Thursday, 3 February 2022

*శ్రీ పంచమి*

 



నేటి సూక్తి ✳ అచలములోని చలనమే శక్తి , ✳ చలనము లోని నిశ్చలమే ఆత్మ
.: ముక్తి మార్గంలో అత్యుత్తమైనది జ్ఞాన మార్గం. అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవడం. 

నేడు ...శ్రీ పంచమి . వసంత పంచమి శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ 
స్థిర వాసరే,  05, ఫిబ్రవరి 2022 కు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
మల్లాప్రగడ రామకృష్ణ  

🍀.  శ్రీ సరస్వతీ స్తోత్రం 🍀

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ||

శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ||

🌻 🌻 🌻 🌻 🌻



. శ్రీ సరస్వతీ సాధన స్తోత్రం 

ఓం అస్య శ్రీసరస్వతీ స్తోత్ర మంత్రస్య  బ్రహ్మా ఋషిః  గాయత్రీ ఛందః  శ్రీసరస్వతీ దేవతా ధర్మార్థ కామ మోక్షార్థే జపే వినియోగః |

ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణే చాక్షసూత్రం
వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగమ్యా |
సా వీణాం వాదయంతీ స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః
క్రీడంతీ దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా   1 

శ్వేతపద్మాసనా దేవీ శ్వేతగంధానులేపనా |
అర్చితా మునిభిః సర్వైః ఋషిభిః స్తూయతే సదా |
ఏవం ధ్యాత్వా సదా దేవీం వాంఛితం లభతే నరః   2 

శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్ |
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్   3 

యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా   4  

హ్రీం హ్రీం హృద్యైకబీజే శశిరుచికమలే కల్పవిస్పష్టశోభే
భవ్యే భవ్యానుకూలే కుమతివనదవే విశ్వవంద్యాంఘ్రిపద్మే |
పద్మే పద్మోపవిష్టే ప్రణతజనమనోమోదసమ్పాదయిత్రి
ప్రోత్ఫుల్లజ్ఞానకూటే హరినిజదయితే దేవి సంసారసారే  5 

ఐం ఐం ఐం దృష్టమంత్రే కమలభవముఖాంభోజభూతస్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే |
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిభవే నాపి విజ్ఞానతత్వే
విశ్వే విశ్వాంతరాత్మే సురవరనమితే నిష్కలే నిత్యశుద్ధే   6  

హ్రీం హ్రీం హ్రీం జాప్యతుష్టే హిమరుచిముకుటే వల్లకీవ్యగ్రహస్తే
మాతర్మాతర్నమస్తే దహ దహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తామ్ |
విద్యే వేదాంతవేద్యే పరిణతపఠితే మోక్షదే ముక్తిమార్గే |
మార్గాతీతస్వరూపే భవ మమ వరదా శారదే శుభ్రహారే   7  

ధీం ధీం ధీం ధారణాఖ్యే ధృతిమతినతిభిర్నామభిః కీర్తనీయే
నిత్యేఽనిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే |
పుణ్యే పుణ్యప్రవాహే హరిహరనమితే నిత్యశుద్ధే సువర్ణే
మాతర్మాత్రార్ధతత్వే మతిమతి మతిదే మాధవప్రీతిమోదే   8  

హ్రూం హ్రూం హ్రూం స్వస్వరూపే దహ దహ దురితం పుస్తకవ్యగ్రహస్తే
సంతుష్టాకారచిత్తే స్మితముఖి సుభగే జృంభిణి స్తంభవిద్యే |
మోహే ముగ్ధప్రవాహే కురు మమ విమతిధ్వాంతవిధ్వంసమీడే
గీర్గౌర్వాగ్భారతి త్వం కవివరరసనాసిద్ధిదే సిద్ధిసాధ్యే   9  

స్తౌమి త్వాం త్వాం చ వందే మమ ఖలు రసనాం నో కదాచిత్త్యజేథా
మా మే బుద్ధిర్విరుద్ధా భవతు న చ మనో దేవి మే యాతు పాపమ్ |
మా మే దుఃఖం కదాచిత్క్వచిదపి విషయేఽప్యస్తు మే నాకులత్వం
శాస్త్రే వాదే కవిత్వే ప్రసరతు మమ ధీర్మాస్తు కుంఠా కదాపి   10  

ఇత్యేతైః శ్లోకముఖ్యైః ప్రతిదినముషసి స్తౌతి యో భక్తినమ్రో
వాణీ వాచస్పతేరప్యవిదితవిభవో వాక్పటుర్మృష్టకంఠః |
సః స్యాదిష్టాద్యర్థలాభైః సుతమివ సతతం పాతితం సా చ దేవీ
సౌభాగ్యం తస్య లోకే ప్రభవతి కవితా విఘ్నమస్తం వ్రయాతి   11  

నిర్విఘ్నం తస్య విద్యా ప్రభవతి సతతం చాశ్రుతగ్రంథబోధః
కీర్తిస్రైలోక్యమధ్యే నివసతి వదనే శారదా తస్య సాక్షాత్ |
దీర్ఘాయుర్లోకపూజ్యః సకలగుణనిధిః సంతతం రాజమాన్యో
వాగ్దేవ్యాః సమ్ప్రసాదాత్త్రిజగతి విజయీ జాయతే సత్సభాసు   12  

బ్రహ్మచారీ వ్రతీ మౌనీ త్రయోదశ్యాం నిరామిషః |
సారస్వతో జనః పాఠాత్సకృదిష్టార్థలాభవాన్   13  

పక్షద్వయే త్రయోదశ్యామేకవింశతిసంఖ్యయా |
అవిచ్ఛిన్నః పఠేద్ధీమాంధ్యాత్వా దేవీం సరస్వతీమ్   14  

సర్వపాపవినిర్ముక్తః సుభగో లోకవిశ్రుతః |
వాంఛితం ఫలమాప్నోతి లోకేఽస్మిన్నాత్ర సంశయః   5  

బ్రహ్మణేతి స్వయం ప్రోక్తం సరస్వత్యాః స్తవం శుభమ్ |
ప్రయత్నేన పఠేన్నిత్యం సోఽమృతత్వాయ కల్పతే   16  

ఇతి శ్రీసరస్వతీ స్తోత్రమ్ |

*శ్రీ పంచమి* ప్రాంజలి ప్రభ
            *మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లు*

           *జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి*.

 *యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు*.

                   *యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి*.

        *శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:*

*మాఘ శుక్ల పంచమ్యాం*

 *విద్యారంభే దినేపి చ*

*పూర్వేహ్ని సమయం కృత్యా*

*తత్రాహ్న సంయుతః రుచిః ॥*

                   *వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి*.

             *చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం*.

    *పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా గోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది*.

           *సరస్వతీ కటాక్షం:*

 *బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు*.

*గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు*.

     *సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు*.

 *వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసాడని పురాణాలు చెబుతున్నాయి*.

  *అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి*.

  *తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు*.

మాతృశ్రీ వందన పుష్పాలు 

మోహముతో ఆకార్షణ కల్పించి
మొనముతో ఆదర్శము చూపించి
హాస్యముతో ఆనందము కల్పించి 
వేదముతో  వాక్కందము చూపించె

పూజకే సౌభాగ్య సంపదలు అందించి
మాటకే కారుణ్య భావములు కల్పించి
నిత్యమూ సద్బుద్ధి కల్పనలు కల్పించి
ధైర్యమూ సౌఖ్యము శక్తియును కల్పించె

మన్మధుడు ఆవహించి రతిని ప్రొద్భవించిన
తన్మయము చెంది వచ్చి పతిని తృప్తిపర్చిన
విస్మయము తెల్పి మంచి చేసియు మభ్యపర్చిన
సంఘమును బాగు చేసె తల్లిగ ఉద్భవించుట

స్త్రీ పురుష భేదము చూపక సమస్తము కాపాడి
మంచి చెడు చూడక నిత్యము నిమిత్తము కాపాడి
వచ్చిపొవు వారల సౌఖ్యము సమస్యను కాపాడి
సేవ సహ వాసము బలిమిని తల్లిగ కాపాడె


లలితా సహస్రనామాలలో ప్రస్తుతము 1 నుండి 100 వరకు మరియు వాటి అర్థం

ప్రార్థన
చతుర్భుజే చంద్ర కలావతంసే
కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ
హస్తే నమస్తే జగదేక మాతః
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ,
చాల పెద్దమ్మ,సురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ
దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల
నుండెడి యమ్మ దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి
యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

ధ్యానమ్
*అరుణాం కరుణా తరంగితాక్షీం
ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్
*అణిమాదిభిరావృతాం మయూఖై
రహమిత్యేవ విభావయే భవానిమ్
*ధ్యాయేత్ పద్మాసనస్థాo వికసితవదనాం
పద్మపత్రాయతాక్ష్మీం
* హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధెమ
పద్మాం వరాంగీమ్
* సర్వాలంకారయుక్తాం సకల మభయదాం
భక్తనమ్రాం భవానీం
* శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం
సర్వసంపత్ప్ర దాత్రీమ్
సకుంకుమవిలేపనా మళికచుంబి కస్తూరికాం
సమంద హసితేక్షణాo సశరచాప పాశాంకుశాం
అశేషజనమోహినీ మరుణమాల్యభుషోజ్జ్వలాం
జపాకుసుమ భాసురాం జపవిదౌ స్మరేద్దమ్బికామ్

అనంతమైన భగవంతుని స్వరూపమును వర్ణించడానికిఉపాసించడానికి స్మరించడానికి సహస్రనామాలు చెప్పబడినవి. భగవంతుడు అనంతుడు. 'శతమనంతం భవతి'. నామము అంటే ఆ దేవత జ్ఞానము. ఇది ఉపనిషత్తు. ఈ సహస్ర నామ పారాయణము శివుని సంకల్ప శక్తిని ఉపాసించుట. మనిషికి ఎన్ని అవసరాలో అన్ని దేవతా రూపాలు. ఉదా: విధ్యకి సరస్వతి, ధనము కొరకు లక్ష్మి. లలిత అంటే లావణ్యము, లాలించేది మొదలగు అర్థములు చెప్పవచ్చు. లలిత ఉపాసన అంటే సౌందర్యమును ఉపాసించుట. లోకాతీత లావణ్యము లలిత. లోకాతీత లావణ్యముతో అన్ని లోకములయందు వ్యాపించి యున్నది, ప్రపంచానికి కారణమైనది పోషకమైనది, రక్షకమైనది అయిన అమ్మనే లలితాంబ

ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది) ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది

1. శ్రీమాతా:- మంగళకరమైన, శుభప్రథమైన తల్లి
2. శ్రీ మహారాజ్ఞి:- శుభకరమైన గొప్పదైన రాణి
3. శ్రీ మత్సిం హసనేశ్వరి:- శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
4. చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది
5. దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది
6. ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది
7. చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
8. రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
9. క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.
10. మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.

11. పంచతన్మాత్ర సాయకా : ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.
12. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
13. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా : సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
14. కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.
15. అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.
16. ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.
17. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.
18. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.
19. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది
20. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.

21. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.
22. తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.
23. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది
24. నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.
25. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.
26. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది
27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ - తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది
28. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా - చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.
29. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా - లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
30. కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా - పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.

31. కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా - బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.
32. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా - రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది.
33. కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ - కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది
34. నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ - బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.
35. లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా - కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది
36. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా - వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ గలది
37. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ - ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
38. రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా - రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది
39. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా - కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది
40. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా - మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.

41. ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా - ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
42. గూఢగుల్ఫా - నిండైన చీలమండలు గలది.
43. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా - తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.
44. నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా - గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.
45. పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా - పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.
46. శింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజా - ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.
47. మరాళీ మందగమనా - హంసవలె ఠీవి నడక కలిగినది.
48. మహాలావణ్య శేవధిః - అతిశయించిన అందమునకు గని లేదా నిధి
49. సర్వారుణా - సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
50. అనవద్యాంగీ - వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.

51. సర్వాభరణ భూషితా - సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
52. శివకామేశ్వరాంకస్థా - శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
53. శివా - వ్యక్తమైన శివుని రూపము కలది.
54. స్వాధీన వల్లభా - తనకు లోబడిన భర్త గలది.
55. సుమేరు శృంగమధ్యస్థా - మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.
56. శ్రీమన్నగర నాయికా - శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్ఠాత్రి.
57. చింతామణి గృహాంతఃస్థా - చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.
58. పంచబ్రహ్మాసనస్థితా - ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.
59.మహాపద్మాటవీ సంస్థా - మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉంది.
60. కదంబ వనవాసినీ - కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.

61. సుధాసాగర మధ్యస్థా - చక్కగా గుర్తించుకొని తనయందు ధరించి అవసరమైనపుడు వ్యక్తము చేయగలుగునది.
62. కామాక్షీ - అందమైన కన్నులు గలది.
63. కామదాయినీ - కోరికలను నెరవేర్చునది.
64. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.
65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.
66. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా - సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.
67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా - అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.
68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా - చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా - గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.
70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా - కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది

71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా - జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.
72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా - భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.
73. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా - నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.
74. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా - భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
75. మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా - మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.
76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా - విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా - కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.
79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.
80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.

