Thursday 23 May 2024

002 -06-2024 ... ప్రాంజలి ప్రభ కధలు..9




010..నేటి కథ..ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

. ఆరోగ్యం.. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక )లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి


తెలుసుకోదగిన విషయం ..... పూజారి తనకు తోచిన కధలు తేలుతున్నాడు 


ఒక రోజొక గురువు గారు తన ఇద్దరు శిష్యుల్నీ పిలిచి, “ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి” అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి, ఒక శిష్యులకు ఇచ్చి, “ఎవరైనా అవసరం ఉన్న వాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్లు” అన్నారు. 


రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్లు’ అన్నారు.


ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచి వాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది.


ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేక పోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది.


మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ యగమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు?


ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే “విలువగలవైనా ..


లౌకిక విషయాలను, వస్తు సమాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే, జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమనీ , జ్ఞానాన్నీ పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే, మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది”. 


అట్లాగే పిల్లలపై ప్రేమ ఉండోచ్చు మొదటి వ్యక్తిలాగా బరువులను మోస్తే ఇవితమంతా బరువుతుంది, రెండోవ్యక్తిలా అందుకున్నదంతా పంచి సహాయము చే యుటె సుఖము.       


***


0'011..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి

గుంటూరు చరిత్ర'


గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా?


శతాబ్దాల చరిత్ర నా గుంటూరు ....


ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి.


కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు.


మాచర్ల చెన్నకేశవుడి ఆశీస్సులతో ౘాపకూడు సిధ్ధాంతం ద్వారా సామాజిక న్యాయం కోసం నిలబడ్డ పల్నాటి బ్రహ్మనాయుడి చరిత్ర నా గుంటూరు.


కృష్ణరాయలుకే కొఱుకుడు పడని కొండవీటి రెడ్డి రాజుల చరిత్ర నా గుంటూరు.


అష్ట దిగ్గజాలకే తలమానికమైన రామకృష్ణ కవి నా గుంటూరు.


'కృష్ణం కలయసఖి సుందరం బాల కృష్ణం కలయసఖి సుందరం' అంటూ 'తరంగాలు' అందించిన నారాయణ దాసు నా గుంటూరు.


అమరావతి కేంద్రంగా సుపరిపాలన అందించిన రాజా వాసిరెడ్డి వేంకట్రాది నాయుడు చరిత్ర నా గుంటూరు.


ముచుకుంద మహర్షి తపమాచరించిన గుత్తికొండ బిలం నా గుంటూరు. 


త్రేతాయుగంనాటిదని పేరు గాంచిన సీతానగరం నా గుంటూరు.


శిబి చక్రవర్తి తన తొడను కోసి పావురాన్ని రక్షించిన క్షేత్రం కపోతేశ్వరాలయమున్న చేజెర్ల చరిత్ర నా గుంటూరు.


అక్కరలో ఉన్నవారిని చేదుకునే కోటయ్య వెలసిన పుణ్య క్షేత్రం కోటప్పకొండ చరిత్ర నా గుంటూరు.


పానకాల స్వామిగా వినుతికెక్కిన నృసింహ క్షేత్రం మంగళగిరి నా గుంటూరు.


పంచారామాలలో ఒకటైన అమరావతి చరిత్ర నా గుంటూరు.


వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న పాత గుంటూరు అగస్తేశ్వరాలయం నా గుంటూరు.


ఇరవై నాలుగు అడుగుల ఆంజనేయుడు అండగా నిలబడిన పొన్నూరు నా గుంటూరు.


పేరెన్నికగన్న భావనారాయణుడు కొలువైన బాపట్ల నా గుంటూరు.


అనంతపద్మనాభుడు కొలువైన ఉండవల్లి గుహలు నా గుంటూరు.


సుదూర తీరాలనుండి వచ్చే వలస పక్షలు సంరక్షణ కేంద్రం ఉప్పలపాడు నా గుంటూరు.


ఆంగ్లో-ఫ్రెంచ్ యుధ్ధం జరిగిన ప్రాంతం (నేటి హిందూ కాలేజ్ ఉన్న ప్రాంతం) నా గుంటూరు.


'నీరు పెట్టావా, నారు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఎందుకు కట్టాలిరా శిస్తు?' అని బ్రిటీషు వారిని ఎదుర్కొని ముప్ఫై ఏళ్ళ ప్రాయంలోనే కన్నెఱ్ఱ చేసి ప్రాణత్యాగం చేసిన కన్నెగంటి హనుమంతు చరిత్ర నా గుంటూరు.


సామాజిక ఆనాచారం వల్ల శివ దర్శనానికి నోచుకోని ఒక అభాగ్యుడి వేదనను 'గబ్బిలం' ద్వారా వినిపించిన మహా కవి జాషువా చరిత్ర నా గుంటూరు.


కొప్పరపు కవుల చరిత్ర నా గుంటూరు.


పువ్వులంటే ముచ్చట పడే మహిళల చేతనే కన్నీరు పెట్టించిన కరుణశ్రీ నా గుంటూరు.


సంస్కృతాంధ్ర భాషల్లో అగ్రగణ్యులైన జమ్మలమడక మాధవరాయశర్మ, శ్రీ కృష్ణాచార్యుల చరిత్ర నా గుంటూరు. 


ప్రవచనాలకు నాంది పలికిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి నా గుంటూరు.


మహా కవులు, రచయితలు అయిన 'తెలుగులెంక' తుమ్మల సీతారామశాస్త్రి,  సత్యం శంకరమంచి, మునిమాణిక్యం నరసింహారావు, కొడవటిగంటి కుటుంబరావు, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి,  రాయప్రోలు సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతారావు, పండిత సత్యదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, ప్రముఖ రచయిత సంజీవ దేవ్, అధరాపురపు తేజోవతి, పాపినేని శివశంకర్, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఓల్గా,  దేవీప్రియ, శార్వరి వంటి వారిని కన్న నేల నా గుంటూరు.


జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత రావూరి భరద్వాజను కన్న నేల నా గుంటూరు. 


వేయి వసంతాల మానవ జీవన యానం, చరిత్రకెక్కని స్వాతంత్ర్య సమరయోధుల గురించి వ్రాసి నాకు మార్గదర్శకం చేసిన మా నాన్న గారు స్వర్గీయ విఠల్ రావు గారు నా గుంటూరు చరిత్ర.


