండీ అంత కోపం ఎందుకూ ? 

ఎందుకా! ఇదుగో ఇందుకూ, అన్నాడు ఆ కాగితాలలో ఆఖర్న ఉన్న సంతకం చూపించి. అవునండీ, He is a nice fellow .. క్రిస్‌మర్టీ from చేగోడీ కంప్యూటర్స్‌. Head quarters డల్లస్‌లో నట. వాళ్ళకి ఇండియాలో కూడాఅన్ని ఊళ్ళలోనూ training centers ఉన్నాయిట. 

అందుకు కాదు, అందుకే .. ఇందుకే .. అసలు అందుకే అన్నాను. శివరాంకి మాటలు తడబడు తున్నాయి. 

శివరాంకి ఎందుకు ఒళ్ళు మండుతోందో ఆవిడకి ఏమాత్రం అర్థం కాలేదు. 
----------------------------------------------------------- 
రచన: వంగూరి చిట్టెన్‌ రాజు, ఈమాట సౌజన్యంతో 
-------------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

088.. ఒకసారి ఒక తెలివైన మరియు తెలివైన యువకుడు IAS (ఇండియన్ సివిల్ సర్వీస్) ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
అతన్ని అడిగారు -
Q 1. భారతదేశం ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
అతను సమాధానం చెప్పాడు - ప్రయత్నాలు చాలా కాలం క్రితం ప్రారంభమయ్యాయి; కానీ 1947లో విజయం సాధించవచ్చు.
Q 2. ఈ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు?
సమాధానం - ఇందులో పాలుపంచుకున్న మరియు సహకరించిన వారు చాలా మంది ఉన్నారు. నేను పేరు చెపితే ఇతరులకు అన్యాయం జరుగుతుంది.
Q 3. అవినీతి దేశానికి అతిపెద్ద శత్రువు అని మీరు అనుకుంటున్నారా?
సమాధానం - ఈ విషయంలో ఒక కమిటీ విచారణ చేస్తోంది. నివేదిక చూసిన తర్వాతే దీనికి సరైన సమాధానం చెప్పగలను.

ఇంటర్వ్యూ బోర్డు అతని అసలు ఆలోచనలకు ముగ్ధులైంది. వారు బయట వేచి ఉండమని అడిగారు; కానీ ప్రశ్నలను బహిర్గతం చేయవద్దని అతనికి సలహా ఇచ్చాడు, ఎందుకంటే వారు ఇతర అభ్యర్థులను కూడా అదే ప్రశ్నలను అడగవచ్చు.

యువకుడు గది నుండి బయటకు వెళ్లినప్పుడు, మరొక వ్యక్తి అడిగిన ప్రశ్నల గురించి ఆరా తీశాడు. ప్రశ్నలను బహిర్గతం చేయవద్దని ఇంటర్వ్ బోర్డుకు హామీ ఇచ్చినట్లు యువకుడు చెప్పాడు.
కానీ, అవతలి వ్యక్తి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. "మీరు చెప్పిన సమాధానం చెప్పండి."

యువకుడు, "ప్రశ్నలను బహిర్గతం చేయను" అనే తన మాటలను వెనక్కి తీసుకోనందున, సరేనని అనుకున్నాడు. కాబట్టి అతను అతనికి మూడు సమాధానాలు ఇచ్చాడు, అవతలి వ్యక్తి త్వరగా హృదయపూర్వకంగా నేర్చుకున్నాడు.

తదుపరి అభ్యర్థి ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు, ఇది జరిగింది.
Q 1. మీరు ఎప్పుడు జన్మించారు?
అభ్యర్థి:- ప్రయత్నాలు చాలా కాలం క్రితం ప్రారంభమయ్యాయి, కానీ 1947లో విజయం సాధించవచ్చు.
ఇంటర్వ్యూయర్లు కంగారు పడ్డారు... తర్వాతి ప్రశ్న అడిగారు.

Q 2. మీ తండ్రి పేరు ఏమిటి?
అభ్యర్థి:- ఇందులో పాల్గొన్న మరియు సహకరించిన వారు చాలా మంది ఉన్నారు. నేను పేరు పెడితే ఇతరులకు అన్యాయం జరుగుతుంది.
ఈ సమాధానంతో బోర్డు సభ్యులు షాక్ తిన్నారని..అన్నారు.

Q 3. మీకు పిచ్చి ఉందా?

అభ్యర్థి :- ఈ విషయంలో ఒక కమిటీ దర్యాప్తు చేస్తోంది. నివేదిక చూసిన తర్వాతే దీనికి సరైన సమాధానం చెప్పగలను.
----
mallapdragada Ramakrishna 
***
089

ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి... అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది. 

జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు. 

ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను" అనిచెప్పింది. 

ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు. 

జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే  ఆలోచించి అలా చెప్పారు. 

ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ,  ఎటువంటి మేజిక్కూ జరగలేదు. 

అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది. 

"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు. 

అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది. 

 ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు. 

జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు. 

కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు. 

సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు. 

తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే. 

మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు. 

ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్ళిపోతారు.

"""**""" 

090.. పుణ్యం ఖరీదు ...01-08-2023

కాశీ పట్టణంలో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.

అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.

 ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో   కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.

 పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని  అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి  భార్య అతనికి చెప్పి  వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును అని సలహా ఇస్తుంది.

బ్రాహ్మణుడు  మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు.

దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.

అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయేవేళ ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.

బ్రాహ్మణునికి  బాధగా అనిపించి అతను కుక్క పై  కుక్కపిల్లల కోసం జాలిపడి,  తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.

కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ  ఇంకా ఆకలితో ఉండటంతో  బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.

బ్రాహ్మణుడు  జాలిపడి  రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా  మొత్తం రొట్టెలు కుక్కకు వేసి  తను మాత్రం కేవలం  నీరు త్రాగి   సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.

 బ్రాహ్మణుడు సేఠ్‌తో    తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.

అప్పుడు సేఠ్    ‘నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను!’ అని అంటాడు.

మధ్యాహ్నం సేఠ్ తన ఇంటికి భోజనానికి వెళ్లి      ‘తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు!’ అని సలహా అడుగుతాడు.

సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ.  ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం  చేసి తెలుసుకొంటుంది.

కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.

సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్  ఇలా అంటాడు…

 ’ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకొంటున్నాను.

బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు… ’నా దగ్గర యజ్ఞానికి సరిపడ  ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా?’    అని.

’ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు. అదే యజ్ఞం!’ అని సేఠ్ అంటాడు.

’నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకొంటున్నాను!’ అని అంటాడు.

 బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.

దానికి బదులుగా  నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని  సేఠ్ అనటం దానికి  బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం  జరిగిపోతాయి.

నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో  కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.

రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు.

త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.

రెండవ సంచీ ఉంచినాకూడా కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి  సేఠ్ తన దగ్గర వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. 

అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు ఆశ్చర్య పోతారు.

అప్పుడు బ్రాహ్మణుడు  సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు!” అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు.

ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి, దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు  నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.

ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.

ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి  ఆగలేక, భర్త వెళ్లగానే ఆ  మూట  తెరిచి చూస్తుంది.  ఆ మూట  నిండా వజ్రాలు, నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.

బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది. మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి? అంటుంది.

”వజ్రాలు, నగలా ? ఎక్కడ ఉన్నాయో చూపించు!” అని అంటాడు బ్రాహ్మణుడు.

భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.

అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.

విపత్తు సమయంలో తన పుణ్యంను  విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.

ఇదీ కథ…!

నిజానికి ఇది కథ కాదు. జీవితం!         ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి.  ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే.    డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు.అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా  మార్చుకోండి. పరలోక ప్రయాణానికి    పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి . దేవుడు మనల్ని పరీక్షిస్తాడు!  మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే,  మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు!అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వమ్ముకాకూడదు.

((()))

091..*వాక్చాతుర్యం 

                ➖➖➖

సాహితీ సంగీతప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి     ఒక  పేద పండితుడు  చాలా రోజులుగా ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ కోట కావలి భటులు యేవో కారణాలు చెప్తూ అడ్డుకుంటూ వచ్చారు.

ఒకనాడు భోజరాజు ఊరిలోని దేవాలయం దర్శించడానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు. అక్కడి ఆలయంలోని వారందరికీ    
ఆ పండితుడన్నా , ఆయన పాండిత్యం  అన్నా అపారమైన గౌరవాభిమానాలు వున్నాయి. 

మహారాజు పరమేశ్వరుని స్తుతిస్తుండగా, ఈ పేద పండితుడు మహారాజు వెనుకగా నిలబడ్డాడు. అర్చకుడు  దేవుడికి ఆరతి ఇస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా…
"గర్భగుడిలో పరమశివుడు లేడు" అని అరిచాడు.  

వెనక నుండి వచ్చిన అరుపు విని మహారాజు ఉలిక్కిపడ్డాడు. పండితుని  వేపు వెనక్కి తిరిగి చూసి "ఎందుకు అలా చెప్తున్నారు?  దేవుడిని దూషించడం  తప్పు అన్నట్టు  ఖండిస్తూ అడిగాడు. 

అందుకు ఆ పండితుడు "చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం నారాయణునికి యిచ్చి శంకరనారాయణు డైనాడు. మరియొక సగాన్ని ధర్మపత్నికి యిచ్చి అర్ధనారీశ్వరుడైనాడు. అందుకే ఆయన చిహ్నంగా ఏదీ లేదని అంటున్నానన్నాడు. 

"ఆయన శిరసున గంగ వున్నది కదా.." అని భోజరాజు అడిగాడు. 
“గంగ సముద్రంలో కలిసి పోయింది.” అన్నాడు పండితుడు.

వెంటనే మహారాజు ఝటాఝూట అలంకారమైన చంద్రుడు ఏమయ్యాడు? అని అడిగాడు. "చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడే వున్నాడు." అని అన్నాడు పండితుడు. అప్పుడు భోజరాజు "అవేవీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా వుంటుంది.” అన్నాడు.

"అది కూడా లేదు. తన శక్తినంతా మీకు యిచ్చివేశాడు .." అని అన్నాడు పండితుడు. పండితుని   నిందాచమత్కార సంభాషణ విని భోజమహారాజు , చిరునవ్వుతో "అన్నీ పోయినా కూడా ఆయన భిక్షాపాత్ర మాత్రం తప్పక ఆయన వద్దనే వుంటుంది" అన్నాడు.

పండితుడు అప్పుడు "ప్రభూ .. అది కూడా యిప్పుడు ఆయన వద్ద లేదు. దానిని పరమేశ్వరుడు నాకు యిచ్చివేశాడు." ఈ సంభాషణ విన్న భోజరాజుకు పండితుని  పేదతనం  అర్ధం అయింది. ఆ పండితునికి  ధనధాన్యాలు, అగ్రహారాలు దానం చేశాడు.  ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తనలోని ప్రతిభను ఇతరులకు తెలియజెప్పడానికి తగిన లౌక్యం, వాక్చాతుర్యం కావాలి. తన వ్యక్తిత్వానికి భంగకరం కాకుండా తన గురించి తానే పొగుడుకోకుండా తన గురించి చెప్పకనే  అవతలివారు తెలుసుకోగల బుధ్ధి సూక్ష్మత కావాలి. అలాటివారు ఏ మూలనున్నా రాణిస్తారు. 