81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.
82. కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరము గలది.
83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా - బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.
84. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.
85. శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.
86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.
87. శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.
88. మూలమంత్రాత్మికా - మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.
89. మూలకూట త్రయకళేబరా - మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.
90. కులమృతైక రసికా - కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.
91. కులసంకేత పాలినీ - కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.

92. కులాంగనా - కుల సంబంధమైన స్త్రీ.
93. కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.
94. కౌలినీ - కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.
95. కులయోగినీ - కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.
96. అకులా - అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.
97. సమయాంతఃస్థా - సమయాచార అంతర్వర్తిని.
98. సమయాచార తత్పరా - సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.
99. మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
100. బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది...
.

నేడు శ్రీ రామదాసు జయంతి....!!

కంచెర్ల గోపన్న రామభక్తునిగా మారిన తరువాత భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందాడు.

 ఖమ్మంజిల్లా నేలకొండపల్లి గ్రామంలో 1620 సంవత్సరంలో జన్మించాడు.

 తండ్రి లింగమూర్తి. తల్లి కామాంబ. దాశరధీశతకంతో సహా ఎన్నో రామకీర్తనలు రామదాసు అందించినవే. 

తెలుగులో కీర్తనలకు ఆద్యుడు రామదాసు అంటారు.

ఇతని గురువు రఘునాథభట్టాచార్యులు. గోపన్న మేనమామ మాదన్న గోల్కొండ నవాబు తానీషా ఆస్థానంలో ఒక ముఖ్యఉద్యోగి.

 ఇతని సిఫార్స్ వలన గోపన్న పాల్వంచ పరగణాకు తహసిల్దార్ గా నియమించబడ్డాడు.

 గోదావరి నదీతీరంలోని భధ్రాచలంకూడా ఈ పరగణాలోనిదే. అప్పటికి భద్రాచల రామాలయం పాడుపడిన స్థితిలో ఉంటుంది. 

పోకల దమ్మక్క అనే రామభక్తురాలు ఈ గుడిని పునరుద్దరించమని గోపన్నను కోరతుంది. 

గోపన్న దానికి అంగీకరిస్తాడు. ఆలయ నిర్మాణానికి తానీషాకు కట్టవలసి భూమిశిస్తు సొమ్మును వాడతాడు.

 ఈ విషయం తెలిసిన తానీషా ఆగ్రహంతో గోపన్నను ఖైదు చేస్తాడు. 12 సంవత్సరాలు జైలులో బాధలు పడతాడు గొపన్న. 

జైలుగది గోడల మీద సీతా రామలక్ష్మణులను చిత్రాలను గీసి వారిని గురించి గానం చేస్తూ కాలం గడుపుతాడు. 

ఈ సమయంలోనే ప్రసిద్ధ సంకీర్తనలు రచించాడు. వాటిలో కొన్ని

"నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి"
"పలుకే బంగారమాయెనా"
"అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి.
ఇంకా తన బాధను చెప్పుకున్న
"ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది-

"నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?" - అని వాపోయి మరలా -

 "ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు" - అని వేడుకొన్నాడు.

12 సంవత్సరాలు తరువాత, రామలక్ష్మణులు గోల్కొండ నవాబు తానీషా వద్దకు వెళ్ళి, గోపన్న బాకీపడ్డ ఆరు లక్షల వరహాల శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసును విడిపించటానికై పత్రము వ్రాయించుకున్నారని కథనం.

 వారిచ్చిన నాణెములను రామటంకాలు అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్రలు ఉన్నాయి.

 ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై కొంత భూమిని ఇచ్చారు.

ఇప్పటికి కూడా రామదాసుని ఖైదులో ఉంచిన గదిని గోల్కొండ కోటలో చూడవచ్చు.

శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పటి నుండి ప్రారంభమైంది తరువాత నుండి కంచర్ల గొపన్న భక్తరామదాసుగా పేరుపొందాడు.

 రామదాసు సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ భద్రాచల దేవస్థానములో భద్రపరచి ఉన్నాయి.

శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. 

త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు...స్వస్తి...

ప్రాంజలి ప్రభ

మాతృశ్రీ వందన పుష్పాలు  

పలుకు లన్నిమెత్తని ముద్దుల పనులు వేరు
ఫలములు సుందరంబులు రుచులువేరు 
కొడుకులు బుద్ధిమంతులు గుణములు వేరు 
మనసును పంచి బుద్ధులు సరిచెయు తల్లి 

సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు నిత్యం 
ఆటపాటలందు, ఆరోగ్యసహనంబు నిత్యం 
చెప్పుచేతలందు, విద్యాభోధనలందు నిత్యం 
మంచిచెడ్డలందు, సంతృప్తి పరిచేది తల్లే 

అతిథిజనుల వీడక, అభ్యాగతుల వీడక
ఆదిపురుషుల వీడక ఆదేవతలు వీడక
అన్నము సమము చేసియు నైవేద్యములు పెట్టియు 
ధర్మ నియమము తెల్సికొ సత్యమె జననీ కళ 

హంస బకము ఒకేరంగు ఉన్న గుణం వేరు 
గాజు మణియు ఒకే మెర్పు ఉన్న ధనంవేరు 
తెల్పు నలుపు ఒకే సారి అన్న పదం వేరు 
బుద్ధి మనసు ఒకే తీర్పు తల్లి తనం వేరు

జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
చక్కనమ్మ గలిగి, బాంధవ్యమును గల్గి,
విద్య తృప్తి గలిగి, ఆకర్షణ ను గల్గి, 
తప్పులెన్నొ చెసియు జీవించుటయు తప్పు 

త్యాగభావమున తరువులే గురువులు 
రాజకీయమున పదవులే గురువులు 
ప్రేమపాకమున పెదవులే గురువులు 
సేవ సాధనకు జనకులే గురువులు 

చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని చెలిమి మంచువోలె 
భార్యకాని చెలిమి చిచ్చువోలె 
భార్యాభర్త  బలిమి  మంచు వోలె 

మందమతులకెపుడు ఉండదు ముందుచూపు 
తిండిపరుల కెపుడు ఉండదు దాహ చూపు 
మొండి బతుకు ఎపుడు ఉండదు ఆశచూపు 
కాల మడుగు కెపుడు ఉండదు వెన్క చూపు 

పుష్పసౌరభంబు పొంద లేదు దారం
గంధవాసనంబు పొందలేదు భాష్పం 
మంచిమాటలన్ని పొందలేరు మూర్ఖం 
జీవ శక్తి తల్లి పొందలేదు సత్యం 

--(())--

ఆరోగ్యం బ్రహ్మ... ఆనందం బ్రహు.. ఆధ్యాత్మిక బ్రహ్మ
సేకరణ..మల్లాప్రగడ రామకృష్ణ
    *నీవే అదృష్టవంతుడివి*

        *50 ఏళ్ల పెద్దమనిషి తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు మరియు అతని భార్య మెడికల్ కౌన్సెలర్‌తో అపాయింట్‌మెంట్ తీసుకుంది.*
కౌన్సెలర్ తన కౌన్సెలింగ్ ప్రారంభించాడు. అతను కొన్ని వ్యక్తిగత విషయాలు అడిగాడు మరియు పెద్దమనిషి భార్యను బయట కూర్చోమని చెప్పాడు.
 పెద్దమనిషి మాట్లాడాడు...
 "నేను చాలా ఆందోళన చెందుతున్నాను ...
 ఇన్‌ఫాక్ట్‌లో నేను చింతలతో మునిగిపోయాను...!" ...... "ఉద్యోగ ఒత్తిడి... పిల్లల చదువులు మరియు ఉద్యోగ టెన్షన్‌లు... ఇంటి లోన్, కార్ లోన్..." ...... *"నేను విపరీతమైన డిప్రెషన్.."*
 అప్పుడు నేర్చుకున్న కౌన్సెలర్ ఏదో ఆలోచించి, "నువ్వు 10వ తరగతి ఏ స్కూల్లో చదివావు?" 
పెద్దమనిషి స్కూల్ పేరు చెప్పాడు.
కౌన్సెలర్ చెప్పారు:-
 *"మీరు ఆ పాఠశాలకు వెళ్లాలి. మీ పాఠశాల నుండి, మీరు మీ 'క్లాస్ X' రిజిస్టర్‌ని గుర్తించి, మీ తోటివారి పేర్లను వెతికి, వారి ప్రస్తుత క్షేమం గురించి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నించండి.*
 *సమాచారమంతా డైరీలో రాసి ఒక నెల తర్వాత నన్ను కలవండి."*
పెద్దమనిషి తన పాఠశాలకు వెళ్లి, రిజిస్టర్‌ని కనుగొని, దానిని కాపీ చేసుకున్నాడు.
 అందులో 120 మంది పేర్లు ఉన్నాయి. అతను ఒక నెలలో పగలు మరియు రాత్రి ప్రయత్నించాడు, కానీ 75-80 సహవిద్యార్థుల గురించి సమాచారాన్ని సేకరించలేకపోయాడు.
 *ఆశ్చర్యం!!!*
 *వారిలో 20 మంది చనిపోయారు...*
 *7 మంది వితంతువులు/వితంతువులు మరియు 13 మంది విడాకులు తీసుకున్నారు...*
 *10 మంది వ్యసనపరులుగా మారారు, వారి గురించి మాట్లాడటానికి కూడా విలువ లేదు...*
 *5 మంది చాలా పేలవంగా బయటకు వచ్చారు, వారికి ఎవరూ సమాధానం చెప్పలేరు..*
 *6 చాలా ధనవంతుడయ్యాడు, అతను నమ్మలేకపోయాడు...*
 *కొందరికి క్యాన్సర్, మరికొందరు పక్షవాతం, మధుమేహం, ఆస్తమా లేదా గుండె జబ్బులు..*
*ప్రమాదాలలో ఒక జంట చేయి/కాలు లేదా వెన్నుపాముకు గాయాలై మంచంలో ఉన్నారు...*
 *కొందరి పిల్లలు మతిస్థిమితం లేనివారు, విచ్చలవిడిగా లేదా పనికిరాని వారిగా మారారు...*
 *ఒకడు జైలులో ఉన్నాడు... రెండు విడాకుల తర్వాత ఒక వ్యక్తి మూడో పెళ్లి కోసం చూస్తున్నాడు...*
 ఒక నెలలో, పదవ తరగతి రిజిస్టర్ విధి యొక్క వేదనను వివరిస్తుంది ...
 *కౌన్సెలర్ అడిగాడు, "ఇప్పుడు చెప్పు నీ డిప్రెషన్ ఎలా ఉందో?"*
 పెద్దమనిషికి అర్థమైంది, 'ఆయనకు ఏ రోగం లేదు, ఆకలితో అలమటించలేదు, అతని మనస్సు పరిపూర్ణంగా ఉంది, అతను కోర్టు / పోలీసులు / లాయర్లచే పెంచబడలేదు, అతని భార్య మరియు పిల్లలు చాలా మంచి మరియు ఆరోగ్యంగా ఉన్నారు. అతను కూడా ఆరోగ్యంగా ఉన్నాడు...
 *ప్రపంచంలో నిజంగా చాలా దుఃఖం ఉందని, తాను చాలా సంతోషంగా మరియు అదృష్టవంతుడిని అని ఆ పెద్దమనిషి గ్రహించాడు.*
 *ఇతరుల ప్లేట్‌లను చూసే అలవాటును వదిలేయండి, మీ ప్లేట్‌లోని ఆహారాన్ని ప్రేమతో తీసుకోండి. ఇతరులతో పోల్చవద్దు. ప్రతి ఒక్కరికీ వారి స్వంత విధి ఉంటుంది.*
  ఇంకా, మీరు డిప్రెషన్‌లో ఉన్నారని అనుకుంటే, మీరు కూడా మీ పాఠశాలకు వెళ్లి, పదో తరగతి రిజిస్టర్‌ని తీసుకురావాలి.
సేకరణ: మానస సరోవరం
0 Comments

రసిక - మ/న/లగ UU UII IIU 8 అనుష్టుప్పు 121 
==
నీకై కోర్కెలు మదిలో 
నాకై రమ్మిట సకియా 
లోకమ్మంతయు మనదే 
నాకమ్మందున మనమే 
==
హేమంతమ్మునఁ జలిలో 
నీమాయన్ బడితినిగా 
కామాశ్లేషపు సుగమే 
ప్రేమాచ్ఛాదక మననా  
==
ఏకాంతమున నెలుఁగై 
ఆకాశమ్మున వెలుఁగై 
రాకాచంద్రుని కళయై 
రా కందోయికిఁ గలయై 
==
అక్షరసామ్య యతితో - 
==
శ్రీదేవీ - చెలువముతో 
నాదమ్మై - నగవులతో 
మోదమ్మై - పులకలతో 
వేదార్థా - వెలుఁగిడవా
==
మల్లారీ - మధురముగాఁ 
బిల్లంగో-వికి మది రం-
జిల్లంగాఁ - జెలువిడరా 
మెల్లంగా - మృదుతరమై 
==
రావోయీ - రసికుఁడ నీ 
రావాలే - రసభరితం  
బీవే నా - యిరవు గదా 
జీవమ్మా - చిఱునగవే 
==

*   పంచ' దంపతులు

ఈలోకంలో కోట్లాదికోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు.

1. మొదటివారు:- *గౌరీశంకరులు!

