Wednesday 22 May 2024

01-06-2024..ప్రాంజలి ప్రభ కథలు..9





0001..రోజుకొక కథ.. ప్రాంజలి ప్రభ.. మీ మల్లాప్రగడ 

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి అమెరికా లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.

అది ప్రపంచంలోనే అతి పెద్ద మాల్. 

అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.

ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?

అడిగాడు బాస్.

చెయ్యలేదు

సరే ! 

రేపు వచ్చి జాయిన్ అవ్వు. 

నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! 

తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది సేల్స్ మాన్  కి. 

చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు.

ఈ రోజు ఎంత మంది కస్టమర్స్  కి  సేల్స్ చేశావు?

కేవలం ఒకరు అని బదులిచ్చాడు సేల్స్ మాన్ 

ఒకటేనా ! 

నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. 

సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?

8,009,770 పౌండ్స్  చెప్పాడు మన సేల్స్ మాన్. 

వాట్ !! అదిరిపడ్డాడు  బాస్. 

అంత పెద్ద సేల్ ఏమి చేశావు? అడిగాడు. 

వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను.

గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే?  అన్నాడు బాస్.  

    

పూర్తిగా వినండి ..!!!

తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు

దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. 

ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు.

అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.

తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.

బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు.

ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!

లేదు సార్ ! బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.

మరి ?  అన్నాడు బాస్. 

ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. 

తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను.

బాస్: అరే యార్ …!! 

ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?

అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు 

నేను శివా ళయాన్ని మొదట శుభ్రం చేసేవాణ్ణి, తరువాత పూజారికి పూలు,పండ్లు విభూతి నీరు అందించేవాడిని, భక్తులు వస్తే రసీదు బుక్ పెట్టుకొని మంచిమాటలతో పూజలక్రింద గోత్రనామాలు వ్రాసేవాడ్ని, నా ప్రవర్తన మెచ్చి అన్నదానం చేసె ఖర్చు వ్రాయించేవారు, బ్యాంకు లావాదేవీలు చేసేవాడ్ని, ఇల్లు ఇచ్చారు, భోజనం అక్కడే 

మరి ఇంకేమి హాయిగా ఉండొచ్చుగా 

ప్రజల సొమ్ము, దేవుని సొమ్ము దొంగిలించటం చూసాను అంతే 


మెడబెట్టి గేంటుంటారు 


లేదండి మారేందుకు మానేసావు 

మానెయ్యలేదండి బ్యాంకు పనులు ఆపారు పూజారిగారు, ఇంటిపనులు చేయమన్నారు 

అంతే.... అంతేనా 


పూజారి భార్యను చూసాను అంతే నామనసు మారిపోయింది 


ఏమిట్రా పెద్దావిడిని చూసావా 


చూసానండి చాలా అందంగా వుంది, చూపు తప్ప లే కపొయ్యాను 

అప్పుడే మయిందిరా 

పూజారి వచ్చాడండి 

వస్తే 

రాత్రికి అమ్మయి వస్తుంది రా బాబు అందండి 

అందా ... వచ్చిందా 

వచ్చిందండి అమ్మకన్నా అమ్మాయి బాగుందండి 

తరువాత ఏమైంది 

నన్ను పిలిచిందండి 

నన్ను పెళ్లిచేసుకుంటావా అమెరికాకు వెళ్లిపోదామందండి 

మరి ఒప్పుకున్నావా ఏమిటి 

అందాలు చూపిస్తే ఏ మగాడు ఒప్పుకోకుండా ఉంటాడండి 

చంపాకురా తరువాత ఏమైందో చెప్పు..

అమ్మాయికి అమెరికా అబ్బాయితో పెళ్లి కుదిరిందండి 

నిన్ను బయటకు నెట్టారా 

నన్నే పెళ్లి పెద్ద చేసి తోడుగా పెళ్ళైన తర్వాత అమెరికాకు పంపించారండీ 

మరే మయిందిరా నీ బతుకు 

అక్కడినండి తిరకాసయందండి 

ఏమిటిరా ఆ తిరకాసు 

అమ్మాయిగారి మొగుడు నండి అమెరికాలో దిగేంగానే పోలీసులు పట్టికెళ్ళారండి 

అప్పు డేమయిందిరా 

మల్లా ఇండియాకు వెళ్లిపోయారా 

లేదండి 

అమ్మాయిగారే నన్ను ఉంచుకున్నారండి 

ఉంచుకోవటమేమిటిరా 

విడాకులొచ్చాక పెళ్లి టండి 

ఆ అమ్మాయి ఎవరురా?

మీరు మేనేజర్ అయితే ఆమె దీని ఓనర్, ఇలాంటివి రెండు మూడున్నాయి 

అంతే అప్పడిదాకా ప్రశ్నలు వేసే వాడు నాలికతెరిచి నేలపై పడి గిలగిలా కొట్టుకున్నాడు 

మిగతా కధ మీకు తెలుసుకదా?


02..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 


తప్పని శిక్ష

హలాపురిని హేమచంద్రుడు పాలించేకాలంలో - దేవుడి విగ్రహం ముందు పూజలోగాని, ప్రార్థనలోగాని ఉన్న ఎవరినీ బంధించకూడదన్న శాసనం అమలులో ఉండేది. నేరస్థుడని తెలిసినా, పూజ ముగించుకుని ఇవతలికి వచ్చిన తరవాతే రక్షకభటులు వాణ్ణి పట్టి బంధించేవారు. ఈ శాసనాన్ని అడ్డుపెట్టుకుని పలువురు నేరస్థులు శిక్షనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు.

