*తెనాలి రామకృష్ణ - 33*
👳♀️
*నవ్వునాలుగు విధాల చేటు - 2*
రాణీవాసంలో ఓ మందిరంలో వీరేంద్రుడు తలదాచుకున్నాడు. ఈ విషయం తెలిసిన రాయలు కోపంతో ఊగిపోయాడు. రాణీ వాసానికి మాయనిమచ్చ. బిడ్డను కోల్పోయిన తుఖాదేవి మతిహీనంతో పిలవగానే పరుగెత్తిన పిరికి వీరేంద్రుని తలచుకుని అతన్ని ఓడ్రదేశంకు పొమ్మని కబురు పంపాడు. ఆ కబురు చేరవేయడా నికి కొందరు సైనికులు బైలుదేరుతుండగా ఒక కీలకమైన దుర్వార్త ఆయాసపడ్తూ మోసుకువచ్చాడు ఒక వార్తాహరుడు.
వీరేంద్రుడిని రాణీవాసం వద్ద ఎవరో గుర్తు తెలియనివారు దారుణంగా హత్య చేసారు. శవం గుర్తుపట్టనంతగా కత్తి వేటులకు గురయినట్టు చెప్పాడు.
ఆ వెంటనే దండనాయకుడు స్వయంగా వచ్చి చెప్పాడు. వీరేంద్రుని హత్య అత్యంత దారుణంగా జరిగిపోయింది. రాణీవాస ప్రాంగణంలో ఇలా జరగడం నమ్మశక్యం కాకుండా ఉంది. అదీ అక్కడ ఉండేది కేవలం స్త్రీలు మాత్రమే. వాళ్లు యుద్ధవిద్యలు నేర్చినవారు కాదు. మరి ఎవరు చేసారు.
"ఈరోజు తిమ్మరుసు వారికి శిక్ష అమలు అయినందున నగరమంతా ఉద్రిక్తంగా ఉంది. ఆయన పైన సానుభూతి వెల్లువెత్తుతోంది. కనుక విషయం ఏలిన వారికి వివరించాను.” అని చెప్పాడు.
"వీరేంద్రుని చంపిన హంతకులు వెంటనే మనకు చిక్కాలి వెదికి పట్టుకోండి. ఆ హత్య వెనుక కారణాలు కావాలి. అన్నట్టు తిమ్మరుసు బంధువులు, ఆయన సానుభూతిపరులను ఓ కంట కనిపెట్టండి. వారిలో ఎవరైన ఈ హత్య చేసి ఉండచ్చు. వీరేంద్రుడు మనకు దీర్ఘకాలం అతిధి. అతని ప్రాణరక్షణ మనదే. అలాంటిది అతన్ని కాపాడుకోలేకపోయాం."
"ప్రభూ రాత్రి మీరు అనుమానించిన బంధువులు తిమ్మరుసువారిని కలుసుకుని తిరుగుబాటు గురించి చర్చించారు. జైలు నుంచి తప్పించగలమని చెప్పారు. అందుకు తిమ్మరుసు అంగీకరించలేదు. రాజాజ్ఞ మీరవద్దు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే తను ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తాను అని హెచ్చరించారు. ఈ విషయం రాత్రే చెప్పేవాళ్లం కానీ మీరు తీవ్ర దుఃఖంతో ఉన్నారు."
రాయలు మళ్లీ ఆలోచనలోపడ్డాడు. తిమ్మరుసు తప్పించుకుపోవాలంటే అతనికి ఆ జైలు గోడలు అడ్డుకావు. తన పై ఇంకా విధేయత చూపిస్తునే ఉన్నాడు. ఆయన ఎవరికి అర్ధంకాడు. పసివాడ్ని చంపి ఇంతదాకా ఎందుకుతెచ్చుకున్నాడు. చివరికి శిక్ష అమలు అయ్యింది అనే మాట రాయలు జీర్ణించుకోలేకపోతున్నాడు. తనని పెంచిన అప్పాజీని తను కన్నులు ఊడపెరికించి నందున తీవ్రంగా బాధపడ్డాడు.
ఆరోజు నగరమంతా సైనికుల పహారా మధ్య ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తత తలెత్తినా అణిచివేయడానికి రంగం సిద్ధంఅయ్యింది. వీరేంద్రుని హత్య గురించి ఏ చిన్న ఆధారం లభించలేదు. వాస్తవానికి ఆ హత్యతో నగరంలో ఒక విధంగా సద్దు మణిగింది. అర్ధరాత్రి వేళ ఓ దండనాయకుడు రాయలను కలుసుకుని ఓ లేఖను అందించాడు. అది రామలింగకవి పూనా నుంచి రాసుకున్న లేఖ..
"ఇంతరాత్రి వేళ ఓ లేఖకు అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చి వచ్చావా, ఏముంది అందులో ” రాయలు అడిగాడు.
”ఈ లేఖను తమరే చదవాలి. ఇతరులెవ రు చదవద్దు అని ఓ నియమం విధించి ఆ కవిగారు ఎవరో దారిన పోయినవానితో పంపినారు.” అని లేఖను అందించాడు.
లేఖను తెరిచాడు రాయలు. అందులో ఏముందోనని చదవబోతూ "అవునూ ఈ లేఖను తెచ్చినవారు ఎవరో దారిన పోయినదానయ్యా! అంటే ఇలానే మన
రహస్యాలు ఇతరులకు తెలియజేయడం. ఛ ఛ ఏమయ్యా ఈ కవికి బుద్ధిరాదా ? ఇంతకీ ఆ దానయ్యను నీ అధీనంలో ఉంచావా ? వదిలేసావా ఈ పిచ్చి కవి ఏ రహస్యాలు ఇందులో ముచ్చటించాడో ” అని చిరాకుపడ్డాడు.
గుటకలు మింగాడు దండనాయకుడు.
రాయలు చదివి ఒక్క ముక్క అర్థంకాక పోవడంతో “ఈ కవికి జీవితమంతా హాస్యమేనా? ఏదో పిచ్చిరాతలకు ఏకంగా చక్రవర్తినే వాడుకుంటున్నాడు. ఈ అర్ధరాత్రి నాకు నిద్రాభంగం కల్గించినందు కు అతనికి ఈసరికి మరణదండన విధించే వాడిని. ఈ చెత్తను మోసుకువచ్చిన దానయ్యను ఖైదు చేయండి. వాడిని విచారించి తగు శిక్ష విధించాలి. అసలే పుత్రశోకంతో ఉన్న నాకు నిద్ర పట్టడమే గగనంలా ఉంటే ఏదో చెత్తరాసి నిద్రాభంగం కల్గిస్తాడా ” అని లేఖను ఓ మూలకు విసిరికొట్టాడు. దండనాయకుడు చెమటలు పోసి వెనుదిరిగిపోయాడు.
ఎర్రని ఎండ శరీరం పై పడడంతో రాయలకు నిద్రాభంగం అయ్యింది. ఆ రాత్రి తన కోట పైభాగంలో నిద్రపోయిన రాయలకు ఎండకు ఒళ్లంతా చిమచిమ లాడిపోసాగింది. అల్లంత దూరంలో నిలబడున్న దాసీజనాలచే ఆ క్రింది పడున్న లేఖను తెప్పించుకుని చిరు కోపంతో అందుకున్నాడు. రామలింగడికి ఒక్కోసారి వక్రబుద్ధి ఏలుతుంది అనుకుని ఆ లేఖను మరోసారి చదివాడు.
జనారణ్యంలో సింహమా, నీ తేజం గురించి ఇక్కడ కొన్ని పులులు చెప్పుకుంటుంటే విని అవి ఎలా తోక ముడిచాయో అని కళ్లప్పగించి మరీ చూసే భాగ్యం కలిగింది. తాటాకుల పై కొనగోళ్లతో రాసే కొన్ని చిలుకలకు నేను గొప్పవాడిగా కన్పించాను. అవి ముద్దు ముద్దుగా నన్ను ఎత్తాయి. మీ సింహం గుహలో రకరకాల చిలుకలకు తాటాకుల పని కల్పించిన తీరు భలేభలే అని అన్నాయి. చివరగా ఓ చిలుక చెప్పింది. మీ సింహం మా ప్రాంతపు ఓ రాబందును తన గుహలో పెట్టి ఎందుకు పోషించాలి. అది నూరుగొడ్లు తిన్న రాబందు కదా! ఆ రాబందువు వలన మీకు మీ సింహంకు అపకారమే అని పలికాయి. అందుకు నేనేమి బదులిచ్చానంటే ఆ రాబందు ఓ గులాబి పువ్వును సింహానికి ఇచ్చింది. కనుక తప్పదు, ఏది ఏమైనా ఆ రాబందును వదిలించుకుంటే తప్ప మీకెవరికి గతులుండవు అని చిలుక జోస్యం చెప్పింది.
ఆ చిలుక పలుకులు విన్నాక భయమేసింది. ఆ రాబందువు తను గులాబి పువ్వులో తీయని విషం నింపింది. అది ఎంత ప్రమాదమో... గులాబికి తప్పని పరిస్థితి. ఆ విషం వలన సింహానికి, గుహకు, జనారణ్యంకు, తాటాకు చిలుకలకు ఏదో రోజు ప్రాణ పమ్రాదం తప్పదు. ఆ రాబందువు ఇక్కడ చేసిన నిర్వాకాలు చాలా ఉన్నాయి.
ఇట్లు :
తాటాకు రామచిలుక
రాయలకు మరోసారి చిర్రెత్తుకు వచ్చింది. ఆరోజు తను రాసిన జాంబవతీ కళ్యాణం గురించి భువనవిజయంలో నోటికి వచ్చినట్టు కూసాడు. ఇంకా దాన్ని మరవక ఆ కావ్యాన్ని మరోసారి కించపరిచేందుకు సాహసించి, మళ్లీ సింహాలు, పులులు, చిలుకలు, రాబందులు అని ఎక్కడ్నించో కూచుని ఏమేమో రాస్తున్నాడు. ఈతడు అసూయపరుడు, నా కవిత్వాన్ని ఇలా కించపరచడంలో ఇలా తన చాకచక్యం ప్రదర్శిస్తున్నాడు. ఆంధ్రుడు అసూయ పరుడు అని పెద్దలు ఊరకే అన్నారా ! కనుక ఈతనికి తగు విధంగా గర్వభంగం చేయాల్సిందే అని రోషపూరితుడై అక్కడ చేతులు కట్టుకుని నిలుచున్న దండనాయ కునికి వెంటనే ఆదేశించాడు.
"ఈ నగరంలో రామలింగకవి ఇటీవల లింగిశెట్టి వద్ద కొనుకున్న ఖరీదైన భవంతిని స్వాధీనం చేసుకోండి. అందులో ఉన్న విలువైన సామగ్రిని మన ఖజానాకు జమ చేయండి. గోవులను మన గోశాలకు తరలించండి. అక్కడ పరిచారికలను తరిమేయండి. రామలింగడు కాశీ నుంచి తిరిగి వచ్చి నగరంలో అడుగుపెట్టిన మరుక్షణం ఖైదు చేయండి. ఈ లేఖను కొత్వాలు కార్యాలయంలో భద్రపరచండి.”
రాయలకు పుత్రుడ్ని కోల్పోయిన నాటి నుంచి అతనిలో ఒకింత మతిస్థిమితం తప్పింది. ఏ విషయాన్ని తట్టుకోలేకపో తున్నాడు. పెనం మీదున్నట్టుగానే ఉంటున్నాడు. పాలన విషయంలో వాయిదాలు వేస్తూనే ఉన్నాడు. సభను పూర్తిగా నిలిపివేసాడు. ఒక్కడే తన మందిరంలో ఎప్పుడు మద్యం మత్తులో జోగుతున్నాడు. తుఖాదేవి మూడు రోజులుగా అన్నపానీయాలు ముట్టలేదని ఇలా అయితే ఆమె పరిస్థితి ప్రమాదం అని రాజ వైద్యులు చెప్పినట్టు ఓ పరిచారిక చెప్పడంతో ఆమెను కలిసేందుకు వెళ్ళాడు.
తుఖాదేవి అందానికి మరో పేరు. అలాంటిది ఈరోజు ఆమె తైలసంస్కారం లేని జుత్తుతో పిచ్చిదానిలా ఉంది. ఆమె ఎన్నడూ మాసిన చీర ధరించడం తన పై అలకబూనినప్పుడు కూడా చూడలేదు. ఆ చీర పై అక్కడక్కడ నెత్తురు మరకలు ఎండిపోయి కన్పించాయి. ఆమె పూర్తిగా నీరసంతో ఉంది. ఆమె ప్రక్కనే కూర్చుని “పోయినవారిని తీసుకురాలేం కదా ! నా కోసం నీ ప్రాణాలు నిలుపుకోవాలి" అని సముదాయించాడు.
బావురుమంది. రాయలు ఆమె చేత కొన్ని పండ్లు తినిపించాడు. "దేవీ, ఇక్కడ నీ బందువు వీరేంద్రుడు చంపబడడం చాలా చిత్రంగా ఉంది. నీకెవరిమీదైన అనుమానం ఉందా ? హంతకులు ఎలా రాగలిగారు. మగపురుగు చొరశక్యం కాని విధంగా ఉన్న రాణీవాసంలోకి ఎలా అడుగుపెట్టారు. మన తిరుమలరాయల శోకంతో ఏదీ పట్టించుకోలేకపోతున్నాను. నీ చీర పై ఆ నెత్తురు మరకలేంటి?”
