Tuesday, 20 January 2026

 _*🚩మాఘ పురాణం - 1 వ అధ్యాయము🚩*_

*మాఘ మాస మహిమ*

☘☘☘☘☘☘☘☘☘

*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*

           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.

పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.

ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.

సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.

రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.

మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.

ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.

పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.

దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 

పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.సుబ్బారెడ్డి

ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.

భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.

******

_*🚩మాఘ పురాణం - 2 వ అధ్యాయము🚩*_

*శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమలు చెప్పుట*

☘☘☘☘☘☘☘☘☘

వశిష్ఠులవారు  మార్కండేయ వృత్తాంతమును , శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత , యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను. *" మహాముని ! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని"* ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును , నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ , నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి , *'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని , కానీ , ప్రయాగక్షేత్ర మహత్యమును , మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన , ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని'* వేడుకొనగా , పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను , దేవి ! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.

సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక , జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా , ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను , లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని , తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతఃకాల స్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని , చెరువు కాని , నుయ్యి కాని , కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి , సూర్యభగవానునకు నమస్కరించి , తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.

ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక , కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక , మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానముచేసి , శ్రీమన్నారాయణుని పూజించి , సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి , విష్ణు మందిరమునగాని , శివాలయమున గాని దీపము వెలిగించి , ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక , పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక , స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె , తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి , దానధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా ! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ !   యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని , జపముగాని , విష్ణుపూజగాని , యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును , ఱంపములచేత , ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి , కాలకృత్యములను తీర్చుకొని , నదికిపోయి స్నానము చేసి , సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి , అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో , అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది , కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు , బాలుడైనను , యువకుడైనను , వృద్ధుడైనను , స్త్రీయైనను , బాలికయైననూ , జవ్వనియైననూ , ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.

పార్వతీ ! దుష్ట సహవాసము చేసేవారు , బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు , సువర్ణమును దొంగలించినవారు , గురు భార్యతో సుఖించినవారు , మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు , జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ , యితరులను వంచించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును , మిత్రద్రోహియు , హత్యలు చేయువాడును , బ్రాహ్మణులను హింసించువాడును , సదావ్యభిచార గృహములలో తిరిగి , తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి , గురుద్రోహి , దైవభక్తి లేనివాడును , దైవభక్తులను యెగతాళిచేయువాడును , గర్వముకలవాడై తానే గొప్పవాడినని

అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును , ఇండ్లను తగలబెట్టువాడును , చెడుపనులకు ప్రేరేపించువాడును యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు , క్రూరకర్మములు ఆచరించువారు , సిగ్గువిడిచి తిరుగువాడు , బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును.   యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో , అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి , యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును , అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు , అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి   యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు , జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలో స్నానము చేయలేరు. కాన , అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి , సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.

ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి , యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని , తల్లిని , భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల   యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని , వైశ్యునికికాని , క్షత్రియునికి కాని , శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని , చేయలేని వారినికాని , ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక , ఆయుఃక్షీణము , వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు , ముఖము కడుగుకొని ,  తలపై నీళ్ళుజల్లుకొని , సూర్యనమస్కారములు చేసి , మాఘపురాణమును చదువుటగాని , వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము , దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా , వంద అశ్వ మేధయాగములు చేసి , బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగును. బ్రాహ్మణ హత్య , పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన , నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

మాఘ పురాణం - 2 వ అధ్యాయము

*శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమలు చెప్పుట*

వశిష్ఠులవారు  మార్కండేయ వృత్తాంతమును , శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత , యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను. *" మహాముని ! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని"* ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును , నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ , నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి , *'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని , కానీ , ప్రయాగక్షేత్ర మహత్యమును , మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన , ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని'* వేడుకొనగా , పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను , దేవి ! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.

సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక , జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా , ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను , లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని , తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతఃకాల స్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని , చెరువు కాని , నుయ్యి కాని , కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి , సూర్యభగవానునకు నమస్కరించి , తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.

ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక , కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక , మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానముచేసి , శ్రీమన్నారాయణుని పూజించి , సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి , విష్ణు మందిరమునగాని , శివాలయమున గాని దీపము వెలిగించి , ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక , పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక , స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె , తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి , దానధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా ! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ !   యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని , జపముగాని , విష్ణుపూజగాని , యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును , ఱంపములచేత , ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి , కాలకృత్యములను తీర్చుకొని , నదికిపోయి స్నానము చేసి , సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి , అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో , అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది , కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు , బాలుడైనను , యువకుడైనను , వృద్ధుడైనను , స్త్రీయైనను , బాలికయైననూ , జవ్వనియైననూ , ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.

పార్వతీ ! దుష్ట సహవాసము చేసేవారు , బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు , సువర్ణమును దొంగలించినవారు , గురు భార్యతో సుఖించినవారు , మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు , జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ , యితరులను వంచించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును , మిత్రద్రోహియు , హత్యలు చేయువాడును , బ్రాహ్మణులను హింసించువాడును , సదావ్యభిచార గృహములలో తిరిగి , తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి , గురుద్రోహి , దైవభక్తి లేనివాడును , దైవభక్తులను యెగతాళిచేయువాడును , గర్వముకలవాడై తానే గొప్పవాడినని

అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును , ఇండ్లను తగలబెట్టువాడును , చెడుపనులకు ప్రేరేపించువాడును యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు , క్రూరకర్మములు ఆచరించువారు , సిగ్గువిడిచి తిరుగువాడు , బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును.   యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో , అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి , యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును , అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు , అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి   యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు , జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలో స్నానము చేయలేరు. కాన , అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి , సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.


ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి , యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని , తల్లిని , భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల   యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని , వైశ్యునికికాని , క్షత్రియునికి కాని , శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని , చేయలేని వారినికాని , ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక , ఆయుఃక్షీణము , వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు , ముఖము కడుగుకొని ,  తలపై నీళ్ళుజల్లుకొని , సూర్యనమస్కారములు చేసి , మాఘపురాణమును చదువుటగాని , వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము , దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా , వంద అశ్వ మేధయాగములు చేసి , బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగును. బ్రాహ్మణ హత్య , పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన , నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

******

_*మాఘ పురాణం - 3 వ అధ్యాయము*_

*గురుపుత్రికాకథ*

మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి?  వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము, పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.

ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద, అనేకవర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలుగుంపులు కట్టి మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.

గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.

గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.

                తండ్రియామెను కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని వద్దకు వచ్చి 'జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను. ఓయీ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!

సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి 'తండ్రీ! నా కుమార్తే చేసిన పాపముయేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.' అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున  యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ నీమచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ మున్నగు సువాసిని అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుహ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.

Monday, 19 January 2026

 భగవంతుడు మానవ జన్మ ఆనందం,ఆహ్లాదం,సంతోషం కోసం ఇచ్చాడంటా......

💥మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు.

 💥వృధ్యాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బుని పోగొట్టుకుంటారు.

 💥ఆరోగ్యం ఆస్తికన్నా మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా.

 💥ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి.

 💥ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి.

 💥వ్యాయామం చేసేదానికి సమయం లేదనే వాళ్ళు, భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది.

 💥తిండి విషయంలో నాలుకను అదుపులో ఉంచుకునే వాడు యోగి, నాలుకను అనుసరించేవాడు భోగి, నాలుకకు బానిసైనవాడు రోగి.

 💥డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర సంపాదించలేము.

 💥పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము.

 💥మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము.

 💥పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము.

 💥ఆయుధాన్ని కొనవచ్చు. కానీ ధైర్యాన్ని కొనలేము.

 💥భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.

 💥మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో.

 💥ధనముతో పరుపుని కొనవచ్చు కానీ నిద్రను కాదు.

 💥ధనముతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు.

 💥ధనముతో దేవాలయాలని కొనవచ్చు, కానీ దేవుణ్ణి కాదు.

 💥దాచిపెట్టి ఏమి చేస్తావు, శవం మీద గుడ్డకు జేబు అయినా ఉండదు.

 💥ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద.

 💥ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నది ముఖ్యం.

 💥ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం.

 💥జీవితంలో ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి:

 1)నీకు విలువ ఇవ్వని వారిని

 2)నిన్ను చూసి ఈర్ష్య పడేవారిని

 3)మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని.

****



           ధర్మో రక్షతి రక్షితః

* జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు.

* మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. 

* మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే.

* ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది.

* ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి.

* ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతోంది.

* శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటాడు.

* అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి.

* అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు.

* మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో విపులంగా వివరించి చెప్పింది మహాభారతం.

* ఏ కర్మలైతే మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో ఆచరించకూడదు.

* అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ చెబుతాడు.

* వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పినవాటిని అర్ధశ్లోకంలో వివరిస్తున్నానని ఈ విధంగా ఉపదేశిస్తారు.

* ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది. ఇదే అసలైన ధర్మసూక్ష్మం.

* ధర్మాచరణమే పరమధర్మమని, సచ్ఛీలమే తపస్సని, సచ్ఛరిత్రమే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు.

* బ్రహ్మచారి అయిన శ్రవణ కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూ, వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రుల సేవచేస్తూ ఆత్మశక్తిని పెంపొందించుకున్నాడు.

* ధర్మవ్యాధుడు స్వధర్మ ఆచరణతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు సేవచేస్తూ వేదవిహిత కర్మలతో తపోశక్తిని సాధించిన కౌశికుడనే బ్రాహ్మణుడికి తత్వోపదేశం చేశాడు.

*  కుక్కుటముని తనకు సమీపంలో ఉన్న గంగను, కాశిని సేవించక తల్లిదండ్రుల సేవలోనే పరమార్థాన్ని గ్రహించాడు.

* అందుకే మనిషి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మ పూజగా భావించాలి.

* ధర్మాచరణతో అందరికీ తోడ్పడాలి.

* భోగాలను విడిచి త్యాగగుణం పెంచుకొమ్మంటుంది ధర్మం.

* అహంకారం వదిలి ఆత్మతత్వం గ్రహించమని చెబుతుంది.

* యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడు తల్లిదీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించమంటాడు.

* అప్పుడు గాంధారి, ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని దీవిస్తుంది.

* ఆమె దీవించినట్లుగానే ధర్మపరులైన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు.

* ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతిలో ఇలా వివరిస్తాడు. ..

* మానవుడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమిపైన, గోసంపదను పశువుల శాలలో విడిచి మరణిస్తున్నాడు. భార్య ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది. మిత్రులు శ్మశానం వరకు వచ్చిపోతారు. ఎంతో ప్రేమగా పోషించుకున్న శరీరం చితిమంటల్లో భస్మమైపోతుంది. జీవుడితో వెళ్లగలిగేది ధర్మం ఒక్కటే.

* తన శ్రేయం కోరకుండా అందరి అభ్యుదయం కోరడం ఉత్తమధర్మం. నిస్సహాయులకు, వృద్ధులకు సహాయం అందించడం మానవతా ధర్మం.

* ఇతరుల నుంచి ఏమి ఆశిస్తారో దాన్ని నీవు ఇతరులకు చేయడం నిజమైన ధర్మం.

* ధర్మాన్ని అనుసరించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

* ధర్మం ఎక్కడ ఉంటుందో జయం అక్కడ ఉంటుంది.

* ఎంతటి క్లిష్ఠపరిస్థితుల్లోనూ ధర్మం విడవకూడదని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.

