Tuesday, 11 November 2025

రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -1*to 4




*రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -1*

మధుర దగ్గిర వున్న తిరుచులి గ్రామంలో 1879 డిశంబరు 30 తేదీన 'వెంకట్రామన్ పుట్టారు. ఆయనే తరవాత భగవాన్ రమణ మహర్షి అనే పేరుతో విశ్వ విఖ్యాతి పొందారు. ఆ రోజే ఆర్ధదర్శనం పుణ్యదినం.

వెంకట్రామన్ మధురలో మిషన్ హైస్కూల్ లో చదువుకుంటూ వుండగా, తన పదహారో ఏట, ఓసారి ఎవరో అరుణాచలం నించి వస్తున్నానని చెపుతూ వుండగా విన్నారు.. ఆ పేరు ఆ అబ్బాయిని ఏవో స్మృతులలో కలవరపెట్టింది.

పదిహేడో ఏట కొద్ది నిమిషాలలో అతనికి ఆత్మసాక్షాత్కారం జరిగింది, ఒకరోజు అతను ఒంటరిగా మేడమీద కూచుని వుండగా, మృత్యువు సంగతి గట్టిగా మనసులోకి వచ్చింది, చావు అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుని, 'ఇదే కదా చావు' అని, చచ్చిపోయినట్టు పడుకుని శ్వాస నాపేశాడు.

(రమణ మహర్షి భాల్య ఆలోచనా

*ప్రశ్నలపరంపరామది ప్రాభవమ్ము*
*మృత్యువు యనగాయేమన మృదువరమగు*
*కాల నిర్ణయంబట్టియు కళలు గాను*
*మృత శిశువుయెవరుయన మృత్యమాయ*

బాల్యంలో రమణ మహర్షికి “నేను ఎవరు?” “మరణం ఏమిటి?” అన్న ప్రశ్నలు కలిగాయి.
వీటి ద్వారా ఆయనకు మరణం అసలు భయంకరం కాదని, శరీరమే చస్తుందని, నిజమైన ఆత్మ నిత్యమని అర్ధమైంది.
ఈ ఆలోచనా వెలుగు ఆయన జీవితాన్ని పూర్తిగా మలిచింది.)
"సరే, ఈ దేహం చచ్చిపోయింది. దీన్ని కాల్చి బూడిద చేస్తారు. దాంతో నేను అంతమేనా? ''నేను'' ఇంకా తెలుస్తోనే వుంది. కనక నేను ఈ దేహం కాదు. నాకు మృత్యువు లేదు" అనుకునేప్పటికి అతని జ్ఞానోదయమయింది. ''నేను" అనేది మనసు ఆలోచనగాక, అది అనుభవమై పోయింది.

త్వరలోనే ఆయన ఎవరితోనూ చెప్పకండా అరుణాచలానికి బైలుదేరి, సరాసరి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి తన తండ్రి అరుణాచలేశ్వరుడి దర్శించుకున్నారు. ఆ నాటి నించి ఆమరణాంతమూ ఆయన అరుణాచలం వదలలేదు. మొదట ఆలయం లోనూ, తరువాత వివిధ ఏకాంత స్తలాల లోనూ, ఆయన సమాధిలో గడిపారు కొన్నేళ్లు.

(*గీ..*శివశివా అరుణాచల సీఘ్ర సేవ*
*బాల్య మౌనదీక్ష ఫలము బ్రహ్మ లీల*
*నిరతము జపము నిత్యము నిర్మలమ్ము*
*శంకరానను బ్రోవరా యని సహజ పూజ*
రమణ మహర్షి బాల్యంలోని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, అరుణాచల శివునితో ఆయన సహజమైన అనుబంధాన్ని సూచిస్తోంది. — చిన్న వయసులోనే అరుణాచలానికి, శివతత్వానికి అతడి మనసు ఎంతో వేగంగా, సహజంగా ఆకర్షితమైంది. — బాల్యంలో వచ్చిన మౌనప్రవృత్తి, అంతర్ముఖత, ధ్యాననిశ్శబ్దం అసలు బ్రహ్మలీల. దేవచైతన్యం అతనిలో సహజంగా వ్యక్తమైంది.
— అరుణాచల నామస్మరణ అతనిలో నిరంతరం నడిచేది. ఆ అంతరజపం అతని మనసును నిరంతరం పవిత్రంగా ఉంచేది.
— శివుణ్ణి “నన్ను రక్షించు” అనే యాచనలా కాకుండా, స్వయంగా శివతత్వమే తన లోనుండి వ్యక్తి — ఇది అతని నిత్య స్థితి.)
:****

