Monday, 19 January 2026

 భగవంతుడు మానవ జన్మ ఆనందం,ఆహ్లాదం,సంతోషం కోసం ఇచ్చాడంటా......

💥మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు.

 💥వృధ్యాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బుని పోగొట్టుకుంటారు.

 💥ఆరోగ్యం ఆస్తికన్నా మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా.

 💥ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి.

 💥ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి.

 💥వ్యాయామం చేసేదానికి సమయం లేదనే వాళ్ళు, భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది.

 💥తిండి విషయంలో నాలుకను అదుపులో ఉంచుకునే వాడు యోగి, నాలుకను అనుసరించేవాడు భోగి, నాలుకకు బానిసైనవాడు రోగి.

 💥డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర సంపాదించలేము.

 💥పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము.

 💥మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము.

 💥పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము.

 💥ఆయుధాన్ని కొనవచ్చు. కానీ ధైర్యాన్ని కొనలేము.

 💥భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.

 💥మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో.

 💥ధనముతో పరుపుని కొనవచ్చు కానీ నిద్రను కాదు.

 💥ధనముతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు.

 💥ధనముతో దేవాలయాలని కొనవచ్చు, కానీ దేవుణ్ణి కాదు.

 💥దాచిపెట్టి ఏమి చేస్తావు, శవం మీద గుడ్డకు జేబు అయినా ఉండదు.

 💥ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద.

 💥ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నది ముఖ్యం.

 💥ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం.

 💥జీవితంలో ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి:

 1)నీకు విలువ ఇవ్వని వారిని

 2)నిన్ను చూసి ఈర్ష్య పడేవారిని

 3)మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని.

****



           ధర్మో రక్షతి రక్షితః

* జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు.

* మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. 

* మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే.

* ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది.

* ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి.

* ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతోంది.

* శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటాడు.

* అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి.

* అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు.

* మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో విపులంగా వివరించి చెప్పింది మహాభారతం.

* ఏ కర్మలైతే మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో ఆచరించకూడదు.

* అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ చెబుతాడు.

* వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పినవాటిని అర్ధశ్లోకంలో వివరిస్తున్నానని ఈ విధంగా ఉపదేశిస్తారు.

* ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది. ఇదే అసలైన ధర్మసూక్ష్మం.

* ధర్మాచరణమే పరమధర్మమని, సచ్ఛీలమే తపస్సని, సచ్ఛరిత్రమే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు.

* బ్రహ్మచారి అయిన శ్రవణ కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూ, వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రుల సేవచేస్తూ ఆత్మశక్తిని పెంపొందించుకున్నాడు.

* ధర్మవ్యాధుడు స్వధర్మ ఆచరణతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు సేవచేస్తూ వేదవిహిత కర్మలతో తపోశక్తిని సాధించిన కౌశికుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేశాడు.

*  కుక్కుటముని తనకు సమీపంలో ఉన్న గంగను, కాశిని సేవించక తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు.

* అందుకే మనిషి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి.

* ధర్మాచరణతో అందరికీ తోడ్పడాలి.

* భోగాలను విడిచి త్యాగగుణం పెంచుకొమ్మంటుంది ధర్మం.

* అహంకారం వదిలి ఆత్మతత్వం గ్రహించమని చెబుతుంది.

* యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడు తల్లిదీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించమంటాడు.

* అప్పుడు గాంధారి, ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని దీవిస్తుంది.

* ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు.

* ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతిలో ఇలా వివరిస్తాడు. ..

* మానవుడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమిపైన, గోసంపదను పశువుల శాలలో విడిచి మరణిస్తున్నాడు. భార్య ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది. మిత్రులు శ్మశానం వరకు వచ్చిపోతారు. ఎంతో ప్రేమగా పోషించుకున్న శరీరం చితిమంటల్లో భస్మమైపోతుంది. జీవుడితో వెళ్లగలిగేది ధర్మం ఒక్కటే.

* తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమధర్మం. నిస్సహాయులకు, వృద్ధులకు సహాయం అందించడం మానవతా ధర్మం.

* ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని నీవు ఇతరులకు చేయడం నిజమైన ధర్మం.

* ధర్మాన్ని అనుసరించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

* ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది.

* ఎంతటి క్లిష్ఠపరిస్థితుల్లోనూ ధర్మం విడవకూడదని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.