తుఖాదేవి రాయల ప్రశ్నలకు బదులీయక "ప్రభూ ఇక్కడ పని చేసే ఒక దాసీ చెల్లెలు రామలింగని ఇంట ఉందట. ఆమెను దండనాయకుడు పొమ్మన్నాడట. ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది. రామలింగని ఇంటిని ఎందుకు స్వాధీనం చేసుకున్నారు.” నీరసంతో లేని ఓపిక తెచ్చుకుని మరీ అడిగింది.
రాయలు లేఖ గురించి చెప్పాడు. ఆమె కళ్లు పెద్దవయ్యాయి. ఆ లేఖను ఉన్న పళంగా తెప్పించి మరీ చదివింది. ఆ నీరసంలో పెద్దగా నవ్వింది. తెరలు తెరలుగా నవ్వింది.
రాయలు తన ప్రాణ సమానురాలు ఇలా మళ్లీ నవ్వుతుందని అనుకోలేదు. లో లోపల రామలింగడిని అభినందించాడు.
" దేవీ ఎందుకు అంతగా నవ్వుతున్నావు. అందులో ఏముంది ? ఆ రామలింగడు నా కావ్యాన్ని కించపరిచేందుకు అలా రాసాడు. అందుకే శిక్షించాను.”
"ప్రభూ అతడు శిక్షార్హుడు కాడు. మన శ్రేయోభిలాషి. కాకుంటే కాశీకి పోతూనే మనకు ఓ గుప్త సందేశాన్ని, ఓ వేగును మనకు ఇచ్చాడు.
ఇందులో సింహం తమరు, పులులు ఓడ్ర దేశపువారు, తాటాకులు గోరుతో రాసే చిలుకలు కవులు, సింహం గుహ అంటే మీ భువనవిజయం, ఇక రాబందువు మా బావ వీరేంద్రుడు. అతడు నూరుగొడ్ల తిన్న రాబందు. ఇందులో అసత్యమేదీ లేదు. అతడి వలన ప్రమాదం అని తీవ్రంగా హెచ్చరించాడు. ఇక లేఖను ఏ దానయ్య తో పంపినందున తెలివిగా జంతువుల పై రాసి పంపాడు. అతన్ని అభినందించా ల్సింది పోగా శిక్షిస్తారా ప్రభూ !”
రాయలు ఆశ్చర్యపోయాడు. ఒకింత సిగ్గుపడ్డాడు. గట్టిగా తల విదలించాడు. క్షణాల్లో రామలింగని పై వేసిన శిక్షను రద్దు చేసాడు. రాణీవాసంలో హత్య గురించి పరిశోధిస్తున్న కొత్వాలు పటేల్ ఓ చిన్న నివేదికను అక్కడే ఉన్న రాయలకు ఇచ్చి వెళ్లాడు.
హత్య జరిగింది రాణీవాసంలో, అదీ తుఖాదేవి మందిర ప్రాంగణంలో జరిగింది. ఆమె దుండగులను చూసి ఉండొచ్చు. ఆమె పిలుపు మేరకు వీరేంద్రుడు అక్కడికి వచ్చాడు. కనుక అతడు హత్యకుగురయ్యే ముందు ఆమెతో మాట్లాడినట్టు దాసీ జనాలు చెప్తున్నారు. పట్టపురాణీవారిని ప్రశ్నించే సాహసం మేం చేయలేం కనుక శ్రీవారికి విన్నవించుకుంటున్నాం.'
రాయలు తుఖాదేవికి విషయం చెప్పి "వీరేంద్రుని హంతకులని నీవు చూసావా ?" అని అడిగాడు. ఆ వెంటనే భృకుటి ముడివైచాడు.
"దేవీ నీ చీరపై ఆ నెత్తురు మరకలు ఏమిటి అని అడిగితే చెప్పలేకపోయావు. నీకు ఆ హత్యకు చాలా ప్రత్యక్ష సంబంధం ఉండి ఉండాలి. నిజం చెప్పు. లేకుంటే దాసీ జనాలను నేరుగా అడుగుతాను." కటువుగా అడిగాడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 34*
👳♀️
*నవ్వునాలుగు విధాల చేటు - 3*
“దేవీ నీ చీరపై ఆ నెత్తురు మరకలు ఏమిటి అని అడిగితే చెప్పలేకపోయావు. నీకు ఆ హత్యకు చాలా ప్రత్యక్ష సంబంధం ఉండి ఉండాలి. నిజం చెప్పు. లేకుంటే దాసీ జనాలను నేరుగా అడుగుతాను." కటువుగా అడిగాడు రాజు.
“నేనే నా చేతులతో చంపాను. వాడే నా కొడుకును చంపాడని నా అనుమానం. వాడికి మీరు మీ వంశం పై తీరని పగ ఉంది. వాడు చంపలేదు అని అనుకోలేం. ఈ చేతులతో చంపాను.”
"మరి అప్పాజీ చంపడం చూసాను అని అన్నావు. ఇప్పుడు వీరేంద్రుడంటున్నావు. నీవు తలాతోకలేని మాటలతో ఘోరాలకు ఆద్యం పోస్తున్నావు.”
"హత్యను కళ్లార చూడలేదు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చేసారు అన్నది నిజం. ఒకరిని మీరు శిక్షిస్తే మరొకరిని నేను శిక్షించాను. నా ముద్దుల పట్టిని చంపడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ పసివాడి హంతకులు ఎంతమంది ఉన్నా వారిని జీవాలతో వదలను. నేను రాజ మాతను కాకుండా చేసినందుకు ఆ ఇద్దరు శిక్షింపబడ్డారు.”
"అప్పాజీని నీవు హత్య చేస్తుండగా చూసావా లేదా? నాకు నిజం చెప్పు. అంతటివాడికి నీ మాట మీదనే ఘోరమైన శిక్ష విధించాను.”
"నేను చూడలేదు. కానీ అతని మాటల్లో తిరుమలరాయలకి ఇప్పట్లో పట్టాభిషేకం వద్దని చెప్పడం అతన్ని అనుమానించాల్సి వచ్చింది. నేను కబురంపి అడిగానా, ఎందుకు రాణీ వాసంలోకి అంత రాత్రి వేళ రావాలి. ఉదయం రావచ్చుకదా ! " ఆమె తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం లో వితండవాదంలో బదులిచ్చింది.
రాయలు వెనుదిరుగిపోతుండగా.. "ప్రభూ ! నేను చేసిన హత్యని రచ్చకెక్కించ వద్దు. అది మనకు మన వంశాలకు రానున్న తరాలకు పెద్ద మచ్చలు. ఆ నీచుడు వీరేంద్రుడుని చంపినది, తిమ్మరుసు సానుభూతి పరులనే చెప్పాలి. ఆ పైన మీ ఇష్టం”.
"సరే ఆ నెత్తుటి మరకలున్న చీరను విప్పి పారేయ్.”
ఈ చీరలో ఆనందం వెతుక్కుంటున్నాను. నా చిట్టి తండ్రిని చంపినవాడి నెత్తురుతో నా శోకాన్ని పూడ్చుకుంటున్నాను."
ఆమె వంక అదోలా చూసి అక్కణ్ణించి వెళ్లిపోయాడు రాయలు.
ఆ మరుసటి రోజు రాణీవాసపు దాసీలను పిలిపించి రాయలే స్వయంగాప్రశ్నించాడు. వారు ఏదీ దాచకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాడు. తుఖాదేవిని వీరేంద్రుడు ఏ విధంగా లోబరుచుకుంది, ఆమె ఎందుకు భయపడింది, వారి తొలి ప్రేమ వ్యవహారం ఏ క్షణమైనా బట్టబయలు చేస్తానని బెదరింపులు కారణం అని తెలుసుకున్న రాయలు పూర్తిగా మనస్సు వదిలేసాడు. అతడి గుండెలలో గల ప్రేమతో నిండిన అరలు ఒక్కసారిగా వెలవెలబోయాయి. ఇంక ఆమె ముఖం చూడాలనిపించలేదు. ఆమె వీరేంద్రుడిని స్వయంగా శిక్షించడంలో ఆంతర్యం కూడా అర్ధంచేసుకోగలిగాడు.
వీరేంద్రుని చంపింది తిమ్మరుసు సానుభూతిపరులే అని నగరంలో దండోరా వేయబడింది. సర్వత్రా ఆనందం వెల్లివిరిసింది.
గజపతుల నుంచి ఓ లేఖ వచ్చింది. అందులో రాయలకు ఓ రహస్యం వివరింపబడింది. ఏమిటంటే తుఖాదేవి కూతురు అని చూడకుండా ఆమె వివాహానికి ముందు జరిగిన ప్రేమ వ్యవహారం గురించి వివరించారు. దీనికి కారణం వీరేంద్రుని దారుణ హత్యను వారు జీర్ణించుకోలేకపోయారు.
రాయలకు తుఖాదేవి పై కోపం ఏ మాత్రం రాలేదు. దానికి కారణం ఆమె రహస్యాలు దాచినందున చేతికి అందిరావల్సిన కొడుకును కన్నవారి వలన పోగొట్టుకుంది. ఇంతకంటే ఆమెకు తను శిక్షించాల్సింది ఏమీ లేదు. ఆమె ముఖం చూడరాదని చివరగా నిర్ణయించుకున్నాడు.
పాలన మీద, అధికారం మీద పూర్తిగా వ్యామోహం సడలిపోయింది. వెంటనే దండనాయకులపై పాలనాభారం వదిలి తను తన అంతఃపురం వీడకుండా మద్యం మత్తులో మునిగితేలిపోసాగాడు. తుఖా దేవి ఎన్నో వినతులను పంపుకుంది. ఒక్కసారి తను చూడాలని ఆశపడింది. రాయలు ఆమెతో బాటు మిగిలిన రాణులకు తన దర్శనం ఇవ్వకుండా మొండికెత్తాడు. తీవ్రమనోవేదనకు గురయ్యాడు. ప్రాణప్రదంగా ప్రేమించిన తుఖాదేవి ఇలా చేయడం తట్టుకోలేక
పోయాడు. ఆమె కారణంగా తనని పెంచి పెద్ద చేసిన తిమ్మరుసును తను ఘోరాతి ఘోరంగా శిక్షించడం జీర్ణించుకోలేక
పోయాడు.
ఖైదు నుంచి తిమ్మరుసు ఎప్పటికప్పుడు రాయలు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నాడు. రాయలకు అండగా తన అన్న కుమారుడు వల్లభరాయలను నియమించాడు. కళ్లు లేని కబోదిగా కాకుండా ఇంకను రాయల వారి క్షేమం కోరుతున్నందున అతని సానుభూతిపరులు మాట జవదాటలేక పోయారు. లేకుంటే తిరుగుబాటు సునాయాశంగా జరిగిపోయి చరిత్ర పుటలకెక్కేది.
తిమ్మరుసు పక్షం చేరినవారిలో దండనాయకులు, అచ్యుతరాయలు, గోవిందరాయలు, కొందరు సామంత రాజులు ఉన్నారు. ఒక దశలో గోవింద
రాయలకు పట్టం కట్టే పరిస్థితి కూడా నగరంలో కోడైకూసింది. ఆనోట ఈనోట విన్న రాయలు పట్టించుకోలేదు. కారణం పూర్తిగా వికలమైన మనస్సుతో పుత్ర శోకంతో మిగిలాడు.
ఒకరోజు న్యాయనిపుణులను పిలిపించి రాయలు తన మరణశాసనాన్ని రాయించాడు. అందులో తన సవతి తల్లి ఓబాంబిక మనుమడు సదాశివరాయలకు సింహాసనం దక్కాలి. అతడు చిన్నవాడైన కారణంగా కేవలం రాజ్య సంరక్షకులుగా తన తమ్ముడు అచ్యుతరాయలు అతనికి తోడుగా తన అల్లుడు రామరాయలు బాధ్యతలు స్వీకరించాల్సిందిగా రాసాడు.
ఇది జరిగిన కొద్ధి రోజులకే రాయలు హఠాత్తుగా చనిపోయాడు. రాయల మరణవార్తను తెలియనీయకుండా తిమ్మరుసును చెర నుంచి తప్పించి విజయనగరానికి దూరంగా తీసుకు
పోయాడు గోవిందరాయలు. దీని వెనుక పలువురు రాజోద్యోగులున్నారు.
భోగలాలసుడైన అచ్యుతరాయలు సింహాసనం అధిరోహించాడు. రామ రాయలు పాలన విభాగం సర్వం తానై చూసే ఒప్పందం పై పాలకుడైయ్యాడు. రాయలు చావు వార్త తప్ప మిగిలినదంతా తిమ్మరుసుకు తెలుసు. బాగా వృద్ధుడై అనారోగ్యాలకు గురవుతూ దైవచింతన వైపు మొగ్గాడు. పాలన లోపలు మార్పులు గురించి గోవిందరాయల నుంచి వినడం వరకే తిమ్మరుసు మిగిలాడు.
మరో ఆరుమాసాలు గడిచాయి.
తెనాలిరామలింగడు నగరంలోకి వస్తూనే రాయల మరణవార్తను విని హతాశుడైయ్యాడు. వరుసగా జరిగిన పరిణామాలను తెలుసుకుని చింతించా డు. రాయల సమాధి వద్దకు వెళ్లి చిన్న పిల్లాడిలా రోదించాడు. అప్పటికే కొందరు కవులు నగరం వదలి తలో దిక్కుకూ వెళ్లిపోయారని తెలిసి చాలా బాధపడ్డాడు.
తుఖాదేవిని కలుసుకున్నాడు. ఆమె భోరున విలపించింది.
