Sunday, 19 June 2022

 

*🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️*

 *27వ శ్లోకం:-*

*మదన పరిహర స్థితిం మదీయే మనసి ముకుందపదారవిందధామ్ని! 

హరనయన కృశానునా కృశోసి స్మరసి న చక్రపరాక్రమం మురారే:!!*

*భావం:-*

*ఓ మదనా! నా మనసులో ముకుంద చరణారవిందములు పాదుకొనిఉన్నవి. నీవు అచటకు చేరుకొన ప్రయత్నింపకుము. పురారి నేత్రాగ్ని చేతనే కృశించితివి. ఇంకా మురారి చక్ర పరాక్రమము గూర్చి తెలుసుకొని మసలుకొనుము.*

🕉🌞🌎🌙🌟🚩

*నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడటమే నాయకత్వ లక్షణం. కానీ మనం మాత్రం అవసరమైన త్యాగం చేయకుండానే నాయకులమవ్వాలని అనుకుంటాం. దాని ఫలితం శూన్యం - చివరికి ఎవరూ మనల్ని లక్ష్యపెట్టరు.*

*ప్రకృతి మీకు పాదాక్రాంతమవ్వాలి. మీరు దాన్ని మట్టికరిపించి అతీతులవ్వాలి. ముక్తులై స్వేచ్ఛను సాధించాలి.*

*నా చైతన్య విమానంలో పైన, క్రింద, కుడి, ఎడమ, లోపల , బయట అంతటా విహరించి , నా అంతరిక్ష గృహంలో, మూలమూలనా ఎల్లప్పుడూ, నా పరమపిత పవిత్ర సన్నిధిలోనే ఉన్నానని కనుగొన్నాను.*


*శ్లో𝕝𝕝 భిత్వా పాషాణ పిఠరం*  *ఛిత్వా ప్రాభఞ్జనీ యథా।*

*పీత్వా పాతాళ పానీయం* *కుటజశ్చుమ్బతే నభః॥*

*తా𝕝𝕝 కొండమల్లె మొక్కతన ఎదుగుదలలో అడ్డుపడే బండరాళ్లను సైతం లెక్కచేయక పెనుగాలులను తట్టుకొని పాతాళముయందున్న నీటి అవశేషాలను తన వ్రేళ్లతో గ్రహించి ఆకాశాన్ని తాకాలనే ధ్యేయంతో మొలకెత్తుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి ఉన్నతస్థానం పొందాలనుకునే వారికి ఇది ఒక స్ఫూర్తినిచ్చేది.*

***

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 582 / Sri Siva Maha Purana - 582 🌹* 

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 02 🌴*

*🌻. కుమారస్వామి జననము  - 2 🌻*

శివుని రాక ఆలస్యమగుటచే అచటకు వచ్చిన పార్వతి దేవశ్రేష్టులనందరినీ చూచి, ఆ వృత్తాంతము నంతనూ తెలుసుకొని మహాక్రోధమును పొంది (12), అపుడు విష్ణువు మొదలగు దేవతలందరినీ ఉద్దేశించి ఇట్లనెను (13).

దేవ్యువాచ|

రేరే సురగణాస్సర్వే యూయం దుష్టా విశేషతః | 

స్వార్థసంసాధకా నిత్యం తదర్థం పరదుఃఖదాః  14

స్వార్థహేతోర్మహేశానమారాధ్య పరమం ప్రభుమ్‌ |

 నష్టం చక్రుర్మద్విహారం వంధ్యాeôభవమహం సురాః  15

మాం విరోధ్య సుఖం నైవ కేషాంచిదపి నిర్జరాః | 

తస్మాద్దుఃఖం భ##వేద్వో హి దుష్టానాం త్రిదివౌకసామ్‌ || 16

దేవి ఇట్లు పలికెను--

ఓరీ! దేవతా గణములారా! మీరందరు పరమ దుర్మార్గులు. మీరు నిత్యము స్వార్థసాధనాపరులు. స్వార్థము కొరకై ఇతరులకు దుఃఖమును కలిగించెదరు (14). మీ స్వార్థము కొరకై పరమప్రభుడగు మహేశ్వరుని ఆరాధించి నా విహారమును భంగపరిచిరి. ఓ దేవతలారా! నేను వంధ్యను అయితిని (15). ఓ దేవతలారా! నాతో విరోధించిన వారికి ఎవరికైననూ సుఖము లభించదు. కావున దుష్టులగు దేవతలకు (మీకు) దుఃఖము కలుగు గాక! (16)

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివుని పత్నియగు ఆ పార్వతి ఇట్లు పలికి కోపముతో మండిపడుతూ విష్ణువు మొదలగు దేవతలనందరినీ శపించెను (17).

పార్వతి ఇట్లు పలికెను--

ఈ నాటి నుండియూ దేవతల భార్యలు వంధ్యలు అగుదురు గాక! నన్ను విరోధించిన దేవతలందరు దుఃఖితులగుదురు గాక! (18)

బ్రహ్మ ఇట్లు పలికెను--

సకలేశ్వరి యగు పార్వతి విష్ణువు మొదలగు దేవలనందరినీ ఇట్లు శపించి శివతేజస్సును గ్రహించిన అగ్నితో కోపముగా నిట్లనెను (19).

పార్వతి ఇట్లు పలికెను--

ఓయీ అగ్నీ! నీవు నిత్యదుఃఖితమగు హృదయము గలవాడవై సర్వభక్షకుడవు కమ్ము. నీవు శివతత్త్వము నెరుంగని మూర్ఖుడవు గనుక దేవకార్యమును చేసినావు (20). ఓరీ మోసగాడా! నీవు మహా దుష్టుడవు. దుష్టుల దుష్ట బోధనలను విని శివవీర్యమును గ్రహించితివి. నీవు ఉచితమగు కార్యమును చేయలేదు (21).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

*మూల మంత్రము :*

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।*

*రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀*

*🌻 380. 'బిందుమండలవాసినీ' - 3🌻* 

*జీవితము యజ్ఞార్థము కానిచో తపస్సు వలను పడదు. అంతరాంత రాళమున జీవప్రజ్ఞ చేరవలె నన్నచో ఇతరములు గోచరింపక సమస్తము శ్రీమాత దివ్యరూపముగనే దర్శించుట ప్రధానము. అపుడు శ్రీమాత భావన నిత్యమగును. అనన్యమగును. బిందు మండల మనగా తెల్లని కాంతితో కూడిన మండలము. ఆ కాంతికి కేంద్రమే బిందువు. ఈ బిందువు గాని, దాని కాంతి గాని, పదార్థమును ఆవరించి యుండును గాని ఆశ్రయించి యుండదు. బిందువు రూపము పూర్ణమగుట వలన దీనిని పూర్ణ మనిరి. తేజోవంత మగుట వలన చీకటికి ఆవలి వెలుగు అనిరి. దీనిని స్మరించుటకే భ్రూమధ్యమున స్త్రీలు, పురుషులు తిలక ధారణము గాని భస్మ ధారణము గాని చేయుట.*

*మాధవు డుండు స్థానము అయి వుండుటచే ఈ భ్రూమధ్య స్థానమును బిందు మాధవు డని, బిందు మాధవి అని పలుకుదురు. భ్రూమధ్యము నుండి బ్రహ్మనాళమున చరించుట బ్రహ్మానంద దాయకము. హృదయ మందు విశాలమై పరమ పవిత్రమైన ప్రజ్ఞగ ప్రవహించు చుండును గనుక బిందు హ్రదము (సరస్సు) అని కూడ పలుకుదురు. బిందు స్థానమున చేరిన వారిని బిందు శర్మ అని పిలుతురు. నాళమున ఈ బిందువు అన్ని లోకముల యందు పయనించు త్రోవను బిందురేఖ అనిరి. బిందు జ్ఞానమే సర్వజ్ఞానము, సర్వానందమయము.*

*సశేషం...*

 *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*714వ నామ మంత్రము* 20.6.2022

*ఓం కులోత్తీర్ణాయై నమః*

కులము (ఇంద్రియాల గుంపు), మనస్సులచే ఎరుగబడనిదైన (అతీంద్రియ స్వరూపిణియైన) జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కులోత్తీర్ణా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కులోత్తీర్ణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు   ఆ తల్లి కరుణచే తన ఇంద్రియాలను  సన్మార్గంలోనికి నడిపించుకొని నిరంతరం భగవద్ధ్యానంలో జన్మతరింపజేసికొనును.

జగన్మాత ఇంద్రిసముదాయమునకు గోచరించనిది. అనగా *సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా* అని లలితాసహస్రనామస్తోత్రంలో  చెప్పినట్లు  ఆతల్లి ధరించిన వస్త్రములు, సుమమాలలు మొదలైనవి వన్నిటితోనూ, దోషరహితమైన అవయవ సొంపుతో ఉండి సర్వాభరణ భూషితయైన ఆ తల్లిని ఈ చర్మ చక్షువులతో చూడలేము, *నిజసల్లాపమాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ* యను నామ మంత్రములో చెప్పినట్లు ఈ శరీరంలో ఉన్న  చెవులతో  సరస్వతీ దేవియొక్క కచ్ఛపీ వీణానాదమునకన్నా మధురమైన ఆ తల్లి పలుకులను వినలేము, *చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా*  యను నామమంత్రములో చెప్పినట్లు సంపంగి, అశోక, పున్నాగ పుష్పసౌగంధములలరిన ఆతల్లి శిరోజముల సౌగంధము గాలిలో తేలియాడుతూ మన శరీరంలోని ఘ్రాణేంద్రియమైన నాసికా రంధ్రములను తాకదు, ఒకవేళ తాకినా గ్రహించలేము, అలాగే *సుధాసారాభివర్షిణీ* అను నామమంత్రంలో చెప్ఫినట్లు సహస్రారంలోని చంద్రమండలమందు స్రవించు అమృతధారలు, నానా రకాల భౌతికప్రపంచ పదార్థముల షడ్రుచుల మేళవింపుల రుచిమరిగిన జిహ్వను చేరనేలేవు, ఆ అమృతధారలలోని మధురిమలు ఈ నాలుకతో రుచి కూడాచూడలేము. ఇంకనూ *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* అను నామ మంత్రములో చెప్పినట్లు పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వ, సౌకుమార్యాది లక్షణములతో భాసిల్లు పదద్వయంపై ఈ శిరస్సును తాకించినను ఆ పాదస్పర్శలోని దివ్యత్వాన్ని తెలియలేము.  ఎందుకంటే నేను అనే భ్రాంతిని విడచి, పరమాత్మలోనైక్యమునంది జీవన్ముక్తుడైతేనే తెలియగలముగాని లేకుంటే కులము (భౌతిక శరీరమందలి ఇంద్రియాల గుంపు) వలన గాని, ఈ శరీరముపై మమకార పూరితమైన మనసుతోగాని ఆ తల్లిని తెలియలేనంత అతీంద్రియ స్వరూపిణి అయినది జగన్మాత. 

కులము అంటే అజ్ఞానము. అజ్ఞానానికి గురువురూపంలో జ్ఞానోపదేశంచేసి, సాధకుణ్ణి కడతేర్చేది పరమేశ్వరి. అందుచే *కులోత్తీర్ణా* యను నామముతో ఆ తల్లి స్తుతింపబడుచున్నది.

ఆ  తల్లికి నమస్కరించునపుడు *ఓం కులోత్తీర్ణాయై నమః* అని అనవలెను.

: *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*178వ నామ మంత్రము* 20.6.2022

*ఓం నిర్భేదాయై నమః*

స్వజాతీయము, విజాతీయము, స్వగతము అను మూడు భేదములు లేక విలసిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్భేదా* యను మూడక్షరముల నామ మంత్రమును  *ఓం నిర్భేదాయై నమః* అని ఉచ్చరించుచు, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ శ్రీమాత పాదసన్నిధిలో ధ్యాన నిమగ్నుడైన భక్తులకు భేదరహితమైన జీవనమును కొనసాగించుచు, భౌతిక సుఖసంతోషములు, ఆత్మానందమమును అనుభవించి తరించును.

సకల జగత్తునందు, జీవులన్నిటిలోను విలసిల్లుతూ, మానవులు, పశుపక్ష్యాదులు, అడవిజంతువులు, వృక్షసంతతి యందును ఏవిధమైన భేదదృష్టి ప్రసరింపజేయక, జీవకోటి యంతయు తనదిగా భావించి, ఏ జీవసమూహమనకు ఏమికావలెనో, ఎలాకావలెనో సమకూర్చుచున్నది.  కాబట్టి ఆ తల్లి *నిర్భేదా* యని అనబడుచున్నది. సహస్రనామములలో *శ్రీమాతా* యని అన్నాము. అనగా జగత్తుకంతటికీ మాతృమూర్తి. తల్లి తన బిడ్డలను భేద భావముతో చూడక  అన్నపానీయములు, విద్యా బుద్ధులు వయసుననుసరించి సమకూర్చును. చంటిబిడ్డకు పాలు పడితే, ఎడ బిడ్డకు గోరుముద్దలు, ఎదిగిన బిడ్డకు అన్నము పెడుతుంది. భేదభావము ఉండకూడదని బిడ్డలందరికీ పాలు మాత్రమే పట్టదు. లేదా అందరికీ ఆవకాయతో అన్నమే పెట్టదు. అలాగే జీవులకు ఆహారపు అలవాట్లు, జీవనము కొనసాగించు సరళిని బట్టి కావలసినవి సమకూర్చుతుంది జగన్మాత. ఒకరిపై అతిప్రేమ, మరొకరిపై ఏహ్యభావము చూపదు గనుకనే *నిర్భేదా* యను నామ మంత్రము సార్థకమైనది. జీవుల కర్మవాసనలు కూడా పరిగణిస్తూ ప్రాప్తి ఎంత ఉంటుందో అంతవరకూ  జీవుల అవసరాలను సమకూర్చుతుంది. 

సాధారణంగా భేదము అనునది జాతిపరమైనది కావచ్చు, లేదా సజాతిలోనే వర్గభేదం కావచ్చు, తన శరీరంలో పాదము, శిరస్సు అను అవయవ భేదము కావచ్చు ... ఈ విధమైన సజాతి, విజాతి, స్వగతము అను భేదత్రయము లేనిది. 

ఆదిశంకరాచార్యులవారు. పరమాత్మకూ, జీవాత్మకూ భేదం లేదు. ఈ రెండూ ఒకటే. పరమాత్మ నిర్గుణం అని బోధిస్తుంది. అద్వైతం 

*ఏకమేవా ద్వితీయం బ్రహ్మ*,

పరమేశ్వరుడు ఒక్కడే. రెండవవాడు లేడు.

 *ఏకం సద్విప్రా బహుధా వదంతి*

సత్యం ఒక్కటే' దానిని జ్ఞానులు బహువిధాలుగా చెపుతారు.

*సర్వం ఖల్విదం బ్రహ్మ* 

ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే. వేరేమీ లేదు.

*జీవో బ్రహ్మైవ నాపరః*

జీవుడు బ్రహ్మము తప్ప అన్యము కాదు

 *తత్త్వమసి* 

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, అది నీవే.  

వంటి వాక్యాలన్నీ అద్వైతసిద్ధిని చెపుతాయి. జీవాత్మ పరమాత్మరూపమే. అయితే యాసంబంధముచేత జీవాత్మ ఈ సత్యాన్ని గ్రహించడంలేదు. జ్ఞానంద్వారా ఈ సత్యాన్ని గ్రహించగల్గుతుంది. ఈ జ్ఞానంపొందిన జీవాత్మ మోక్షం పొందగలుగుతుంది. అంటే పరమాత్మయై ఊరుకుంటుంది. జగన్మాత పరబ్రహ్మ స్వరూపిణి.  గనుక *నిర్భేదా* యని అన్నాము.

కూర్మపురాణంలో ఇలా చెప్పబడినది:

*శ్లో. త్వం హి సా పరమా శక్తిః అనంతా పరమేష్ఠినీ సర్వభేదవినిర్ముక్తా సర్వభేదవినాశినీ॥* (సౌభాగ్య భాస్కరం, 387వ పుట)

నీవే మహాశక్తివి. అనంతపు పరమేష్ఠిస్వరూపురాలవు. సకల భేదములు లేనిదానవు. సకల భేదములు నశింపజేయుదానవు.

శివశక్తులు ఇరువురు ఒకరు లేక మరొకరు లేరు. ఇద్దరూ ఒకటే. పరమాత్మకు లింగభేదం లేదు. కనుక జగన్మాత *నిర్భేదా* అని నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్భేదాయై నమః* అని అనవలెను.