***
092..శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-16
 
సీతాదేవిచే కాకాసుర వృత్తాంతము, చూడామణి ప్రధానము
సీతాదేవి ఆనందించినదియై హనుమతో రామలక్ష్మణుల కుశలములు, వారి కార్యసన్నద్ధత గురించి అడిగెను. జనస్థానములో శ్రీరాముడు ఒక్కడే పదునాలుగు వేల మంది రాక్షసులను సంహరించెను. అట్టి పురుష శ్రేష్ఠుడు ఆపదలచే చలించు వాడు కాడు. నాకు ఇంకా రెండు నెలల సమయము మాత్రమే యున్నది. కావున రాముని త్వరగా తీసుకొని వచ్చి నన్ను చెర నుంచి విడిపింపుము అని అనెను. అప్పుడు హనుమ సీతతో నీ అనుమతి అయితే ఇప్పుడే నేను నిన్ను రాముని దగ్గరకు చేర్చగలను అని అనగా సీత రవ్వంత హనుమ శక్తి సామర్థ్యములకు శంకించినను, తరువాత అతని శక్తిని చూసి ఉత్తమ పతివ్రత అయిన సీత అందుకు మృదువుగా నిరాకరించెను.
 
(ఇక్కడ గమనించితే రావణుడు సీతను బలముతో తీసుకొని వచ్చెను కానీ తనంతట తానుగా పరపురుషుని స్పర్శ ఇష్టపడదు. ఆధ్యాత్మిక శాస్త్ర దృష్టితో సీత నిర్ణయము సరియైనదే. పరపురుషుడనగా ఇచ్చట పరధర్మము లేదా పరవృత్తి. అటువంటి పరధర్మము యొక్క భుజములపై కూర్చొని స్వస్థానమునకు వెళ్ళుట యోగ్యము కాదు. గీతలో ఈ పరధర్మ స్వీకారం నిషేధించబడినది.
 
శ్లో|| శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్
      స్వధర్మో నిథనం శ్రేయః పరధర్మో భయావహః
 
పరవృత్తి రూప హనుమానుని స్పర్శ సీత స్వీకరించదు. రామ రావణుల వృత్తి సంఘర్షణ జరిగి, రావణ వృత్తిని జయించి, రాముడు తనదైన సీతావృత్తిని స్వీకరింప వలెను. అదియే శ్రేయస్కరమైనది).
అందుకు హనుమ మిక్కిలి సంతోషించి రాముడు గుర్తింపగల ఏదైనా అబిజ్ఞానమును ఒసగమని కోరెను. అప్పుడు సీత గద్గద స్వరముతో కాకాసురుని కథను రామునికి గుర్తుగా ఈ విధముగా తెలియ చేయు చున్నది.
 
శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా                 5.39.12
తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుణ్డయత్
తమ్ అహం లోష్టమ్ ఉద్యమ్య వారయామి స్మ వాయసం  5.39.15
 
దారయన్ స చ మాం కాక  స్త త్రైవ పరిలీయతే
న చా౭ప్యుపారమ న్మాంసా ద్భక్షా౭ర్థీ బలి భోజనః          5.39.16
ఆసీనస్య చ తే శ్రాన్తా పున రుత్స౦గమ్ ఆవిశమ్
 
క్రుధ్యన్తీ చ ప్రహృష్టేన త్వయా౭హం పరిసాన్త్వితాః     5.39.19
బాష్ప పూర్ణ ముఖీ మన్దం చక్షుషీ పరిమార్జతీ
లక్షితా౭హం త్వయా నాథ వాయసేన ప్రకోపితా            5.39.20
 
పరిశ్రమాత్ ప్రసుప్తా శ్చ రాఘవా౭౦కే ప్య౭హమ్ చిరం
పర్యాయేణ ప్రసుప్త శ్చ మ మా౭౦కే భరతా౭గ్రజః          5.39.21
స తత్ర పునరే నాథ వాయస స్సముపాగమత్
 
తత సుప్తప్రబుద్దాం మాం రామాస్యాంకా త్సముత్థితామ్  5.39.22
వాయస స్సహసాగమ్య విదధార స్తనాంతరే
పునః ్పున రథోత్పత్య విదధార స మాం భృశమ్    5.39.23
స దర్భ సంస్తరా ద్గృహ్య బ్రహ్మణోఽస్త్రేణ యోజయత్ 5.39.30
స దీప్త ఇవ కాలా౭గ్ని ర్జజ్వాలా౭భిముఖో ద్విజమ్
స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి         5.39.31
 
తత స్తం వాయసం దర్భ స్సో౭మ్బరే౭నుజగామ హ
అనుసృష్ట  స్తదా కాకో జగామ వివిధాం గతిమ్               5.39.32
న శర్మ లబ్ధ్వా లోకేషు త్వా మేవ శరణం గతః              5.39.35
మత్కృతే కాక మాత్రేఽపి బ్రహ్మా౭స్త్రం సముదీరితమ్   5.39.39
 
కస్మా ద్యో మాం హరే త్త్వత్తః క్షమసే తం మహీపతే
తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్   5.39.69
ప్రదేయో రాఘవా యేతి సీతా హనుమతే దదౌ
 
"చిత్రకూటమిలో ఒకనాడు నేను అలసి రాముని తొడపై పరుంటిని. అప్పుడు మాంసము నందు ఆసక్తి గల ఒక కాకి నా గుండెలపై గీరుచు కొరికెను. ఈ విధముగా అది నేను ఎంత ప్రయత్నించినను పోకుండెను. ఆ విధముగా అలసి పోతిని. కొంతతడవకు రాముడు నా ఒడిలో పరుండెను. మరల ఆ వాయసము ఎగిరి వచ్చి నా వక్ష స్థలమును గోళ్ళతో గీరగా, నా గుండెల నుండి వచ్చిన రక్త బిందువులతో తడిసి రాముడు మేల్కొనెను. అందుకు రాముడు మిగుల కోపించి అక్కడి ఒక దర్భను (గరిక) బ్రహ్మాస్త్రమున అభిమంత్రించి వాయసముపై వదిలెను. ఇంద్రుని కుమారుడైన ఆ వాయసమునకు ముల్లోకములలో ఎవరును రక్షించ లేకపోయిరి. చివరకు అది తిరిగి రాముని శరణు జొచ్చినది. శరణు పొందిన కాకము ఒక కంటిని మాత్రమే ఆ అస్త్రమునకు ఇచ్చి దాశరథునికి నమస్కరించి వెడలి పోయెను. అట్టి కాకము మీద నాడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన రాముడు ఈనాడు నన్ను రక్షించుటలో జాగు యేల?".  ఇట్లు చెప్పి వస్త్రములో దాచి యుంచిన దివ్యమగు చూడామణిని[1] తీసి రామునికి ఒసగమని సీత హనుమకు ఇచ్చెను అట్లా మణిని పుచ్చుకొని హనుమ సీతకు నమస్కరించి వెనుకకు వెళ్ళుటకు ఉద్యుక్తుడాయెను. 
 
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] రత్నాకరం నందు పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు, వరుణనునికి ఇవ్వగా అతడు జనకునికి ఇచ్చెను. జనకుడు ఈ మణిని వివాహకాల సమయమున తన భార్య ద్వారా సీతకు ఇచ్చెను
--(())--

093

*ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు.*

*అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది.*

*అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు.*

*మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది.*

*అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు.*

*'విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది.*

*అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు.*

*'విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది. అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది.*

*అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.*


*'విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది.*


*యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు.*

*'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ' కొనండి' అని ఉంది.*😜

*ఇందులో నీతి  ఏంటంటే... విమానం అయినా... అధికారం అయినా... ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే... సర్వ నాశనం కాక తప్పదు.*😁

*నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు... సమర్ధత అనుభవం కూడా ఉండాలి.*☺️

****

094 

ఒకరోజు తమ్ముడు ఫోన్ చేసాడు. 

అక్కా నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని. 

అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క 

ఇల్లంతా వెతికింది. వారికోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. 

పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. 

రెండే రెండు ఆరంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో

రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది ...

బెల్ మోగింది తమ్ముడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. 

అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది.. 

వంట గదిలోకి వెళ్ళింది. రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసు లో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు ఆమె తల్లి ముందు ఆరంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ళ గ్లాసు ఉంచింది... తమ్ముడికి 7up అంటే ఇష్టం అని చెబుతూ ..

తమ్ముడి అది తాగి నిజం తెలుసుకున్నాడు. 

ఇంతలో అత్తగారు నాకు 7up కావలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కకు.. 


అక్కా నువ్వు కూర్చో నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక  గ్లాసు కింద పడేసాడు. అయ్యో ఏమైంది ఆని అందరూ అడిగితే 

జ్యూస్ ఒలికింది. నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే.. అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది.

      ఇక వెళ్ళొస్తామంటూ.. బయల్దేరారు ముగ్గురూను.

     తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని "అక్కా.! జాగ్రత్త. వంటగదిని శుభ్రంగా తుడిచేయి. లేదంటే చీమలు వచ్చేస్తాయి" అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు.  భార్యకు, అత్తగారికి కనిపించకుండా డబ్బులను, అక్కకు తెలియకుండా.. కంటి నీరుని దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ. 👍

    "ఇక నుంచి తరచూ.. పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినపుడల్లా.. నీ చేతి వంట రుచి చూడాల్సిందే" అన్నాడు. భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ.. ఆలోచించుకుంటూ!

సోదరులంటే ఇలా ఉండాలి కదా ..! 🤗🤗

బంధం అనే కాదు.. కష్టాల్లో  ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం, ప్రయత్నం చేయాలి.

          *ఆత్మీయతను కోల్పోకండి.!*

దయచేసి మనకి అందరు దొరుకుతారు. ఎక్కడ అయినా తోడపుట్టిన వాళ్ళని కోల్పోతే వాళ్ళు దొరకరు. ఏదైనా విభేదాలు ఉన్నా.. మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపు కోవడంలో తప్పు లేదు.

         

ఇలాంటి ఆత్మీయతలను; అనుబంధాలను

నేడు మనం కోల్పోతున్నాం

***

095 //వ్యాఘ్రీ యధా హరేత్ పుత్రాన్  దంష్ట్రాభ్యాం చ న పీడయేత్

భీత పతనాదేతాభ్యాం తద్వత్ వర్ణాన్ ప్రయోజయేత్

1. వేదం లోని అక్షరాలు సునాయాసం గా పలకాలి

2. అక్షరాలు అస్పష్టం గా ఉండకూడదు

3. ధ్వని జారిపోవడం కాని తేలిపోవడం కాని జరగకూడదు అలా అని అరిచినట్టు గా కూడా ఉండకూడదు.