      *లోకాసమస్థాః సుఖినోభవంతు*

కధకాని కథలు. (01to 07) ********

 



కథ గాని కథ( ఏడు )

విత్తనం మొక్కగా, చెట్టుగా, పువ్వుగా, పండుగా, వివిధ రూపాలను మళ్లీ విత్తనం గా మారటం, శృష్టికారకమైన చైతన్యం జగత్తునంత మోస్తూ దైవ సంకల్పo ప్రకారంగా సృష్టి ధర్మం వల్ల చీకటి వెలుగుల సమాజంలో, సుఖ దుఃఖాల జీవితం నలిగి వెలుగులుగా. అవగాహన మొదటి మెట్టుగా అర్థం చేసుకొని నడుచుకునే ఆకలి మెట్టవడం, విశ్రాంతి ధర్మబద్ధమైన నడకతో సాగిపోతూ, అప్రమత్తులై, నిరంతర ఎరుకతో, జీవన గమనమై, పరిశీలిస్తూ, అంతా పరిశోధనలాగా సాగుతూ, సంతృప్తిగా,  ద్రవించే జ్ఞాన స్వరంగా, పరంగా, కళలు  మార్చుకుంటూ, నిండుగా, పండుగల జీవిస్తూ సమస్త లోకానికి భారం కాకుండా, పంచభూతాలకు అడ్డం రాకుండా సాగించడమే మానవ జీవితం. 

మరి దెబ్బలకు వచ్చిన రాయికి దొరుకు గౌరవం. ఆటుపోట్లు ధరించిన జీవికి కడవరకు పయనం. మనిషి దిగులు లేని సత్యాన్ని అనుకరించి, ధర్మాన్ని నిర్వహించి నిర్మలంబుగా, కాలయాపన చేస్తూ, మనసు కోరుకుంటూ, జీవన కళ ఉట్టిబడుతూ, బతుకు ఉత్సవాల్లో, అనుభవాలతో, జీవన గమనం సర్వస్వయోదాయకం.

 తీగల నుండి తెగిన దోస పండ్లుగా,ఎండిన ఆకు రాలినట్లుగా, ఉప్పొంగుతున్న సముద్రం ఉప్పెనగ ఊరికి వెనక తగ్గినట్లుగా,  కర్మ పరిపక్వత పొంది కర్మానుసారం అనుభవించి, అంతిమంగా శివోహంగా మారి "ఆత్మకు మరణం లేదు కనుక" మరో జీవనంగా మారటం జీవన ప్రక్రియ.

*****

కథ కాని కథ (06)

బ్రహ్మణ ముహూర్తం విలువ లేందే మనసుకు తృప్తి చేరదు, కాలంతో ఎదురీదాలంటే మన సంస్కృతి సంప్రదాయలు, వంశగౌరవాలు తప్పవు, అలాగే మంచి సంసారానికి అన్యోన్యత ముఖ్యం!

అభివృద్ధి అంతా విజ్ఞానంతోనే అంటే మనిషి అలవాట్లు తరతరాలుగా వస్తున్నాయి, ఎవరు ఎన్ని చూపిన మనసు బట్టే పోవుట నిజమైన విజ్ఞానం. అందుబాటులో ఉన్న అజ్ఞానం తొలగించ గల బుద్ధి ఉంటే చాలు, ప్రపంచ విజ్ఞానం అవసరమా...

తెల్లారి లేస్తే  అన్నీ అబద్ధాలే చెప్పేవారున్నారు,

అలాంటప్పుడు ఎందుకు నీతుల ఉపయోగం ఏమిటనే వారున్నారు, కాని గత్యంతరం లేని స్థితిలో పలుకు మాయకు చిక్కుతారు కదా కాని సరిదిద్దుకొనే తెలివి, బుద్ధి మామవులకు ఉన్నాయికదా....

ఆర్ధికలోపాలు వ్యవస్థాగతం, అలాంటప్పుడు వ్యవస్థను మార్చ దళచినా అందరూ దొరకని దొంగలేగా తల్లి తండ్రి గురువు ఎంతచెప్పిన పిల్లల చేష్టలు మారవు యిదీ యంతే కదా...

భారతీయులకు గుళ్ళే ముఖ్యం అలాంటప్పుడు దేశమేమైతేనేమి అంటున్నావు? అసలు నీదర్మం నీవు నిర్వహిస్తున్నావా, గుడి యనేది హృదయం పదిలంగా ఉంటే జీవనం పదిలం.

ఆధ్యాత్మికమే,రాజకీయచైతన్యం పిడికెడు మెతుకులు చాలవా నీకు చెప్పి చేయించు కోలేని మూర్ఖ వాదన దేనికి.

భూమి దద్దరిల్లేలా - ఆకాశం అదిరిపోయేలా ఆర్భాటాలు వద్దు!ఆపదలో ఉన్నవాడ్ని - అవసరంలో ఉన్నవాడ్ని ఆదుకోవడం ముద్దు!

*****

కధకానికధ. (05)

మల్లెతోటలో గులాబికోసం వెతుకుతావెందుకు, తీరని ఆశకు కొత్తరెక్కలను తొడుగుతు ఎగరాలని పరిగెడతా వెందుకు దూరంజరుగుతున్న దరిచేరి ఫలములబుట్ట పరుగుల చూపులందుకు, తీపివ్యాధులకు చేదు మందులను మింగుతు ఒకవైపు, కక్కుర్తి యాటలు ఎందుకు, స్వచ్ఛత యనేది అందరికీ ఉంది, దాన్ని దక్కించుకొని సద్వినియోగం చేసుకోవాలి ఎవరాయినాసరే కాదా?.

పాటనుపాడే పశువులకాపరి సంతసాన్ని చూడు కల్మషము లేని తనము, విధిరాతంటూ వ్యథల సంద్రమే ఈదుతూ కర్తవ్యం, కాకరకాయ కాదు, ఏ సమయాన, ఏఋతువుకు తగ్గ అలవాట్లు ఉంటే చాలుగా మనలో.

కాకికోకిలగ పాడాలంటే కుదిరే పనియేనా నీకు, నాకు, పట్టువదలక మీకర్మంటూ పాడుతూ, నన్ను వేధిస్తూ, ఉండుట ఎవ్వరి కొరకు?

తప్పులు ఎంచే నీగుణమే నని ఒంటరి చేస్తుందే, మరి అట్లామాటాడుకు, ఆగని నోటికి తాళం వేయకె సాగుతు ఉండుట దేనికి. రమణి అలుకలను తీర్చగ సాగే ప్రియుని దెంత మురిపెంబూ కలువ మెచ్చని చందమామగా కదులుతు కాలక్షేపం చేద్దామా మనము.

సంతోషంతో పొంగే మనసుకె విజయంచేరువలే ఉందని తెలుసుగా, రగిలేగుండెకు శ్రీచందనమై తాకుతు మనసు కలవరం తగ్గించుకొనుట అందరి కర్తవ్యం కదా

బలే చెప్పారే.... మీరు

****

** కథకాని కథ(04)

సాహిత్యం అంటే సహనం నుండి వచ్చే, అనుభవాల అక్షర సత్యాలను తెలిపేది కవి హృదయం అర్ధం చేసుకోవటం నుంచి వచ్చె, పదానికి అర్ధాలు ఎన్నో, అర్ధం కానివారికి ఎం చెప్పెది ఇక నుంచ్చె?

వనంలోకి ప్రేమికులు రావద్దంటే ఆగుతారా, ఇది జంతు సాహిత్యం చదవద్దంటే ఆగుతారా, మనుష్యులకంటే జంతువులే మేలని తెలియదా, భావాన్ని అర్ధం చేసుకోలేనివారికి బూతు అంటే ఎలా ఈ దుస్థితి నేటి పరిస్థితి మనిషి జన్మ అన్ని జన్మలలో ఉకృష్టమైనది, సమాజానికి మాయని మచ్చగా ఆర్థిక అవసరాలు దేనికి?

ఉత్తమ సాహిత్యాన్ని ఆదరించటం అందరి కర్తవ్యంమనో నిగ్రహశక్తి పెంచేది, ఆలోచిన్పచేసేది కవిత్వంసరస్వతీ పుత్రులను విమర్సించటం అవివేకంమనలోలేనిది ఇతరుల్లో ఉన్నది గ్రహించటమే వివేకం కాదా?

*_జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేవి మత్తు మందు లాంటివి! ఇవి అలవాటు అవ్వాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం తోడవ్వాలి. ఆ పుణ్యఫలంను నేటి సాధనకు సహాయంగా చేసుకుని మరింత సాధకులు కావడానికి ప్రయత్నం చేయాలి. వీటిని వదిలేసి కేవలం భోగ భాగ్యాలను అనుభవిస్తూ కూర్చుంటాం అంటే జన్మకు సార్థకత చేకూరదు!..*

--((*))

కథ కాని కథ(3)

*భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి...*

*సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది... అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు...*

*పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు... భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది...*

*దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది... క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది... చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, భగవంతుని కృపకు పాత్రులవుతాం*

*****

మనిషికి మోక్షం - అర్థం -పరమార్ధం(కధకాని కథ. (02)

నువ్వెవరో తెలుసుకో ముందు, ఈ విశ్వం ఎంత పెద్దదైనా,  నీ జ్ఞానం ముందు  అది చాలా చిన్నదే. 

పక్షులకు రెక్కలే సాధనాలు; నీకు నీ ఊహలే రెక్కలు.  అవే నీ అమృత వాక్కుల ణే రెక్కలతో విశ్వాన్నే దాటేస్తావు;  అదే నీకు వరం.  నువ్వు బాధ్యత బంధము భారము కాకుండా వెతుకు; ప్రకృతి ప్రభావము తోడు నీడగా, నీ వెంటే ఉండు, అప్పుడే మోక్షం లభిస్తుంది.  

 స్నేహాన్ని, ధర్మాన్ని,సత్యాన్ని మార్గంగా ఎంచుకో;  అప్పుడే భగవంతుడ్ని చేరుకోగలవ్.  నిన్ను ద్వేషించేవాళ్ళ నిన్నేమీ చేయలేరు,నిన్ను ప్రేమించేవాళ్ళని దగ్గరకి తీసుకో; అప్పుడు నువ్వే ఒక వెలుగు.  అంబర దీపంగా వెలిగి పోతావు 

నువ్వే ఆకాశమైనప్పుడు,  నిన్ను గాలి ఏం చేస్తుంది?  

నువ్వే సముద్రమైనప్పుడు,  నీరు నిన్ను ఏం చేస్తుంది?  

నువ్వే స్వర్గమైనప్పుడు,  దుఃఖం నిన్ను ఏం చేస్తుంది?  

నువ్వే దేవుడవైనప్పుడు మృత్యువు మాత్రం ఏం చేస్తుంది?  

ఎడారిలో ఉన్నప్పుడు నువ్వే ఒయాసిస్సువు;  

అడవిలో ఉన్నప్పుడు నువ్వే మృగరాజువి;  సమాజంలో ఉన్నప్పుడు నువ్వే ఒక సమూహానివి.  నీ ఆలోచనలని బట్టే నీ జీవితం;  నీ మానవత్వాన్ని బట్టే నీ వ్యక్తిత్వం.  

మాట్లాడుతున్నప్పుడు  నువ్వు మౌనంగా,  అందరూ మౌనంగా ఉన్నప్పుడు  నువ్వు గొంతెత్తి మాట్లాడు.  

ఈ జీవితం నాటకం కాదు;  ఇదొక పరీక్ష.  ఇందులో నువ్వు గెలవాలి;  దాని కోసం రోజూ నువ్వు సాధన చేయాలి.  

గులాబీలు నిన్ను చూసి నవ్వు తుంటే  నువ్వు దిగాలు ముఖం వేసుకుని కూర్చోకు. సాయంత్రానికి వాడిపోయే  ఆ గులాబీలను చూసి  సంతోషంగా ఉండడం నేర్చుకో.  

నీ చుట్టూ ఉన్న చీకటికి భయ పడకు;  నీలో ఉన్న చీకటికి భయపడు.  నువ్వు వెలుగులో జీవించాలంటే  నువ్వే వెలుగువి కావాలి.  

మృత్యువు గురించి భయపడకు;  దానితో ఆఖరి శ్వాస వరకు పోరాడు.  అదే జీవిత చరదరంగం.  

