Saturday 27 October 2018

ఉగాది ప్రత్యేకత


చదవండి ప్రాంజలి ప్రభ 
ఉగాది  ప్రత్యేకత  

*"ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం."*

(1) *"తైలాభ్యంగనం"*

*"తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది."*

(2) *"నూతన సంవత్సర స్తోత్రం"*

*"అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను."*

(3) *"ఉగాది పచ్చడి సేవనం"*

*"ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!"*

*"అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాది  పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగా*"ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం."*

(1) *"తైలాభ్యంగనం"*
********
*"తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది."*

(2) *"నూతన సంవత్సర స్తోత్రం"*
*********
*"అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను."*

(3) *"ఉగాడి పచ్చడి సేవనం"*
********
*"ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!"*

*"అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాది  పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం."*

(4) *"పూర్ణ కుంభదానం"*

*"ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి."*

(5) *"పంచాంగ శ్రవణం"*

*"తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది."*

*"ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి."*
 నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం."*
--((**))--


******************
*శ్రీవికారి-ప్రయోజనకరి*  
****
*కవి మిత్రులందరికీ *శ్రీవికారి* యుగాది
శుభాకాంక్షలు శుభాభినందనలతో......
******************
   
*1. ఆ.వె.*
*శ్రీ! వికారి* నిన్ను శీఘ్రము పిల్చుచు!
*శ్రీ విళంబి* వెళ్ళు శిబిరమునకు!
షష్ట వత్సరములు చాటుకుండిననీకు!
నీ *యుగాది*నాడు యెంతొ సొగసు!

*2. ఆ.వె.*
మమ్ము వీడునట్టి*మా *విళంబి* నీకు!
కలిన కల్మశముల కలివిషములు!
మలిన మతులు ఖలులు మత్సరములువీడ!
శాంతి పొందుమమ్ము సంతసమున!

*3. ఆ.వె.*
యుగయుగమువసంత మొందించు నాత్మజు!
లందరకును తెల్పు మవని తీరు!
పంచ భూతములను పాటిగా రక్షించి!
కాలగతులశుభము కలుగు జేయు!

*4. ఆ.వె.*
ధన్యవాదములను ధరవిళంబికినిచ్చి!
సాగనంపుజనులు సాదరముగ!
ప్రక్క జేర్చుకొనును పయనమందగచెల్లి!
నక్కజముగ చెల్లి యధ్భుతముగ!

*5. ఆ.వె.*
అరవయేళ్ళకొక్క యధ్భుత వసంత!
మాసమందుగనును మా *వికారి!*
వర్షయుగపుకాంత వలపులసొగసగు!
యవ్వనమ్ముపంచు జవ్వనిగను!

*6. ఆ.వె.*
ఏక వత్సరాన యెగుడుదిగుడులన్ని!
పరవశాల బాధ ప్రాభవముల!
నందిపొందువిందు లధ్భుతరీతిగా!
వందనములునీకు? వర్ష శతము!

*7. సీసము.*
వాసంత శోభతో వాకిళ్ళు లోగిళ్ళు!
రంగవల్లులకాంతి రంగరించ!
కొంగ్రొత్త కోయిల కోమలి సుస్వర!
శ్రవణసంగీతాలు స్వాగతించ!
ఆమనిచిగురించి యవ్వని పులకించి!
కిసలయ నాట్యాల కేళితోడు!
పంచాంగ శ్రవణము బ్రాహ్మణాశీస్సులు!
తారాగణాలన్ని తరలిరాగ!

*శ్రీవికారి* కి నాహ్వాన చిన్మయమున!
యిల్లు వాకిళ్ళునామని పల్లెపల్లె!
నుదయ వాసంత వేడుక లురుతరముగ!
నుత్సవమ్ములుజరుపుదు రుర్వి జనులు!