మాంటిస్సొరి ఎడ్యుకేషన్ కు నాంది పలికి ఈనాడు మహావృక్షమైన శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్, చేతన, ఉషోదయ, సంధ్యారాగం, రక్ష వంటి సంస్థల వ్యవస్థాపకులు మంగాదేవి గారు నా గుంటూరు.


ఎమ్సెట్ లేని రోజుల్లో మెడికల్ ఎంట్రన్స్ కు కోచింగ్ ఇవ్వడంద్వారా తెలుగునేల అంతా చిరపరిచితమైన సింహం శ్రీ చతుర్వేదుల విశ్వనాధమ్ ఎలియాస్ సివియన్ ధన్ గుంటూరు.


నాటక రంగంలో లబ్దప్రతిష్టులైన స్థానం నరసింహారావు, ఏ.వి. సుబ్బారావు, ఈలపాట రఘురామయ్య, కాళిదాసు కోటేశ్వరరావు, స్థానం వారి తరువాత స్త్రీ పాత్రలలో స్థానం సంపాదించిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి,  మాడభూషి వేంకట శేషాచారిలను అందించిన నేల నా గుంటూరు.


శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహా సన్నిధానం నా గుంటూరు.


కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిధ్ధేశ్వరానంద భారతి స్వామి నా గుంటూరు.


క్రీస్తు పూర్వం రెండు వందల ఏళ్ళ నాడే అబ్రకాన్ని కనుగొన్న భౌతిక వాది, బౌధ్ధుడు, రసాయనిక శాస్త్రాన్ని ఔపోసన పట్టిన నాగార్జునుడి చరిత్ర నా గుంటూరు.


సూర్య మండలంలో హీలియమ్ గ్యాస్ ను కనుగొన్న చరిత్ర నా గుంటూరు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూరు వజ్రానికి పుట్టినిల్లు నా గుంటూరు.


బుఱ్ఱకధా పితామహుడు నాజర్ నా గుంటూరు.


బౌధ్ధ భిక్షువులకు ఆలవాలమైన భట్టిప్రోలు చరిత్ర నా గుంటూరు.


బ్రహ్మదేవునికి ఉన్న రెండే రెండు దేవాలయాల్లో ఒకటైన చేబ్రోలు నా గుంటూరు.


చేత వెన్న ముద్ద తో దర్శనమిచ్చే ప్రపంచంలోని ఏకైక శ్రీ కృష్ణ దేవాలయం ఉన్న సొలస గ్రామం నా గుంటూరు.


బ్రిటీషు వారి తుపాకులకు ఎదురొడ్డి నిల్చిన ఆంధ్రకేసరి పుట్టినిల్లు అలనాటి నా అవిభాజ్య గుంటూరు.


కోట్ల విలువైన ఆస్థిని స్వాతంత్ర్యం కోసం దేశానికి ఇచ్చివేసిన దేశభక్త కొండా వెంకటప్పయ్య నా గుంటూరు.


చీరాల-పేరాల ఉద్యమాన్ని నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు.


మూడు సార్లు నిషేధానికి గురైన నవల 'మాలపల్లి' రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ నా గుంటూరు.


బాల వితంతువులను చేరదీసి విద్యాబుధ్ధులు గరిపి గౌరవప్రదమైన బ్రతుకులను ఇచ్చిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ నా గుంటూరు.


నిస్వార్ధ సేవకు నిరుపమానమైన ఉదాహరణ వావిలాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు.


దేశంలోనే మొట్టమొదటిసారిగా మునిసిపల్ ఆఫీసుపై మువ్వన్నెల ౙండా ఎగురవేసి బ్రిటీష్ అధికారాన్నే సవాలు చేసిన నడింపల్లి నరసింహారావు నా గుంటూరు.


రైతు లేనిదే దేశం లేదని అహర్నిశలు వారి శ్రేయస్సుకై పాటుబడ్డ గోగినేని రంగనాయకులు (N.G.Ranga) నా గుంటూరు.


ఐదుగురు ముఖ్యమంత్రులను, నలుగురు అసెంబ్లీ స్పీకర్లను అందించిన చరిత్ర నా గుంటూరు.


కేంద్ర కేబినెట్ లో ఒకే సమయంలో ఒకే జిల్లానుండి ఇద్దరు మంత్రులు ఉన్న ఏకైక జిల్లా నా గుంటూరు.


పొగాకు, మిర్చి, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలకు నెలవు నా గుంటూరు. 


శాకంబరీదేవీ ప్రసాదం, ఆంధ్రశాకం గోంగూర నా గుంటూరు.


భగభగ మంటలు మండించే మిరప్పళ్ళ కారం నా గుంటూరు.


గలగలా పారే కృష్ణమ్మ కెరటాలతో సస్యశ్యామలమైన కృష్ణా డెల్టా నా గుంటూరు.


విద్యారంగానికి పంచ మాతృకలుగా విరాజిల్లుతున్న 135 సంవత్సరాల ఆంధ్ర క్రైస్థవ కళాశాల, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ కళాశాల, యాభై సంవత్సరాల వయసున్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల, తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కళాశాల, (మునిసిపాలిటీ ఆధ్వర్యంలో మహిళలకు కళాశాల ప్రారంభించి, తరువాత బ్రిటీష్ ప్రభుత్వానికి అంటగట్టిన లౌక్యుడు తెల్లాకుల జాలయ్య గారు) ప్రభుత్వ మహిళా కళాశాలల వైభవంతో Oxford of Andhra అని పేరుగన్నది నా గుంటూరు.


దేశ విదేశాలలో స్థిరపడ్డ తెలుగు వైద్యులలో అధిక శాతం గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్ధులే అన్నది జగమెరిగిన సత్యం. అది నా గుంటూరు.


గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అంటే సామాన్య జనం నుండి కోటీశ్వరుడి వరకు అందరూ కోరుకునేదే.


Guntur is considered as Medical Hub of AP.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ, ప్రొ॥ వాసిరెడ్డి శ్రీ కృష్ణ, ప్రొ॥కె.సచ్చిదానంద మూర్తి, ప్రతి ఇంటా వినిపించే సుందరకాండ ఎమ్మెస్ రామారావు, ప్రవచన కర్త శ్రీ మైలవరపు శ్రీనివాసరావు నా గుంటూరు.