అర్థనారీశ్వరరూపం, తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత, ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం!కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

2. రెండవవారు:- *లక్ష్మీనారాయణులు!

 విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.

3. మూడవవారు:- *బ్రహ్మ సరస్వతుల జంట

బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా   ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య .. ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

4. నాల్గవవారు:- *ఛాయా సూర్యులు! 
సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది, ఛాయాదేవి. 

ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా పట్టుదలతో ఉంటాడో,
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

5. ఐదవవారు:- *రోహిణీ చంద్రులు

రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది, చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి, లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

******

॥ దత్త నామస్మరణ ॥ 🙏🏻🙏🏻

రచన::శ్రీ రంగావధూత
తెలుగు::రాజ్యలక్ష్మి శ్రీనివాస బొడ్డుపల్లి.

🌹శ్లోకం::- జ్ఞానం భక్తిః కర్మయోగశ్చ యోగః సర్వేప్యేతె దత్తధామ్ని ప్రలీనాః !
దత్తస్కంధే సర్వశాఖా మిలింతి మూలం తస్మాద్దత్తనామ స్మరాత్మన్ ॥

🌹భావం::- ఈ శ్లోకంలో పూజ్యశ్రీ రంగావధూత గారు భారతీయ సంస్కృతిలోని  అన్ని యోగాలకు, మార్గాలకు మూలం దత్తాత్రేయ స్వామి అని వివరిస్తున్నారు
మనం తరచూ చెట్టు మూలం పట్టుకోవటానికీ బదులు కొమ్ములు పట్టుకుంటాము. ఆ పట్టుకోవటంలో కూడా పొరపాటు చేస్తాము. భగవంతుని పొందేటందుకు జ్ఞాన, భక్తి, కర్మ, యోగా మార్గాలు వున్నాయి. గీతలో అర్జనుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, " ఏ దారిలో వెళ్ళాలి" అని. శ్రీ కృష్ణుడు అన్ని మార్గాలు ఉత్తమమైనవి అని, అన్ని భగవంతుని వైపు నడిపించేవని చెప్తాడు. రంగావధూత మహరాజ్ గారు ఇక్కడ ఒక చెట్టు ఉదాహరణగా తీసుకుని వివరించారు. చెట్టు కొమ్ముల…

నేటి ఆనందం 

మంత్రోపదేశం:

బడ్జెట్ తో  తెలుగు  రాష్ట్రాల కు సరియైన  కేటాయింపు లు లేవని కలత చెందిన  కొందరు  హిమాలయాల్లో  ఉన్న  ఓ స్వామీజీ ని ఆశ్రయించారు.

ఆయన అనుగ్రహించి ఈ.తెలుగు వారందరికీ  ఓ మంత్రోపదేశం చేశారు.

 ''డింక్కో నా రుమీ కంచ మీ''

ఈ మంత్రం ప్రతి ఒక్కరూ  ఒక లక్ష  జపం చేసుకోండి  2024 వరకు.

మరో ముఖ్య  మైన  మాట ఎట్టి పరిస్దితి లోనూ ఈ మంత్రం తిరగేసి చదవరాదు.

అలా చదివాక చేసే జపం పనిచేయదు.జాగ్రత్త సుమా!




 

ఓం శ్రీరామ - శ్రీ మాత్రేనమ:
నేటి సూక్తి : 
ధ్యానం అంటే శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని పక్కన పెట్టడమే.

చిరంజీవుడైన శివభక్తుడు మార్కండేయుడు
 ఫిబ్రవరి 4వ తేదీ శుక్రవారం మార్కండేయ జయంతి సందర్భంగా...

శివభక్తుల గురించి తల్చుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది. పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్నీ, అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలనీ పెంచేందుకు మార్కండేయుడి కథను ఆదర్శంగా చెబుతారు. ఈ  మాసాన ఆ మార్కండేయుని కథ మరొక్కసారి…

అనగనగా మృకండుడు అనే రుషి ఉండేవారు. మృకండుడు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు. వారికి పిల్లలు లేరు! సంతానభాగ్యం కోసం వారిద్దరూ వారణాశి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో… `మీకు తప్పకుండా పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను. కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా?` అని అడిగాడు. `వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేం, మాకు గుణవంతుడైన అల్పయుష్కుడే కావాలి` అని కోరుకున్నారు మృకండుని దంపతులు.
 
అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖలాంటి ఓ బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకలగుణాభిరాముడు! బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి మృకండుని ఆశ్రమానికి సప్తరుషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్షు తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తరుషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ, అతడిని నిరంతరం శివారాధన చేస్తూండమని సూచించాడు. అందరూ కలిసి, శివనామస్మరణ చేత అకాలమృత్యవు దరిచేరదని మార్కండేయునికి తెలియచేశారు.

పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒకపక్క అతని మృత్యుఘడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒకో నిమిషం గడిచేకొద్దీ మరింత జోరుగా సాగుతోంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయల్దేరారు యమభటులు. కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా! అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి, యమపాశాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు. `ఆ ధ్యానాన్ని ఆపి ఇవతలికి రా! నీ మృత్యువు సమీపించింది` అని హుంకరించాడు యముడు. కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు ఇవతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు.

ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి ఆస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదకీ, తన భక్తుని మీదకీ పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్కపెట్టున సంహరించాడు. ఆ సందర్భంలోనే శివునికి `కాలాంతకుడు` అనే బిరుడు వచ్చింది. అంటే కాలాన్ని/మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. కానీ యుముడే లేకపోతే ఈ లోకంలో చావుపుట్టుల జీవనచక్రం ముందుకు సాగేదెలా! అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు. అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదనీ, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదనీ హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు. ఈ ఘట్టం తమిళనాడులోని `తిరుక్కడయూర్‌` అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం. కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి. మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా, అష్టాదశ పురాణాలలో ఒకటైన `మార్కండేయ పురాణా`న్ని కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవీమాహాత్మ్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది.

🚩ఈరోజుప్రత్యేకత --ప్రాంజలిప్రభ 🚩

ప్రాంజలి ప్రభ..నేటి పద్యాలు.. నవరత్నాలు, 04-02-2023
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ

మనము రామానుజాచార్య మార్గ మెంచె
హిందువుల ఏక భక్తిగా హిమము నుంచె
వేయి వత్సర పండుగే వేల్పు నెంచె
బ్రాహ్మణ లు యజ్ఞము నుచేయ భక్తి నెంచె
పెద్ద విగ్రహప్రతిష్ట చేయ నెంచె ఈశ్వరా
*****
నిదుర పోవులే అలలన్ని నియమ మైన
మలుపు లుప్రేమ ఫలములు మనసు పైన
పూల కొరకు ఋతువులు లే పూజ కైన
ప్రతివిషయము విడ్డూరమే ప్రీతి యైన
పగలు రాత్రి యే నిలకడ ప్రేమ కథ లె ఈశ్వరా
****
గృడ్డిగా నమ్మటము వద్దు గుణము వుంచు
యోగ అభ్యాస విద్యతో యొచన పెంచు
వినయ మనసు స్వేచ్ఛ పలుకు నిత్య మెంచు
మనలొ కర్తవ్య ము స్థితి మాట నెంచు
పరిచయము కాని వక్తియే ప్రేమ పంచె ఈశ్వరా
*****
ఎవరి కైననూ కావాలి ఏమి యైన
చలి లొ వెచ్చని కౌగిలి జయము యైన
చీకటి నడక చూపేది వెలుగు యైన
చూపులతొ తోడు చీకటి వెలుగు యైన
అసలు సిసలు ఏమి అనక ఆశ తోడు ఈశ్వరా
****""""***
స్ధిరసుఖాసనం ధ్యానాన్కి సత్య నిధియె
వత్తిడి శరీర ధ్యాసయే వచ్చు మదియె
శ్వాస ఉత్సాస నిశ్చాస సరళ విధియె
తృప్తి భావ ప్రశాంతతే నిజము తిధియె
షరతు, స్త్రీ సుఖం అయిననూ సహజ ప్రేమ ఈశ్వరా
****"
కనబడని గాలి ప్రాణాన్ని కలసి నిలుపు
తెలియనిది ప్రేమ మనసుతో కలసి నిలుపు
తెలియకనె తీరు తాపమూ  తలపు వలపు
నీరు ఆవిరి మేఘమై నీరు కలుపు
నిప్పుతోకూడు బూడదై నేల చేరు ఈశ్వరా
****"
మూర్ఖ మనసుయే గంభీర్య మూస ఎపుడు
సజ్జన పలుకు చల్లగా సాగు ఎపుడు
స్త్రీ లు ఆడంబరముచట్టు తిరుగు ఎపుడు
వెతుకు సన్మార్గముయె దైవమేను ఎపుడు
మనిషి మనిషి కి గౌరవం మమత ప్రేమ ఈశ్వరా
"""*
దత్తపది.......జపాను, జర్మనీ,  జమైక, జాంబియ
ఇఛ్ఛ వల్లనే జనుల జపాను జయము  
జర్మని కళలు జనుల స్వచ్ఛతయె జయము    
స్నేహతొ జన జమైకయే సేవ జయము 
జాంబియ జనుల ప్రేమయే జాతి జయము  
****
సందేశవాక్యం 
లోకుల తప్పులెంచు మేధావులెందరో ?
తమ తప్పు తెల్సే జ్ఞానిలేడిలలో !

తప్పు లెంచు మేధావికే తపన పెరుగు 
తప్పు చేయని వాడైన తపన పెరుగు 
తప్పు తెలియక తప్పునే చేసి తిరుగు 
తప్పు తనదాక రాలేదు అనుచు పరుగు 
జ్ఞాని అజ్ఞాని తప్పుగమనించి బ్రతుకు ఈశ్వరా

ఆరోగ్యం బ్రహ్మ..ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ
మల్లాప్రగడ రామకృష్ణ 

 *వెంట రాని ఆస్తులు చూసి* *విర్రవీగకోయి!!*
 *కృశించుకుపోయే శరీరాన్ని చూసి**మురిసిపోకోయి!!*
*కడవరకు కలిసినడవని బంధాలకు* *బానిసవ్వకోయి!!*
 *పదవీ, హోదా ఉన్నాయని ఎగిరెగిరి* *పడకోయి!!*

 *తరిగిపోయే అందాన్ని చూసుకొని* *పొంగిపోకోయి!!*
*మంచితనమే శాశ్వతమనే సత్యాన్ని* *మరచిపోకోయి!!*
*కదిలిపోయే కాలంలో ఏది శాశ్వతం కాదని**తెలుసుకోవోయి!!*
 *మరణం అనివార్యమనే నిజాన్ని గ్రహించి* *మసలుకోవోయి!!*   

 *డబ్బులు ఉన్నాయని విర్రవీగి గబ్బు పనులు* *చేయకోయి!!*                                                              *విలువైన జీవితం గడపాలని విలువలు దిగజారి బతకకోయి!!*                                                          *ఉన్నదాంట్లో సాయం చేయడం మనిషితత్వమని*
*అర్ధం చేసుకోవోయి!!ధర్మాన్ని విస్మరించకోయి దరిద్రాన్ని మూటకట్టుకోకోయి!!                                    

దేవుని స్మరించవోయి ధన్యుడవు కావోయి!!

మాతృశ్రీ వందనం 
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ  

నాగుల మల్లెలు ప్రతికలవుతూ 
వాసన పుష్పాలు ప్రతిభలవుతూ 
వేసవి గాలులు ప్రగతి లవుతూ 
కాలపు గానము ప్రతిజ్ఞ లవుతూ 

విలువలు పెంచె నడవడి జగతికి
మనసును పంచె మగువకు గడబిడి 
తరుణము చూపి పలికెడి పలుకులు 
వినయము చూపి చిలికెడి చినుకులు 

తప్పక జరిపే కార్య నిర్వాహణకు 
ఒప్పియు కదిలే సౌర్య పరాక్రమము 
గోప్యమువలనే ఆర్యనిర్వాహణకు 
శాంతము తెలిపే మాతృశ్రీ నిర్ణయము 

ఉన్నచోటు ఉంటే విజ్ఞానం తెలియదు 
అన్నచోటు పోతే అజ్ఞానము తెలియదు 
కన్నచోటు పోతే గుర్తింపుయు తెలియదు 
మొన్ననేమి లేకే మర్యాదయు తెలియదు

--(())--

శ్లోకం::- దేవో దత్తో మర్త్యజన్మోపి దత్త స్తిర్యంగ్ దత్తః కీటకీటోపి దత్తః!
స్థాణుర్దత్తో జంగమో దత్త ఏవ సర్వో దత్తః సర్వరూపస్త్వరూపః ॥

భావం::- ఈ శ్లోకంలో పూజ్యశ్రీ రంగావధూత గారు చాలా ఆలోచనాత్మకంగా, సర్వవ్యాప్తమైన దత్తాత్రేయ నిరాకార తత్వాన్ని అనేక మార్గాలలో వివరించారు
దత్త స్వామికి ఆత్మ సమర్పణ చేసుకోవాలని వివరిస్తున్న స్వామి వారు, దత్తాత్రేయ స్వామి ఎలా వుంటారో బోధిస్తున్నారు. దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం. భగవతి అనసూయ తపస్సు ప్రభావంతో త్రిమూర్తులు  చిన్నపిల్లలయినారు. కుమారుడిని పోషించాలని వున్నదనే ప్రార్థన అంగీకరించిన త్రిమూర్తులు, స్వయంగా దత్తం అయినారు. ఈ విధంగా దేవుడే మానవాకారంలో జన్మించారు.  మనుషులలోను, పశు పక్ష్యాదులలోను, కీటకాలలోను, పర్వతాలలోను, అడవిలో తిరిగే జంతువులలోను పరమాత్మ వ్యాపించి వున్నాడు. ఈ ప్రపంచంలోని అన్ని నామ రూపాలలోనూ దాగి వున్నాడు. అన్నిటిలో ఆ భగవంతుని దివ్య శక్తి నిండి వుంది. చరాచర ప్రపంచంలో ఆయన లేని స్థానం లేదు. రంగావధూత గారు తమ దగ్గరకు వచ్చిన గంజాయి తాగే సన్యాసులలో కూడా మంచి చూశారు. ప్రతి ఒక్కరిలో కొన్ని మంచి లక్షణాలు వుంటాయి. దత్తాత్రేయ స్వామి పిల్లలలో, వేశ్యలలో, ఆకతాయి మనుషులలో మొదలగు వారిలో ఏదో ఒక మంచి చూశారు. వారిని తమ 24 మంది గురువులుగా అనుకున్నారు. 