నేరానికి పాల్పడిన తమను ఖైదుచేయడానికి రక్షక భటులు వస్తున్నారని తెలియగానే, పూజగదిలోకిగాని, గుడిలోకిగాని వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడేవారు. పూజలు ప్రారంభించేవారు. రక్షకభటులు వేచి చూసి చూసి, విసుగు చెంది తరవాత వద్దామని వెళ్ళిపోయేంతవరకు ఈ పూజలు కొనసాగేవి. భటులు వెళ్ళి పోయాక, వెలుపలికివచ్చి, వాళ్ళ కంటబడకుండా తప్పించుకుని పారిపోయేవాళ్ళు. రాజు హేమచంద్రుడి వద్ద కొత్తగా సలహాదారుగా చేరిన చంద్రహాసుడు ఒకనాడు ఈ శాసనంలోని లొసుగును రాజుగారి దృష్టికి తీసుకువచ్చి, ‘‘దేవాలయాలు పరమ పవిత్రమైనవి. మానవ జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగడానికి దైవభక్తి, పాపభీతి చాలా వరకు ఉపయోగపడతాయి.అయితే, విగ్రహం సమక్షంలో నేరస్థులను సైతం బంధించకూడదన్న పురాతన శాసనం ద్వారా నేరస్థులు రక్షకభటుల కళ్ళుకప్పి తప్పించు కుంటున్నారు. రోజురోజుకూ నేరాలు పెరిగి పోతున్నాయి. ప్రభువులు దీనిని గురించి ఆలోచించి, న్యాయాధికారులను సంప్రదించి తగునిర్ణయం తీసుకోవడం మంచిది కదా!'' అన్నాడు. అంతా శ్రద్ధగా విన్న రాజు తలపంకిస్తూ, ‘‘ఈ శాసనం మన రాజ్యంలో మా తాత తండ్రుల నుంచి వస్తున్నది. దీనిని ఇప్పుడు హఠాత్తుగా మార్చడం భావ్యం కాదు. నేరాలు పెరగ కుండా ఉండడానికి మరేదైనా మార్గం ఆలోచిద్దాం,'' అన్నాడు. చంద్రహాసుడు అప్పటికి మౌనంగా ఊరుకున్నప్పటికీ దానిని గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇలా వుండగా ఒకనాడు సుగంధపురిలో పెళ్ళికుమార్తె బంగారు నగలను దొంగిలించుకుని పారిపోతూన్న దొంగను పట్టుకోవడానికి రక్షకభటులు వాడి వెంటబడ్డారు. అయితే, ఆ దొంగ వారికి దొరకకుండా ఊరి పొలిమేరను చేరుకున్నాడు. రక్షక భటులు వదలకండా తరమసాగారు. అటవీ ప్రాంతంలో పరిగెత్తుతూన్న దొంగకు ఒక చోట నాలుగు గుంజలు పాతి, పైన తాటాకులు కప్పబడివున్న పాకలో పసుపూ, కుంకుమా పూసిన తెల్ల బండరాయి కనిపించింది. దొంగ పరమానందంతో పాకలోకి జొరబడి పసుపూ కుంకుమలు పూసిన తెల్లబండరాయి ముందు చేతులెత్తి మొక్కుతూ నిలబడ్డాడు. వాడి వెనకనే అక్కడికి చేరుకున్న రక్షక భటులు వాణ్ణి చూసి, ‘‘అరరే, దేవుడి విగ్రహం ముందు చేరాడే! బంధించలేక పోయామే!''అంటూ ఆశాభంగానికి గురై, చేసేది లేక అలాగే నిలబడిపోయారు. దొంగ కళ్ళు మూసుకుని విగ్రహం ముందు కూర్చుని మరింత భక్తి నటించసాగాడు. అయితే, కొంతసేపటికి రక్షకభటులు తనను చుట్టుముట్టి, సంకెళ్ళు తగిలిస్తున్నారని గ్రహించి, దొంగ అమిత ఆగ్రహంతో కళ్ళు తెరిచి, ‘‘ఏమిటీ! దేవుడి ఎదుటే బంధిస్తున్నారా?'' అనబోయి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. కారణం- అప్పటికే రక్షక భటులు వాడి ఎదుట వున్న పసుపు కుంకుమలు పూసిన బండరాతిని అవతలికి తొలగించారు. దొంగ కారాగారం పాలయ్యాడు. మరునాడు న్యాయాధికారి ద్వారా ఈ సంగతి గురించి విన్న రాజు హేమచంద్రుడు, నూతన సలహాదారు చంద్రహాసుడి సూచనలోని సత్యాన్ని గ్రహించి, పూజాది కార్యక్రమాలలో ఉన్న నేరస్థులను బంధించకూడదన్న పాతశాసనాన్ని రద్దు చేశాడు. అప్పటి నుంచి నేరస్థులు అంత సులభంగా తప్పించుకోలేకపోయారు. క్రమేణా రాజ్యంలో నేరాలు తగ్గిపోయాయి.

****

003..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 


జయద్రదుడు (సైంధవుడు)

మహాభారతములో నూరుగురు కౌరవుల ఏకైక సోదరి దుస్సల భర్త. ఈ జయద్రదుడు ఇతను సింధు రాజ్యానికి రాజు కాబట్టి సైంధవుడు అని కూడా పిలుస్తారు. ఈ పేరుతోనే అతను ప్రసిద్ధి చెందాడు. ఇతనికి దుస్సల కాకుండా మరో ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిలో ఒకరు గాంధార రాజ్యము నుండి మరొకరు కాంభోజ రాజ్యము నుండి.

ఇతని తండ్రి పేరు వృద్ధక్షత్రుడు జయద్రదుడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి వీడు  యుద్దములో వీడి తల తునుమబడును అని చెప్పగా, అది  విన్న అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు వీని తలను నేలమీద ఎవరు పడవేస్తారో వారి తల వెయ్యి ముక్కలగును అని పలికెను. కానీ కురుక్షేత్ర సంగ్రామములో వీని తల నరికింది కృష్ణుని ఉపాయముతో అర్జునుడే అయినప్పటికీ  ఆ తల ను నేల మీద పడవేసింది సాక్షాత్తు తండ్రియే! తన వాక్కు ఫలితముగా తండ్రి వృద్ధక్షత్రుని తల వెయ్యి ముక్కలవుతుంది .

జయద్రదుని పేరు రెండు సంస్కృత పదాలనుండి వచ్చింది "జయత్"అంటే విజయవంతుడైన

,"రథ"అంటే రధము. అంటే విజయవంతమైన రధాలు కలిగినవాడు అని అర్ధము అలాగే సింధు

రాజ్యానికి రాజు కాబట్టి  సింధూరాజా అనియు సింధు రాజ్య వారసుడిగా సైంధవుడు అని పిలుస్తారు ఈ పేరుతోనే అతను ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాడు. ఇంత  చరిత్ర ఉన్న రాజు అయినప్పటికీ గొప్ప కురు వంశానికి అల్లుడైనప్పటికీ, బుద్ధి  మంచిది కాదు. పాండవులు మాయ జూదములో ఒడి అరణ్యవాసము చేస్తున్నప్పుడు పాండవులు వేటకు వెళుతు ద్రౌపదిని  తృణబిందు మరియు ధౌమ్య ఋషుల ఆశ్రమములో వారి రక్షణలో ఉంచి వెళతారు. ఆ సమయములో ద్రౌపదిని చూసిన జయద్రదుడు తన మంత్రి కోటికస్యు ని ఆమె ఎవరో కనుక్కుని

రమ్మని పంపుతాడు. ఆతను ఆశ్రమానికి వచ్చి, ద్రౌపది పాండవుల భార్యగా గుర్తించి ఆ సంగతిని జయద్రదునికి తెలియజేస్తాడు. అన్ని విషయాలు తెలిసినప్పటికీ జయద్రదుడు ద్రౌపది దగ్గరకు వచ్చి తన్ను తానూ పాండవుల బావగారిగా పరిచయము చేసుకొని ద్రౌపదిని తనను పరిణయమాడమని అడుగుతాడు. 