మెడికల్, ఇంజనీరింగ్ .... ఇప్పుడు CA కోచింగ్ లకు పుట్టినిల్లు నా గుంటూరు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్టర్డ్ ఎకౌంటెంట్, ICFAI Founder Governor నండూరి జ్యోతిర్మయి యశస్వి (N J YASASWI) నా గుంటూరు. 


శాస్త్రీయ సంగీత దిగ్గజం మంగళంపల్లి బాల మురళి గారి గురువు, త్యాగరాజ స్వామి శిష్య పరంపరలో ఒకరైన పారుపల్లి రామకృష్ణయ్య, పురాణం పురుషోత్తమ శాస్త్రి, కొమండూరి శేషాద్రి, కర్లపాలెం చంద్రమౌళి మరియు వారి శిష్యులైన నాదస్వర విద్వాంసులు షేక్ సుభానీ, కాలీషా దంపతులు (పద్మశ్రీ అవార్డుల గ్రహీతలు), రాజనాల వేంకట్రామయ్య, వింజమూరి వరదరాజయ్యంగారు,  సంస్కృతాంధ్ర పండితులు శ్రీమాన్ కొమండూరి సీతారామాచార్యులు నా గుంటూరు.


సినీ ప్రముఖులైన చక్రపాణి, వేమూరి గగ్గయ్య, గోవిందరాజుల సుబ్బారావు, నాగయ్య, ముక్కామల, కాంచనమాల, ఛాయా దేవి, సావిత్రి, జమున, కొంగర జగ్గయ్య, శారద, ప్రభ, దివ్యవాణి, జయలలిత, సుమలత, రాగిణి, బాలయ్య, గుమ్మడి, ధూళిపాళ, డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ, ఏవియస్, వీర నరసింహాపుర అగ్రహారీకురాలైన భానుమతి, కొసరాజు రాఘవయ్య, ముదిగొండ లింగమూర్తి, సియస్సార్, వంగర వెంకట సుబ్బయ్య, కె. విశ్వనాధ్, గాన కోకిల ఎస్. జానకి, మాధవపెద్ది సత్యం, గోఖలే, బ్రహ్మానందం, జీవా, ప్రదీప్ శక్తి, బోయపాటి శీను, కొరటాల శివ, పోసాని, సంగీత 'చక్రవర్తి', గాయని సునీత, గాయకుడు మనో, సినీ రచయిత మాడభూషి దివాకర బాబు, సంగీత దర్శకుడు, గేయ రచయిత వోగేటి నాగ వేంకట రమణ మూర్తి (స్వర వీణాపాణి), హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి, సూర్యదేవర రామమోహనరావు, సినీ, టి.వి. సీరియల్ రచయితలు గూడూరు విశ్వనాధ శాస్త్రి, మాడభూషి వేంకటేష్, సినీ రచయితలు, దర్శకులు అయిన బుర్రా సాయి మాధవ్, రాజేంద్ర భరద్వాజ, క్రిష్ జాగర్లమూడి, కే.యస్. రవీంద్ర, బయ్యవరపు వేంకటేశ్వరరావు, గుంటూరు శాస్త్రిగా ప్రసిధ్ధి చెందిన GSRK శాస్త్రి, నాటక, సినీ రచయిత ృశ్నేశ్వరరావు, నాటక రంగ ప్రముఖుడు నాయుడు గోపి నా గుంటూరు.


పారిశ్రామికవేత్తలలో సుప్రసిధ్ధులైన వెలగపూడి రామకృష్ణ ICS నా గుంటూరు.


యువ డాషింగ్ & రెబల్ క్రికెటర్ అంబటి రాయుడు నా గుంటూరు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక నా గుంటూరు.


పిడుగురాళ్ళ, రాగి నిక్షేపాల అగ్నిగుండాల, నరుకుళ్ళపాడు, ఫిరంగిపురం .... ఈ పేర్లు వింటేనే ప్రత్యర్ధికి కాళ్ళు వణుకుతాయి. అదీ నా గుంటూరు.


శిల్పకళకు నెలవు దుర్గి నా గుంటూరు.


విప్లవ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ నా గుంటూరు.


మొట్టమొదటగా 1913 లో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించింది నా గుంటూరు ....


గోంగూరంటే ముందుంటాం. మిరప్పళ్ళ కారం మాదేనంటాం.


దేనికైనా ముందుంటాం .... 


మాటలో సూటిదనం, నిక్కచ్చితనం, పొగరు, విగరు ఉన్నదే నా గుంటూరు ....


ఇంతటి ఘన చరిత్ర ఉన్న ప్రాంతాన్ని మీకు పరిచయం చేసిన

* కీర్తి శేషులు మల్లాప్రగడ లక్ష్మణరావు గారు మానాన్న గారు, యీ గుంటూరులో హనుమాన్ జ్యోతిషాలయం గా అంజనం వేసి (బాలంజనేయ ప్రశ్న ) వచ్చిన వారి సమస్యలు తీర్చి, జాతకాలు చెప్పి, హనుమాన్ మూలికా వైద్యశాల నడిపి ఆంజనేయస్వామి గుడి కట్టి తనవంతు సేవలు చేశారు*


*  యిక్కడే పుట్టి డిగ్రీ చదివి (P M C ) నేను లెక్కల మాస్టర్ గా పనిచేసి పుట్టి పెరిగినది మరొక్కసారి జన్మభూమి కి ప్రణామాలు అర్పిస్తూ మీ 

మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ, హైదరాబాద్*

మన బాష తెలుగు.. మన చెలిమి అందరికీ రక్ష 


 పుట్టి పెరిగిన ఊరు గుంటూరు ....


ఇదీ గుంటూరు అంటే .....


12..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి


*ఈ రోజు వేటూరి సుందర* *రామమూర్తి గారి* 

 *వర్ధంతి.(22-5-2010).* 


ఆయన రాకముందు ఎందరో మహామహులు సినీ గీతాలు...సాహిత్యవిలువలతో వ్రాశారు. 


నీతులు రాశారు. బూతులు రాశారు!


కానీ ఈయన రాకతో రసవద్గీతలు & భగవద్గీతలు కూడా వెల్లువయ్యాయి.


పున్నాగపూలు సన్నాయి పాడాయి..కోకిలమ్మకు పెళ్ళి కుదిరింది...కోనంతా పందిరయ్యింది...చిగురాకులు తోరణాలయ్యాయి.


మానసవీణలు మధు గీతాలు పాడాయి.