"మహాకవి మీ మాటలను విని ఆచరించ లేకపోయాను. భయపడ్డాను తీరా మీరు ఊహించినట్టే కొడుకును, చివరికి రాయల వారిని కోల్పోయాను. అతిహీనంగా బతుకు ఈడ్చుచున్నాను. నేను చేసిన తప్పిదాలు క్షణక్షణం బాధిస్తున్నాయి. చివరికి ఆ వీరేంద్రుడ్ని నా చేతులతో పొడిచి పొడిచి కూలదోసాను. అతడు విలవిలమని కొట్టుకుంటుంటే దండ నాయకుడు మరి కొంతమంది కత్తికోకండ గా నరికివేసారు. నాలో రేగిన పగ తీరింది. కానీ, నేనంటే ప్రాణం పెట్టే భర్తను, నా ముద్దులపట్టి తిరుమలరాయలను శాశ్వతంగా పొగొట్టుకున్నాను. ఆ ద్రోహులు, నా ఈ గతికి కారకులు నా పుట్టింటివారు, ఇంతవరకు నా ముఖం చూడరాలేదు." అని విలపించింది.
ఆమెను ఓదార్చి తిమ్మరుసు ఉనికి తెలుసుకుని అక్కడికి ప్రయాణమయ్యా డు. కనుగుడ్లు కోల్పోయిన వృద్ధ సింహంలా ఉన్న తిమ్మరుసును చూసి..
“అప్పాజీ మీకా ఇంతటి దుర్గతి పట్టింది. అయ్యో నేనున్నాను కాను. మీకు బదులు నా కళ్లను ఇచ్చి మిమ్మల్ని రక్షించుకునే వాడిని.” అని చేతులు పట్టుకుని ఏడ్చాడు.
“నాయనా రామలింగా, నీవా ఎప్పుడు వచ్చావు. నీ ప్రయాణం బాగా అయినదా? అన్నట్టు నీకు గుర్తుందా నేను చెప్పిన మాటలు, గయలో మనకు కప్పం కడ్తున్నట్టు ఇబ్రహీం లోడి శాసనం రాయించాడా ? నీవు చూసావా” ఆత్రంగా అడిగాడు.
“చూసాను గయలో రాయబడి ఉంది. ఆ విషయం చెప్పుదామని వస్తే ఇంకేం ఇక్కడ మిగిలింది. సర్వం శూన్యం ఐపోయింది. మన రాయలు దివ్య జ్యోతి అయి మన వెలుగులను తీసుకుపోయాడు.” అని ఏడ్చాడు.
"రాయలు మరణించాడా ? గోవిందరాయా ఒక్కసారి ఇటు వచ్చి నాకు నిజం చెప్పు.” అని ఎలుగెత్తి పిలిచాడు.
గోవిందరాయలు వస్తూనే నాలుక కొరుక్కున్నాడు. అయ్యో రామలింగకవికి లోగుట్టు చెప్పనందువలన రాయల మరణం తిమ్మరుసుకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏది దారి ? అని దారులు వెతుకుతూ వచ్చి నిలబడ్డాడు.
"గోవిందరాయా ఈ వృద్ధునికి నిజం దాచి మరింత గుడ్డివాణ్ణి చేసావు. ఈ చేత్తో పెంచి పెద్దవాడిని చేసిన నా శ్రీకృష్ణదేవరాయలని కడసారి చూసుకోలేకపోయాను. నాకు ఇంతకంటే శిక్ష ఏముంటుంది.” అని దుఃఖించాడు.
రామలింగడు కొంతసేపు అలానే వదిలేసి ఆ తరువాత తిమ్మరుసుకు ధైర్యం చెప్పి 'తను రాయలు లేని విజయనగరంలో మరి నివాసం ఉండలేను. మరో రాజు పంచన చేరలేను. ఇక బతుకుదారి ఎలా అని ఆలోచిస్తున్నాను. పిల్లలు చిన్నవారు వారి కోసం బతకాలి' అని తన గోడు చెప్పుకున్నాడు.
“నాయనా రామలింగా, రాయలు లేకుంటే నేను లేను. నీవు బతుకు దారికై విచారించకు. నీవు ఏ రాజుల వద్దా మనలేను అని అనుచున్నావు. మహా మండలేశ్వరుడు పెదసంగభూపాలుని వద్ద కార్యనిర్వాహకోద్యోగిగా పని చేసే వేదాద్రి మంత్రిని నీకు పరిచయం చేస్తాను. అతడు నిన్ను అన్ని విధాలుగా ఆదుకొనగలడు. నాయనా గోవిందరాయా, ఒకసారి వేదాద్రిని నేను పిలిచాను అని పిలువు" అని చెప్పి పంపాడు.
చుట్టపు చూపుకు వచ్చిన వేదాద్రి పక్క వీధిలోంచి వచ్చి చేతులు కట్టుకున్నాడు.
"వేదాద్రి ఈతడు మహాకవి. అంతేకాదు ఆత్మాభిమానం గలవాడు. సమస్త కావ్యరస సుధామండన కుండలుడు. ఇట్టి కవిని పోషించాల్సిన శుభతరుణం నీకు లభించినది. ఇదే నీవు నాకు చేయవల్సిన చివరి పని. ఇంతకుమించి ఏమీ కోరను.”
అన్నాడు తిమ్మరుసు.
“తమాజ్ఞ తప్పక ఏ దోషం లేకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకుందును. " అని అప్పాజీ పాదాల పై ప్రమాణం చేసాడు.
రామలింగడు వేదాద్రికి చేతులు జోడించా డు. అతడు వైష్ణవం స్వీకరించిన మహానుభావుడు. అప్యాయంగా తన అక్కున చేర్చుకుని “ఒ కవి తిలకమా నేను ధన్యుడనయితిని.” అని ఆనంద బాష్పాలు రాల్చాడు. అప్పాజీ వద్ద శెలవు తీసుకుని బయల్దేరాడు రామలింగడు.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 35*
👳♀️
*నవ్వు నాలుగు విధాల చేటు - 4*
మార్గమధ్యంలో పల్లకిలో వెళ్తున్న దూర్జటి కనిపించి పల్లకి దిగి రామలింగానికి ఎదురొచ్చి...
"నాయనా చూసావా ! మన రాయలు తన మరణశాసనాన్ని రాసినపుడు నమ్ముకున్న మన గురించి కనీసం ఒక్క ముక్క అయినా ప్రస్తావించనందున ఈరోజున మనము తలోదిక్కయినాము. ఒకరా ఇద్దరా తెలుగు, కన్నడ, సంస్కృతం, ఉర్దూ భాషల కవులు మొత్తం 32 మంది ఏం కావాలి, అందుకే అన్నాను రాజులు ఉన్మత్తులు వారి కొలువులు నరక ప్రాయంబులు, కాదంటావా? ఈ మధ్య ఏలికలైన అచ్యుతరాయలు ఓ కవి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఈ కొత్త రాజు భోగం మనిషి, ఆ కవిని మెడ బట్టుకుని గెంటించాడు. పాపం ఆ కవి ఎంత బాధ పడ్డాడో కదా ! ఇంకనూ మనలో కొందరు చూరుపట్టుకుని వ్రేలాడుచందాన ఈ భోగ లాలసులు ప్రాపకం కోసం వెంపర్లాడుచు న్నారు. మన అందరికంటే పెద్దవాడు పెద్దన రాజాశ్రయం లేనిదే తను లేనన్నట్టుగా బతుకు ఈడ్చుచున్నాడు. ఎంతగా వారిని వేడుకున్నాడో నీవు చూస్తే చాలా జాలిపడతావు. ” అని వేదాంతిలా పెదవి విరిచి కొత్తగా తను రాసిన ఓ పద్యం ఆలపించాడు.
వేదం దిట్టగరాదుగాని, భువిలో విద్వాంసులం జేయనేలా?
ధీచాతురిఁ జేసిన గులా మాపాటనే
పోకక్షుద్బాధాదుల్ గలిగింపనేల?
యది కృత్యంబైన దుర్మార్గులన్ ఛీ ! ధాత్రీశులఁ జేసేఁ, జేయనేటి కటకటా! శ్రీకాళహస్తీశ్వరా !
( తాత్పర్యం :- ఈశ్వరా ! బ్రహ్మను నిందించరాదు కానీ, అతడు, లోకంలో పండితులను ఎందుకు సృష్టించాలి? పోనీ, సృష్టింపబడిన వారికి ఆకలి వంటి బాధలు కలిగించుటెందుకు? పోనీ, సృష్టి ధర్మము, పడక తప్పదు అని అనుకొందము. ఈ పండితులను ఆదరించే శక్తి సామర్ధ్యము లున్న రాజులను కోపించి బుద్ది ఇవ్వకుండా దుర్మార్గులను చేసినాడేమి?)
రామలింగడు నవ్వి "తెలుగు సాహిత్యం రాయలవలే ఆరాధించువారు ఎవరు ? మనకు తెలిసింది కావ్య రచన తప్ప ఇతరత్రా మనం ఏం చేయలేం. బతకలేని వారు రాజుల ప్రాపకంకై పాకులాడక తప్పదు. నన్ను ఆశీర్వదించండి, నేను వేదాద్రి మంత్రి వద్దకు పోవుచున్నాను."
"రామలింగా రాయలవంటి చక్రవర్తిని మెప్పించినవాడివి చివరికి ఒక మహా మండలేశ్వరుని దయాలబ్ధంతో పని చేసుకునే చిన్న ఉద్యోగి వద్ద బతుకు ఈడ్చు వేదాద్రి మంత్రి వద్ద భుక్తికి చేరడానికి నీకు మనస్సేలా వచ్చింది. వినడానికి నాకెంతో కష్టంగా ఉంది. అందరి కంటే నీవు చాలా దయనీయ పరిస్థితిలో మిగిలావు." అని బాధపడ్డాడు.
"మీ కాళహస్తీశ్వర శతక రచన నూటికి నూరుపాలు కుప్పపోసిన నిజాలు. ఇక సెలవా మరి.” మిక్కిలి వినయంగా చేతులు జోడించి రామలింగడు వెను దిరిగాడు.
దూర్జటి కళ్లలో చిన్న కన్నీటి పొర కదలాడింది. “నిన్నా ఈశ్వరుడే రక్షించు గాక" అని మనస్సులో కోరుకున్నాడు.
రామలింగడు కాళ్లీడ్చుకుని అలసాని పెద్దనార్య ఇంటికి వెళ్లాడు. అప్పుడు పెద్దన ఇంటి వద్ద అతని కుటుంబ సభ్యులు అంతా కలిసి ఏదో సుదీర్ఘ చర్చలో ఉన్నారు. రామలింగకవి వచ్చెను అని వారిలో ఒకరు చెప్పగా పెద్దనార్య రామలింగడిని పట్టుకుని ఒక్కసారి కట్టలు తెంచుకునే వరద ఏరులా కన్నీరు కార్చాడు
“నాయనా రామలింగా, ఇక మన భువన విజయం మూతబడింది. రాయల సాటి ఇప్పుడున్న రాజులు కాలేరు. మనమంతా దిక్కులేని పక్షులమయ్యాం. మన ఈ శేష జీవితం ఎలా గడపాలి. నాకు ధైర్యం చెప్పవచ్చావా ? అని చిన్నపిల్ల వానివలే ఏడ్చాడు. అతడితోబాటు అతని కుటుంబ సభ్యులు ఏడ్చారు.
రామలింగడు పెద్దన కన్నీటిని తుడిచి "మా అందరికి పెద్దదిక్కు అయిన మీరే ఇలా నీరసించిన ఇక మాకెవరు దిక్కు, ధైర్యం. మనకు మనమే కల్పించుకోవాలి." అని భుజం తట్టాడు.
శోకసముద్రం అయిన పెద్దనార్య చిన్న గొంతుతో ఓ పద్యం వినిపించాడు.
ఎదురైనచోఁదన మద కరీంద్రమునిల్పి కేలూతయొసఁగి యెక్కించుకొనియె మనుచరిత్రంబందుకొనువేళ బురమేగఁబల్లకి తనకేలబటిటయెత్తెఁ గోకట గ్రామద్యనేకాగహ్రారములడిగిన సీమలయందు నిచ్చె బిగువైన కవి గండపెండేరమున కీవదగునని తానే పాదమున తొడిగె
ఆంధ్ర కవితాపితామహా అల్లసాని పెద్దన కవీంద్రా అని తన్ను పిల్చునట్టి కృష్ణదేవ రాయలతో దివికేగలేక బ్రతికియున్నాడు జీవచ్చవంబగుచు.......
రాయలను తలచుకుని పెద్దనార్యలు కుళ్లి కుళ్లి ఏడ్చాడు.
“నిజమే ఆ రాయలవారికి మాకంటే మీరన్నచో అభిమానమే కాదు ప్రాణం కూడా, మాకెవరికి దక్కని గౌరవం మీకే దక్కాయి. ఆయన పక్కన పట్టపుటేనుగు పై కూర్చుండబెట్టుకొనియెను. మీ మహా కావ్యం మనుచరిత్రను స్వీకరించినాడు. ఆయన స్వయంగా బంగారు గండపెండేరం మీ కాలికి తొడిగాడు. మీ పల్లకికి బోయగా ఒకవైపు మోసాడు. పెక్కు అగ్రహారముల ను కోరకనే మీకు ఇచ్చాడు. ఆంధ్రకవితా పితామహా అని ఆయనే మిమ్మల్ని నిత్యం పిలుచుకునేవాడు. ఇంతకుమించిన గౌరవం ఏ భాష కవికి లభించలేదు. ఇక చావు పుట్టుకలు మానవ సహజం. పెద్దలు తమకు తెలియనిది కాదు.” అన్నాడు రామలింగడు.