అదేమనిషికి మోక్షం  అర్థం పరమార్ధం

*****

ప్రణాళిక! (కధకాని కథ. (01)

********

వివక్షలేని దానకర్ణులుగా, దయాదులుగా చూపు తో, ఆంక్షలు లేని ధాన్యము పండించే రీతిగా, దార (భార్య) దాపరికము లేకుండా కాపు' కస్తూ, జ్ఞానమణి గా ధార్మికుడుగా, దాతగా, దాశరధిగా, దామోదరుడుగా జీవితమై, అందరికి దారములా, దారులుగా, దావనలము కాని 'పని' గా,సంపదంతా దాత (బ్రహ్మ) దాతువులు ధార (నీరు) పంచభూతాల సహాయం 'సమాజపరం' గా, దేశాలకు కత్తిధార, దాగుడుమూతలు, దానవులు,' సరిహద్దులను దాటి పోవగా,  దోపిడీ లేని ధారాపాతంగా, దారి తెన్ను, తెలిపే ఆనందం' పొందగా,'వ్యక్తిగత' వివక్ష, దాస్య ప్రవృత్తి, దాచుకొను, దోచుకొను, ఆస్తి పోగా, లంచాలు లేని, దాసీ పుత్రులు లేని,  ఎలపట దాపట లేని, దాహము తీర్చు వ్యవస్థ' రాగ'పనిని' అందరూ, దాస్యమనక, ధర్మమని తలంచి గౌరవించాలి!

ప్రజాశ్రేయస్సే ప్రతి ఒక్కరి లక్ష్యమురాజకీయం' కాగా, ద్వేషం, ద్రోహం, అమిత దాహం, అహంభావం నశించి ప్రేమ' మిగలగా, చిటపటలు కాదు అందరిలో అన్నీ సమయాల్లో చిరునవ్వులతో ఏదీ నీది కాదనే'వేదాంతం' గా, పనులన్నీ మౌనంగా' జరగా,బానిసత్వంలేని బ్రతుకు' గా మాయ పోయి 'హాయి' గా మనిషి క్రమంగా 'దేవుడు గా 

మానవత్వమే నీ 'ప్రణాళిక' గా కావాలి!

      *******

Saturday, 22 November 2025

 రమణ మహర్షి..భగవాన్ స్మృతులు - *5

🪷

అధికారులు, బిచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, రూపవంతులైన స్త్రీలు ఎవ్వరూ ఆయన దృష్టిని తీసుకోలేక పోయేవారు. కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి, అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికే వారు కారు, ఒకర్ని పిలిచి పలకరించి, ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా, తనని పలకరించగానే కసిరి కొట్టేవారు. కొందర్ని గట్టిగా తిట్టేవారు హాస్యం పట్టించి, వెక్కిరించి, అందరూ నవ్వేటట్లు చేసేవారు.

సీసపద్యం

కసిరి కొట్టి కనులు కథలుగా తిప్పియు

 నవ్వించి నవ్వుతూ నటన జూప

కలలోన కనిపించ కలవరించి పిలవ

కొందర్ని చూడక కోప భావ

భక్తుని యాకృతి బంధము నో ర్పుగా

భావభవపలుకు భయము తొలగ

వచ్చి వేచిన కోప వాక్కులు తీరుగు

నమ్మిన వారికి నమ్మ పలుకు

గీత


విషము కన్న మూర్ఖ చెలిమి విషము యగుట 

తెలిసి నడవ గలుగు తీరు తెలప గోరు 

సూరి జనుల సుస్నేహము సూత్ర మగుట 

అమృత తుల్యమౌను పలుకు నవిని లోన 


🌼 సీస పద్యం – సరళ భావం

**

కొంతమంది చిన్న చిన్న మాటలతో, కనులతో సంకేతాలతో

నవ్వులు రేపుతూ, నటిస్తూ ప్రవర్తిస్తారు.

కొందరు మనసులో, కలల్లో కనిపించి

మనలను కలవరపరిచే వారు ఉంటారు;

కొందరిని మాత్రం చూడాలని అనిపించదు—పరిచయం కోపమే తెస్తుంది.

భక్తుడు ఈ బంధాలన్నిటినీ సహనంతో భరిస్తాడు;

భగవద్భావం అతని హృదయంలో నిలిచితే

అన్నిటి భయాలు తొలగిపోతాయి.

ఎవరైనా కోపంతో వస్తే,

భక్తుని సమక్షంలో ఆ కోప పెల్లుబికిన మాటలు కూడా తగ్గిపోతాయి.

సత్యంగా నమ్మిన వారికి మాత్రమే

అతను నిజమైన మాట చెప్పుతాడు.


🌼 గీత – సరళ భావం


మూర్ఖుడితో స్నేహం —

విషం కంటే ప్రమాదం.

జీవితంలో ఎవరి వెంట నడవాలో,

ఎవరి నుండి దూరంగా ఉండాలో తెలుసుకొని ఉండాలి —

కొందరికి అది నేర్పాలి.

పండితులు, జ్ఞానులు, మంచివారి స్నేహం

ప్రాణాధారం లాంటి గొప్ప సూత్రం.

వారి మాటలు —

అమృతంలా మనసులో తేలికగా, శాంతిగా ప్రవహిస్తాయి.


కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తరువాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా, ఆ  భక్తుడికే యెంతో నిలువ లేని ఆతృత కలుగుతుంది, భగవాన్ని యెప్పుడు చూస్తానా అని, దూరాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఏదీ లక్ష్యం చేయక యెప్పుడు యెప్పుడు అంటూ వస్తాడు ఆశ్రమానికి. అతను వచ్చేప్పటికి భగవాన్ తల రెండో వైపు తిరిగి ఉంటుంది, అటు చూడరు, పలకరించరు. చిరునవ్వు నవ్వరు కొన్ని రోజులు. ఈలోపల యెందర్ని పలుకరిస్తారో ప్రేమగా పిలచి, మాట్లాడి, కుశల ప్రశ్నలు వేస్తారో!

కొందరు వుండేవారు. వారికి అందరి ముందూ భగవాన్ తో మాట్లాడడం గొప్ప. అందరి వంకా చూస్తూ, ఏవో కాయితాలో పుస్తకమో పట్టుకుని, ఏదో సందేహాన్ని కల్పించుకుని వెళ్ళి భగవాన్ని పలకరించి మాట్లాడతారు- మధ్య మధ్య చుట్టూ వున్న వారి వంక గర్వంగా చూస్తూ అంత స్వల్పమైన విషయాన్ని యెంతోసేపు మాట్లాడతారు, వాళ్ళతో భగవాన్, దూరం నుంచి వచ్చి; త్వరలో వెళ్ళవలసిన ఇంకోరు తమ సందేహాలతో రోజులకి రోజులు వుండిపోవలసిందే. యెవ్వరికేది అవసరమో, ఏది వారిని తనకి కట్టి వేస్తుందో, ఏది వారి అహాన్ని అణుస్తుందో ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా.

సశేషం..

 *006

ఆశ్రమంలో తనకి ఇష్టంలేని పని కాని, తను వద్దన్న పని కాని జరుగుతూ వుంటే, పిలిచి చీవాట్లు వేసేవారు. కాని, అప్పటికి వినకపోతే మాట్లాడకుండా వూరుకొనే వారు. చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలూ అజ్ఞలూ పెట్టేవారు ఆశ్రమాధికార్లు.


మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా భగవాన్ని ఎవరూ చూడకూడదని టైమ్ నిర్ణయించి, భగవాన్ని అడగకుండానే హాలు తలుపులు వేయించి వేశారు.


భగవాన్ “ఇదేమిటి?" అని అడిగితే, "మీ ఆరోగ్యము కోసం” అన్నారు. తలుపులు ముయ్యడానికి వీల్లేదనీ, 24 గంటలూ తలుపులు తెరిచి వుండాలనీ భగవాన్ అన్నా కూడా వినిపించుకోలేదు అధికార్లు. అందుకని ఆయనే హాల్లోంచి బైటికి వచ్చి కూర్చున్నారు. కాని, అప్పటికీ ఆశ్రమం వారు ఆయన మాట వినలేదు. ఒకటే బతిమాలారు, చివరికి అట్లాగే కానీ అని హాల్లోనే వుండిపోయినారు భగవాన్.


*****

ఏదో జరుగుతోంది  ప్రపంచమంతా

కారుమేఘాలుకమ్మి మూసుకు పోతోంది! లోకం తీరు ఇదేనా?

 

సముద్రాలు పొంగి మంచుకొండలు కరిగి అగ్నిపర్వతాలు పగిలి ఏదో విలయం! కనవస్తున్నది ఇందుకు కారణమేమి?


కల్లోల స్వప్నాలు వికృత రూపాలు భూత నృత్యాలు ఏమిటిదంతా? నాకేనా లేదా అందరికా..?


ఇది యుగాంతమా? కొత్త యుగానికి ప్రారంభమా?

అంతమే ఆరంభమా? ఎం చెప్పలేను శివా?***


అనేకమంది భగవాన్ కి ఫలహారాలు తెచ్చి పెట్టేవారు, వేళగాని వేళల కూడా ఆయనకి అవి జీర్ణమవుతాయా, లేదా అనే ఆలోచన కూడా లేకుండా. చాలాసార్లు అవి తిని బాధపడేవారు భగవాన్. ఒకరు యెంత తెచ్చిపెట్టినా తినేవారు. ఇంకోరు యెంతో భక్తితో విలువైన ఫలహారాలు తెచ్చిపెట్టి తినమంటే అటు తల త్రిప్పి కూడా చూసే వారుకారు. కొందరు ఆయన ముందు ఫలహారం పెట్టి, ఆయన పలక్కపోతే, అట్టానే చేతులు కట్టుకుని నించుని నించుని, ఇంక గతిలేక వెళ్లిపోయేవారు. ఒకరి చేతినుంచి ఇవాళ తిని ఇంకోసారి వాళ్లు తెస్తే, వాళ్ల వంక చూడనే చూడరు.


సశేషమ్.. చలం.. సాహిత్యం మల్లాప్రhగడ

[23/11, 06:58] Mallapragada Ramakrishna: 007


భగవాన్ ప్రవర్తన ఎప్పటికప్పుడు మారేది. ఆయన ఏ అనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు, ఆయన ధ్యానముద్రలో కూచున్న సాక్షాత్ దక్షిణా మూర్తి  అనిపించేవారు. పోజు లేని ఆ శాంభవీ ముద్ర ఎంతో ఆర్టిస్టిక్ గా వుండేది! ఆ అందంనించి కళ్లు తిప్పుకోలేకపోయే వాళ్లం, కదలని మారని సూర్యోదయాన్ని చూసినట్లుండేది. ఆయన ' ముఖంకాని, ఆయన దేహంకాని, మామూలుగా అందాలు అలవాటైన నా కళ్ళకి, అందంగా కనపడేవి కావు. కాని, ఆయన నిశ్చలంగా, గంభీరంగా కూచున్నారా-(ఆయన దేహం అట్లాగే వుండేది,) కాని, మరి ఏమిటో యింత అందం, ఇంత లావణ్యం! అవేంకాదు; ఏదో మనకు అలవాటైన సౌందర్యాలకి art కూడా అందుకోలేని దేదో ఆయన్ని వెలిగిస్తున్నట్టుండేది. ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన, చక్రవర్తి దుకూలాలు కట్టుకుని, రాజలాంఛనాలతో, నవరత్న సింహాసనంపై కూచున్నట్లుగా వుండి దిగ్భ్రాము చెందేవాళ్లం, ఆ స్థితిలో నైనాసరే, ఎవరన్నా "భగవాన్!" అన్నాడూ -ఎక్కడనించి దిగివచ్చేదో ఆయనకి ఈ లోకస్మృతి. కాని సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగిరావడమేముంది!


*****

జరిగే యుద్ధాలు 

భీకర దాడులు 

ఉల్కా పాతాలు 

ఒక ప్రళయం! అని యెంచ లేకున్నాను ఎందుకు?


ఆకాశవాణి పలుకులు 

భయపడకండి!

అంతమే ఆరంభం!

ఇది కొనసాగింపు! కొత్త పోకడలు ఏల?