ఇది విన్న ద్రౌపది జయద్రదుని మందలిస్తుంది. కానీ ఆగ్రహించిన జయద్రదుడు ద్రౌపదిని

అపహరించి తన రాజ్యానికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు. ఇదంతా గమనించిన ద్రౌపది సఖి ధాత్రేయిక పాండవులకు జరిగిన విషయాన్ని చెపుతుంది. అప్పుడు ధర్మరాజు తన సోదరులను ద్రౌపదిని విడిపించుకు రమ్మని పంపుతాడు. వారు జయద్రదుని సైన్యాన్ని వెంబండించి, అతని సైనికులను హతమారుస్తారు.

ఇది చుసిన జయద్రదుడు ద్రౌపది ని అక్కడే వదిలి పారిపోతాడు. అర్జునుడు సైనికుల తప్పేమి లేదు వారిని చంపటం అనవసరం వదిలేయమని, భీమునికి సలహా ఇచ్చి తన బాణాలతో పారిపోతున్నజయద్రదుని అశ్వాలను చంపి, జయద్రదుని బందీగా పట్టుకుంటాడు. భీముడు కోపముతో జయద్రదుని జుట్టు పట్టుకొని నేలకేసి బాదుతాడు. చంపటానికి సిద్దమైన భీముడిని అర్జునుడు వారిస్తాడు. భీముడు జయద్రదుని కి గుండు గీసి సంకెళ్లతో బంధించి  ధర్మరాజు సముఖానికి తీసుకువస్తాడు. భీముడు ద్రౌపదిని ఏవిధమైన శిక్ష వేయమంటావు అని అడుగుతాడు.

కానీ ద్రౌపది పెద్ద మనసుతో ఇప్పటికే బానిస వలే ధర్మరాజు ముందు మోకరిల్లి ఉన్నాడు. ఎంతైనా ఇంటి ఆడబడుచు భర్త చంపటం మంచిది కాదు, క్షమించి వదిలెయ్యండి అని చెపుతుంది. ఆ విధముగా అవమాన భారంతో జయద్రదుడు తన రాజధానికి చేరుకుంటాడు.

పరాభవించబడ్డ సైంధవుడు చాలా దుఃఖించి, పాండవులమీద పగ తీర్చుకోవాలని కోరికతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్ష్యం అయి వరాన్ని కోరకోమనగా సైంధవుడు పాండవులని సంహరించే వరాన్ని కోరతాడు. దానికి శివుడి అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు పతనమై ద్రోణుడు సేనాపతిగా ఉండగా, పాండవులు వీరవిహారం చేస్తుండగా దుర్యోధనుడి కోరిక మేరకు

ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. పద్మవ్యూహ విద్య పాండవులలో అర్జునుడికి తప్ప మిగతా ఎవ్వరకి రాదని కౌరవులకు తెలుసు, అర్జునుడిని,శ్రీకృష్ణుని ప్రక్కకి తప్పించడానికి ద్రోణుడు ఒక ప్రణాళిక వేసి, సుశర్మ,త్రిగట అనే ఇద్దరు  రాజులను వారి సైన్యాలతో మరోచోట యుద్ధము చేయటానికి అర్జునుడిని పైకి పంపుతారు. అప్పుడు పాండవ సైన్యం సమాలోచన చేస్తే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసని బయటకు రావడం తెలియదని అంటాడు. అప్పుడు మిగిలిన పాండవులు తాము వెంట ఉండి అభిమన్యుడిని కాపాడతామని అభిమన్యుడితో పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సైంధవుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం పాండవులకు అడ్డం పడి వారిని వ్యూహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు. ఎంతో వీరోచితంగా పోరాడినా అభిమన్యుడు ఏకాకి కావడం చేత, ఏకాకిగా రథం క్రింద ఉన్న అభిమన్యుడిని కౌరవులు సంహరిస్తారు. సైంధవుడు అడ్డం పడడం వల్లనే అభిమన్యుడు ఏకాకిగా అయి సంహరించబడ్డాడన్న వార్త పాండవ సేన శిబిరాలకు వచ్చినప్పుడు అర్జునుడుకి తెలిసి చాలా చింతించి తరువాతి రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని సంహరించక పోతే తాను అగ్నికి ఆహుతి అయి పోతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆనాడు జయద్రదుని చంపకుండా వదిలివేసినందుకు భీముడు ద్రౌపది చింతిస్తారు. 

అర్జునుడి బారి నుండి జయద్రదుని రక్షించటానికి ద్రోణుడు మూడు రకాల వ్యూహాలను ఏర్పరుస్తాడు మొదటిది శకట వ్యూహము, రెండవది సూచీముఖం వ్యూహము, మూడవది పద్మవ్యూహము. భీముడు, అర్జునుడు, సాత్యకి కౌరవ సేనను చీల్చుకుంటూ ముందుకు సాగుతారు.  అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవ సైన్యం సైంధవుడి వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతిస్తూ  సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి, తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న

సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు.

జయద్రదునికి దుస్సల వలన కలిగిన కొడుకు సురధడు.  కానీ ఇతను కురుక్షేత్ర యుద్దములో  పాల్గొనడు కురుక్షేత్ర యుద్ధము అనంతరము ధర్మరాజు అశ్వ మేధయాగము చేస్తూ సైన్యము వెంబడి అర్జునుని పంపుతాడు. అర్జునుడు సింధు రాజ్యానికి వచ్చినప్పుడు సురధుడు అర్జునుని ఎదుర్కొని గెలవటం కష్టము అని భావించి ప్రాణత్యాగము చేస్తాడు. ఈ విషయము తెలుసుకున్న అర్జునుడు సురధుడి కొడుకును రాజుగా పట్టాభిషేకము చేసి యుద్ధము చేయకుండానే తన రాజ్యానికి వెళతాడు.