"రామలింగా నీలో ముక్కుసూటితనమే కాదు. సాటివానిని అభినందించడం, అనునయించడం తెలుసు. కన్నీటిని తుడిచే పెద్ద మనస్సు గల వాడివి." అని అలసాని పెద్దనార్య అభినందించాడు.
అక్కడ నుంచి సెలవు తీసుకుని రాయలు లేని విద్యల నగరాన్ని వదిలేసి శాశ్వతంగా సాగిపోయేందుకు సిద్దమయ్యాడు. తనకంటూ మిగిలిన సామాన్లతో గూడు బండిలో భార్య బిడ్డలతో బయల్దేరాడు. నగర సరిహద్దుల వద్ద కొత్వాలు పటేల్ ఎదురై పాదాభివందనం చేసి వలవల ఏడ్చాడు.
" మాకెన్నో విషయాల్లో పెద్ద మనస్సుతో పరిష్కరించిన మహానుభావుడవు. చివరికి ఈ నగరం వదిలి పోవుచున్నావా స్వామీ !” అని పుట్టెడు దుఃఖంతో అడిగాడు.
“తప్పదు కొత్వాలు ఇందులో మనం నిమిత్తమాత్రులం. ఏనుగు ఎక్కేవాడు ఏదో రోజు ఏనుగు కాళ్ల కింద పడక తప్పదు. కవులు, కళాకారుల బతుకులు ఇంతే ! సరే నిన్ను కలియకుండానే వెళ్లిపోవుచున్నందు కు నీకు నా మీద ఎలాంటి కోపం లేదు కదా !”
“అయ్యా తమవంటి వారిపై నాకెందుకు కోపతాపాలుంటాయి. తమరు ఇలా అతి చిన్నవాని కొలువుకు పోవడం నాకు భరించరానిదిగా ఉంది. అష్టదిగ్గాజాలలో ఎవరూ బతుకు తెరువుకై ఒక సామాన్య కొలువుకు వెళ్లడం జరగలేదు. అది మీకు మాత్రమే జరిగింది. ఒకప్పుడు ఇప్పుడున్న ప్రభువు అచ్యుతరాయలు సభలో మీరు చేసిన చిత్రవిచిత్రాలకు ఉబ్బితబ్బిబయ్యే వారు. ఇక రామరాయలైతే మీ పట్ల ప్రత్యేక అభిమానంతో ఉండేవారు. ఏదో మిషతో మీకు కానుకలను ఇచ్చేవారు. అటువంటి వారు ఈరోజు మీరు వెళ్లిపోతున్నారని నాలాంటివారు పదేపదే చెప్పినా కనీసం నిలువరించ ప్రయత్నం చేయలేదు. దీనికి కారణం చెప్పగలరా?" అడిగాడు రామలింగని వైపు జాలిగా చూస్తూ......
"ఇంతగా నా గురించి ఆలోచించిన వాడవు అదీ నీవే చెప్పు. నీ సమాధానం నా వద్ద ఉంది. అయినను చెప్పు.."
"ఏముందయ్యా, పదిమందికి వినోదం కోసం మీరు ఒక్కడిని వేలెత్తి చూపేవారు. ఆ ఒక్కడు వందలాదిమంది మధ్య నవ్వులపాలయ్యేవాడు. అలాంటివారు మీకు తెలియకుండానే మీకు శత్రువుల య్యారు. ఇక కడుపుబ్బ నవ్వేవారు ఎంతో ఆనందించినా మీరంటే భయపడేవారు. రాయలవారినే మీరు వేలెత్తి చూపేవారు. అంతటి సాహసం ఎవరు చేయగలరు? అయినను మీరు రోడ్డు మీద ప్రాణాలు పెట్టి మరీ ఆ పని చేసారు. హాస్య కదలికలన్నీ మీపాలిటి ఈరోజు శాపం అయినవి. మీరంటే గతించిన శ్రీకృష్ణదేవరాయల వారికి, తాతాచార్యుల వారికి, తిమ్మరుసు వారికి, అష్టదిగ్గజాలకు, మిగిలిన రాజోద్యోగులకు అందరికి మీరంటే చచ్చేటంత భయం. దేవరాయలవారు మిమ్మల్ని భరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్న అచ్యుతరాయలు, ఓ తప్పుల తడకగా అలవాటుపడిన వ్యసనపరుడు గా, భోగలాలసుడిగా ఉన్నందున మీరు ఎప్పుడైన నిలదీస్తారని భయం. కనుక వదిలించుకుంటున్నారు. ఇదంతా నేనుగా ఊహించినది కాదు. నగరమంతా కోడైకూయుచున్నది. ఇందులో ఏమైనా బాధ కలిగించినట్టు అనిపిస్తే నన్ను మన్నించండి." తనలో ఏదీ దాచకుండా చెప్పాడు.
"కొత్వాలు నీవన్నదానిలో నిజం ఉంది. కానీ నేను నీవన్నట్టు పదిమంది కోసం ఎవరిని వేలెత్తి చూపలేదు. మానసికంగా బాధించలేదు. కానీ నాకు తెలియకుండానే నేను అందర్ని భయపడేట్టు చేసుకున్నాను. కాని విషయాల్లో దూరాను. ఆ పరిస్థితులు అలాంటివి. సరే ఇకనైనా ఇలా జరగకుండా గిరి గీసుకుని బతకగలను. మహామంత్రి తిమ్మరుసు నాకు హాయిగా జీవించేందుకు ఓ అవకాశం కల్పించారు. ఆయన నన్ను శత్రువుగా చూడలేదు" ఒకింత సంతృప్తి వ్యక్తం చేసాడు.
“అందులో కూడా పెద్ద లోపం ఉంది. తిమ్మరుసు తలచుకుంటే ఈ నగరంలో మీకు పెద్ద హోదా కల్పించగలడు. అలాగే ఆయన మాటకు ఇప్పటికి విలువనిచ్చే అచ్యుతరాయలచే ఓ సర్వాగ్రహారాన్ని మీకు కట్టబెట్టించగలడు. కానీ, ఆయన కావాలనే మీ స్థాయిని చిన్నది చేయడానికి ఎక్కడో మారుమూల అతి చిన్న మండలేశుని వద్ద పని చేసే చిన్న జీతగాడి వద్ద కుదిర్చాడంటే అందులో ఎంత కుట్ర ఉందో మీకు తెలియదా ? అక్కడితో మీ కదలికలకు విలువలు లేకుండా చేయడం కాదా ? ఇతర రాజులెవ్వరు వారి ఆస్థానం లో అవకాశం కల్పించకుండా చేయడమే దీని వెనుక ఆంతర్యం.”
రామలింగడు నవ్వి “నాయనా మనిషి ప్రతి కదలికకు రాజకీయాలలో ముడిపెడతారు. నేను కవిని, ముక్కుసూటిగా వర్తించే బ్రాహ్మణుడను. నీవు చెప్పే రాజకీయాలు నాకు బొత్తిగా తెలియనివి. నీవన్నట్టే జరిగితే నాకిది గుణపాఠమే. ఇక శెలవు నాయనా. ఎప్పుడైనా పనిపడితే ఆ మారుమూల మండలేశానికి వస్తే నన్ను కలియకుండా పోవద్దు." అని చెప్పి గూడు బండిలో ఒదిగి కూర్చున్నాడు.
ఆ పక్కనే కూర్చున్న అతని భార్య కన్నీరు మున్నీరు అయి విలపించి “ కొత్వాలు చెప్పినది నిజం కాదా ? మీరు అందరిని పనిగట్టుకుని విమర్శించారు. ఫలితం మళ్లీ మనం తేరుకోలేని విధంగా జరిగింది” అన్నది. ఆమెను అనునయించి కన్నీళ్లు తుడిచాడు రామలింగడు.
కొత్వాలు ఒక వజ్రపుటుంగరాన్ని ఇచ్చి "నేను నా శక్తి మేరకు ఈచిన్న బహుమతిని ఇస్తున్నాను స్వీకరించండి, అన్నట్టు లోగడ వజ్రాల వర్తకుని వద్ద కొనుగోలు చేసిన ఖరీదైన భవంతిని ఒక దశలో రాయల వారు మీరు కాశీ వెళ్లినపుడు స్వాధీనం చేసుకున్నారు. కాశీ నుంచి వచ్చిన వెంటనే మిమ్మల్ని కారాగారంలో పడేయమని ఆజ్ఞాపించాడు. ఎందుకో ఆ తరువాత మనస్సు మార్చుకుని ఆ శిక్షను రద్దు చేసుకున్నారు. ఆ రద్దు అనేది భవనం విషయంలో జరగలేదు. ప్రస్తుతం ఆ భవంతిని సైనికుల శిబిరంగా వాడుతున్నా రు. ఈ మధ్య అచ్యుతరాయల వారికి చెప్తే ఆయన పట్టించుకోలేదు. ఇన్నేళ్ల రాయల వారి సహచర్యం మీకు ఏమీలాభించలేదు. మీరు దురదృష్టవంతులని చెప్పక తప్పదు. హాస్య బ్రహ్మలేకానీ ఆర్ధికబ్రహ్మలు కాలేక పోయారు” అన్నాడు.
“కొత్వాలు ఇక సెలవు.” అని చేతులు జోడించాడు రామలింగడు.
పడమటి కొండల్లోకి సూర్యుడు మెల్లగా ఒరిగిపోతుంటే రామలింగ కవి గూడుబండి నగరం వదిలి సన్నని బాటలో ఒక కొత్త దిక్కుకి సాగిపోయింది..విజయనగరానికి వీడ్కోలు చెప్తూ...
*సమాప్తం*
రేపు మరొక కధ చదువుకుని ఈ కధలను ముగిద్దాం. కొంత విరామం తరువాత పాఠకుల కోరికపై మళ్ళీ అక్బర్ బీర్బల్ చరిత్రతో కూడిన హాస్య కధను చదువుకుందాం...
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*తెనాలి రామకృష్ణ - 36*
👳♀️
*మనిషి బుద్ధిగల చిలుక - 1*🦜
"ప్రభూ ! రామలింగకవి వద్ద ఉన్న మాట్లాడే రామచిలుకకు తెలియని శాస్త్రమే లేదంటే అతిశయోక్తి కాదేమో ! ఆ పిట్టని ఆ కవికి ఎవరో మహనీయుడు ఇవ్వగా లభించిందట. అట్టి పక్షిని అతను కేవలం పండ్లు పెట్టి పెంచగలడు. అదే మన మందిరంలో ఉంటే ఎలా ఉంటుంది? బంగారు పంజరంలో తియ్యనిపండ్లు, అడవి తేనె, సామాన్యులకు దొరకని అరుదైన కాయ ధాన్యాలు ఆ పక్షికి పెట్టి సాకగలం. దానికి మరింత మేథస్సు పెరగగలదు." అని పట్టపురాణి రాయల వారి దృష్టికి తీసుకువెళ్లింది. ఎలాగైనా ఆ రామచిలుకను తను పెంచాలనే కోరికతో ఓ రాత్రి తన మందిరంలో రాయలవారిని కోరింది.
"మహారాణీ ! ఆ కవి వద్దనున్న చిలుక ఎందుకు ? అంతకంటే మరింత అందమైనవి తెప్పించి ఈ మందిరం నింపగలను. ఆ కవి ఒక రకంగా తిక్క మనిషి, ఏ మాత్రం భయపడకుండా ఇవ్వనని మొండికేసిన మనమేమి చేయలేం” నచ్చజెప్పచూసాడు రాయలు.
“మన్నించండి మహారాజా ! ఆ చిలుక పలు శాస్త్రములను వల్లెవేసినది అని విన్నప్పటి నుంచి దానిని పెంచవలెనని దానితో సరదాగా గడపాలని ఆశ పడ్తున్నాను. నా ఈ చిన్ని కోరిక తీర్చండి" అని వేడుకుంది పట్టపురాణి. రాయలు ఆలోచించి చివరికి పట్టపురాణి చిరు కోరిక కాదనలేక సరేనని మరుసటిరోజు రామలింగకవిని స్వయంగా అడిగాడు. అందుకు రామలింగడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
క్షణాలలో పంజరంలో చిలుక పట్టపురాణి ఇంటికి చేరినది. "రామలింగా నీవు ఇంత త్వరగా ఒప్పుకుంటావనుకోలేదు. నీవు చాలా వింతైన మనస్సుగలవాడివి. ఏది ఏమైనా మా రాణివారి కోరిక నీ సమ్మతితో తీర్చాను " అని రాయలు సంబరంగా చెప్పాడు.
"ప్రభూ ఆ చిలుక మనిషిబుద్ది గల పక్షి. అది ఒక ముని ఇవ్వగా పుచ్చుకున్నాను. అది తర్కశాస్త్రములో దిట్ట. నా వద్ద చాలా కాలంగా ఉన్నా, దానికి రాజుల నీడన బతకాలనే ఆశ ఎక్కువ. ఈరోజు చాలా సంబరపడిపోయి ఉంటుంది. పోనీ, నావద్ద ఏమి తింటుంది. పండ్లు నేతిమిఠాయిలు తప్ప. రాణివాసంలో ముద్దముచ్చటగా జీవించగలదు. ప్రతి రాత్రి దాని చిలుక పలుకులు వింటూ నిద్రపోయేవాడిని. తమరిమాట కాదనలేక ఇచ్చాను.” దీనవదనంతో చెప్పి బయలుదేరాడు రామలింగడు.