ఈ శ్లోకం దానినే ధృవీకరిస్తున్నది. అందుకే మన దృష్టి మార్చుకుని, ఈ మాయ వెనుక ఉన్న పరబ్రహ్మను గుర్తించమని స్వామి వారు చెప్తున్నారు. మనము ఎటువంటి కర్మలు చేసినా సర్వత్రా వ్యాపించి వున్న ఆ పరబ్రహ్మ తప్పక చూస్తూవుంటాడు అనే దృష్టి అలవరచుకోవాలి. 

ఒకసారి ఇటువంటి దృష్టి అలవాటైతే సుఖశాంతులు లభిస్తాయి. ఈ విధంగా అనేక కోణాలనుంచి దత్తాత్రేయ నిరాకార తత్వాన్ని శ్రీ రంగావధూత గారు మనకు వివరిస్తున్నారు.

రచన:::శ్రీ రంగావధూత
తెలుగు::రాజ్యలక్ష్మి శ్రీనివాస బొడ్డుపల్లి.
*****
ఆరోగ్యం బ్రహ్మ... ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ

ఒకసారి ధర్మరాజు తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు.
కృష్ణా! మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా రావాలి. అన్నాడు. నాకు ఇక్కడ అనేక వ్యవహారాలతో తీరిక లేకుండా ఉంది రావడం కుదరదు. మీరు వెళ్ళండి అన్నాడు శ్రీకృష్ణుడు.
లేదు కృష్ణ నువ్ రావలసిందే అన్నాడు ధర్మరాజు. కుదరదంటే కుదరదు అన్నాడు శ్రీకృష్ణుడు. పట్టువదలకుండా అడుగుతూ ఉంటే.. సరే నేనైతే రావడం కుదరదు. నా ప్రతినిధిని పంపుతాను అంటే చేసేదిలేక ధర్మరాజు సరేనన్నాడు. 

వెంటనే శ్రీకృష్ణుడు ఓ సొరకాయ తెచ్చి దశర్మరాజుకి ఇచ్చి "ఇది స్వయంగా నేనే అనుకో. నాకు ఎలాంటి మర్యాదలు చేస్తావో అలాగే దీనికి చెయ్. ఏ తీర్థంలో మునిగినా దీన్ని కూడా పిలక వరకు మంచు. ఏ దేవతా దర్శనం చేసినా దీనికి చేయించు అని చెప్పి పంపాడు. అలాగేనని దానికి ఓ పల్లకీ ఏర్పాటు చేసి సకల లాంఛనాలతో ఊరేగిస్తూ తీసుకెళ్లాడు. తీర్థయాత్రలు అన్నీ తిప్పి తిరిగి శ్రీకృష్ణుడు వద్దకి ఆ సొరకాయ తీసుకొచ్చి శ్రీకృష్ణా ఇదిగో సొరకాయ. అని ఇచ్చాడు.. అప్పుడు శ్రీకృష్ణుడు

ధర్మరాజా! అన్ని తీర్థాలలో ముంచావా? ముంచాను. అన్ని దేవతా దర్శనాలు చేయించావా? చేయించాను. నాగోత్రం ప్రవర చెప్పావా? చెప్పాను. సరే.. తీర్థయాత్రలు చేసొచ్చాక సమరాధన చేయడం ఆనవాయితీ కనుక దీన్ని తీసుకెళ్లి కూర వండించి అందరికి ఆ భోజనాలలో పెట్టు అన్నాడు. అలాగేనని సొరకాయ తీసుకెళ్లి చక్కగా ముక్కలు కోసి కూర వండి అందరికీ భోజనం పెట్టాడు. ఒక్కముద్ద నోట్లో పెట్టుకున్నారో లేదో అందరూ వాంతులు చేసుకున్నారు. ధర్మరాజ ఏమిటి ఈ కూర ఇంత చేదుగా ఉంది. అనేసరికి ధర్మరాజుకి కంగారు పుట్టి శ్రీకృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకెళ్లి కృష్ణా! కొంప మునిగింది. సొరకాయ చేదుగా ఉందట. అందరూ వాంతులు చేసుకుంటున్నారు అన్నాడు.

ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. తెలుసా! తెలిసి ఎలా ఇచ్చావ్ కృష్ణ.  కాశి దర్శించి, గంగలో మునిగి, అనేక క్షేత్రాలను దర్శిస్తే చేదు పోతుందని అనుకున్నాను. పోలేదు అనేసరికి అవాక్కయ్యారు ధర్మరాజు.
అంతరార్థం! మనం ఎన్ని క్షేత్రాలు సందర్శించిన, అనేక తీర్థాలలో మునిగినా గుణం మారిందా లేదా అనేది గమనించాలి. గుణం మారనప్పుడు ఎన్ని తిరిగి ఏమి లాభం. అన్ని వృథానే. ప్రవచనాలు విన్నా, క్షేత్రాలు దర్శించిన, తీర్థాలు సేవించినా మనషి నడవడిక లో కొంతైనా మార్పు రావాలి, కనీసం ఆ మార్పుకోసం ఒక్క అడుగైనా పడాలి. ఆ మార్పు రానప్పుడు ఎన్ని క్షేత్రాలు తిరిగిన ఎందుకు. సమయం వృథా తప్ప.. 

"ఆత్మశుధ్ధిలేని ఆచారమదియేల 
భాండశుధ్ధిలేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా 
విశ్వదాభిరామ వినురవేమ"

🙏జై శ్రీమన్నారాయణ🙏

****

ఓకే చిన్న కధ 

అనగనగా ఓ రాముడు. అతని తమ్ముడు సోముడు. పెద్దాడికి ఆరేళ్ళు. సిన్నోడికి నాలుగేళ్ళు. వెరసి వారిద్దరి అల్లరికి మాత్రం పదేళ్ళు. సరే. ఓ పండగేదో తరుముకు వచ్చేసింది. పెద్దాడికి సరదా చేసుకోవాలనిపించి వాళ్ళమ్మ దగ్గర గునిసేడు. ఆవిడ అండికి సిఫార్సు చేసింది. (పెనిమిటులను అలాగే పిలవాలంట..గా) ఆయన మొదట ఠాఠ్ అన్నాడు. పిల్లాడు లంకించుకున్నాడు. వాడెందుకేడుస్తున్నాడో తెలియకపోయినా తనూ యాడవాలి కదా అనుకునీసి సోమడు కూడా గొంతు కలిపాడు. తిక్క రేగిన పెద్దాయన విసురుగా బైటకు పోయాడు. కాపీ అయినా తాగలేదే అనుకుంటూ అమ్మ పిల్లలిద్దరినీ గదమాయించి వంటింటోకి నడిచింది. 

అన్నదమ్ములిద్దరూ చేసేది లేక అప్పటికి ఏడుపాపేసి, చానెల్లో పడ్డారు. ఓ గంటా రెండు గటలు గడిచాక పిల్లను అన్నాలకు లేవమంది. లేవలేదు. తనే బొచ్చెలు(బౌల్సు) పట్టుకొచ్చింది. యట్టాగో ఇద్దరి నోళ్లలో చెరో చించా కూరింది. ఇంతలో తలుపు చప్పుడు. ఆగకుండా బెల్లు. గబగబ హాల్లోకి తలుపు తీసిన ఆమె విస్మయంగా  చూస్తూ అలాగే నిలబడిపోయింది. లోపలకు రానీవా అంటున్న నాన్న గొంతు వింటూనే స్పైడర్ మాన్ కంటే వేగంగా దూసుకు వచ్చేరు పిల్లలిద్దరూ... 

చేతిలో పెద్ద ప్యాకెటటుతో ఉస్సురంటూ లోపలకు అడుగు పెట్టాడు రాజుగారు(అన్నట్లూ సదరు అండి పేరే రాజు, అమ్మ పేరు రాణియే). ప్యాకెటుపైకి దూకపోయిన పిల్లలను బౌల్ ఖాళీ చేయాల్సిందేనంటూ గద్దించి భర్తకు మంచినీళ్ళివ్వడానికి లోపలకు నడిచిందావిడ. భోజనాలు పూర్తి కాగానే ఆయనే తొందర పెట్టాడు ప్యాకెట్ తెమ్మని. అంతా వరండాలోకి చేరారు. ఈసారి విస్తుబోవడం పిల్లల వంతయింది. 

ఎందుకటా.... 

ప్యాకెట్లో ఉన్నవి ఏకే ఫార్టీ సెవెనూ, ఉల్లిపాయలూ వగయిరాలే... 

సరే వాటినీ, అంతకు ముందెప్పుడో ఓ పదేను మాసాల కిందట చేసిన మతాబాలూ, ఆనాడే కాల్చగా మిగిలిన మతాబాలూ గట్రాలను కూడా కలిపి పెరట్లో నవారు మంచంపై దుప్పటి పరిచి వీటిని దానిపై పరిచి అంతా లోపలకు వెళ్లారు. అలా ఓ రెండ్రోజులు చేసారు. మరి చాలా పాతవి కదా అందుకూ... 

సరే. పండగొచ్చింది. అన్నీ పేలాయి. కానీ...కానీ...కానీ... 

వొహటి మాత్రం తుస్సు మంది. ఇహ మొదలూ... 

టపా కాయా టపా కాయా ఎందుకు ప్లలేదూ గడ్డి మోపు అడ్డమొచ్చింది... 

గడ్డి మోపా గడ్డిమోపా ఎందుకు అడ్డం వొచ్చావూ ఆవు తినలేదు అవా ఆవా ఎందుకు తినలేదూ... 

బా... మ్ ... మ ... పె ... ట్ ... ట ... లే ... దూ (పాపం నీర్సంగా ఉందాయే) బామ్మోయ్... 

ఛఠస్. వింటున్నాలే అరవబాక. అసలే తమ్ము ఏడుస్తుంటే సోమిగా ఎందుకురా ఏడుస్తున్నావూ...

ఉల్లిపాయలైపోయాయా... 

కాదూ, కు ..... క్క .... క .... రి .... చిం .... దీ... 

టామీ టామీ నీకేం పుట్టిందే వాడినెందుక్కరిచావూ... 

వాడికే పుట్టింది... 

నాకు తోక పుచ్చుకు లాగాడు యదవ...

హమ్మ...హుష్...(గమనిక... 

ఇందులోని నీతి మాత్రమే ప్రధానం. లాజిక్కులు వద్దని మనవి...) 

మరోమాట... 

ఇదేదో పాత కథకు పాలిషులా ఉందే అనుకుంటే మీ మాటే రైటూ... 

****

03-02-2022

 



03.1.2022 సాయంకాల సందేశము

శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము

కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|

కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్

ఐదవ అధ్యాయము-నాలుగవ భాగము

ధుంధుకారి ప్రేతత్వమును పొందుట - ఉద్ధరింపబడుట

సూర్యభగవానుడు ధుంధుకారి ప్రేతత్వ విముక్తికి శ్రీమద్భాగవత సప్తాహశ్రవణము అత్యంత ఉత్తమ సాధనమని చెప్పగా, గోకర్ణుడు అసంఖ్యాకమైన శ్రోతల నడుమ ధుంధుకారి ప్రేతమగుటచే వాయురూపమున వెదురు కణుపులలో కూర్చొనగా శ్రీమద్భాగవతమును ఏడు దినములు ప్రవచించగా ధుంధుకారి ప్రేతత్వ విముక్తుడాయెను ఇది మనం చదివాము.

ఈ లోకమునందు సప్తాహశ్రవణము చేయుటవలన భగవంతుని కరుణ శీఘ్రముగా ప్రాప్తించి సమస్తపాపములు తొలగును. భగవత్కథా శ్రవణమునకు దూరముగా ఉండువారు, నీటిలో పుట్టిన బుడగలవలె, జీవులలో జన్మించిన దోమలవలె కేవలము మరణించుటకే జన్మించిన వారగుదురు. భాగవతకథా శ్రవణము యొక్క ప్రభావమువలన జడములైన ఎండిన వెదురు కర్రలయొక్క కణుపులు పగిలిపోయినవి. అయినప్పుడు తత్ప్రభావము చేత చిత్తముయొక్క కణుపులు  తెరుచుకొనుననుట ఏమంత వింతకాదు కదా! సప్తాహశ్రవణము చేయుటవలన మానవుని హృదయగ్రంథులు విడిపోవును. అతని సమస్త సంశయములు పటాపంచలైపోవును. అతని కర్మలన్నియును నశించును.