4. పెదవుల చివరనుంచి పదాలని పలకకూడదు

వేద పఠనానికి ఉండాల్సింది మూడు లక్షణాలు. అవి ఏమిటంటే అక్షర శుద్ధి, మాత్రా శుద్ధి, స్వర శుద్ధి. వేదాన్ని జాగ్రత్త గా పఠనం చెయ్యకపోతే అర్ధం మారిపోయే అవకాశం ఉంది. వేద పఠనం లో దైవ ప్రీతి కలిగించడమంతా వాటి స్వరం లో ఉంటుంది. ఉచ్ఛ మంద్ర స్థాయి లో పలికే స్వరాలని ఆ స్థానం గమనించి అలాగే పలకాలి. వేదం లో స్వరితము, అనుదాత్తము , దీర్ఘ స్వరితము, ఉదాత్తము అనే ముఖ్య స్వరాలు ఉంటాయి. వాటిని గురుముఖతా నేర్చుకుని వల్లె వేయాలి. వేద విద్యకి గురు అనుగ్రహం పూర్తిగా ఉండాలి. సంకల్పం ఉంటే మార్గము, గురువు దొరకడం కష్టం కాదు. అనుష్ఠానాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఆ వేదమాతని ప్రార్ధిస్తే నేర్చుకోవాలన్న తపన తోడయితే తప్పక మార్గం సుగమం అవుతుంది.

నేర్చుకునే ఒక్క పాఠం అయినా పద్దతిగా నేర్చుకుని సాధన చేస్తేనే ప్రయోజనం.

శంకరులు మనకు ఎన్నో స్తోత్రాలు అనుగ్రహించారు. తప్పులు లేకుండా అవి నేర్చుకుని చెప్పుకున్నా వేద మంత్రాలకి సమానమైన ఫలితం ఉంటుంది.

పై విషయాలపై సందేహాలు ఉంటే పెద్దవారి వద్ద నివృత్తి చేసుకోవచ్చు, కానీ చర్చకు వితండానికి తావు లేదు.

*** 

096...

096..1000 ఏళ్ల నాటి శ్రీరామానుజాచార్యుల శరీరం... శ్రీరంగంలో ఎప్పుడైనా చూసారా?*

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన మరణించి వెయ్యేళ్లు పూర్తియైనను ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం.

*శ్రీరామానుజచార్యులు*

భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం.

శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4 వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా... అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. 

పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

*రామానుజాచార్యుల గొప్పదనం:*

రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు.

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు.

కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.

*ప్రాచుర్యంలోకి రాని రహస్యం:*

క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. అయితే రామానుజాచార్యుల మాదిరిగానే 15వ శతాబ్ధంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్ధివ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ అనే చర్చిలో భద్రపరిచారు.

గోవాను పోర్చుగీసు వారు పాలిస్తున్న సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మతస్తుడు ఇక్కడ సువార్త వ్యాప్తికి కృషి చేశాడు. ప్రజలకు సహాయం అందిస్తూ క్రైస్తవ మతంపై నమ్మకాన్ని కలిగించాడు. ప్రపంచ వ్యాప్త పర్యటనల్లో భాగంగా మకావూలో క్రైస్తవ మత ప్రచారాలకు వెళ్ళిన ఆయన అక్కడ మరణించడంతో ఆ శరీరాన్ని గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ చర్చికి తరలించారు. 

క్రైస్తవ మత వ్యాప్తిలో జేవియర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన శరీరాన్ని ఓ గాజు పెట్టెలో ప్రత్యేక మూలికలతో కుళ్లిపోకుండా భద్రపరిచారు. దీంతో ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. గోవా పర్యాటకంలో ఇది ఒక ముఖ్యమైన సందర్శనీయ స్థలంగా పేరుగాంచింది. అయితే ఈ ప్రదేశానికి వచ్చిన ప్రాచుర్యం దీనికి ముందే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం లభించలేదు. అందుకే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి.

097.. ప్రాంజలి prabha❤️

ఈ క్రింది 26 దోషాలు మనుష్యుని నరకం వైపు పయనింపచేస్తాయి - 1 🌹*

*🌻. భవిష్య పురాణం 5వ అధ్యాయము 🌻*

సేకరణ రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

*ఈ మనుష్యులెవరనగా*

*(1) అధముడు (2) విషముడు (3) పశువు (4) పిశునుడు (5) కృపణుడు (6) పాపిష్టుడు (7) నష్టుడు (8) రుషుడు (9) దుష్టుడు (10) పుష్టుడు (11) హృష్టుడు (12) కాణుడు  (13) అంధుడు (14) ఖండుడు (15) చండుడు (16) కుష్టు (17) దత్తాపహారకుడు (18) వక్త (19) కదర్యుడు (20) దండుడు (21) నీచుడు (22) ఖలుడు (23) వాచాలుడు (24)చపలుడు (25)మలీమసడు  (26)స్తేయి.*

*(ఈ దోషాలు స్త్రీలకున్నా దోషాలే... )*

*ఈ ఇరవై ఆరుదోషాల్లోనే మళ్ళా భేద, ప్రభేదాలు చెప్పబడ్డాయి.*

*అందుకే వాటిని ఒక్కొక్కటిగా సంగ్రాహంగానైనా వివరించి చెప్పవలసి వుంది. ఇలా :*

*(1) గురువుల వద్దకూ దైవసన్నిధికి చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చుని యుండుట, పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్యధర్మాచరణను చేయుట- ఇవన్నీ అథమసంజ్ఞక దోషాలు.*

*(2)  పైకి ప్రియంగా మధురంగా మాట్లాడుతూ హృదయంలో మాత్రం హాలాహలాన్ని కలిగియుండి చెప్పేదొకటిగా చేసేదొకటిగా జీవించేవాడు విషముడు.*

*(3) మోక్షమును గురించి అసలు ఆలోచించకుండా, ప్రాపంచిక విషయవాంఛలలోనే మునిగితేలుతూ, హరి సేవ వూసే తలపక, ప్రయాగలో వుంటూ ఇంకెక్కడో స్నానం చేస్తూ, ప్రత్యక్ష దైవాలను విస్మరించి అదృష్టభాగ్యాన్ని వెతుకుతూ, శాస్త్రసారాన్ని బొత్తిగా పట్టించుకోకుండా వుండేవాడు పశువు.*

*(4) బలంతోగాని, వేషంతోనో మోసంతోనో గాని, మిథ్యా ప్రేమను ప్రదర్శించి గాని మనుష్యులను తన లాభం కోసం ఆపదలలో ముంచేసేవాడు పిశునుడు.*

*(5)  దేవ, పితృ కార్యాలలో మంచి అన్నం పెట్టే స్తోమతు వుండీ కూడా మ్లానమై అశుభ్రమైన అన్నాన్ని భోజనాలలో వడ్డించే దుర్బుద్ధియైన మానవుడు కృపణుడు. వానికి స్వర్గమూ దొరకదు; మోక్షమూ లభింపదు.*

*అప్రసన్నమైన మనసుతో కుత్సిత వస్తువులతో దాన కర్మలను గావిస్తూ కోపంగా మొహం మాడ్చుకొని పూజలను చేసేవాడూ కృపణుడే. శరీర విక్రయదారులు కూడా కృపణులే.*

*(6) మాతాపితలను, గురువులను వారి కర్మకు వారిని వదలివేసి హోమ-యజ్ఞాల నిర్వహణలో కూడా లోపం చేసేవారు పాపిష్టులు.*

*(7) సాధనాచరణను పరిత్యజించి, అసత్యపు సేవాప్రదర్శన చేయువాడు, వేశ్యాగామి, దేవధనం ద్వారా స్వంత పబ్బం గడుపుకొనేవాడు, భార్యచేత వ్యభిచారం చేయించి బతుకు నిలుపుకొనేవాడు, కన్యలను తెచ్చి అమ్ముకొనో మరే విధంగానో మొత్తానికి స్త్రీధనం ద్వారానే  అపసవ్యంగా అక్రమంగా బతికేసేవాడు పురాణ పరిభాషలో నష్టుడన బడతాడు.*

*(8) మనసులో ఎప్పుడూ క్రోధమే తప్ప మరో మనోవికారమూ, సరాగమూ వుండనివాడు, తన హీనతను తానే తలచుకొని మరీ కోపం తెచ్చేసుకుని చల్లటి వాతావరణాన్ని మంట సెగలపాలు చేసేవాడు  (ఉడుకుమోతువాని ముఖాన కునుబొమలు శాశ్వతంగా ముడివడే ఉంటాయి. చిరునవ్వన్నది వుండదు ) - ఇలాంటి వాడు రుష్ఠుడు*

*(9) అకార్య లేదా నిందిత ఆచరణ ద్వారానే జీవించే వాడు. ధర్మకార్యమేదీ పూర్తిగా చేయని వాడు.*

*నిద్రాళువు, దుర్వ్యసనాలపై ఆసక్తిగలవాడు, మదిరాలోలోడు, స్త్రీలను సేవిస్తుండేవాడు, ఎల్లపుడూ దుష్టులుగా జగత్రసిద్ధులైన వారి సాంగత్యంలోనే తిరుగుతుండేవాడు దుష్టుడనబడతాడు.*

*(10) మధుర, మృష్టాన్న భోజనాన్ని తానొక్కడే తినేవాడు, వంచకుడు, సజ్జనులను నిందించేవాడు, శుకర (మద్యశాల వంటి వాటిని శుభ్రపరచుట)తో సమానమైన వృత్తి చేసేవాడు పుష్టుడు.*

*(11) నిగమాగమాలను అంటే వేదతంత్రాలను అధ్యయనం చేయకపోగా, వినడానికి కూడా రానివాడు హృష్టుడు*

*(12, 13) శ్రుతులు, స్మృతులు బ్రాహ్మణ్యానికి రెండు కళ్ళు. ఒకటి లేనివాడు కాణుడు, రెండూలేనివాడు అంధుడు.*

*(14) అన్నదమ్ములతో కయ్యమాడేవాడు, మాతాపితలను అప్రియవచనాలతో బాధించువాడు ఖండుడవుతాడు.*

*(15) శాస్త్రనింద జేయువాడు, చాటున కొండెములు చెప్పేవాడు, రాజ్ మాగీ, శూద్రసేవకుడు, శూద్రపత్నులతో అనాచర చేసేవాడు, శూద్రగృహంలో వండబడిన అన్నాన్ని ఒకమారు తిన్నా, శూద్రగృహంలో అయిదు రోజులు నివసించినా... వాడు చండుడనబడతాడు.*

*(16) కుష్టుడు :*

*ఎనిమిదిరకాల కుష్టురోగాలు కలవాడు, లేదా మూడురకాలైనా వున్నవాడు, శాస్త్ర నిందులతో కలిసి తిరిగేవాడు కుష్టుడు*

*(17) దత్తాపహారకుడు :*

*కీటకంలా తెగ తిరిగేవాడు, కుత్సిత దృష్టితోనే వ్యాపారం చేసేవాడు, దత్తాపహారకుడన బడతాడు.*

*(18) వక్త :*

*కుపండితుడై, అజ్ఞానియై ఉండి కూడా ధర్మోపదేశాలు చేసేస్తుండే వాడు వక్త. (వక్త అనే మాటకి ప్రస్తుతం మాత్రం మంచి అర్థముంది. అదే రూఢి)*