అసత్యం వీడి సత్యానికి 

చీకటితొలగివెలుగులోకి వచ్చునా

మృత్యు కోరల నుండి 

అమృతమయజీవనానికి మార్గమా


ప్రతి యుగాంతము 

మరోయుగ ఆరంభం! మూలమా

బానిసయుగంనుండి

భూస్వామ్య యుగానికి! తప్పదా


భూస్వామ్యం నుండి

పెట్టుబడి దారీకి వత్తాసే

అంతాప్రజాచైతన్యం

సమతా యుగానికి! మార్పులే


ఇన్నాళ్లు పీక్కతిన్న

నరరూప రక్కసులు మారరా

రక్త దాహం తీరక

చేస్తున్న వైకృతం! ఇంకా పోదా


సానుకూల మౌతుంది

ఇది అంతమూకాదు

ఆరంభమూకాదు

పాతనీరు పోతోంది! అంతే అనుకోనా


కొత్తనీటి జల కళ

ఇది ఆనంద హేల

కొత్తప్రపంచం లోకి

ఒకఅంతం!ఒకఆరంభం! నావంతు కృషి ఎంతవరకు****  

భగవాన్ని పలకరించడమంటేనే యెంతో భయం. ఏ అధికారమూ, పరివారమూ లేని, బలంలేని స్వరూపం ముందు, గొప్ప పదవుల్లో, అధికారాలలో వుండేవారు, అతి గర్విష్టులు, సైన్యాధికారులు నమస్కరించడానికి వణికిపోయినారు.

మల్లాప్రగడ

***

008.భగవాన్ స్మృతులు


రోజుకి మూడు నాలుగుసార్లు, ఆశ్రమం నించి కొండ మీదికి వెళ్ళేవారు భగవాన్. ఆయన ముందు నడుస్తూ, వెనక కమండలం పట్టుకుని శిష్యుడూ, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వుండేవారు. 


అప్పుడప్పుడు కొండని ఇటూ అటూ చూసి, వెనక్కి తిరిగి శిష్యుడితో చల్లగా మాట్లాడుతూ వుండేవారు.కింద నుంచున్న నాబోటివారు తదేక దృష్టితో ఆయనవంకే చూస్తూ నుంచునేవారు, వారు కనుమరు గయిందాకా. ఏమనిపించేదంటే- అట్లా ఒక్కొక్క మెట్టే యెక్కుతూ కొండ చివరికి వెళ్లి, అక్కడనించి అట్లా ఆకాశంలోకి మాయమై ఇంక తిరిగి రారేమోననిపించేది ప్రతిసారీ.


***అందరం బిజీ బిజీ!

కులమతాలతో 

తన్నుకు చావటానికి 

టైం లేనంత బిజీ శివా అనలేని బిజీ.


మీరు ఏ'రంగం'లో 

నిష్ణాతులో-అందులో 

బిజీ గా ఉండండి!

కులమతాలొద్దుమనకు! అన్నా కులం, మతం అంటూ తిరగటం దేనికి విగ్రహం శక్తి ఇచ్చే విధానం తెలుసుకోక 


అందరం కష్టపడదాం!

అందరం అనుభవిద్దాం!

అదీ వ్యవస్థ అంటే 

వాళ్లు మనుషులంటే! తెలుసుకోలేని మూఢ జనాన్ని ఎలా మార్చాలి 


మనకష్టాన్నంతా 

రిజర్వుబ్యాంకులో 

కుప్పపోద్దాం-కావాల్సింది 

తీసుకు తిందాం! అది చాలదా


మధ్యలోరాజ్యంఎందుకు

దళారీ గాళ్లెందుకు?

ఓటు కొనేవాళ్లెందుకు?

వీళ్ళతోవిసుగొచ్చేస్తోంది! అని నేనంటే ఎవరైనా నమ్ముతారా 


ఒకరి కష్టాన్ని మరొకరు

దోచుకోవటం ఏంటి?

పాపమంతా ఇక్కడే!

పైకిమాత్రంఎన్నినీతులో! చెప్పే వారి ఎక్కువ ఆచరించే వారు తక్కువ ఏమనాలి 


అంతా వంచనాశిల్పులు!

ఇలాంటి బతుకు వద్దు!

ఆలోచించండి-ఒక

ప్రత్యామ్నాయంచూద్దాం! అని అనుకున్న వారు ఎవరు అర్థం తెలుసుకోకుండా అర్థం చేట్లు తిరిగేవారే 


మీకైతే ఎలా ఉందోకాని

నాకైతేమనశ్శాంతిలేదు! ఇది అంతా ఆ శివా కల్పనలే మాయలే 

ఎటుచూస్తే అటు దగా

ఎన్నాళ్లీదోపిడీసమాజం? ఈ సమాజాన్ని గెలిచేది మౌనం అర్థం చేసుకున్న వాడికి గ్రహణం అదే మూల శివ తత్వం 


*****

0009


భగవాన్ చివరి రోజుల్లో కురుపులేచి ఆపరేషన్లు అయి, శరీరం బలహీనమైన తరువాత ఆయన సోఫామీద నించి లేవడానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ కూచున్న వారికి ఆ బాధ తమ దేహాలలో పలుకుతున్నట్లుండేది. అట్లా బాధ పలకడా నికే ఆయన ఆ నెప్పిని పోగొట్టుకునేవారు కారేమో! ఆయన పొందిన మహోన్నత స్థితీ, అనిర్వచనీయమైన ఆనందమూ, అవేకాదు, ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా ఈ ప్రజలకోసమే గావును! కొన్ని ఏళ్ళు ఆయనకు మోకాళ్లు నెప్పులు వుండేవి. ఎవరో ఒకరు పంపిన మందు తైలాన్ని మర్ధన చేస్తూనే వున్నారు, పిసికే వారు. సోఫామీదనించి లేస్తూ భగవాన్ తన మోకాళ్లని పిసుక్కునేవారు. ఎవరన్నా పిసకబోతే "వుండవయ్యా! అంత పుణ్యమూ మీకేనా, ఈ మోకాళ్లని పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాయించుకోనీ” అనేవారు. 


ధర్మోరక్షతి రక్షితః 

వినటానికి బాగుంది!

వేలసంవత్సరాలుగా 

వింటున్న నీతిసూత్రం!


ధర్మాన్నిఎవరురక్షించాలి?

ఎవరు రక్షించటం లేదు?

రక్షించేవాళ్ళు బాగున్నారా?

రక్షించనివాళ్ళుబాగున్నారా?


అసలు ఏది ధర్మం?

చాతుర్వర్ణ ధర్మాలు!

ఆ కాలంలో చెప్పారు!

కాలం మారిపోయింది!


బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 

త్రైవర్ణ ధర్మాలు ఏవి?

సూద్ర ధర్మాలు ఏవి?

ఇవి రక్షించబడాలి!


బ్రాహ్మణ ధర్మం ఏది?

వాళ్ళు 'గుడి'నినమ్మారు!

నేటికీ'గుడి'తోనే ఉన్నారు!

ధర్మ రక్షణ జరుగుతోంది!


క్షత్రియధర్మం ఏది?

రాజ్యభారం! సుజనరక్షణ!

ఇపుడుపాలించేవాళ్లెవరు?

ధర్మమే మారిపోయింది!


వైస్యులధర్మం ఏది?

వ్యవసాయం చెయ్యటం!

అదీ ఆనాటి వాళ్ళ ధర్మం!

ఇప్పుడు ధర్మం మారింది!


సూద్ర ధర్మం ఏది?

త్రైవర్ణాలను సేవించటం!

ఇప్పుడు సాధ్యమౌతుందా?

ఇక్కడా ధర్మం మారింది!


మారుతుంది కాబట్టే

ధర్మం 'చర' అన్నారు!

చాతుర్వర్ణ ధర్మం కాదు

నేడు ప్రజాస్వామ్య ధర్మం!


ఆ పాత నీతి సూత్రం

నేడు పనికిరాదు!

ప్రజాస్వామ్య సూత్రాలతో

కొత్తగారాసిందే రాజ్యాంగం!


రాజ్యాంగ ఉల్లంఘనచేసి

మనువాద ఫాశిస్టులు

వీరంగమాడుతున్నారు!

ధర్మాన్ని చెడగొట్టారు!


కంచే చేను మేస్తోంది!

మనువాద ఫాశిస్ట్ కార్పొరేట్

అధర్మపాలననుంచి

దేశాన్నికాపాడదాం రండి!


వాళ్ళు చెప్పినధర్మాన్ని

వాళ్ళే తుంగలో తొక్కారు!

ధర్మం కాలాను గుణం!

ధర్మో రక్షతి రక్షితః! అంటూ

       

ఆయన లేచి నుంచుని కర్ర నానుకుని ఒక్కొక్క అడుగు వేస్తూవుంటే, భక్తుల్లో ప్రతివారి వూపిరీ యెగిరిపోతూ వుండేది ఆయన వేసే ప్రతి అడుగుకీ.

🪷

సశేషం


[26/11, 11:46] Mallapragada Ramakrishna: *భగవాన్ స్మృతులు -10

🪷


ఆశ్రమాధికార్లు కట్టించిన కొత్త హాలు రాతి గుమ్మం దాటడం అతి ప్రయాస అయ్యేది భగవాన్ కి. చూసేవారికి, చిన్న పిల్లలకి కూడా యెట్లానన్నా ఆయన్ని పట్టుకుని దాటించాలనిపించేది. కాని, తమ బుజాల్ని వూతగా ఇవ్వాలని వెళ్ళే పరిచారకుల్ని విదిలించి పంపించేవారు భగవాన్. ఒక్కొక్కసారి ఆయన పడిపోయేవారు కూడా, కాని, సహాయం మాత్రం తీసుకునే వారు కారు.


మానవోద్ధరణకై ఈశ్వరుడు ఏ రూపంలోనో భూమిపై అవతరించి, తాను అనేకమందిని శిష్యులుగా తీసుకొని, వారిని సాధనలో పెట్టి పునీతుల్ని చేస్తారు. ప్రతి గురువు పద్ధతీ, తక్కినవారి నుంచి ప్రత్యేకంగా వుంటుంది. కాని, ప్రతి గురువు కూడా తనను విశ్వసించి, తాను నియమించిన ప్రకారం ప్రశ్న లేకుండా నడవమనే ఆజ్ఞ ముఖ్యమైనది. వారు యే ప్రజలమధ్య అవతరిస్తారో వారి మతాలకీ, ఆచారాలకీ, పురాతన ధర్మాలకీ, కరుడు కట్టిన నీతులకీ కూడా చాలాసార్లు వారి బోధ విరోధంగా, విపరీతంగా వుండవచ్చును. తాము నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడచు కునే గురువుని భరించలేక చాలామంది వదిలిపోతారు. కొందరు ఆ గురువుని వదలలేక, ఆయన మాట వినలేక “ఆయన అంతేలే” అని తప్పుకు తిరుగుతూ వుంటారు.

*****

మార్చేవాళ్లెవరు? అంతా శివ ప్రక్రియలే


సామాన్యులు కష్ట జీవులు కూలినాలి జనం పుత్తు పూసలేని వాళ్లు ఏది చెపితే 

అదినమ్మేవాళ్ళు మూఢ విశ్వాసాలతో నిండినవాళ్లు 

దేవుని విలువ తెలియని వాళ్లు  వెయ్యి రూకలకు 

అమ్ముకునేవాళ్ళు తమకష్టాన్ని

ముడుపులు కట్టి హుండీల్లో వేసేవాళ్ళు ప్రతి కొండకెళ్లి

గుండుకొట్టించే వాళ్ళు మహిమలనినమ్మేవాళ్ళు

బ్రమ్మోత్సవాలు రథ యాత్రలు

పుష్కరాలు కుంభమేళాలు

తెలియనివాళ్ళు

వీళ్లంతా తరతరాల వంచితులు పీడితులు! వీళ్ళను మార్చాలి!

వీళ్ళ అజ్ఞానం మీద

బ్రతికేవాళ్లంతా వంచకులు పీడకులు దోపిడీ సమాజం!