త్వరలోనే ఆయన తల్లికి తెలిసివచ్చి ఇంటికి రమ్మని ఎంత ఏడ్చినా ఆయన కదల్లేదు. ఊళ్ళో ఆయన సంగతి తెలిసి, ఆయన ఉపదేశానికై మనుషులు వస్తున్నారు.

సేకరణ.. మల్లాప్రగడ
సశేషం

*రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -2*

1908 లో మహాకవి, పండితులు గణపతి శాస్త్రిగారు స్వామిని సందర్శించి, ఆయన సాక్షాత్తూ సర్వేశ్వరుడని తెలుసుకొని, ఆయననించి ఉపదేశాన్ని అడిగిపొందారు. ఆయనే వెంకట్రామన్ కి 'భగవాన్ రమణ మహర్షి ' అని పేరుపెట్టి ప్రకటించింది. ఆయన మూలంగానే భగవాన్ కీర్తి దేశమంతా వ్యాపించింది.

కవులు మహనీయులు కలసి కళకళకళ
స్థిరము ధనము కీర్తికలిగి సేవబోధ
పుస్తక రచన చేసియు పుడమి నందు
రోగ భాధ నిర్వాణము శోక మగుట
భావవ్యాఖ్య
– జ్ఞానులు, సాహితీవేత్తలు, సద్గురువులు కలిసి ఉన్న చోట
కళకళకళ – జ్ఞానోదయ కాంతి, ఆత్మానంద ప్రకాశం విరజిల్లుతుంది.
–అవరి ధనం భోగబలమో బంగారమో కాదు;
స్థిరమైన జ్ఞానం, సత్కీర్తి, సేవ భావం – ఇవే వారి సొత్తు.
–వారు రచించిన గ్రంథాలు ప్రపంచానికి మార్గదర్శకాలు.
–ఆ గ్రంథాల బోధ అమలు చేస్తేమనసు–బుద్ధుల రోగాలు తగ్గిశోకాలు, లోకవ్యథలు నశించిశాంతి–నిర్వాణ స్థితి సిద్ధిస్తుంది.

1916 లో భగవాన్ తల్లీ, తమ్ముడూ అరుణాచలం వచ్చి ఆయనతో పాటుగా స్తిరపడ్డారు. 1920 లో భగవాన్ తల్లి చనిపోయింది, ఆమె దేహాన్ని కొండమీద నించి తీసుకువచ్చి పాలితీర్థం దగ్గిర సమాధి చేశారు. త్వరలో భగవాన్, ఆయన తమ్ముడు చిన్నస్వామి, శిష్యులూ కొండ దిగి వచ్చి ఆ సమాధి దగ్గిరే స్తిరపడ్డారు. అప్పటి నించి లోకంలో అన్ని దేశాలలోనూ ప్రసిద్ధి కెక్కిన శ్రీ రమణా శ్రమం ప్రారంభమయింది.

ధనం కురిసింది, కీర్తి వ్యాపించింది. తీర్థ ప్రజలవలె దేశ దేశ ప్రజలు ఆయన్ని ప్రతి దినమూ దర్శించుకున్నారు. ఆయన రచించిన పుస్తకాలు ఎన్నో భాషల్లోకి తర్జుమాలైనాయి.

1950 ఏప్రిల్ 14 న రెండు సంవత్సరాలు గా ఆయన్ని బాధిస్తున్న సార్కోమా వల్ల ఆయన నిర్వాణం చెందారు.