ఈ భాగవతకథా రూపమైన తీర్థజలము సంసారమనెడి బురదపూతను కడిగివేయుటలో సమర్థమైనది. మనిషి చిత్తమునందు ఇది స్థిరముగా ఉన్నయెడల, అతనికి నిశ్చయముగా ముక్తి లభించి తీరునని విద్వాంసులు వక్కాణించుచుండిరి. ధుంధుకారి ఈ రీతిగా విషయములను అన్నింటిని తెలుపుచుండెను. ఇంతలో వైకుంఠవాసులగు పార్షదులతో కూడిన ఒక విమానము అతని కొరకై వచ్చి దిగెను. ఆ విమానము యొక్క కాంతులు ధగధగ మెరయుచు వలయాకారముగా వ్యాపించుచుండెను. అందరూ చూచు చుండగా ధుంధులీ కుమారుడైన ధుంధుకారి (ఎన్నో పాపములు చేసి ప్రేతత్వమంది, శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణముతో ప్రేతత్వ విముక్తుడై) ఆ విమానమునెక్కెను. ఆ విమానము నందున్న గోకర్ణుడు ఇట్లు నుడివెను-

గోకర్ణుడు అడిగెను - భగవంతునికి ప్రియమైన పార్షదులారా! ఇక్కడ నిర్మల చిత్తము గలిగిన మా శ్రోతలు ఎందరో ఉన్నారు. వారందరి కొరకు కావలసినన్ని విమానములను ఒకేసారి తీసికొని రాలేదెందుకు? నిజమునకు ఇచటగల వారందరు సమానముగనే శ్రీమద్భాగవతకథను శ్రవణము చేసినారనుట స్పష్టము. కాని, ఫలితమునందు ఈ విధమగు భేదము ఎందుకు కలిగినట్లు? ఇది మాకు తెలుపుడు.

భగవత్సేవకులు చెప్పిరి - మహాత్మా వినుటయందు గల భేదము వలననే దాని ఫలితమునందు భేదము యేర్పడినది. శ్రోతలందరును సమానముగనే వినియున్నారు. కాని, వీరందరు వినినదానిని ఒకే విధముగ చింతనము చేయలేదు. కావున, అందరు కలిసి సేవించినప్పటికిని వారికి లభించు ఫలమునందు భేదము కలిగినది. ఈ ప్రేతము ఏడు దినములు ఉపవాసము చేసి చక్కగా శ్రవణము చేసినది. వినిన కథాంశమును స్థిరచిత్తముతో పూర్తిగా మననముతో పాటుగా నిధిధ్యాసను కూడ నేరవేర్చు చుండెను. జ్ఞానము దృఢము కాకపోయినచో, అది వ్యర్థమగును. ఏమరుపాటుచేత శ్రవణము చేయనియెడల వినిస దంతయునూ గాలిలో కలసిపోవును. మంత్రమునందు సందేహము ఏర్పడినచో వినిసదంతయు నష్టమైపోవును. చిత్తచాంచల్యముతో చేసిన జపము బూడిదలో పోసిన పన్నీరుగా మారును. భక్తులు లేని దేశము, అపాత్రునకు పెట్టిన శ్రాద్ధభోజనము, శ్రోత్రియులు కానివారికిచ్చిన దానము, ఆచారములేని కులము వ్యర్థములుగా తెలియవలెను. గురువు చెప్పిన మాటలయందు దృఢవిశ్వాసమును కలిగి యుండవలెను. వినయభావమును పెంచుకొనవలెను. మనసునందలి దోషములమీద విజయమును సాధించవలెను. కథాశ్రవణము నందు చిత్తముయొక్క ఏకాగ్రత కుదురుకొనవలెను. ఇట్టి నియమములు పాటించినయెడల కథాశ్రవణము యొక్క అచ్ఛమైన ఫలము దానంతటదే లభించి తీరును. అందువలన ఈ శ్రోతలు అందరును మరల ఒకసారి శ్రీమద్భాగవతకథను వినినచో, నిశ్చయముగా వీరందరికి వైకుంఠవాసము లభించును. ఇంకను, గోకర్ణా! గోవిందుడే స్వయముగా విచ్చేసి, నిన్ను గోలోకధామమునకు తీసికొని వెళ్ళును. అని ఈ విధముగా చెప్పి పార్షదులందరూ శ్రీహరిని కీర్తించుచూ, వైకుంఠమునకు వెళ్ళిపోయిరి. శ్రావణమాసము నందు గోకర్ణుడు మరల అదేవిధముగా సప్తాహక్రమముతో భాగవతకథను వినిపించెను. ఆ శ్రోతలందరూ రెండవసారి ఆ కథను శ్రద్ధగా వినిరి.

నారద మహర్షీ! ఈ కథ సమాప్తమగునపుడు అచట జరిగినదానిని మీరు వినగలరు. భక్తులతో నిండిన విమానములతో భగవంతుడు అక్కడ ప్రత్యక్షమాయెను. అన్ని వైపులనుండి జయజయ ధ్వనులు, నమస్కార శబ్దములు మారుమ్రోగసాగెను. శ్రీహరి మిగుల సంతసించి, స్వయముగా తన పాంచజన్య శంఖమును పూరించెను. వెంటనే ఆయన గోకర్ణుని బిగ్గరగా కౌగలించుకొని అతనికి తనవంటి స్వరూపముసు ప్రసాదించెను. అప్పుడా హరి ఒకే ఒక్క క్షణములో ఇతర శ్రోతలనందరినీ మేఘసమానమగు శ్యామవర్ణులుగా,పీతాంబరములను ధరించిన వారిగా, కిరీటములతోడను, కుండలములతోడను అలంకరింపజేసెను. గోకర్ణుని దయవలన ఆ గ్రామమునందుగల కుక్కలు, చండాలురు మొదలగు జీవులందరిని విమానములలోనికి ఎక్కించిరి. వారందరును యోగి జనులు చేరుకొనెడి భగవంతుని ధామమునకు పంపబడిరి. ఈ రీతిగా భక్తవత్సలుడైన శ్రీకృష్ణభగవానుని కథాశ్రవణముచేత ప్రసన్నుడై గోకర్ణుని వెంటనిడుకొని తన గోపబాలురకు ప్రియమైన గోలోకధామమునకు వెళ్ళిపోయెను. పూర్వము అయోధ్యవాసులందరు శ్రీరామచంద్రప్రభువువెంట సాకేత ధామమునకు చేరుకొనిరి. అటులనే గోకర్ణునితో పాటుగా అతని గ్రామవాసులందరిని శ్రీకృష్ణభగవానుడు యోగులకు దుర్లభమైన గోలోకధామమునకు చేర్చెను. సూర్యచంద్రులకు, సిద్ధపురుషులకు కూడ అంత సులభముగా లభ్యముకానట్టి లోకమునకు శ్రీమద్భాగవతకథాశ్రవణము చేయుటవలన వీరందరు చేరుకొనిరి. 

నారదమునీంద్రా! సప్తాహయజ్ఞము ద్వారా భాగవత కథను వినటవలన ఉజ్జ్వలమైన ఫలరాశి సమకూరును.దీనిని గూర్చి మేము నీకు ఇంకేమని చెప్పగలము? ఆర్యా! కర్ణపుటములచేత గోకర్ణుని కథయందలి ఒక్క అక్షరమైనను పానము చేయగలిగిన వారలు, తిరిగి తల్లికడుపున పుట్టనేలేదు.

గాలి, నీరు, ఆకులను ఆహారముగా స్వీకరించి శరీరమును శుష్కింపచేయయుటవలన గాని, ఎంతోకాలము వరకు భయంకరమగు తపస్సు చేయుటవలనగాని యోగాభ్యాసము చేయుటవలనగాని పొందలేని గతిని - పరంధామప్రాప్తిని సప్తాహశ్రవణము వలన మానవులు సహజముగనే పొందెదరు. 

చిత్రకూటమునందు విరాజమానుడైన శాండిల్య మునీంద్రుడు కూడ ఈ పరమ పవిత్రమైన భాగవతమును పఠించుచుండును. తద్ద్వారా ఆయన బ్రహ్మాండమున నోలలాడుచుండును.

ఈ కథ పరమ పవిత్రమైనది. ఒక్కమారు వినినంతనే ఇది సమస్త పాపరాశిని భస్మమొనర్చును. శ్రాద్ధసమయమునందు దీనిని పఠించినయెడల పితృదేవతలకు తృప్తి కలుగును. ఇక నిత్యము చక్కగా పఠించినచో మోక్షము లభించును.

ఇది శ్రీపద్మపురాణముయొక్క ఉత్తరఖండము నందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందలి ఐదవ అధ్యాయము సంపూర్ణము

శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

*****
ఆరోగ్యం బ్రహ్మ.. ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ
03-02-2023
💐💐💐#గండకీనది_చరిత్ర 💐💐💐
గండకీ అనే వేశ్య గర్భంలోనే మహావిష్ణువు పుడతాడు, ఆమెతో ఒక్కరాత్రి గడిపితే చాలు అనుకునేవారు..!!
సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఊరి పేరు కాదు. గ్రామం అస్సలే కాదు. విష్ణువు ఆకారంలో ఉండే చిన్నచిన్న రాళ్లనే సాలి గ్రామం అంటూ ఉంటారు. వాటిపై విష్ణువు రూపం ఉటుంది. అయితే ఇవన్నీ కూడా ఒక్క నదిలోనే ఎక్కువగా దొరుకుతాయి. గండకి నది గర్భంలోనే ఇలాంటి రాళ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటిని చాలా మంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు. వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం.
గండకీ ఒక వేశ్య...
ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి. లోపల విష్ణువు కనపడతాడు. ఇంత ప్రత్యేకమైన సాలి గ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది. పూర్వం గండకీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకీ ఉండేది. గండకీ ఒక వేశ్య.
ఒక్కరాత్రి గడిపితే చాలు...
గండకీతో ఒక్కరాత్రి గడిపితే చాలు వాళ్ల తలరాతలు మారిపోయేవి. వాళ్ల అదృష్టాలు మారిపోయేవి. బాగా సంపన్నులుగా, గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలా మంది డబ్బు ఉన్న వాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకీ మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డ వాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది.
భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది.
తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించడమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా తట్టుకోలేకపోయేది.
మారువేషంలో బేరం కుదుర్చుకున్నాడు
గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఒక రోజు ముందు మారువేషంలో వెళ్లి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండికి కూడా అతను మంచి వాడిలాగా కనిపించాడు కాబట్టి ఒక రోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. తనకు ముందుగా భార్యలా స్నానం చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు.
సరే అని.. గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటినిండా పుండ్లు కనపడ్డాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధద్రవ్యాలను గండకి ఆయన్ని పూసింది. కొత్త బట్టలు తొడిగించింది.
పక్క మీదకు తీసుకెళ్తుంది...
తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమెనే తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజు అంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు.
చితిలోకి దూకుతుంది..
తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీసహగమనం చెయ్యడానికి సిద్ధం అవుతుంది. అందరూ అడ్డుకున్న కూడా వినదు. తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది.
విష్ణువునే గర్భానా పుట్టాలని కోరుకుంటుంది
అయితే మంటలు ఒక్కసారిగా మల్లె పూల మాదిరిగా మారుతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చింది అంటాడు. గండకీ సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏ వరం కావాలో కోరుకో గండకీ అంటాడు విష్ణు మూర్తి. గండకీ విష్ణువునే తన గర్భానా పుట్టాలని కోరుకుంటుంది. సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు.
గండకీ మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది సాలిగ్రామం, గండకీ కథ.
తులసి శాపం వలన సాలగ్రామం గా మారిన విష్ణువు గండకీకి ఇచ్చిన వరం వలన గండకి నదిలోకి సాలగ్రామ రూపంలో చేరతాడు..
****


మల్లాప్రగడ రామకృష్ణ..03-02-2022
 / ఆత్మాయణం:-
రాముడు = ఆత్మ 
సీత = శక్తి 
రావణుడు (పది తలలు) = మనస్సు (వెర్రితలలు/పరి పరి ఆలోచనలు)
హనుమంతుడు (వాయుపుత్రుడు) = శ్వాస 
విభీషణుడు = బుద్ధి 
👉 రాముడు, సీత కలిసి ఉంటే ఆనందం.
 【ఆత్మ, శక్తి కలిసి ఉంటే ఆనందం.】
👉 రావణాసురుడు వచ్చాడు, సీతను తీసుకెళ్ళిపోయాడు.
 【మనస్సు వచ్చింది, శక్తిని తీసుకెళ్ళి పోయింది.】
👉 హనుమంతుని సహాయంతో సీత జాడ తెలిసింది.
 【శ్వాస మీద ధ్యాస ద్వారా శక్తిని పొందవచ్చు అని తెలిసింది.】
👉  రాముడు, రావణాసురుని మధ్య యుద్ధం లంకలో.
【ఆత్మకు, మనస్సుకు యుద్ధం అంతర్ముఖంలో.】
👉 రావణుడికి ఒక తల తీస్తే ఇంకొక తల పుట్టుకు వస్తుంది.
【మనస్సులో ఒక ఆలోచనను తీసివేస్తే మరొక ఆలోచన గుర్తుకు వస్తుంది.】
👉 విభీషణుని సహాయంతో రావణాసురుని జయించెను.
 【బుద్ధి సహాయంతో మనస్సును  జయించవచ్చు.】
👉 సీత రాముని దగ్గరికి వచ్చింది పట్టాభిషేకం జరిగింది.
【శక్తి ఆత్మతో కలిసింది ఆనందంతో జీవిస్తాము.】
ఇది ప్రతి ఆత్మ యొక్క కథే. ఆత్మ శక్తితోనే ఉంటుంది. మనస్సు వల్ల శక్తిని కోల్పోతాము. సాధన ద్వారా కోల్పోయిన శక్తిని తెచ్చుకొని ఆనందంతో జీవిస్తాము.
దయచేసి తేలుగు భాషను బ్రతికించండి.. తెలుగులో అభిప్రాయం తెలుపండి
1 Comment