004..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 


''దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు... ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి'' - అని చాలామందికి సందేహం వస్తుంటుంది. భగవంతుడికి సమర్పించే నైవేద్యాలను భగవంతుడు తినడు. కానీ పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందని చెప్పడమే ఈ ఆచారం వెనుక ఉద్దేశం. సాధారణంగా దేవాలయాలకు వెళ్లి, ఆ దేవ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలను పుచ్చుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం.దేవాలయాలను సందర్శించి నప్పుడు మాత్రమే నైవేద్యాలు సమర్పించుకుండా మన ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలలో కూడా దేవ దేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. నిత్య పూజ అయినా లేదా ప్రత్యేక పర్వదినాలలో అయినా పూజలు నిర్వహించి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.

నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించని పదార్థాలు మనం తినకూడదని ధర్మగ్రంధాలు చెప్తున్నాయి. అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా, వండిన పాత్రలను ముందుగా దేవునికి నివేదించిన తర్వాత తాము తినడం చాలామందికి అలవాటు. ఇంకొందరు తినే ప్రతి పదార్దాన్నీ, ఆఖరికి మంచినీటిని కూడా "కృష్ణార్పణం" అంటూ భక్తిగా దేవునికి అర్పించి, ఆపైన తాము తినడం లేదా తాగడం చేస్తారు. అది భక్తికి నిదర్శనం.

మనం తినే ప్రతి పదార్ధాన్నీ దేవుడికి అర్పించడం వెనుక ఓ కారణం ఉంది. అదేమిటంటే... దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే యావ ఉన్నప్పుడు శుచిగా, శుభ్రంగా, నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారుచేస్తాం. అంతే ఎక్కడా సమయాభావం లేకుండా జాగ్రత్త పడతాం. ముందుగా స్నానం చేసి పదార్ధాల దగ్గరికి వెళ్తాం. పండ్లు మొదలైనవి కూడా మంచి పక్వమైనవి, పుచ్చులు, డాగులు లేనివి, మిగలపండి కుళ్ళిపోనివి పూజకు ఉపయోగిస్తాం. నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాం. పరిశుభ్రత లేనివి, పాడైపోయిన పదార్ధాలు, పక్వంకానివి, సరిగా ఉడకనివి, మిగల పండినవి, నిలవ ఉన్నవి, ఎంగిలి చేసినవి, రుచి లేనివి, పవిత్రంగా లేనివి - మొదలైన పదార్థాలు నివేదనకు పనికిరావు. 

''ఆహార శుద్ధిః సత్వ శుద్ధిః '' - అంటూ వర్ణించింది ఉపనిషత్తు. అంటే పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి. అలాంటి పదార్దాలు మనసును ప్రశాంతంగా ఉంచి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే, దేవుడికి నివేదించడానికి ఎప్ప్పుడూ సాత్విక పదార్ధాలను మాత్రమే వినియోగిస్తాం. దేవునిముందు నైవేద్యంగా సాత్విక పదార్ధాలను ఉంచినట్లయితే, మన ఆహారం కూడా అదే అవుతుంది కదా! అలా మనం తామస, రజో గుణాలు ఉన్న పదార్ధాలను కాకుండా సాత్విక గుణాలను పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం. అదీ సంగతి. దేవునికి నైవేద్యం సపర్పించడంతో మన మనసులో భక్తిప్రపత్తులు నెలకొనడమే కాకుండా, ఆ పదార్ధాన్ని మనం తింటాం కనుక సుఖంగా, శాంతంగా ఉంటాం. పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, ఎటువంటి లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో నైవేద్యాన్ని దేవునికి పెడతారు. సాధారణంగా ఆలయానికి వెళ్లినా, ఇంట్లో పూజ చేసినా కొబ్బరికాయ, అరటి పండ్లు ప్రసాదంగా పెడతాము. కానీ ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యం ఒక్కోటి ఉంటుంది. విఘ్నేశ్వరుడికి బెల్లం అంటే ప్రీతి. ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు నైవేద్యంగా సమర్పించాలి. గణపయ్యకి గరిక మాల అంటే చాలా ఇష్టం. శివుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యం పెట్టి మారేడు దళాలు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి. వేంకటేశ్వరుడికి తులసిమాల మెడలో వేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి.సత్యనారాయణస్వామికి ఎర్ర గోధుమనూక, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి, పంచదార కలిపిన ప్రసాదం నైవేద్యం పెట్టాలి. హనుమంతుడికి అప్పాలంటే ఎంతో ఇష్టం. అప్పాలు నైవేద్యంగా సమర్పించి సింధూరం, తమలపాకులతో పూజించాలి.లలితాదేవికి క్షీరాన్నం, పండ్లు, పులిహోర, పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా పెట్టాలి. దుర్గాదేవికి మినపగారెలు నైవేద్యం పెట్టి నిమ్మకాయల మాల అమ్మవారికి వేస్తే చాలా మంచిది.

సాధారణ సర్వసాధారణమైన లోపం ఏమిటంటే, సమర్పణలను PRASĀD అని పిలవడం. ప్రసాదం అంటే "అనుగ్రహం" మరియు అది భగవంతునికి సమర్పించిన తర్వాత మాత్రమే నైదేద్యం అవుతుంది. చాలా మందికి ఈ తేడా తెలియదు.

ఆగమ శాస్త్రం వివిధ రకాల నైవేద్యం కోసం వంటకాలను కలిగి ఉంది ఉదాహరణకు:-

పానకం - చూర్ణం చేసిన మిరియాలు మరియు ఉప్పు మరియు బెల్లం పొడితో సమాన పరిమాణంలో పెరుగు మరియు నీరు.

పరమాన్నము - పాలు, నెయ్యి, బెల్లం కలిపి వండిన అన్నం

పాయస - పచ్చి శెనగలు, బియ్యం, నెయ్యి మరియు పాలు 4 రెట్లు బియ్యం. (ఆవు పాలకు బదులుగా కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు.

గూడన్నము— బెల్లంతో వండిన అన్నం

ముద్గన్న - అన్నం మరియు పచ్చి శెనగలు కలిపి వండుతారు

దధ్యోదనము - పెరుగు కలిపిన అన్నం.