*(19) కదర్యుడు :*

*గురుజనుల వృత్తులను అపహరించడానికి ప్రయత్నించేవాడు. కాశీ నివాసి అయివుండి కూడా కాశినొదిలేసి బహుదినాలు బయటి ఊళ్ళల్లో వుండేవాడు కదర్యుడు.*

*(20) ఉద్దండుడు :*

*మిథ్యాక్రోధాన్ని ప్రదర్శిస్తూ, దండవిధానంలో, అమలులో కల్పించుకొని జనులను దండించేవాడు దండదోషి లేదా ఉద్దండుడు.*

*(21) దురాచారి :*

*బ్రాహ్మణ, రాజ, లేదా దేవ సంబంధి ధనాన్ని అపహరించి మరొక బ్రాహ్మణునికో దైవానికో పెట్టేవాడు, ఆ ధనంతో భోజనాలు పెట్టేవాడు, అక్షరాభ్యాసముండి చదవడానికి గాని, బలవంతాన చదివినా అర్థం చేసుకోవడానికి గాని ప్రయత్నించని వాడు, అనాచారి, దురాచారి నీచుడు.*

*(22) ఖలుడు :*

*గుణవంతులలో సజ్జనులలో దోషాలు వెతకడమే పనిగా పెట్టుకొనేవాడు ఖలుడు.*

*(23) వాచాలుడు :*

*భాగ్యహీనులను పరిహాసయుక్తంగా, వెటకారంగా సంబోధించి వేధించేవాడు, చండాలురతో మరీ బహి రంగంగా సల్లాపము లాడేవాడు వాచాలుడు.*

*(24) చపలుడు :*

*పక్షులను పెంచి అమ్ముకొనేవాడు పిల్లిపిల్లీ తగువులాడుకొని కోతి దగ్గరకు ధర్మంకోసం వెళితే రెండిటినీ మోసం చేసిన కోతిలాగా మానవద్రవ్యాలను భక్షించేవాడు, మాంస భక్షకుడు, అన్యాంగనాసక్తుడు, మట్టిపెళ్లలను పగులగొట్టేవాడు (వ్యంగా) చపలుడనబడతాడు.*

*(25) మలీమసుడు :*

*నూనె రాసుకొని నలుగు పెట్టుకొని తలంటి పోసుకోవడం వంటి శరీరశుద్ధికర్మ ఏనాడూ చేసుకోనివాడు, నిత్యశరీర శుభ్రతకర్మలేవీ చేపట్టనివాడు మలీమసుడు.*

*(26) స్తేయి :*

*చోరుడు దొంగతనం చేయడమేకాక మాతా పితలను పోషించకుండుట, గురువును గౌరవించకుండుట, మంచి ఆలోచనేదీ మనసులో లేకుండుట స్తేయి లక్షణాలు.*

*🌻. ఈ దోషాలలో ఏ ఒక్కటీ లేనివాడే నిజమైన మనిషి 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

098.. ప్రాంజలి ప్రభ

వృద్ధదంపతులు మనసు కుదుటపడి ఒకరికొక్కరు చిన్ననాటి ఆలోచనలు గుర్తు చేసు కుంటున్నారు 

స్వచ్చమైన గాలి  నీళ్ళు,. పచ్చటి  పొలాలు. పరిశుభ్రమైన.    వాతావరణం  లో  పుట్టి.    పెరిగిన   వాళ్ళం... 

తలపై   నుండి.    చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని...

 చేతికి     పుస్తకాల.   సంచి తగిలించుకుని...,

ఒక్కడిగా.    బయలుదేరి    దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను.      కలుస్తూ పెద్దగుంపుగా.  .  కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం, జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు.   లాక్కుంటు ..., చిరుగు.    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం 

10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు.   వేసుకున్న.  ,  తరం మాదే...

గోలీలు, బొంగరాలు, కర్రా బిళ్ళ, నేలా బండ,. ఉప్పాట, ఏడు పెంకులాట.....

బంతి పుచ్చుకుని.  నేరుగా కొట్టేసుకుంటే బంతిలాగ  వంటిమీద ముద్రపడే ముద్రబాల్.   లాంటి ఆటలాడిన తరం...,

బడికి    వేసవి కాలం.   , సెలవులు రాగానే   తాటి చెట్లూ,. ..  సీమ తుమ్మ చెట్లూ    ఈతచెట్లు    ఎక్కి కాయలు.   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లో స్నానాలు     చేసిన   వాళ్ళం.   , తాటి   బుర్రలు     బండితో ఆడినోళ్లం...

దీపావళి  కి.    తాటి    బొగ్గుల రవ్వల   దివిటీ    కోసం   వళ్ళంతా మసి   పూసుకొని  మరీ     తయారు చేసుకనే  వాళ్ళం. 5 ps     ఐస్   తిన్నది   మేమె. ,,  .  పది    పైసలతో   బళ్ళో.  మ్యాజిక్   షో.   చూసింది    మేమే.... 

 వర్షం   వస్తె   తాటాకు.  గొడుగూ,    యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం..

సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క.   తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...

ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 

పండగ    సెలవులు, వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు

ఎన్ని సెలవులు.   వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా    ఆనందాన్ని.   అనుభవించిన    తరంవోళ్ళం...,

పెద్దలు.  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని.   పొట్ట    చెక్కలయ్యేలా నవ్వుకున్నదీ మేమే.... 

 ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,

అంతామేమే.  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా. / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...

ఉర్లో   ఒక    ఇంట్లో   దొంగలు  పడ్డారని ,.  పిల్లలు.    అందరం  కలిసి    ఊరు  చుట్టూ    తెల్లవార్లూ   ఎన్నో రాత్రులు

టార్చిలైట్స్,    కర్రలు  పట్టుకుని  కాపలా కాసిన    వాళ్ళం  మేమే.

 వృద్ధదంపతులు ఓరి మొహాలు ఓకారు చూసుకుంటున్నారు 

ఏమంటుంది ఆలోచిస్తున్నారు మీరు అన్నది శ్రీమతి 

నాకనిపిస్తున్నదే ఇద్దరికి ఒకే సారి శ్రీ మరణం రావాలని కోరుకుందాము మన వేనని ఉంటుంది 

 

*. ఓ మరణమా…! :

హే…  ఎప్పటికప్పుడు నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో నీకేం తెలుసు… అసలెప్పుడు వస్తావ్ నువ్వు? త్వరగా రావూ… 

తమకంతో కళ్ళు మూసుకుంటున్నా… రెప్పలపై కమ్మగా వాలిపో... నా వంటిని వెచ్చని దుప్పటిలా కప్పేసేయ్… నన్ను సుఖాల మత్తులోకి నెట్టేస్తూ... 

రెప్పలపై నీ చప్పుడు వినగానే నీ శబ్దంలోకి నన్నులాగేసుకుంటావనుకుంటూ ఉంటాను.  

ఉత్తుత్తి చప్పుళ్ళతో నన్నుభ్రమల దారుల్లోనడిపిస్తూ ఎప్పటికప్పుడు ముఖం చాటేస్తావ్… ఎందుకోయ్? అంత అల్లరి? నీకెవరు నేర్పారు ఈ తిమ్మిరి ఆటలు? 

అసలు నీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఉన్న ఎదురు చూపులలో నా విరహాన్ని ఎప్పుడైనా చదివావా? 

అయినా నువ్వెందుకు చదువుతావులే… నేనేం గొప్పట నీకు… నన్ను మించిన ఇష్టులెవరట నీకు… చాలా పోసెస్సివ్ గా ఉంది. నీకు నేను తప్ప ఎవరూ ఎక్కువ కాకూడదు. 

ప్రతి క్షణం నీ చప్పుడు వింటూనే ఉంటాను… పక్కనే ఉన్నట్లుంటావ్… పలకరిద్దాం అంటే పలుకులకి విరామమంటావ్… ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను అల్లుకుపోతావ్ కదా అని ఆశగా ఎదురు చూస్తుంటా. 

అసలు ఇన్నాళ్ళు నన్ను చూడకుండా నాకోసం వెదకకుండా ఉన్నావని నీ మీద చాలా కోపం వస్తుంది… నాకు నువ్వొద్దు పో అని అనాలని అనిపిస్తుంది… 

నీ మీదే ప్రాణం పెంచుకున్న నేను నువ్వు లేకుండా ఉండగలనా…? నీతో కలసి ప్రకృతిలో పరిమళమై నడుస్తున్న ఊహ వచ్చినప్పుడల్లా నా అలక మటుమాయం లే… బెంగ పడకు. 

నా ప్రతి విరామంలో నీ గురించిన ఆలోచనలతో మత్తు తెప్పిస్తావ్. నీకన్నా నాకు హితులెవ్వరు…? సన్నిహితులెవ్వరు…? 

నాకు నువ్వు ఉన్నావని అనుకున్నప్పుడల్లా దుఃఖ భారాలన్నీ మాటు మాయం అయిపోతాయి తెలుసా? ఆ దుఃఖాలన్నీ కట్టగట్టుకుని ఎక్కడికి పారిపోతాయో గానీ మనసుకి మాత్రం మధురమైన సేదని పోత పోసేస్తావ్. ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యమైన విద్య కదూ... 

నువ్వలా నావైపు నడుస్తూ వస్తున్నప్పుడు నా కళ్ళల్లో కనిపించే అంత వెలుగుని నీ జీవితకాలం లో నువ్వు చూడలేవు. 

నేను దాటిన ప్రతి స్మృతికీ తెలుసు… ఇప్పుడు తమకన్నా నాకు నువ్వెక్కువ అని. నేను నాలో ఉండిపోవటంలో కంటే నీలోకి జారిపోవటంలో ఉన్న ఆనందం ఉంది చూశావూ… అది చెప్పటానికి సాధ్యం కాదురా… త్వరగా నువ్వొచ్చేసి నన్ను ఆనందాల్లో ముంచెయ్యవూ... 

అసలే నువ్వు దూరంగా ఉంటున్నావని చాలా దుఃఖంగా ఉందని తెలుసు కదా… 

అందుకే ఈ సారి నువ్వు ఇల్లు మారినప్పుడు నీ చిరునామా నాదే అవ్వాలి… ఓ మరణమా…! :) 

****

                    


c099.. దెయ్యపు కధ  



దేవతలూ, దెయ్యాలూ... రాజులూ, రాక్షసులూ... మంత్రాలూ, మాయలూ... నీతులూ, నవ్వులూ... భలేగుండేవి ఆ కథలు. ఆకాశంలో, పాతాళంలో విహరిస్తూ ఇంద్రధనుస్సులను తాకుతూ, రెక్కల గుర్రాలపై గెంతులేస్తూ, ఏడుతలల నాగుబాములతో తలబడుతూ, ఒంటికంటి రాక్షసులను సంహరిస్తూ, మాంత్రికులను బురిడీ కొట్టిస్తూ మంచిని గెలిపిస్తూ... అబ్బ అవి వినాలేగానీ ఇట్లా చెబితే ఆ ఆనందం అర్థం కాదమ్మా.
అమ్మ ఒడిలో పడుకొని వెచ్చగా పాలుతాగినట్లు, ఎండాకాలంలో వేపమాను కింద చేరి చల్లని గాలిలో ఉయ్యాలలూగినట్లు... పండగరోజున తియ్యని పూర్ణం కర్జికాయను నోట్లో పెట్టుకొని తనివితీరా నమిలినట్లు... నేను చెప్పలేనే.. ఆ ఆనందమే వేరు'' అంది.
దాంతో నాకు కూడా ఆ కథలు ఒక్కసారి వినాలనిపించింది. అమ్మమ్మతో అంతసేపు ఎప్పుడూ గడపలేదు. వెంటనే అమ్మమ్మకు మరింత దగ్గరగా జరిగి "అయితే నాకు కూడా ఒక కథ చెప్పు అమ్మమ్మా...వింటా'' అన్నాను.