*8. సీసము.*
సాహిత్య సౌరభ సంగీత నాట్యాల!
సరిగమ పదనిస స్వరఝరులుగ!
కోమల కోయిల  కొంగ్రొత్త గానాలు!
నవనాయకాగణ 'నవ'విధులుగ!
మానసాంతరభావ మావిడాకులశోభ!
మృదుమధుపచ్చడి ముదము గొలుపు!
పరివర్తనాయుత పరిణతి కాంక్షించి!
ప్రణమిల్లుచుంటిమి!భవితకోరి!

యిన్ని సద్గుణా లీప్సితా లిమ్మటంచు!
నిన్నునాహ్వానమునుజేయ నెమ్మనమున!
నిమ్న మానసములవీడి నియతి తోడు!
యుగపు నేటి *వికారి ప్ర యోజనకరి!

*9. సీసము.* 
సబ్బండ వర్ణాల సారాంశ జలధిగా!
సాకుమా లోకులు శాంతినొంద!
సత్సంగ,సత్పథ సంస్కార మానస!
ధర్మము కాపాడ ధరణియందు!
క్రూరాత్ములెందరో కుత్సితయుక్తితో
సన్మాన సులనిల చంపుచుండె
కలికాల మహిమయో కర్మానుగతమదో!
తెలియకుండెడుబాధ వెలికి తీసి!

మంచితనమునుకాపాడు మాతవీవె!
దుష్ట శిక్షణ చేసెడు దూతవీవె!
ధర్మపథమునురక్షించు దాతవీవె!
అమ్మ! *శ్రీవికారి* కిదే యంజలింతు!

*10.ఉ.మా.*
అమ్మ *వికారి* యంచునిను నామని కోయిల నీవసంతమున్!
రమ్మనిపిల్చుచైత్రమున లక్షణ కన్యగ రమ్యగానమున్!
కొమ్మగమావికొమ్మగని కోమలి సుస్వర కూతకూయగా!
యిమ్మహికేగుదెంచి యవ నీశుల మానస బాధదీర్చుమా!

*11.ఉ.మా.*
మా'నవ'మానవాధముల మానస మత్సర మాంద్యమానముల్!
మానిని మౌనపోకడలు మాననిమందగు మృత్యుపాశముల్!
దానవ దంష్ట్ర చేష్టలును దన్నుగ మిన్నుగ దాపురించెగా!
యీనవ వత్సరమ్మునిల నేవిధ సద్గతులు లిచ్చుచుందువో?

*12.ఉ.మా.*
ఎన్నికలమ్ములందుకవు లెందరు భారతి భారతావనిన్!
పన్నుగ *శ్రీవికారి* యుగ భాస్కర తేజములుద్భవించునో?
సన్నుతిగాయుగాది మది శాంతము నోర్పునునందజేయగా!
మన్ననలందగోరు మహి*మాన్విత పండితులెందరెందరో!

*13.ఉ.మా.*
వందనమందజేతుహృది వంచిత లబ్దప్రతిష్ఠులంధరన్!
స్పందితవాగ్విభూషణులు సత్యమసత్యపువాస్తవస్తవా*
స్కందులముందునిక్కమును గావుమటంచునువేడుకుంటునే!
కందిన మానసాత్ములను గౌరవమందగ సాకుభారతీ!

ప్రాంజలి ప్రభ కు పంపినవారు
*రచన*
*మా. మురళీధర శర్మ*
*సిద్ధిపేట-30.03.2019*

--((**))--





ఉగాది విధి - Pranjali pdrabha తెలియ పరుస్తున్నది 

భారతదేశంలో కాలగణనకు మూడు మానాలు అనూచానంగా వస్తున్నాయి. చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్య మానం. ఈ మూడూ వేదాధారమైన ప్రాచీన జ్యోతిషశాస్త్ర ప్రమాణాలతో ఉన్నవే. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాలమానాలు ప్రమాణాలు. సౌర-చాంద్ర మానాల్లో సంవత్సర నామాలు మారవు. చంద్రుడి నక్షత్ర యోగాన్ని అనుసరించి చాంద్రమానం, సూర్య సంక్రమణాల ప్రకారం సౌరమానం, గురూదయాన్ని ఆధారంగా చేసుకొని బార్హస్పత్య మానం లెక్కిస్తారు. ఎవరి పరంపరాగతమైన, ప్రాంతానుసార మానాలు వారికి ప్రమాణాలు. ఇందులో వైరుధ్యాలేమీ లేవు.