వెల్లువొచ్చి గోదారమ్మా వెల్లకిలా పడింది.


గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రనా ఎందువలన? అని సందేహాలు కలిగాయి!


నెమలికి నేర్పిన నడకలు, మురళికి అందని పలుకులు, అందానికి అందమైన పుత్తడి బొమ్మలు దొరికారు.


తకిట తకిట తందానాలు, జగడ జగడ జగడాలు, మసజసతతగ శార్ధూలాలు,గసగసాల కౌగిలింతలు తెలుగు పాటను శృంగారభరితం...రసవంతం చేశాయి.


                            @@@@


ఏ కులము నీదంటే గోకులము నవ్వింది... మాధవుడు యాదవుడు మాకులమే లెమ్మందీ.. 

అని నడమంత్రపు మనుషులకు  జవాబిచ్చింది!


వేణువై వచ్చాను భువనానికి..గాలినై పోతాను గగనానికి....

 

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే....వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే...


నరుని బ్రతుకు నటన ..ఈశ్వరుని తలపు ఘటన... ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన...


వేదాంత ధోరణి నిగ్గదీసింది.


చిలక్కొట్టుళ్ళు, గిచ్చుళ్ళు, 

తిక్క రేగిపోవడాలు, పలక మారిపోవడాలు, 

ఆకు చాటున తడిసిన పిందెలు, 

ఆరేసుకోబోయి పారేసుకోవడాలు...


ఇలాంటి పామర జన రంజకమైన పదాలు కూడా సంధర్భోచితంగా...సాహిత్య మర్యాదకు నోచుకున్నాయి!


ఈ ధుర్యోధన ధుశ్శాసన  గీతంలో... మర్మ స్థానం కాదది నీ జన్మ స్థానం.. అంటూ అందరినీ ఉద్వేగ పరిచే ఆవేశం!


వెండితెరపై పాటలకు సరికొత్త గౌరవం తీసుకొచ్చిన ఆ పాళీ..

ఎవరిదో మీకిప్పటికే తెలుసు.


కీ.శే.వేటూరి సుందర రామమూర్తి గారు.


                             @@@@


అలలు కదిలినా....పాటే! 

ఆకు మెదిలినా....పాటే!

కలలు చెదిరినా....పాటే!

కలత చెందినా.....పాటే!....


ఏ పాట నే పాడనూ.....అంటూ సందిగ్ధావస్థలో పడే వారు ఆకాలంలో. 


అదో స్వర్ణ యుగం....సినీ సంగీతానికి!


ఇప్పుడదేం లేదు! పాటలు ఉండాలి. 


అవి ఓన్లీ హీరో హీరోయిన్లకే ఉండాలి! 


మహా ఐతే...ఒకటో...రెండో ఐటెం సాంగ్స్ ఉండాలి! అవి కూడా స్టెప్పులేసుకునేందుకు వీలుగా....మాంచి ఊపు వచ్చేట్లుండాలి!


ఆ పాటలకు సందర్భ శుధ్ధి కూడా ఏమీ అవసరం లేదు! ఎప్పుడంటే....అప్పుడే వచ్చిపోతుంటాయి! 


సూటూ...బూట్లతో హీరో....పెద్ద పెద్ద కర్చీఫ్ లు పైన.... చిన్ని చిన్ని చెడ్డీలు క్రింద వేసుకుని హీరోయిన్...గెంతుతూ ఉంటే....


ప్రక్కన పదిమంది....వెనకాల వంద మంది గెంతుతూ ఉంటారు!


పాట ఎప్పుడెప్పుడైపోతుందా.....అని ప్రేక్షకుడు....చూస్తుంటాడు! 


అదీ ఇప్పటి పాట గతి!


                                @@@@


అసలీ పాటలు & పద్యాలు ఎందుకండి !? విదేశీ సినిమాలలో చాలా తక్కువగా ఉంటాయి....లేదా...సినిమా అంతా పాటలే ఉంటాయి. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లాగా!


ఈ ధుర్యోదన దుశ్శాసన దుర్వినీతి లోకం లో......బదులు సింపుల్ గా..నీకు తల్లీ..చెల్లీ లేరా! అనొచ్చు. 


ముప్పిరిగొన్న భావావేశాలను...మాట భరించలేదు. అవి పదాలుగా దొర్లకుండా...కళారూపం ఇవ్వాలి. అదే పాట!


                              @@@@


1974 లోవచ్చిన 'ఓ సీత కథ తో సినీ గీతాల రచన క్రొత్త మలుపు తిరిగింది.


ఆ పదవిన్యాసంలో.....

ఆ నవ్యతలో.....,

ఆ వైవిధ్యంలో...., 

ఆ నిర్భయ పదసృష్టిలో....

ఆ ప్రభంజనంలో...... 


సినీ కవిత 4 దశాబ్ధాల పాటు ఉర్రూత లూగింది.


ఇప్పటి తెలుగు సినిమా పాట...మాట ఎలా ఉన్నాయంటే....బెజవాడలో ఏలూరు కాలువ లేదూ...అలా ఉంది! ఒకప్పుడు  తెలుగు సినిమా పాట గౌరీశంకర శృంగం! అని అన్నాడాయన.


పాట పక్షి లాంటిదని....ఏ పక్షి ఎంత బరువు మోయగలదో...ఎంత దూరం పయనించ గలదో...వారికి తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదని కాదు!


అలా తెలిసిన వారిలో అగ్రగణ్యులు వేటూరి వారు. ఏ పాటకు...ఎలాంటి అలంకారం చేయాలి. ఏ ఆభరణాలు తొడగాలో...బాగా తెలిసిన వారు!


శృంగార గీతాలు కూడా....చిందులు తొక్కేలా చేశాయి వీక్షకులను!


నమక చమక యమగమక లయంకర సకలలోక జర్జరిత భయంకర వికట నటస్పద విస్ఫులింగాల్ని....

కురిపించిన ఆ కలమే....


అబ్బ నీ తీయనీ దెబ్బ...ఎంత కమ్మగా ఉన్నదోయబ్బ...

అంటూ శృంగారాన్ని ఒలికించింది!


                              @@@@


నే చెప్పేదేముంది. అందరూ ఒప్పుకునేదే.

వేటూరికి సాటి వేటూరి యే....


వేటూరి వారిపాటకి

సాటేదని సరస్వతిని చేరి కోర, 

నా పాటేశ్వరుడికి వుజ్జీ

వేటూరేనంది నవ్వి వెంకటరమణా!