రాయలకు ఆ చిలుకను తక్షణం చూడాలని ఆశ పుట్టి వెంటనే పట్టపురాణి ఇంటికి వెళ్లాడు. అక్కడ బంగారు పంజరంలో చిలుక ఉల్లాసంగా కనిపించింది. రాణి, ఆమె దాసీజనాలు చుట్టుముట్టి కేరింతలు కొట్టసాగారు. రాయలను చూడగానే “రాజాధిరాజా! యవనరాజ్య స్థాపనా చార్యుడా, సాహితీసమరాంగణ చక్రవర్తి స్వాగతం! సుస్వాగతం!!" అని పంజరం లోంచి ఎలుగెత్తి పలికింది చిలుక. అంతా నోళ్లు వెళ్లబెట్టి మరీ విన్నారు. రాయలు మతి తప్పినవాడిలా పంజరంలోకి చూసాడు. అక్కడ నిశ్శబ్ధం చోటు చేసుకుంది.
“ఓ శుకరాజమా! నీచతుర సంభాషణ నాకు చాలా ఆనందింపచేసింది. ఎవరు నేర్పారు నీకీ మధురపలుకలు." అని పంజరంపై చిటికె వేసి మరీ అడిగాడు.
"విద్య ఒకరు నేర్పితే వచ్చేది కానీ, నాకు ఎవరు నేర్పలేదు. గురువు లేని విద్య నాకబ్బినది. అదెట్లన్న చెట్టు తొర్రలో శిశువుగా ఉన్నప్పుడు ఒక బోయవాడు నా తల్లితండ్రులను వధించి నన్ను నా తోటి మరో ముగ్గురన్నదమ్ములను వాడి బుట్టలో వేసుకుని, ఇంటిముఖంపట్టాడు. బుట్టలో మా ప్రక్కనే జన్మనిచ్చిన నా తల్లితండ్రుల శవములు చూసి నేను మా అన్నదమ్ములు కంటికి మింటికి ఏకధాటిగా ఏడ్చాం. పసివాళ్లం ఎగురుటకు రెక్కలు ఇంకా రానందున బిక్కు బిక్కుమంటూ ఉన్నాం. బోయవాడి గుడిశెలో వాడి పిల్లలు బుట్ట లోంచి మమ్మల్ని తీసారు. పిట్టలన్నిటిని వండమని చెప్పాడు బోయివాడు.
“మరీ పిల్లపచ్చులు కొన్నాళ్లు పోయాక వండుకుంటే బావుంటాది." అని అతడి పెళ్లాం చెప్పి మా తల్లితండ్రులను నిప్పుల మీద కాల్చి ఆ తల్లీ పిల్లలు ఇష్టంగా తినే దృశ్యం ఇంకా నా కళ్ళలో కదులాడుతోంది. ఆ రాత్రి ఆ బోయిగుడిశెలో నన్ను తప్ప మిగిలిన నా సోదరులను ఓ పిల్లి వచ్చి ఎత్తుకుపోయింది. ఒంటరిగా ఉన్న నన్ను ఆ బోయిపిల్లవాళ్లు ఆడుకునేందుకు అడవి అంతా తిప్పేవారు. వారూ దయాహీనులు. వారి రాక్షసక్రీడకు ప్రాణములు ఏ క్షణమైనా పోయేవి. ఆ అడవిలో దర్బలు ఏరుకుంటు న్న ఓముని నన్ను చూసి..
“ఏయ్ పిల్లలూ ఆ చిన్ని చిలుక నిలుగుడ్లు వేయుచున్నది. కొంచెం నీరు పట్టినా బతకవచ్చు" అని జాలిపడ్డాడు.
"ఇది ఛస్తే కాల్చుకు తింటాం” అని బదులిచ్చి ఆ రాకాసి పిల్లకాయలు మరింత నన్ను హింసించారు. ఆ మునికి కోపం వచ్చి వారి నుంచి నన్ను లాక్కుని దయతో సాకాడు. అతడు రాచబిడ్డలకు విద్యలు నేర్పేవాడు. అవి విని నాకుగా నేను నేర్చుకున్నాను. ఆ గురుకులంలో చాలా కాలం ఉన్నాను.
ఒకసారి ఆ ముని తనను చూడవచ్చిన రామలింగానికి నన్ను ఇచ్చి ఇది ఓ వింతైన చిలుక. శాస్త్రము తెల్సినది. నీకు పనికి వస్తుంది అని చెప్పాడు. అప్పట్నించి ఆ కవి వద్ద నేటి వరకు ఉన్నాను." అని తన పాతజీవితం గురించి చెప్పింది.
ఆ కథ విని రాణి బొటబొట కన్నీరు కార్చింది. ఆమెను చూసి దాసి జనం కూడా కన్నీరుమున్నీరయ్యారు. రాయలు విచార వదనంతో ఆ శయన మందిరంలో తల్పం పై నడుం వాల్చాడు. దాసిలంతా వెళ్లిపోయారు. తన కాళ్ల దగ్గర కూర్చున్న రాణీని చూసి "దేవీ పశుపక్ష్యాదుల్లో కూడా ఇలాంటి గాధలుంటాయా?” అని బాధపడ్డాడు. ఆ తరువాత మౌనంగా ఉండిపోయారు.
పంజరంలో చిలుక “నా గురించి మీరు బాధపడకండి. ఆనందంగా ఈ రేయి గడపండి." అని మృధుమధురంగా పలికింది. ఇద్దరూ అయోమయంగా పంజరం వైపు చూసారు.
తెలతెలవారుతుండగా రాణి తల్పం పై నుంచి లేచి దుస్తులు సరి చేసుకుని పంజరం గుర్తుకు వచ్చి అటు చూసింది. చిలుక నిశ్చల చిత్రంలా కనిపించింది. దగ్గరగా వెళ్లి చూసింది.
"రేయి బాగా గడిచిందా? రాయలు వారు రశికులే ! ” అని నవ్వింది.
ఆ మాటలకు రాణి వారికి నిలువెత్తు సిగ్గు ఆవరించింది. మళ్లీ ఒక పక్షి మాటలకు తాను సిగ్గపడినందుకు నవ్వుకుని "ఏయ్ నువు భలే కొంటె చిలుకవు" అని అభినందించి తియ్యనిపండ్లు పెట్టింది.
"ఓ పట్టపురాణి, నీకు రాయలువారంటే ఎంతో ఇష్టం కదూ !" అడిగింది చిలుక.
" ఆయనంటే ఇష్టమే కాదు. నా ప్రాణం చూసావా. నేను కోరగానే నిన్ను ఆ బాపని నుంచి తీసుకువచ్చారు. నేనన్న ఆయనకి అంతులేని ఇష్టం. నీకు నిజమే చెప్తున్నా, నేనంటే ఆయనకు ప్రాణం" ఎరుపెక్కిన బుగ్గలతో చెప్పింది.
“మరీ గొప్పలు చెప్పకు, ఓ చిలుకను మీ వద్ద బతికీడ్చినవాడి వద్ద నుంచి తెచ్చి ఇవ్వడం కూడా ఈడేర్చిన కోరిక ఎలా అవుతుంది ?
"మగాడిని అనాదిగా ఆడది నమ్మి చెడిపోతోంది. అంతెందుకు రాయలవారికి నీవు మూడో పట్టపుభార్యవు. మీరే కాకుండా ఆయనకు మరి తొంబండుగురు భార్యలున్నారు. నీలాగనే ఆయనకు పన్నెండుమందీ ప్రాణప్రదములే. నీవు కోరినది చిలుక కనుక ఇవ్వగలిగాడు. భార్యలను త్యజించమంటే మగాడిగా అతడి బుద్ధి బయటపడుతుంది.” ఆ చిలుక కిలకిలలాడుతూ చెప్పింది. ఆ మాటలను విని అంతులేని ఆశ్చర్యానికి గురయ్యింది పట్టపురాణి.
నిద్రమేల్కొని రాయలు లేచి వచ్చాడు.
“ఏమిటి నాకంటే ముందు చిలుక పలుకులు వింటున్నావు.” అని నవ్వుతూ అడిగాడు. రాణి ఒక్కక్షణం అక్కడ నిలువకుండా రాయలు వైపు చురచురా చూస్తూ వెళ్లిపోయింది. అర్ధంకాని రాయలు “ఓ చిలుక రాజమా, నా దేవి ఎందులకు ఏదో అలక బూనినట్లున్నది.” అని చిలుకకి అర్ధం అవుతుందో లేదోనని ముద్దుగా అడిగాడు.
"నీవంటి బహుభార్యలున్నవాడిపై భార్య అలకబూనదు ? చూసావా, రాజా! ఆమె కోరికపై నన్ను తెచ్చి ఇచ్చావు. క్షణికమే కదా ఆమె ఆనందం. ఒక్క విషయం చెప్తాను. పులిపాలను తెచ్చి ఇచ్చినా, ధనరాసులు కుప్పలుపోసినా, నమ్మని ఆడదాన్ని ఎవరూ నమ్మించలేరు. నిన్ను నీ భార్యలెవరూ నమ్మరు, స్త్రీ మనస్సు ప్రళయాంతకం కదా !"
ఆ చిలుకపలుకులు విన్నంతనే రాయలకు తల తిరిగిపోయింది. ఏమీ ఈ చిలుక యధార్థవాదం. ఎంత చక్కగా చెప్పినది. రాత్రంతా నాతో శయనించిన రాణివారు ప్రేమతో లేరన్నమాట. చిలుకన్నట్లు బహు భార్యలున్న వానికి ఏ భార్య నమ్మకంగా ఎటులుండగలదు? తనలో తర్కించుకోసాగాడు.
*సశేషం*
రేపు మరొక కధ చదువుకుని ఈ కధలను ముగిద్దాం. కొంత విరామం తరువాత పాఠకుల కోరికపై మళ్ళీ అక్బర్ బీర్బల్ చరిత్రతో కూడిన హాస్య కధను చదువుకుందాం...
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
**తెనాలి రామకృష్ణ - 37*
👳♀️
*మనిషి బుద్దిగల చిలుక - 2* 🦜
"రాజా! నీతి శాస్త్రం చదివితివి కదా, ఎవరో పరపురుషునికి ఆనందాన్నిచ్చే దాన్ని కావాలంటే నీవు ఏరీతినో తెచ్చుకుని ఆ ఆనందం అనుభవించవచ్చు. కానీ అట్టి పురుషుని వద్ద నుంచి తెచ్చిన దాన్ని అంటే నన్ను నీ కాంతకు కానుకను చేయడం ఎంత వరకు సబబు. పరపురుషుని వద్ద ఉన్న దేనినైనా మన హిందూ స్త్రీలు ఆశించి కోరవచ్చునా ! ఇది ఏ ధర్మం ?"
రాయలు ముఖంలో నెత్తురుచుక్క మిగలలేదు. అదోలా అయిపోయాడు.
"ఓ చిలుకా నీ పలుకులు ధర్మబద్ధమైన ఆణిముత్యాలు. చాలా పెద్ద తప్పుచేసాను. ఎవరక్కడ ? ఈ బంగారు పంజరంలో గల చిలుకను మా మందిరంకు తక్షణం చేర్చండి" దాసీలకు ఆదేశించి వెనుదిరిగి వెళ్లిపోయాడు.
రాయలు పట్టపురాణివారి మందిరం నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినందు న ఒక రకమైన కలకలం మొదలయ్యింది. కొంతమంది దాసీలు "అమ్మా ఈ చిలుకను మహారాజు తన మందిరానికి పంపించేయ మన్నారు. ఆయన ఎందుకో చాలాకోపంగా ఉన్నారు. మీరేమో స్నానానికి వెళ్ళారు. ఏం జరిగిందేమో” అని భయంతో విన్నవించారు.
రాణివారికి ఏమీ అర్ధంకాలేదు. పంజరంలో చిలుక మరింత ఉల్లాసంగా ఉంటూ "ఓ పట్టపురాణీ! రారమ్ము, చూసావా నీ విభుడు, నీవంటే పడిచచ్చునంటివి. ఏదీ అతని ప్రేమ ? వంతుల వారిగా భార్యలతో ఉన్నవాడికి నీ ఒక్క దాని పై ఏ శాతం ప్రేమ ఉంటుంది. ఎంత గుడ్డిగా నమ్మిఆరాధించు చుంటివి. నిన్ను చూస్తుంటే ఎనలేని జాలివేయుచున్నది.” అన్నది.
"నీతో ఏమైనా అన్నారా? దాచకుండా చెప్పు" ప్రాధేయపడింది పట్టపురాణి. ఆమె కళ్లు పెద్దవయ్యాయి.
"ఓ పట్టపురాణీ ! నీవును ధర్మశాస్త్రములు చదివితివి కదా ! పరపురుషుని వినోదాన్ని నీవు కోరవచ్చా ? నేను రామలింగకవి వద్ద ఉన్నాను. ఇళ్ల కాకుల్లాంటి నీ దాసీల కన్ను ల్లోపడ్డాను. వారు అద్భుతమైన రామ చిలుక ఉందనడం నీవు ఉచితానుచిత జ్ఞానం లేక ఏకంగా రాయల వారినే కోరడం బహు భార్యలోలుడైన ఆ రాజు ముందు వెనుకలను ఆలోచించక ఆ చిలుకను నీకు తెచ్చి కానుక చేసినందుకు ఇప్పుడిప్పుడు తను చేసింది తప్పని తెలుసుకుని కృద్ధుడైనాడు.” రామచిలుక రాణికి అర్ధమైయ్యేలా చెప్పింది.