"సరే, చెప్తాలే... కానీ ఈ రోజు బాగా పొద్దుపోయింది గదా... రేపు సాయంత్రం ఆ చెత్త టీవీ చూడకుండా బడయిపోగానే నా దగ్గరికి రా'' అంది.
తరువాత రోజు శనివారం. హాఫ్‌డే స్కూల్. పొద్దున్నే లేశా. అమ్మమ్మ ఇంకా లేవలేదు. తొందరగా తయారయి ఏడుకంతా బైటపడ్డా. బళ్లో అందరికీ అమ్మమ్మ గురించి, ఆమె చెప్పబోయే కథల గురించి చెప్పా. అందరూ సోమవారం ఆ కథలన్నీ తమకు కూడా చెప్పాలని ప్రామిస్ చేయించుకున్నారు.
మధ్యాహ్నం బడయిపోగానే పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాను. ఇంటి ముందంతా బంధువులు, నాన్న స్నేహితులు. లోపల ఏడుపులు. ఏమీ అర్థం కాలేదు. బెరుకుబెరుకుగా లోపలికి అడుగుపెట్టాను. వరండాలో అమ్మమ్మ కింద పడుకొని వుంది. కళ్లు మూసుకొని ఉన్నాయి. ముక్కల్లో దూది ఉంది. తలవెనుక దీపం వెలుగుతూ ఉంది.

"రాత్రి నిద్దురలోనే పోయింది. పొద్దున్న ఎంతసేపటికీ లేవకపోతే'' నాన్న ఎవరికో చెబుతూ ఉన్నాడు. అలా... ఆ రోజునుంచి కథ వినాలనే కోరిక నెరవేరనే లేదు. అమ్మను, నాన్నను, ఎదురింటోళ్లను, పక్కింటోళ్లను... ఎందరినో... అడిగీ... అడిగీ.. అలసిపోయా.

అన్నం తినబుద్ధి కాలేదు. నీళ్లు తాగబుద్ధి కాలేదు. ఒక్క కథ... ఒక్క కథ... అంటూ నిద్రలో కూడా కలవరించసాగానట ... అమ్మా, నాన్నా... నన్ను చూసి తల్లడిల్లిపోయారు. ఏవేవో బుక్కులు తెచ్చి చదివి వినిపించసాగారు. ఎవరెవరినో పిలిపించి కథలు చెప్పించసాగారు. కానీ ... వాళ్ల మాటల్లో జీవంలేదు. వాళ్ల ముఖాల్లో కథ చెబుతున్న ఆనందం లేదు. దాంతో... మా అమ్మమ్మ వర్ణించినట్టు కమ్మని అమ్మపాల వంటి అద్భుతమైన కథ వెంటనే ఏదీ నాకు దొరకలేదు. చివరికి ఒకరోజు వర్షంలో బాగా తడవడం వల్ల న్యుమోనియా వచ్చి చనిపోయాను. కథ వినాలనే నా కోరిక మాత్రం తీరలేదు'' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ మంజు ఒళ్లో ఒదిగిపోయింది.

"నీ కోరిక తప్పకుండా తీరుతుంది కావ్యా ... నీకోసం తప్పకుండా మంచి కథని ఎలాగైనా విని, దాన్ని నీకు వినిపించి నీకు విమోచన కల్గిస్తాను. నీ కథని అందరికీ చెబుతా. నీ కథ విన్న వాళ్లు వాళ్ల పిల్లలకు చెప్పడానికైనా కథల్ని నేర్చుకుంటారు ... '' కావ్యని తన గుండెలకు మరింతగా పొదువుకుంటూ చెప్పింది మంజు.
(మీ అభిప్రాయాన్ని తెలియజేయండి)                సమాప్తం (8)

ధన్యవాదాలు

--(())--

Wednesday, 31 January 2024

kanda



తలిదండ్రులు తొలి గురువులు

తలిదండ్రులె తొలి చెలిమియు తలచిన యెడలన్

తలిదండ్రులె బంధు గణము

తలిదండ్రులు దైవసములు తధ్యము రామా !!


కాయము కొవ్వగు రీతిన

ఖాయమ భయమే గనున్న ఖర్చులు పెరిగే

ధ్యేయము లేకయు తిండియు

మాయల జబ్బులు కళకళ మర్మము రామా


మితమే మరచీ సుఖమని

పతనమ్ము రుచులకునేడు పాఠము చెప్పెన్ 

మితదాహము నున్ననాడు

సతిపతి దేహానికొచ్చు శాంతిరామా


అసమానత యవినీతియు

దేశములో రక్త పోటు దీనుల పైనన్ 

ఆశల దాహము వల్లన 

పాశముతో గుండెపోటు పాఠము రామా 


స్త్రీ కళ తోడగు నిత్యము

వేకువ కళలౌను సత్య విద్యల మయమున్ 

నేకము యగుటే మూలము

తాకెడి తప్పోప్పు లేను తత్త్వము రామా


యగుసహజీవనమేరతి

వేగు వెతలతో బ్రతుకులు వెల్లువ తోటన్ 

మాగినసుఖముల దుఃఖము 

సాగును కళలగుట గాను సాధ్యము రామా


ఎవ్వడు రోషము లేకయు 

ఎవ్వడు విద్యా వినయము ఎల్లప్పుడుగన్ 

ఎవ్వడు సంతుష్టుడగుట 

ఎవ్వడు లోకమున భయము యెరుకా రామా


సత్యపలుకుగా గుణమున్ 

నిత్యమితవ్యయముతోను నిర్ణయ కళలన్ 

పత్యము మితమై హితమున్ 

నిత్యకళలు ఇంద్రియాల నీడలు రామా


వలపుల్లో యూరడిగన్ 

కళలల్లో కావ్యమేను గానుక గానున్ 

తలపుల్లో తన్మయమున్ 

కులుకుల్లో సందడీను పున్నమి రామా


దెబ్బలు తిన్న స్వర్ణమ్ 

బొబ్బలు ఎక్కిన చరణము భోధలు గానెన్ 

అబ్బుర పడుటే మనసున్ 

తబ్బిబ్బగుటయే జగతిన తాపము రామా


ఎగిసే గడసరి పడుచున్ 

నిగనిగ మెరిసేను కాంతి నియమౌనుకళన్ 

చిగురింపమదీ చిలికెన్ 

శృంగార ప్రియాసఖీ యశోవిధి రామా


పడతిరో యువతి కళకు

వడివడి మనసుకు ముసురగు విలయపు వేళల్

కడు లలిత యుగళ రాగము

చెడుగుడు యాటల ఫలితము చింతలు రామా


కం. కమలాప్తుడ నతి గొనుమయ

విమలంబగు బుద్ధినిచ్చి వినయము నిడుచున్

కమనీయపు చరితల నిడి

శమమేలెడు మనసు తోడ శాంతాకారా||


హరిహరసంభవపుత్రా!

గిరిశబరివసిత! మనోజ్ఞ !కృపతోఁగనుచున్

వరపూజ్యాయ్యప్పా!

సురనరకామ్యార్థదాత! శుభములనిడుమా !!! "


కం. శ్రీవేంకటేశ శ్రీశా

గోవర్ధన శైలమెత్తి గోకులమెల్లన్

గావగ బూనినతండ్రీ

 శ్రీవత్సాంకా నతిగొను చిన్మయరూపా||


కం. నారాయణీ నమోయన

కారుణ్యంబును గురిసెడు కల్పకవల్లీ

క్షీరాబ్ధివాసివమ్మా

ధీరారక్షించుమమ్మ ధీశక్తిడుచున్||


వందనము భారతమ్మా

నందన వనముగ వెలసిన నవ భారతమా!!

సందేహించక ప్రజలము

వందేమాతరము గీతి పాడెదమమ్మా!!


భవభయ ముడిపెడు శశిధర

పవనాశన భూష  శూలి పావనచరితా

శివ హర గిరీశ గిరిశా

జవమున‌ నతిగొని శరణిడు జంగమదేవా||


శరవణజన్మాऽऽసాదిత..

గురుఁడవునిఖిలురకు బుధేంద్ర కోటిజనులకున్

హరుఁడవు దురితచరులకున్

సురనిచయాత్మా ప్రసీద 'సుబ్రహ్మణ్యా'!!! "


కం. బొజ్జగణపతికి నతులిడ

నొజ్జగవిజ్ఞానమిచ్ఛు నోరిమితోడన్

సజ్జనమార్గము జూపును

గుజ్ధునిరూపమునరసిన గోరిక దీర్చున్||


కం.  *రాకా!* నిన్నే నమ్మితి,

రా కావగ నన్నునిపుడె, రమ్యా! కృతికిన్

శ్రీకారముగా నిలుము శు

భాకారవు కావ్యమునకు భాస్వన్మణి వై


పెద్దలు సెప్పుదురన్నియు

విద్దెలఁగూలంకషముగ వేడుకతోడన్

బద్దలువిఱుగవు తనువున

ౘద్దియనందురు పలుకులు శారదదయతో.."


ఘనులగు పూర్వులరచనలు

సునిశితముగఁజదివియప్డు శుద్ధకవనముల్

మనతెనుఁగునవ్రాసినచో

* మన పద్యములను పఠించి మాన్యతఁగనరే *..."