. కపిల గీత - 26 / Kapila Gita - 26🌹*

*🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 2 🌴*

*26. భక్త్యా పుమాన్జాతవిరాగ ఐన్ద్రియాద్దృష్ట శ్రుతాన్మద్రచ నానుచిన్తయా*

*చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే ఋజుభిర్యోగమార్గైః*

*నా యందు కలిగిన భక్తితో జీవుడు వైరాగ్యాన్ని పొందుతాడు. ఇంద్రియములకు సంబంధించిన విషయాల యందు, చూచినా విన్నా ఆసక్తి కలుగదు. వాడి మనసు ఎప్పుడూ నా కథలను గూర్చి చింతిస్తూ ఉంటాడు. నిరంతరం నా కథలనే చెబుతూ వింటూ ఉండే వాడు సాంసారిక భోగముల యందు విరక్తి కలిగి ఉంటాడు. అతను యోగములో ఉండి మనస్సును స్వాధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది జరిగితే వారికి చక్కటి దారి దొరుకుతుంది. దానితో నన్ను సాక్షాత్కరింప చేసుకోవడానికీ, మనసుని నిగ్రహించు కోవడానికి ప్రయత్నిస్తాడు.*

*సశేషం..*


Friday, 17 June 2022


(తరువాత భాగంలో -  వాస్తు - శకునాలు)

.....

 శ్లోకం 08:-


చేతః ఖల్వస్య బన్దాయ ముక్తయే చాత్మనో మతమ్ |

గుణేషు సక్తం బస్ధాయ రతం వా పుంసి ముక్తయే || 8

టీకా:-

 చేతః = మనస్సు; ఖలు = నిజానికి; అస్య = ఒకనియొక్క; బంధాయ = బంధమునకు; ముక్తయే చ = ముక్తికిని; ఆత్మనః మతమ్ = నేను అంగీకరించుచున్నాను; గుణేషు సక్తం = గుణముల యొక్క సాంగత్యము; బంధాయ = బంధకారణము; రతం వా = రమించు; పుంసి = పురుషునిలో; ముక్తయే  = ముక్తికి కారణము.

భావం:-

నిజానికి జీవుని మనస్సే బంధమునకు, మోక్షమునకు కారణమని నేను అంగీకరిస్తున్నాను. ప్రకృతి గుణముల సాంగత్యములో ఉన్న మనస్సు బంధ కారణం. భగవంతుని యందే లగ్నమైయున్న మనస్సు మోక్షకారణం.

వివరణ:-

ఈ సత్యం మన శాస్త్రాలలో అనేక పర్యాయములు చెప్పబడింది. ఉపనిషత్తు ఈ విధంగా చెబుతున్నది. - "మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః” (అమృతబిందూపనిత్తు). భగవద్గీత (6.5)లో ఈ విధంగా చెప్పబడింది. - "ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః” “ఎవరికైనను మిత్రుడైన, శత్రువైన మనస్సే”.

మన బంధనం శారీరకమైనది కాదు మానసికమైనదే. విషయ వస్తువులలో ఆనందమున్నదనే అసత్యాభిప్రాయంతో మన మనస్సు మమకారాలను, కోరికలను, భ్రాంతులను కల్పించుకొన్నది. అలాంటప్పుడు మన దుఃఖాలకు ఎవర్ని దూషిస్తాం? మన వ్యాకులతలకు, సంఘర్షణలకు, దుఃఖాలకు మనమే బాధ్యులం. మనమెప్పుడు దేని గురించీ ఫిర్యాదు చేయకూడదు. ఎప్పుడూ, ఎక్కడా, దేనినీ లేక ఏ పరిస్థితులనూ నిందించకూడదు. మేఘాలకు కారణమైన గాలియే, మేఘాలను తొలగించుటకు కూడా కారణమై వెనుక నున్న ప్రకాశవంతమైన సూర్యుని ప్రకటింపచేస్తున్నట్లుగా, మన మనస్సే బంధమోక్షములకు కారణము. ఈ సత్యాన్ని మనం మన అనుభవంలో తెలుసుకోవచ్చును.


సత్త్వ, రజః, తమస్సు అనే ప్రకృతి గుణాలతో యీ ప్రపంచమంతా నిర్మితమైయున్నది. ఈ గుణాలు వ్యక్తిలో కర్మేంద్రియాల ద్వారా (శ.మ.బు) జ్ఞానేంద్రియాల ద్వారా (శబ్ద,స్పర్శ, రూప, రస, గంధాలు) వ్యక్తమవుతున్నాయి.


 భగవద్గీత ఇట్లు చెబుతున్నది - (3.28) - “గుణాగుణేషు వర్తంతే గుణాలు గుణాలలో వర్తిస్తున్నాయి”. వాటిలో సహజ సంబంధమున్నట్లుగా గుణాలు గుణాలలో వర్తిస్తున్నాయి. “నేను”, “నాది” అనే భావంతో విషయ వస్తువులను గుర్తించినప్పుడు వాటితో నేను తాదాత్మ్యము చెందుతున్నాను.


 తరువాత వాటి బాధ, అవమానము, నా దుఃఖం, అవమానం అవుతున్నది. ఈ గుణాల తోడి తాదాత్మ్యమును వదలి, భగవంతునిలో రమించ నారంభించినప్పుడు ద్వంద్వాతీతుడను అవుతాను. క్రిందిస్థాయిలోనే వున్నట్లయితే ప్రపంచంలో బంధించబడతాను. క్రిందికి ప్రవహించేనీరు తొక్కబడుతుంది. పైకి ఎగిసే అగ్ని పూజింపబడుతున్నది.


ఎవరైనా భగవంతునిలో ఎలా రమించగలరు? భగవానుడు జవాబిస్తున్నాడు.

.....


" ఘనశ్యామవపుర్దేవం , ఘనసప్తాచలప్రభమ్..

ఘనవేదనుతం , వందే , ఘనసంకటహారిణమ్ !!! "

"


🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 1 🌴


25. సతాం ప్రసఙ్గాన్మమ వీర్యసంవిదో భవన్తి హృత్కర్ణ రసాయనాః కథాః

తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధా రతిర్భక్తిరనుక్రమిష్యతి


భక్తులు చెప్పే నా కథలు మీ ప్రయత్నం చేయకుండానే మీ కర్ణ రంధ్రం నుండి లోపలకి వెళ్ళి అక్కడ ఉన్న దోషాన్ని పోగొడతాయి. ఇలా వారు చెప్పే కథలను వినడం వలన మోక్ష మార్గం తెలుసుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. వారి యందు ప్రీతి కలుగుతుంది, నా యందు (పరమాత్మ యందు) భక్తి కలుగుతుంది. శ్రద్ధ కథల మీద, రతి చెప్పేవారి మీద, భక్తి పరమాత్మ మీద కలుగుతుంది.


సశేషం..


 . శ్రీ శివ మహా పురాణము - 581 / Sri Siva Maha Purana - 581 🌹 


🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 02 🌴

 కుమారస్వామి జననము  - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-


యోగమునందు, జ్ఞానమునందు విశారదుడగు మహాదేవుడు ఆ రోదనమును విని విహారమును ముగించగోరియూ, పార్వతి వలని భయముచే ముగించలేదు (1). భక్తవత్సలుడగు శివశంకరుడు రాక్షసునిచే పీడితులైన దేవతలను చూచుటకు గృహ ద్వారము వద్దకు వచ్చెను (2). అపుడునేను, విష్ణువు, దేవతలందరు భక్తవత్సలుడగు శివుని చూచి మిక్కిలి ఆనందమును పొందితిమి (3). ఓ మునీ! నేను, హరి, మరియు సమస్త దేవతలు మహానందముతో శంకరునకు సాష్టాంగ ప్రణామమాచరించి స్తుతించితిమి (4).


దేవతలిట్లు పలికిరి -- ఓ మహా ప్రభూ! దయచేసి తారకాది రాక్షసులను సంహరించుము. హే విభూ! దేవకార్యమును చేయుము. మహేశ్వరా! దేవతలను రక్షించుము (5). ఓ దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! శంకరా! సర్వుల అంతర్యామిని అగు నీకు సర్వము విదితమే (6).శివభగవానుడు దేవతల ఆమాటను విని దుఃఖితమైన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (7).శివుడిట్లు పలికెను--


ఓవిష్ణూ| బ్రహ్మా! దేవతలారా! మీకు అందరికీ మీ మనస్సులే శరణము. జరుగబోయేది జరిగి తీరును. దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు (8). జరిగిన దేదో జరిగినది. దేవతలారా! ప్రకృతమును గురించి వినుడు. ఇపుడు నా తేజస్సును గ్రహించగల వారెవ్వరు? (9) గ్రహించగల సమర్థుడు గ్రహించుగాక! యని శివుడు చెప్పెను. దేవతలందరిచే ప్రేరితుడైన అగ్ని కపోతరూపమును ధరించి (10), ఆ శివతేజస్సును ముక్కుతో గ్రహించెను. ఓ మునీ! ఇంతలో పార్వతి అచటికి వచ్చెను (11).


సశేషం....

....

 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 65 / Agni Maha Purana - 65 🌹

శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.

. కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -3‌


జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటిపై పాత్రను, ఇధ్మమును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి స్రుక్కున, స్రువమును భూమిపై ఉంచవలెను.

ఆజ్యాస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షిణిని గ్రహించి దానిని నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడిచి, ప్రోక్షణీపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని అగ్నికీ ఎదురుకుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు ప్రోక్షించి, ఎదుట నుంచి, ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీతపై విష్ణువును ధ్యానించి, ఆజ్యసాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్ళు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవ్రేలితోను అనామికతోను పట్టుకొని, వాటిని నేతలో ఇటు నటు త్రిప్పినేతిని సంస్కరించవలెను.


వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు క్రిందికి చిమ్మవలెను. వాటితో స్రుక్స్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్భలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని లనుచు పిమ్మట హౌమము చేయవలెను.


గర్భాధానాది కర్మలను ఆ యా అంశములను వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగముల ననుసరించి, నామాంతముగా గాని, సమావర్తాంతము గాని, అధికారాంతము గాని చేయవలెను. సశేషం....


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀  83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।

రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀


 380. 'బిందుమండలవాసినీ' - 2🌻 


సృష్టికర్త కూర్చుండియున్న పద్మము సృష్టి కర్తకన్న ముందే యేర్పడినది. ఆ పద్మము నాళము అంతకన్న ముందున్నది. ఆ నాళము పుట్టు స్థానము తెలియుట అసాధ్యము. అవ్యక్తమగు పరమాత్మ తత్త్వము నాళము ద్వారా ప్రసరించి పద్మము నేర్పరచి సృష్టికర్తను పుట్టించెను. జీవుని కూడ అట్లే ప్రతి ఉదయము మేల్కాంచును. మేల్కాంచుటకు ముందు జీవు డెటనుండి వచ్చుచున్నాడో తెలియుటకు ప్రయత్నించుట నాళమున చేరి వెదకుటగా తెలియదగును. సృష్టికి కర్త చతుర్ముఖ బ్రహ్మ. మన జీవన సృష్టికి కర్త మనమే.

బ్రహ్మవలె మనము కూడ సృష్టి జరుపుదుము. బ్రహ్మ సృష్టి బ్రహ్మము ఆజ్ఞానుసారము జరుగుట వలన బ్రహ్మదేవుడు సృష్టి కధిపతియై యున్నాడు. అతడు దైవేచ్ఛ నెఱిగి సృష్టి కర్తృత్వము నిర్వహించు చున్నాడు. అతని కర్తృత్వము నిరహంకార పూరితము. జీవుడు కూడ దైవేచ్ఛకు సమర్పణము చెంది దివ్యసంకల్పమునే నిర్వర్తించు చుండినచో బ్రహ్మానందమున ఉండవచ్చును. ఇట్టి బ్రహ్మానందము పొందుటకే సర్వసాధనలును. నవవిధ భక్తుల ద్వారా దైవసాన్నిధ్యము సిద్దించిన వారు కేవలము దైవేచ్ఛయే తమ ఇచ్ఛగా జీవింతురు. దివ్య ప్రణాళిక నిర్వర్తించుచు శాశ్వతులై సృష్టి యందుందురు. ఇట్టి బ్రహ్మానంద స్థితి తమ లోపలి బ్రహ్మనాళమును (బ్రహ్మ రంధ్రము) చేరినచో కలుగును. దానికి చేయు ప్రయత్నమే తపస్సు.


13235: శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏

నామపారాయణప్రీతా యను 20,736 నామములు భాస్కరరాయలు వారు ఇచ్చిన క్రమంలో కూర్చుట నా అదృష్టము.

ఆ పరమేశ్వరి తనను కీర్తించడానికి, తద్వారా భక్తులు తరించడానికి తన సహస్రనామములను వ్రాయమని వశిన్యాది వాగ్దేవతలను (వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అను వారిని) ఆదేశించినది. వశిన్యాదులు ఆ పరమేశ్వరి అంశనుండి ప్రాదుర్భవించినవారు. వశిన్యాదులు వ్రాసినవి వేయినామములు. మరి నేను కూర్చిన నామములు 20, 736. వశిన్యాదులంటే అత్యంత జ్ఞానసంపన్నులు. ఏమీ కాని నేను ఎంతో అదృష్టవంతుడిని అని చెప్పుకోవచ్చా?  ఎందరో పండితులు, జ్ఞానసంపన్నులు ఉన్నారు. నేను వారి పాదరజమునకు కూడా సరితూగను.  


ఆ పరమేశ్వరి వశిన్యాదులచే సహస్రనామములు వ్రాయించుకొన్నది. ఆ సహస్ర నామములకు భాష్యము భాస్కరరాయలువారిచే వ్రాయించుకొన్నది. భాస్కరరాయలు వారు 20,736 నామాలు ఎలా కూర్చవలెనో చెప్పారు. అంతేగాని ఆయనకూడా కూర్చలేదు. ఎందరో అత్యంత జ్ఞానసంపన్నులు ఉన్నారు. వారు కూర్చాలంటే ఇలాంటివి కోట్లాది సహస్రనామాలు కూర్చగలరు. 20,736 నామములు కూర్చగలిగే మహద్భాగ్యాన్ని నాకు ఆ పరమేశ్వరి అనుగ్రహించినదా అనినట్లు మహానభావులు అందరూ నాకోసం వదలివేశారా అని అని నేను భావించవచ్చా?

మాతృకా వర్ణములు 51. అందులో ల, ళ లు ఒకే అక్షరంగా భావించుతారు. ఆ విధంగా 50 అక్షరములకు 50 మంది దేవతలు ఉన్నారు. వారు విశుద్ధిచక్రము నందు 16 మంది, అనాహతచక్రము నందు 12 మంది, మణిపూరచక్రమునందు 10 మంది, స్వాధిష్ఠాన చక్రమునందు ఆరుగురు, మూలాధారమునందు నలుగురు, ఆజ్ఞాచక్రమునందు ఇరువురు ఉన్నారు. 

షట్చక్రములందు  వివిధ సంఖ్యల (16+12+10+6+4+2) దళములు గల పద్మములయొక్క కర్ణికలయందు అమ్మవారు వజ్రేశ్వరి, వామదేవి, వయోఽవస్థావివర్జితా, సిద్ధేశ్వరి, సిద్ధవిద్యా, సిద్ధమాతా యను దేవతా స్వరూపములలో  విలసిల్లుచున్నది. సహస్రారము నందు యశస్వినీ రూపిణియై విరాజిల్లుచున్నది.


శ్రీలలితాంబిక అకారాది క్షకారాంతమైన ఏబై ఒక్క అక్షరముల మాతృకావర్ణరూపిణి. అలాగే అసలు శక్తిపీఠములు కూడా ఏబది ఒకటి. 

అమ్మవారు మాతృకావర్ణరూపిణి గనుకనే మాతృకా వర్ణములనుండి 20,736 నామములు సమీకరించవచ్చని సౌభాగ్యభాస్కరం అను గ్రంథము వ్రాసిన భాస్కరరాయలువారు చెప్పారు. ఈ 20,736 నామముల పారాయణకూడా శ్రీలలితా సహస్రనామ స్తోత్రమునకు అనుబంధము గలిగినదే. యౌగికార్థముచే ఇవి కూడా నామములే అయిఉన్నవి. వీటి పారాయణకు ఏవిధమైన ఉపదేశము అవసరములేదు. బీజాక్షరయుతమైన ఈ నామములు, శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణవలె పారాయణము చేయదగినవే. నామపారాయణము అనగా ఈ నామములు పారాయణచేయుట అని కూడా భాస్కరరాయలు వారు చెప్పారు.

