Wednesday 16 October 2019



ప్రాంజలి ప్రభ 
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ 


క: కేసరి కేసరి నడుమిల

కేసరి కటి ,వళులు యలలకే సరి , చెలిప

ల్కేసరి పోల్చగ నవసుధ

కేసరి ,పొగడంగ వాసుకే సరి దీనిన్!

చాటుపద్యం-- అజ్ఙాత కర్తృకం .


పలుకుల చెలి రసనాగ్రం మీద నీట్యంచేస్తూంటే కవితా హృదయాలు పరవసించి యెన్ని చమత్కారాలు ఆవిష్కరిస్తాయో చెప్పతరంగాదు. సురుచిర చమత్కార భాసురమైన యీపద్యం ఆకోవకు చెందినదే!

ఒకానొక అతివ యందాలను వర్ణించే యీపద్యంలో ' కేసరి ' యనేపదంతో కవి చక్కని చమత్కారాన్ని ఆవిష్కరించాడు. యీపద్యంలో కేసరి యనేపదాన్ని యేడుమార్లు ఉపయోగించి కవి యమకాలంకారాన్ని బహు తమకంగా వాడి
వివిధార్ధాలను సాధించాడు. ఇది కవిప్రతిభకు నిదర్శనం.

ఇంతకీ యీపద్యంలో యేముంది?

1 కేసరికే సరి నడుము-- ఈమె నడుము సింహం నడుముతో సమానం.

2 ఇలకేసరి కటి-- కటి భాగం భూమితో సమానం.

3 వళులు అలలకే సరి- పొట్టమీద ముడుతలు అలలతో సమానం.

4 చెలిపలుకే నవసుధకే సరి-- ఆమెమాట అమృత తో సమానం.

5పొగడంగా వాసుకేసరి-- పొగడటానికి సర్పరాజు వాసుకే తగును.

భావ: ఈమె నడుము సింహం నడుము వంటిది. (సింహం నడుముతోపోలిక కవిసమయం) కటిభాగం విశాలమై భూమికి సరిపోతుంది.( కటికి భూమిపోలిక కవి సమయం ) వళులు (పొట్టమీది ముడుతలు) అలల కు సరిపోతాయి. ఈమెమాటలు తియ్యనైన అమృతంతో సమానం. ఇంత సుందరాంగిని పొగడాలంటే యెవరితరం? ఆసర్పరాజు వాసుకే సరిపోతాడు.అని భావం.

ఇలా కేసరి యనేపదం విరుపుతో యింత చమత్కారం ఇక్కడ విరిసింది.ఆయువతి యందం అతిలోక మనోహరంగా
ఆవిష్కృత మైనది.

స్వస్తి!

--చతుర సౌజన్యంతో




ప్రాంజలి ప్రభ 
సేకరణ : మల్లాప్రగడ రామకృష్ణ 

"కాశీ (వారణాశి)"

           "కాశీ" అంటే ప్రకాశము, వెలుగు, తేజస్సు, కాంతి అని అర్ధాలు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీలో ఉన్న "విశ్వనాథ లింగము" అత్యుత్తమైనదిగా భక్తుల అభిప్రాయము. మూడు రాత్రులు, 3 పగళ్ళు నగరం దాటకుండా కాశీలో ఉంటే "రాజసూయ యాగం + అశ్వమేధ యాగం" చేసిన ఫలితం వస్తుంది. కాశీ నగరం ద్వాదశ నామాలతో ప్రసిద్ధి చెందినది. అవి: "కాశీ, వారణాశీ, బెనారస్, శివపురి, క్షేత్రపురి, త్రిపురారి, రాజనగరి, ఆనందకాననం, గౌరీముఖి, అవిముక్తి, మోక్షపురి, జ్ఞానపురి."
       
        కాశీలోని "మణికర్ణిక తీర్ధం"లో స్నానం చేస్తే "యజ్ఞం" చేసిన ఫలితం వస్తుంది. పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన "భిందుమాధవుడు" కాశీలోనే ఉన్నాడు. అస్సీఘాట్ దగ్గర ఉన్న "లోలార్క్ కుండ్"లో సూర్య భగవానుడు ఉన్నాడు. లోలార్క్ కుండ్ లో ఎర్ర చందనం, ఎర్ర పువ్వులు వేసి నమస్కారం చేయాలి, ఆరోగ్యం బాగుంటుంది.
       
         కాశీలోని "అన్నపూర్ణ" అమ్మవారి చేతిలో అన్నపు భాండము, గరిటె ఉంటాయి. ఇక్కడ "విశాలాక్షి" అమ్మవారు త్రిశక్తి పీఠాలు (కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి)లో ఒకటిగా, అష్టాదశ పీఠాలలో ఒకటిగా, అష్టశత శక్తులు (108 శక్తి పీఠాలు)లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. 
         
          సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్ శబ్ధమును నిరూపించుకున్నది ఇక్కడే (హరిశ్చంద్ర ఘాట్ వద్ద). తులసీదాసు రామాయణాన్ని (శ్రీరామచరిత మానస్) వ్రాసినది ఇక్కడే. 
     
     జగద్గురువులు శ్రీఆదిశంకరరాచార్యులు ఇలా అంటారు "ఆనందమునకు మూలానందమైన ఆనందకాననం (కాశీ)లో నివశిస్తూ, పాపాలను తుంచివేసే, అనాధలకు నాధుడైన కాశీనాధుడు విశ్వనాధుడిని శరణు వేడుకుంటున్నాను" అన్నారు. భజగోవిందంలో జగద్గురువులు గంగానది గురించి "గంగాజల లవ కణికా పీతా" అంటూ గంగమ్మ నీరు ఒక్క చుక్క తాగినా, యముడి వద్దకు వెళ్ళాల్సిన పని ఉండదంటారు.
      