చేయి*0పఁదగును హితమును

*రా ..యి*0పగునుత బుధేష్ట రాగముతోడన్

*సాయి*యగురంగనిమరువ

*కోయి*నరవరుఁడ మనమున కుపశాం తినిడున్


నచ్చే సమయమ్మేలే

విచ్చే పువ్వుల సుఘంద వెన్నెలమయమే

మెచ్చే సొగసందాలగు

స్వేచ్చే సుఖదుఃఖములగు సేవల బ్రతుకే


ఆశల యానంద మధువు

చూసే యనురాగ తలపు చూపుల కళలే

వేసే యడుగు సుఖమగుటే

చేసే పనుల ఫలములు చేరువ కొరకే


నీలో మనసు కలకళలు 

నీలో కొంటె సరసాల నీడల మయమే

నీలో వయ్యారి కళలు 

నీలో రేపుకళ ప్రేమ నిత్య సు శోభల్


కిన్నెర సానిక మధురా 

దన్నుగ నిలువంగ లేదు ధరణిని నెంచున్ 

కన్నెల సొగసుల జూడగ

వెన్నెల చినబోయినెంచి వెలదిని, వేళా 


నీ హృదయము నాదియులే 

నీ చిగురు పెదవుల తీపి  నియ మమ్మగుటే

నీ చిలక పలుకు మనసే 

నీ చిలిపి నగవుల చూపు నిర్ణయ మౌనే


నీతో కలిసే నిజమిది

నీతో పంచుకొనుటేను నిర్ణయమేలే

నీతో సర్వ సుఖములే

నీతో బంధము జయమగు నియమగు విధ్యే


చిరుజల్లులలో సందడి

విరజాజివిరహము జూడ వింతకులుకుయే

ధరహాసము జూప తలపు

అరవిందసమేతుని కళ యాసలు తీర్చే


కన్నె కలువపై కులుకే

వెన్నెల పిలుపగు పలుకుల వలపై రాణీ

నున్నని ముఖముగ కదలే

మన్నన కోర మనసైన మహిమను జూపే


యంతా చూసినయేదో

కొంతా శుభమే జరుగును కోరిక తీరే

వింతా మార్పు కలుగుటే

పంతాలపలుకు పరువము పదనిస వరకే


సుందరాంగుని లీల లు

పందెరము యగు పరమపద ఫలమే నయ్యే

మందగమనమే మనసగు

చందురుని కథలను తెల్పు చిన్మయ రూపే


లోపాలే యాసలుగా

పాపాలే వ్యాదు లగుట పాలక మహిమే

కోపాలే మూల రసం

తాపాలే దుఃఖమునకు తత్త్వమ్ము గనే 


నాహృదయకుపహరములో

నీ హృదయము దాగి యుంది నిర్మలమగుటే 

నా హృదయం నీ మయమే 

నీ హృద్యము నాకుపంచు నిర్ణయ శంభో


కం. పురుషోత్తమ శ్రీరమణా

కరుణాకర దేవదేవ కావుము శౌరీ

సరసిజ నయనుడ మురహరి

పరమిడి నిలుపగ నతిగొను పరమాత్మహరీ||


కం. తృణములమేయుచు గోవులు

గుణమయక్షీరములను గురియును గూర్మిన్

మణిమయ దేహపు కాంతుల

గుణసుందరి నెపుడు నతుల

గొలుతునుమదిలో||


కం.యదుకుల తిలకుడ నిరతము

మదిదలతును మురియుచు నిను మరువకుమము‌లన్

సదయుడ శరణము నిడుమయ

పదముల గొలుతును నియతిని పరమపదమిడన్||


కం. అంబుజదళ శుభ నేత్రా

కంబుగ్రీవా గణేశ కరిముఖ వరదా

అంబాసుత హర వరసుత

దంబంబుల రూపుమాపు దయవిఘ్నేశా


ఇష్టంమే నన దే ననుటే

కష్టంమే విధిగనేటి గళము నేర్పున్

నష్టంమే మది వాంఛలు

ఇష్టం నన్నది సమమ్ము యీశ్వర శక్తిన్


తొలివలపుల రాణీ, నా

తలపుల వయ్యారి నీవె ధరణిని వెదకన్

కొలువంగ నాడు నేడును

కలలోనను కనికరించు గడసరి సఖియా!!


స్వచ్ఛత పలుకే వయసుది

ఇచ్ఛా మలుపే మనస్సు యిష్టమ్ముగనే

స్వేచ్చా జీవిత బతుకే

మచ్చయు లేనిది జగంబు మానస మగుటన్


కమ్మని కలలను తెలిపే

ఇమ్మని ముద్దుల కలయిక యింకా శోభల్

రమ్మని సతిరాజతలపు

 కమ్మగనున్నది ప్రకృతియె కళలే శోభల్


తండ్రి మాట మిన్న తల్లి మాటలు మిన్న 

రాజభోగమన్న రాజరికము 

కన్న అడుగుజాడ కళ్లునే తెరిపించు

భక్తి మిన్న అనియు బంధ తృప్తి


నాన్నగ రామా యనుచూ

మన్నన మహినా మహాత్మ మహిమే జూడన్

మన్నిక బ్రతుకే నిచ్చున్

సన్నిధి పెన్నిధి యనుటయు సమ్మతి రామా


Wednesday, 17 January 2024

 



'అసమానతలు అమానుషాలు'


 ఒకానొకప్పుడు ఒక కీకారణ్యంలో అనేక జంతువులు, పక్షులు జీవిస్తూ ఉండేవి. అదే అరణ్యంలో కొన్ని చిలుకల కుటుంబాలు జీవిస్తూ ఉండేవి. అందులో రెండు చిలుకలు చాలా నేస్తంగా ఉండేవి. ఒకదానికోసం మరొకటి ప్రాణం ఇచ్చుకోగలిగినంత గాఢమైన స్నేహం వాటిది. అవి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ వాగులలో స్నానం చేస్తూ, ఆ అడవిలో దొరికే ఫలాలు తింటూ ఉండేవి. 


ఆ అడవి వాతావరణంలో అవి ప్రకృతినియమాలు మినహా మరే నిబంధనలుగాని, నియంత్రణలు గాని లేకుండా స్వేచ్ఛగా పెరిగాయి. అంతే కాకుండా వాటికి తోచినమేరకు, వాటి సామర్ధ్యం మేరకు అవి ఇతర జంతువులకు, పక్షులకు, సాయం చేసేవి.


ఆ అరణ్యానికి సమీపంలోనే మునీశ్వరుల కుటీరాలు కొన్ని ఉండేవి. ఆ చిలుకలు రెండూ అక్కడక్కడ తిరుగుతూ ఆశ్రమవాసుల దినచర్యల్ని గమనించనారంభించాయి. ఆ మునీశ్వరులు జీవిస్తున్న పద్ధతి, పిల్లలకు విద్యనేర్పే విధానం వాటికి బాగా నచ్చింది. అవి తమలో తాము "అరే, ఈ మానవులు ఎంత అదృష్టవంతులు! వాళ్ళకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. దానితోబాటు విద్యనేర్చుకునే అవకాశాన్నిచ్చాడు.


 చూడు ఆ పిల్లలు గురువుగారి వద్ద ఎంత చక్కగా విద్యలు నేర్చు కుంటున్నారో!" అని ముచ్చటించుకునేవి. అలా కాలం గడిచి పోతున్నది; రెండు చిలుకలకూ వయస్సు మీద పడుతున్నది. వాటి స్నేహం మరింత బలపడి కొనసాగింది. వాటిలో ఒక చిలుకకు తానూ చదువుకోవాలనే కోరిక మరింత బలంగా కలిగింది. కాలం గడచి పోయింది; రెండు చిలుకలూ చనిపోయాయి. 


మరణానంతరం వాటి మంచి హృదయాలకు అనుగుణంగా వాటికి స్వర్గ ప్రాప్తి కలిగింది. అలా స్వర్గంలోకూడా వాటి మైత్రి కొనసాగింది. ఆ చిలుకల మైత్రికి సంతోషపడిన భగవంతుడు కొంతకాలం తరువాత వాటిని పిలిచి, "చిలుకల్లారా, మీ స్నేహం కారణంగా మీరు నాకెంతో ప్రియమైనవారైనారు. మీరు స్వర్గలోకాన్ని విడచి వెళ్తున్న సందర్భంగా కోరిన జన్మనొందేలా మీకు వరం ఇవ్వదలచాను. ఏజన్మ కావాలో కోరుకోండి" అన్నాడు. 


ఒక చిలుక "మహానుభావా! నీ దర్శనంతో నా జన్మ పావనమైంది. నాకు ఇదివరకటిలాగానే చిలుక జన్మను ప్రసాదించు. అదే అరణ్యంలో నేను మళ్ళీ జన్మించేలా వరమివ్వు" అని అడిగింది. రెండవ చిలుక తనకు మనుష్యజన్మ ప్రసాదించమని వేడుకున్నది. భగవంతుడు "తథాస్తు" అని దీవించాడు. మరుక్షణం ఒకటి చిలుకలాగాను, ఒకటి మనిషిలాగాను భూమిమీద జన్మించాయి. 


మొదటి చిలుక అరణ్యంలో జన్మించే సరికి అరణ్యం తగలబడుతున్నది. అక్కడ ఉండవలసిన ముని కుటీరాలు ఏనాడో శిధిలమైనాయి. అరణ్యంలోని చెట్లన్నీ ఏనాడో మనిషివాతనబడి గతించాయి. ఆ అరణ్యంలోంచి బయటపడి ఎంతో శ్రమతో తప్పించుకున్నాయి కొన్ని చిలుకలు. అలా ప్రాణాలతో మిగిలిన చిలుకలకు ఇక ఆహారం కరువైంది. 


తినేందుకు మధుర ఫలాలు లేవు; గూడు కట్టుకునేందుకు అనువైన చెట్లు కానరావటం లేదు. ఎక్కడ చూసినా కాలుష్యం. ’సుసంపన్నమై, తనను ఊరించి ’రా, రమ్మ’ని పిలిచిన గత జీవితం ఎక్కడున్నది? ’గతం గత:’ గతించిన కాలం మళ్ళీ రాదు. సర్వ సంపదలతో తులతూగే అలాంటి జీవితాన్ని తిరిగి సృజించుకోగలిగే సామర్ధ్యం ఈ చిలుక జన్మకు లేదు. ఇలాంటి జన్మనా, తను కోరుకున్నది?’ అని వగస్తూ చిలుక తన జీవితాన్ని అతి భారంగా నెట్టుకొచ్చింది. 


రెండవ చిలుక మానవజన్మనెత్తింది కదా, దాని తల్లిదండ్రులు పల్లెలో జీవితాలు గడపలేక, పట్టణానికి వలస పోయారు. అక్కడ అది అనేకమంది పిల్లలలాగే మురికిగుంటల్లో, రోడ్ల మాటున, అర్ధాకలితో పెరగవలసి వచ్చింది. తనను ఊరించిన అద్భుత విద్యావిధానం కొందరికి మాత్రమే అందుతుందని దానికి ఆలస్యంగానైనా, అర్ధమైంది. భగవంతుడు మనిషికి ఇచ్చిన చింతనా శక్తితో అది ’ఎందుకిలా?’ అని ప్రశ్నించుకున్నది. 


’భగవంతుని సృష్టిలో అందరూ ఒకటికాదూ? మానవులు సృష్టించుకున్న ఈ తారతమ్యాల్ని మనిషిగా తను రూపుమాపలేకపోతే తన జన్మ ఎందుకు?’ ఆ చిలుక స్వశక్తితో ఇక గొప్ప నాయకునిగా ఎదిగింది. మానవలోకంలో సత్యానికి, ప్రేమకు ఇంకా స్థానం ఉన్నదని, వాటిని మిగుల్చుకోకపోతే మనందరి జీవితాలూ శిలా సదృశాలే అవుతాయని ప్రవచించింది. దాని మాటలు మెల్లమెల్లగా దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. 'అసమానతలు అమానుషాలు' అన్న భావన పెరిగింది. మానవసమాజం మెల్లగా వెలుగువైపు పయనించింది. తన జీవితం సార్ధకమైందన్న సంతృప్తి దానికి కలిగింది.


--(())-


101."పాపపుణ్యాలు సుఖదుఃఖాలుగా ఎలా పరిణమిస్తున్నాయి !?"