నేటి రాధాకృష్ణ సరసగీతం - 03-02-2022
ప్రాంజలి ప్రభ -- మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  
మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

ఎకసెక్కె ములు ఏల..ఏది ఎందాకనో
అందాక కులుకులే .. అరిగి నాను రాధా 
తైతక్క లాటలు.. తక్కువ అనగ లేను
విశ్వాస పలుకులు..విజయ మగును కృష్ణా 

మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 
నొప్పింత లేకుండ ..నొప్పింత రాకుండ
మనసునొప్పింపక..మనుగడగను రాధా 

ఆర్భాటములు లేవు..అంతరములు లేవు
ఆలుమగలు గాను బ్రతక వలెను కృష్ణా 
హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  

ప్రేమయే మనకిక.. ప్రేమయే శ్రధ్ధగా
శ్రద్ధకలిగెనేని .. శుభము మనకు రాధా 

సులభసాధ్యముప్రేమ...సుమధురమ్ముగ ప్రేమ
సర్వసృష్టికి సమయ మేను కృష్ణా 
హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  

వినుడునాదు పలుకు విశ్వసించు ము ప్రేమ
దెలియవచ్చెటి మేలు దెలుపు ప్రేమ రాధా 
అడిగిన తలపున..ఆదరముయు ప్రేమ
అలుకలేని సుఖము.. అందు ప్రేమ కృష్ణా 

మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  

మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా
*****
ఆరోగ్యం బ్రహ్మ...ఆనందం.. బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ
విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ..03-02-2023
అంతరాలు, ఓ చక్కని వ్యాసం :
*మధ్యతరగతి అంతరంగంలో ఆ  #అంతరం అలాగే ఉండిపోయింది!*
1) *చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం, కొంతమంది రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!* 
అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!
ఇప్పుడు పెద్దయ్యాక మనం కొనుక్కుని తినే టైంకి ఆ పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*
2) *చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే, కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు, అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగేవాళ్ళంకాదని!*   
పెద్దయ్యాక మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే వాళ్ళు కాటన్ కు దిగారు ఇప్పుడు, కాటన్ దుస్తుల ధరే ఎక్కువ ! 
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*
3) *చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే మోకాళ్ళ దగ్గర చినిగితే పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా #రఫ్ చేసి ఇస్తే మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!* 
పెద్దయ్యాక చూస్తే జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని ఫ్యాషన్ పేరుతో #అధికధరలకు కొంటున్నారు !
*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*
4) *ఓ వయసులో మనకు సైకిల్ కొనగలగడమే కష్టం, అదీ సాధించేసరికి వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు, మనం స్కూటర్ కొనే సమయానికి వాళ్ళు కార్లలో తిరిగేవారు, మనం కొంచెం ఎదిగి మారుతి 800 కొనే సమయానికి వాళ్ళు BMW ల్లో తిరిగారు, మనం రిటైర్మెంట్ వయసుకి  వచ్చిన కూడబెట్టుకున్న వాటితో  కొంచెం పెద్ద కారు కోనేసమయానికి వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!
*దాంతో ఇప్పటికి ఆ అంతరం
 అలాగే ఉండిపోయింది . .
                        **
ప్రతి దశలో ప్రతి సమయాన విభిన్న మనుషుల మధ్య స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.
*"ఆ అంతరం నిరంతరం" ఎప్పటికి ఉండి తీరుతుంది *
రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని మళ్ళీ రేపటిరోజున గతించిన  #ఇవాళ్టి గురించి చింతించేకంటే, ఇవాళ అందినదానితో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ రేపటి స్వాగతం పలకడం శ్రేయస్కరం.
*మన, మనవారి గురించి
కాలాన్ని వెచ్చిద్దాం
*మనం నవ్వుతూ ఉందాం*
 *జీవితం కూడా సంతోషంగా ఉంటుంది * 
🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

నేటి రాధాకృష్ణ సరసగీతం - ప్రాంజలి ప్రభ  
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 
మధుర క్షణాల్లో మాటలు అలికే 
గడిచిన ప్రతి క్షణము గమ్య మయ్యె 
ఉదయ భానుకర్తవ్యమే ఊత మయ్యె
కళ్ళ ముందట ఆయుధం కావ్య మయ్యె
చేష్ట లన్నియు నిజముయే చెంత కృష్ణా      

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే
ఆశల గొడుగు చేరకు ఆట లాగ  
ఆశ తలుపు తట్టకు నిరాశ యేగ 
అలసిన మనసు లో వేట లాగ
గెలుపు ఓటమి లాగానె గొలుసు రాధా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 
మధుర క్షణాల్లో మాటలు అలికే 

లాలి పాటతో కమ్మగా జాలి ఆట 
గాలి వాటమై బ్రతుకుయే కాలి బాట 
మాలి లాగానే జీవితం మేలి మాట 
రాలి పొయేటి ఆకుయే రవ్వ వెల్గు కృష్ణా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 

వెన్నెల కురిసే రాత్రుల్ని వేడు కొనుచు 
మంచు కప్పిన కాలము మనసు అనుచు  
తరువులకు ఉన్న పుష్పాలు తపన యనుచు  

లేత ఆకులు వలననే నీవు రాధా 
పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 

0




 

ఆరోగ్యం బ్రహ్మ..ఆనందం బ్రహ్మ.. ఆధ్యాత్మిక బ్రహ్మ

............అమృత వర్షం..........
     కవిత్వం అంటే  ఆషామాషీ వ్యవహారం కాదు.  అది ఉబుసుపోక దినుసు కాదు.
అది ఎంతో  విలువైనది. అందునా  సంప్రదాయ సిద్ధమైన  పద్య కవిత్వం  మరింత   ప్రశస్తమైనది.  
ఆ పద్య నిర్మాణం కూడ తీరికగా తనకు నచ్చిన రీతిలో తోచిన తీరులో  తనకు ఆహ్లాదంగా  ఉన్నప్పుడు తనంత తానుగా  చేయటం కాదు. ఆశువుగా  వేదిక మీద  అప్పటికప్పుడు చేయటం, తాననుకున్న  భావాలూ  పదాలూ కాక, ఎదుటివారు(పృచ్ఛకులు) కోరిన భావాలతో పదాలతో పద్యం కట్టటం, అన్ని పద్యాలనూ చివరికి ధారణ చేసి అందించటం  సామాన్యమైన విషయం కాదు. 
ఈ ప్రక్రియనే మనం అవధానం అంటున్నాం. తెలుగు భాషకే ప్రత్యేక మైన ఈ విద్య అష్టావధానం నుంచి  శతావధానంగా, సహస్రావధానంగా  వికాసం పొందింది.   ఎంద రెందరో ఈ రంగంలో అఖండ విజయం సాధించిన సన్నివేశాలు చూస్తున్నాం మనం.
అంతే కాదు. 
  
అలా  అవధానం  అటు అవధానికీ ఇటు సదస్యులకూ  కూడ ఆనందామృత వర్షమే.  
ఈ అంశాన్నే అవధాను లందరి పక్షాన  ప్రతినిథిగా  'మహా సహస్రావధాని',  పద్మశ్రీ గరికిపాటి  నరసింహారావు   ప్రసన్న గంభీర శైలిలో  ఒక అవధాన సభలో  ఆశువుగా వెల్లడించారు.  
________________________
శబ్దబ్రహ్మ ముపాస్య దైవము;
   స్వ విశ్వాసంబు పీఠంబు; ని
శ్శబ్దాంత ర్మథనమ్ము  మంత్ర
   మననాచారమ్ముగా; కౌముదీ 
సుబ్దీపంబులె అంధకార దళన
  జ్యోతుల్;   సహస్రార మం 
దబ్దక్రీడ వధాన విద్య యనగా; 
   ఆనందమే బ్రహ్మమౌ.
---------------------------------------
    అవధానం ఆట కాదు. అర్చన.  ఈ అర్చనలో  శబ్ద బ్రహ్మమే  ఉపాస్య దైవం.  అంటే  శబ్దాన్ని పరమాత్మగా దర్శిస్తూ చేసే  ఉపాసన. 
అర్చన చేసే సమయంలో  దేవతామూర్తికి ఒక ఆసనం ఏర్పాటు చేస్తారు.   తన ఆత్మ విశ్వాసమనే ఆసనంపై  శబ్ద బ్రహ్మను ప్రతిష్ఠించి ఉపాసన చేస్తాడు  అవధాని.  
మరి, ఏ మంత్రానుష్ఠానం చేస్తాడు? అంటే  అది పైకి కనిపించదు. వినిపించదు.  నిశ్శబ్దంగా లోలోపలే అంతర్మథనం రూపంలో జరుగుతుంది.  అవధాన అంశాలను అందమైన పద్యాలుగా తీర్చిదిద్దే  ప్రయత్నంలో అవధాని అంతరంగంలో నిశ్శబ్దంగా జరిగే మథనమే మంత్ర మననం. 
  తనలో అంతర్మథనం ఇంతగా జరుగుతున్నా,   చాల మామూలుగా నవ్వుతూ నవ్విస్తూ,  ఆ కవి అవధానం నిర్వహిస్తాడు. అలవోకగా  చిరునవ్వులు చిందిస్తూ  పద్యాలు అందిస్తాడు.  ఇది అంతర్మథనం కనుక, పైకి కనిపించదు.   నిశ్శబ్దంగా జరిగేది  కనుక, బయటికి వినిపించదు.  అవధాని పెదవులపై చిరునవ్వుల పువ్వులనే మనం చూస్తాం. కాని, లోపల జరుగుతున్న యజ్ఞాగ్ని మనకు కనిపించదు.  

ఏ అర్చన చేసినా సంప్రదాయం ప్రకారం  దీపారాధనతోనే కదా! ప్రారంభిస్తాం మనం. 
ఈ అర్చనలో ఏమిటా దీపం? ఒకటేమిటి?  పండితులు ఔనని తలఊపే వ్యాకరణ సమ్మతమైన పదాలే దీపాలు.  "సిద్ధాంత కౌముది" అనే సంస్కృత వ్యాకరణ గ్రంథ అధ్యయన ఫలంగా  స్ఫురించే  పదాలు.  ఆ పదాలను 'సుబంతాలు', 'తిఙంతాలు'
 
అంటారు వ్యాకరణ పరిభాషలో. ఆ దీపపు కాంతిలో  సాగుతుంది అవధాన  శబ్దబ్రహ్మోపాసన. 
ఫలితంగా వెలువడేది వట్టి మాటల కూర్పు అయిన పద్యం మాత్రమే కాదు.  అది అవధాని అనే  ఉపాసకుని సహస్రార కమలంలో కురిసే అమృతవర్షం. అప్పుడు కలిగే ఆనందం  బ్రహ్మానందంతో  సమానమైనది.  తనతో పాటు  సహృదయ సదస్యు లందరికీ ఈ ఆనందాన్ని పంచుతాడు అవధాని. 
====================
అవధానం అంటే శబ్దబ్రహ్మోపాసన అని ఇంత ప్రౌఢ సుందరంగా పలికిన మహా సహస్రావధానికి  ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
అశ్వధాటిని మించిన     ఆశుధాటి అతుల చతురోక్తులను మేటి హాస్యపేటి భారతీయత నెలకొన్న భవ్యవాటి ఘటికు డవధాన ఘనపాఠి గరికిపాటి.
అని 
పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారికినిండు మనసుతో అభినందనలూ అభివందనాలూ సమర్పిస్తూ...
       నమస్సులతో....
    మీ  మల్లాప్రగడ  శ్రీమన్నారాయణ మూర్తి.