నామపారాయణప్రీతా యను ఈ గ్రంథమును భక్తులగోత్రనామములతో ఎందుకు పూజించుచున్నాము? అను ప్రశ్న ఉద్భవించవచ్చు.  బీజాక్షరస్వరూప నామములు గలిగిన ఈ గ్రంథము ఒక పవిత్రగ్రంథము. శ్రీచక్రముతో సమానమైనది. శ్రీమద్భగవద్గీత, శ్రీమద్భాగవతము, శ్రీమద్దేవీభాగవతము, శ్రీమద్రామాయణము వంటి గ్రంథములతో సమానమైనది. అమ్మవారి 20,736 నామములలో, ఒకనామమునకు 5 బీజాక్షరముల చొప్పున 20736 x 5 = 1,03,680 రూపాలలో మా గృహము నుండి మీగృహమునకు వచ్చుచున్నది. ఈ సంఖ్య నవదుర్గాస్వరూపము. అది ఎలాగ అంటే 1,03,680 = 1 + 0 + 3 + 6 + 8 + 0 = 18 = 1 + 8 = 9 (నవదుర్గలు). అందుకే హోమము, కుంకుమపూజ, శ్రీలలితా సహస్రనామ స్తోత్రపారాయణతో ఆ మహాతల్లిని సంతృప్తి పరచుచున్నాము. మీ గృహములో ఉంటేనే చాలు ఆ నామములు పారాయణచేసినంత ఫలము. 

ఈ నామములు అత్యంత మహిమాన్వితమైనవి. భక్తులకు కర్మఫలవిముక్తిని కలిగించు కైవల్యదాయకమైనవి. వీటిని విశేషమైన ప్రచారంలోకి తీసుకురావాలని ఆశిస్తూ ఈ గ్రంథమును గురుంచి అత్యంతవిశేషముగా అందరికీ విన్నవించుకుంటున్నాను. 

నేను నిత్యము శ్రీలలితా సహస్రనామముల వ్యాఖ్యానము, వేదవ్యాసుల వారి భాగత శ్లోకములు తాత్పర్యములతోను, నిత్యపంచాంగము వాట్సాప్ మరియు TELEGRAM సమూహముల ద్వారా అందజేయుచూ చిరపరిచితుడనై యున్నాను.

ఈ గ్రంథములు కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు - 7702090319, 9505813235 (వాట్సాప్ మాత్రమే).

🧘‍♂️389) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 


స్థితి ప్రకరణము  

రెండవ అధ్యాయము

దామ వ్యాళ కటోపాఖ్యానము

యస్యాసదిద మిత్యాస్థా నివృత్తా సర్వవస్తుషు క్రోడీకరోతి సర్వజ్ఞం నావిద్యా తమవాస్తవీ. 

“ఈ దృశ్యజగత్తు అసత్తైనది” అని యెఱుఁగుటచే ఎవనికి సమస్త దృశ్యపదార్థముల నుండియు ఆసక్తి తొలగిపోయినదో, అట్టి సర్వజ్ఞుని మిథ్యయగు అవిద్య తన వశమొనర్చుకొనజాలదు.

యదా తే నేన్ద్రియార్థశ్రీః స్వదతే హృది రాఘవ 

తదా విజ్ఞాతవిజ్ఞానః సముత్తీర్ణభవార్ణవః. 


ఓ రామచంద్రా! ఎపుడు ఇంద్రియార్థములగు శబ్దస్పర్శాదులు నీకు స్వతః హృదయమందు రుచింపకుండునో, అపుడు విజ్ఞానరూపమగు ఆత్మ నెఱింగిన వాడనియు, సంసార సముద్రమును దాటినవాడనియు తెలిసికొనుము. 

.....

2-120

అస్వాదితేన్ద్రియార్థస్య సతనోరతనోరపి అనిచ్ఛతోఽపి సంపన్నా ముక్తిరర్థవశాత్తవ. 

ఇహలోక, పరలోక ఇంద్రియార్థములగు శబ్దస్పర్శాదు లెపుడు నీకు రుచింపకుండునో, అపుడు వ్యవహరించుచున్నప్పటికిని, లేక సమాధియందున్నప్పటికిని ముక్తి నీవు కోరకుండగనే అనాయాసముగ నీకు ప్రాప్తించినట్లగును.


: తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వారి సంకీర్తన


రేకు: 7-6

సంపుటము: 15-43


రాగము: సాళంగనాట

||పల్లవి||

జపియించరె సర్వజనులు యీ నామము 

తమరపమునో పుణ్యాలకు రామనామము!!

||చరణం||

శాంతికరము రామచంద్ర నామము

భ్రాంతు లణఁచు రామభద్ర నామము

వింతసుఖ మిచ్చు రఘువీర నామమూ, 

భూమిచింత దీర్చునదివో శ్రీరామనామము!!

||చరణం||

కలిదోషహరము రాఘవనామము 

సర్వఫలదము సీతాపతి నామము

కులక శోభనము కాకుత్థ్సనామము 

అనిరలమైన దిదివో రామనామము!!

||చరణం||

గుమిత మైనది రఘుకులనామము 

అతిసుముఖము దశరథసుత నామము

అమితమై శ్రీవేంకటాద్రి నాయకుఁడై

రమియించె యీతని రామనామము!!


....




ఒకరి కోసము ఒకరౌట ఓపికయగు 

వలపు కోసము మనసౌను వరుస గాను  

మమత కోసము మను ఔను మాయ గాను  

మరులు గొల్పే వయసౌను మనసు గాను 


మచ్చి కగుట కోసము బుద్ది మలుపు గాను 

సిద్ధు లగుట కోసము దీక్ష స్థిరముగాను 

ముద్దు మురిపాల కోసము ముడుపు గాను 

బాస లన్ని కోసము ప్రేమ బంధ మౌను  


మేఘ మెరుపు కోసము సుఖ మేను మౌను 

మెరుపు కోస పిడుగె శబ్ద మేలు ఔను   

పిలుపు కోసము తనువుగా ప్రేమ నిచ్చు 

ఇంతి పిలుపులు కథయేది ఇష్టమౌను 


🧘‍♂️99) అష్టావక్ర గీత🧘‍♀️

అధ్యాయం - 9

నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)  

శ్లోకం 07:-


పశ్య భూతవికారాంస్త్వం భూతమాత్రాన్ యథార్థతః ।

తత్క్షణాద్ బంధనిర్ముక్తః స్వరూపస్థో భవిష్యసి ॥ 9-7 ॥


టీకా 

భూతవికారాన్ = భూతవికారములైన దేహేంద్రియాదులను, యదార్థతః = వాస్తవముగా, భూతమాత్రన్ = భూతమాత్రములనుగా, త్వం = నీవు, పశ్య = చూతువు గాక, తత్ క్షణాత్ = అట్లు చూచినవెంటనే, బంధనిర్ముక్తః = బంధము నుండి విడివడిన వాడవై, స్వరూపస్థః = స్వరూపస్థితియందున్న వాడవుగా, భవిష్యసి = కాగలవు.

వివరణ:-

పంచమహాభూతాలు పరిణామం చెంది వస్తువులుగా మారినా, వాటి నుండి నిజానికి వేరుగా లేవు. ఇది తెలుకుంటే వాటి బంధంనుండి విడివడినట్టే. ఈ విధంగా బంధరహితుడవై స్వరూపంలో ముక్తుడవై నిలచిపో.

తాత్పర్యం:-

మనచుట్టూ ఉన్న ప్రపంచమంతా పదార్థంతో నిర్మింపబడింది. ఆ పదార్థపు మూలాన్ని నిశితంగా పరిశీలిస్తే పంచభూతాలు పంచీకరణం చెంది పదార్థంగా రూపొందడమే కనిపిస్తుంది.

 ఏ వస్తువును పరీక్షించినా పంచభూతాలయిన పృథివి, ఏ జలము,అగ్ని, వాయువు ఆకాశము కానిదేదీ ఎక్కడా ఎందులోనూ గోచరించదు.

 బంగారంతో తయారు కాబడిన ఏ ఆభరణాన్ని చూసినా బంగారం తప్ప వేరేదేదీ కనిపించదు. నామరూపాలు మాత్రమే వేరుగా ఉంటాయి. ఇదేవిధంగా కనబడే ప్రపంచమంతా రాగద్వేషాలు అర్థరహితమనిపించి అదృశ్యమయిపోతాయి.

ఇంతవరకూ వస్తువులన్నీ నిజంగా ఉన్నాయనుకుంటూ, వాటి ప్రత్యేకతలను గుర్తించి, రాగద్వేషాలతో వానిని సంపాదించాలని కానీ వదిలించుకోవాలని కానీ నిత్యమూ శ్రమిస్తున్నాము.

పదార్థపు యదార్థ స్వరూపం తెలుసుకున్నాక దేని మీదనైనా ప్రత్యేక దృష్టి ఎలా ఉండగలదు? అజ్ఞానం వల్ల కలిగిన రాగద్వేషాలు ఈ యదార్థ జ్ఞానంతో అంతరిస్తాయి. రాగద్వేషాలవల్ల ప్రేరేపింపబడి చేసే పనులూ, ప్రయత్నాలూ,శ్రమా అన్నీ వ్యర్థంగా కనిపించి త్యజించబడతాయి. ఆ స్థానే మనస్సులో అనంతశాంతి చోటు చేసుకుంటుంది.

 అశాంతి స్థానంలో అనంత శాంతి ఉదయించగానే ఆ ప్రకాశంలో, ఆలోచనల ఉరవడి తగ్గిన నిశ్చలత్వంలో శుద్ధమైన చైతన్యం స్వయంగా కేవలంగా భాసిస్తుంది. అహంకారం---అహం సర్వభూతాత్మ అని గ్రహించి ఆనందంగా మిగిలిపోతుంది.

🧘‍♂️19) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️

19) శ్లోకం:-

బుద్ధ్వా సమస్తమపి దృశ్య మచిత్స్వరూపం   ప్రత్యక్చితిం చ నిజరూప తయా విదిత్వా |

దేహేంద్రియా ద్యఖిల సాక్ష్యహ మిత్యజస్రం సంచింతయ వ్యపగతాఖిల సంశయ స్సనే II 19

టీకాసమస్తం అపి = ఈ యావత్తు కూడా, దృశ్యం అచిత్స్వ రూపం బుద్ధ్వా = దృశ్యమనీ, జడమని ఎరిగి, చ = మరియు, ప్రత్యక్ చితిం = లోనున్న చితిని, నిజ రూపతయా = తన నిజరూపమని, విదిత్వా = గుర్తెరిగి, వ్యపగత = పోయిన, అఖిల సంశయః సన్ = అన్ని సంశయాలు కలవాడవై, దేహ ఇంద్రియ ఆది = దేహము, ఇంద్రియాలు మొదలైన వాటికి, అహం సాక్షి ఇతి = నేను సాక్షినని, అజస్రం = ఎప్పుడూ, సంచింతయ = బాగా చింతన చెయ్యి.

భావం:- ఈ యావత్తు దృశ్యమనీ, జడమని తెలుసుకొని, లోన ఉన్న చితియే నీ నిజరూపమని ఎరిగి, అన్ని సంశయాలను వదిలి, దేహేంద్రియాదులకు నేను సాక్షినని నిరంతరం చింతన చెయ్యి.

వివరణ:-దేహేంద్రియ ప్రాణాంతఃకరణలు అన్నీ దృశ్యమని ముందు శ్లోకంలో రుజువు చేయబడినది. దృశ్యమైనది యావత్తు జడమే.

అయితే దీనిని తెలుసుకునే నేను ఎవరు? అనే ప్రశ్నకి సమాధానం లోపల ఎక్కడో ఉన్న చితియే. అదే నేను అని వస్తుంది.

ఇలా తెలుసుకోవడం బుద్ధి నిర్ణయం. ఇలా అనుభవంగా మారలేదు. అందుచేత బుద్ధిలో “నేను చితిని” అనే విశ్వాసం కలిగాక, దేహాదులు ప్రపంచంలో చేసే వ్యవహారాలలో చిక్కుకోకుండా ఉండటానికిగాను ఆ వ్యవహారాలన్నించటికీ నేను సాక్షినని నిరంతరం భావన చెయ్యాలి.

క్షణం పాటు. యేమరినా ఈ పరికరాలు, వాటి వ్యవహారాలు మనల్ని పట్టుకొని ప్రపంచంలోకి ఈడ్చివేస్తాయి.

ఇది నిదిధ్యాసనలో భాగం.

ఓం నమః శివాయ:

🧘‍♂️9- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘‍♀️

🧘‍♂️9-సిద్ధభూమిక🧘‍♀️:-

శ్రీమాలి గారు చెప్పిన దానిని బట్టి సిద్ధాశ్రమం మానస సరోవరానికి ఈశాన్య దిశలో వందల కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. పైనుండి విమానంలో కనిపించేది కాదు. ఫోటోలకు అందేదికాదు. అక్కడ కొన్ని చోట్ల వేదఘోష, కొన్ని చోట్ల నిశ్శబ్ద తపస్సు, కొన్ని చోట్ల సాధనలను గూర్చిన ప్రవచనాలు, బ్రహ్మర్షుల అనుగ్రహభాషణలు జరుగుతుంటవి.

 ఎవరికి బాధలు, ఆందోళనలు, రోగములు, ముసలితనపు కష్టాలు ఉండవు. అప్సరసలు -మహర్షుల అనుగ్రహ కోసం ఆడుతూ పాడుతుంటారు. నిరంతర సమాధిలో ఎన్నో సంవత్సరాలుండే మౌనుల నక్కడ దర్శించవచ్చును.

సిద్ధాశ్రమం ఒక ఊహాప్రదేశం కాదు. నిజంగానే భౌతికంగా ఉన్నదని నిరూపించటానికి శ్రీమాలీగారు దేశవిదేశ ప్రముఖులను కొందరిని తీసుకువెళ్ళి కొన్ని గంటలపాటు ఆ ప్రదేశాలను చూపించి అక్కడి మహాత్ములను దర్శింపజేశారు. వారిలో ప్రఖ్యాత అమెరికన్ అణుశాస్త్రవేత్త జెఫ్, బ్రెజిల్ డాక్టర్లు -పూలింగ్, యూలే, హాలీవుడ్ సుందరి బీలే, శాస్త్రవేత్త ఎమర్సన్, ఖగోళ శాస్త్రవేత్త పహరిచ్, లండన్ శాస్త్రజ్ఞుడు బ్రూజీ, చంద్రగ్రహచోదన నిపుణుడు సిరాంగ్, కంప్యూటర్ విజ్ఞానాద్యుడు హోరీ ప్రభృతులున్నారు. వీరంతా ఏకకంఠంతో ఈ దివ్య ప్రదేశం యొక్క మహత్వాన్ని కొనియాడారు.

సాయికాకా అనే యోగి తాను చాలాసార్లు జ్ఞాన గంజకు సిద్ధమహాత్ముల సహాయం వల్ల వెళ్ళివచ్చానని అన్నాడు. అది శంబళ గ్రామ ప్రాంతంలో రహస్యంగా ఉంటుందని అటువంటి కేంద్రాలు హిమాలయాలలోనే గాకnభూమిమీద మరికొన్ని ప్రదేశాలలో కూడా ఉన్నవని ఆయన తెలియజేశారు.

జేమ్సు హిల్టన్ నవల లాస్ట్ హొరైజాన్ నవలలోని షాంగ్రిలా - ఈ శంబళ ప్రాంతంలోని ఒక భాగంగా పరిగణించబడుతున్నది. ఈ నవల సినిమాగా వచ్చి ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ దీని చేత ప్రభావితుడై తన నివాస భవనానికి షాంగ్రిలా అని పేరు పెట్టుకొన్నాడు.

కుర్తాళయోగి మహావతార్ బాబా బదరీప్రాంతం కేంద్రంగా పెట్టుకొన్న జ్ఞాన్ గంజ్ తో సన్నిహిత సంబంధం కలిగిన మహాత్ముడు. సిద్ధభూమి

జ్ఞానగంజ్ అని గోపీనాధ కవిరాజ్ రచించిన గ్రంథంలో ఇటువంటి ఎన్నో విశేషాలు వివరంగా చెప్పబడినవి. (ఈయన 1976 లో మరణించాడు).

ఈ ప్రదేశాలలో పరమసుందరమైన జలపాతాలెన్నో ఉన్నవి. వాటి నీరు ఒక చోట సరస్సుగా రూపొందింది. దానికి సిద్ధయోగ సరస్సని పేరు.శ్రీ పాద శ్రీవల్లభుల వారు స్నానం చేసిన స్ఫటికసరస్సదే కావచ్చు. దీని ఒడ్డుననే అమరత్వాన్ని, సర్వకామ్యములను ప్రసాదించే కల్పవృక్షం ఉన్నది. దీని ఫలాలు శ్రీ చక్ర మేరు ప్రస్తారంవలె ఉంటాయి. సిద్ధాశ్రమం దాటి బయట ప్రపంచంలోకి ఈ ఫలాలను తీసుకువెళ్ళటానికి అనుమతి లేదు. అయితే ఇటీవల ఒక యోగి అచటి మహాత్ముల అనుమతితో 2001 లో ప్రయాగలో జరిగిన కుంభమేళాకు ఒక పండును తీసుకు వచ్చాడు. దానిని చూడటానికి

కొద్దిమందికి అనుమతి ఇవ్వబడింది.