      *లోకాసమస్థాః సుఖినోభవంతు*

కధకాని కథలు. (01to 07) ********

 



కథ గాని కథ( ఏడు )

విత్తనం మొక్కగా, చెట్టుగా, పువ్వుగా, పండుగా, వివిధ రూపాలను మళ్లీ విత్తనం గా మారటం, శృష్టికారకమైన చైతన్యం జగత్తునంత మోస్తూ దైవ సంకల్పo ప్రకారంగా సృష్టి ధర్మం వల్ల చీకటి వెలుగుల సమాజంలో, సుఖ దుఃఖాల జీవితం నలిగి వెలుగులుగా. అవగాహన మొదటి మెట్టుగా అర్థం చేసుకొని నడుచుకునే ఆకలి మెట్టవడం, విశ్రాంతి ధర్మబద్ధమైన నడకతో సాగిపోతూ, అప్రమత్తులై, నిరంతర ఎరుకతో, జీవన గమనమై, పరిశీలిస్తూ, అంతా పరిశోధనలాగా సాగుతూ, సంతృప్తిగా,  ద్రవించే జ్ఞాన స్వరంగా, పరంగా, కళలు  మార్చుకుంటూ, నిండుగా, పండుగల జీవిస్తూ సమస్త లోకానికి భారం కాకుండా, పంచభూతాలకు అడ్డం రాకుండా సాగించడమే మానవ జీవితం. 

మరి దెబ్బలకు వచ్చిన రాయికి దొరుకు గౌరవం. ఆటుపోట్లు ధరించిన జీవికి కడవరకు పయనం. మనిషి దిగులు లేని సత్యాన్ని అనుకరించి, ధర్మాన్ని నిర్వహించి నిర్మలంబుగా, కాలయాపన చేస్తూ, మనసు కోరుకుంటూ, జీవన కళ ఉట్టిబడుతూ, బతుకు ఉత్సవాల్లో, అనుభవాలతో, జీవన గమనం సర్వస్వయోదాయకం.

 తీగల నుండి తెగిన దోస పండ్లుగా,ఎండిన ఆకు రాలినట్లుగా, ఉప్పొంగుతున్న సముద్రం ఉప్పెనగ ఊరికి వెనక తగ్గినట్లుగా,  కర్మ పరిపక్వత పొంది కర్మానుసారం అనుభవించి, అంతిమంగా శివోహంగా మారి "ఆత్మకు మరణం లేదు కనుక" మరో జీవనంగా మారటం జీవన ప్రక్రియ.

*****

కథ కాని కథ (06)

బ్రహ్మణ ముహూర్తం విలువ లేందే మనసుకు తృప్తి చేరదు, కాలంతో ఎదురీదాలంటే మన సంస్కృతి సంప్రదాయలు, వంశగౌరవాలు తప్పవు, అలాగే మంచి సంసారానికి అన్యోన్యత ముఖ్యం!

అభివృద్ధి అంతా విజ్ఞానంతోనే అంటే మనిషి అలవాట్లు తరతరాలుగా వస్తున్నాయి, ఎవరు ఎన్ని చూపిన మనసు బట్టే పోవుట నిజమైన విజ్ఞానం. అందుబాటులో ఉన్న అజ్ఞానం తొలగించ గల బుద్ధి ఉంటే చాలు, ప్రపంచ విజ్ఞానం అవసరమా...

తెల్లారి లేస్తే  అన్నీ అబద్ధాలే చెప్పేవారున్నారు,

అలాంటప్పుడు ఎందుకు నీతుల ఉపయోగం ఏమిటనే వారున్నారు, కాని గత్యంతరం లేని స్థితిలో పలుకు మాయకు చిక్కుతారు కదా కాని సరిదిద్దుకొనే తెలివి, బుద్ధి మామవులకు ఉన్నాయికదా....

ఆర్ధికలోపాలు వ్యవస్థాగతం, అలాంటప్పుడు వ్యవస్థను మార్చ దళచినా అందరూ దొరకని దొంగలేగా తల్లి తండ్రి గురువు ఎంతచెప్పిన పిల్లల చేష్టలు మారవు యిదీ యంతే కదా...

భారతీయులకు గుళ్ళే ముఖ్యం అలాంటప్పుడు దేశమేమైతేనేమి అంటున్నావు? అసలు నీదర్మం నీవు నిర్వహిస్తున్నావా, గుడి యనేది హృదయం పదిలంగా ఉంటే జీవనం పదిలం.

ఆధ్యాత్మికమే,రాజకీయచైతన్యం పిడికెడు మెతుకులు చాలవా నీకు చెప్పి చేయించు కోలేని మూర్ఖ వాదన దేనికి.

భూమి దద్దరిల్లేలా - ఆకాశం అదిరిపోయేలా ఆర్భాటాలు వద్దు!ఆపదలో ఉన్నవాడ్ని - అవసరంలో ఉన్నవాడ్ని ఆదుకోవడం ముద్దు!