క్షరన్న - అరటి, పనసపండు, మామిడి మరియు బెల్లంతో పచ్చి శనగపప్పు తో వండిన అన్నము 

సిట్రాన్న - చింతపండు-బియ్యం 

హరిద్రాన్నం - పసుపు మరియు మిరియాలు కలిపి వండిన అన్నం.

యవన్నం - బార్లీతో చేసిన వంటకం

రోజువారీ పూజలో నైవేద్యానికి ప్రత్యామ్నాయంగా కాల్చిన గింజలు లేదా ఎండిన పండ్లను ఉపయోగించవచ్చు. ప్రాసెస్ చేసిన చక్కెర కూడా సాధారణ పూజ కోసం నైవేద్యంగా పరిగణించబడుతుంది.

0005..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 

ఆలుమగల హాస్యానందం!

"ఏఁవోయ్..."

"ఆఁ…"

"పులుసులో చిలగడ దుంపలు వేసావా, ఘుమఘుమలాడుతోంది?"

"కళ్ళు మూసుకుని పూజ్జేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు?"

"కళ్ళు మూసుకున్నాను గానీ ముక్కు మూసుకోలేదుగా?"

"బానే ఉంది. ముందు పూజ కానివ్వండి".

"నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో. భగవంతుడికి ప్రీతికరమైనది".

"మరే... మీకు కలలోకొచ్చి చెప్పాడాయన!"

"కలలోకే రావాలేఁవిటే రాజ్జం? మనకు ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంటబడతాయ్... భక్తిగా తింటాం కాబట్టి".

"ఓహో... అలాగా?"

"ఆంజనేయస్వామికి అప్పాలు, వెంకన్నకు దధ్యోజనం, చక్కెరపొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె, పాలు..."

"ఇంకా...?"

"అసలు మహానైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనఃస్పూర్తిగా తినడానికేనే… ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడఁవే".

"మరి అమ్మ వారికి ఇష్టమైనవి చెప్పలేదెందుకో?"

"దుర్గమ్మకు పులిహోర, శ్రీ మహాలక్ష్మికి పూర్ణాలు..."

"అవేఁవీ కావు..."

"మరి...?"

"అమ్మ వారికి వడ్రాణ్ణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడలో చామంతి బిళ్ళ..."

"ఆపుతావా దండకం? నీకిష్టమైనవాటన్నిటికీ అమ్మవారి పేరు చెబుతావా?"

"మీకిష్టమైన వాటికి భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదేంటి మరి?"

"నన్ను కాసేపు పూజ్జేసుకోనిస్తావా? అసలు నిన్ను కదిలించడం నాదీ బుధ్ధి తక్కువ".

"మీరా, నేనా కదిలించింది? శ్రావణమాసానికి ఏం చేయించుకున్నావని అమ్మాయడుగుతోంది".

"శ్రీమహావిష్ణోరాఙ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యః బ్రహ్మణః ద్వితీయ పదార్ధే శ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైఋతి ప్రదేశే..."

"నైఋతి ఇక్కడ కాదు, ఈశాన్య ప్రదేశే... అని చెప్పుకోవాలి".

"నీతో ఇంకొంచెం సేపు మాట్లాడితే ప్రవర కూడా మరచిపోతాను".

****

006..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 

  *భోజరాజుకు కాళిదాసు  చమత్కారస్తుతి*

      *****************************

  భోజరాజుసాహిత్యకళాపోషణము,వారి ఆస్థాన మహామహాకవి కాళిదాసులను గురించి వినని సాహితీరసజ్ఙులుండరు.

 ఒకప్పుడు భోజరాజుకు ఒకవిచిత్రమైన ఆలోచన

కలిగి, "ఒకవేళ నేను మరణించితే నీ స్పందన ఎలా ఉంటుంది?" అని కాళిదాసును పండిత సభలో ప్రశ్నించాడట.కాళిదాసు "మహారాజా! అలాంటి ఊహను నేను భరించి, స్పందించటం

అసంభవం"అని జవాబిచ్చాడట.భోజుడు తన

ఆజ్ఞను ధిక్కరించిన కాళిదాసుపై కోపించి, దేశ బహిష్కారశిక్ష విధించగా,అతడు సభను విడచి వెళ్ళిపోయెనట.

   కాళిదాసు లేని  సరస్వతీకళావిహీనమగు రాజ

సభలో ఉండలేక కొంతకాలం తరువాత భోజుడు వేగులద్వారా కాళిదాసు ఉన్నప్రాంతాన్ని తెలిసి కొని మాఱువేషంలో అక్కడికి వెళ్ళి కాళిదాసును కలవగా, మాటల సందర్భములో  కాళిదాసు అతనిని "అయ్యా! తమరే ప్రాంతనివాసులు? ఇక్కడకు మీ రాక కారణమేమిటి?" అని ప్రశ్నిం చాడట.మాఱు వేషంలోని రాజు తాను ధారా నగరంలో నివసించే పండితుడననీ,అచ్చోట భోజరాజు మరణించాడనీ,కళావిహీనమై ఆ నగరాన్ని వీడి దేశంలో పర్యటిస్తున్నాననీ పలికి

నాడట.

   వెంటనే కాళిదాసు హృదయం అత్యంత శోక  తప్తమై ఆయన వాక్కునుండి వెలువడిన శ్లోక

మిది.

    "అద్యధారా  నిరాధారా నిరాలంబా సరస్వతి౹

    పండితాః ఖండితాస్సర్వే భోజరాజే దివంగతే౹౹"

   భావము: ఈ రోజు ధారానగరము నిరాధార

మైనది.సరస్వతీదేవికి ఆలంబనము లేక దీనం గాఉన్నది.అనేకమంది పండితుల శిరస్సులు ఖండించబడినట్లుగ అయినది.భోజరాజు లేక పోవుటయే ఈ అనర్థాలన్నింటికీ కారణము.

      ఈ శ్లోకశ్రవణముతో భోజరాజు హృదయము పరవశించింది.మేను పులకరించింది.వెంటనే

అతడు తన మాఱురూపమును తొలగించగా,

కాళిదాసు మహానందభరితుడై , అమంగళకర

మైన తన శ్లోకంలోని ఒక్కొక వాక్యంలో రెండు

అక్షరాలను మాత్రమే మార్చి ఇలా చెప్పాడు.