నేటి రాధాకృష్ణ సరస గీతం 03-02-2023
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ   

రాధానీ కల ఇదిగా -కృష్ణానీ కల ఇదిగా రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 
నీ మాయన్ బడితినిగా  దాహమ్మున్ అడిగితిగాఁ నీ కాలమ్ ఇది కథగా   
దేహమ్మున్ వడి వడిగా 
రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా నీకై కోర్కెలు మదిగా ప్రేమమ్మేగ కథలుగా  నాకై తీర్పుగను మదిగా స్నేహమ్మే గ మనసుగా రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా లోకమ్మంతయు కనగా జీవంమ్మంతయు కలగా నాకంమ్మంతయు మనగా ప్రేమమ్మంతయు కళగా రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా ఏకాంతమ్ము న నెలగా శ్రీ కాంచమ్మును వలగా
శ్రీ శాంతమ్ముయు నెలగా  శ్రీ శాంతిత్వము వలగా
రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 
ప్రేమాచ్ఛాదక మనగా దేహత్యాగము అనగా 
ప్రోత్యాహమ్ముయు యనగా ఉచ్చాహమ్ము యు అనగా 
రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా 
రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా    
కృష్ణానీ కల ఇదిగా - రాధానీ కల ఇదిగా
కృష్ణా నీ తలపులుగా- రాధానీ వలపులుగా
ఆధారం: UU UII IIU
*****
నేటి రాధాకృష్ణ సరస గీతం- ప్రాంజలి ప్రభ
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ
02-02-2022

సానుకూలము ఇదియే
తనువునే సంగ్రహించు కృష్ణా --- 2
సామర్ధ్యము చూపావు లే
నీపై విశ్వాసమంది రాధా --- 2

చలిపులి పిలిచింది చర్మంబు పగిలింది
మంచునే కురిపించి మాటు వేసె రాధా

చల్లగాలి యె పెర్గి చపలచిత్తము ఆయె
మత్తును పెంచియు మమత కోరె కృష్ణా

కలలాయె బత్కు.. కలకాల మేలు.
కిలరావ మయ్యె కీర్తి బతుకే రాధ

విలలాప సేవ.వెలలాగ చిందు. .
వలలాగ జిక్కి వృధ్ధి బతుకే. కృష్ణా

చలిలోన వచ్చాను చక్కని చుక్కను
వెచ్చపర్చు మిపుడే వేగ మల్లె రాధా ---2

కౌగిలి అందించు కరములు బందించు
సౌఖ్యముయే నీకు సుఖము నాకు కృష్ణా ---2

అలకాయె నీవు అలనాడు మాట.
అందుకేది చెప్పి ప్రీతి బతుకే కృష్ణా

జలకాలు ఆడి.జిలికేను మేలు
చలిలాగ వేడు శాంతి బతుకే రాధా

మోదము లేదని మైకము లేదని
వినుము తీరు ఇదియు వింత కాదు కృష్ణా

ఖేదము లేదని భేదము లేదని
అన్నమాట ఇదియు ఆశ కాదు రాధా

గరికపైవొదిగాను విశ్రాంతి తీరు వేళ
మత్తుగావిని పించుము గాన లీల కృష్ణా

అణువణువు నిండిన ప్రణవం ఆత్ర హేళ
నువ్వు అడుగంట ని ప్రమ నమ్మె లీల రాధా

విలలాప సేవ వెలలాగ చిందు.
వలలాగ జిక్కి వృధ్ధి బతుకే కృష్ణా

చలిపులి పిలిచింది చర్మంబు పగిలింది
మంచునే కురిపించి మాటు వేసె రాధా

సానుకూలము ఇదియే
తనువునే సంగ్రహించు కృష్ణా --- 2
సామర్ధ్యము చూపావు లే
నీపై విశ్వాసమంది రాధా --- 2

***** See less
Co
02.01.2022 ప్రాంజలి ప్రభు.. ప్రాతఃకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఐదవ అధ్యాయము-మూడవ భాగము
ధుంధుకారి ప్రేతత్వమును పొందుట - ఉద్ధరింపబడుట
సూర్యనారాయణ భగవానుడు, ధుంధుకారి ప్రేతత్వ విముక్తికి శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణ సాధనవిధానమును గోకర్ణుని అభ్యర్ధనపై ఇంకను ఇట్లు చెప్పుచుండెను- "నాయనా! ప్రయత్న పూర్వకముగ శ్రీమద్భాగవత పారాయణము చేయుము. ఈ సాధనము మిగుల సులువైనదికదా!" అని అందరును ఈ మాటనే చెప్పిరి. కనుక, గోకర్ణుడు కూడ ఇందుకు తగినట్లుగా నిశ్చయించుకొని భాగవతకథను వినిపించుటకుగాను సంసిద్ధుడాయెను.
అంతట పట్టణముల నుండి, పల్లెల నుండి అసంఖ్యాకమగు ప్రజలు కథను వినుట కొరకు తరలి వచ్చిరి.ఇంకనూ చాలమంది కుంటివారు, గ్రుడ్డివారు, ముదుసలివారు, మందమతులు కూడ తమ తమ పాపములను నశింపజేసికొనుటకై అచటికి చేరుకొనిరి. ఈ విధముగా అచటకు చేరిన జనసమ్మర్ధమును గాంచి దేవతలకు కూడ ఆశ్చర్యము కలిగెను. గోకర్ణుడు వ్యాసపీఠమును అలంకరించి, కథను చెప్ఫసాగెను. అప్పుడచటకు ప్రేతరూపమున ఉన్న ధుంధుకారి కూడ చేరుకొనెను. తాను కూర్ఛొనుటకు ఇటునటు స్థలమును వెదుకసాగెను. ఇంతలో నిలువుగా నిలిపినట్టి ఏడు కణుపులు గలిగిన వెదురుకర్రమీద ఆ ప్రేతము దృష్టి నిలిచినది. అప్పుడా ప్రేతము వెదురుకర్ర మొదట్లో అనగా క్రిందనున్న రంధ్రమునందు జొచ్చి ఆ కథను వినుటకై అచట కూర్ఛొనెను. వాయురూపముతో ఉండుటవలన ఆ ప్రేతము బయట ఎక్కడను కుర్చుండలేకపోయెను. అందువలన వెదురు కర్రను ఆశ్రయించెను. గోకర్ణుడు విష్ణుభక్తుడగు బ్రాహ్మణుని ముఖ్యశ్రోతగా నియమించెను. ప్రథమస్కంధము నుండియే స్పష్టమైన కంఠధ్వనితో కథను వినిపించుటను ప్రారంభించెను. సాయంకాలము కథకు విశ్రాంతి నీయబడినది. అప్పుడొక అద్భుతము జరిగినది. సభాసదులందరు చూచుచుండగా ఆ వెదురుకర్రయొక్క మొదటి కణుపు పట-పట శబ్దము చేయుచు పగిలిపోయెను.
ఇదే విధముగ రెండవదినము సాయంత్రము రెండవ కణుపు పగిలి పోయెను. ఇటులే మూడవ దినము అదే సమయమునకు మూడవ కణుపు పగిలిపోయెను. ఇదే రీతిగ ఏడు దినములయందు ఏడు కణుపులు పగిలిపోయెను. పన్నెండు స్కంధములను వినుటచేత ధుంధుకారి వరుసగా ఏడు కణుపులను పగులగొట్టుకొని పవిత్రుడై, ప్రేతత్వమునుండి విముక్తుడాయెను. అంతట అతడు దివ్యరూపమును ధరించి అందరియెదుట నిలచెను. అతని శరీరము మేఘమువలె శ్యామవర్ణముతో నుండెను. అతడు పీతాంబరమును ధరించి, తులసీ మాలలచే శోభిల్లుచుండెను. శిరముపై ధరించిన మనోహరమైన కిరీటము, చెవులయందుగల కమనీయమైన కుండలములు మిలమిల మెరయుచుండెను.
అతడు వెంటనే తన సోదరుడైన గోకర్ణునకు నమస్కరించి అతనితో ఇట్లు పలికెను - సోదరా! నీవు దయతో నాకు ప్రేతత్వపు బాధలనుండి విముక్తిని కలిగించితివి. ప్రేత పీడను నశింపజేయునట్టి శ్రీమద్భాగవతకథ పవిత్రమైనది. శ్రీకృష్ణధామమునకు చేర్చునట్టి ఈ సప్తాహ పారాయణము మిగుల ధన్యమైనది. సప్తాహ శ్రవణము ప్రారంభింపబడినప్పుడు ఈ భాగవతకథ ఇప్పుడే శీఘ్రముగా మమ్ములను అంతమొందించునని సమస్తపాపములు గజగజ వణికి పోవుచుండును. తడిసినవి, ఎండినవి, చిన్నవి, పెద్దవియగు అన్ని రకములైన కట్టెలను నిప్పు కాల్చివేయును. అటులే ఈ సప్తాహశ్రవణము మనస్సుద్వారా, మాటలద్వారా, కర్మలద్వారా చేయబడిన అన్నివిధములైన పాపములను భస్మమొనర్చును. 
ఈ భారతదేశమందు శ్రీమద్భాగవతకథను ప్రతివాడు  వినవలయును. ఒకవేళ విననిచో, వాని జన్మము వ్యర్థమైనదేనని పండితులు, దేవతలు ఆ సభయందు ప్రకటించిరి. ఈ దేహము అనిత్యమైనది. దీనిపై మోహమును పెంచుకొనెదరు. దీనిని బాగుగా లాలించి, పోషించి, హృష్ట-పృష్టముగా, బలముగా తయారుచేయుట మంచిదే. కాని, శ్రీమద్భాగవతకథను శ్రవణము చేయకుండా ఏమి చేసిననూ, ఈ శరీరమువలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. అట్టి మనిషి జన్మము నిష్ఫలము. ఎముకలే ఈ శరీరమునకు ఆధారమైన స్తంభములు. రక్తనాళములు, నాడులు అను త్రాళ్ళచే ఇది బంధింపబడినది. వీటిపైనుండి రక్తము, మాంసములతో పైపూతగా నింపబడినది. ఆ పైన ఇది అంతయు చర్మముచే కప్పబడినది. ఇది పూర్తిగా దుర్గంధపూరితము. అంతేగాదు, మలమూత్రములతో కూడిన భాండము.
ఈ శరీరము వృద్ధాప్యముచేత దుర్గతినొందును. దుఃఖముచేత బాధింపబడును. ఇది రోగములకు పుట్టినిల్లు. ఎల్లకాలము ఏదో ఒక కోరికచే పీడింపబడుచుండును. దీనికెప్పటికి తృప్తి కలుగదు. ఈ శరీరమును ధరించియుండుట కూడా ఒక భారమే అగును. దీని రోమరోమమునందు దోషములే నిండియున్నవి. ఇకపోతే, ఇది కేవలము క్షణభంగురమైనది. క్షణములో ఇది మటుమాయమగును. అంత్యకాలమునందు దీనిని పాతిపెట్టినచో, ఇది క్రిములుగా మారును. ఏదేని పశువు భక్షించినచో, ఇది మలముగా మారిపోవును, అగ్మియందు కాల్చినచో, బూడిదకుప్పగా మార్పు చెందును. ఇట్టి మూడువిధములగు గుర్తులచేత శరీరముయొక్క స్థితి, గతులను గూర్చి స్పష్టముగా పేర్కొనబడినది. ఇంతటి అస్థిరమైన శరీరముద్వారా మానవులు శాశ్వతమైన ఫలమును ఒసగునట్టి ఉత్తమకార్యములను ఏల ఆచరింపకుందురోకదా? ఉదయము వండిన అన్నము సాయంత్రమునకు చెడిపోవును. అట్టి అన్నరసముతో పోషింపబడిన శరీరము శాశ్వతమెట్లగును?
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ,  ఆశుకవితాధురీణ
 6281190539
*****
*ఇది ఇది చదివిన తర్వాత దాచుకో కుండా, పంచుకోకుండా ఉండలేను😊🙏 
*వేటూరి విశ్వరూపం* 
ఈరోజు వేటూరి గారి జయంతి సందర్భంగా మనకోసం.....!
నీ సొగసు చూడ తరమా? ’-
                               ఐదో చరణం కధ  -

                             మేం 'మిస్టర్ పెళ్ళాం' ఫీచర్ ఫిలిం తీస్తున్న రోజులు. అది 14,డిశెంబరు 1992, మార్గశిర సోమవారం, ప్రఖ్యాత గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరామ్మూర్తిగారు అయ్యప్ప దీక్షలో, హైదరాబాదులో ఉన్నారు. నిర్మాణ సారధ్యం పూర్తిగా చేస్తున్న నేనేమో చెన్నైలో బాపుగారి దగ్గర వున్నా. మా సినిమాలో, ఓ సందర్భంలో, హీరోయిన్ని ఆటపట్టిస్తూ, హీరో చిలిపిగా పొగిడే ఓ పాటని, త్యాగరాజ కృతి "నీ సొగసు చూడ తరమా .." అనే పదాలను అనుపల్లవిగా పొదుగుతూ అందించడానికి ప్రయత్నించమని, ప్రముఖ గేయ రచయిత శ్రీ వేటూరిగారికి బాపూగారు సూచించారు. 

               అలా అడిగిన మర్నాడే ఆ పాటకి అద్భుతమైన ఓ నాలుగు చరణాలను వేటూరిగారు మాకు అందించారు. ఐతే ఐదో చరణాన్ని మాత్రం మరో మూడు రోజుల్లో అందిస్తానన్నారు. కానీ అలా జరగలేదు.  కానీ, అప్పటికే ఆ మొదటి నాలుగు చరణాలకి అద్వితీయ సంగీత దర్శకుడు శ్రీ యం.యం. కీరవాణిగారు మధురమైన ఓ ట్యూన్ కట్టేసి, రికార్డింగ్ కి సిద్ధమైపోయారు. 