పట్టపురాణి ఆ మాటలకు భయబ్రాంతమై పోయింది. “నేను తెలియక తప్పు చేసాను" అని బావురుమంది. దాసీలు ఆమెను ఓదార్చారు. అందులో ఒక దాసీ “అమ్మా ఈ దిక్కుమాలిన చిలుక వచ్చింది. అందుకే అనర్ధాలు దాపురించాయి. ఈ పాడు చిలుక ఇందాక మహారాజుగారికి ఏమేమో నూరిపోసింది. మేము దూరం నుంచి విన్నాం " చెప్పింది చిలుకను చూసి గుర్రెత్తిపోతూ.....
"నిజమే ఇదంతా ఈ చిలుక ప్రభావమే. ఈ చిలుక నా పై చాడీలు చెప్పి ఉంటుంది. దీన్ని చంపి పాతరేయండి. ఇట్టి నీచపు పక్షులు బతకరాదు. నాకూ చెప్పింది మహా రాజుపై, నేను నమ్మి ఆయనపై అలకబూని చెప్పకుండా స్నానానికి వెళ్ళిపోయాను. వచ్చేలోగా ఈ ముదనష్టపు చిలుక నాపై ఏవేవో రాజుగారికి చెప్పి ఆయన మనస్సు విరిచింది. అసలు ఇది ఎక్కడ పెరిగింది? తెనాలి రామలింగని వద్ద, అతడికి పెంచి పోషించే రాజే లేక కాదు. ఈమధ్య భువన విజయంలో అందరి సమక్షంలో మహా రాజునే ఆడిపోసుకున్నాడట. అట్టి నోటి తీటగల వ్యక్తి పెంపకంలో ఈ నీచపు పక్షికి మనష్యుల రాగద్వేషాలు బాగానే వంటపట్టాయి. రాజుగారి మనస్సు విరిగితే అంత త్వరగా అతకదు...... ఏంటి దారి ?" అని పట్టపు రాణి తల పట్టుకుని కూర్చుంది.
"అమ్మా దీన్ని వండుకుని తినేస్తామమ్మా మనల్ని ఇంతగా బాధపెట్టిన దీన్ని ఇలా వదలరాదు.” ఒక దాసి ఎరుపెక్కిన కళ్లతో చిలుక పంజరం వైపు కసిగా చూస్తూ అడిగింది.
"మరి మహారాజుగారు అడిగితే ?” రాణీ భయం వ్యక్తం చేసింది.
“మీరు భయపడకండి. పంజరం మీ వద్దకి తెస్తుండగా తప్పించుకుపోయింది అని చెప్తే సరిపోతుందమ్మా!”
"ఓసీ దాసీ, నన్ను చంపేశక్తి నీకుందే! నేను యధార్ధవాదిని. అందుకే లోకవిరోధిని అయ్యాను. నేను ధర్మశాస్త్రపారంగతుడ ను. నన్ను నిర్జించినా మీకు పుట్టగతులుం డవు. స్త్రీ బుద్ది ప్రళయాంతకం అని ఊరకనే పెద్దలు చెప్పలేదు. ఓ రాణీ నీ వెనుక కూటికి చేరిన దాసీజనాల మాటల ను పట్టించుకోవద్దు. ఇప్పటికైనా నీ పురుషుని ఆదేశాలను గౌరవించి నన్ను రాయలమందిరానికి చేర్చు. ధిక్కరించి మళ్ళీ తప్పు చేయకు.”
చిలుక మాటలు విని పట్టపురాణికి పట్టరాని కోపం వచ్చింది.
“దరిద్రపు చిలుకా! నీ గొంతు ఈ మందిరం లో నేను వినకూడదు. నా ఉసురు నిన్ను దహించివేస్తుంది.” అని ఇంకా ఏమేమో అంటుండగా...
“జయము జయము రాణీవారికి ....... " అని వినయంగా నిలుచున్నాడు కొత్వాలు. ఒక పత్రం చదివాడు. అది విని అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్షణం నుంచి పట్టపు రాణి హోదా నుంచి తొలగింపబడి కేవలం రాణిగా మాత్రమే మహారాజు గుర్తిస్తున్నట్టు ఆ పత్రంలో సారాంశం. అంత వరకు 120 మంది దాసీజనాలతో కళకళలాడిన ఆ భవనంలో కేవలం 21 మంది దాసీలు మాత్రమే మిగిలారు. రాజుగారి ఆదేశాలు క్షణాల్లో అమలులోకి వచ్చేసాయి. శోకమూర్తి అయ్యింది రాణి. ఆమె చుట్టు మిగిలిన దాసీలు కూర్చుని ఆమెను ఊరడించసాగారు.
“మన్నించండమ్మా మాకు రాణీవాస ప్రవేశం నిషిద్దం. కానీ, ఉన్నపళంగా మహారాజుగారే ఇలా ఆదేశాలు అమలు చేయమన్నారు. చివరగా తమ వద్ద ఉన్న బంగారు పంజరంలో గల చిలుకను అత్యంత జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు. తీసుకుపోదునా తల్లీ!” కొత్వాలు చేతులు కట్టుకుని అడిగాడు.
"ఓయీ! ఇదిగో నేనిందున్నాను. నీవు ఏ కొంత ఆలస్యంగా వచ్చినా నా ప్రాణములు నిలుచునవి కావు. ఇక్కడ దాసీజనాలు స్త్రీ మూర్తులుగారు కసాయిలకుప్రతిరూపాలు. చిన్ని చిలుకను నన్ను చంపి తినేవరకు వెళ్లారు. ఎటులనో ఆ మాట ఈ మాట చెప్పి ఇంతవరకు నా బతుకు బతికితిని.” అని చెప్పింది చిలుక.
కొత్వాలు అంతులేని ఆశ్చర్యంతో పంజరం వైపు చూడసాగాడు. అలా మాట్లాడే చిలుకను చూడటం ఇదే మొదటిసారి.
“అమ్మా ఈ జుహీరున్నీసా వలన మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఖతర్ నక్ చిలుక గురించి చెప్పాను. పాపం ముచ్చటపడి తెప్పించుకున్నారు. ఇది పాగల్ పంచీ (పిచ్చి చిలుక) మొత్తం మహల్ గలీజ్ (మురికి) చేసింది, రాజా వారితో మీకు లడాయి పెట్టింది. రాజా వార్కి మై సచ్ బోల్తా హూ! ముజ్ కో ఆజ్ఞా దీజియే " అని కళ్ల నీళ్లు తిప్పుకుని మరీ అడిగింది ఒక దాసీ.
"ఏ సాయిబుల బచ్చీ, నీవు వచ్చీరానీ తెలుగు ఉర్దూ కూతలు కలగలిపి రాయల వారికి చెప్తే ఈ రాణమ్మకు మంచికి బదులు బహుత్ బురా (పెద్దచెడ్డ) చేస్తావు. అసలే తోక తొక్కిన పాములా ఉన్న రాయలు వారు మీ సాయిబుల పద్ధతిలో మన రాణమ్మకు 'తలాక్ తలాక్ తలాక్ అని మూడుసార్లు చెప్పేయగలరు. అప్పుడు ఈ చిన్ని రాణీవాసం కూడా ఉండదు. ఏ ఊరవతల విడిదికే పరిమితం అవుతారు." అని పంజరం లోంచి పెద్ద గొంతుతో చెప్పింది చిలుక.
జుహీరున్నీసా కోపంతో పండ్లు పటపట కొరికి “చుప్ బద్మాష్,. మార్ డాలుంగీ ” అని చిలుక పై కస్సుమని అరిచి ఇటు తిరిగి "అమ్మా ఈ పిచ్చి చిలుక తలాక్ అని కూసింది. అంటే ఏమిటో మీకు తెలుసా? తలాక్ అని మూడుసార్లు చెప్తే శాశ్వతంగా విడిపోవడం మా ముస్లింలలో ఉంది. ఈ చుప్పనాతి చిలుకకు మా మతం మీద కూడా పట్టుంది. దీని మాటలు వింటే గుస్సాగా ఉంది” అని కళ్లు తుడుచుకుంది.
ఆ పక్కనే ఉన్న కటకానికి (ఒరిస్సా) చెందిన ఓ దాసి చిలుకను చీదరించుకుని “కదొకు జిబొ కాహిఁకి ? గౌడొ యిబొ కాహిఁకి" అని చెప్పి బాధపడింది.
"ఏమంటున్నావు ? నాకు ఒక్క ముక్క అర్దంకాలేదు. ” జుహిరున్నీసా అడిగింది ఆ ఓడ్రపుదాసీ అమ్మాయి ఒరియా మాటలకి.
పంజరంలో రామచిలుక రెక్కలు టపటప లాడిస్తూ “నన్ను అడుగు నేను చెప్తాను. ఆ దాసి కటకానికి చెందినది. అంటే ఓడ్రపు భాష అమ్మాయి. ఏం కూసిందీ అంటే అడుసు తొక్కనేల, కాలు కడుగనేల అని అర్ధం. ఆ దాసి వచ్చింది ఓడ్రపు దేశం కటకం (కటక్) నుంచి. పట్టపురాణి అన్నపూర్ణాదేవికి పుట్టింటి వారిచ్చిన దాసీ జనాలలో ఈమె ఒకతే. ఆ పట్టపురాణి వారితో ఏంసరిపడలేదో ఏమో కానీ ఈ రాణీవాసానికి వచ్చింది" అని చిలుక ఆ ఓడ్రపు దేశపు దాని గురించి మొత్తం వివరించింది.
అంతా హడలెత్తిపోయారు." ఓర్నాయినో ఇది తగువులమారి చిలుకే కాదు. దీనికి తెలియని భాష లేదు. ఈ విజయనగర సామ్రాజ్యంలో తెలియనిది లేనట్లుంది. దీని నోట్లో నోరు పెడితే, ఇది మన నోట్లో ఇంత గడ్డిపెడుతోంది. కొత్వాలయ్యా దీన్ని త్వరగా తీసుకుపో ! " ఓ తెలుగు దాసి చెప్పి పంజరాన్ని చేతికి అందించింది.
👳♀️
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
[09/03, 6:24 pm] P.Haribabu: *తెనాలి రామకృష్ణ - 38*
👳♀️
*మనిషి బుద్దిగల చిలుక - 3* 🦜
"ఏమేవ్ తెలుగుపిల్లా ! నువ్వు కార్య వాదివి. నన్ను ఎలా వదిలించుకున్నావో ! ఈపాటి బుద్ధి ఆ సాయిబుల పిల్లకు, ఒరియా పిల్లకు బొత్తిగా లేదు. మీ రాణమ్మ కు చెప్పు ఇలా చిలకలు, ఎలకలతో ఆడుకుంటే కాదే! చక్కగా రాయలవారికి ఓ వారసుడిని కని ఇమ్మనే. పాపం వారికి భార్యలధికం కానీ, ఒకరిద్దరు తప్ప మిగిలినవారు సంతానంతో కళకళలాడడం లేదు” చివరిగా ఆ మాటలంది ఆ గయ్యాళి చిలుక.
"అమ్మా చూసారా ఆ రాలుగాయి చిలుక ఎంతలేసి మాటలాడుతోందో !" మరో దాసి రాణివారితో బాధపడ్తూ చెప్పింది.
“అదో చుప్పనాతి పక్షి దాని విషయం వదిలేయండి. రాయలవారికి నేనంటే ఎంతిష్టమో మీ అందరికి తెలుసుకదా, ఆయన ఎందుకు ఇలా మారిపోయారు. నేను ఏ తప్పు చేసాను." చుట్టూ కూర్చున్న దాసిలను అడిగింది రాణి ఏడుస్తూ.
"అమ్మా మగాడిని నమ్మరాదమ్మా ! అందులో రాజులను అసలునమ్మకూడదు" ఓదాసి చెప్పింది. కళ తప్పిన రాణీవాసం అయ్యింది.
📖
రాయలవారి ముంగిట పంజరం పెట్టి చేతులు కట్టుకున్నాడు కొత్వాలు. రాయలు చూపులు చిలుక పై నిలిచాయి.
"ఓ చిలుకా నువ్వు రామలింగకవి వద్ద శుశ్రూష చేసినదానవు. అతనివలే నీకు వేపకాయంత వెర్రి ఉంది కదూ ! ఏమాత్రం భయమన్నది లేకుండా ఏకంగా నా పట్టపు రాణిపై అభాండాలు వేసావు. అక్కడ మహరాజుగా ధర్మసంరక్షకుడిగా ఆమె పై చర్య తీసుకున్నాను. ఆమె పై ఎంతటి తీవ్ర ఆరోపణలు చేసావు. ఆమె పరపురుషుని గురించి అలోచించినట్లు చెప్పి రుజువు చేసావు. నీవు చిలుకవు అయిపోయావు లేకుంటే మనిషివయి పుట్టి ఉంటే ఎంత ప్రమాదం".
“మన్నించండి. నేను యధార్దవాదిని. నేను చెప్పినదానిలో నిజం లేకపోయినా, నిజమే అనేట్టు భ్రమ ఉంది. అదే ఆమె పాలిటి శాపం అయ్యింది. వాస్తవానికి ఆమె పరపురుషుని గురించి ఆలోచించలేదు. అమాయకంగా మాటలాడే చిలుకను కోరుకుంది, ఇక్కడే ఆమె తెలియకుండా పొరపాటు చేసింది. ఏలినవారు నన్ను మన్నించి ఆమెను క్షమించి ఆమెకు మీ మనస్సులో పూర్వ వైభవం కల్పించమని ప్రార్దిస్తున్నాను.” కొత్వాలు పరిసరాలను మరిచి చిలుక మాటలను వింటున్నాడు.
“ఓ చిలుక నేను నా పట్టపురాణిని క్షమించినచో నా నీతి, నా ధర్మం తప్పు పట్టవు కదా !”