మార్చేవాళ్లెవరు?  అంతా ఆశివుడే చేస్తాడు, శివుడే మారుస్తాడు, జీవుడు నిమిత్తమాతృడు. స్వార్ధ, మురికి కూపంలో చిక్కి నలిగే ఈగలబతుకే యగు తీరుగాను

****


భగవాన్ ఏ ఆచారాలూ పాటించేవారు కారు. తన దగ్గర చేరిన ఆచారవంతుల్ని,  ఆ ఆచార బంధనాల నుంచి తప్పించాలని చాలా ప్రయత్నించారు. అంతటి గురువుని యెదురుగా పెట్టుకొని; ఆయన్ని సాక్షాత్ ఈశ్వరావతారమని స్తుతిస్తూ గర్వపడు తూనే వారి దేవతార్చనలు, వ్రతాలు, మొక్కుబళ్ళు, తీర్థయాత్రలు - సమస్తమూ చేస్తూనే వుండేవారు భక్తులు. భగవాన్ని అడిగితే, "ఏదీ వద్దు, నిశ్చలంగా కూచో, అది ఉత్తమమైన యాత్ర... కాశీకిపోతావా? ఇది కాశీకాదా? అరుణాచలం కన్నా గొప్ప పుణ్యక్షేత్రం యెక్కడ వుంది? ఇదే హిమాచలం. ఇదే కైలాసం" అంటూన్నా సరే పోతూనే వుండేవారు.

📖

[27/11, 07:01] Mallapragada Ramakrishna: 0011.భగవాన్ స్మృతులు


ఆయనకి గొప్ప భక్తురాలు, ఎచ్చెమ్మ. ఒక సారి లక్ష తులసీ పత్రి వ్రతం చేసి, అలా చేశానని భగవాన్ తో గొప్పగా చెప్పుకుంది. "ఆ చెట్టుని అన్నిసార్లు గిల్లడంకన్న, నువ్వే లక్షసార్లు నిన్ను నువ్వు గిల్లుకోకపోయి నావా!?” అన్నారట.


చిన చేపను పెదచేప పెదచేపను తిమింగలం మింగటమేమన కాల రీతిగా ను మాత్రమే


దోపిడీ కాలము లో, ప్రేమకాలములో

సృజన శక్తులు కూడా

నశించిపోతాయి, కారణం వెతుకుంటే అంతా నిశ్శబ్దం


ఎక్కువతక్కువలతో

మనో వికారాలు పెరిగి

అంతా అంధకారమే అది ఎవరి వసరమో తెలియదు కదా


భౌతికమూ లేదు, ఆధ్యాత్మికమూ లేదు,

నిర్వీర్యము నిస్తేజమే, మనసు అర్భాటాలకు ఆజ్యం లాగ మారుట ఎంతవరకు సమంజసం


ఉపన్యాసాలు ప్రవచనాలు

కన్నీటితుడుపులు, కాలయాపన అనుకున్నా తప్పే, మనసు శాంతికి మరో మార్గం యది కాదా


నీ వల్ల ఎవ్వరికీ  హాని జరగకూడదు అదే సత్యం

అదీ నిత్యం


'ఆనాడే'మానవులంతా

ద్విగుణీకృత శక్తులై 

సమాజం సుసంపన్నం జేసే కార్యకర్తలుగా, శివగాణాలుగా తయారవుతారు మనలో కావాల్సినది ధైర్యం స్థాయి యనేది ఏదీ లేదు, ఓర్పు, ఓపిక మనుగడ కూ ప్రశాంతి కదా అని భావామృతం తెలియపర్చారు.

            ****


ఏది ఏమైనా, ఏది ఎటుపోయినా పట్టించుకోని భగవాన్, హాల్లో అద్దాల బీరువాకి ఆనుకునే పిల్లవాడితో అతి ఆత్రతగా "అద్దం, అద్దం పగులుతుంది” అని హెచ్చరించేవారు, తల్లి చచ్చిపోయిన ఉడత పిల్లని పెంచి; క్రిందపడి బీటలుపడ్డ పిచిక గుడ్డును తాను స్వయంగా జాగ్రత్త చేసి, పిల్ల ఐతే అందరికి చూపి ఆనందించే వారు భగవాన్, కాని, ఆయనకి చాలా ఆత్మీయులని అందరూ అనుకునేవారు చచ్చిపోతే “అట్లాగా!” అని వూరుకునే వారు. పుస్తకాలు బైన్డు చేస్తూ వుంటే, అలమారు చేస్తూ వుంటే, ఆ చేసేవారిని విసిగించి బలవంతం చేసి, పావు అంగుళం లో పదోవంతు కొలతలను కూడా సరి చేయించేవారు. వంటలూ అంతే, ఎట్లా వుండాలో, ఎన్నో వివరాలు చెప్పి చేయించి సరిగా చేస్తున్నారో లేదో లేచి వెళ్లి చూస్తూ వుండేవారు. మళ్ళీ యెంత విలువైనవి కనపడలేదన్నా, పాడైనా సరే ఆయన వినుపించుకోనన్నా వినుపించుకోరు.


ఆయన ముందే హాల్లో స్త్రీలను గడకర్రలు పెట్టి నెట్టేవారు సేవకులు; స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు; భోజనం దగ్గర కూచున్న కొత్తవాళ్లని బైటికి గెంటేవారు. అయినా అట్లా చూస్తూ వుండేవారు భగవాన్. కాని, ఒక పిట్టకు, ఒక చెట్టుకు ఏ హాని కలిగినా జాగ్రత్తగా నయం చేసేవారు; హాని చేసేవారిని చూసి ఉగ్రులయ్యేవారు.

📖

[27/11, 18:19] Mallapragada Ramakrishna: 012..భగవాన్ స్మృతులు


ఆశ్రమానికి డబ్బు కూడిన మొదటి రోజుల్లో, ముందు 'వాకిట్లో ' కాచుకొని వున్న బీదలకి, ఆవులకి, తక్కిన ప్రాణులకి భోజనం పెడితేనేకాని భగవాన్ భోజనానికి లేచేవారు కారు, ఆశ్రమంవారు బీదలకి వేరే పల్చని సాంబారు వండితే, వారితోపోట్లాడి తను ఆ పల్చని సాంబారు వేసుకొని, వారికి మంచి సాంబారు పోయించేవారు. తను తినే యిడ్లీలు ఆవులకు పెట్టించేవారు ఆశ్రమం వారికి ఆ పనులు చాల కష్టంగా వుండి, ఎట్లాగన్నా ఆయన కన్ను కప్పాలని చూసేవారు. విసుగుపుట్టి ఆయన ఆ విషయమై కల్పించుకోవడం మానేసారు. తన భక్తులకి భిన్నంగా తనకేమి అధికంగా పెట్టినా ఉగ్రులయ్యేవారు. తనకి జబ్బుగా వున్నా తన కోసం తెచ్చిన పళ్ళు పాలు అందరికీ పంచాల్సిందే. ఆ విధంగా తనకు ప్రత్యేకత చూపినందుకు కోపించి - కాఫీ, పాలు మానేశారు భగవాన్, చాలకాలం.


రమణ మహర్షి ఆవేదనతో భాధతెలపకుండా నాకు ఏమీ భాదలేదు అంటూ


మీ ఆరోగ్యం మీ చేతిలో, మీ నడకలో, మీ పడకలో,  మీ నిద్రలో, మీతిండి లో 


మీ ఆరోగ్యం మీ ఉప్పులో,  మీ నూనె లో, మీ నీటి లో, మీ ధ్యానంలో, మీ ఆసనాల్లో 

మీ ఆరోగ్యం ఎండపొడ లో 


మీ ఆరోగ్యం విటమిన్స్ లో, ప్రోటీన్స్ లో, పండ్ల లో, ఆకు కూరల్లో, కోడిగుడ్లలో తెల్ల సొనలో,ఇప్పుడు పచ్చసొన లో,మీ ఆరోగ్యం మీ నవ్వులో 

అ హ హ హ ఆహా హా హా 

నవ్వండి నవ్వండి నవ్వండి 

లోపలఏడుస్తూనేఉంటారు

సమస్యలెక్కడికి పోతాయి!


ఎందరో మహానుభావులు 

వారిచ్చిన 'ఉవాచ'లు 

మనకు శిరోధార్యాలు!

నా'ఉవాచ'కూడా వినండి

మీ ఆరోగ్యం మీ 'బుద్ధి' లో!


బుద్దులు మంచివి కాకపోతే 

మీ సుద్దులు మారిపోతాయి 

మీ చేతలు మారిపోతాయి!

బుద్ధి అన్నిటికి మూలం!

దాన్ని సరిజేసు కోండి -మీకు 

నూరేళ్లు ఆరోగ్యం ఖాయం!!


మన బుద్ధులనిండా కులాలు 

మతాలు  ఎక్కువతక్కువలు

ప్రక్క వాళ్ళమీద ఈర్ష్య లు 

అరిషడ్వర్గాలతో నిండిపోతే 

నువ్వెన్నిచేసినా ఏమీలేదు!


ప్రేమ కరుణ దయ సహకారం

సమభావం సౌభ్రాత్రంవీటితో 

నీ హృదయం నిండి పోవాలి

రోగాన్ని రమ్మను చూద్దాం!

రాదు!మీరంటే దానికి భయం


ఇవన్నీ కుళ్లబెట్టుకుంటే 

మీరు ఏం చేసినా ఆరోగ్యం 

శ్రీమతేరామానుజాయన్నమః 

మీ చేతిలో మాత్రం ఉందా?

ఏంజరిగినా 'దైవేచ్ఛ'కదూ! 

అని అందరితో చెప్పేవారు

       

భగవాన్ కి ఎప్పుడూ ఏదో జబ్బు చేస్తునే వుండేది. మందు లిప్పించ చూసేవారు. ఎప్పుడూ భగవాన్ మందులు వద్దనేవారు. కాని, వత్తిడిచేస్తే మీ ఇష్టం కానిమ్మనేవారు. తరువాత ఏ మందులు యెంత కాలం పోసినా మింగేవారు. చివరదశలో ఆయన దేహాన్ని అంతంచేసిన కురుపు లేచినపుడు ఏ మందూ, ఏ కోతా వద్దన్నారు. ఎట్లా వచ్చిందో అట్లానే పోతుందన్నారు. కాని, రెండు మూడేళ్లు దానికోసం పోసిన మందల్లా తాగారు, కొ'సిన కొతల్లా కోయించుకున్నారు.

ఏది ఏమైనా ఈ జ్ఞానులందరూ ప్రేమమయులు, వారు ఏది చేసినా – యెట్లా చేసినా అది వారి నాశ్రయించిన వారి పురోభివృద్ధికే జరిగేది.


*___చలం*

🪷

సశేషం

[29/11, 21:07] Mallapragada Ramakrishna: *భగవాన్ రమణ మహర్షి స్మృతులు - 4*/13

🪷


*సాధుని శాంతమ్మ అనుభవాలు -1*


నా అన్న అల్లుడికి రామనాధపురం నుంచి దగ్గర వున్న పల్లెటూరికి బదిలీ అయింది. భార్య పుట్టింట్లో ఉండడంవల్ల అతను వొక్కడే వెళ్లి వంట చేసుకోలేక, నాకు కబురంపాడు. నాకప్పుడు నలభై యేళ్లు.  సామాన్లన్నీ వెంటతీసుకుని వెళ్లాను. బియ్యం పొయ్యిమీద పెట్టి కూర్చున్నానో లేదో, ఏ కారణం లేకుండానే నాలోంచి పెద్ద ప్రశ్న బయలుదేరింది.


"ఏమిటి? నువ్వు చేస్తున్న పని! ముగ్గురు కొడుకులూ పోయినారు, భర్త పోయినాడు. కుతురికి పెండ్లిచేసి, ఆ కుతుర్నీ అల్లుణ్ని అమితంగా ప్రేమించి నీకున్నదంతా వాళ్ళ కోసం ఖర్చు చేశావు. ప్రసవించి పిల్లతో సహా కూతురు చచ్చింది. కూతురు పోయి ఆరు మాసాలయిందో లేదో, ఈ లోపలనే అన్న కూతుర్నీ అల్లుణ్నీ తెచ్చుకొని రామనాధపురం రాజుగారిని యాచించి, అతనికి ఉదోగ్యం ఇప్పించి, నేడు మిగిలిన దేదో వాళ్లిద్దరికీ ఖర్చు చేస్తూ వాళ్ళకి వండి పెడుతున్నావు. ఇందుకేనా నువ్వు పుట్టింది? ఎవరిమీదో ఒకరిమీద మమ కారం తగిలించుకోకుండా నిలవలేవా? ఇతనెవరు? నువ్వెవరు? ఈ చాకిరీకి, ఈ ఖర్చుకి అర్థమేమిటి? ఇట్లాగే నీ కాలం

గడిస్తే, చివరికి నీ గతేం కాబోతుంది?" అని అడిగారు నాలోని ఎవరో...