         అద్య ధరా *"సదా"* ధారా

       *"సదా"* లంబా సరస్వతి ౹

         పండితాః *"మం"* డితాస్సర్వే

         భోజరాజే *"భు"* వంగతే౹౹


  భావము:ఈ రోజున ధారానాగరము సరస్వతీ దేవి  నిత్యాలంబనముతో  సదా శోభిల్లుచున్నది. భోజరాజు భువిపైన ఉన్నంతకాలము పండితు లందఱూ అఖండ  శోభతో సంభావించబడు     తూనే ఉంటారు.

   ఈ శ్లోకములోని మొదటిపాదంలో *నిరా* ను

*"సదా"* గాను, రెండవ పాదంలో *ఖం* ను

  *"మం"* గను, *ది* ను *"భు"* గను మాత్రమే

మార్పు చేయుటచే భావము శుభకరంగ మార్పు

చెందుట విశేషము.

   భోజరాజు హర్షపులకితుడై కాళిదాసును తిరిగి

తనవెంట ధారానగరమునకు సగౌరవముగా

తోడ్కొని పోయెనట.

    విపులార్థమును చిన్నవాక్యములో ఛందోబద్ధం

చేయటం సంస్కృతవాణికే సాధ్యము.ఇటువంటి

సంస్కృత శ్లోకాలు ఎన్నో ఉన్నవి.

 卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐


07..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి 


*అమెరికా ఖరీదైన దేశం, కానీ దాని పౌర సేవలు అత్యున్నత ప్రమాణాలు.*


 *వేసవిలో, తెలంగాణ లోని వరంగల్ నుండి ఒక కుటుంబం సెలవు కోసం యుఎస్ వెళ్ళింది.  అందులో ఒక జంట, వారి ఇద్దరు పిల్లలు మరియు ఆ వ్యక్తి తండ్రి ఉన్నారు.*


*న్యూయార్క్ నగరంలో మూడు రోజుల తర్వాత, వారు నయాగరా జలపాతానికి వెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు.  NYC నుండి నయాగరా వరకు ఉన్న ఇంటర్‌స్టేట్ హైవే అద్భుతంగా ఉంది.*


 *వారి వెనుక కారులో ఒక 80 పైబడిన వయస్సు గల అమెరికన్ మహిళ వస్తుంది.*

 *భారతీయ పిల్లలు వెనుక  సీటుపై మోకరిల్లి, వెనుకకు చూస్తూ, నవ్వుతూ, వెనక్కి ఊపుతూ వెనుక కారులో వస్తున్న అమెరికన్ లేడీకి చేతులు ఊపుతూ ఉంటారు.*

*అకస్మాత్తుగా అమెరికన్ లేడీ కి ముందు కారులో ప్రయాణిస్తున్న భారతీయుల కారు వెనుక సీటు కిటికీలో నుండి ఒక వృద్ధ భారతీయుడి తల బయటకు వచ్చి రక్తం వాంతి చేసుకోవడం చూసింది.*

*ఆమె తన కారును పక్కన ఆపి వెంటనే సహాయం కోసం 911కి కాల్ చేసింది.*

*వెంటనే, ఆకాశంలో ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ కనిపించింది.  అది ఒక మైలు ముందుకి దిగి, కారును ఆపమని భారతీయ కుటుంబానికి సంకేతాలు ఇచ్చింది మరియు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది వృద్ధుడిని దాదాపు ICUలో ఉన్న ఛాపర్‌లోకి తీసుకెళ్లారు.  ఆక్సిజన్ సరఫరా ప్రారంభమైంది.*

*హృదయ స్పందన రేటు మరియు ఇతర పారామితులు పర్యవేక్షించబడ్డాయి.  సూచనలను అందించడానికి జాన్ హాప్‌కిన్స్ నుండి ఒక స్పెషలిస్ట్ MD వీడియో కాల్‌లో ఉన్నారు.*

*అరగంటలో, వృద్ధుడు క్షేమంగా ఉన్నాడని మరియు మళ్లీ ప్రయాణించడానికి సరిపోతాడని ప్రకటించారు.*

*అమెరికన్ లేడీ 👍 త్వరిత సహాయం మరియు సమయానుకూల చర్యకు అభినందనలు!*

*ఈ సేవల కోసం, వ్యక్తి నుండి $ 5,000 డాలర్లు వసూలు చేయబడింది..*

*ఒక భారతీయ కుటుంబానికి ఇది చాలా డబ్బు.*

*ప్రణాళికేతర ఆర్థిక ఖర్చులతో, ఆ వరంగల్ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు మరియు అతని తండ్రిని తిడుతూ..*

  *"పాన్ (కిళ్ళీ) తిని కారులోంచి ఉమ్మివేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు?"*

****

008..నేటి కథ..ప్రాంజలి ప్రభ.. లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి

😂 *సరదాగా నవ్వుకోండి.*😂

😂 *జైలర్: ఈరోజు నిన్ను ఉరి తీస్తారు. నీ చివరి కోరిక ఏంటో చెప్పు..?*

*ఖైది: నా బదులు మీరేస్కోండి... సార్...!*

😂 *"ఏమండీ మన బాబు నిద్రలో జడుసుకుంటున్నాడు...."*

*"వాడి పెళ్ళాం ఎక్కడో పుట్టినట్టుందిలే..నువ్వు పడుకో.."*

😂 *బస్సులల్లో ఆడవారు కూరుచ్చునే వైపు "ఆడవాళ్ళని గౌరవించండి".. అని వ్రాశారు సరే...*

*అలాగే మగ వాళ్లు వైపు "మగ వాళ్ళను గౌరవించండి"... అని రాయాలి కాదా..*

*కానీ మావైపెమో.... "దొంగలున్నారు జాగ్రత్తా".. "టికెట్ లేని ప్రయాణం నేరం" అని రాస్తారా ఇది అన్యాయం కాదా.!!*

😂 *"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" భోరుమంది సుశీల.*

*"ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా..?" అడిగింది తల్లి. "నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు వండమన్నాడు"  చెప్పింది సుశీల.*

😂 *భార్య : గత 4 సంవత్సరాలుగా నేను వ్రతాలు ఏవీ చేయడం లేదు...*

*భర్త : ఇప్పుడేమైంది..*

 *భార్య : అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నారు..!!*

*భర్త : అవును..నేను ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటుంటాను.*

 *భార్య : నేనేం వెర్రి దానిలా కనిపిస్తున్నానా.. తిన్నగా నిజం చెప్పు..ఎవర్తది..నీ ఆరోగ్యం కోసం పూజలు, వ్రతాలూ చేస్తున్నది. ?* 