ఉగాదినాడు నూతన సంవత్సర ఆరంభాన్ని చక్కని శుభ భావనతో, కాలరూపుడైన భగవంతుడి ఆరాధనతో పవిత్రంగా ఆచరించడం భారతీయుల సంప్రదాయం. శాస్త్ర విధిని అనుసరించి- ముందురోజే శుభ్రం చేసుకున్న గృహాన్ని మామిడి తోరణాలు, రంగవల్లులు, పసుపు గుమ్మాలతో అలంకరించడం సంప్రదాయం. బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి గణపతిని, ఇష్టదేవతను పూజించాలి. వాణీ హిరణ్యగర్బు ´(సరస్వతి, బ్రహ్మ)లు, లక్ష్మీ నారాయణులు, ఉమా మహేశ్వరులతో పాటు దిక్పాలకులను, నవగ్రహాలను యథాశక్తి అర్చించాలి. పంచాంగాన్ని పూజించి, పంచాంగ శ్రవణం చేయాలి.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు- అనే అయిదు అంగాలను జ్యోతిషశాస్త్ర రీత్యా గణించిన గ్రంథమే ‘పంచాంగం’. సంవత్సర ఆరంభంలో- గ్రహ, నక్షత్ర, వారాదులు అనుసరించి కాలాంశాల్ని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. నిత్యం అనుష్ఠానం చేసుకొనేటప్పుడూ- దేశ, కాల సంకీర్తన అనే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో మనం ఉన్న ప్రాంతం; అక్కడి నది, పర్వతాల ప్రస్తావన; దేశ సంకీర్తన; ఆనాటి తిథి, వార, నక్షత్రాది స్మరణ కాల సంకీర్తన ఉంటుంది. అనునిత్యం ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల, ఆ రోజుకు సంబంధించిన కాలభాగాలు జ్ఞప్తిలో ఉంటాయి.

సంవత్సరం, పగలు, రాత్రి, పక్షం, మాసం, అయనం, యుగం, కల్పం... వీటన్నింటికీ పేర్లు, లక్షణాలు ఉన్నాయి. వీటి పరిజ్ఞానమే సంస్కృతి సంబంధ వారసత్వంగా భారతీయులందరి కర్తవ్యం. ఈ కర్తవ్య పాలనలో ఉగాది ఒక మధుర ఘట్టం. ఉ-గ- ‘ఉదు’ అంటే, నక్షత్రం. ‘గ’ అంటే, గమనం. నక్షత్ర గమన (చంద్రుడితో నక్షత్రానుబంధం) రీత్యా ఇది ఉగాది.

పంచాంగ శ్రవణ అనంతరం- ఉగాది పచ్చడిని నివేదించి, ప్రసాదంగా స్వీకరించడం విధి. నింబ కుసుమం (వేప పూత), మామిడి, బెల్లం- దీని ప్రధాన ద్రవ్యాలు అని శాస్త్రం చెబుతోంది. ఈ ప్రసాదాన్ని మొదటి యామం (జాము)లోనే (ఉదయం 8.30-9.00 గంటల మధ్య) గ్రహించాలంటారు. కాలం ఎటువంటివాటిని సూచిం చినా సంకల్ప బలం, సత్కర్మ ఆచరణ, సద్భావనతో సవరించుకోగలం అనే చక్కటి విషయాన్ని పలు ధార్మిక, జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి.

అందుకే ఉత్సాహం, ఆశాభావం, దేశహిత కాంక్షతో నూతన వత్సరాన్ని స్వాగతిద్దాం. కాల స్వరూపుడైన పరమేశ్వరుడు అందరికీ శుభాలు ప్రసాదించుగాక అని ప్రార్థిద్దాం!