"చెప్పాను రాజా ! చేయని నేరం ఆమెది. కనిపించే నేరాన్ని శిక్షించే రాచరికం తమది. మీరు శిక్ష విధింపుతో ధర్మబద్ధుడు అని అనిపించుకున్నారు. ఇప్పటికే ఆమె శోకమూర్తి అయ్యింది. ఆమెను కరుణించండి.”
రాయలవారికి ఇంతవరకు చిలుక పై ఉన్న కోపం ఇప్పుడు అది చెప్పిన ధర్మమైన మాటలకు చాలా వరకు తగ్గిపోయింది. సరిగ్గా అప్పుడే విచ్చేసాడు మహామంత్రి తిమ్మరుసు.
"నాయనా ఏదో చిలుకను తెచ్చావట. అది రాణీవాసాన్ని అల్లకల్లోలం చేస్తోందట. అలాటి దుష్టపక్షులని మనం భరించలేము. దాని పీడ వదిలించుకోవడమే ఉత్తమ లక్షణం" చెప్పాడు.
కొత్వాలు గుటకలు మ్రింగుతూ ఇద్దర్నీ చూడసాగాడు. రాయలువారు చిన్నగా నవ్వి "అప్పాజీ ! అదిగో ఆ రామచిలుక " అని చూపాడు. తిమ్మరుసు ఆశ్చర్యంగా చూసాడు దాని వైపు.
"సుస్వాగతం మహామంత్రివర్యులకు, తమను దర్శించినందుకు నా జన్మ ధన్యం అయ్యింది. మీరు నన్ను దుష్టపక్షిగా సెలవిచ్చారు. ఆ మాటలకు ఏ బాధా లేదు. కానీ, తమ నోట అటువంటి మాటలు రావచ్చా ! నాడు అవసానంలో ఉన్న వీరనరసింహరాయలవారు కొలువులో మంత్రిగా వెలగబెట్టిన మిమ్మల్ని ఆతడు కోరినది ఏమిటి ? మీరు చేసినది ఏమిటి? పాపమాతడు మిమ్మల్ని నమ్మి తన కొడుకుకి పట్టం కట్టమని తన సవతి తమ్ముడైన మన ఏలిక రాయలువారిని చంపి ఆనవాలుగా కండ్లు తీసుకురమ్మని కోరితే, దాచి మేక కనుగుడ్లు తెచ్చి చూపి పాపమా వీరనరసింహరాయల వారి ప్రశాంతమైన చావుకు కారకులైయ్యారు. ఓ మంత్రి పదవిలో ఉండే మీకు ఇన్ని రాజకీయపు టెత్తులు అవసరమా ? మీ చాతుర్యం ఎంతటిదో చరిత్రలో కొన్ని పుటలు చెప్పకనే చెప్తాయి. మీకు పూర్ణ ఆయుష్షు ఉండి మళ్లీ రాయలవారి వారసత్వం విషయంలో మీ పాత్ర ఏ విధంగా మలుపులు తిరుగుతుందో?” చిలుక పలుకులు వింటూ రాయలు, తిమ్మరుసు, కొత్వాలు అవాక్కయ్యారు.
తిమ్మరుసుకు ముఖంలో నెత్తురుచుక్క లేకుండా అయిపోయింది. రాయలు భృకుటి ముడిపడింది. అతని మనస్సు అంతా ఆలోచనలతో ముసురుపట్టినట్టు అయ్యింది. పక్కనే ఉన్న తిమ్మరుసు వైపు చూడలేక చూసాడు. తిమ్మరుసు అంతటి వృద్ధాప్యంలో కూడా చిలుక పలుకులను విని తట్టుకోలేక మొలలో ఉన్న కరవాలం పై చేయి బిగించాడు. ఆ తరువాత తమాయించుకున్నాడు. గట్టిగా కన్నులు కొన్ని క్షణాలు మూసుకుని భారంగా తెరిచాడు.
నిశ్శబ్దం ఆ మందిరంలో కొన్ని క్షణాలు రాజ్యమేలింది.
"మనిషి బుద్ది గల ఈ పక్షి రాజమందిరంలో ఉండడం చాలా ప్రమాదం. ఇది శత్రువులా తేనె పూసిన మాటలను ఎలాంటి జంకు లేకుండా, ప్రాణభీతి లేకుండా ప్రేలుతోంది. అవశ్యం దీన్ని వదిలించుకోవాలి.” అని తిమ్మరుసు చిరు కోపం ప్రదర్శించాడు.
రాయలు ఏమీ బదులీయకుండా చిలుక వైపు చూస్తూ నిలబడ్డాడు.
"కొత్వాలు ఇది పక్షి అయిపోయింది కనుక బతికిపోయింది. దీన్ని పెంచి పోషించిన వాడు ఆ తెనాలి రామలింగడు కదా ! ఆ మధ్య ప్రభువులనే అతడు తొలిసారి భువనవిజయంలోకి అడుగుపెట్టిన రోజే అవమానించాడని విని తల్లడిల్లిపోయాను. కవులు, పండితులు, కింది ఉద్యోగులు, సామంతులు, పాలెగాళ్లు, ఇలాంటి కఠోర పలుకులను పలికే నీచ పక్షులను వారి స్థాయిని మించి ఎదగనీయరాదు. ఆరోజే తెనాలి రామలింగడిని శిక్షించి ఉంటే ఈ పక్షి ఇలాంటి కూతలు కూసి ఉండేది కాదు కదా ! " అని తనలో ఏదీ దాచుకోకుండా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు తిమ్మరుసు.
"ఓ చిలుకా నువ్వు తిరిగి రామలింగని ఇంటికి వెళ్లిపోతావా?” రాయలు దానివంక విచిత్రంగా చూస్తూ అడిగాడు.
"ఏం మహారాజా ! తిమ్మరుసువారు నన్ను వదిలించుకోమన్నారని, ఆయన మాటలకి విలువనిచ్చి సాగనంపుతున్నారా ? మీరు పంపినా నేను వెళ్లను. ఆ కవీశ్వరుని వద్ద శుశ్రూషతో నా జన్మ ధన్యం అయ్యింది. ఆయన మాట పెళుసు,ముక్కుసూటితనం నాకు వచ్చాయి. తప్పుడు మాటలు ఆడనంతవరకు మనకేమీ కాదు. లేనిపోని అభాండాలు చెప్తే మన విలువలు నశిస్తాయి, ఎదుటివారిని బాధించే వారవుతాం, శారీరక హింసకు గురువుతాం అదే నాకు తెలిసింది." అని అందంగా చెప్పింది.
"నీ వంటి పక్షి మాటలను నిత్యం వినాలని ఆనందించాలని ఉంది. కానీ, నీ కుండ బద్దలుకొట్టిన విధం ఒకింత అయోమయం లోకి నెట్టేస్తోంది." అని చిలుకకు చెప్పి, కొత్వాలుతో “ నీవు ఇక్కడ ఉన్నట్టుగా వెళ్లి రామలింగని తీసుకురావాలి. ఆయన ఎంతటి పనిలో ఉన్నా ఇది రాయలవారి అత్యవసర పిలుపుగా చెప్పి తీసుకురా !" అని చెప్పి పంపాడు రాయలు.
చిలుక, రాయల మధ్య మౌనం చాలాసేపు సాగింది. తిమ్మరుసు, చిలుక చెప్పిన విషయాలను గురించి రాయలు పదేపదే ఆలోచిస్తూ మందిరంలో అటు ఇటు పచార్లు చేయసాగాడు. కొంతసేపటికి కొత్వాలు వెంట రామలింగకవి విచ్చేసాడు.
చేతులు కట్టుకుని నిలబడి "ప్రభూ ! పిలిచారట. దారిలో కొత్వాలు చెప్పాడు. చిలుక తమను బాధపెట్టిందట. దానికి జన్మయితే పక్షిగా ఆ బ్రహ్మ సృష్టించాడు. కానీ అది మనిషిగా పుట్టాల్సిందే. నన్ను అనేక శాస్త్రముల పై ప్రశ్నించిమరీ చంపుతుంది. అది లేకుండా హాయిగా రాత్రంతా గడిపాను. తమ ఆగ్రహానికి గురయిందని విన్నాను. మన్నించి దాన్ని వదిలేయండి.” అని ప్రాధేయపడ్డాడు.
"రామలింగా ఇది పక్షిజాతికే తలమానికం. దీనిని శిక్షించలేను. దీని కారణంగా నేను నా రాచరికపు పనులపై దృష్టి మరల్చలేకు న్నాను. తిరిగి తీసుకుపో ! ఈ చిలుకతో నా విలువైన సమయం గడిచిపోతోంది.”
"మన్నించండి. నేను తిరిగి తీసుకుపోజా లను. ఇది రాణీవాసంలో ఒక రాత్రి ఉంది. ఇప్పుడు మీ మందిరంలో ఉంది. ఇక్కడ వైభవాలను అనుభవించిన దీన్ని నేనెట్లు సాకగలను. నా వలన కాదు. నేను తమ దయాలబ్దంతో బతుకు ఈడ్చుచుంటిని" రామలింగడు చేతులెత్తేసాడు.
ఎంత ఖర్చయినా తాను భరించగలనని రాయలు రామలింగానికి నచ్చజెప్ప చూసాడు. అంతా వింటున్న పంజరంలోని చిలుకకు చిర్రెత్తిపోయింది. అది అసలే వాగుడుకాయ. పెద్దగా రెక్కలు ఆడించి పంజరంలో విచిత్రశబ్దాలు చేసింది.
“ ఓ సాహితీసమరాంగణ చక్రవర్తీ! పాపమా కవితిలకాన్నేందుకు బతిమాలి బామాలడము, ఈ మందిరంలో పెదవి విప్పకుండా నా బతుకు నేను బతకగలను. నేను ఎవరికి అక్కర్లేదనుకుంటే నన్ను వదిలేయండి. ఈ విశాల ప్రపంచంలో నాకు చోటు దొరకకపోదు." చిలుక గొంతు విప్పింది.
“రామలింగా నీవు కాదంటే ఈ చిలుకను విడిచిపెట్టడమే. ఈ చిలుక నీవలే జంకు గొంకు లేనిది. ఎవరూ భరించలేరు. చూసావా, దాని గర్వం.”
"విడిచిపెట్టేయండి ప్రభూ ! అదే దాని బతుకు బతుకుతుంది. నాకెలాంటి అభ్యంతరం లేదు." తన అభిప్రాయాన్ని చెప్పాడు రామలింగడు.
“కొత్వాలు, ఆ పంజరంలో నుండి చిలుకను విడిచిపెట్టు” రాయలు ఆజ్ఞాపించాడు.
"ఓ చక్రవర్తీ! నన్ను విడిచిపెడుతున్నది ధర్మ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలువారు. ఇలా స్వతంత్ర జీవనానికి రిక్తహస్తాలతో ఎన్నడు పంపరాదు అని మీకు ఏ ధర్మశాస్త్రం తెలియచేయలేదా ? నాకనీస కోర్కెలను తీర్చరా ప్రభూ !" చిలుక ఆశగా ముద్దు ముద్దుగా అడిగింది.
"కోరికలా? కోరుకో ! నీ ఇష్టం ఎన్నయినా నాకు అభ్యంతరం లేదు."
“మహాధాత! నేను మానవుణ్ని కాను. ఆశకు అంతులేని జాతి అంతకన్నాకాదు. ఒక కోరిక నా కోసం! మరొకటి మీ కోసం... అడగగలను.” అని అడిగింది చిలుక పంజరంలో దర్పంగా నిలుచుని.
"మా కోసం ఏమడుగుతావు ?" రాయలు తీక్షణంగా చూస్తూ అడిగాడు. ఆ చిలుక మాటలు అంతులేని ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
🦜
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల
[09/03, 6:25 pm] P.Haribabu: *తెనాలి రామకృష్ణ - 38*
👳♀️
*మనిషి బుద్దిగల చిలుక - 3* 🦜
"ఏమేవ్ తెలుగుపిల్లా ! నువ్వు కార్య వాదివి. నన్ను ఎలా వదిలించుకున్నావో ! ఈపాటి బుద్ధి ఆ సాయిబుల పిల్లకు, ఒరియా పిల్లకు బొత్తిగా లేదు. మీ రాణమ్మ కు చెప్పు ఇలా చిలకలు, ఎలకలతో ఆడుకుంటే కాదే! చక్కగా రాయలవారికి ఓ వారసుడిని కని ఇమ్మనే. పాపం వారికి భార్యలధికం కానీ, ఒకరిద్దరు తప్ప మిగిలినవారు సంతానంతో కళకళలాడడం లేదు” చివరిగా ఆ మాటలంది ఆ గయ్యాళి చిలుక.
"అమ్మా చూసారా ఆ రాలుగాయి చిలుక ఎంతలేసి మాటలాడుతోందో !" మరో దాసి రాణివారితో బాధపడ్తూ చెప్పింది.
“అదో చుప్పనాతి పక్షి దాని విషయం వదిలేయండి. రాయలవారికి నేనంటే ఎంతిష్టమో మీ అందరికి తెలుసుకదా, ఆయన ఎందుకు ఇలా మారిపోయారు. నేను ఏ తప్పు చేసాను." చుట్టూ కూర్చున్న దాసిలను అడిగింది రాణి ఏడుస్తూ.
"అమ్మా మగాడిని నమ్మరాదమ్మా ! అందులో రాజులను అసలునమ్మకూడదు" ఓదాసి చెప్పింది. కళ తప్పిన రాణీవాసం అయ్యింది.