రమణ మహర్షి మహాసమాధి (1950) పర్యంతము గురుభక్తి–జ్ఞానోత్కర్షను ఒక పద్యం

*కవులవీ మహనీయుల కలిసిన చోట కళకళంబు వెలుగురంగులన్*
*సేవధర్మము నిలిచిన స్థిరధనంబై కీర్తిసంపద ప్రసరిం చునున్*
*రచన రత్నములై పుడమి యందు రోగశోకాలను వీరే జయింతురన్*
*రమణమౌనమహర్షి రమ్యనిర్వాణ మార్గదీక్ష పతిమొందుగన్*
వరుస భావం
కవులు, జ్ఞానులు, మహనీయులు కలిసి ఉన్న స్థలంలో
జ్ఞానప్రకాశం, ఆత్మానంద వెలుగులు ఉట్టిపడతాయి.
వారి నిజమైన ధనమంటే సేవ, ధర్మం, సత్కీర్తి –
ఇవే వారికి స్థిరమైన సంపదగా ప్రపంచమంతా విస్తరిస్తాయి.
వారు రచించిన గ్రంథాలు రత్నాల్లా ప్రపంచాన్ని వెలిగించాయి;
మనుషుల దుఃఖాలు, రోగాలు, శోకాలు తొలగించే శక్తి వాటిలో ఉంది.
అటువంటి జ్ఞానసంపదలో శ్రేష్ఠుడై రమణ మహర్షి
మౌనదీక్షతో సుందరమైన నిర్వాణమార్గాన్ని ప్రపంచానికి చూపించారు.

సశేషం

రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -3*

.*ప్రస్తావన*

ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థితి ఎట్లా ఉంటుందో, తక్కినవారు గ్రహించలేరు. వారి జీవితపు నడక పద్ధతి కూడా భేదంగా వుంటుంది. అంతేకాదు, ఆ జ్ఞానులలోనే, ఒకరి జీవిత పద్ధతీ, వారు బోధించే సాధనా పద్ధతీ ఒకరినుంచి ఇంకొకరికి వేరుగా ఉంటాయి. వారిలో కొందరు మనుష్యుల మధ్య వుండిపోయి, ఆశ్రమాలలో నివసించి, శిష్యుల్ని తయారు చేస్తారు. కొందరు నిలకడలేకుండా తిరుగు తూ వుంటారు. కొందరు పాడతారు, కొందరు వాదిస్తారు, కొందరు బోధిస్తారు. కొందరు మానులు, కొందరసలు కంటికి కనపడరు, కొందరు రొష్టుపడి ప్రజల ఆగ్రహం వల్ల కంటకబడతారు. కాని, వారికి కంటకం అంటదు.

ఒకే మాట మాట్లాడి, ఒకేచర్య చూసినవారే కొందరు పూజనీయు లై, చివరివరకు మన్ననలందుకుంటారు. కొందరు నిందపడతారు.

విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు వారు కల్పించుకున్నది కాదనీ, వారి మాటల, చేతల, ప్రోద్బలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది. వారి చుట్టూ ఏం జరిగినా, వారికేం జరిగినా వారికి అంటదు. వారు మనుషులకి అర్థంకారు. ఎందుకంటే, మనుషులు మనసులతో ఆలోచించి చేస్తారు. అందువల్ల ఒకరికొకరు కొంతవర కన్నా అర్థమవుతారు, కాని ఈ జ్ఞానులకు మనోనాశనమవుతుంది. అందువల్ల వారి నడకలే వేఱు. వారి జీవిత సందర్భాలలో, సంబంధాలలో పరస్పర విరుద్ధాలెన్నో కనపడతాయి. వారి పనులలో కొన్నింటికి కారణాలు వున్నట్లు కనపడతాయి. కొన్నింటికి కనపడవు. పిచ్చివాడి పనుల లాగో, పొగరెక్కి నిరంకుశుడైన నియంత పనులలాగో తోస్తాయి. వారి పనుల లక్ష్యము వారి నంటవు. నక్కలంక యోగి, తనని సమీపించినవారి గుండెల్లో దభేలని తన్నేవారు. తిరిగి ఎవరూ ఆయనని తన్నరు. తిట్టరు. తన్నులు తిన్నవాడికి బాధా అవమానమూ కాని ఆ యోగిని తంతే, తనని తన్నినట్టు కూడా తెలీదు అతనికి.