ఇది ముళ్ళపూడి వెంకటరమణ గారు ఛలోక్తి గా చెప్పిన విషయం.


గానం కోరుకునే గీతం వేటూరి 

గాయకుడు కోరుకునే కవి వేటూరి 

ఇది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ఉవాచ.


యాభై సంవత్సరాలు పైబడిన మా సినీ జీవిత ప్రయాణంలో మాకు తారసపడిన మహాకవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కణ్ణదాసన్. ఇంకొకరు వేటూరి.

ఇది సంగీత దర్శకద్వయం రాజన్-నాగేంద్ర గార్ల అభిప్రాయం.


పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే! నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇలా చెప్పారు.


                            @@@@


వేటూరి సుందరరామ్మూర్తి గారు 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించారు.


మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్... బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. 


ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 

1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.


వేటూరి దైతా గోపాలం గారి దగ్గర...

ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు.


8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు...

ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. 


వేటూరి గారు 75సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.


వేణువై వచ్చాను భువనానికి

గాలి నై పోయాను గగనానికి.....అంటూ.


ఈ రోజు వేటూరి సుందర రామమూర్తి గారి

వర్ధంతి.(22-5-2010).


స్మృత్యంజలి.🌹


              

🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿


🌹రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹*

*సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా*

*సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి*

*ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి.  సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.*

*సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,*

*అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.*

*మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,*

*కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.*

*మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.*

*రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.*

7 *🌻. సూర్య స్తోత్రం 🌻*

*ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం*

*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*

*ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం*

*భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*

*🌻. పాలు పొంగించే విధానం 🌻*

*సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.*

*ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం  సూర్యునికి ఎంతో ప్రీతి.*

*🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹*

*ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.*

*భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.*

*🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀*

*వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |*

*గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే  ౧*

*భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |*

*ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్  ౨*

*వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |*

*అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే  ౩*

*భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం*

🌹 🌹 🌹 🌹 🌹





🍀

014..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి


*అద్భుతం….*


              *శ్రీకృష్ణ జననం!*

                 ➖➖➖✍️

శ్రీకృష్ణుని జనన సమయంలో జరిగిన అద్భుతాలు…*


*గ్రహ నక్షత్రతారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం..* 


*శ్రావణమాసం.. కృష్ణపక్షం, అష్టమి, అర్ధరాత్రి రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు. సకలలోకాలకూ మంగళప్రద మైన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవ దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ.*


*శంఖం, చక్రం, గద మొదలయిన ఆయుధాలు ధరించిన నాలుగు చేతులతోనూ, శిరస్సున మణిమయ కిరీటంతోనూ, మెడలో కౌస్తుభమణితోనూ, చేతులకు కేయూరాది భూషణాలతోనూ, వక్షస్థలాన శ్రీవత్సం పుట్టుమచ్చతోనూ, పద్మపత్రాలవంటి నేత్రాలతోనూ, వెలుగులు విరజిమ్ముతున్న ముఖబింబంతోనూ, పట్టువస్త్రంతోనూ, సకల జగత్తునూ సమ్మోహింపజేసే                       నీల మోహనరూపంతోనూ జన్మించిన శిశువును చూసి దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతి చెందారు. ఆ తేజస్సును తట్టుకోలేకపోయారు.*


*కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని నిల్చున్న వసుదేవునికి అప్పుడు తెలిసింది, తనకి జన్మించింది విష్ణుమూర్తి అని. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. విష్ణుమూర్తికి ప్రణమిల్లాడు. అనేక విధాల స్తోత్రం చేశాడతన్ని. అవతారమూర్తిగా తన కడుపున జన్మించిన విష్ణుమూర్తిని చూసి చేతులు జోడించింది దేవకి.* 


*నమస్కరించిందతనికి. అనేక విధాల కీర్తించింది. పూర్వజన్మ సుకృతం కారణంగానే భగవంతుణ్ణి కన గలిగాననుకున్నది . 🙏

 015..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 

ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి


మహా మానవతామూర్తి గౌతమ బుద్ధుని 2568 వ జయంతి ! సందర్భంగా మీకోసం


****************************************


1. బాల్యంలోనే బాణం దెబ్బకు విలవిల లాడిన పావురమును

కట్టు కట్టి కాపాడినవాడు!


2. బాణంతో కొట్టిన వాడిది కాదు, కాపాడిన వాడిదే పక్షి అని రాజ సభలో నిరూపించిన వాడు!


3. రెండు రాజ్యాల మద్య నదీజలాల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించిన వాడు!


4. మానవ కళ్యాణానికి

భార్యా బిడ్డలను వదిలి మహాభినిష్క్రమణ చేసిన వాడు!


5. తమను వదిలి వెళుతున్నందుకు రధసారధి చెన్నుడితో పాటు అశ్వం కంథకను కూడా ఏడ్పించిన వాడు!


6. పెంచిన తల్లి గౌతమి పేరునే తన పేరుగా చేసుకున్న వాడు!


7. తాను జ్ఞానం పొందిన బోధి వృక్షం గుర్తు వచ్చేలా పేరు 

స్థిరపడిన వాడు!


8. తనను ధిక్కరించి వెళ్ళిన వారినే తన బోధనలతో శిష్యులుగా

చేసుకున్న వాడు!


9. గజదొంగ అంగుళీ మాలుడి మనసు మార్చి తన అనుచరుడిగా చేసుకున్న వాడు!


10. ఆనాటి విశ్వ సుందరి, రాజ నర్తకి, గణిక  వృత్తిలో వున్న “ఆమ్రపాలి”నిని 

బౌద్ద బిక్షుణిగా మార్చిన వాడు!


11. గృహస్తులు శాఖాహార లేదా మాంసాహారం ఏది పెట్టినప్పటికీ భిక్షువులు తిరస్కరించ కూడదని చెప్పిన వాడు!


12. గృహస్తుడు పెట్టిన

కుళ్ళిన భిక్ష వలన తాను మరణ శయ్యపైన వున్నప్పటికీ

ఆ గృహస్తుని ఏమీ అనరాదని తన శిష్యులను ఆదేశించిన వాడు!