నారాయణ దత్త శ్రీమాలి చెప్పిన పట్టికలోని వారే గాక మరికొందరు దాక్షిణాత్య యోగులు కూడా అక్కడ ఉన్నారని మరి కొందరు మహాత్ములు చెపుతున్నారు. ఆంధ్రుడైన త్రైలింగస్వామి, ద్రావిడ దేశ ప్రసిద్ధులు భోగనాధుడు, సుందరనాధుడు, కరువూరర్, పాంబట్టి, కొంగనార్, సత్తముని, రామదేవర్, మాచముని, వాస్మోగర్ మొదలైన పేర్లెన్నో వినిపిస్తున్నవి. పురాణాలలో చిరంజీవులుగా చెప్పబడిన అశ్వత్థామ, వ్యాసుడు, హనుమంతుడు, కృపుడు, పరశురాముడు మొదలైనవారు హిమాలయ సిద్ధభూములలో వుండి సాధకులను అనుగ్రహిస్తూనే ఉన్నారు.

 సువిశాల, సువిస్తరమైన సిద్ధాశ్రమ భూమికలలో బౌద్ధ, జైన, శైవ, శాక్తేయాది విభాగాలెన్నో ఉన్నవి. హైందవేతర మతస్థులలోని సిద్ధులు కూడా ఇక్కడ ఉన్నారు. తపస్సు - దైవనిష్ఠ మతములకు సంప్రదాయములకు, ఆచారములకు అతీతమైనవి. మహావతార్ బాబా శిష్యులలో అన్యమతస్థులున్నట్లు వారి చరిత్రలో ఉన్నది.

 చైనాలోని షామాన్ మాంత్రికులు కొందరు అక్కడ ఉన్నారని బోన్సా మతస్థుల విశ్వాసం. ప్రసిద్ధయోగిని ఆనందమాయి మరణించిన తర్వాత సిద్ధాశ్రమంలో ఉన్నదని శ్రీమాలి చెప్పటం వల్ల మంచుకొండలతో ఆమె అనుబంధం స్మరించదగినది. మహాత్ముడు వేల

సంవత్సరాలు జీవించిన బృందావన యోగి దేవరహాబాబా దయవల్ల హిమాలయాలలో 20, 25 అడుగుల ఎత్తున్న ద్వాపరయుగ మానవులను తాను చూడగలిగానని ఆమె చెప్పిన విషయం ఆశ్చర్యకరమైనది.

అలానే దలైలామా కార్యదర్శిగా, చైనా పోలీసులచే హింసించబడి మరణదశలో సిద్ధలామాల సంకల్పం వల్ల లండన్లోని బ్రిటిష్ డాక్టర్ శరీరంలో ప్రవేశించి థర్డ్ ఐ మొదలైన అద్భుత గ్రంథాలు రచించిన ట్యూ' లోబ్యాంగ్ రాంపా “పురాతన గుహలు" అనే గ్రంథంలో పూర్వయుగాల మహనీయుల శాస్త్ర విజ్ఞాన రహస్యాలు హిమాలయ కందరాలలో ఎలా నిక్షిప్తమై ఉన్నవో వివరించాడు. ఆనాటి సిద్ధుల వివరాలు కొన్ని అతడు తెలియజేశాడు కూడా.

ఇంత ఆధునిక విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా హిమాలయాలు ఎన్నో రహస్యాలకు స్థానమై ఉండి, మానవులు లౌకిక జ్ఞానంతో తెలుసుకోలేని విశేషాలెన్నో కలిగి ఉన్నవి. వాటి యెరుక లభించాలంటే తపస్సు చేయాలి. అక్కడ సిద్ధుల అనుగ్రహాన్ని పొందాలి. ఆ సిద్ధులు కొందరి చరిత్రలు సేకరించి ఒక గ్రంథంగా ప్రచురించటం జరుగుతున్నది. ఇటీవలి నా అమెరికా యాత్రలో బౌద్ధ యోగి పద్మసంభవుని చరిత్ర చదివినప్పుడు కలిగిన దివ్యానుభావాలు - ఈ రచనకు ప్రేరణ. ఈ గ్రంథంలో చెప్పబడిన వారు కాక ఇంకా ఎందరో సిద్ధాశ్రమ యోగులున్నారు. ప్రస్తుతానికి దీనిని సహృదయులు స్వీకరింతురుగాక!

***

ఉండబట్టలేక నాకు తోచిన రెండుముక్కలు ఆశక్తి ఉన్నవారికోసం.

నిన్న ఒక మిత్రుడు పురుషసూక్తం నేర్చుకున్నా విని అభిప్రాయం చెప్పండి అని ఒక ఆడియో పంపాడు. పూర్తిగా వినలేక ఆపేసి ఫోన్ చేసి ఎవరివద్ద నేర్చుకున్నావు అని అడిగితే యూట్యూబ్ అన్నాడు. ఇది మొదటి అనుభవం కాదు, చాలా మంది దగ్గర నుండి వింటున్నదే ఈ మధ్యన.

ప్రస్తుత కాలం లో వేద మంత్రాలు నేర్చుకోవాలనుకోవడం మంచి విషయమే కానీ ఇలా యూట్యూబ్ ల ద్వారానో, ఏదో మాధ్యమాల ద్వారానో, పుస్తకాల ద్వారా నేర్చుకోవాలనుకోవడం తోనే ఇబ్బంది.

వేదాధ్యయనానికి, పఠనానికి మన ఋషులు కొన్ని పద్దతులు నిర్దేశించారు.

గీతీ శీఘ్రీ శిరఃకంపీ తధా లిఖితపాఠకః

అనర్ధజ్ఞః అల్ప కంఠశ్చ షడేతే పాఠకాధమాః

గీతీ – అంటే పాట పాడినట్లు పఠనం చెయ్యడం, ఇది సరి అయినది కాదు. సామ వేదం సంగీతం లా ధ్వనించినా దానిని కూర్చిన పద్దతి లోనే గానం చెయ్యాలి. దానికి విరుద్దం గా పలకడం సంగీత పరంగా అయినా సరి అయినది కాదు. అంతే కాదు హాని కూడా చేస్తుంది. నిర్ణీత మయిన పద్దతి లోనే పఠనం చెయ్యాలి.

శీఘ్రీ – వేదం లో అక్షరాలు మాత్రా కాలాలతో నిర్ణయించబడి ఉంటాయి. ఆ మాత్రల కాలం ప్రకారమే ఆ అక్షరాన్ని పలికి తీరాలి. అప్పుడే సరైన ఫలితం వస్తుంది. అనువల్ల తొందర తొందరగా పలకకూడదు.

శిరః కంపీ – పఠనం చేసేటప్పుడు తల ఊపడం లాంటివి చెయ్యకుండా సరిగా కూర్చుని ఏకాగ్రత తో ధ్యాన నిష్ఠ గా వేదాన్ని పఠనం చెయ్యాలి. అవసరం లేకుడా తల ఊపడం వలన వైదిక ధ్వని తరంగాలకి అవరోధం కలిగిస్తుంది.

లిఖిత పాఠకః – పుస్తకం చూసి చెప్పే వాడు లిఖిత పాఠకుడు. వేదం గురువు తో పాటు వల్లె వేసి చెబుతుండగా గుర్తు పెట్టుకుని పఠిన్చాలి. వినికిడి జ్ఞాపక శక్తుల మీద ఆధారపడి ఉండేదే వేదపఠనము.

అనర్ధజ్ఞః – అర్ధం తెలుసుకోకుండా పఠనం చేసేవాడు. ఫలితానికి అర్ధం కూడా ఖచ్చితం గా తెలుసుకోవాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

అల్ప కంఠహ – తక్కువ గొంతు తో గొణిగి నట్టు చదివేవాడు.పూర్తి గొంతుతో గట్టిగా చదివినప్పుడే వేదనాదాల ధ్వని చుట్టు పక్కల ప్రతిధ్వనించి సత్ఫలితాలని ఇస్తుంది.

వ్యాఘ్రీ యధా హరేత్ పుత్రాన్  దంష్ట్రాభ్యాం చ న పీడయేత్

భీత పతనాదేతాభ్యాం తద్వత్ వర్ణాన్ ప్రయోజయేత్

1. వేదం లోని అక్షరాలు సునాయాసం గా పలకాలి

2. అక్షరాలు అస్పష్టం గా ఉండకూడదు

3. ధ్వని జారిపోవడం కాని తేలిపోవడం కాని జరగకూడదు అలా అని అరిచినట్టు గా కూడా ఉండకూడదు.

4. పెదవుల చివరనుంచి పదాలని పలకకూడదు

వేద పఠనానికి ఉండాల్సింది మూడు లక్షణాలు. అవి ఏమిటంటే అక్షర శుద్ధి, మాత్రా శుద్ధి, స్వర శుద్ధి. వేదాన్ని జాగ్రత్త గా పఠనం చెయ్యకపోతే అర్ధం మారిపోయే అవకాశం ఉంది. వేద పఠనం లో దైవ ప్రీతి కలిగించడమంతా వాటి స్వరం లో ఉంటుంది. ఉచ్ఛ మంద్ర స్థాయి లో పలికే స్వరాలని ఆ స్థానం గమనించి అలాగే పలకాలి. వేదం లో స్వరితము, అనుదాత్తము , దీర్ఘ స్వరితము, ఉదాత్తము అనే ముఖ్య స్వరాలు ఉంటాయి. వాటిని గురుముఖతా నేర్చుకుని వల్లె వేయాలి. వేద విద్యకి గురు అనుగ్రహం పూర్తిగా ఉండాలి. సంకల్పం ఉంటే మార్గము, గురువు దొరకడం కష్టం కాదు. అనుష్ఠానాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఆ వేదమాతని ప్రార్ధిస్తే నేర్చుకోవాలన్న తపన తోడయితే తప్పక మార్గం సుగమం అవుతుంది.

నేర్చుకునే ఒక్క పాఠం అయినా పద్దతిగా నేర్చుకుని సాధన చేస్తేనే ప్రయోజనం.

శంకరులు మనకు ఎన్నో స్తోత్రాలు అనుగ్రహించారు. తప్పులు లేకుండా అవి నేర్చుకుని చెప్పుకున్నా వేద మంత్రాలకి సమానమైన ఫలితం ఉంటుంది.

పై విషయాలపై సందేహాలు ఉంటే పెద్దవారి వద్ద నివృత్తి చేసుకోవచ్చు, కానీ చర్చకు వితండానికి తావు లేదు.

*** 

🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️

 27వ శ్లోకం:-

శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యంకే న ప్రాపు ర్వాంచితం పాపినోపి హా న:! పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్ తేన ప్రాప్తం గర్భ వాసాది దు:ఖం!! 

భావం:-

పాపాత్ములైనను శ్రీమన్నారాయణ అను నామమును ఉచ్చరించి తమ కోర్కెలను తీర్చుకొనిరి కదా! అయ్యో నా వాక్కు ఆ నామమును ముందు ఉచ్చరించినది కాదు. అందులకే నాకీ జన్మము. ఈ గర్భవాసము మున్నగు దుఃఖములు సంభవించివి.

పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే, పురోగమించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మ అతులిత శక్తిసంభరితమై వెలువడుతుంది.

జాగృతి

స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

అనుభవం పెరిగే కొద్దీ 'పురుష ప్రయత్నం' లోనే సర్వం ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. దే నా నూతన సందేశం.

....

🧘‍♂️విస్తరణ🧘‍♀️ 

జాతి మతాలు ఏవయినా వ్యక్తులందరిలోనూ ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకోవాలి. ప్రతి మానవుడిలోనూ మీ ఏకత్వాన్ని అనుభూతం కావించుకున్నప్పుడు--- అంతకు ముందుకాదు ---- దివ్య ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది మీకు.

శ్రీ పరమహంస యోగానంద / సఫలతా నియమం

ॐ卐సుభాషితమ్ॐ卐 

శ్లో𝕝𝕝 ఆలస్యం హి మనుష్యాణాం శరీరస్థో మహాన్ రిపుః|

నాస్త్యుద్యమ సమో బంధుః కుర్వాణో నావసీదతి||

తా𝕝𝕝 ఆలస్యం చేయడం అనేది మానవుల శరీరంలో ఉన్న గొప్ప శత్రువు. ప్రయత్నించడం అనే గుణానికి సమానమైన బంధువు లేనే లేదు...ప్రయత్నశీలి ఏనాడు నశించడు. ప్రయత్నం చేసే వ్యక్తి ఏ పనిలోను విఫలం కాడు. 

...


🧘‍♂️97) అష్టావక్ర గీత🧘‍♀️

అధ్యాయం - 9

నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)  

శ్లోకం 05:-

నానా మతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా ।

దృష్ట్వా నిర్వేదమాపన్నః కో న శామ్యతి మానవః ॥ 9-5 ॥

టీకా మహర్షిణాం = మహర్షుల యొక్కయు, సాధూనాం = సాధుపురుషుల యొక్కయు, తథా = అదేవిధముగ, యోగినాం = యోగుల యొక్కయు, నానామతం = భిన్నభిన్నములగు మతములను, దృష్ట్వా = చూచి, నిర్వేదం = వైరాగ్యమును, ఆపన్నః = పొందినవాడై, కః మానవః = ఏ మానవుడు, న శామ్యతి = శాంతిని పొందడు?

వివరణ:-

ఎందరో మహానుభావులు-మహర్షులు, సాధువులు, యోగీశ్వరులు, వీరి ప్రవచనాలు అనేకవిధాలుగా కనిపించినా ఉన్న సత్యం ఒకటే అని తెలుసుకుని జ్ఞాని నిర్వేదంతో శాంతుడవుతాడు.

తాత్పర్యం:- ఎందరో మహానుభావులు తమ అనుభవాలను తెలియజెచ్పే ప్రయత్నం చేసేరు, మరెందరో మేధావులు వారి ప్రవచనాలను వ్యాఖ్యానించేరు. వీటితో తత్త్వశాస్త్రం శాఖోపశాఖలుగా బహుళంగా విస్తరించింది.

 వీటన్నిటినీ చూసిన సాధారణ సాధకుడు సందేహంలోపడి సంశయాత్ముడై సాధననే విస్మరించవచ్చు అందుకే ఆచార్యశంకరులు తమ "వివేకచూడామణి" లో ఇలా అన్నారు. 

శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణమ్ 

అతః ప్రయత్నాజ్ఞాతవ్యం తత్త్వజ్ఞస్తత్త్వమాత్మనః (వివేకచూడామణి - 60)

శాఖోపశాఖలయిన ఈ తత్త్వశాస్త్రం తర్క వ్యాఖ్యలతో మహారణ్యంవలె దుర్గమమైనది. ఇందులో నుండి బయటపడడం మహాకష్టం. ఇందులోపడి మతి పోగొట్టుకోకుండా తెలివైన సాధకులు చైతన్యస్వరూపమైన ఆత్మను కనుగొని నిష్ఠను సంపాదిచుకోవాలి.

తెలివైన సాధకుడు అన్ని రకాల అభిప్రాయాలను వివేకవిచక్షణలతో సమీక్షించి బుద్ధికి పరిమితమైన జ్ఞానంతో, బుద్ధికతీతమూ ఆధారమూ అయిన చైతన్యం తెలియబడదనీ,సత్యాన్ని సూచించడమే బుద్ధికి పరమావధి అనీ గ్రహిస్తాడు. 

కాబట్టి నిజమైన సాధకుడు వాదప్రతివాదనలను తర్కాన్నీ విడిచి పెట్టి, విభిన్న అభిప్రాయాల మీద విమర్శనాత్మకమైన నిర్లిప్తత కలిగి ఉంటాడు. వాదం అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. విచారణ విజ్ఞానాన్ని అన్వేషిస్తుంది. 

చిత్తశుద్ధి కల్గిన సాధకులు గురువుల ద్వారా సత్యంగురించి శ్రవణం చేసి, విన్నదానిని మననం చేసి, పాండితీ ప్రకర్ష మీద ప్రలోభం వీడి, వాద ప్రతివాదాల జోలికిపోక శాంతమూ, శుద్ధమూ చైతన్యస్వరూపమూ అయిన ఆత్మానుభవాన్ని సాధిస్తారు.

ఎందరో మహానుభావులు సత్యాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తున్నప్పుడు ఎవరిని మార్గదర్శిగా ఎన్నుకోవాలి అనే సందేహం సహజంగా వస్తుంది. రాబోయే శ్లోకంలో దీనికి సమాధానమిస్తున్నారు మునివర్యులు. 