*****

కధకానికధ. (05)

మల్లెతోటలో గులాబికోసం వెతుకుతావెందుకు, తీరని ఆశకు కొత్తరెక్కలను తొడుగుతు ఎగరాలని పరిగెడతా వెందుకు దూరంజరుగుతున్న దరిచేరి ఫలములబుట్ట పరుగుల చూపులందుకు, తీపివ్యాధులకు చేదు మందులను మింగుతు ఒకవైపు, కక్కుర్తి యాటలు ఎందుకు, స్వచ్ఛత యనేది అందరికీ ఉంది, దాన్ని దక్కించుకొని సద్వినియోగం చేసుకోవాలి ఎవరాయినాసరే కాదా?.

పాటనుపాడే పశువులకాపరి సంతసాన్ని చూడు కల్మషము లేని తనము, విధిరాతంటూ వ్యథల సంద్రమే ఈదుతూ కర్తవ్యం, కాకరకాయ కాదు, ఏ సమయాన, ఏఋతువుకు తగ్గ అలవాట్లు ఉంటే చాలుగా మనలో.

కాకికోకిలగ పాడాలంటే కుదిరే పనియేనా నీకు, నాకు, పట్టువదలక మీకర్మంటూ పాడుతూ, నన్ను వేధిస్తూ, ఉండుట ఎవ్వరి కొరకు?

తప్పులు ఎంచే నీగుణమే నని ఒంటరి చేస్తుందే, మరి అట్లామాటాడుకు, ఆగని నోటికి తాళం వేయకె సాగుతు ఉండుట దేనికి. రమణి అలుకలను తీర్చగ సాగే ప్రియుని దెంత మురిపెంబూ కలువ మెచ్చని చందమామగా కదులుతు కాలక్షేపం చేద్దామా మనము.

సంతోషంతో పొంగే మనసుకె విజయంచేరువలే ఉందని తెలుసుగా, రగిలేగుండెకు శ్రీచందనమై తాకుతు మనసు కలవరం తగ్గించుకొనుట అందరి కర్తవ్యం కదా

బలే చెప్పారే.... మీరు

****

** కథకాని కథ(04)

సాహిత్యం అంటే సహనం నుండి వచ్చే, అనుభవాల అక్షర సత్యాలను తెలిపేది కవి హృదయం అర్ధం చేసుకోవటం నుంచి వచ్చె, పదానికి అర్ధాలు ఎన్నో, అర్ధం కానివారికి ఎం చెప్పెది ఇక నుంచ్చె?

వనంలోకి ప్రేమికులు రావద్దంటే ఆగుతారా, ఇది జంతు సాహిత్యం చదవద్దంటే ఆగుతారా, మనుష్యులకంటే జంతువులే మేలని తెలియదా, భావాన్ని అర్ధం చేసుకోలేనివారికి బూతు అంటే ఎలా ఈ దుస్థితి నేటి పరిస్థితి మనిషి జన్మ అన్ని జన్మలలో ఉకృష్టమైనది, సమాజానికి మాయని మచ్చగా ఆర్థిక అవసరాలు దేనికి?

ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించటం అందరి కర్తవ్యంమనో నిగ్రహశక్తి పెంచేది, ఆలోచిన్పచేసేది కవిత్వంసరస్వతీ పుత్రులను విమర్సించటం అవివేకంమనలోలేనిది ఇతరుల్లో ఉన్నది గ్రహించటమే వివేకం కాదా?

*_జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేవి మత్తు మందు లాంటివి! ఇవి అలవాటు అవ్వాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం తోడవ్వాలి. ఆ పుణ్యఫలంను నేటి సాధనకు సహాయంగా చేసుకుని మరింత సాధకులు కావడానికి ప్రయత్నం చేయాలి. వీటిని వదిలేసి కేవలం భోగ భాగ్యాలను అనుభవిస్తూ కూర్చుంటాం అంటే జన్మకు సార్థకత చేకూరదు!..*

--((*))

కథ కాని కథ(3)

*భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి...*

*సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది... అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు...*

*పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు... భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది...*

*దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది... క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది... చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, భగవంతుని కృపకు పాత్రులవుతాం*

*****

మనిషికి మోక్షం - అర్థం -పరమార్ధం(కధకాని కథ. (02)

నువ్వెవరో తెలుసుకో ముందు, ఈ విశ్వం ఎంత పెద్దదైనా,  నీ జ్ఞానం ముందు  అది చాలా చిన్నదే. 

పక్షులకు రెక్కలే సాధనాలు; నీకు నీ ఊహలే రెక్కలు.  అవే నీ అమృత వాక్కుల ణే రెక్కలతో విశ్వాన్నే దాటేస్తావు;  అదే నీకు వరం.  నువ్వు బాధ్యత బంధము భారము కాకుండా వెతుకు; ప్రకృతి ప్రభావము తోడు నీడగా, నీ వెంటే ఉండు, అప్పుడే మోక్షం లభిస్తుంది.  