మనం చేసిన మంచిచెడులే మనకు సుఖదుఃఖాలుగా వస్తాయి. ఈ సత్యాన్ని గుర్తిస్తే మంచి చేయటం, చెడును మానటం అనేవి ఎవరూ చెప్పకుండానే ఆచరిస్తాం. బాణాసురుడు అనే రాక్షసుడు తపస్సుచేసి పుణ్యం సంపాదించాడు. ఆ పుణ్యఫలంతో శివుడినే తన ఇంటికి కాపలాగా ఉంచుకున్నాడు. కానీ బాణాసురుడు చేసిన పాపం కృష్ణుడి రూపంలో అతన్ని వధించడానికి వచ్చింది. ఒకే పరమాత్మ పుణ్యఫలంగా రక్షణకోసం కాపలా ఉంటే, పాపఫలంగా శిక్షించడానికి కూడా వచ్చాడు. పుణ్యఫలం తరిగిపోగానే శివుడు అదృశ్యమయ్యాడు. పాపఫలం అతన్ని సంహరించేలా చేసింది. ధర్మజీవనంలో మనిషికి పాపస్పర్శ ఉండదు. కనుక ఎప్పుడూ దైవానుకూలతే ఉంటుంది. దాన్నే 'ధర్మోరక్షతిరక్షితః' అనే సూత్రంగా చెప్పారు !

***

102.."దుఃఖాలను దూరంచేసే శాంతిమంత్రం 'నేనెవరు' అనే ప్రశ్నగా చెప్పిన భగవాన్ శ్రీరమణమహర్షి బోధను ఎలా అర్థం చేసుకోవాలి !?"

సత్ప్రవర్తనతో మంచి వ్యక్తిత్వాన్ని, మంచి వ్యక్తిత్వంతో నిరహంకార స్థితిని, నిరహంకారంతో శాంతిని, శాంతిద్వారా ఆత్మస్థితిని తెలుసుకోటానికి భగవాన్ చూపించిన సులభోపాయమే "నేనెవరు?" అన్న ప్రశ్న. అందుకే అది మనకు ప్రశ్నకాదు. దుఃఖాలను దూరంచేసే శాంతిమంత్రం. ఏమతంలోనైనా, మార్గంలోనైనా నైతికత లేకుండా దైవాన్ని చేరిన ఉదాహరణగాని, దుఃఖాన్ని దూరంచేసుకునే అవకాశం గాని లేదు. ఇపుడున్న మనోబుద్ధులతో దైవం కనిపించటం అనటంలో అంతర్యం ఏమిటంటే నేను సాధన చేస్తున్నాను అన్న కర్తృత్వభావంతో చేసినంతకాలం దైవం తెలియదు. ఈ సృష్టిలో తన ప్రమేయంలేదనే నిరహంకారస్థితి వల్ల కలిగే శాంతివల్ల దైవం తెలుస్తుంది. తన ప్రమేయం లేదని తెలిపే శాంతిగుణమే అప్రమేయమైన దైవాన్ని సాక్షాత్కరించేలా చేస్తుంది. మనం నైతికతతో శాంతిని సాధిస్తే, శాంతి దైవాన్ని మన హృదయంలోకి తెస్తుంది. అది నిద్ర ఆవహించిన సహజంగా మన ప్రమేయం లేకుండా ఉంటుంది. అత్యాశతో పది చాక్లెట్లు కావాలని మారాంచేసే చిన్న పిల్లవాడికి మంచి మాటలు బోధించేది వాడి ప్రవర్తనలో మార్పుకోసమే. అది వాడికి అర్థమై పద్ధతి మార్చుకుంటే వాడు శాంతిగా ఉంటాడు, ఎదుటివారిని శాంతిగా ఉంచుతాడు. ప్రతి విషయంలో మన నైతిక ప్రవర్తన కూడా మనని, ఎదుటి వారిని శాంతిగా ఉంచుతుంది !

***

103.."నిద్రలో ఏ బాధలు ఉండటం లేదు కదా అలా మెలకువలో ఉండటం ఎందుకు సాధ్యం కావట్లేదు !?"

మనని తీవ్రంగా బాధించే శారీరక వ్యాధులు, మానసిక వేదనలు, చుట్టూ ఉన్న సామాజిక సమస్యలు, కుటుంబ కలతలు అన్నీ నిద్రలో మటుమాయం అవుతున్నాయి. నిజానికి అవి పోవటం లేదు. మనకు తెలియకుండా పోతున్నాయి అంతే ! తెలియకుండా పోవటం అంటే అనిపించకుండా ఉండటమే. ఇలా అనిపించకుండా ఉండే స్థితిని సంపాదిస్తే జీవనం కూడా నిద్రలాగా హాయిగా గడిచిపోతుంది. నిద్రాలాగా అంటే జీవనం లేకుండా కాదు. ఎవరో మనని అవమానించారు. ఆ విషయం మనకి అనిపించకపోతే అది నిద్రే !

***

104.."అనుకోవటాలు, భావాలు లేకుండా జీవనం కొనసాగలేదుకదా !?"

నేను అబ్బాయిని-అమ్మాయిని, నేను ఉద్యోగిని-నిరుద్యోగిని, నేను భక్తుడిని-నాస్తికుడిని ఇలా అనుకునేవాన్నీ భావాలే. అనుకోకపోతే జీవనం ఎట్లా అనేది సంశయం. పసివయసులో పిల్లలకు తాము ఆడ, మగ అనే భావం ఉండదు. అయినా వాడికి జీవనం ఉంటుంది. మల్లె చెట్టు వద్దకు వెళ్ళి ఇది మల్లెపూల చెట్టు అనుకుంటేనే అది గుబాళిస్తుందా ? అలా అనుకోకపోతే మనకు ఆ పరిమళం అందకుండా ఉంటుందా ! సినిమా చూస్తున్నంతసేపు మనసు అనేక ఆలోచనలతో సాగుతుంది కానీ దానికి భావం ఉండదు. ఒక్క సినిమా విషయంలోనే కాదు ఏ అనుభవంలోనైనా అనుభవ సమయంలో భావం ఉండదు. భావం వచ్చిన తర్వాత అనుభవం ఉండదు. శాంతి మన శాశ్వతమైన ఆస్థి. కానీ మనలో ఏర్పడుతున్న భావాలే దానిని భంగపరుస్తున్నాయి !

***

105.."అసంకల్పితంగా వచ్చే భావాలను సంకల్పంతో అడ్డుకునే వీలు ఉన్నదా ? అలాచేసి శాంతిని పొందవచ్చా !?"

నిద్రలో మనకు ఏ భావాలు ఉండవు. మెలకువ రాగానే భావాలు వస్తున్నాయి. భావం రాగానే అది సంతోష, దుఃఖాలుగా, కష్టసుఖాలుగా పరిణమిస్తున్నాయి. ఆ ద్వంద్వములేని స్థితే శాంతి. భావంలేని స్థితిలో మనసు శాంతిగా ఉంటుంది. వివేకవంతులు ఎవరైనా ఎక్కువ కాలం కొనసాగేదాన్నే కోరుకుంటారు. మనం ప్రపంచంలోని ఏ వస్తువు, విషయంలనుండైనా సంతోషం, సుఖం కోరుకుంటాం. కానీ ఏ సుఖసంతోషాలు శాశ్వతంగా నిలిచి ఉండవు. భావాలు మనలోని కోరికలవల్ల ఏర్పడుతున్నాయి. వస్తువులను అనుభవించటం కోరికకాదు. సుఖసంతోషాల కోసం ఆరాటపడటం కోరిక. ఆ కోరికే పరిణమించి భావాలకు కారణం అవుతుంది. దీన్ని అర్థం చేసుకుంటే శాంతి సులభం అవుతుంది !

***

106.."కోరికలు నశింపజేసుకునే ఉపాయం, సాధన ఏమిటి !?"

ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అనుభవిస్తూ, దానిపై ఆధారపడని స్థితిని సంపాదిస్తే కోరికలు నశిస్తాయి. కోరికలు లేని మనసు భావాతీత స్థితిలో సుఖదుఃఖాలను సమంగా స్వీకరిస్తూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అదే మనం చేయాల్సిన సాధన, సాధించాల్సిన స్థితి. ప్రపంచంపై ఆధారపడటానికి కారణం మనకు దాని స్వరూపం తెలియకపోవటమే. యాపిల్ పండులో దాని తీయదనంతో పాటు నశించిపోయే గుణం కూడా ఉంది. అదే దాని స్వరూపం. అది అర్థమైతే తీయదనంతో సంతోషిస్తాం గానీ అది శాశ్వతంగా ఉంచుకోవడం కుదరదని అర్థం చేసుకుంటాం. మనం చీకట్లో దేన్నో చూసి భయపడతాం. తీరా అది నీడేనని తెలుసుకున్న తర్వాత ఆ భయం పోతుంది. అలాగే సంతోషదుఃఖాలు, కష్టసుఖాలు కేవలం మన భావంవల్ల ఏర్పడుతున్నాయని తెలిస్తే వాటిని ఆ క్షణానికి అనుభవిస్తాం కానీ పొంగిపోవడం, కృంగిపోవడం చేయం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పిన సమస్థితి, స్ధితప్రజ్ఞత యోగం. ఆ స్థితిని పొందినవాడు భగవంతుడితో సమానం. ఆ స్థితిని పొందటానికి మనకు అవరోధంగా ఉన్నది మన భావాలే అనేది గుర్తించాలి !

***

107 ..ప్రశ్న : ప్రయత్నమే అక్కరలేకుండా మనశూన్యతను ప్రచూరమూ, ..అవిరళము చేయగలిగితే అది ఆత్మస్థితి అనవచ్చునా ?"

శ్రీరమణమహర్షి : మనసున్నంతకాలం యత్నముండవలె. అన్ని వేదంతాల్లోనూ ఈ శూన్యస్థితిని గురించిన వివాదం కావాల్సినంత ఉన్నది !

"ప్రశ్న : ఆత్మానుభవదశలో ప్రత్యక్షభావమొకటి ఉందా ? అది అనుభవమేనా, కాక కేవలం ఆత్మస్థితియేనా !?"

శ్రీరమణమహర్షి : ప్రత్యక్షం పరమస్థితి. అది భావనామాత్రం కాదు !


108.." ఎన్నో రకాలుగా వస్తున్న దుఃఖం దూరం కావాలంటే ఏం చేయాలి !?"


దీన్ని తెలుసుకునేందుకు భగవాన్ శ్రీరమణమహర్షి మనకు అవసరమైన మౌలిక గుణమేదో బోధించారు. అందుకు సులువైన మార్గంగా "నేనెవరో" తెలుసుకోమన్నారు. ఒక పక్షి పైకి ఎగరాలంటే రెక్కలు కావాలి. ఒక వ్యక్తి వ్యాపారం చేయాలంటే ధనం కావాలి. ఒక యువకుడు ఉద్యోగం చేయాలంటే చదువు కావాలి. ఇలా ఏది చేయాలన్నా అందుకు ప్రాథమిక అవసరమైన మౌలిక గుణం ఒకటి ఉంటుంది. సమాజంలో అతి కొద్దిమందికి ఆధ్యాత్మికంగా ఏదో సాధించాలనే తపన ఉంటుంది. దైవాన్ని చూడాలని కొందరు, మోక్షాన్ని పొందాలని మరికొందరు, ఆత్మ దర్శనం కోసం ఇంకొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. తాము కోరుకున్నది లభించే వరకు దుఃఖ పడుతూ ఉంటారు. ఇదంతా సాధకులు ఎదుర్కొనే సమస్య. ఇక ఇతర ఆస్తికులైనా, నాస్తికులైనా నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బరువులకు తాము దూరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాక వీరంతా దుఃఖ పడుతూ ఉంటారు. ఇది ఏ సాధన లేని సామాన్యులు ఎదుర్కొనే సమస్య. మాన్యులైనా, సామాన్యులైనా అందరికీ దుఃఖం ఉంటుంది. దైవ సమానులైన మహానుభావులకు సాధకులు, సామాన్యులు అనే బేధం ఉండదు. అందుకే శ్రీరమణమహర్షి ముందుగా "నేనెవరో" తెలుసుకోమన్నారు !