13. తాను చెప్పిన కార్య- కారణ, అనిత్య, అనాత్మ , 

ప్రతీత సముత్పాద

సిద్ధాంతాలను ప్రజా ఉద్యమ దృక్పథంతో 

విశాల ప్రజా రాశులకు

చేర్చినవాడు!


14. తనకంటే ముందు చార్వాక , లోకాయతులు చెప్పిన హేతువాద ఆలోచనా ధారకు ప్రజా ఉద్యమ స్వరూప మిచ్చిన వాడు!


15. త్రిరత్నాలను, పంచశీలను , అష్టాంగ మార్గమును బోధించిన వాడు!


16.  క్షురక వృత్తి దారుడయిన ఉపాలికి , చర్మ కారుడయిన సునీతుడికి  బౌద్ద దీక్షను ఇచ్చి , స్వయం కృషితో వారు ఉన్నత స్తానం ఎదగటానికి కారణం అయినవాడు!


17.  బౌద్ద సంఘంలో మహిళలను చేర్చుకోవటమే గాక బౌద్ద బిక్షుణీ సంఘాన్ని 

ఏర్పరచి, 

వారికి తగిన గౌరవ స్థానాన్ని కల్పించిన వాడు! మన దేశంలో మొదటి మహిళా సంఘ నిర్మాత అయినవాడు!


18. కులాన్ని- వర్ణాశ్రమ ధర్మాలను నిరశించటమే గాక 

అన్ని కులాల వారిని తన అనుచరులుగా చేసుకున్న వాడు!


19. బౌద్ద దీక్షలో ప్రథముడు ఏ కులం వారు అయినప్పటికీ 

తర్వాత వచ్చిన వారు  ప్రధములను గౌరవించే

గురు సంప్రదాయాన్ని ఏర్పరిచిన వాడు!


20. భార్యా , పిల్లలను, తల్లి దండ్రులను తన బోధనలను అనుసరించే వారుగా చేసుకున్న వాడు!


21. ఆసియా జ్యోతిగా వెలుగొందిన వాడు!


22. బాబా సాహెబ్ అంబేద్కర్ తన సిద్దాంతాలకు మూల పురుషుడిగా చెప్పబడిన వాడు!


23.అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ రచనకు ప్రేరణ అయిన 

స్వేఛ్చ, సమానత్వం,  సౌభ్రాతృత్వాలను అందించిన వాడు!


24. వేమన , గురజాడ, గుర్రం జాషువా, గాంధీ, నెహ్రూలపైన , ప్రపంచ ప్రఖ్యాత   సైంటిస్ట్  

ఐన్ స్టీన్ పైన   విశేష ప్రభావం చూపిన వాడు!


25. మతాన్ని నల్లమందుగా భావించిన కారల్ మార్క్స్ చే గౌరవించ బడిన  మన దేశ మహనీయుడు!


26. ప్రఖ్యాత మార్క్సిస్ట్ రచయిత అయిన రాహల్ సాంకృత్యాయన్ 

తన రచనలకు ప్రేరణగా తీసుకోబడినవాడు!


27. మహా వీరుడు అయిన చండాశోకుని

ధర్మమూర్తిగా శాంతాశోకుడుగా మార్చినవాడు!


28. పూర్వజన్మ, పునర్జన్మ లను , వర్ణాశ్రమ ధర్మాలను బలపరిచే కర్మ సిద్ధాంతాలను  నమ్మవద్దని చెప్పినవాడు!


29. తన బోధనలను ప్రజలలో వుండి  , ప్రజల తిండితిని , ప్రజలపై ఆధారపడి  పని చేసే ప్రజా ఉద్యమ దృక్పధం ఏర్పరచి  దానికి నియమ నిబంధనలు 

ఏర్పరచిన వాడు!


30. తన జననం, జ్ఞానోదయం, మహాపరి నిర్యాణం ఒకే రోజు , వైశాఖ పూర్నిమ

రోజునే జరిగినవాడు!


31. తన జీవిత మంతా వనాలలోను ప్రజల మద్య బోధనలు చేస్తూ 

గడిపిన వాడు !


32. ప్రకృతిని ప్రేమించిన వాడు, ప్రకృతి రక్షణ కోరిన వాడు!


33. ప్రజల భాషలోనే తన బోధనలు చేసిన వాడు!


34. దేవుడు లేడని చెప్పినవాడు

స్వయం శక్తిపై  నమ్మకం ఉంచాలని చెప్పినవాడు!


35. సత్య నిరూపణ కోసం ఎవరి నయినా

ధిక్కరించమన్నది, తాను చెప్పిన దానిని  కూడా తప్పని భావిస్తే తిరస్కరించమని, 

ప్రతి దానిని నిరూపణ చేసుకోకుండా ఆచరించ వద్దని చెప్పినవాడు!


36. నిరంతర చలనం - నిరంతర మార్పు గురించి 2500 సంవత్సరాల నాడే చెప్పినవాడు!


37. ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్పిన వాడు, 

84 వేల ప్రవచనాలు చేసిన వాడు! 

ఎవరు?


ఎవరా  మహనీయుడు!


అతడే సిద్దార్దుడు

అతడే గౌతముడు

అతడే బుద్దుడు


అతడే సిద్దార్ధ గౌతముడు

అతడే గౌతమ బుద్దుడు

అతడే గౌతమ బుద్దుడు.


 నమో బుద్దాయ!

నమో  బుద్దాయ!

నమో  బుద్దాయ!

****

16..

వివాహ సంభంద విచిత్రాలు - ఇనప బెండకాయ?

పెళ్లి చూపులలో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. చూడబోతే వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడట్లే వున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగులు. పెద్ద జీతాలు. 

ఎన్ని అనుకున్నాకన్యాదానం చేయవలసింది పిల్ల తండ్రి కాబట్టి అందరం అనగా ఆయన పిల్లతో సహా,  అందరం ఆయన వంక చూసాము. 

అయన అప్పటికే వీర గంభీర ముద్రలోకి ప్రవేశించి వున్నాడు.

"అబ్బాయితో కొంచెం మాట్లాడేది వుంది" అని అభిప్రాయం వ్యక్తం చేసాడు. 

అలాగే మాటాడండి అని పిల్లాడి తల్లి అన్నది.  

ఇక్కడ కాదు, అలా డాబా మీదకు వెళ్లి మాటాడుకుంటాం అని అయన పిల్లవాడిని తీసుకొని డాబా మీదకు వెళ్ళాడు. 