*వామ్మో...భర్త వెర్రి చూపులు చూస్తున్నాడు..*

😂 *భార్యాభర్తలైన సుబ్బారావు, సుందరి ఏడు గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు. చివరికి..*

*సుబ్బారావు- ".. సరే, పైన దేవుడున్నాడు... నాది తప్పయితే నేనే పోతాను.." అన్నాడు రొప్పుతూ.          "గుళ్లో అమ్మోరుంది.. నాది తప్పయితే నా పసుపు కుంకాలే పోతాయిలే..." ముక్కు చీదుతూ అంది సుందరి.*

😂 *ఇదిగో అక్కా !  పక్కింటాయన కోమా లోకి వెళ్ళాట్ట తెలుసా!*

*అవునా ! ఈ డబ్బున్నోళ్లు ఎక్కడికైనా వెళతారమ్మా!*

😂 *కట్నం ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది. పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు "నష్ట పరిహారంగా" భర్త కట్నం తీసుకుంటాడు.*

😂 *భార్య : ఏవండీ..కొన్నేళ్ల కిందట నేను పెప్సీ బాటిల్ లా సన్నగా.. నాజుగ్గా ఉండేదాన్ని కదా...*

*భర్త : ఇప్పుడు కూడా నువ్వలానే ఉన్నావ్ డియర్..*

*భార్య (ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ) నిజమా!!..*

*భర్త : అవును..కాపోతే అప్పుడు 200ml బాటిల్..ఇప్పుడు 2.5ltr బాటిల్.. అంతే.*

*భార్య : సచ్చినోడా..*


😂 *మొగుడు: పండగకి చీర కావాలా? చుడీదార్ కావాలా?*

*పెళ్లాం: నాదేం ఉంది మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి.*


😂 *ఏవోయ్ రామారావు ఎనిమిదైంది, అసలేకొత్తగా పెళ్ళయింది, ఇంకా ఆఫీసులోనే పనిచేస్తూ ఉన్నావు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదా? అని అడిగాడు ఆఫీసర్. ఏం లేదు సార్, మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. “ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి” రహస్యం చెప్పాడు రామారావు.*


😂 *భర్త : నీ చీర పని మనిషికి ఇచ్చావా?*

*భార్య :  అవును.. ఏమైంది?*

*భర్త : వంటింట్లో ఉంటే నువ్వే అనుకుని వెళ్ళి..*

*భార్య : ఆ.. అనుకుని.. వెళ్ళి.. ఏమైంది.. త్వరగా చెప్పండి.. ఏంచేశారు?*

*భర్త : నీకెందుకు శ్రమ తప్పుకో అని అంట్లన్నీ నేనే కడిగేశా!!* 

*సర్వే జనా సుఖినోభవంతు.🙏🙏*           సేకరించినది

***

  *నృసింహ జయంతి:*

క|| *ఇందు గల డందు లేడని*

*సందేహము వలదు, చక్రి సర్వోపగతుం,*

*డెం దెందు వెదకి చూచిన,*

*నందందే కలడు, దానవాగ్రణి!**వింటే.


తండ్రీ ! శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా? ఎక్కడ ఎక్కడ వెతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వముచేత అన్నిటియందు నిండి నిబిడీకృతమై ఉంటాడు అన్నాడు. *ఓహో! అలాగా ఈ స్తంభములో ఉంటాడా?* అన్నాడు ఇప్పుడు వస్తున్నది నరసింహావతారము. పిల్లవాడు *అంతటా ఉన్నాడు ఉన్నాడు* అంటున్నాడు. హిరణ్యకశిపుడు మూడు వేళ్ళు ముడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడనుండి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుని మాట వమ్మయిపోతుంది. రావడము అంటూ జరిగితే శంఖ, చక్ర, గద, పద్మములు పట్టుకున్న శ్రీమన్నారాయణునిగా వచ్చి హిరణ్యకశిపుని సంహారము చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చిన వరము ప్రతిబంధకము. ఆయన ఎన్ని వరములు ఇచ్చాడో అన్నివరములకు మినహాయింపుగా రావాలి. అన్నివరములకు మినహాయింపుగా ఎక్కడనుండి రావాలో తనచేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆపితే అక్కడనుండి రావాలి.

మ|| ' *హరి సర్వాకృతులం గలం ' డనుచు బ్రహ్లాదుండు భాషింప స

త్వరుడై ' యెందును లేడు లే ' డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ

నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానాజంగమస్థావరో

త్కరగర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్!