అట్లానే భగవాన్ జీవితంలో ఎన్నో విషయాలు అర్ధంకావు - ఆయన ఈ ద్వంద్వాలు దాటిన మహర్షి అనీ, సర్వేశ్వరుడే అని నమ్మనివారికి, ఆయన ఏమాత్రమూ అర్థంకారు, ఆయన మానవా తీతుడు గనక. ఆయనలో కనపడే వైరుధ్యాలకి మానవుల్లో వెతికినట్లు కారణాలు వెతకటం దాని, విమర్శించడం గాని అజ్ఞానం, ఏ మనిషికి, ఏ పరిస్థితికి అవసరమైనట్టు ఆ విధంగా మాట్లాడేవారు ఆచరించేవారు ఆయన.
సీస పద్యం
*చెప్పి చెప్పక నుండి చిత్తము తెలుపుచూ
కర్మబంధము గాను కార్య దీక్ష
ఈశ్వరుని లీల యున్నదా యిచ్ఛతీరగలుగా
అడుగకే తెలుపుచూ ఆశ్రితయగు
విన్న చూసినపని వింతపోకడగాను
ఇష్టము కాదని యిచ్ఛ తెలువు
పిలిచి చీవాట్లగు పెనవేయు బంధము
నీరస్తుడి వలెను నిమ్మకుండు
గీత..
జ్ఞానులకు మనో నాశన జ్ఞప్తి గాను
మనిషి యజ్ఞానతలపులు మాయతీరు
పిచ్చివాడి పనులు తీరు పెనుగు లాట
అర్ధ మావ్వుతూ యర్ధము ఆశ వలదు

🌼 సీస పద్యానికి సరళ భావం
చెప్పి చెప్పకుండ చిత్తమున్ తెలుపుచూ
రమణ మహర్షి ఎక్కువ మాటలు లేకుండానే —
తనంతట తాను మౌనంగా మనసులోని సత్యాన్ని తెలియజేస్తాడు.
కర్మబంధములను కర్మలేనిగ
కర్మ చేసేటట్లే కనిపించినా,
అతనికి కర్మలకు బంధమేమీ ఉండదు.
ఈశ్వరలీలవెల గోచరింపగ నేర్పుచూ
ఈ లోకంలో జరిగేది అన్నీ ఈశ్వర లీల అని
చూడగల దృష్టిని మనకు నేర్పుతాడు.
అడుగకే వాక్యమున్ ఆశ్రయించున్
మనం అడగకముందే
మన ప్రశ్నలకు సమాధానమిచ్చే శక్తి అతనికి ఉంది.
విన్న దృశ్యములు వింతగానే కనుచూ
ప్రపంచంలోని మాటలు, దృశ్యాలను
సాధారణ మనుషుల్లా కాదు — వింతగా, లోతుగా చూస్తాడు.
ఇష్టమెల్ల పేల్పి యిచ్ఛని విడనాడి
అతనిలో స్వీయ ఇష్టాలు లేవు.
అతడు ఇష్ట–అనిష్టాలను పూర్తిగా దాటిపోయాడు.
పిలిచి పెనవేయు బంధములును విరిచి
మానవులను కట్టిపడేసే బంధాలను విచ్ఛిన్నం చేస్తాడు.
నీరసుండై తానే నిశ్చలత గన్
బయటి ప్రపంచానికి అతను భావరహితుడిలా కనిపించినా,
అతడు అంతర్వైఖరితో నిశ్చల జ్ఞానమూర్తి.
🌼 గీత భావం
జ్ఞానుల కార్యమది జ్ఞాననాశ మూర్త్యై
జ్ఞానుల పని — మన అజ్ఞానాన్ని నాశనం చేయటం.
మనుజున్ అజ్ఞాన కర్మ మాయ తీరు
అజ్ఞానంతో మనిషి చేసే పనులు మాయతో నిండివుంటాయి.
పిచ్చివానిచేయు ప్రవర్తనల్లే సత్యం
మన ప్రవర్తనలో చాలావరకు
పిచ్చివాడి చర్యల లాంటివి —
మనం నిజమైనది, అబద్ధమేదో గుర్తించలేం.
అర్ధమై వచ్చునే — ఆశ విడువుమా
ఈ సత్యం అర్థమైతే,
ఆశలు, ఆపేక్షలు వదిలేయడమే మోక్షమార్గం.
*****