**17) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️

17) శ్లోకం:- ప్రత్యక్చితి ర్వపురిదం న భవే జడాత్మా  కుడ్యాదివ జ్జడతయా ప్యసవో న చిత్స్యుః | నా పీంద్రియాణి కరణం కుత ఏవ చిత్స్యాత్ కుద్దాలకాదివ దితి ప్రవిచారయ త్వమ్ ॥ 17

టీకా ఇదం వపుః = ఈ శరీరం, కుడ్య ఆదివత్ = గోడమొదలైన వాటివలె, జడ ఆత్మా = జడస్వభావం కలది, ప్రత్యక్ చితిః న భావేత్ = అంతశ్చైతన్యం కాదు, అస్వః అపి = ప్రాణాలు కూడాను, జడతయా = జడత్వకారణం చేత, చిత్ న స్యుః = చిత్తు కావు, ఇంద్రియాణి అపి న = ఇంద్రియాలు కూడా కావు, కుద్దాలక ఆదివత్ = గొడ్డలి మొదలైన వాటివంటి, కరణం ఏవ = పరికరం మాత్రమే, చిత్ కుతః స్యాత్ చిత్తు ఎలా అవుతుంది? ఇతి = ఇలా, త్వం = ప్రవిచారయ = నీవు గాఢంగా విచారణ చెయ్యి.

భావం:- 'ఈ శరీరం, గోడ మొదలైన వాటివలె జడ స్వభావం కలిగినది. చితి కాదు. పంచప్రాణాలు కూడా జడత్వ కారణం చేత చితి కాదు. ఇంద్రియాలు కూడా కావు. గొడ్డలి మొదలైన పనిముట్లు వంటివి. చితి ఎలా అవుతాయి?' ఇలా నీవు గాఢంగా చింతించు.

వివరణ

ఈ శ్లోకం నుండి విచారణా మార్గం ఉపదేశింపబడుతుంది. వడ్లగింజ నుండి బియ్యపు గింజని వేరు చేసినట్లుగా జడాన్ని చితిని విడదీయడం సాధ్యం కాదు. జడము, చితి రెండూ జీవునిలో భాగాలు. బుద్ధిలోని సునిశితమైన విచక్షణ ద్వారా విడదీసి తెలుసుకోవడం ఒక్కటే పద్ధతి.

శరీరం గోడలతో కట్టిన ఇల్లు వంటిది. అందులో జీవుడు నివసిస్తున్నాడు. బాహ్య వాయువు ముక్కు ద్వారా లోనికి వెళ్ళి శక్తినిస్తే పంచప్రాణాలు శరీరాన్ని నిలబెట్టుతాయి. అవి కూడా జడమైనవే. ఇంద్రియాలు కేవలం పరికరాలు. వాడుకునే వాడికి చితి వుంది కాని వాడుకోబడే పరికరాలు జడమైనవే.

ఇవేవి చితి కాదు. ఇలా బుద్ధిని సవితర్క మార్గంలో నడిపించడమే ఆత్మ విచారణ.

** - శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)

678) శ్లోకము :-

పాపాని మే హరతు కాచన కృత్తశీర్షా మాతా పదాంబుజ భుజిష్య వితీర్ణహర్షా!

యా భక్తలోక వరదాన విధౌ వినిద్రా వాసం కమండలు  ధునీ పులినే కరోతి!!  678

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి! భక్తలోకమునకు వరములిచ్చుటకై నిద్రమాని జాగరూకతో ఉండునట్టిది,

తను ప్రతిష్ఠ అయిన క్షేత్రమున ప్రవహించు  పావన  కమండలు అను నది యొక్క 

ఇసుకదిబ్బలపై నివసించునది, తన పాద పద్మముల దాసులగు భక్తులకు 

ఆనందము ప్రసాదించునది, కంఠము నరుకుకొని చ్ఛిన్నమస్తక అయిన రేణుకా దేవి

నాపాపములను తొలగించు కాక 

...

***679) శ్లోకము :-

షష్ఠావతార జననావని రేకవీరా భీమా ధునోతు దురితాని గణాధిపస్య!

యా భక్త రక్షణ విధావతి జాగరూకా పుణ్యే కమండలు ధునీ పులినే చకాస్తి!!  679

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి! పవిత్రమగు కమండులు నదీ తీర 

ఇసుక మైదానమున నివసించునది,

తన భక్తుల రక్షణ అందు జాగరూకత కలది,

సాటి లేని పరాక్రమముచే 

ఏకవీర అని ప్రసిద్ధి చెందినది, 

చండిక, భీమ అని నామముల కూడ పిలువబడు, 

విష్ణువు ఆరవ అవతారమైన 

పరశురాముని తల్లి 

రేణుకా దేవి 

కుమారుడుగణపతి  

పాపముల హరించు కాక.

**శ్రీమన్నారాయణీయము                     దశమ స్కంధము 72వ దశకము - అక్రూరుని ఆగమనము - 72 - 9 & 10 - శ్లోకములు

72-9

సాయంతనాప్లవవిశేషవివిక్తగాత్రౌ

ద్వౌ పీత నీలరుచిరాంబర లోభనీయౌ।

నాతిప్రపంచధృతభూషణచారువేషా

మందస్మితార్ర్ధవదనౌ స యువాం దదర్శ॥

9వ భావము :-

ప్రభూ! నీవూ - నీ సోదరుడు బలరాముడు -సాయంకాల సమయమగుటచే, స్నానమాచరించిరి; ఆకర్షణీయమగు పసుపు నీలివర్ణపు దుస్తులను,

అతి ఆడంబరముకాని ఆ భరణములను ధరించిరి; మందస్మిత ప్రసన్న వదనములతో వచ్చిరి. అట్టి మిమ్ములను - ఆ అక్రూరుడు చూచెను.

**72–10

దూరాద్రథాత్ సమవరుహ్య నమంతమేనం

ఉత్థాప్య భక్తకులమౌళిమథోపగూహన్।

హర్షాన్మితాక్షరగిరా కుశలానుయోగీ

పాణిం ప్రగృహ్య సబలో౾థ గృహం నినేథ॥

10వ భావము :-

ప్రభూ! అక్రూరుడు మిమ్ము చూడగనే వేగిరమే రథము దిగి మీకు నమస్కరించెను; ప్రభూ! నీ పాదములపై వాలెను. నీవప్పడు ఆ భక్తాగ్రేసురుని లేవనెత్తి అతనికి సంతోషము కలిగించుచూ కౌగలించుకొంటివి;

 మర్యాద పూర్వకముగా సంభాషించితివి; కుశలమడిగితివి. అతని హస్తములను మీరు చెరియొకవైపున పట్టుకొని గృహాంతర్భాగమునకు తోడ్కొని వెళ్ళిరి.

***





2*శ్రీ దామోదరాష్టకం*


1)నమామీశ్వరం సచ్చిదానందరూపం- లసత్కుండలం గోకులే భ్రాజమానం |

యశోదాభియోలూఖలాద్ధావమానం -పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా || 


2)రుదంతం ముహుర్నేత్రయుగ్మం -మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం |

ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ- స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్ || 


3)ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే-స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ |

తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం - పునః ప్రేమతస్తం శతావృత్తి వందే || 


4)వరం దేవ మోక్షం న మోక్షావధిం వాన చాన్యం వృణేఽహం వరేషాదపీహ |

ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః || 


5)ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్- వృతం కుంతలైః స్నిగ్ధ-రక్తైశ్చ గోప్యా |

ముహుశ్చుంబితం బింబరక్తధరం మేమనస్యావిరాస్తాం అలం లక్షలాభైః || 


6)నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం |

కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః || 


7)కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ |

తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్ఛ న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ || 


8)నమస్తేఽస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే |

నమో రాధికాయై త్వదీయప్రియాయై నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యం || 

ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సoపూర్ణం ||


 9 ..

3*శ్రీ సూర్యస్తోత్రం*...

ధ్యానం |

ధ్యాయేత్సూర్యమనంత కోటికిరణం తేజోమయం భాస్కరం |

భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||

ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం |

భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ 

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |

జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |

అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః 

ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |

సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః  4 

పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |

అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయ నమో నమః 

కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |

ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమో నమః 

సకలేశాయ సూర్యాయ ఛయేశాయ నమో నమః |

క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనం 

సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణం |

ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్   

సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ 


****


*అధ్యాయము - 1*

ఈ ప్రపంచంలో అన్ని వస్తువులను, జీవులను కలుపునది ప్రేమయే. పేరు ప్రతిష్ఠలు, వస్తువుల యందు మనకున్న ప్రేమ వాటితో మనలను కలుపుతున్నట్లుగా, భగవంతుని యందు మనకుగల ప్రేమ మనలను ఆయనతో ఐక్యపరచును. ఈ భక్తి మార్గము అందరకూ అనుసరించుటకు సులభమైనది. మనందరిలో సహజంగా ప్రేమ ఉంది. వృక్షములు, జంతువులతోసహా అందరూ ప్రేమను అర్థం చేసుకోగలరు.

ఒక ధనవంతుని కుమారునకు పెట్టుబడి సిద్ధముగానే ఉన్నందున వ్యాపారము ప్రారంభించుట సులభమే. అదే విధంగా మన దగ్గర ఉన్న ప్రేమ అనే పెట్టుబడిని శరీరమునందు, విషయవస్తువుల యందు పెడుతున్నాము.

ఈ ప్రేమలోగల పరస్పర ఆధారము, ప్రతిఫలాపేక్ష దుఃఖమునకు కారణమవు తున్నాయి. వీటి యందు మన పెట్టుబడియైన ప్రేమను వెనుకకు తీసుకొని అనగా మమకారాన్ని వదలి దానిని భగవంతుని యందు పెట్టుబడిగా పెట్టిన ఆయన దాన్ని మించి సమృద్ధమైన ప్రతిఫలమిస్తాడు.

"భగవానుడే సత్యము, అంతరాత్మ, జీవన నిర్వాహకుడు - బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి కథ్యతే”. ఆయన అందరి వెనుకనే ఉండి అందరి ఆలోచనలను వెలిగించే అంతరాత్మయైన నిర్గుణ చైతన్యం.

నేను భగవంతుని ప్రేమిస్తున్నట్లయితే ఎవరినైనా ఎలా ద్వేషించగలను? అవమానించగలను? భగవంతుని విగ్రహాన్ని పూజిస్తూ యితర జీవులను ద్వేషిస్తున్నచో అటువంటి ప్రేమ బూడిదలో పోసిన పన్నీరు వంటిదని భాగవతం చెబుతున్నది. అటువంటి ఆరాధన వలన ఎటువంటి జ్ఞానము లభింపజాలదు.

మమకారాన్ని వదులుకొనుటకు సాధనము ఈ క్రింది శ్లోకములో

చెప్పబడింది.


4*🧘‍♂️10- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘‍♀️*

*🧘‍♂️10-సిద్ధభూమిక🧘‍♀️:-*

శ్వేతవరాహకల్పంలో వైవస్వత మన్వంతరం. 28వ మహాయుగంలో కలియుగం ప్రథమపాదం విక్రమశకంలో 7వ శతాబ్దం. దక్షిణాపథంలో శ్రీలంక. అందులో ప్రసిద్ధమైన మలయపర్వతం. ఈ శైలం మీద నుండి వచ్చే గాలులకు కొన్ని వందల మైళ్ళమేర చల్లగా ఉంటుంది.

ఈ గిరి మీద చందన వృక్షాలు అసంఖ్యాకంగా ఉండటం వల్ల ఇది నాగజాతికి నివాసమైంది. ఋషుల ఆశ్రమాలు, గ్రామాలు ఇక్కడ అరణ్యప్రాంతాలలో మానవనివాసాలు.

అటువంటి ఒక చిన్నపల్లెలో ఒక బ్రాహ్మణ కుటుంబం. ఆస్తిపాస్తులు లేవు. పురాతనమైన చిన్న యిల్లు, కొండలు, గుట్టలు, అక్కడ పెద్దపంటభూములు లేవు. అడవిలో నివ్వరిధాన్యం కొంచెం లభిస్తుంది. పండ్ల చెట్లు మాత్రం సమృద్ధిగా ఉన్నవి. కొద్దిగా గోసంపద. ఈ బ్రాహ్మణుడు కాస్త చదువుకొన్నాడు.

 సాయంకాలాలు పురాణ ప్రవచనం చేస్తుంటాడు. దగ్గరి కుటుంబాలవారు ఒక పది, పదిహేనుమంది వచ్చి వింటుంటారు. ఎప్పుడన్నా కొంచెం ధాన్యం,

కాయగూరలు పండ్లు ఇస్తుంటారు. పంచాంగం చూచి మంచి చెడు చెపుతుంటాడు. జాతకభాగంతో అల్ప పరిచయం ఉంది.

కాలం గడచిపోతున్నది. సంతానం లేదు. తనకు తెలిసిన జ్యోతిష పరిజ్ఞానాన్ని బట్టి సంతానయోగం లేదు. వంశం నిలిచే అవకాశం కనబడటంnలేదు. ఒకసారి దేవీ భాగవతం పురాణం చెపుతుండగా దేవదత్తుని కథ వచ్చింది. ఆ దేవదత్తుడు సంతానయోగం లేదని తెలుసుకొని ఒక మహర్షినిnఆశ్రయించాడు. ఆ ముని - పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుందని సలహా యిచ్చాడు. దేవదత్తుడు మునిపల్లెలో ఉన్నవాడు. యజ్ఞానికి విపుల కేమి లోటు? అంతో యింతో ఉన్నవాడు. దక్షిణలివ్వగలడు.

శాస్ట్రోక్త విధానంలో యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞంలో హోమాలు, అర్చనలు, పారాయణలు చాలా భాగాలుంటవి. గోభిలుడనే మహర్షి ఉద్గాతగా వేదపారాయణం చేస్తున్నాడు. ఎండాకాలం కావటం వల్ల అలసిపోయి ఒక చోట మంత్రస్వరం తప్పుగా ఉచ్చరించాడు. వింటున్న దేవదత్తునికి కోపం వచ్చింది. ఏమయ్యా ! గోభిలా ! నేను ప్రయోజనం కోరి యజ్ఞం చేస్తున్నాను. స్వరం దోషయుక్తమైతే ఫలితం ఎలా వస్తుంది ? అని గద్దించాడు. గోభిలునికి కోపం వచ్చింది.

ఎండ వేడికి అలసిపోయి కాస్త పొరపాటు చేస్తే పదిమందిలో నన్ను అవమానిస్తావా ? నీకు మూర్ఖుడగు పుత్రుడు పుట్టును గాక ! అని శపించాడు. యాజ్జికులంతా విస్తుపోయి చూస్తున్నారు. దేవదత్తుడు పరిస్థితి గమనించాడు. శాపాయుధుడైన ఋషిని తానేమి చేయగలడు? వెంటనే మహర్షీ ! నన్ను క్షమించు. ఉద్రేకంలో తొందరపడ్డాను. అయితే మీ మాటవల్ల ఒక ఉపకారం జరిగింది.

పుత్రుడు పుడతాడని నిశ్చయమైంది. అయితే వేదవేత్తల కుటుంబంలో మూర్యుడు ప్రభవిస్తే అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. పుట్టే పిల్లవాడు పండితుడయ్యేటట్లు ఆశీర్వదించండి” అని కాళ్ళ మీద పడ్డాడు.

 గోభిలునకు మనస్సు కరిగింది. “విప్రుని అలుకయు తృణహుతాశనంబు దీర్ఘమగునె?” అన్నారు పెద్దలు. బ్రాహ్మణుని కోపం గడ్డిపరకకు అంటుకొన్న నిప్పువంటిది. ఎక్కువ సేపుండదు. గోభిలుడు శాంతించి “దేవదత్తా ! నీకుమారుడు మొదట మూడుడైనా తర్వాత సరస్వతీదేవి అనుగ్రహం చేత విద్వాంసుడవుతాడు” అని వరమిచ్చాడు.

తరువాత కొన్నాళ్ళకు దేవదత్తునకు కుమారుడు పుట్టాడు. వాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఉపనయనం చేశారు. కాని శాపం వల్ల ఎంత కష్టపడ్డా చదువు రాలేదు. ఆపిల్లవాడు మునిశాపంవల్ల తనకు విద్యరాదని విని తండ్రి అనుజ్ఞ తీసుకొని దూరప్రదేశానికి వెళ్ళి ఒక కుటీరం నిర్మించుకొని భగవధానం చేసుకుంటూ మంచిరోజుల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులలోను అబద్దమాడేవాడు కాకపోవటం వల్ల అతనికి సత్యవ్రతుడనే పేరు వచ్చింది.