ఒక్కసారిగా నా కళ్లు వాస్తవానికి గట్టిగా తెరుచుకున్నాయి.


నేను వెంటనే నా అన్న అల్లుడి దగ్గరకు వెళ్లి “నేను రామేశ్వరం బయలుదేరు తున్నాను” అన్నాను.


"ఎప్పుడు?”


“ఇప్పుడే.”


"అదేమిటి?”


"అది అంతే, నేను వెడుతున్నాను.”


అతను ఆశ్చర్యంతో, అయిష్టంతో "నాకు తిండి ఎట్లా?" అని సణుగుతున్నాడు.


"అదంతా నాకు తెలీదు, నేను రామేశ్వరం వెళుతున్నాను. పొయ్యిమీద అన్నం వుంది, చూసుకో” అని ఖచ్చితముగా చెప్పి, రైలెక్కాను.


ఆ ముందు రోజు అతను, అతని భార్య నా లోకం. వాళ్ళు తిన్నారా, లేదా? వాళ్లకి యిష్టమయ్యేట్టు వంట చేశానా? ఇంకా ఏం పెట్టను వాళ్లకి? ఇదే నా బతుకు. అసలు అలోచించితే వాళ్లెవరో, నే నెవరో!

📖


రామేశ్వరం వెళ్లాను. ఒకటే వేదన, నాకు మోక్షమార్గం యెవరు చూపుతారు?


అక్కడ పురాణం చదివే ఒకామె వుంటే ఆమెకి సేవచేస్తూ వారింట్లో వున్నాను 'మొదట్లో. ఆమెనడిగాను. పరమార్థం అర్థం కావాలంటే ఏం చదవమంటావని, 

'కైవల్యం' అనే పుస్తకం చదవమంది ఆమె. అది ఎక్కడ దొరుకుతుందంటే నాగస్వామి గారని ఒక స్వామి వున్నారు, ఆయన్నడగ మంది. నాగస్వామిగారిని చిన్నతనంనుండి యెరుగుదును, వెళ్లి ఆయన్ని అడిగాను.


"ఎందుకు 'కైవల్యం' నీకు?”


"అది చదివితే మోక్షమార్గం స్పష్టమౌతుందన్నారు.”


"పుస్తకం చదివినంత మాత్రాన నీకు మోక్షమార్గం తెలుస్తుందా?”


"అంతకన్న ఏం చెయ్యను స్వామి?”


“నీకా మార్గం తెలుసుకోవాలని గట్టికోర్కె వుందా?"


“అవును.”


"మోక్షం తప్ప ఇంక దేనిపైనా ఆశలేదా? అది సత్యమేనా?”


"అవును.”


ఆయన నన్ను పరీక్షిస్తూ చూచారు. 


“సరే. రేపు పౌర్ణమినాడు రా” అన్నారు.


పౌర్ణమినాడు నాకు మహామంత్రం ఉపదేశం చేశారు. ఉపదేశం పొందుతూ వుంటేనే, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడి లా కన్పించారు. ఆ మంత్రం ఉచ్చరించటం తోనే ఒళ్లు తెలీక, తన్మయురాలనై, యెంతో సేపు అట్లానే కూర్చుండిపోయినాను. నాకు యింత సులభంగా సద్గురువు దొరికారే అని చాలా సంతోషమయింది. ఆనాటి  నుంచి ఒక సంవత్సరం కైవల్యం చదవడ మయ్యేవరకు ఆ దంపతుల్ని సేవించుకుని వుండిపోయినాను


తరవాత రామనాధపురానికి వెళ్ళి లోక వ్యవహార సంబంధాలు వదిలి నేను తెలుసుకున్న వేదాంత గ్రంథాలు చదివి వినేవారికి చెబుతూ ఆ మంత్రం జపించు కుంటూ కాలం గడుపుతున్నాను.

ఇంకా వుంది

📖


*

[02/12, 06:34] Mallapragada Ramakrishna: భగవాన్ రమణ మహర్షి స్మృతులు - 4*/14

అట్లా తొమ్మిది సంవత్సరాలు గడిచాయి. 

నాకు యాభై ఏండ్లు నిండాయి. రామనాధ పురవాసులైన మురుగనార్ (భగవాన్ శిష్యుడు) నా పఠన కాలక్షేపానికి వస్తూ వుండేవారు. వారి దగ్గర భగవాన్ శ్రీ రమణ 

మహర్షుల వారి చిత్ర పఠాన్ని ఒకనాడు చూచాను. 


అప్పటి నుంచి ఎలాగైనా భగవాన్ దర్శనం చేసుకోవాలని గట్టి కోర్కె కలిగింది. మురుగ నార్ అప్పటికే అన్నీ వదలి భగవాన్ పాదాల్ని ఆశ్రయించుకొని అరుణాచలంలో ఉంటున్నారు, నేను ఎప్పుడూ బాగా బీద దాన్ని కావడంవల్ల అనుకున్న వెంటనే దూరప్రయాణం చెయ్యగల సామర్థ్యం నాకులేదు. కొంత డబ్బు సమకూర్చుకోడా నికి సంవత్సరంపట్టింది. నేను మురుగనార్ గారి అక్క, మరి ఇంకా ముగ్గురు స్త్రీలు కలిసి అరుణాచలానికి బయలుదేరాము గంపెడాశతో... 

📖


అది 1927 కార్తీక మాసం.


అప్పటికే భగవాన్ కొండ దిగి వచ్చి పాలి తీర్థం ప్రక్కన తల్లి సమాధిపైన వేసిన ఒక పాకలో ఉంటున్నాడు. అక్కడ ఆ పాక తప్ప ఇంకేమీ లేదు. చుట్టూ అడవి. మేము ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అందులో స్థిరపడ్డాము. 


మర్నాడు భగవాన్ దర్శనానికివెళ్లినప్పుడు వారు ఆ పాకలో ఓ నులక మంచం పైన కూర్చుండి ఉన్నారు. ప్రక్కన మురుగనార్. వారిని చూడగనే తెలిసింది, వారు గురు రూపంలో ఉన్న ఈశ్వరుడని. నేను తెచ్చిన పళ్లు వారి ముందుపెట్టి నమస్కరించి, "ఎన్నాళ్ళ నుంచో తమ దర్శనం చేసుకోవా లనే నాకోర్కె ఈనాటికి తీరింది. ధన్యురాల నైనాను” అని చెప్పి, "స్వామి, నాకు ఈ మనసు అనేది లేకుండా చేసి నన్ను కటాక్షించండి" అని అడిగినాను.


దానికి స్వామి మురుగనార్ తో "ఆమెను కనుక్కోండి మనసు అనేది ఒకటుందంటే, ఆ మనసు ఆకారమెటువంటిదో, ఆ మనసుగారికి మీసాలూ, గడ్డాలూ వున్నా యేమో చూడమనండి” అన్నారు.


ఆ మాటకి ఏమి సమాధానం చెప్పాలో తెలీలేదు నాకు. మురుగనార్ నన్ను చూచి “నీకు దీక్ష అయింది" అన్నారు.


రమణ స్తుతి పంచకం నుంచి నేను ఒక పద్యం చదివాను అరవంలో. “నీవు స్వర్ణజోతి స్వరూపం. నీవు సర్వ పరి పూర్ణుడవు. నీవు పొందిన ఆత్మానుభూతి పరిమళమై సర్వజగత్తును ఆవరించింది. రసాన్ని ఆస్వాదించి అందరూ నీ దగ్గిరకే పరుగెత్తుకొని వస్తున్నారు. నేను ఆ పరిమళాన్ని రుచి చూచి నిలువలేక 'ఎక్కడ? నువ్వెక్కడ?' అని వెతుక్కుంటూ వచ్చాను” అనే అర్ధంతో పాడాను.


అది విని "ఈ పద్యం ఈ అమ్మకి యెట్లా తెలిసింది?” అని అడిగారు భగవాన్.


దానికి మురుగనార్ నన్ను రామనాధ్ లో తాను యెరుగుదునని, రమణ స్తుతి పంచకం కాపీ నాకు తాను ఇచ్చిన సంగతీ చెప్పారు.


ఆ విధముగా మేము ఐదుగురము నలభై రోజులు వున్నాము అరుణాచలంలో.  ఊళ్ళో వండుకొని భోజనం చేసి మాలో మేము చందాలు వేసుకుని మధ్యాహ్నం పన్నెండింటికి రోజూ ఏదో ఫలహారం తయారు చేసుకొని ఆశ్రమానికి చేరుకొనే వాళ్లము. మూడు గంటలకు స్వామికీ, అక్కడ ఉన్న భక్తులకీ మేము తెచ్చిన ఫలహారాన్ని పంచి పెట్టేవాళ్లము. అందరికి ఎంత ఇస్తామో అంతమాత్రమే స్వామివారి కీ ఇవ్వాలి. అంతకన్న యెక్కున తీసుకోరు. కనుక అందరికి సరిపోయేట్టు తయారు చేసేవాళ్లం. ఆ రోజుల్లో ఆశ్రమంలో చిన్న స్వామే వంట. గోపాలరావు అనే భక్తుడు ఊళ్ళో దొరికిన బియ్యం-అవీ ఆశ్రమానికి పంపేవారు. భక్తురాలు ఎచ్చమ్మ కూడా ఏదో ఒకటి పంపేవారు. ఆ వచ్చినవాటిని వంటచేసేవారు చిన్నస్వామి. నెయ్యిగాని, కూరలుగాని సరిగా ఉండేవి కావు. స్వామి వారికి చారు అన్నమే చాలారోజుల పాటు వడ్డించారు. చారు కూడా లేకుండా ఉత్త ఊరగాయ ముక్కతో తిన్న రోజులు కూడా చాలా వున్నాయి.

🪷

*సశేషం*

*భగవాన్ రమణ మహర్షి స్మృతులు-5*/15



*​సాధుని శాంతమ్మ అనుభవాలు -2*


​ఇంతలో కార్తీకదీప ఉత్సవం దగ్గరకు వచ్చింది. ఆ రోజుల్లో కూడా దీపానికి వచ్చిన ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేవారు, భగవానుని చూడడానికి. అందుకని తెల్లవారగట్ట మూడింటికే ఫలహారం తీసుకుని కూర్చునేవారు.

​తెల్లవారిందా —లేవడానికీ, కదలడానికీ వీలు వుండేది కాదు భగవాన్ కి. ఆయన చుట్టూ కర్రలు కట్టేవారు, గుంపు తోసుకుని మీదపడకుండా. దాంట్లో స్వామి, మురుగ నార్, తక్కిన భక్తులు కూర్చునేవారు. అందుకని స్వామి నాతో "ఈ దీపం పది రోజులు నువ్వేమీ ఫలహారం చేసి తీసుకొని రావద్దు, గుంపువల్ల ప్రయోజనం ఉండదు" అన్నారు. నేను ఏ పళ్ళో తెచ్చి గుంపులో చొరబడి కర్రల సందు నుంచి స్వామివైపు ఆ పళ్లుపెట్టి వెళ్లిపోయేదాన్ని.


​కార్తీకదీప ఉత్సవం ఐనాక నాతో వచ్చిన వారు చిదంబరం వెళ్ళాలనుకుంటున్నారు. నాకేమో భగవాన్' జయంతి (పుట్టినరోజు) వరకు అరుణాచలంలోనే ఉండాలనిఉంది. కాని వాళ్లు వెళ్ళిపోతున్నారు కదా, నేను వెళ్ళాలని సెలవు తీసుకుందామని భగవాన్ దగ్గరకు వెళ్లాను. ఆయన నన్ను ఇంకొ రోజు ఆగమన్నారు. భగవాన్ రచించిన 'ఉపదేశ సారం' అనే పుస్తకాలు అచ్చై మర్నాడు వస్తాయనీ, నన్ను ఓ కాపీ తీసుకొని వెళ్ళమని అన్నారు. మర్నాడు శలవు తీసుకోడానికి వెళ్ళినపుడు 'ఉపదేశ సారం' కాపీ ఇచ్చి శలవిచ్చారు భగవాన్.