       కాశీలోని ఘాట్లు మొత్తం 365, అందులో ముఖ్యమైనవి 64 ఘాట్లు. వాటిలోనూ ముఖ్యంగా స్నానం చేయవలసినవి 5 ఘాట్లు అని పెద్దలు చెబుతారు, అవి: 1)అస్సీ ఘాట్, 2)కేదార్ ఘాట్, 3)దశాశ్వమేధఘాట్, 4)మణికర్ణిక ఘాట్, 5)పంచగంగ ఘాట్. వీటన్నింటిలో అతి ముఖ్యమైనది "మణికర్ణిక". ఈ మణికర్ణక ఘాట్లో మధ్యాహ్నం12 గంటలకు దేవతలు అందరూ వచ్చి స్నానం చేస్తారని ప్రసిద్ధి. ఆ సమయంలో మణికర్ణిక స్థవం చదివి స్నానం చేయాలి.
      
        కాశీలో మరణించిన ప్రతి జీవికి విశ్వనాధుడు దర్శనం ఇచ్చి, వారి కుడి చెవిలో "తారకమంత్రం" చెప్పి, మోక్షం ప్రసాదిస్తాడు! "కాశ్యాస్తు మరణాన్ ముక్తిః" అని శాస్త్రవచనం. అందుకే కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచెవి పైకి లేచి ఉంటుంది! అందుకోసం చాలామంది జీవిత అంత్యకాలం కాశీలో గడపడానికి వెళుతూ ఉంటారు. దీనినే 'కాశీవాసం' అంటారు. అటువంటి వారికి వసతిని కల్పించే వాటిలో ముఖ్యమైనవి "కాశీలాభ్  ముక్తిభవన్, ముముక్షు భవన్, గంగాలాభ్ భవన్".

          కాశీలో ప్రవేశించిన జీవియొక్క పాపాల చిట్టా చిత్రగుప్తుని వద్ద నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. డుండిగణపతి, కాలభైరవుడు పరిశీలించి, యమయాతన కంటే 32 రెట్ల అధిక శిక్షలను విధించి, మరుజన్మ లేకుండా చేస్తాడు కాబట్టే, కాలభైరవ దర్శనం తరువాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి, దర్శించినవారు కాశీ దాటి వెళ్ళిపోయినా పాపాలు అంటకుండా, రక్షగా నల్లని కాశీదారం కడతారు!

     క్షేత్రపాలకుడైన "కాలభైరవుడు"ని తప్పకుండా దర్శించుకోవాలి. ఈయన మరో పేరు 'క్రోదభైరవ దేవుడు'. ఈయన అనుమతి లేకుండా మనం కాశీ క్షేత్రంలో అడుగుపెట్టలేము. "సాక్షి గణపతి'ని దర్శించుకోవాలి. గంగా హారతి ప్రపంచ ప్రసిద్ధి పొందినది.
శ్రీవిశ్వనాధుని హారతి (ఉ.3గం.కు) సేవకు ₹251, అభిషేకం ₹140 చెల్లించాలి. అన్నపూర్ణమ్మ కుంకుమ పూజకు ₹350 చెల్లించాలి. 

"ఎంతో పుణ్యం ఉంటే కానీ కాశీ క్షేత్రంలో అడుగుపెట్టలేము"

"గంగా తరంగ కమనీయ జటాకలాపం,
 గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్,
 నారాయణప్రియ మనంగ మదాపహారం,
 వారణాసీ పుర పతిం భజ విశ్వనాథం"

"భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం"
                                   -- జపయజ్ఞ సమితి

"ఓం నమఃశివాయ"
"ఓం నమఃశివాయ"
"ఓం నమఃశివాయ"
--((***))--



--((***))--

టోల్ గేట్లలో మీరు అందుకున్న రశీదులతో మీరు ఏమి చేస్తారు?

ఇక్కడ మీరు తెలుసుకోవలసినది.

జాతీయ రహదారుల రహదారులపై మీ ప్రయాణ సమయంలో మీకు లభించే రశీదులు టోల్ గేట్లను దాటడానికి మాత్రమే పరిమితం కాదు.

  అప్పుడు ఇంకేముంది?
1. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మీరు రశీదు యొక్క మరొక వైపు ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. మీ కాల్ వచ్చిన 10 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుంది.

2. మీ వాహనానికి కొంత సమస్య ఉంటే మీ చక్రం పంక్చర్ అయింది, మీరు అక్కడ పేర్కొన్న ఇతర నంబర్‌కు కాల్ చేయవచ్చు మరియు మీకు 10 నిమిషాల్లో సహాయం లభిస్తుంది.

3. మీరు ఇంధనం అయిపోతుంటే మీకు 5 లేదా 10 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ సరఫరా చేయబడుతుంది. మీరు సరఫరా చేసిన ఇంధనం కోసం వాటిని చెల్లించి పొందవచ్చు.

టోల్ గేట్ల వద్ద మీరు చెల్లించే డబ్బులో ఈ సేవలన్నీ చేర్చబడ్డాయి. చాలా మందికి ఈ సమాచారం లేదు మరియు అలాంటి పరిస్థితులలో మనం నొప్పిని అనుభవించాల్సిన అవసరం లేదు.
,.....

No comments:

Post a Comment