సశేషం )

100) అష్టావక్ర గీత🧘‍♀️*

*నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)*  

*శ్లోకం 08:-*


*తాత్పర్యం:-*

సూక్ష్మంగా, అంతర్గతంగా మనలో ఉండే వాసనలు మనస్సులో కోరికలు గానూ బుద్ధిలో ఆలోచనలుగానూ వ్యక్తం అవుతుంటాయి. అందుకే సాధారణంగా వాసనలను కోరికలు అని, వాడుతూ ఉంటాం. అయితే నిజానికి కోరికల యొక్క బీజరూపమే వాసనలు. మనిషిలో ఉండే ఈ మొత్తం వాసనలను కారణశరీరమనీ, లింగదేహమనీ అంటారు.

ఈ కారణశరీరమే మనిషిలోని వ్యక్తిత్వంగా వ్యక్తమవుతూ ఉంటుంది. (కారణశరీరం--వ్యష్టిలోని మొత్తం వాసనలు కారణ శరీరం అనబడతాయి సమిష్టి జీవుల సమష్టి వాసనలు మాయ అనబడతాయి. ఈ మాయగా వ్యక్తమయే ఆత్మ చైతన్యమే ఈశ్వరుడు అనబడుతున్నాడు.

 'పర్వాః శరీరాభిమానీ, సమిష్టికారణ శరీరాభిమానీ పరమాత్మా ఈశ్వరః" -- ఈ సృష్టికి, స్థితికి, లయానికి కారణమయిన మహాశక్తి, అన్ని ప్రాణులలోనూ బయటా కూడా ఉంటూ ఈశ్వరుడుగా గుర్తింపబడుతున్నాడు.

మనశ్శరీరాలలో ఆలోచనలుగా, కోరికలుగా, క్రియలుగా వ్యక్తమయే ఈ ఆలోచనలే (వాసనలే) అహంకారాన్ని స్వార్థభావంతో బంధిస్తాయి. ఆ బంధంతో జనన మరణ యుక్తమైన జీవిత చక్రం క్రమం తప్పకుండా పరి భ్రమిస్తూ ఉంటుంది. 'వాసనా ఏవ సంసారః"---ఈ వాసనలే సంసారానికి బీజం వంటివి. కోరికలు లేకుండా చేసుకోవడమే సంసారం నుండి బయటపడడం, వాసనారాహిత్యమే ముక్తి.

"అద్య --ఇప్పుడు--కోరికలను త్యజించి,వాసనలను క్షయింపజేసుకున్న తరువాత, వ్యక్తికి సంపూర్ణ స్వతంత్రం లభిస్తుంది. అతడు ఎక్కడ ఏ విధంగా జీవించినా సంసారచక్రం అట్టివానిని బాధించదు, బంధించదు. యోగవాశిష్ఠంలో ముక్తి ఇలా వివరింపబడింది.



9వ అధ్యాయం సమాప్తం.


🕉️🌞🌍🌙⭐🚩

: *🧘‍♂️20) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️*

*20) శ్లోకం:-*


*దేహాదికం జగ దసజ్జడ దుఃఖ రూపం మయ్యద్వితీయ నిజబోధ సదాదిరూపే |* 


*సందృశ్యతే భ్రమవశా ద్గగనే నిరంశే గంధర్వ పత్తన మివేత్యనుభావయ త్వమ్ ॥ 20*


*టీకా*


 దేహ ఆదికం = దేహము మొదలైనవి, జగత్ = బాహ్య ప్రపంచము, అసత్ = మిథ్య, జడ దుఃఖ రూపం = జడమైనవి, దుఃఖాన్ని కలిగించేవి, భ్రమవశాత్ = భ్రాంతి కారణంగా, అద్వితీయ = రెండోదిలేని, నిజబోధ సత్ ఆది రూపే = నా జ్ఞాన సత్తాల మొదటి రూపమైన, మయి = నాలో, గగనే నిరంశే విభజనలు లేని ఆకాశంలో, గంధర్వ పత్తనం ఇవ = గంధర్వ నగరంవలె, సందృశ్యతే = కనబడుతుంది, ఇతి = ఇలా, త్వం అనుభావయ = నీవు నిరంతరం భావన చెయ్యి.


*భావం:-*


దేహాదులు, జగత్తు మిథ్య అయినవి జడమైనవి, దుఃఖరూపమైనవి. అద్వితీయమైన సచ్చిద్రూపమైన నా స్వస్వరూపంలో నిరంతరం భావన చేయుము... భ్రాంతి వల్ల విభజనలు లేని ఆకాశంలో గంధర్వపట్టణం కనిపించినట్లు, కనబడుతున్నాయి.


*వివరణ:-*


కేవలం దేహేంద్రియాలని సాక్షినని భావించడం వల్లనే నిదిధ్యాసన పూర్తి కాదు. ప్రాపంచిక, శారీరక సమస్యలు, బాధలు ఉంటూనే వుంటాయి. వాటి మిథ్యా స్వరూపం కూడ మనకి బాగా అర్థం కావాలి.



 దేహాదుల్ని బట్టి ప్రపంచము, అందులోని దుఃఖాలు మనని తాకుతున్నాయి. నేను కేవలం సాక్షిని అయితే ఇవన్నీ ఎందుకు కనబడుతున్నట్లు? వీటిని ఎలా వదిలించుకోవాలి? ఈ శ్లోకంలో స్పష్టం చేస్తుంది.



ఆకాశంలో ఏ విభజనలు లేకపోయిన కంటిలోని నీటి తెరల కారణంగా ఆకాశంలో ఏవేవో భవనాలు పట్టణాలు ఉన్నట్లు కబడుతుంది. అది కంటిదోషం. అలాగే భ్రాంతి కారణంగా కేవలం సచ్చిద్రూపంగా ఉండే ఆత్మ స్వరూపంలో దేహాదులు, వాటి కారణంగా జగత్తు కనబడుతున్నాయి.



 అవి మిధ్య, జడము, పైపెచ్చు దుఃఖమయము. భ్రాంతి వల్లనే కనబడుతున్నాయి. ఈ ప్రకారంగా తర్కబద్ధంగా నిరంతరం చింతన చేయగా చేయగా క్రమంగా భ్రాంతి పొరలు కరిగిపోయి ఇవి కనబడడం మాని వేస్తాయి. స్వస్వరూపం గోచరమౌతుంది.


🕉️🌞🌍🌙🌟

 *🧘‍♂️శ్రీ అన్నమాచార్య సంస్కృత కీర్తన🧘‍♀️*


గానం: ఎం.ఎస్.సుబ్బలక్ష్మి అమ్మ

రాగం: యమన్ కల్యాణి

రేకు రాగము: ధన్యాసి.


భావయామి గోపాలబాలం మన-

స్సేవితం తత్పదం చింతయేయమ్ సదా!!


కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా-

పటల నినదేన విభ్రాజమానం

కుటిలపద ఘటిత సంకుల శింజితేనతం

చటుల నటనా సముజ్జ్వల విలాసం!!


నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది-

సుర నికర భావనా శోభితపదం

తిరు వేంకటాచల స్థితం అనుపమం హరిం

పరమపురుషం గోపాలబాలం!!


🕉️🌞🌏🌙🌟🚩


     యశోదమ్మ దగ్గర పారాడుతూ, నడుస్తూ, నృత్యం చేస్తున్న చిన్నికృష్ణయ్యని అన్నమయ్య ఈ కీర్తనలో మనోహరంగా వర్ణిస్తున్నాడు.

చిట్టి పొట్టి అడుగులు వేస్తూ ముద్దు కన్నయ్య నడుస్తుంటే మొలతాడుకు ఉన్న చిరుగంటలు అందంగా మోగుతున్నాయి. అసలు మన హృదయాలు గంటలుగా మారాయేమో! అదుగో మనలని అనుగ్రహించటానికి కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు. అటు  కాలు ఇటు  వేసి, అందెలు ఘల్లు ఘల్లు అంటుంటే మా బాల కిట్టయ్య ఎంత చక్కటి నృత్యం చేస్తున్నాడో కదా! ఆ విలాసం ఇంకెవరికయినా ఉంటుందా!

 అదుగో! అమ్మ ఎప్పుడు పెట్టిందో చేతిలో వెన్నముద్దతో వెన్నదొంగ మురిసిపోతూ మెరిసిపోతున్నాడు. కృష్ణుడు ముద్దుముద్దుగా నడుస్తుంటే, ఆ అడుగులకు అందరూ మురిసిపోతున్నారు. ఆ అడుగులతో బ్రహ్మ మొదలైన దేవతల ఆలోచనలు మెరిసిపోతున్నాయి. అలా తమ భావాలను మెరిపిస్తున్న కృష్ణున్ని తలుచుకుంటూ దేవతలందరూ తాము అదృష్టవంతులమనుకొంటున్నారు.

ఎవ్వరితో పోలిక లేనివాడు,పరమ పురుషుడు గోపాలబాలుడు. ఆ చిన్ని కృష్ణుడు వేంకటేశునిగా వేంకటాచలంలో ఉన్నాడు. ఆ ఆవులు కాసే బాలుడిని, నన్ను రక్షించమని ధ్యానిస్తాను.

***

స్వామివారు భూలోకంలో ఉన్నది సరిగ్గా 125 సంవత్సరాలని ఒక లెక్క ఈ 125 సంవత్సరాల జీవిత కాలంలో పెద్దరికపు చేష్టల కంటే శ్రీకృష్ణుని బాల్య క్రీడలు కవులకు అధికంగా మనస్సేవితాలయ్యాయి. మనస్సేవితమనేది ఒక అద్భుతమైన పద బంధం. చేతులు, కాళ్ళు భగవంతుని సేవలో యాంత్రికంగా నిమగ్నమవుతాయి. కాని, మనస్సు సేవించటమనే విషయం మానవులలో తక్కువగా జరుగుతుంది. రాగ ద్వేషాలకు అతీతులై, భగవంతునికి మనస్సేవ చేయమని అన్నమయ్య సందేశం. భాగవతంలో కర్దమ మహాముని చూసిన స్వామి మనస్స్పర్శస్మిరేక్షణుడు (మనస్సును తాకే చిరునవ్వుల చూపుల వాడు). ఆ చిన్నికృష్ణుడిని మనస్సేవితునిగా చేసిన అన్నమయ్య ధన్యుడు,

మర్కట కిశోర న్యాయ మార్జాల కిశోర న్యాయం - అని రెండు పద్దతులు భక్తి ప్రపంచంలో ఉన్నాయి. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు దాటేటప్పుడు తల్లి కోతిని - పిల్ల కోతి గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇక్కడ తల్లికి రక్షణ బాధ్యత లేదు. పిల్లకే బాధ్యత, ఈ విధానంలో భక్తుడిదే బాధ్యత.

జీవుడు తన రక్షణకు తాను ప్రయత్నాలు చేస్తుంటాడు. మార్జాల కిశోర న్యాయం దీనికంటే ప్రత్యేకమైనది. పిల్లి తన పిల్లలని తానే రక్షిస్తుంది. ఆహారం అందిస్తుంది. ఒకచోట నుంచి ఇంకోచోటికి తానే తీసుకువెళుతుంది. ఇక్కడ తల్లిదే రక్షణ బాధ్యత. పిల్లకి సంబంధం లేదు. అన్నమయ్య లాంటి మహాభక్తులు అనుసరించిన శరణాగతి మార్గం ఇదే. స్వామికే సర్వం సమర్పణ చేయాలి. తన రక్షణ బాధ్యతలు అన్నీ స్వామికే అప్పజెప్పే ఈ ఉత్తమ భక్తి విధానంలో వేలాది కీర్తనలు అన్నమయ్య రాసాడు.

ఈ భావయామి కీర్తనలోన సదా ( ఎల్లప్పుడు) అనే పదం కీలకమైంది. సర్వకాల సర్వావస్థల్లోనూ స్వామిని ధ్యానించాలి. శరణు కోరాలి. ఈ కీర్తన ఇచ్చే సందేశం ఇదే. చింతయేయమ్ కు బదులు *'చింతయేహమ్'* అను పాఠమే మనం గ్రహించాలి. ముత్తుస్వామి దీక్షితులవారు కూడా *చింతయేహమ్* అని శివ సంకీర్తనలలో తరచూ ప్రయోగించారు. అమ్మ భావనాగమ్య (భావించటం చేత తెలియదగినది లలితాసహస్రం). కృష్ణయ్య కూడా భావనాగమ్యుడు. కేవలం మనకే కాదు. బ్రహ్మ మొదలైన దేవతల భావనలకు చిన్ని కృష్ణుడు శోభనిస్తాడని అన్నమయ్య చెబుతున్నాడు. అంటే మనం కృష్ణయ్యను ఒక్కసారి భావిస్తే చాలు, ఆ ఊహలు వెలిగిపోతాయి. అతడు బ్రహ్మాది భక్తుల భావాల వెలుగుతో ప్రకాశించే పదాలు కలవాడని కవి మాట.

పదాలకు రంగు, రుచి, వాసన ఉంటాయంటే కవులలాగే చెబుతారని అనుకొనేవాళ్ళు, ఈ అన్నమయ్య భావనాశోభ చూసి "పదాలకు రుచి ఉంటుంది. నిజమేస్మీ" అనకుండా ఉంటారా?

ఈ కీర్తనలోని నిరత కరకలిత నవనీతం (చేతిలో ఉంచుకొన్న కొత్తగా తీసిన వెన్నముద్ద కలిగినవానిని ) పాదాన్ని విన్న వెంటనే, "చేత వెన్నముద్ద చెంగల్వపూదండ" అనే పద్యం గుర్తుకు వస్తుంది. ఆ మాటకొస్తే అమ్మ చేతిముద్దలాంటి కమ్మనైన ఈ పద్యం కూడా అన్నమయ్యదే అని కొందరు విమర్శకుల భావన.

ఇంతకీ వెన్నముద్దకి, కృష్ణుడికి సంబంధం ఏమిటి? ఆయనకి ఇంకేం పనిలేనట్టు అస్తమాను ఈ వెన్న దొంగతనాలు ఏమిటి? వెన్నముద్దలు చేతిలో పెట్టుకోవటమేమిటి? ఈ ప్రపంచం నీళ్ల వంటిది. మనస్సు పాల వంటిది. నీళ్లలో పాలను కలిపితే - స్వచ్ఛమైన పాల ఉనికి మనకు కనిపించదు. అదే పాలను పెరుగుగా మార్చి చిలికితే వెన్న వస్తుంది.

ఆ వెన్నముద్దను నీళ్లలో ఉంచితే, అది నీళ్లలో కలవదు. తేలుతుంది. మన జీవుల మనస్సు వెన్న కావాలని కృష్ణయ్య సందేశం. నీళ్ళ లాంటి ప్రపంచంలో ఉంటున్నాం ప్రాపంచిక బంధాలు అంటుకోకూడదు. ఇది చెప్పినంత తేలిక కాదు. పాలలాంటి మనస్సు వెన్నగా మారాలంటే కృష్ణమూర్తి అనుగ్రహం జీవుడికి అవసరం. నన్ను ఆశ్రయించండి. స్మరించండి.

మిమ్మల్ని నా చేతుల్లో పెట్టుకొని చూసుకొంటానని స్వామి వెన్నముద్దను చేతిలో ధరిస్తున్నాడు. ఇది అర్ధం చేసుకొన్న అన్నమయ్య లాంటి మహాభక్తులు సదా ఆయనను స్మరించి తరించారు. అన్నమయ్య కీర్తనలు చదివి ఆనందించాలి. ఆయన మార్గాన్ని అనుసరించి తరించాలి.

***

 *🧘‍♂️90- ఒక యోగి ఆత్మకథ🧘‍♀️*

*రాతిబొమ్మ గుండె*

“శిలారూపిణివైన మౌన మాతృమూర్తి, నీ ప్రియభక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తి వయావు. నీ కోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందనల్ని ఎందుకు ఆలించవమ్మా?” అంటూ ప్రార్థించాను.

దివ్య ప్రశాంతితోబాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది. అయినా ఐదుగంటలు గడిచిపోయాయి; నేను అంతర్‌దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానమివ్వలేదు, నేను ఒక్కరవ్వ నిరాశపడ్డాను. ఒక్కొక్కప్పుడు, ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చెయ్యడం దేవుడు పెట్టే పరీక్ష. కాని చివరికి, తదేక నిష్ఠగల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శన మిస్తాడాయన. భక్తి తత్పరుడైన క్రైస్తవుడు ఏసును చూస్తాడు; హిందువు కృష్ణుణ్ణో, కాళికా దేవినో చూస్తాడు; ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడివేపు తిరిగితే విరాట్ జ్యోతిని దర్శిస్తాడు.

నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూశాను; మధ్యాహ్న కాలనియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు. ముఖమంటపంలో ఉన్న నా ఏకాంత స్థల నుంచి లేచి ముంగిట్లో అడుగు పెట్టాను. అక్కడ నేలమీద పరిచిఉన్న రాయి మిట్టమధ్యాహ్నం ఎండకు మలమల మాడుతోంది; నా అరికాళ్ళ మంటెత్తిపోతున్నాయి.

“జగన్మాతా,” అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను. ​“నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు; ఇప్పుడు మూసిన తలుపుల వెనక దాక్కుని ఉన్నావు. ఈ రోజు నేను మా బావగారి తరఫున నీకు ప్రత్యేక ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను.”

మనస్సులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది. మొదట, నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి, పాదాలకింద ఆహ్లాదకరమైన చలవ అల ఒకటి పాకి వచ్చింది. ఆ తరవాత, ఆ ఆలయం పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకొని కాళికాదేవి శిలావిగ్రహాన్ని ఆవిష్కరించింది. క్రమంగా ఆ విగ్రహం సజీవరూపంగా మారింది; చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది; చెప్పనలవికాని ఆనందంతో నన్ను పులకరింపజేసింది. కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టుగా నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటికి వచ్చేసింది; నా శరీరం జడప్రాయం కాకపోయినా అతినిశ్చలమయిపోయింది.

ఆ తరవాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తార మయింది. నా ఎడమవేపు గంగానది మీద అనేక మైళ్ళదురం స్పష్టంగా చూడగలిగాను, అంతే కాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్ళకు కట్టింది. భవనాలన్నిటి గోడలూ పారదర్శకంగా ప్రకాశించాయి; వాటిగుండా నేను, దూరభూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను.

నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ, నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితిలో ఉండిపోయినప్పటికీ, నేను చేతులూ కాళ్ళూ స్వేచ్ఛగా కదపగలిగాను. కొన్ని నిమిషాలసేపు నేను కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను: మూసినా తెరిచినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను.

ఎక్స్-రే లనే కిరణాల మాదిరిగా, ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల ​పదార్థాల్లోకీ చొచ్చుకుపోతుంది; ప్రతి చోటా దివ్యనేత్రమే కేంద్రం; దాని కెక్కడా పరిధి ఉండదు. ఎండకు మాడుతున్న ఈ ముంగిట్లో నించుని ఉండగా నే నొక విషయం కొత్తగా గ్రహించాను; వాస్తవానికి స్వప్నమై, నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్టసంతానంగా జీవించడం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు. సంకుచిత మూర్తిమత్వంలో కుదించుకుపోయిన మానవుడికి పలాయన వాదమే శరణ్యమయినట్లయితే, సర్వవ్యాపకత్వంతో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా?

దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులల్లా ఆలయమూ అమ్మవారి విగ్రహమూ, తక్కిన వాటిలో ప్రతి ఒక్కటీ తెలుపూ నీలమూ ఇంద్ర ధనుస్సులోని రంగులూ గల స్నిగ్ధ కాంతి పరివేషంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయి. నా శరీరం గాలిలో తేలిపోవడానికి సిద్ధంగా వాయుపదార్థంతో ఏర్పడినట్టు అనిపించింది. నా భౌతిక పరిసరాల సంపూర్ణ స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ, ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను.

గుడి గోడల వెనక పవిత్రమైన మారేడుచెట్టు ముండ్ల కొమ్మల కింద కూర్చుని ఉన్న మా బావగారిని చటుక్కున చూశాను. ఆయన ఆలోచనల ధోరణిని అప్రయత్నంగానే తెలుసుకోగలిగాను. ఆయన మనస్సులో, దక్షిణశ్వర పవిత్ర వాతావరణ ప్రభావంవల్ల కొంతమట్టుకు ఉదాత్తస్థితి నందుకున్నప్పటికీ నా గురించి నిర్ధాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి. నేను సూటిగా, ఆ అమ్మవారి దివ్యమంగళ విగ్రహం వేపు తిరిగాను. ​“జగన్మాతా, మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు?” అని ప్రార్థించాను.

ఇంతవరకు మౌనంగానే ఉన్న ఆ సౌందర్య రూపిణి చివరికి నోరువిప్పి మాట్లాడింది. “నీ కోరిక నెరవేరుతుంది!”

సతీశ్ వేపు సంతోషంగా చూశాను నేను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పని చేస్తోందని సహజ ప్రవృత్తివల్ల తెలిసి ఉన్నట్టుగా ఆయన, నేలమీద కూర్చున్న చోటునుంచి రోషంగా లేచాడు. ఆయన గుడివెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు; తన పిడికిలి ఎత్తి చూపిస్తూ నన్ను సమీపిస్తున్నాడు.

సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమయింది. అమ్మవారి దివ్య మంగళమూర్తి అవుపించడం మానేసింది; ఆ ఆలయం పారదర్శకత పోగొట్టుకొని తిరిగి మామూలు పరిమాణాన్ని పొందింది. మళ్ళీ నా ఒళ్ళు, సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమల మాడుతోంది. ముఖ మంటపం నీడలోకి ఒక్క గంతు వేశాను; సతీశ్ మండిపడుతూ నన్నక్కడికి వెంబడించాడు. నా గడియారం చూసుకున్నాను. ఒంటిగంటయింది; దివ్య దర్శనం గంటసేపు ఉందన్నమాట.

“ఓయి తెలివితక్కువ నాయనా, కాళ్ళు మెలివేసుకుని కళ్ళు తేల వేసుకుని గంటలగ్గంటలు కూర్చున్నావక్కడ. నిన్ను గమనిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. మన భోజన మెక్కడోయ్? ఇప్పుడు గుడి మూసేశారు; గుడి అధికారులికి నువ్వు మన సంగతి చెప్పకపోతివి; మన భోజనాల ఏర్పాటుకు టైము చాలా మించిపోయింది!”

🕉🌞🌏🌙🌟🚩

- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)*

🕉🌞🌎🌙🌟🚩

685) శ్లోకము :-

ప్రాణేశ్వరీ విధిపురే లసతః పురారే 

రంగీకరోతు శరణాగతి మంబికా మే.!


లబ్ధం నిపీయ యదురోరుహకుంభదుగ్ధమ్

సంబంధ మూర్తి  రభవత్ కవిచక్రవర్తీ!!  685 


పదవిభజన:-


ప్రాణేశ్వరీ విధిపురే లసతః పురారేః 

అంగీకరోతు శరణాగతిం అంబికా మే!


లబ్ధం నిపీయ యదురోరుహ కుంభ దుగ్ధమ్

సంబంధ మూర్తిః   అభవత్ కవిచక్రవర్తీ!! 685 


భావము:-


తల్లీ ! ఓ ఉమాదేవి!

సంబంధమూర్తి దేవార్ లేక తేవారు అని పేరుకల 

మూడు ఏండ్ల వయసు కల బాలునకు 

నీ పాలిండ్ల పాలు అను మిషను జ్ఞానము ప్రసాదింపగా

శైవ సమాచార్యుడు- కవి చక్రవర్తి అయ్యెను.



శీర్హాలి, లేక శీర్ఖాలి అని ప్రసిద్ది పొందిన 

బ్రహ్మపురమున విలసిల్లు పరమ శివుని  

ఇల్లాలివి నా శరణాగతి అను ప్రపత్తిని 

అంగీకరింతువు కాక.


🕉🌞🌎🌙🌟🚩


686) శ్లోకము :-


అప్రాప్య లోక రచనావన పాతనేషు 

యస్యా  స్త్రయో పి పురుషాః కరుణా కటాక్షమ్!

 

నైవేశతే కిమపి సా జగదేకమాతా 

భద్రా పరా ప్రకృతి రస్త్వఘనాశినీ నః!! 686   


పదవిభజన:-


అప్రాప్య లోక రచన ఆవన పాతనేషు 

యస్యాః త్రయః  అపి పురుషాః కరుణా కటాక్షమ్!


న ఏవ ఈశతే కిం అపి సా జగదేకమాతా! 

భద్రా పరా ప్రకృతిః అస్తు అఘ నాశినీ నః!!     686   


భావము:-


తల్లీ ! ఓ ఉమాదేవి! 


390) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️* 


*స్థితి ప్రకరణము*  

*రెండవ అధ్యాయము*

*దామ వ్యాళ కటోపాఖ్యానము*


2-121


ఉచ్చైఃపదాయ పరయా ప్రజ్ఞయా వాసనాగణాత్‌ పుష్పాద్గన్ధమివోదారం చేతో రామ పృథక్కురు. 

ఓ రామచంద్రా! ఉన్నతమగు అత్మపదప్రాప్తి కొఱకై నీవు మహాప్రజ్ఞతో నీ యొక్క 

వివేకవైరాగ్యసహితమగు ఉత్తమ మనస్సును, వాసనాసమూహము

నుండి - పుష్పమునుండి గంధమువలె వేఱుచేయుము. 


2-122


సంసారామ్బునిధావస్మిన్ వాసనామ్బు పరిప్లుతే 

యే ప్రజ్ఞా నావమారూఢాస్తే తీర్ణాబ్రుడితాః పరే  


వాసనయను జలముచే పూర్ణమై యున్నటి ఈ సంసార సముద్రమున ప్రజ్ఞ (వివేకము) అను నావ యెక్కినవారే అద్దానిని దాటివైచిరి. తక్కినవారు అందు మునిగిపోయిరి. 

2-123

క్షురధారాప్రమితయా ధియా పరమధీరయా ప్రవిచార్యాత్మన స్తత్త్వం తతః స్వపదమావిశ. 

ఓ రామచంద్రా! కత్తియొక్క అంచువలె (వివేక వైరాగ్యములచే) తీక్షణమొనర్పబడినదియు, మహాధైర్యముతో గూడుకొనినదియు నగు బుద్ధిచే ఆత్మతత్త్వమును బాగుగ విచారించి, అటు పిమ్మట ఆ స్వకీయ ఆత్మపదమున ప్రవేశింపుము.


🕉️🌞🌏🌙🌟🚩

 1*🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️

 *28వ శ్లోకం:-*

*మజ్జన్మన: ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయమదను గ్రహ ఏష ఏవ! త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ!!*

*భావం:-*

*దైత్యసంహారక! లోకనాథ! ఈ నా కోర్కెను తీర్చుము. నన్ను అనుగ్రహింపుము. నీ భ్రుత్యు భ్రుత్యు పరిచారక భ్రుత్య భ్రుత్యునాకు భ్రుత్యుడనుగా నన్ను తలంచుము. ఆవిధంగా నీ భ్రుత్య పరంపరలో ఒకనిగా నన్ను తలంచుటఏ ప్రభూ! నాజన్మకు ఫలము.*

🕉🌞🌎🌙🌟🚩

*🧘‍♂️సుభాషితరత్నావళి🧘‍♀️*

*శ్లోకం:-*

.....

 2*🧘‍♂️08- శ్రీ కపిలగీత🧘‍♀️*

*అధ్యాయము - 1 శ్లోకం 07:-*

*తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురాన ఘే! I*

*ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాంగ నైపుణమ్ || 7*

*టీకా:-*

తం ఇమం = అది, ఇది; తే = నీకు; ప్రవక్ష్యామి = తెలియజేయుదును; యమ్ అవోచమ్ = నేను ఏదైతే చెప్పానో; పురా = పూర్వం; అనఘే = ఓ పాపరహితా; ఋషీణాం శ్రోతు కామానామ్ = వినవలెననే కోరిక గలిగిన ఋషులకు; యోగమ్ = యోగం; సర్వాంగ నైపుణమ్ = దాని అన్నివిధముల నుండి.

*భావం:-*

అనఘా! పూర్వం జిజ్ఞాసువులైన ఋషులకు చెప్పిన యోగమును నీకు విశదపరచెదను.

*వివరణ:-*

భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడిలా అంటాడు-(4.3) “స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః పురాతన కాలంలో నాచే చెప్పబడిన యోగమునే ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను".

ఈ జ్ఞానం శాశ్వతసత్యం. ఎప్పుడెప్పుడు అది కనుమరుగౌతూ ఉంటుందో అప్పుడప్పుడు భగవానుడవతరించి ఆ జ్ఞాన పరంపరను పునరుద్ధరిస్తూ ఉంటాడు.

గమ్యము, సాధనములు, అడ్డంకులు, ఉపకరణములు, ముందు జాగ్రత్తలు, ఫలితాలు మొదలైనవి ఈ జ్ఞానములోని వివిధ విషయములు. ఈ జ్ఞానం ఇక్కడ కపిలమునిచే సంపూర్ణంగా విశదీకరింపబడుచున్నది.

పూర్వమీ జ్ఞానము మహర్షులకు బోధింపబడినది. ఈ జ్ఞానము జిజ్ఞాసవు లకు మాత్రమే ఇవ్వబడింది, ఇవ్వాలి. లేనిచో అది వ్యర్థమవుతుంది, అపార్థము చేసుకోబడవచ్చు, లేక దుర్వినియోగపడవచ్చు.

కపిల ముని ఇప్పుడీ జ్ఞానాన్ని తన తల్లినికి ఉపదేశిస్తున్నాడు. ఈ జ్ఞానము స్త్రీలకు బోధింపబడకూడదన్న లేక వారు వినకూడదన్న మాట అసత్యమని దీనినిబట్టి తెలుస్తున్నది.

 ఈ క్రింది శ్లోకములోని సత్యమును గుర్తించనంతవరకు ఏ సాధనకునకూ ఆధ్యాత్మిక ప్రగతిసాధ్యము కాదు. కాబట్టి దీనియొక్క ప్రాముఖ్యతను గ్రహించాలి.

***

:

 3*🧘‍♂️98) అష్టావక్ర గీత🧘‍♀️*

*అధ్యాయం - 9*

*నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)*  

*శ్లోకం 06:-*


*कृत्वा मूर्तिपरिज्ञानं चैतन्यस्य न किं गुरुः ।*

*निर्वेदसमतायुक्त्या यस्तारयति संसृतेः ॥ ९-६ ॥*

*కృత్వా మూర్తిపరిజ్ఞానం చైతన్యస్య న కిం గురుః ।*

*నిర్వేదసమతాయుక్త్యా యస్తారయతి సంసృతేః ॥ 9-6 ॥*

శ్లో|| కృత్వా మూర్తి పరిజ్ఞానం చైతన్యస్య న కిం గురుః |

నిర్వేదసమతా యుక్త్యా యస్తారయతి సంసృతేః || 6.

*టీకా* 

నిర్వేద = వైరాగ్యము, సమతా = సమత్వము, యుక్త్యా = యుక్తుల చేత, చైతన్యస్య = చైతన్యము యొక్క, మూర్తి పరిజ్ఞానం = ఆకారవిశేషజ్ఞానమును, కృత్వా = చేసి, యః = ఎవడు, సంసృతేః = సంసారమునుండి, (స్వం = తనను), తారయతి = తరింపజేసికొను చున్నాడో, సః = అట్టివాడు, గురుః = గురువు, న కిం = కాడాయేమి? (అగుచున్నాడని భావము) 

*వివరణ:-*

శుద్ధమైన చైతన్య స్వభావాన్ని తెలుసుకుని, తార్కికమూ, సమత్వమూ కలిగి బుద్ధితో, ప్రపంచంమీద నిర్వేదభావం కలిగి, జనన మరణయుక్తమయిన సంసార చక్రం నుండి ముక్తుడయినవాడు మాత్రమే నిజమైన మార్గదర్శి కాగలడు.

*తాత్పర్యం:-*

వేదవేదాంగాలలో అపారమైన ప్రజ్ఞ ఉండడమే గురువు అర్హత నిర్ణయించదు. శాస్త్రపరిజ్ఞానం శ్రోత్రియత్వం వాంఛనీయమూ, ఆకర్షణీయమూ అయినప్పటికీ కేవలం అది ఒకటే చాలదు. ఆత్మానుభవనిష్ఠుడై నిర్వేదమూ, సమత్వమూ యుక్తి యుక్తమయిన బుద్దిని కలిగియుండిన వ్యక్తిమాత్రమే నిజమైన మార్గదర్శి కాగలడు.

 అష్టావక్రులు అభిప్రాయములో బ్రహ్మనిష్ఠ కలిగిన జ్ఞాని మాత్రమే ఇతరులకు గురువు కాగల అర్హత కలిగినవాడు.

అర్హతలేని గురువును త్యజించమని గురుగీత అంటుంది. "జ్ఞానహీనో గురుస్త్యాజ్యో'--- "స్వవిశ్రాంతిం న జానాతి, పరశాంతిం కరోతి కిం"----తనలో లేని శాంతిని పరులకు ఏవిధంగా ఇవ్వగలడు?