 స్నేహాన్ని, ధర్మాన్ని,సత్యాన్ని మార్గంగా ఎంచుకో;  అప్పుడే భగవంతుడ్ని చేరుకోగలవ్.  నిన్ను ద్వేషించేవాళ్ళ నిన్నేమీ చేయలేరు,నిన్ను ప్రేమించేవాళ్ళని దగ్గరకి తీసుకో; అప్పుడు నువ్వే ఒక వెలుగు.  అంబర దీపంగా వెలిగి పోతావు 

నువ్వే ఆకాశమైనప్పుడు,  నిన్ను గాలి ఏం చేస్తుంది?  

నువ్వే సముద్రమైనప్పుడు,  నీరు నిన్ను ఏం చేస్తుంది?  

నువ్వే స్వర్గమైనప్పుడు,  దుఃఖం నిన్ను ఏం చేస్తుంది?  

నువ్వే దేవుడవైనప్పుడు మృత్యువు మాత్రం ఏం చేస్తుంది?  

ఎడారిలో ఉన్నప్పుడు నువ్వే ఒయాసిస్సువు;  

అడవిలో ఉన్నప్పుడు నువ్వే మృగరాజువి;  సమాజంలో ఉన్నప్పుడు నువ్వే ఒక సమూహానివి.  నీ ఆలోచనలని బట్టే నీ జీవితం;  నీ మానవత్వాన్ని బట్టే నీ వ్యక్తిత్వం.  

మాట్లాడుతున్నప్పుడు  నువ్వు మౌనంగా,  అందరూ మౌనంగా ఉన్నప్పుడు  నువ్వు గొంతెత్తి మాట్లాడు.  

ఈ జీవితం నాటకం కాదు;  ఇదొక పరీక్ష.  ఇందులో నువ్వు గెలవాలి;  దాని కోసం రోజూ నువ్వు సాధన చేయాలి.  

గులాబీలు నిన్ను చూసి నవ్వు తుంటే  నువ్వు దిగాలు ముఖం వేసుకుని కూర్చోకు. సాయంత్రానికి వాడిపోయే  ఆ గులాబీలను చూసి  సంతోషంగా ఉండడం నేర్చుకో.  

నీ చుట్టూ ఉన్న చీకటికి భయ పడకు;  నీలో ఉన్న చీకటికి భయపడు.  నువ్వు వెలుగులో జీవించాలంటే  నువ్వే వెలుగువి కావాలి.  

మృత్యువు గురించి భయపడకు;  దానితో ఆఖరి శ్వాస వరకు పోరాడు.  అదే జీవిత చరదరంగం.  

అదేమనిషికి మోక్షం  అర్థం పరమార్ధం

*****

ప్రణాళిక! (కధకాని కథ. (01)

********

వివక్షలేని దానకర్ణులుగా, దయాదులుగా చూపు తో, ఆంక్షలు లేని ధాన్యము పండించే రీతిగా, దార (భార్య) దాపరికము లేకుండా కాపు' కస్తూ, జ్ఞానమణి గా ధార్మికుడుగా, దాతగా, దాశరధిగా, దామోదరుడుగా జీవితమై, అందరికి దారములా, దారులుగా, దావనలము కాని 'పని' గా,సంపదంతా దాత (బ్రహ్మ) దాతువులు ధార (నీరు) పంచభూతాల సహాయం 'సమాజపరం' గా, దేశాలకు కత్తిధార, దాగుడుమూతలు, దానవులు,' సరిహద్దులను దాటి పోవగా,  దోపిడీ లేని ధారాపాతంగా, దారి తెన్ను, తెలిపే ఆనందం' పొందగా,'వ్యక్తిగత' వివక్ష, దాస్య ప్రవృత్తి, దాచుకొను, దోచుకొను, ఆస్తి పోగా, లంచాలు లేని, దాసీ పుత్రులు లేని,  ఎలపట దాపట లేని, దాహము తీర్చు వ్యవస్థ' రాగ'పనిని' అందరూ, దాస్యమనక, ధర్మమని తలంచి గౌరవించాలి!

ప్రజాశ్రేయస్సే ప్రతి ఒక్కరి లక్ష్యమురాజకీయం' కాగా, ద్వేషం, ద్రోహం, అమిత దాహం, అహంభావం నశించి ప్రేమ' మిగలగా, చిటపటలు కాదు అందరిలో అన్నీ సమయాల్లో చిరునవ్వులతో ఏదీ నీది కాదనే'వేదాంతం' గా, పనులన్నీ మౌనంగా' జరగా,బానిసత్వంలేని బ్రతుకు' గా మాయ పోయి 'హాయి' గా మనిషి క్రమంగా 'దేవుడు గా 

మానవత్వమే నీ 'ప్రణాళిక' గా కావాలి!

      *******