ఇదో కొత్త పోకడ కాబోసు అని మేము సరిపెట్టుకున్నాము.  

వారు అరగంట తరువాత కిందకి తిరిగి వచ్చారు. 

సంభందం - భజ గోవిందం అయిందని మాలో ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యింది. అందరం నిరుత్సాహంతో బయట పడ్డాము. ఉత్సాహం కోసం లిమ్కా లు తాగాము. 

నేను ఇరువురికి బాగా పరిచయం వున్నా వాడిని, పైగా ఈ సంభందం ఇక్కడి వరకు తెచ్చిన వాడిని కూడా. ఆయనది నాదీ ఒకే ఆఫీస్ కూడాను. 

మీరు ఏమి మాట్లాడుకున్నారు అని  పిల్లవాడిని ఎంతో అడిగి కూడా సంభందం ఎందుకు బెడిసింది కనుక్కోలేక పోయాము. 

వాళ్ళు చివరి ప్రయత్నంగా నాతో "విషయం ఏమిటో తెలుసుకుందాము. ఇకముందట జాగర్త పడవచ్చు. మీరు అడిగి తెలుసుకొని రండి" అని నన్ను బ్రతిమాలారు. 

ఆ బ్రతిమిలాటకు లొంగి కొంతా, ఏమిటో తెలుసు కుంటే ఎందుకైనా మంచిది అని కొంతా అలోచించి నేను పిల్ల తండ్రిని ఆయన తీరికగా వున్నప్పుడు మా ఆఫీసులోనే కదలేసాను. 

అయన పేరు పురుషోత్తమ దాస్ రూప్ చెందు జ్ఞ్యానేంద్రు. పేరు ఎట్లావున్నాగాని అయన, అచ్చం మనవాడే. 

పురుషోత్తం దాసు గారు ఇలా అన్నాడు.  

"పిల్ల వాడు  చదువుకి సంబంధించని ఎన్నో పుస్తకాలు చదివినట్లు తెలుసుకున్నాను. లోకజ్ఞనం, సొంత తెలివి, మనో వికాసం  కోసం ఆ బుక్స్ చదివాడుట. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకం కూడా లేని   లైబ్రరీ ఇంట్లో ఉందట. మీరు భగవత్ గీత చదివారా అని అడిగితే,అది ఆధ్యాత్మిక గ్రంధం కాదు జ్ఞ్యాన భాండం" అని దాని గొప్పని  గురించి మాట్లాడాడు. అతడి మనసు బాగా వికాసం చెంది వుంది. మేము అల్లుడి  మర్యాదలు చేసినపుడు పొంగిపోయి మాఇంట్లో బోర్లా పడే మనిషి కాదు. అల్లాగే మేము అతని మీద నిరసన వ్యక్తం చేయటానికి అని అతన్ని చిన్న చూపు చూస్తే, కుంగి పోయి మా దారికి వచ్చే మంచి  మనిషి కూడా కాదు. దేనికైనా ఉక్కు కడ్డీలా స్థిరంగా వుండే మనిషి అనిపించింది. అతని ముందు ఎవరి పప్పులూ ఉడకవు. ఫదిమంది ఫ్రెండ్స్ సర్కిల్ కి ఇతడే నాయకుడట. ఆఫీసులో కూడా సొంత నిర్ణయాలను తీసుకొని ఆ  నిర్ణయాలను చక్కగా  అమలు పరుచుకో గలుగుతాడుట! అంటే కొండను ధీ కొట్టే అంత  సాహసం వున్నవాడు. ముక్కుసూటి మనిషి అని తెలుస్తోంది. తల్లి తండ్రులంటే భక్తీ వినయం వున్నాయి. పిల్లాడికి జ్ఞ్యానం మరీ ఎక్కువగా వుంది. పెళ్లి తరువాత తల్లి తండ్రులని ఎలా చూడాలి వాళ్ళని ఏమి చేయాలి అన్నది కూడా ప్లానింగ్ చేసి పెట్టుకున్నాడు. 

"ఇల్లాంటి ఆదర్శ పురుషుడికి నా పిల్లనిస్తే నాకేమి ప్రయోజనం? అల్లుడు అంటే అట్టు మీద ఉల్లి పాయలాగా, పులుసులోకి ముక్కలాగా, చెట్టునున్న చిక్కుడు కాయలాగా, కొమ్మకున్న కరేపాకు రెమ్మ లాగా, మనం ఏమనుకుంటే దానికి పనికొచ్చ్చేట్లు ఉండాలి. ఏపని చెపితే ఆ పని గురించి తర్కించకుండా ప్రతి పనికి "వూ" కొట్టేవాడై  ఉండాలి. వాళ్లకు పెళ్లి కావాల్సిన పిల్లాడిని పెంచే విధానం తెలీదు. పిల్లాడిని మంచి వ్యక్తిత్వంతో, స్థిరమైన సొంత భావాలతో పెంచారు. అలా సొంత వ్యక్తిత్వం వున్న అబ్బాయి అంటే ఇనప బెండకాయ లాంటి వాడు. మాకు పెళ్లి పులుసులోకి పనికి రాడు" అని తేల్చి చెప్పాడు. 

ఇది చదివి సంతోషించిన వారు సంతోషించగా, స్వర్గీయులు శ్రీ  కొడవటి గంటి కుటుంబరావు గారని ఒక ప్రముఖ రచయిత, ఇది చదివి స్వర్గంలో కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయనకు నా క్షమాపణలు.
***
017..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 
ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి

వివాహ సంభంద విచిత్రాలు - ఇనప బెండకాయ?

పెళ్లి చూపులలో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు. చూడబోతే వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు ఇష్టపడట్లే వున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగులు. పెద్ద జీతాలు. 

ఎన్ని అనుకున్నాకన్యాదానం చేయవలసింది పిల్ల తండ్రి కాబట్టి అందరం అనగా ఆయన పిల్లతో సహా,  అందరం ఆయన వంక చూసాము. 

అయన అప్పటికే వీర గంభీర ముద్రలోకి ప్రవేశించి వున్నాడు.

"అబ్బాయితో కొంచెం మాట్లాడేది వుంది" అని అభిప్రాయం వ్యక్తం చేసాడు. 

అలాగే మాటాడండి అని పిల్లాడి తల్లి అన్నది.  

ఇక్కడ కాదు, అలా డాబా మీదకు వెళ్లి మాటాడుకుంటాం అని అయన పిల్లవాడిని తీసుకొని డాబా మీదకు వెళ్ళాడు. 