--((**))--

క్ష్మి
శ్లోకం: శతా యుర్వజ్ర దేహయం సర్వ సంపత్కరాయ 
సర్వారిస్ట వినాశాయ నిమ్బకుసుమ భక్షణం. 
అర్థము: వేపపూవు తింటే దీర్ఘాయుస్సు కలుగుతుంది,దేహము వజ్ర సమానమవుతుంది. 
మరియు సర్వ అరిస్టాలను తొలగిస్తుంది. 
ఈ పచ్చడి తింటే శరీరానికి మేలు జరుగుతుందని ఆయుర్వేదము చెప్తుంది 
---------------------------------
త్యాముష్ణ శోకే నరాభీష్ట మధుమాస సముర్భవ 
నిభా విశోకే సంతస్తాం మమ శోకం సదా కురు.

అర్థము: (అశోకము అన గా వేపచెట్టు)వసంతమాసము లో చిగురించే అశోకమా 
జీవితములో శోకాలతో బాధపడుతున్నాను ఓ అశోక పుష్పమా నిన్ను 
సేవిస్తున్నాను నన్ను శోకము నుండి విముక్తుడిని చెయ్యి (అశోక మనగా శోకము 
లేకుండుట అని కూడా అర్థము)

ప్రకృతి వర్ణన అంటే పుడమికి తిలకం దిద్దటమే, ఉగాది నాడైతే కవి కలాలు 
కొత్తరంగులు నింపుకొని మరింత పిపాసను జోడించేందుకు ఉరకలేస్తాయి. ఇదిగో ఈ 
భూతిలకం అలాంటిదే. ఇది అతిధృతి ఛందములో ఓ వృత్తం 'భభరసజజగ' గణాలు.

చైత్ర రథమ్మునరావె నా సఖి జావళింప మధూదయం 
నేత్రపథమ్మున శోభలీనుచు నీలినింగిలో చిత్రమై 
గాత్రమ్ము కమ్మని కీర్తనల్ వరగాంచ నవ్యయుగాదినన్
ఆత్రముతో ప్రియకావ్య కన్యక ఆలకించె సుదాక్షరై 
(తానరూపి, హనుమకొండ ) (తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)
--------------------------------------------
ప్రాబంధిక శైలిలో ఆధునిక భావకవిత::
వసంతము::
ఒకటి కోకిల పల్కె నొకట శారిక కుల్కె
నొక కొమ్మపై చిల్క హొయలు నొల్కె
ఒకట మల్లియ పూచె నొకట సంపెగ తోచె
నొక క్రేవ మందార మురిమి చూచె
ఒకట తుమ్మెద పాడె నొకట తెమ్మెర లాడె
కామినీమణి మూగనోము వీడె
ఒకట నవ్వులు హెచ్చె నొకట మోదువు విచ్చె
ప్రణయహృదయమందు వ్రణము దెచ్చె
చల్ల చల్లని చందన చర్చవలన
తాపము మరింత యధికమై తనర జొచ్చె
మధువొ మధువో యటంచు కమ్మ విలుకాడు
పడతి కన్ను గిన్నెల నిండ పట్టి తెచ్చె
(నవ వసంతవైభవము - కవితాపుష్పకము)సురేంద్ర నాథ్
---------------------------------
వచ్చింది వచ్చింది I "వికారినామ " ఉగాది 
కావాలి, కావాలి I మీ అందరికీ శుభకర శ్రీకర 
జీవనానికి నాంది .
నూతన సంవత్సర శుభాకాంక్షలు
--((**))--
సర్వేషాం------- నామ నూతన సంవత్సరారంభావసరే ఉగాది శుభాశయాః.

"శార్వరి శుభములు నొసఁగును..
శర్వాణి కృపాకటాక్ష సంపద చేఁతన్!
పర్వఁపుసుశాంతి కలుఁగున్..
ఖర్వమగు మదాతిశయము కాపురుషులకున్!!!"