తన చుట్టూ ఆశ్రమంలో జరిగే వాటిలో ఆయనకి ఎంతవరకూ సంబంధం వుందో చెప్పలేము. సంబంధం వుండనూ వుంది; ఉండనూ లేదు. లోకంలో జరిగే అనేక అత్యాచారాలకీ, ఈశ్వరుడికీ సంబంధం వున్నట్టా, లేనట్టా? ఆశ్రమాధికారులూ, ఆశ్రమవాసులూ తరచు ఆయనని అడక్కుండానే ఎన్నో చేసేవారు, భగవాన్ కి ఇష్టంకాదని తెలిసి కూడా, ఆ పనులు భగవాన్ కంటనో, చెవినో పడితేనేగాని, భగవాన్ వాటిని నోటీసు చేసేవారు కాదు. గమనించినప్పుడు ఒక్కొక్కసారి పిలిచి చీవాట్లు వేసేవారు. ఒక్కొక్కసారి ఏమీ అనేవారు కారు. చీవాట్లేకాక ఆశ్రమాధికారి వీపుమీద మూడు కర్రలు విరిగాయని భగవాన్ అన్నట్లుగా చెప్పుకునేవారు. ఆశ్రమాధికారి మాత్రం భగవాన్ కంట పడకుండా, నిరంతరం నేరస్థుడి వలె ఇటూ అటూ తప్పుకు తిరిగేవాడు.

సశేషం

*రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -4*

భగవాన్ని దర్శించవచ్చినవారు ఆశ్రమంలో జరిగే అనేక ఘోరాలు, అన్యాయాలు, పక్షపాతాలు, డబ్బు గుంజడాలు… ఇవి భగవాన్ తో చెప్పితే, "మీరు ఎందుకు వచ్చారు? ఈ ఆశ్రమంలో జరిగే లోపాల్ని యెంచి సంస్కరించేందుకా అంతదూరం నుంచి వచ్చారు? మీ దేశంలో ఏమీ లేదా సంస్కరించేందుకు? మీరు వచ్చిన పని ఏదో అది చూసుకొని వెళ్ళరాదా?” అనేవారట.

ఆశ్రమ ధనం దుర్వినియోగమవుతోందనీ, ధనార్జనే ముఖ్యంగా వుందనీ భగవాన్ తో అంటే, “వాళ్లు ధనం కోసం చేరారు. నీకూ ఆ ఆశ ఉంటే వాళ్ళలో చేరి చూడు, భాగం పెడతారేమో!” అన్నారట.

తన పేర నెల నెలా వసూలవుతున్న ధనం యెట్లా వినియోగమౌతోందో భగవాన్ పట్టించుకోలేదు. తన పేర యాచించడం భగవాన్ కి యెన్నడూ ఇష్టంలేదు. లక్షలు ఖర్చుపెట్టి కట్టించిన ఆశ్రమాలయానికై యాచించపోతే, గట్టిగా నిషేధించారు భగవాన్. కాని, విన్నదెవరు?

అయినా, తన ఆజ్ఞను మీరి చందాలు పోగు చేసి కట్టిస్తున్న ఆలయాన్ని, అర్ధరాత్రులు భగవాన్ టార్చి వేసుకొని రాళ్ళన్నీ పరీక్షించేవారట. అంతాతయారైన తరువాత ఓరాత్రి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన శ్రీచక్రంపైన చెయ్యి వుంచి పదినిమిషాలు నుంచున్నారట. కుంభాభిషేకం మొదలైన పూజలన్నింటికి అభ్యర్థనపై మౌనాధ్యక్షత వహించారు.

డబ్బు సేకరణలు వద్దు డప్పు కొట్టు రాసిన పద్యానికి అనుగుణంగా, రమణ మహర్షి దినచర్య – సరళ భావం ఇక్కడ అందిస్తున్నాను.
ప్రతి పాదం అర్థం స్పష్టంగా, సులభంగా ఉండేలా వివరించాను.*
*చున్న కార్యకర్తలు చేష్ట చూపు లన్ని*
*వ్యర్థ మేయగు విధమున వ్యక్తి యగుట*
*రమణ కిష్టమన్నది లేదు రకము తీరు*