ఇదో కొత్త పోకడ కాబోసు అని మేము సరిపెట్టుకున్నాము.  

వారు అరగంట తరువాత కిందకి తిరిగి వచ్చారు. 

సంభందం - భజ గోవిందం అయిందని మాలో ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యింది. అందరం నిరుత్సాహంతో బయట పడ్డాము. ఉత్సాహం కోసం లిమ్కా లు తాగాము. 

నేను ఇరువురికి బాగా పరిచయం వున్నా వాడిని, పైగా ఈ సంభందం ఇక్కడి వరకు తెచ్చిన వాడిని కూడా. ఆయనది నాదీ ఒకే ఆఫీస్ కూడాను. 

మీరు ఏమి మాట్లాడుకున్నారు అని  పిల్లవాడిని ఎంతో అడిగి కూడా సంభందం ఎందుకు బెడిసింది కనుక్కోలేక పోయాము. 

వాళ్ళు చివరి ప్రయత్నంగా నాతో "విషయం ఏమిటో తెలుసుకుందాము. ఇకముందట జాగర్త పడవచ్చు. మీరు అడిగి తెలుసుకొని రండి" అని నన్ను బ్రతిమాలారు. 

ఆ బ్రతిమిలాటకు లొంగి కొంతా, ఏమిటో తెలుసు కుంటే ఎందుకైనా మంచిది అని కొంతా అలోచించి నేను పిల్ల తండ్రిని ఆయన తీరికగా వున్నప్పుడు మా ఆఫీసులోనే కదలేసాను. 

అయన పేరు పురుషోత్తమ దాస్ రూప్ చెందు జ్ఞ్యానేంద్రు. పేరు ఎట్లావున్నాగాని అయన, అచ్చం మనవాడే. 

పురుషోత్తం దాసు గారు ఇలా అన్నాడు.  

"పిల్ల వాడు  చదువుకి సంబంధించని ఎన్నో పుస్తకాలు చదివినట్లు తెలుసుకున్నాను. లోకజ్ఞనం, సొంత తెలివి, మనో వికాసం  కోసం ఆ బుక్స్ చదివాడుట. ఒక్క ఆధ్యాత్మిక పుస్తకం కూడా లేని   లైబ్రరీ ఇంట్లో ఉందట. మీరు భగవత్ గీత చదివారా అని అడిగితే,అది ఆధ్యాత్మిక గ్రంధం కాదు జ్ఞ్యాన భాండం" అని దాని గొప్పని  గురించి మాట్లాడాడు. అతడి మనసు బాగా వికాసం చెంది వుంది. మేము అల్లుడి  మర్యాదలు చేసినపుడు పొంగిపోయి మాఇంట్లో బోర్లా పడే మనిషి కాదు. అల్లాగే మేము అతని మీద నిరసన వ్యక్తం చేయటానికి అని అతన్ని చిన్న చూపు చూస్తే, కుంగి పోయి మా దారికి వచ్చే మంచి  మనిషి కూడా కాదు. దేనికైనా ఉక్కు కడ్డీలా స్థిరంగా వుండే మనిషి అనిపించింది. అతని ముందు ఎవరి పప్పులూ ఉడకవు. ఫదిమంది ఫ్రెండ్స్ సర్కిల్ కి ఇతడే నాయకుడట. ఆఫీసులో కూడా సొంత నిర్ణయాలను తీసుకొని ఆ  నిర్ణయాలను చక్కగా  అమలు పరుచుకో గలుగుతాడుట! అంటే కొండను ధీ కొట్టే అంత  సాహసం వున్నవాడు. ముక్కుసూటి మనిషి అని తెలుస్తోంది. తల్లి తండ్రులంటే భక్తీ వినయం వున్నాయి. పిల్లాడికి జ్ఞ్యానం మరీ ఎక్కువగా వుంది. పెళ్లి తరువాత తల్లి తండ్రులని ఎలా చూడాలి వాళ్ళని ఏమి చేయాలి అన్నది కూడా ప్లానింగ్ చేసి పెట్టుకున్నాడు. 

"ఇల్లాంటి ఆదర్శ పురుషుడికి నా పిల్లనిస్తే నాకేమి ప్రయోజనం? అల్లుడు అంటే అట్టు మీద ఉల్లి పాయలాగా, పులుసులోకి ముక్కలాగా, చెట్టునున్న చిక్కుడు కాయలాగా, కొమ్మకున్న కరేపాకు రెమ్మ లాగా, మనం ఏమనుకుంటే దానికి పనికొచ్చ్చేట్లు ఉండాలి. ఏపని చెపితే ఆ పని గురించి తర్కించకుండా ప్రతి పనికి "వూ" కొట్టేవాడై  ఉండాలి. వాళ్లకు పెళ్లి కావాల్సిన పిల్లాడిని పెంచే విధానం తెలీదు. పిల్లాడిని మంచి వ్యక్తిత్వంతో, స్థిరమైన సొంత భావాలతో పెంచారు. అలా సొంత వ్యక్తిత్వం వున్న అబ్బాయి అంటే ఇనప బెండకాయ లాంటి వాడు. మాకు పెళ్లి పులుసులోకి పనికి రాడు" అని తేల్చి చెప్పాడు. 

ఇది చదివి సంతోషించిన వారు సంతోషించగా, స్వర్గీయులు శ్రీ  కొడవటి గంటి కుటుంబరావు గారని ఒక ప్రముఖ రచయిత, ఇది చదివి స్వర్గంలో కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయనకు నా క్షమాపణలు.
***

018..నేటి కథ..2012 నుండి ప్రాంజలి ప్రభ.(.ఆనందం 
ఆరోగ్యం  .. ఆధ్యాత్మకం.. తో అంతర్జాల పత్రిక ) లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.. స్నేహాన్ని పెంచుకోండి..మనభాష తెలుగండి

శ్రీ కూర్మ జయంతి

 మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో 
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్.

కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు.

మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. 

ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు.

అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం.

శ్రీ కూర్మం 

ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం.

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది.

కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. 

ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. 

శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. 

మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.

ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. 

ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట. 

శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. 

ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు.

ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం.

ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం, జ్యేష్ట మాసం లో వచ్చే కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పెద్దల ఉవాచ

ఓం నమో భాగవతే కూర్మనాథాయ


No comments:

Post a Comment