📖
రాయలవారి ముంగిట పంజరం పెట్టి చేతులు కట్టుకున్నాడు కొత్వాలు. రాయలు చూపులు చిలుక పై నిలిచాయి.
"ఓ చిలుకా నువ్వు రామలింగకవి వద్ద శుశ్రూష చేసినదానవు. అతనివలే నీకు వేపకాయంత వెర్రి ఉంది కదూ ! ఏమాత్రం భయమన్నది లేకుండా ఏకంగా నా పట్టపు రాణిపై అభాండాలు వేసావు. అక్కడ మహరాజుగా ధర్మసంరక్షకుడిగా ఆమె పై చర్య తీసుకున్నాను. ఆమె పై ఎంతటి తీవ్ర ఆరోపణలు చేసావు. ఆమె పరపురుషుని గురించి అలోచించినట్లు చెప్పి రుజువు చేసావు. నీవు చిలుకవు అయిపోయావు లేకుంటే మనిషివయి పుట్టి ఉంటే ఎంత ప్రమాదం".
“మన్నించండి. నేను యధార్దవాదిని. నేను చెప్పినదానిలో నిజం లేకపోయినా, నిజమే అనేట్టు భ్రమ ఉంది. అదే ఆమె పాలిటి శాపం అయ్యింది. వాస్తవానికి ఆమె పరపురుషుని గురించి ఆలోచించలేదు. అమాయకంగా మాటలాడే చిలుకను కోరుకుంది, ఇక్కడే ఆమె తెలియకుండా పొరపాటు చేసింది. ఏలినవారు నన్ను మన్నించి ఆమెను క్షమించి ఆమెకు మీ మనస్సులో పూర్వ వైభవం కల్పించమని ప్రార్దిస్తున్నాను.” కొత్వాలు పరిసరాలను మరిచి చిలుక మాటలను వింటున్నాడు.
“ఓ చిలుక నేను నా పట్టపురాణిని క్షమించినచో నా నీతి, నా ధర్మం తప్పు పట్టవు కదా !”
"చెప్పాను రాజా ! చేయని నేరం ఆమెది. కనిపించే నేరాన్ని శిక్షించే రాచరికం తమది. మీరు శిక్ష విధింపుతో ధర్మబద్ధుడు అని అనిపించుకున్నారు. ఇప్పటికే ఆమె శోకమూర్తి అయ్యింది. ఆమెను కరుణించండి.”
రాయలవారికి ఇంతవరకు చిలుక పై ఉన్న కోపం ఇప్పుడు అది చెప్పిన ధర్మమైన మాటలకు చాలా వరకు తగ్గిపోయింది. సరిగ్గా అప్పుడే విచ్చేసాడు మహామంత్రి తిమ్మరుసు.
"నాయనా ఏదో చిలుకను తెచ్చావట. అది రాణీవాసాన్ని అల్లకల్లోలం చేస్తోందట. అలాటి దుష్టపక్షులని మనం భరించలేము. దాని పీడ వదిలించుకోవడమే ఉత్తమ లక్షణం" చెప్పాడు.
కొత్వాలు గుటకలు మ్రింగుతూ ఇద్దర్నీ చూడసాగాడు. రాయలువారు చిన్నగా నవ్వి "అప్పాజీ ! అదిగో ఆ రామచిలుక " అని చూపాడు. తిమ్మరుసు ఆశ్చర్యంగా చూసాడు దాని వైపు.
"సుస్వాగతం మహామంత్రివర్యులకు, తమను దర్శించినందుకు నా జన్మ ధన్యం అయ్యింది. మీరు నన్ను దుష్టపక్షిగా సెలవిచ్చారు. ఆ మాటలకు ఏ బాధా లేదు. కానీ, తమ నోట అటువంటి మాటలు రావచ్చా ! నాడు అవసానంలో ఉన్న వీరనరసింహరాయలవారు కొలువులో మంత్రిగా వెలగబెట్టిన మిమ్మల్ని ఆతడు కోరినది ఏమిటి ? మీరు చేసినది ఏమిటి? పాపమాతడు మిమ్మల్ని నమ్మి తన కొడుకుకి పట్టం కట్టమని తన సవతి తమ్ముడైన మన ఏలిక రాయలువారిని చంపి ఆనవాలుగా కండ్లు తీసుకురమ్మని కోరితే, దాచి మేక కనుగుడ్లు తెచ్చి చూపి పాపమా వీరనరసింహరాయల వారి ప్రశాంతమైన చావుకు కారకులైయ్యారు. ఓ మంత్రి పదవిలో ఉండే మీకు ఇన్ని రాజకీయపు టెత్తులు అవసరమా ? మీ చాతుర్యం ఎంతటిదో చరిత్రలో కొన్ని పుటలు చెప్పకనే చెప్తాయి. మీకు పూర్ణ ఆయుష్షు ఉండి మళ్లీ రాయలవారి వారసత్వం విషయంలో మీ పాత్ర ఏ విధంగా మలుపులు తిరుగుతుందో?” చిలుక పలుకులు వింటూ రాయలు, తిమ్మరుసు, కొత్వాలు అవాక్కయ్యారు.
తిమ్మరుసుకు ముఖంలో నెత్తురుచుక్క లేకుండా అయిపోయింది. రాయలు భృకుటి ముడిపడింది. అతని మనస్సు అంతా ఆలోచనలతో ముసురుపట్టినట్టు అయ్యింది. పక్కనే ఉన్న తిమ్మరుసు వైపు చూడలేక చూసాడు. తిమ్మరుసు అంతటి వృద్ధాప్యంలో కూడా చిలుక పలుకులను విని తట్టుకోలేక మొలలో ఉన్న కరవాలం పై చేయి బిగించాడు. ఆ తరువాత తమాయించుకున్నాడు. గట్టిగా కన్నులు కొన్ని క్షణాలు మూసుకుని భారంగా తెరిచాడు.
నిశ్శబ్దం ఆ మందిరంలో కొన్ని క్షణాలు రాజ్యమేలింది.
"మనిషి బుద్ది గల ఈ పక్షి రాజమందిరంలో ఉండడం చాలా ప్రమాదం. ఇది శత్రువులా తేనె పూసిన మాటలను ఎలాంటి జంకు లేకుండా, ప్రాణభీతి లేకుండా ప్రేలుతోంది. అవశ్యం దీన్ని వదిలించుకోవాలి.” అని తిమ్మరుసు చిరు కోపం ప్రదర్శించాడు.
రాయలు ఏమీ బదులీయకుండా చిలుక వైపు చూస్తూ నిలబడ్డాడు.
"కొత్వాలు ఇది పక్షి అయిపోయింది కనుక బతికిపోయింది. దీన్ని పెంచి పోషించిన వాడు ఆ తెనాలి రామలింగడు కదా ! ఆ మధ్య ప్రభువులనే అతడు తొలిసారి భువనవిజయంలోకి అడుగుపెట్టిన రోజే అవమానించాడని విని తల్లడిల్లిపోయాను. కవులు, పండితులు, కింది ఉద్యోగులు, సామంతులు, పాలెగాళ్లు, ఇలాంటి కఠోర పలుకులను పలికే నీచ పక్షులను వారి స్థాయిని మించి ఎదగనీయరాదు. ఆరోజే తెనాలి రామలింగడిని శిక్షించి ఉంటే ఈ పక్షి ఇలాంటి కూతలు కూసి ఉండేది కాదు కదా ! " అని తనలో ఏదీ దాచుకోకుండా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు తిమ్మరుసు.
"ఓ చిలుకా నువ్వు తిరిగి రామలింగని ఇంటికి వెళ్లిపోతావా?” రాయలు దానివంక విచిత్రంగా చూస్తూ అడిగాడు.
"ఏం మహారాజా ! తిమ్మరుసువారు నన్ను వదిలించుకోమన్నారని, ఆయన మాటలకి విలువనిచ్చి సాగనంపుతున్నారా ? మీరు పంపినా నేను వెళ్లను. ఆ కవీశ్వరుని వద్ద శుశ్రూషతో నా జన్మ ధన్యం అయ్యింది. ఆయన మాట పెళుసు,ముక్కుసూటితనం నాకు వచ్చాయి. తప్పుడు మాటలు ఆడనంతవరకు మనకేమీ కాదు. లేనిపోని అభాండాలు చెప్తే మన విలువలు నశిస్తాయి, ఎదుటివారిని బాధించే వారవుతాం, శారీరక హింసకు గురువుతాం అదే నాకు తెలిసింది." అని అందంగా చెప్పింది.
"నీ వంటి పక్షి మాటలను నిత్యం వినాలని ఆనందించాలని ఉంది. కానీ, నీ కుండ బద్దలుకొట్టిన విధం ఒకింత అయోమయం లోకి నెట్టేస్తోంది." అని చిలుకకు చెప్పి, కొత్వాలుతో “ నీవు ఇక్కడ ఉన్నట్టుగా వెళ్లి రామలింగని తీసుకురావాలి. ఆయన ఎంతటి పనిలో ఉన్నా ఇది రాయలవారి అత్యవసర పిలుపుగా చెప్పి తీసుకురా !" అని చెప్పి పంపాడు రాయలు.
చిలుక, రాయల మధ్య మౌనం చాలాసేపు సాగింది. తిమ్మరుసు, చిలుక చెప్పిన విషయాలను గురించి రాయలు పదేపదే ఆలోచిస్తూ మందిరంలో అటు ఇటు పచార్లు చేయసాగాడు. కొంతసేపటికి కొత్వాలు వెంట రామలింగకవి విచ్చేసాడు.
చేతులు కట్టుకుని నిలబడి "ప్రభూ ! పిలిచారట. దారిలో కొత్వాలు చెప్పాడు. చిలుక తమను బాధపెట్టిందట. దానికి జన్మయితే పక్షిగా ఆ బ్రహ్మ సృష్టించాడు. కానీ అది మనిషిగా పుట్టాల్సిందే. నన్ను అనేక శాస్త్రముల పై ప్రశ్నించిమరీ చంపుతుంది. అది లేకుండా హాయిగా రాత్రంతా గడిపాను. తమ ఆగ్రహానికి గురయిందని విన్నాను. మన్నించి దాన్ని వదిలేయండి.” అని ప్రాధేయపడ్డాడు.
"రామలింగా ఇది పక్షిజాతికే తలమానికం. దీనిని శిక్షించలేను. దీని కారణంగా నేను నా రాచరికపు పనులపై దృష్టి మరల్చలేకు న్నాను. తిరిగి తీసుకుపో ! ఈ చిలుకతో నా విలువైన సమయం గడిచిపోతోంది.”
"మన్నించండి. నేను తిరిగి తీసుకుపోజా లను. ఇది రాణీవాసంలో ఒక రాత్రి ఉంది. ఇప్పుడు మీ మందిరంలో ఉంది. ఇక్కడ వైభవాలను అనుభవించిన దీన్ని నేనెట్లు సాకగలను. నా వలన కాదు. నేను తమ దయాలబ్దంతో బతుకు ఈడ్చుచుంటిని" రామలింగడు చేతులెత్తేసాడు.
ఎంత ఖర్చయినా తాను భరించగలనని రాయలు రామలింగానికి నచ్చజెప్ప చూసాడు. అంతా వింటున్న పంజరంలోని చిలుకకు చిర్రెత్తిపోయింది. అది అసలే వాగుడుకాయ. పెద్దగా రెక్కలు ఆడించి పంజరంలో విచిత్రశబ్దాలు చేసింది.
“ ఓ సాహితీసమరాంగణ చక్రవర్తీ! పాపమా కవితిలకాన్నేందుకు బతిమాలి బామాలడము, ఈ మందిరంలో పెదవి విప్పకుండా నా బతుకు నేను బతకగలను. నేను ఎవరికి అక్కర్లేదనుకుంటే నన్ను వదిలేయండి. ఈ విశాల ప్రపంచంలో నాకు చోటు దొరకకపోదు." చిలుక గొంతు విప్పింది.
“రామలింగా నీవు కాదంటే ఈ చిలుకను విడిచిపెట్టడమే. ఈ చిలుక నీవలే జంకు గొంకు లేనిది. ఎవరూ భరించలేరు. చూసావా, దాని గర్వం.”
"విడిచిపెట్టేయండి ప్రభూ ! అదే దాని బతుకు బతుకుతుంది. నాకెలాంటి అభ్యంతరం లేదు." తన అభిప్రాయాన్ని చెప్పాడు రామలింగడు.
“కొత్వాలు, ఆ పంజరంలో నుండి చిలుకను విడిచిపెట్టు” రాయలు ఆజ్ఞాపించాడు.
"ఓ చక్రవర్తీ! నన్ను విడిచిపెడుతున్నది ధర్మ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలువారు. ఇలా స్వతంత్ర జీవనానికి రిక్తహస్తాలతో ఎన్నడు పంపరాదు అని మీకు ఏ ధర్మశాస్త్రం తెలియచేయలేదా ? నాకనీస కోర్కెలను తీర్చరా ప్రభూ !" చిలుక ఆశగా ముద్దు ముద్దుగా అడిగింది.
"కోరికలా? కోరుకో ! నీ ఇష్టం ఎన్నయినా నాకు అభ్యంతరం లేదు."
“మహాధాత! నేను మానవుణ్ని కాను. ఆశకు అంతులేని జాతి అంతకన్నాకాదు. ఒక కోరిక నా కోసం! మరొకటి మీ కోసం... అడగగలను.” అని అడిగింది చిలుక పంజరంలో దర్పంగా నిలుచుని.
"మా కోసం ఏమడుగుతావు ?" రాయలు తీక్షణంగా చూస్తూ అడిగాడు. ఆ చిలుక మాటలు అంతులేని ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
🦜
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*