***

4🧘‍♂️18) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️*

*18) శ్లోకం:-*

*దృశ్యత్వతోన మనసశ్చ భవే చ్చితి త్వం నాహంకృతిశ్చ పరిణామవతే చితి స్స్యాత్ |*

 *బుద్ధే రచిత్వ మపి జన్మ వినాశవత్వాౕౖత్ చిత్తం చ దృశ్య మచిదిత్యనుచింతయ త్వమ్ ॥ 18*

*టీకా*

దృశ్యత్వతః = దృశ్యమైన కారణంవల్ల, చితిత్వం = చితి స్వభావం, మనసః = మనస్సుది, న భవేత్ = కాదు, చ=మరియు, పరిణామవతే అహం కృతిః = మార్పులు చెందే అహంకారం, చితిః న స్యాత్ = చితికాదు, జన్మ వినాశవత్వాత్ = పుట్టడం, నాశనం ఉన్నందున, బుద్ధేః = బుద్ధి యొక్క, అచిత్వం అపి = చితి కాని విషయం కూడా (నిశ్చయమే). దృశ్యం చిత్తం = దృశ్యమైన చిత్తం, అచిత ఇతి = అచిత్తేనని, అనుచింతయ = నిరంతరం విచారణ చెయ్యి.

*భావం:-*

‘దృశ్యమైనందున మనస్సు చితి కాదు. ఇంకా, మార్పు చెందే అహంకారం చితి కాదు. జన్మ, వినాశం కలిగిన బుద్ధి, దృశ్యమైన చిత్రం కూడా జడమైనవే' ఇలా నిత్యం చింతన చెయ్యి.

*వివరణ*

 ఇక 'అంతఃకరణం' చితి అవుతుందా అనే విచారణ సాగింపు బడుతుంది. ఉద్రేకాలతో ఊగిపోతూ, సంశయాల పుట్ట అయినది మనస్సు దాని ఉద్రేకాలు, సంశయాలు జీవుడికి తెలుస్తూ ఉంటాయి. అందుచేత మనస్సు- దృశ్యం. ద్రష్ట-చూచేవాడు. అతడే చితి. చూడబడే దృశ్యం జడమే. 

అహంకారం "నేను చేస్తున్నాను" అనే భావం. చేసే పనిని బట్టి, తిరిగే రంగాన్ని బట్టి మారుతుంది. నేను తినేవాణ్ణి, నడిచేవాణ్ణి, వినేవాణ్ణి అంటున్నప్పుడు అహంకారం పలురకాలుగా మారుతుంది.

చితి ఎప్పుడూ ఒకే రూపం కలిగి వుంటుంది. అందుచేత అహంకారం చితి కాదు. జడమైనది. చితి ఈ మార్పులన్నింటినీ గ్రహించేది.

బుద్ధో? అది అన్ని కాలాలలో పని చెయ్యదు. మనం పడుకున్నప్పుడు అది నిద్రపోతుంది. భారీగా అన్నం తిన్నప్పుడు అది మందంగా పనిచేస్తుంది. అందువల్ల జన్మ వినాశాలున్న బుద్ధి చితి కాదు. బుద్ధి యొక్క జన్మ వినాశాలని తెలుసుకునే బుద్ధి.

చిత్తం పాత జ్ఞాపకాల పుట్ట. మనస్మృతులన్నీ మన ఎరుకే. అందువల్ల అది కూడా దృశ్యమే. చితి కాదు.

***

5*🧘‍♂️88- ఒక యోగి ఆత్మకథ🧘‍♀️*

*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)*

*అధ్యాయం : 21*

*శ్రీ అన్నమాచార్య సంకీర్తన* 

రేకు: 1921-2

సంపుటము: 29-62

రాగము: కుంతలవరాళి

ఏలితివి నన్నుఁ దొల్లె యింతగా మన్నించితివి

ఆలించి నా విన్నపము లవధరించవయ్యా!! 

॥పల్లవి॥


కోపగించరాదు నీతో గుంపెన చూపఁగరాదు

వైపుగా నిచ్చక మాడవలెఁగాని

రాఁపులఁ బెట్టఁగరాదు రట్టుసేసి చూపరాదు

చేపట్టి నీవే కృపసేయవయ్యా !!

॥ఏలి॥

కన్నుల జంకించరాదు కడుఁ దమకించరాదు

వన్నెగా బత్తి నెరపవలెఁగాని

సన్నలఁ గొసరరాదు సారెకుఁ బెనఁగరాదు

అన్నిటా నీవే నన్ను 

నాదరించవయ్యా!! 

॥ఏలి॥

పాడి పంతా లెంచరాదు పైపై సిగ్గువడరాదు

వాడికగాఁ గాఁగిలించవలెఁగాని

కూడితివి నన్ను నిట్టె గురిగా శ్రీవేంకటేశ

వేడుకతో వరమిచ్చి వెలయించవయ్యా !!

॥ఏలి॥


నన్ను పరిపాలించుచున్న స్వామి ఇంతగా మన్నించితివి. నా విన్నపములు ఆలకించి నన్ను ఉద్ధరించవయ్యా. నీతో కొపగించరాదు ఆగ్రహం గా చూడరాదు.

నీతో ప్రియవచనములాడాలి గాని రాచుట పెట్టరాదు. నీపై నిందవేసి చూడరాదు.  అనుగ్రహించి నీవే దయచూపించవయ్యా. నీపై కన్నులతో కూడా కోపగించరాదు. అత్యంతము మోహము పడరాదు. అందముగా భక్తి చూపించాలి గాని సైగ చేయరాదు. మాటిమాటికి అహంకారం చూపించరాదు.

అన్నిటా నీవే నన్ను ఆదరించవయ్యా. ధర్మ ఆధర్మములను ఎంచరాదు. పైపై సిగ్గు పడరాదు. అలవాటుగా కౌగిలించవలె కాని శ్రీవేంకటేశ నీతో కలవాలన్న లక్ష్యంతో వేడుకతో వరమిచ్చి రక్షించవయ్యా అంటు అన్నమయ్య కీర్తించారు.

**

 - శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)*

680) శ్లోకము :-

భేదాయ చేద్ గతరజా ముని రాదిదేశ 

చిచ్ఛేద చేద్ బహుగుణ స్తనయః సవిత్రీమ్!

దాహ్యం శరీర మఖిలప్రభు రీశశక్తి

ర్యద్యావివేశ చ కథా పరమాద్భుతేయమ్!!      680

పదవిభజన:-

భేదాయ చేత్ గతరజాః మునిః ఆదిదేశ 

చిచ్ఛేద చేత్  బహుగుణః  తనయః సవిత్రీమ్!

దాహ్యం శరీరం అఖిలప్రభుః  ఈశశక్తిః

యది అవివేశ చ కథా పరమ అద్భుతా ఇయమ్!!     680

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి! 

పరమ సాత్వికుడైన 

జమదగ్ని మహాముని 

క్రోధావేశమున 

శిరస్సు ఖండింప ఆజ్ఞాపించుట,

సద్గుణముల రాశి అయిన పుత్రుడు 

పరశురాముడు ఆ విధముగా ఖండించుట,

అగ్నికి సమర్పింప దగు 

రేణుకా దేవి మృత శరీరమున 

ఈశ్వర శక్తివి నీవు ప్రవేశింవగా  

ఆమె పునర్జీవి అగుట

అన్నియు  

పరమ అద్భుత  నీ లీలా  విషయములు.

 ***

6.  శ్లోకములు :-


పుత్రః  ప్రియ స్తవ శిరః సహసా చకర్త

కృత్తా చ హర్షభరితా భవతీ ననర్త!


నో తస్య పాప మపి నో తవ కాఽపి హాని 

ర్నాశోఽస్య హా భుజభువా మభవద్ విపాకః!!   681


అంబైవ సా సురభి దర్జునభూపతి ర్యాం  

వీర్యా జ్జహార స చ భార్గవ ఆజహార!


తస్యా హతేః పరగృహస్థితి రేవ హేతుః

గంధర్వ దర్శన కథా రిపు కల్పితైవ!!    682


పదవిభజన:-


పుత్రః  ప్రియః తవ శిరః సహసా చకర్త

కృత్తా చ హర్ష భరితా భవతీ ననర్త!


నో తస్య పాపం అపి నో తవ కా  అపి హానిః 

నాశః అస్య హా భుజభువాం అభవత్  విపాకః!!   681


అంబా ఏవ సా సురభిః  అర్జునభూపతిః యాం  

వీర్యాత్ జహార  సః చ భార్గవః ఆజహార!


తస్యాః  హతేః పరగృహస్థితిః ఏవ హేతుః

గంధర్వ దర్శన కథా రిపుకల్పితా ఏవ!!   682


భావము:-


తల్లీ ! ఓ ఉమాదేవి!  రేణుకాదేవి! 

ప్రియ పుత్రుడు పరశురాముడు 

ఏ విచారము లేకుండ నీ శీర్షము ఖండించెను.


ఖండింప బడిన దానవైననూ హాని కలుగక

ఆనందముతో నృత్యము చేసితివి.

అతనికి మాతృ హత్య పాపము కలుగలేదు.  

కాని ఈ సంఘటన భూమిలోని రాజులకు 

వినాశకారణముగా పరిణమించెను.


ఈ పౌరాణిక విషయము అసంభవముగా తోచుచున్నది.


గంధర్వరాజు, రేణుకాదేవి మోహము ఇత్యాదులు కూడ

సత్య దూరములయిన పౌరాణిక కథనము మాత్రమే.


వేదములో ఈ విధముగా చెప్పబడినది.

కార్తవీర్యార్జునుడు  అపహరించిది అంబనే.

కామధేనువును కాదు.


పరశురాముడు అతనిని జయించి 

విడిపించినది స్వంత తల్లినే.

జమదగ్ని ఆజ్ఞచే 

ఆమెను పరశురాముడు ఖండించుట

పర గృహ నివాస నింద నివృత్తి కొరకు మాత్రమే.


***

*🧘‍♂️388) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️* 


*స్థితి ప్రకరణము*  

*రెండవ అధ్యాయము*

*దామ వ్యాళ కటోపాఖ్యానము*


2-115


నష్టే ధనఽథ దారాదౌ హర్షస్యావసరో హి కః 

పారావలోకినస్త్యేతైః విరాగం యాన్తి సాధవః.


నశ్వరములగు ధన, భార్యాదులచే హర్షమును బొందనేల? వానియొక్క (దుఃఖ, నరకాది) భయంకర భావిదుష్ఫలితములను గాంచునట్టి సాధువులు ఆ స్త్రీ ధనాదులయెడల విరక్తిని గలిగియుండుచున్నారు. 

2-116

సంసారసంభ్రమే హ్యస్మింశ్ఛన్నాత్మన్యాతతాయిని 

తథా విహర సంబుద్ధో యథా నాయాసి మూఢతామ్‌. 

ఓ రామచంద్రా! సంసారమున దిరుగాడునదియు, శత్రువువలె దాగుకొని చంపుటకు సిద్ధముగ నున్నదియు నగు కామము యొక్క విషయమై నీవు మహాజాగరూకుడై అప్రమత్తుడవై యుండి, మూఢత్వమును బొందకుండులాగున వర్తింపుము.

2-117

యయా కయాచిద్యుక్త్యైవ దృశ్యాద్యస్య గతా రతిః పరిమజ్జతి తస్యాస్థా 

న క్వచిద్విమలా మతిః. 

ఏదో యొక యుక్తిచే ఎవరికి దృశ్యము నుండి ప్రీతి, పట్టుదల తొలగిపోవునో, (పరమార్థాత్మయందు పట్టుదల గల) అట్టివాని యొక్క నిర్మలబుద్ధి సంసారసాగరమున ఎచటను మునుఁగనేరదు.

***

🙏శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

712వ నామ మంత్రము 18.6.2022

ఓం ఈ (యై) నమః

ఈం అను బీజాక్షర స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.

తురీయస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఈ అను ఏకాక్షర నామ మంత్రమును ఓం ఈ (యై) నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు   ఆత్మానందానుభూతినంది తరించును.

ఈం అనేది శక్తి బీజం. ఈ బీజమును కలుపుకునే మాయాబీజం, లక్ష్మీ బీజం, సరస్వతీ బీజములు ఏర్పడ్డాయి.  కామకళా బీజం కూడా ఏర్పడినది. కామకళా బీజమే దేవీ స్వరూపము. ఈ దేవి నారాయణుని సోదరి మరియు శివునిపత్ని. సృష్టికి మూలమైన శక్తి ధ్యానింపతగిన మన్మథబీజము కూడా. 

ఈ అను  అక్షరము తురీయస్వరూపమునకు నిర్వచనము.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ఈ (యై) నమః అని యనవలెను.

***

07. మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మ…

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

176వ నామ మంత్రము 18.6.2022

ఓం నిర్వికల్పాయై నమః

సంకల్ప వికల్పములు లేని శుద్ధచైతన్య స్వరూపిణి అయిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్వికల్పా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిర్వికల్పాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులు జ్ఞానపరిపూర్ణులై, సదా పరమేశ్వరీ ధ్యానమునందు మనస్సును నిమగ్నముచేసి తరించుదురు.

సంకల్పము అంటే ఏదైనా చేయాలనే ఆలోచన. సాధారణంగా పూజచేయునపుడు ఆచమనం చేసి, తమ యునికికి సంబంధించిన కాలము, ప్రదేశము, తిథివారనక్షత్రాదులు, ఆపైన సంకల్పంచేయువారి గోత్రము, నామధేయం, ఎందు నిమిత్తం సంకల్పం చేస్తున్నామో... ఇత్యాదులు సంకల్పంలో ఉంటాయి. అలాగే ఏదైనా కార్యక్రమం చేయాలనుకోవడాన్ని కూడా సంకల్పం అంటాము. కాని వికల్పము అంటే సంకల్పానికి వ్యతిరేకంగా అర్థం తీసుకోకూడదు. వికల్పానికి అర్థం భ్రాంతి అని అంటే ఇక్కఢ సందర్భం కుదురుతుంది. అంటే లేని  వస్తువును గూర్చి వివరణ ఈయడం. దీనినే శూన్యమైన విషయము నుండి పుట్టిన జ్ఞానము. దీనికి ఒక ఉదాహరణముగా ధూర్జటి మహాకవి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఒక పద్యం పరిశీలిద్దాము.

శా||అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా

కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతింజెంది  చరించుగాని, పరమార్థంబైన నీయందు దా

జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా!        


ఈ పద్యంలోని భావము


ఓ శ్రీకాళహస్తీశ్వరా! పరమేశ్వరా! ఈ జగత్తు, ఈ జీవనము, జననము-మరణము మళ్ళీ జన్మించడం అనేవి అంతయూ మిథ్య.  అలా తెలిసి కూడా ఎల్లప్పుడూ భార్యా, బిడ్డలు, సంపదలు, తనువు అనేవి శాశ్వతమనియు, సత్యమనియు తలచుచూ మోహము అనే  సముద్రం (మోహార్ణవములో) లో మునిగి పోవును గాని, జన్మకు పరమార్థమునిచ్చే నీయందు రవ్వంతైనను ధ్యానము నిల్పడు కదా. ఇదంతా అజ్ఞానమే కదా!

ఈ రకమైన అజ్ఞానమే వికల్పము అంటారు.  వికల్పము అనునది అజ్ఞాన సంబంధమైనది. లేనిది ఊహించుకొని  అదే నిజమని భ్రాంతి చెందడం. ఇది కేవలం మనసుకు సంబంధించినది. పరమాత్మసంబంధమైనది కాదు. గనుక పరమాత్మ, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయిన జగన్మాత నిర్వికల్పా యని అనబడినది. సాధకుడు యోగసాధనలో పరాకాష్ఠదశలో సమాధిస్థితికి చేరుతాడు. ఆ స్థితిలో సంకల్పవికల్పములు ఉండవు.  దీనినే నిర్వికల్ప సమాధి స్థితి యంటారు. పరబ్రహ్మ స్వరూపిణియైన జగన్మాతకు సంకల్పవికల్పములు ఉండవు. గాన నిర్వికల్పా యను నామంత్రముతో స్తుతింపబడు చున్నది.

జగన్మాత  చతుష్షష్టికళామయి (236వ నామ మంత్రము) అనగా అరవై నాలుగు కళలలోను పరిపూర్ణురాలు. అటు వంటి కళాప్రపూర్ణ అయిన జగన్మాత 

విజ్ఞాన ఘనరూపిణీ (253వ నామ మంత్రము) అన్ని కళలయందును జ్ఞానము కలిగి యుండుటను విజ్ఞానఘనము అందురు. గనుక ఆ తల్లి విజ్ఞానఘనరూపిణీ యని అనబడుచున్నది గనుక జ్ఞానమునకు పరాకాష్ఠ అయినది గనుక సంకల్పవికల్పములు ఉండవు. కావున నిర్వికల్పా యని అనబడుచున్నది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్వికల్ఫాయై నమః అని అనవలెను.

****