***

109 .."నారు పోసినవాడు నీరు పోయకపోతాడా అన్నట్లు సృష్టిలో జీవనప్రక్రియ అంతా చైతన్య ఏర్పాటుగానే తలపోయాలేమో !?"


సృష్టిలో ఏది భౌతిక రూపాలు తయారుచేసిందో అదే వాటి జీవనానికి అవసరమైన తెలివిని కూడా తయారు చేసింది. ఆ రెండిటి మిశ్రమమే చైతన్యం ఏర్పాటు చేసే సృష్టికార్యం. ఒక విద్యార్థి మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ చదవాలంటే ఆయా శాస్త్రాల్లో చిన్ననాటి నుండే ఆసక్తి, నైపుణ్యం ఉండాలి. తదనుగుణంగా తలిదండ్రులు తగిన తోడ్పాటునందించి, ప్రతిభను గమనించి మురిసిపోతారు. విద్యార్థిలోని సామర్ధ్యం అతనిలో సహజంగా ఏర్పడివున్న తెలివికి సానపడితే వచ్చిందా ? లేక కేవలం తన కృషితో మాత్రమే వచ్చిందా ? ఎవరైనా రాయిని శిల్పంగా చెక్కగలరు గానీ మట్టి ముద్దను చెక్కలేరు. శిల్పాన్ని మలిచిన శిల్పిలోనూ, ఆ శిల్పానికి అవసరమైన కాఠిన్యాన్ని మాత్రమే కలిగివున్న రాయిలోనూ, ఆ చైతన్యమే తగిన నైపుణ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. కోడి, బాతు గ్రుడ్లను ఒకేచోట పొదిగించినా, అవి పిల్లలుగా మారగానే వేటి సహజ ప్రవృత్తిని అవే ప్రదర్శిస్తాయి. బాతు పిల్లలు నీటి గుంటలోకి, కోడి పిల్లలు చెత్తకుప్పలోకి వెళతాయి. అదంతా వాటిలోని చైతన్య ఏర్పాటే !


110 ..మోహం పోతే మనసుకు స్వేచ్ఛ వస్తుంది !!


నిఘంటువులో సర్పం అంటే పాము అని ఉంటుంది. అది చదువుకున్నప్పుడు లేదా విన్నప్పుడు భాషాపరమైన భావం తెలుస్తుంది. అయితే అది నిజంగా పామును చూసినప్పుడు కలిగే అనుభవాన్ని ఇవ్వదు. కానీ ఆధ్యాత్మిక విషయంలో  అలాకాదు. మనం చదవడం లేదా వినటంద్వారా కలిగే జ్ఞానమే విశ్వాసం, పరిపక్వతలచేత అనుభవంగా పరిణమిస్తుంది. ఆధ్యాత్మికతలో అర్థం కావడానికి, అనుభవం రావడానికి పెద్దగా తేడా, దూరం ఉండదు. సత్యం అర్థమయ్యే కొద్దీ వాస్తవికత అర్థం అవుతుంది. ప్రపంచం  వాస్తవికత తెలిసే కొద్దీ దానిపై మోహం పోయి మనసుకు స్వేచ్ఛ వస్తుంది !


111 .. కలవరము 🥀

7, 8.మన బలమున పెద్దవారిని కూడా పేర్కొనుచున్నాను. భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మున్నగు పరాక్రమవంతులు మన పక్షము నలంకరించియున్నారు.

9. యుద్ధమునందు ఆరితేరినవారు, అనేక శాస్త్రములు తెలిసినవారు, లెక్కకు మిక్కిలిగా నాకొరకు మమకారమున జీవితాశను కోల్పోయి యుద్ధమునకు సిద్ధమైనారు.

10. భీష్మునిచే రక్షింపబడుచున్న‌ నాబలము లెక్కకు మిక్కిలియై పర్యవేక్షణకు లొంగకున్నది. పాండవుల బలము పరిమిత సంఖ్యమై హద్దుల్లో నిమిడియున్నది. దానిని భీముడు రక్షించుచున్నాడు.

11. ఎట్లైనను మీరందరు తమతమ స్థానములనుండి భీష్ముని కాపాడుకొనుడు.

12. ఇట్లు పలుకుతున్న దుర్యోధనుని మాటలలో గురువగు ద్రోణుని నెత్తిపొడుచుట, కొంత అధైర్యము గోచరించినవి. ఇట్టి భావములనుండి మరలించి,  దుర్యోధనునకు హర్షము పుట్టించుచు భీష్ముడు సింహనాదముగా తన మహా శంఖమును పూరించెను. అతడు వయస్సుతో నిమిత్తం లేని ప్రతాపవంతుడని ఆ శంఖధ్వని చాటినది.

13. వెంటనే అనేక శంఖములు, భేరులు మున్నగు వాద్యముల ధ్వనులు కురు సైన్యముల నుండి ఏవెలువడి భూనభోంతరాళములు నిండినవి.

14. అదే సమయమునకు నరనారాయణులు తెల్లని గుర్రములు పూన్చిన మహారధమున రంగము నడుమన కనిపించిరి. దివ్యశంఖములను పూరించిరి.

--(())--

112..ఆచార్య సద్భోదన

ఉన్నతము, శాశ్వతమూ, అవినాశమూ అయిన ఒక ఆధ్యాత్మికాదర్శం కోసం మనం గట్టిగా ప్రయత్నించాలి.

కానీ మనం కోరికోరి ఈ మాయా కల్పితమైన మమతానురాగాలను, భౌతికమైన  భోగాలను అంటిపెట్టుకుని, అజ్ఞానపు పంథాను ఎంతో ఇష్టంగా అవలంబిస్తాం. ఈ రోజు కాకపోతే రేపైనా వాటిని విడువక తప్పదు కదా. మనంతట మనంగా పట్టువిడవకపోతే, మన చేతిలోని ఆటబొమ్మ ఏదో ఒకనాటికి బలవంతంగా లాగివేయబడుతుంది. ఇది అమితమైన దుఃఖానికి దారి తీస్తుంది.

ఇలా జరిగిన తర్వాత, భగ్న హృదయులైనప్పుడు మాత్రమే చాలా మంది ఈ జీవితం నేర్పే పాఠాలను నేర్చుకుంటారు.

కానీ ఈ విధంగా నేర్చుకోవడం ఎంతో బాధాకరంగా ఉండడమే కాక, దానికి ఎన్నో జన్మలు పడుతుంది కూడా. అలా చెయ్యడానికి బదులు, ఆధ్యాత్మిక జీవనన్ని బుద్ధిపూర్వకంగా, చక్కగా యోచించి, స్పష్టమైన ఎరుకతో, దృఢమైన సంకల్పశక్తితో, భగవర్పిత ఏకనిష్టతో జీవించాలి.

నిజానికి, ఈ సంకల్పశక్తి ద్వారా మన జీవితాన్ని ఉన్నత శిఖరాలకూ చేర్చవచ్చు లేదా అధోగతులకు దిగజార్చవచ్చు.

అంతా మన చేతుల్లోనే ఉంది. 

***

113..సనత్కుమారుని బోధలు

మనము కళ్ళు మూసుకొని కూర్చుంటే మన మనస్సు స్పందనము లోకి చేరి, లోపల ఒక వెలుగును దర్శనము చేయిస్తూ ఉంటుంది. ఆ వెలుగును దర్శనము చేయడానికే తపన చెందాలి.

మనస్సు అంతర్ముఖమవ్వడము చేత బుద్ధిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బుద్ధిలోనికి ప్రవేశించిన వాడే ఆత్మసామ్రాజ్యము పొలిమేరలలోకి వెడతాడు. అటుపైన ఆత్మతత్త్వము అర్ధమైన పిమ్మట, పరమాత్మ తత్త్వమును అనుభూతి చెందుతూ క్రిందివన్నీ వదిలివేస్తాడు.

***

114..ఆచార్య సద్భోదన

మన ఉనికిని మనం విస్మరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేనిచో ప్రాపంచికత్వం మనలో జొరబడి మనల్ని ముంచివేయగలదు. మనపై మన ఆలోచనలు నిమగ్నమైనప్పుడు దృష్టిని అన్యధా మళ్ళించగలగాలి. మనకు దివ్యకృప యొక్క ఆవశ్యకత ఎంతాగానో ఉన్నది. మన ఆదర్శం పట్ల మనకు అంకితభావం ఉండాలి. మనలను మనం అందుచేత సురక్షితంగా ఉంచుకోవాలి. జీవితం ఎత్తుపల్లాలను కూడుకుని ఉంటుంది. అందువలన మనం సదా భగవంతుని రక్షణలో ఉండేలా చూసుకోవాలి. ఆధ్యాత్మిక జీవనం నిస్వార్థత మీద ఆధారపడి ఉన్నది. అది కేవలం సంకుచితపు "నేను" కాకుండా ఉన్నది. ఒక ఆదర్శం పట్ల భక్తి విశ్వాసాలతో మెలగడం వలన మనలో నిస్వార్థత కలుగుతుంది. అంతేకాక అది పవిత్రతను చేకూరుస్తుంది.

"సర్వేజనా స్సుఖినోభవంతు."

***

115.."అంతరంగ జీవనంలో వ్యక్తిత్వం వలన అహంకారం పెరుగుతుంది అంటారేమిటి 🤔!?"


సామాజిక జీవనంలో అందరికీ ఆమోదయోగ్యమైనదాన్ని మంచి వ్యక్తిత్వం అంటారు. జీవనంలో అలా ఒక వ్యక్తిత్వంతో ఉండటం వల్ల గౌరవం పెరుగుతుంది 🤴. కానీ అంతరంగ జీవనంలో [ఆలోచనల్లో ] వ్యక్తిత్వం వలన అహంభావన అధికమై సత్యదృష్టి తగ్గుతుంది 😔. భగవాన్ శ్రీరమణమహర్షి బోధించిన విచారణమార్గం మన అంతరంగ జీవనాన్ని సంస్కరించుకోవటం ద్వారా సత్యదృష్టిని పెంచుకునేందుకు ఉపకరిస్తుంది 😋. మనసు పోకడలను విచారించడం ద్వారా ఆలోచనలో ఉన్నదంతా నేనేనని, నా మనసేనని గుర్తించేలా చేస్తుంది. చివరికి దైవం విషయంలో కూడా మనకు ఈ సూత్రమే వర్తిస్తుంది 😯. మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించేటప్పుడు ఏం జరుగుతుందో పరిశీలిస్తే మనకు మనసు చేస్తున్న నాటకం అర్థమవుతుంది 👍!

***