                      Dec-18 తారీకున A-VMG స్టూడియోలో రికార్డింగ్ కాల్షీట్ కూడా కంఫర్మ్ చేసేసాను.  ఆ ఐదో చరణం మాత్రం ఇంకా అందకపోడంతో, నాకు కంగారు మొదలై హైదరాబాదుకి ఫోన్ చేసి, వేటూరిగారిని  కాంటాక్ట్ చేస్తే, తాను అదే మధ్యాన్నం ఫ్లయిట్ లో వస్తున్నాననీ, 3 గంటలకల్లా, చెన్నైలో దిగిన వెంటనే, డైరెక్ట్ గా AVM-Gకి వచ్చి, స్వయంగా తన ఐదో చరణాన్ని నాకు అందించడం ఖాయమని భరోసా ఇచ్చేశారు. వెంటనే బాపూగారికి ఆ విషయం చెప్పేశాను. దాంతో ఆయన, అంతకు ముందనుకున్నట్టు  కాల్షీటుని కాన్సిల్ చెయ్యకుండా రికార్డింగ్ స్టూడియోకి 2.30 pm కల్లా చేరుకున్నారు.

                        అప్పటికే మన బాలూగారు అక్కడికి వచ్చేసి, పాట రిహార్సల్స్ లో మునిగిపోడం మాకు కనిపించింది. బాపూగారు నావేపు చూసి, ఓసారి తన అరచేతిని నాకు చూపించారు. ఆ ఐదో చరణం సంగతేంటన్నది ఆయన ఉద్దేశమే ఐనా, అది నా చెంప ఛెళ్ళుమనిపించే ఓ లుక్ లా నాకనిపించి, బయటికి పారిపోయాను. మరో 20 నిమిషాల్లో, అయ్యప్ప దీక్ష దుస్తుల్లో వున్న వేటూరిగారు AVM_G కి చేరిపోయి నాకు ఓ టెన్షన్ తగ్గించి, మరో టెన్షన్లో పడేసారు.
 తన ఐదో చరణాన్ని ఇంకా రాయలేదన్నారు.

                     కాసేపట్లో రాసేసి, ఇచ్చేస్తానంటూ,  ఆరుబయట వున్న సిమెంట్ సోఫాలో కూర్చొని,నన్ను తన పక్కనే కూర్చోమంటూ, రాయడం మొదలెట్టారు. ఒక్కసారి తానొచ్చిన సంగతి బాపుగారికి చెప్పొస్తానంటే, ముందుకాదని, సరేనన్నారు. భయం భయంగా లోపలికెళ్ళిన నన్ను బాపూగారు ,"ఇప్పుడేంటీ కధా ?" అన్నట్టు చూడ్డంతో, "వేటూరిగారొచ్చేసి ఐదో చరణం రాస్తున్నా"రని చెప్పా.

                        "ఈసారి చరణాన్ని పంపించండి..చాలు !" అని తన ఫైల్ వేపు తల తిప్పుకున్నారు. మీకు తెలుసుగా... that is Bapu. ఐతే , ఆ ఐదో చరణం అంత సాధారణంగా పుట్టలేదు. దాదాపు ఓ చిన్న సైజు సాగర మథనం జరిగింది. అదెలాగంటే..
అదెలాగంటే..

                                నేను బాపుగారిని కలిసి తిరిగి రాగానే వేటూరిగారు ఐదో చరణాన్ని రాసి, పక్కన పెట్టేసి, ఇంకేదో రాస్తూ కనబడ్డారు. చిన్న సైగతో ఆయన అనుమతి తీసుకొని, ఆయన పక్కన పడేసిన కాయితాన్నందుకొని, ఆ ఐదో చరణాన్ని చదివాను:
 ' ఇల్లాలుగ అల్లాడిన ఆ రోజులలో, సఖికీ సుఖమే మిగిలిందిలే,    ఆఫీసుకి వెళ్ళొచ్చే ఈ రోజులలో, పతికీ బ్రతుకే తెలిసిందిలే,   చిగురాకులే సడి చేసినా, చిలకమ్మ వచ్చిందని,    ఎదతోడుగా ఎదురేగినా, నిదరొచ్చి వాలిందనీ,    త్యాగరాజ కృతిలో  సీతాకృతిగల ఇటువంటి
    సొగసు చూడ తరమా '

                                అది చదివిన నాకు, అమ్మో, అంతుందా! అనిపించింది. ఆనందం పట్టలేక ఒక్క గెంతేయాలనిపించింది. ఆ ఐదో చరణాన్ని తీసుకొని బాపూగారి దగ్గరికి లంఘించబోయాను. 
వెంటనే వేటూరిగారు నా చొక్కాపట్టుకొని వెనక్కిలాగి, నన్నక్కడే కూర్చోమన్నట్టు సైగచేసారు. అలా ఎందుకో నా కర్ఢం కాలేదు. నేనలా కూర్చోగానే, నా చేతిలోవున్న కాయితాన్ని లాగేసి, నలిపేసి, ఉండచుట్టి వెనక్కి పడేసారు. తను ఫ్రెష్ గా రాసిన మరో వెర్షన్ నా చేతికిచ్చి, మళ్ళీ రాసుకోడంలో మునిగిపోయారు. ఆ రెండో వెర్షన్ ఎలా సాగిందంటే….

' తెలి చీరల మరుమల్లెల ముస్తాబులలో, క్షణమే యుగమై గడిచేనులే,
 కడకొంగున తలవాల్చిన నారీమణికి, కనులా కలలే మిగిలేనులే,
 ఒకనాటి ఎడబాటులో, ఒరిగిందిలే వనితామణి,
వొడిదీపమే కొడిగట్టగా,కరిగింది కాంతామణీ..
                          "ఆహా, ఎంతద్భుతంగా వుందో  - లోపలికి తీసుకెళ్ళనాండీ ?"   అనడిగిన నావేపు  చిరు కోపంతో చూసి,   దాన్ని కూడా వెనక్కి లాక్కొని,  ఉండ చుట్టి వెనక్కి పారేసారాయన. నాకేమీ అర్ధం కాలేదు.

 ఓ చిర్నవ్వు నవ్వి, మళ్ళి రాయడంలో ఒదిగిపోయి,  మరో వెర్షన్ మరింత అద్భుతంగా సృష్టించి నాకు చూపించారు. దాని తీరెట్లు కొనసాగిందనగా...
' కౌగిళ్ళకు కట్నాలుగ దాచిన పరువం, కన్నీటికి కరిగిందొక కాటుక రేఖై,  వస్తాడని ముస్తాబులు చేసిన అందం, ఈనాటికి   మిగిలిందొక రాలిన పూవై,   పసిగాలిలో పతి ఊసులే వినిపించె విధి ఆటలో,    కడకొంగునే పడకిల్లుగా  గడిపింది ఎడబాటులో,  త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి  సొగసు చూడ తరమా...'
                                 
ఈ చరణం చూసిన నాకు, ఓ క్షణం గురువుగారి మనోవేదన పట్ల ధ్యాస పెరిగి,   ఆలోచనలో పడ్డాను. ‘అసలీయన ఏం చెప్పదల్చుకున్నారు, ఎందుకిలా మథన పడుతున్నారు…’ అనుకుంటూ పైకి చూస్తుండగా, దాన్ని కూడా ఆయన వెనక్కి లాగేసి, ఉండచుట్టి వెనక్కి పడేశారు.
 ‘మరో వెర్షన్ రాస్తాను, అలా కూర్చో’ అన్నట్టు నాకు సైగ చేసారు.

అవతల, పాట రికార్డింగ్ మొదలైందని, బాపుగారు ఐదో చరణం కోసం ఎదురు చూస్తున్నారనీ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి రహస్యంగా నాకు చెప్పి వెళ్ళిపోయాడు. నా గుండెల్లో బాంబు పేలినట్టవడం వేటూరి వారు గమనించారు. అంతే, వెంటనే ఆయన స్పీడందుకొని, మరో కొత్త చరణం రాసి నా చేతిలో పెట్టేసారు. అదెలా నర్తించిందనగా...

'రామలాలికి లేచిన పసిప్రాయం బరువై, రామపాదమే సోకని శిలకన్నా బరువై, రాముడికోసం కన్నుల ప్రాణాలే కొలువై, రామచిలక ముక్కుపుడక ముద్దులు కరువై, మల్లెపూలు నలుపన్నది మాపటి విరహం, వెన్నెలైన వేడన్నది మంచపు నరకం, పతిరాకకు ఎదురుచూపు పడతుల పరువం, నిట్టూర్పుకు పుట్టినిల్లు కదలని నిమిషం, త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి సొగసు చూడ తరమా...'

" ఇదెలావుంది, నిర్మొహమాటంగా చెప్పండి !" అంటూ స్వామి దాదాపు నన్ను శాసించారు. నిజం చెప్పొద్దూ, నాకెందుకో కొంచెం ఎక్కువైందనిపించి, నోరుజారి, ఆ మాటే ఆయనతో అన్నా. అంతే, ఠక్కున ఆ కాయితం కూడా లాగేసి, నలిపేసి, వెనక్కి పారేసారు. తమ ఐదో వెర్షన్ కి శ్రీకారం చుట్టారు. అంతలో మా రమణగారు స్టూడియోకి వచ్చి, కారు దిగి, మా దగ్గరికి రావడం, వేటూరిగారు తమ ఐదో చరణపు ఐదో వెర్షన్ ఆయనకి చూపడం, దాన్ని చూసిన రమణగారు 'అత్యద్భుతం మహప్రభో !' అంటూ ఓకే చెయ్యడం, నా మనసు కుదుటబడ్డం, అన్నీ ఒకే క్షణంలో జరిగిపోయాయి.
 ఇపుడా ఐదో వెర్షన్ ఎలా మెరిసిందనగా....

"సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి,  క్షణమే యుగమై, వేచీ వేచీ,  చలిపొంగులు చెలికోకల ముడిలో అదిమీ,  అలసీ, సొలసీ, కన్నులువాచీ, నిట్టూర్పులో, నిశిరాత్రిలో, నిదరోవు అందాలతో,
 త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి నీ సొగసు చూడ తరమా !"
        - అంతే,   దాన్ని తీసుకొని వాళ్ళిద్దరూ లోపలికెళ్ళగానే, నేను కాసేపాగి, వెనక్కి పారేయబడ్డ కాయితం ఉండలన్నీ ఏరుకొని, కళ్ళకద్దుకొని దాచుకున్నాను. (అందువల్లే ఇవాళ ఈ మధురాను భూతిని మీతో పంచుకోడం సాధ్యపడింది.) ఆ తర్వాత, మరో గంటలో శ్రీ బాలుగారి గళాన, ఖరహరప్రియ రాగంలో, మధురగాన సురభి శ్రీ యం.యం.కీరవాణిగారు స్వరపరచిన బాణీలో, ఆ ఐదో చరణం అత్యద్భుతంగా ప్రాణం పోసుకొంది. అది వింటుండగా నా కళ్ళవెంట జల జలా ఆనందాశ్రువులు రాలడం గమనించిన బాపూగారు, నన్ను కౌగలించుకొని ఉపశమింపజేసారు. వారందరి సమక్షంలో శ్రీ వేటూరి స్వామికి పాదాభివందనం చేసాక గానీ నా ఆవేదన చల్లారలేదు.
 ఓ సానబట్టిన వజ్రం లాంటి పాట పుట్టుక వెనక ఎంత మేథా మథనం జరుగుతుందో ఉటంకించడానికి, ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ దొరకడం అసాధ్యమేమో. 
That is VETURI . 
 ఆయనకి రజత కమలం రాడంలో ఆశ్చర్యమేముంది. అంతటి మహానుభావుణ్ణీ మన తెలుగువాడిగా పొందగలగడం మనమంతా చేసుకున్న అరుదైన అమూల్య అదృష్టం. కాదనగలరా?
 పాటల సిద్ధాంతి "వేటూరి" జయంతి!! గీత గీస్తే ప్రాణం పోసినట్టుండాలి!
గీతం రాస్తే పువ్వు పూసినట్టుండాలి! ఇది తిరుగు లేని సత్యం ఇందుకు "వేటూరే" సాక్ష్యం!
వేదనల్ని నేలలో నాటితే వెదురు పొదలై ప్రభవించాయి! వెదురు పొదల్ని ఊపిరితో మీటితే
వేటూరి పాటలై ప్రవహించాయి!!
ఆయన అక్షర తూణీరంలో... 'ఓంకార నాదానుసంధానమౌ గానా'లే కాదు 'ఓలమ్మీ తిక్కరేగిందా'లూ ఉంటాయి! 'రాలిపోయే పువ్వు'లే కాదు 'రగులుతోంది మొగలిపొద'లూ ఉంటాయి!

'ఆరేసుకోబోయి పారేసుకున్న'
అందం చందం ఊహకందాక 
ఓహో 'కందం' అనుకున్నాం!
రాలుపూల రాగపరాగాన్ని 
పాటగా మలచి, పాటను పక్షిని చేసి 
వాగర్ధాల రెక్కలు తొడిగిన
వాఙ్మయ సిద్దార్థుడు ఆయన!!
తెలుగు నుడికారం అలంకారమై 
పదపదాన మెరిసి ప్రేక్షకజన రంజకమై
ఆయన పాటల గుడికి ప్రాకారమైంది!
తెలుగు జాతీయం ఓంకారమై
ఆ కలాన ఒదిగి జాతీయపురస్కారమై
సినీ గేయ విజయానికి శ్రీకారం చుట్టింది!!
ప్రపంచ పర్యాటక స్థలాల్ని చూడడం టూరిజం!
ప్రపంచాన్ని పాటల్లో పట్టి చూపడం "వేటూరిజం"!!
.........ప్రాంజలి ప్రభ

***