శర్వరీ శం చ వో దద్యాత్
నీరోగాచ్చ శుభాశయాత్|
కృత్వా విఘ్నాని నిఘ్నాని
కార్యలాభం ప్రదాస్యతు||

అందరికీ ఉగాది శుభాకాంక్షలు

శర్వుని రాణి పేరుగల శార్వరి నిండగ సస్యసంపదలీ
యుర్విని రాగదే సుఖము లొప్పనికన్ కరోనకున్
గర్వము భంగమౌనటుల కామిత మీయగ నీదు రాకకై
సర్వులు వేచినారిటను శక్తివి నీవని పిల్వనెంచుచున్

శార్వరీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మత్తకోకిల శాంతి దూతగ కూత కూసెను శార్వరీ
మత్తు పెంచును హాయి గొల్పును సృష్టి నేస్తము శార్వరీ
చిత్ర మాలిక చింత తీర్చును బుధ్ధి పెర్గును శార్వరీ
స్థితి మారి ఉగాది శోభలు నిత్య సత్యము శార్వరీ

--(())--



శార్వరి వచ్చి కరోనా ను తరిమి కొట్టాలని ఆశిస్తున్నాను ! అందరికి ఉగాది శుభాకాంక్షలు.

ప్రాంజలి ప్రభ - karona

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

విశాలాంతిక - త/త/త/గ UUI UUI - UUIU

10 పంక్తి 293

ఏమాయ కమ్మింది - మాపైన మే
మేమీ చె సి యున్న - ఇంతా మనో
మార్గమ్ములే ప్రశ్న - లయ్యెనుగా
ఇంతెందు కాలోచనా అందురే

కాలమ్ము మాయగా చుడాలిగా
పంతమ్ము పోకుమా అద్రుష్టమే
ఎవ్వారె మన్నాను మౌనంగ ఉం
డీ దేశ కష్టమ్ము భావించియే

శుబ్రమ్ము చేస్తేను ఆరోగ్యమే
ఏరోగ మూ రాదు భయ్యమ్ములే
కుండంగ జీవించు ఆనందమే
పంచియు ఆహ్లాద మే పొందుటే

ఉద్వేగ ఉద్యోగ సేవార్ధమ్ము
ఎందెందు అందందే ఆరోగ్యమ్ము
బిడ్డల్తొ ఉండేది సౌకర్యమే
ఏరోగ మీదాక రాకుండులే

ఏకష్టమూ రాక సౌఖ్యమ్ములే
ఎంచేసు యున్నానొ ఈమాయలో
--(())--


నేటి కవిత్వం - రథము
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

శరీరమే  కదిలించే రథము 
రథానికి ఆత్మయే రధికుడు  
రధికునకు సారధి బుద్ధి 
బుద్ధిని నిర్దేసించేది ఇంద్రియాలు 
ఇంద్రియాలే కదిలే గుర్రాలు 
గుర్రాలకు వెయ్యాలి కళ్లెం 
కళ్లెం అనేది జీవిలో మనస్సు  

కర్మల వళ్ళ కలుగు ఫలం 
ఫలం వళ్ళ పెరుగు భోగం 
భోగం వళ్ళ కలుగు వాసన 
వాసన వళ్ళ కలుగు జన్మ  

జన్మ వాళ్ళ చేయాలి కర్మ 
కర్మలే ఫల సుడి గుండాలు 
గుండాలు తప్పాలంటే ఆత్మ
ఆత్మ శుద్ధిగా ఉండాలి 

అంటే పరమాత్మ ధ్యానమే 
అదే ఆత్మ జ్ఞానము 
దీనికి లింగ బేధము లేదు 
దీనికి నిత్యకర్మ నిష్ఠ 
న్యాయ ధర్మ సత్యానికి శాంతి 
అదే మనకు ప్రశాంతి 
--(())--
3. ప్రస్థానం (సంగీతమ్)
 
కోరిక ఉన్నది నోట మాట రాదు
మాట వచ్చిన నోట పాట  రాదు
పాట వచ్చిన ఒక్క పల్లవీ రాదు
పల్లవి నేర్చిన  అవకాసం రాదు  