​నేను ఆయనను వదిలి కదలలేక ఏడ్చాను, భగవాన్ చాలా దయగా, నాతోపాటు ఆయనా దిగులు పడుతున్నట్లుగా "నువ్వు రామనాధ్ వెళ్ళడంలేదు. ఎక్కడికీ వెళ్ళడం లేదు. అరుణాచలం వెళుచున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తిరిగి వెళ్ళడం అంటే కష్టంగానే ఉంటుంది. దిగులుపడకు వెళ్ళిరా” అన్నారు. ఆ మాటలతో నాకు ఓదార్పు కలిగింది. ఆ రోజే చిదంబరం వెళ్లి, అక్కన్నించి రామనాధపురం చేరుకున్నా.


ఇంకా వుంది

****

*భగవాన్ రమణ మహర్షి స్మృతులు-5*/16


*సర్వేశ్వరుడి కృప*


​నేను రామనాధ పురంలో తిరిగి అమ్మవారి పూజలు చేసుకుంటూ గ్రంధపఠనం చేస్తూ వున్నాను. ఏడాది గడిచింది. తిరిగి భగవాన్ జయంతి వస్తోంది. 'పోయిన జయంతికి వుండలేకపోతినే. ఈ జయంతి కైనా వెళ్లగలనా' అనే చింతలో వున్నాను. బీదదాన్ని, రైలుచార్జి కూడా లేదు నా దగ్గర. ఎక్కడన్నా అప్పుచేసి ఐనాసరే శనివారం బయలుదేరి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. శుక్రువారంనాడు టపాలో నాకు జయంతికి ఆహ్వానం వచ్చింది, భగవాన్ ఫోటోతో సహా. నాకెంతో ఆనందమయింది. కరుణామయులు, ఈ క్షుద్రురాలిని జ్ఞాపకముంచుకొని ఆహ్వానం పంపించారు. అరుణాచలం వెళ్ళింతర్వాత తెల్సింది భగవాన్ స్వయంగా గోపాలరావు తో "శాంతమ్మకి ఒక ఆహ్వానపత్రిక పంపు” అని చెప్పి పంపించారని.


​నేను సద్గ్రంథాలు చదివి వినిపిస్తున్న సంగతి విని రామనాథపురం రాజావారి అంతఃపుర స్త్రీలు నాకు కబురంపి, వేదాంత గ్రంధాలు చదివించుకునేవారు. ఆ నాడు నేను నా కందిన ఆహ్వానం తీసుకొని ఆ రాణులకు చూపాను. భగవాన్ ఫొటో చూచి అందరూ ఆనందించారు. నాకు జయంతికి వెళ్లాలని ఉందని చెప్పాను. వాళ్ళలో వాళ్లు చందాలు వేసికొని 30 రూపాయలు ఇచ్చారు. భగవాన్ నన్ను రప్పించుకోడానికి సమయానికి డబ్బు కూడా సమకూర్చారు. అనుకున్న నాటికి బయలుదేరి అరుణాచలం చేరుకోగలిగాను.


*​ఆశ్రమంలో స్థిరపడడం*


​నేను ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి ఒక హాలు కట్టారు. దాంట్లో భగవాన్ మామూలు మంచం ఓ మూల వేశారు. దానిపైన దిళ్లు వేసుకొని భగవాన్ కూర్చుని వున్నారు. దండపాణి స్వామి "ఉల్లత్ నార్పత్" 

(భగవాన్ వ్రాసిన నలభై శ్లోకాలు) చదువుతూ ఉంటే భగవాన్ వాటికి వ్యాఖ్యానం చేసి చెబుతున్నారు.

​భగవాన్ నన్ను చూడగానే "ఉల్లత్ నార్పల్ (పుస్తకం) నీకు రాలేదా! మురుగ నారును నీకు పంపమన్నానే” అన్నారు. జయంతికి ఆహ్వానం కూడా స్వామి నా పేరు చెప్పి పంపమని జ్ఞాపకం చేశారట. సర్వేశ్వరుడే నాపైన అంత శ్రద్ధవహించి నాకు సందేశాలు పంపుతే వారిని విడవడం ఎట్లా సాధ్యమౌ తుంది? నే నెంత? ఆడదాన్ని, అంత కృప నాపై కలగడానికి నేను చేసిందేమున్నది?


​అట్లాగే ఆశ్రమములో భగవాన్ తో భోజనం చేసి ఆశ్రమంలో ఉండిపోయాను, నా స్వంత ఇల్లులాగ, రాత్రులు మాత్రం ఊళ్ళో కి పోయి భగవాన్ భక్తులు మొదలియార్ గారి ఇంట్లోనో, ఎచ్చమ్మపాటి ఇంట్లోనో నిద్రపోయేదాన్ని, కార్తీక ఉత్సవమూ, జయంతీ గడిచాయి. "ఇంక ఎంతకాల ముండగలను వీరిమీద భారమై? వెళ్లాలి గదా!?” అని దిగులుపడుతూ ఓరోజు భగవాన్ సమక్షాన నిలిచి "ఇక్కడ ఉన్నంత కాలమూ శాంతంగా, తృప్తిగా, ఇంకేమీ ఆక్కర్లేకుండా ఉంటుంది. ఇంటికి వెళ్లానా, శాంతి ఉండదు. నేనేం చెయ్యను? భగవాన్ ని వదిలి కదలలేకుండా ఉన్నాను" అన్నాను.


​"నీ మనస్సు స్థిరపడ్డదాకా ఇక్కడ వుండు. తరువాత నువ్వు ఎక్కడికి వెళ్లినా శాంతి నీతోనే ఉంటుంది" అన్నారు. కానీ, ఎక్కడ ఉండను? బైట ఉందామంటే బీదదాన్ని. జయంతి కాగానే ఆశ్రమానికి వచ్చిన అతిధులు వెళ్ళిపోతున్నారు. నేనూ వెళ్లాలి కదా? ఐనా, ఆశ్రమం వారికే తిండి పుష్కలముగా 'లేదే! నేను భారము కదా వీరికి? ఏమైనా నేను కదలలేను. ఏవిధంగా నో నేను ఆశ్రమములో ఉండగలిగితే?అనుకుంటూ భోజనానికి వెళ్లాను.


​వంటింట్లో చిన్నస్వామి, రామకృష్ణస్వామి మాట్లాడుకుంటున్నారు. చిన్నస్వామికి ఒళ్లు బాగాలేదు. వైద్యానికి మద్రాసు వెళ్ళుచున్నారు, ఓ రెండు నెలలపాటు. ఈ లోపల శాంతమ్మ వంటచేస్తూ ఆశ్రమంలో ఉంటుందా అని ఆలోచించుకుంటున్నారు. నన్ను చూడగానే అడిగారు, నాకంతకన్నా ఏం కావాలి? కరుణామూర్తి, నా కోర్కెని ఎంత సులభంగా వెంటనే తీర్చారో స్వామి! అంతే, అప్పటి నుంచి ఆశ్రమంలో స్థిరపడి పోయినాను. నేనట్లా ఉండటం భగవానుని ఆజ్ఞగా, ఆయన ఇచ్చగా, ఆయన వరంగా భావించాను.

🪷

*సశేషం*

****

Tuesday, 11 November 2025

రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -1*to 4




*రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -1*

మధుర దగ్గిర వున్న తిరుచులి గ్రామంలో 1879 డిశంబరు 30 తేదీన 'వెంకట్రామన్ పుట్టారు. ఆయనే తరవాత భగవాన్ రమణ మహర్షి అనే పేరుతో విశ్వ విఖ్యాతి పొందారు. ఆ రోజే ఆర్ధదర్శనం పుణ్యదినం.

వెంకట్రామన్ మధురలో మిషన్ హైస్కూల్ లో చదువుకుంటూ వుండగా, తన పదహారో ఏట, ఓసారి ఎవరో అరుణాచలం నించి వస్తున్నానని చెపుతూ వుండగా విన్నారు.. ఆ పేరు ఆ అబ్బాయిని ఏవో స్మృతులలో కలవరపెట్టింది.

పదిహేడో ఏట కొద్ది నిమిషాలలో అతనికి ఆత్మసాక్షాత్కారం జరిగింది, ఒకరోజు అతను ఒంటరిగా మేడమీద కూచుని వుండగా, మృత్యువు సంగతి గట్టిగా మనసులోకి వచ్చింది, చావు అంటే ఏమిటి? అని ప్రశ్నించుకుని, 'ఇదే కదా చావు' అని, చచ్చిపోయినట్టు పడుకుని శ్వాస నాపేశాడు.

(రమణ మహర్షి భాల్య ఆలోచనా

*ప్రశ్నలపరంపరామది ప్రాభవమ్ము*
*మృత్యువు యనగాయేమన మృదువరమగు*
*కాల నిర్ణయంబట్టియు కళలు గాను*
*మృత శిశువుయెవరుయన మృత్యమాయ*

బాల్యంలో రమణ మహర్షికి “నేను ఎవరు?” “మరణం ఏమిటి?” అన్న ప్రశ్నలు కలిగాయి.
వీటి ద్వారా ఆయనకు మరణం అసలు భయంకరం కాదని, శరీరమే చస్తుందని, నిజమైన ఆత్మ నిత్యమని అర్ధమైంది.
ఈ ఆలోచనా వెలుగు ఆయన జీవితాన్ని పూర్తిగా మలిచింది.)
"సరే, ఈ దేహం చచ్చిపోయింది. దీన్ని కాల్చి బూడిద చేస్తారు. దాంతో నేను అంతమేనా? ''నేను'' ఇంకా తెలుస్తోనే వుంది. కనక నేను ఈ దేహం కాదు. నాకు మృత్యువు లేదు" అనుకునేప్పటికి అతని జ్ఞానోదయమయింది. ''నేను" అనేది మనసు ఆలోచనగాక, అది అనుభవమై పోయింది.

త్వరలోనే ఆయన ఎవరితోనూ చెప్పకండా అరుణాచలానికి బైలుదేరి, సరాసరి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి తన తండ్రి అరుణాచలేశ్వరుడి దర్శించుకున్నారు. ఆ నాటి నించి ఆమరణాంతమూ ఆయన అరుణాచలం వదలలేదు. మొదట ఆలయం లోనూ, తరువాత వివిధ ఏకాంత స్తలాల లోనూ, ఆయన సమాధిలో గడిపారు కొన్నేళ్లు.

(*గీ..*శివశివా అరుణాచల సీఘ్ర సేవ*
*బాల్య మౌనదీక్ష ఫలము బ్రహ్మ లీల*
*నిరతము జపము నిత్యము నిర్మలమ్ము*
*శంకరానను బ్రోవరా యని సహజ పూజ*
రమణ మహర్షి బాల్యంలోని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, అరుణాచల శివునితో ఆయన సహజమైన అనుబంధాన్ని సూచిస్తోంది. — చిన్న వయసులోనే అరుణాచలానికి, శివతత్వానికి అతడి మనసు ఎంతో వేగంగా, సహజంగా ఆకర్షితమైంది. — బాల్యంలో వచ్చిన మౌనప్రవృత్తి, అంతర్ముఖత, ధ్యాననిశ్శబ్దం అసలు బ్రహ్మలీల. దేవచైతన్యం అతనిలో సహజంగా వ్యక్తమైంది.
— అరుణాచల నామస్మరణ అతనిలో నిరంతరం నడిచేది. ఆ అంతరజపం అతని మనసును నిరంతరం పవిత్రంగా ఉంచేది.
— శివుణ్ణి “నన్ను రక్షించు” అనే యాచనలా కాకుండా, స్వయంగా శివతత్వమే తన లోనుండి వ్యక్తి — ఇది అతని నిత్య స్థితి.)
:****

త్వరలోనే ఆయన తల్లికి తెలిసివచ్చి ఇంటికి రమ్మని ఎంత ఏడ్చినా ఆయన కదల్లేదు. ఊళ్ళో ఆయన సంగతి తెలిసి, ఆయన ఉపదేశానికై మనుషులు వస్తున్నారు.

సేకరణ.. మల్లాప్రగడ
సశేషం

*రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -2*

1908 లో మహాకవి, పండితులు గణపతి శాస్త్రిగారు స్వామిని సందర్శించి, ఆయన సాక్షాత్తూ సర్వేశ్వరుడని తెలుసుకొని, ఆయననించి ఉపదేశాన్ని అడిగిపొందారు. ఆయనే వెంకట్రామన్ కి 'భగవాన్ రమణ మహర్షి ' అని పేరుపెట్టి ప్రకటించింది. ఆయన మూలంగానే భగవాన్ కీర్తి దేశమంతా వ్యాపించింది.