*ఒకనొక విధముగా నుండి నోర్పు జూపి*
*తగువిధాన సేవలుజేసి తప్పు నొప్పు*
*తెలియ వని పలుకేనమ్మి తిరుగు జనులు*
*పూల దండలు వద్దని పుడమి పూజ*
🌼 సరళ భావం
రమణ మహర్షి మాటలో –
డబ్బు సేకరించడానికి, పేరుప్రచారం కోసం డప్పు కొట్టడానికి ఆయన ఒప్పుకోరు.
ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలు చేసే చూపరికాలు, ఆచార ప్రదర్శనలు కూడా
ఆయనకు ఇష్టం కాదు.
అనవసరమైన హోదాలు, పదవులు, పేరుప్రతిష్టలతో వ్యక్తిగా ఎదగడం
అతనికి అసలు ఇష్టం కాదు.
ఈ రకమైన ప్రవర్తన రమణ మహర్షి ధర్మానికి అనుగుణం కాదు.
మనిషి తన విధిని నిశ్శబ్దంగా, సహనంతో చేయాలని ఆయన బోధ.
సేవ చేయాలి—కానీ చూపు కోసమో, ఫలితం కోసమో కాదు.
తప్పు చేసినపుడూ అహంకారం లేకుండా దాన్ని అంగీకరించాలి.

తెలిసినట్లు నటిస్తూ తిరిగే మనుషులు చాలా మంది.
పూల దండలు, అలంకారాలు, ఆడంబరాల పూజలు ఆయన వద్దు అన్నారు.
ప్రపంచం ఇచ్చే బాహ్య పూజలకన్నా
మనసులోని మౌన పూజనే ఆయన ప్రాముఖ్యమిచ్చారు.

పూజలూ, ఊరేగింపులూ, ఉత్సవాలు - ఏవీ లక్ష్యం లేవు భగవాన్ కి, ముఖ్యంగా తనమీద పువ్వులు వెయ్యడం, తన ముందు కొబ్బరికాయలు కొట్టడం, హారతు లివ్వడం మొదలైనవి ఇష్టంలేదు. పుట్టిన జయంతి చేసినా, చేస్తున్నారు గనుక చూస్తూ కూచునేవారు, కుచోమంటే. ఆయనా దేవతా విగ్రహాల కిచ్చిన హారతి తెచ్చి ఇస్తే అందరికి మల్లేనే కళ్ళ కద్దుకుని, విభూతి పెట్టుకునేవారు.

ఆయన జబ్బుగా వున్నప్పుడు ఆయన ఆయుస్సు కోసం గ్రహశాంతి, హోమాలు చేశారు. దాంట్లో వుండే Anomaly ఏమీ తోచలేదు, ఆయన ఆయుస్సు కోరేవారికి. ఆ హోమాల, హారతులు తీర్థం తీసుకున్నా రాయన.

తనకు జబ్బు చేస్తే, మందు అవసరం లేదంటారు భగవాన్. కాని, భక్తులు దిగాలు పడ్డా, మందు తీసుకోమని బతిమాలినా, "సరే, తెండి" అని, ఏ మందిచ్చినా అట్లా మింగుతూనే వుండేవారు.

వచ్చిన ప్రజలు సాష్టాంగపడి నమస్కరించే వారు. కాని, భగవాన్ తల తిప్పి కూడా చూసేవారు కారు. కాని, ఎందుకో ఎప్పుడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్న వారు కాస్తా, చప్పున తనకి నమస్కరించే వారి వంక చూసేవారు. ఒక్కొక్కరిని పలకరించే వారు కూడా. నవ్వేవారు. ఎన్నో కుశల ప్రశ్నలు వేసేవారు, దూరదేశాల నించి వచ్చిన వారిని, పసి పిల్లలని, నడవలేని వృద్ధుల్ని ప్రత్యేకంగా చూసేవారు.
🪷
సశేషం

*

*గౌరవలీయులైన వెంకటాచలం  గారు కి కృతజ్ఞతలతో లోగడ రచించిన భగవాన్ స్మృతులను, ప్రాంజలి ప్రభ సభ్యులకు సేకరించిన కథను అందచేయాలని సంకల్పం ఆ అరుణాచలేశ్వరాయ నమః పరమేశ్వరుని కృపా కటాక్షాలు అందరికీ అందాలని 

ఓం నమఃశివాయ.. అరుణాచలేశ్వరాయ నమః

నమోనమః సర్వేజనాసుఖినోభవంతు*


No comments:

Post a Comment