ప్రేమ చరణాలు పాడక తప్పదు
సంగీతంపై అన్వేషణ తప్పలేదు  
వయస్సును వంచించుట లేదు
ప్రకృతి పంచే వాకిలికి   తప్పదు  

పాటను పాడాలని కోరిక కలిగింది
అనుకోకుండా ఒక పల్లవి కుదిరింది
కానీ ఆపై అమరలేదు చరణాలు
అన్వేషణలోనే మనుగడ నలిగింది

నేనో గానం చేయాలను కుంటున్నా
వచ్చే అవరోధాలను దాటాళను కున్నా  
ఎన్నో ప్రయత్నాలు చెస్తూ నే ఉన్నా
ఏది మంచో ఏది చెడో తెలియ లేకున్నా 

నీకోసం సంగీతమ్ నేర్చుకున్నా
సంగీతంతో బ్రత కాలను కున్నా
నీ భందం కోసం కష్టపడుతున్నా
సంగీతానికి గానం తోడవ్వలనుకున్నా
--((*))-- 
 ప్రస్థానం (పంచ భూతాలు )

పవిత్రంగా పునీతమౌతున్న పంచభూతాలు



పృథ్వి తొలకరి దిద్దిన మధుర వాసనతో

గ్రీష్మ తాపాన్ని తట్టుకొని నవ వనాలతో

ప్రకృతిమయమై అనేక అనుభూతులతో  

ప్రతి మనసుకు తృప్తినివ్వాలని తపనతో

మోస్తూ చివరకు తనలోకి చేర్చుకోనేది భూమి



పగలు సూర్య వెలుగుతో, రాత్రి చెంద్రుని వెన్నెలతో

కడలిని  పీలుస్తూ, కుండల్లా మేఘాల వివిస్తరణతో

శబ్ద కాలుష్యాన్ని భరిస్తూ ఎవ్వరినీ అనలేని తనంతో

రంగులు మార్చే మేఘాల మెరుపుల కదలికలతో

లెక్కించలేని పరిధిలో అనంతంగా ఉన్నదే ఆకాశం



జాలువారు నదిలో గాలి చేరి తుమ్పరులతో

నిత్య సంచారము చేయు గాలి విహంగాలతో

ప్రాణులను రక్షించేగాలి తరువుల కదలికలతో

గాలికి కోరికల రెపరెపలు కళ్ళు కదలికలతో

పీల్చని వారుబ్రతకరు, అందుకే కావాలి ఈ గాలి    




స్వార్ధంతో, నిస్వార్ధంతో దగ్గరవ్వాలని తపనతో

కడలిలో అగ్ని పుట్టి వచ్చి చేరే తుఫానులతో

అగ్నికి శిలలుకరిగి లార్వగామారి కప్పే బుడిదతో

అడవిని అగ్ని రగిల్చగా వణ్యప్రాణులు పరుగులతో  

ఉదరంలోని ఆహారం జీర్ణ మగుటకు రక్తంతో కలిసేది అగ్ని







హృదయం తల్లడిల్లి చెమ్మగా వచ్చే కంటి నీరుతో   

గంగ యంత్రాల ద్వారా ఉద్భ వించే జలాలతో

ఎడారిగా మారుతున్న మనసులపై చల్లే నీరుతో

బ్రతుకు తెరువుగా నిత్యమూ దొరికే జలాలతో   

ఆభిషెకానికి, ఆఖరిచూపుకు పనికి వచ్చేది నీరు    


పసుపుపచ్చగా (బంగారు) రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము.

శ్రీలలితా త్రిపురసుందరీ సహస్ర నామావళిలోని నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం పీతవర్ణాయై నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు తాపత్రయ బాధలు నశిస్తాయి, అనుష్ఠానాదులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. తల్లి కరుణచే ఐహిక, ఆముష్మిక శుభములు పొందుతారుస్వాధిష్ఠాన చక్రాధిదేవత పచ్చని శరీర ఛాయతో శోభించుచుండును. 