బ్రహ్మాండము అంతా నారసింహము అయిపోయి విష్ణుతత్వము అన్నిటిలోకి చేరిపోయింది నరసింహావతారముగా. అన్నిటా నిండిన నారసింహతత్వము ఎలా ఉంటుందో ఊహించాలి. హిరణ్యకశిపుడు వేలు తిప్పుతూ స్తంభమును చూపించి *ఇందులో ఉన్నాడా?* అన్నాడు. అంటే *మళ్ళీ అదేమాట అడగవద్దు అంతటా ఉన్నాడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు* నాన్నా అన్నాడు అయితే పిలవమని అన్నాడు. కొడుకు మాట కాదని నిరూపించాలి. కొడుకు మాట నిలపెట్టాలని పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యముగా ఉన్నాడు పరమేశ్వరుడంటూ మాట్లాడుతున్నాడు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహము అయిపోయింది. ఆస్తంభమును ఒక్కదెబ్బ కొట్టి *రమ్మను ఇందులోనుండి* అన్నాడు. అలా అనడముతోనే పెళపెళా శబ్దములు చేస్తూ ఆస్తంభము బద్దలయి అందులో నుండి విస్ఫులింగములు పైకివచ్చి పెద్ద కాంతిమండలము కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటికి వచ్చింది. అందులోనుండి పట్టుపుట్టము కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైన గర్జనచేస్తూ ఆయన పాదములు తీసి, వేస్తుంటే ఆయన వేగమునూ, వత్తిడినీ తట్టుకోలేక వేయిపడగలుగల ఆదిశేషుడు సార్వభౌమము మొదలైన దిగ్గజములు కూడా భూమియొక్క బరువుని ఓర్చలేక తలలు వంచాయి. ఆయన పాదములలో శంఖ , చక్ర, పద్మరేఖలు, నాగలి , అమృతభాండము మొదలైన దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్ఠమైన మోకాళ్ళు, ఐరావతముయొక్క తొండమువంటి బలిష్ఠమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డాణము, చప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారములు, నృసింహాకారము పైన సింహముయొక్క ముఖము, పెద్ద దంష్ట్రలు భయంకరమైనవాటిని తెగకోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి. అదిరి పడిపోతున్న పెదవులు. మంధరపర్వత గుహలను పోలినటువంటి నాసికారంధ్రములు. పుట్టలోనుండి పైకివచ్చి కోపముతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో? అలా ఆడుతున్న నాలుక. కోటిసూర్యుల ప్రకాశముతో గురిచూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు. నిక్కపొడుచుకున్న వెంట్రుకలు. పెట్టుకున్న పెద్దకిరీటము. అనంతమైన బాహువులయందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగుతీసి అడుగు వేస్తూవస్తూ పెద్దగర్జన చేస్తూ తల ఇటూ అటూ ఊపితే కేసరములు కదలి విమానములో వెడుతున్న దేవతలు భ్రంశమై విమానములనుండి కిందపడిపోయి, ఆ మేఘములన్నీ కొట్టబడి, పర్వతములు అన్నీఘూర్ణిల్లి, సముద్రములన్నీ పొంగిపోయి, భూమండలమంతా కలతచెంది స్వామి నరసింహావతారము వచ్చింది. ఇప్పటివరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వమును పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నృసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే 33 కోట్లమంది దేవతలు ఆకాశములో నిలబడి స్థోత్రము చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండముతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే, పెద్దగర్జన చేస్తూ వెళ్ళి హిరణ్యకశిపుని డొక్కలదగ్గర పట్టుకుని పైకిఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయటా కాదు గడప మీద, పగలూ కాదు, రాత్రి కాదు,  ప్రదోషవేళ, ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకితీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి, కానీ పైకితీస్తే దిక్కులు ఉండవు. అదొక శాస్త్రము. ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, రాక్షసులు దేవతలు కాదు, యక్షులు, గంధర్వుల, కిన్నెరలు,కింపురుషులు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దగ్గర పట్టుకుని అలా పైకిఎత్తి గడప దగ్గరకు తీసుకునివచ్చి ఇంట్లోకాదు, బయటా కాదు గడప మీద, పగలూ కాదు, రాత్రి కాదు, ప్రదోషవేళ,  ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా  తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపి చీల్చి గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్ష:స్థలములో ఉన్న ఉర: పంజరములోని ఎముకలు అన్నిటినీ కోసేసి పటపట విరిచి పేగులు తీసి మెడలో వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోసిళ్ళతోపట్టి త్రాగి ఒళ్ళు, బట్ట , కేసరములు అన్నీ నెత్తుటితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షసగణములన్నిటినీ చంపి పెద్దశబ్దము చేస్తూ డొల్లబడిన హిరణ్య కశిపుని శరీరమును విసరివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్థోత్రము చేసారు. ఏమి నారసింహ అద్భుత అవతారము? ఇంతమంది స్థోత్రము చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. ఉగ్ర భావనతో ఊగిపోతున్నాడు. లక్ష్మీదేవిని చూసి *అమ్మా నీవు నిత్యానపాయినివి ఆయన వక్ష:స్థలములో ఉంటావు. నిన్ను చూస్తే ప్రసన్నుడౌతాడు తల్లీ దగ్గరకు వెళ్ళమని* అన్నారు.

ఆమె *నా భర్త ముఖము పూర్ణచంద్రబింబములా ఉంటుంది. ఇంత కోపముగా నేనెప్పుడూ చూడలేదు, నేనుకూడా దగ్గరకు వెళ్ళను* అన్నది. శ్రీమహావిష్ణువు అవతారములలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారము నరసింహావతారమే. అందరూ భయపడుతుంటే *ప్రహ్లాదా! నీ గురించి వచ్చినదే ఈ అవతారము నీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్నుని చెయ్యమని* అన్నారు. చిన్న పిల్లవాడయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదములను పట్టి నమస్కరించి *పైన సింహముగా కింద నరుడిగా వచ్చి, పెద్దనోరుతో, గోళ్ళతో, గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది లోకములో ఉన్నది దాని పేరు సంసారము. దానికి భయపడతాము గాని నీకు భయపడతామా?* అన్నాడు. *బ్రహ్మాది దేవతల తలమీద పెట్టని చెయ్యి, లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, పరమ భక్తుడిని అని పేరుపెట్టి ఏమీతెలియని అర్భకుడిని అయిన నాతల మీద చెయ్యిపెట్టి నాకోసము పరుగెత్తుకు వచ్చి నా మాట నిలపెట్టడానికి స్తంభమునుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయములో ఎంత కారుణ్యము ఉన్నదో నాకు తెలియదు అనుకుంటున్నావా? అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా? పరమేశ్వరా నీకు నమోవాక్కములు* అని స్థోత్రము చేసాడు. పరవశించిననరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడమీద కూర్చోపెట్టుకుని "నీ భక్తికి పొంగిపోతున్నాను ఏమి వరముకావాలో కోరుకోమని" అన్నాడు. అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు వరాలు? నాకు ఎందుకు కోరికలు? ఏకోరికా లేదు. నీపాదములయందు నిరతిశయ భక్తి కలిగి ఉంటే చాలు. నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బతికాడు ఆయనకు ఉత్తమగతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే ఏనాడు పట్టుకుని పైకిఎత్తి తొడలమీద పెట్టుకున్నానో, నీ తండ్రి నావంక చూసి ఎప్పుడైతే స్తబ్దుడైనాడో నాగోళ్ళతో చీల్చి నెత్తురు తాగానో, ఆనాడు నీ తండ్రే కాదు అంతకుముందు 21 తరములు తరించాయి. ప్రహ్లాదా నీవు బెంగపెట్టుకోవద్దు. నీకు ఆశీర్వచనము చేస్తున్నాను. దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరిపాలించి పరమ భాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీకధ ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వినపడుతుందో, అక్కడ నేను ప్రసన్నుడ నవుతాను. ఎంతో సంతోషిస్తాను. సభామంటపములోని వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దానివలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమగతులు పొందుతా" రని ప్రహ్లాదోపాఖ్యానమునకు శ్రీమహావిష్ణువే ఫలశృతి చెప్పారు🙏🏻🕉️👏 *మీకూ మరియూ మీ కుటుంబ సభ్యులకూ శ్రీలక్ష్మీనృసింహ జయంతి శుభాకాంక్షలతో*🙏🏻🕉️👏

No comments:

Post a Comment