శ్రీచక్రాధిష్ఠాన దేవత అయిన పరమేశ్వరిని శ్రీమన్నగర నాయికాయై నమః  (56వ నామ మంత్రము)  శ్రీఅనగా లక్ష్మి, ఆమెతో కూడిన నగరము శ్రీచక్రము అగును; శ్రీగౌడపాద సూత్రములందు ఈ వ్యాఖ్యగలదు; అందుచే శ్రచక్ర నాయిక (లక్ష్మీ, సరస్వతి, పార్వతుల కలయిక)  ఆదిపరాశక్తి అనియు, అమ్మ శ్రీచక్ర వాసిని అగుటచే శ్రీమన్నగరనాయిక అనియు, శ్రీచక్రమే శ్రీనగరమనియు అంధు బిందురూపంలో విరాజిల్లుతున్న దేవి శ్రీమన్నగరనాయిక, సుమేరు ఉత్తరకొన యందు ఉండు సుధాసాగరమందలి మణిద్వీపమునందు ( ఓం సుధాసాగర మధ్యస్థాయై నమః ఉండునదియే శ్రీమన్నగరము. ఇది మయబ్రహ్మచే నిర్మింపబడినది ఈ శ్రీమన్నగరమునే విద్యా నగరమనికూడ చెప్పుదురు ఇక్కడినుంచే అమ్మవారు ఆదేశాలు, ఆజ్ఞలు ఇస్తూ పరిపాలన నిర్వహిస్తుంది' వ్యక్తియొక్క సహస్రార స్థానము నుండి ఆ వ్యక్తికి కావలసిన పనులన్నియు ఆజ్ఞలు, సంకల్పాలు, సందేశాలు ఇవ్వబడుతాయి.  మేరు పర్వతము నందలి త్రికూట మధ్య శిఖరవాసిని ( ఓం సుమేరు మధ్య శృంగస్థాయై నమః) త్రికూట మధ్య శిఖరము - శ్రీమన్నగరము ఆ నగరమునకు అధ్యక్షురాలు శ్రీదేవి అగును (55వ నామ మంత్ర వివరణము) సుధా సాగర మధ్యమున పంచవింశతి (25) ప్రాకారములు గల్గిన శ్రీనగరము గలదు. శ్రీనగరమునకు అధిదేవత శ్రీలలితా పరాశక్తియే అగును. ఇక్కడ చెప్పిన ఇరువది ఐదు (పంచవింశతి) ప్రాకారములు పంచవింశతి తత్త్వములు అగును.

 
 508వ నామమంత్రము🕉🕉🕉 ఓం అతిగర్వితాయై నమః

గర్వాతిశయంగల తల్లికి నమస్కారము, స్వాధిష్ఠానమునందు ఉన్న కాకినీ యోగిని మిక్కిలి సౌందర్యంతోనూ, సకల ఐశ్వర్యములతోను విరాజిల్లుచున్నందున, ఆ తల్లి అతిశయించిన గర్వంగలదై ఉంటుంది, శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళిలోని అతిగర్వితా యను అయిదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును ఓం అతిగర్వితాయై నమః అని ఉచ్చరిస్తూ భక్తిశ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు ఉపాసకులు సర్వాభీష్ట సిద్ధులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై, ఆ తల్లి పాదసేవయందే జన్మ ధన్యతనందెదరు. స్వాధిష్ఠాన చక్రాధిదేవత సౌందర్యాతిశయముతో, సకలైశ్వర్యములతో, నాలుగు చేతులతో అతి మనోహరముగా తన తనూవిలాసంతో అతిశయించిన గర్వము కలిగి ఉండుటచే అతిగర్వితా  అనే నామ మంత్రముతో కీర్తింపబడుతున్నది. స్వాధిష్ఠాన చక్రంలో ఏదైనా మార్పుగలగితే మనిషికి గర్వం, దర్పం, దంభం మొదలైనవి కలుగుతాయని భావము. అమ్మవారికి నమస్కరించునపుడు ఓం అతిగర్వితాయై నమః అని అనవలెను.


















No comments:

Post a Comment