కవులు మహనీయులు కలసి కళకళకళ
స్థిరము ధనము కీర్తికలిగి సేవబోధ
పుస్తక రచన చేసియు పుడమి నందు
రోగ భాధ నిర్వాణము శోక మగుట
భావవ్యాఖ్య
– జ్ఞానులు, సాహితీవేత్తలు, సద్గురువులు కలిసి ఉన్న చోట
కళకళకళ – జ్ఞానోదయ కాంతి, ఆత్మానంద ప్రకాశం విరజిల్లుతుంది.
–అవరి ధనం భోగబలమో బంగారమో కాదు;
స్థిరమైన జ్ఞానం, సత్కీర్తి, సేవ భావం – ఇవే వారి సొత్తు.
–వారు రచించిన గ్రంథాలు ప్రపంచానికి మార్గదర్శకాలు.
–ఆ గ్రంథాల బోధ అమలు చేస్తేమనసు–బుద్ధుల రోగాలు తగ్గిశోకాలు, లోకవ్యథలు నశించిశాంతి–నిర్వాణ స్థితి సిద్ధిస్తుంది.

1916 లో భగవాన్ తల్లీ, తమ్ముడూ అరుణాచలం వచ్చి ఆయనతో పాటుగా స్తిరపడ్డారు. 1920 లో భగవాన్ తల్లి చనిపోయింది, ఆమె దేహాన్ని కొండమీద నించి తీసుకువచ్చి పాలితీర్థం దగ్గిర సమాధి చేశారు. త్వరలో భగవాన్, ఆయన తమ్ముడు చిన్నస్వామి, శిష్యులూ కొండ దిగి వచ్చి ఆ సమాధి దగ్గిరే స్తిరపడ్డారు. అప్పటి నించి లోకంలో అన్ని దేశాలలోనూ ప్రసిద్ధి కెక్కిన శ్రీ రమణా శ్రమం ప్రారంభమయింది.

ధనం కురిసింది, కీర్తి వ్యాపించింది. తీర్థ ప్రజలవలె దేశ దేశ ప్రజలు ఆయన్ని ప్రతి దినమూ దర్శించుకున్నారు. ఆయన రచించిన పుస్తకాలు ఎన్నో భాషల్లోకి తర్జుమాలైనాయి.

1950 ఏప్రిల్ 14 న రెండు సంవత్సరాలు గా ఆయన్ని బాధిస్తున్న సార్కోమా వల్ల ఆయన నిర్వాణం చెందారు.

రమణ మహర్షి మహాసమాధి (1950) పర్యంతము గురుభక్తి–జ్ఞానోత్కర్షను ఒక పద్యం

*కవులవీ మహనీయుల కలిసిన చోట కళకళంబు వెలుగురంగులన్*
*సేవధర్మము నిలిచిన స్థిరధనంబై కీర్తిసంపద ప్రసరిం చునున్*
*రచన రత్నములై పుడమి యందు రోగశోకాలను వీరే జయింతురన్*
*రమణమౌనమహర్షి రమ్యనిర్వాణ మార్గదీక్ష పతిమొందుగన్*
వరుస భావం
కవులు, జ్ఞానులు, మహనీయులు కలిసి ఉన్న స్థలంలో
జ్ఞానప్రకాశం, ఆత్మానంద వెలుగులు ఉట్టిపడతాయి.
వారి నిజమైన ధనమంటే సేవ, ధర్మం, సత్కీర్తి –
ఇవే వారికి స్థిరమైన సంపదగా ప్రపంచమంతా విస్తరిస్తాయి.
వారు రచించిన గ్రంథాలు రత్నాల్లా ప్రపంచాన్ని వెలిగించాయి;
మనుషుల దుఃఖాలు, రోగాలు, శోకాలు తొలగించే శక్తి వాటిలో ఉంది.
అటువంటి జ్ఞానసంపదలో శ్రేష్ఠుడై రమణ మహర్షి
మౌనదీక్షతో సుందరమైన నిర్వాణమార్గాన్ని ప్రపంచానికి చూపించారు.

సశేషం

రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -3*

.*ప్రస్తావన*

ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థితి ఎట్లా ఉంటుందో, తక్కినవారు గ్రహించలేరు. వారి జీవితపు నడక పద్ధతి కూడా భేదంగా వుంటుంది. అంతేకాదు, ఆ జ్ఞానులలోనే, ఒకరి జీవిత పద్ధతీ, వారు బోధించే సాధనా పద్ధతీ ఒకరినుంచి ఇంకొకరికి వేరుగా ఉంటాయి. వారిలో కొందరు మనుష్యుల మధ్య వుండిపోయి, ఆశ్రమాలలో నివసించి, శిష్యుల్ని తయారు చేస్తారు. కొందరు నిలకడలేకుండా తిరుగు తూ వుంటారు. కొందరు పాడతారు, కొందరు వాదిస్తారు, కొందరు బోధిస్తారు. కొందరు మానులు, కొందరసలు కంటికి కనపడరు, కొందరు రొష్టుపడి ప్రజల ఆగ్రహం వల్ల కంటకబడతారు. కాని, వారికి కంటకం అంటదు.

ఒకే మాట మాట్లాడి, ఒకేచర్య చూసినవారే కొందరు పూజనీయు లై, చివరివరకు మన్ననలందుకుంటారు. కొందరు నిందపడతారు.

విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు వారు కల్పించుకున్నది కాదనీ, వారి మాటల, చేతల, ప్రోద్బలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది. వారి చుట్టూ ఏం జరిగినా, వారికేం జరిగినా వారికి అంటదు. వారు మనుషులకి అర్థంకారు. ఎందుకంటే, మనుషులు మనసులతో ఆలోచించి చేస్తారు. అందువల్ల ఒకరికొకరు కొంతవర కన్నా అర్థమవుతారు, కాని ఈ జ్ఞానులకు మనోనాశనమవుతుంది. అందువల్ల వారి నడకలే వేఱు. వారి జీవిత సందర్భాలలో, సంబంధాలలో పరస్పర విరుద్ధాలెన్నో కనపడతాయి. వారి పనులలో కొన్నింటికి కారణాలు వున్నట్లు కనపడతాయి. కొన్నింటికి కనపడవు. పిచ్చివాడి పనుల లాగో, పొగరెక్కి నిరంకుశుడైన నియంత పనులలాగో తోస్తాయి. వారి పనుల లక్ష్యము వారి నంటవు. నక్కలంక యోగి, తనని సమీపించినవారి గుండెల్లో దభేలని తన్నేవారు. తిరిగి ఎవరూ ఆయనని తన్నరు. తిట్టరు. తన్నులు తిన్నవాడికి బాధా అవమానమూ కాని ఆ యోగిని తంతే, తనని తన్నినట్టు కూడా తెలీదు అతనికి.

అట్లానే భగవాన్ జీవితంలో ఎన్నో విషయాలు అర్ధంకావు - ఆయన ఈ ద్వంద్వాలు దాటిన మహర్షి అనీ, సర్వేశ్వరుడే అని నమ్మనివారికి, ఆయన ఏమాత్రమూ అర్థంకారు, ఆయన మానవా తీతుడు గనక. ఆయనలో కనపడే వైరుధ్యాలకి మానవుల్లో వెతికినట్లు కారణాలు వెతకటం దాని, విమర్శించడం గాని అజ్ఞానం, ఏ మనిషికి, ఏ పరిస్థితికి అవసరమైనట్టు ఆ విధంగా మాట్లాడేవారు ఆచరించేవారు ఆయన.
సీస పద్యం
*చెప్పి చెప్పక నుండి చిత్తము తెలుపుచూ
కర్మబంధము గాను కార్య దీక్ష
ఈశ్వరుని లీల యున్నదా యిచ్ఛతీరగలుగా
అడుగకే తెలుపుచూ ఆశ్రితయగు
విన్న చూసినపని వింతపోకడగాను
ఇష్టము కాదని యిచ్ఛ తెలువు
పిలిచి చీవాట్లగు పెనవేయు బంధము
నీరస్తుడి వలెను నిమ్మకుండు
గీత..
జ్ఞానులకు మనో నాశన జ్ఞప్తి గాను
మనిషి యజ్ఞానతలపులు మాయతీరు
పిచ్చివాడి పనులు తీరు పెనుగు లాట
అర్ధ మావ్వుతూ యర్ధము ఆశ వలదు

🌼 సీస పద్యానికి సరళ భావం
చెప్పి చెప్పకుండ చిత్తమున్ తెలుపుచూ
రమణ మహర్షి ఎక్కువ మాటలు లేకుండానే —
తనంతట తాను మౌనంగా మనసులోని సత్యాన్ని తెలియజేస్తాడు.
కర్మబంధములను కర్మలేనిగ
కర్మ చేసేటట్లే కనిపించినా,
అతనికి కర్మలకు బంధమేమీ ఉండదు.
ఈశ్వరలీలవెల గోచరింపగ నేర్పుచూ
ఈ లోకంలో జరిగేది అన్నీ ఈశ్వర లీల అని
చూడగల దృష్టిని మనకు నేర్పుతాడు.
అడుగకే వాక్యమున్ ఆశ్రయించున్
మనం అడగకముందే
మన ప్రశ్నలకు సమాధానమిచ్చే శక్తి అతనికి ఉంది.
విన్న దృశ్యములు వింతగానే కనుచూ
ప్రపంచంలోని మాటలు, దృశ్యాలను
సాధారణ మనుషుల్లా కాదు — వింతగా, లోతుగా చూస్తాడు.
ఇష్టమెల్ల పేల్పి యిచ్ఛని విడనాడి
అతనిలో స్వీయ ఇష్టాలు లేవు.
అతడు ఇష్ట–అనిష్టాలను పూర్తిగా దాటిపోయాడు.
పిలిచి పెనవేయు బంధములును విరిచి
మానవులను కట్టిపడేసే బంధాలను విచ్ఛిన్నం చేస్తాడు.
నీరసుండై తానే నిశ్చలత గన్
బయటి ప్రపంచానికి అతను భావరహితుడిలా కనిపించినా,
అతడు అంతర్వైఖరితో నిశ్చల జ్ఞానమూర్తి.
🌼 గీత భావం
జ్ఞానుల కార్యమది జ్ఞాననాశ మూర్త్యై
జ్ఞానుల పని — మన అజ్ఞానాన్ని నాశనం చేయటం.
మనుజున్ అజ్ఞాన కర్మ మాయ తీరు
అజ్ఞానంతో మనిషి చేసే పనులు మాయతో నిండివుంటాయి.
పిచ్చివానిచేయు ప్రవర్తనల్లే సత్యం
మన ప్రవర్తనలో చాలావరకు
పిచ్చివాడి చర్యల లాంటివి —
మనం నిజమైనది, అబద్ధమేదో గుర్తించలేం.
అర్ధమై వచ్చునే — ఆశ విడువుమా
ఈ సత్యం అర్థమైతే,
ఆశలు, ఆపేక్షలు వదిలేయడమే మోక్షమార్గం.
*****

తన చుట్టూ ఆశ్రమంలో జరిగే వాటిలో ఆయనకి ఎంతవరకూ సంబంధం వుందో చెప్పలేము. సంబంధం వుండనూ వుంది; ఉండనూ లేదు. లోకంలో జరిగే అనేక అత్యాచారాలకీ, ఈశ్వరుడికీ సంబంధం వున్నట్టా, లేనట్టా? ఆశ్రమాధికారులూ, ఆశ్రమవాసులూ తరచు ఆయనని అడక్కుండానే ఎన్నో చేసేవారు, భగవాన్ కి ఇష్టంకాదని తెలిసి కూడా, ఆ పనులు భగవాన్ కంటనో, చెవినో పడితేనేగాని, భగవాన్ వాటిని నోటీసు చేసేవారు కాదు. గమనించినప్పుడు ఒక్కొక్కసారి పిలిచి చీవాట్లు వేసేవారు. ఒక్కొక్కసారి ఏమీ అనేవారు కారు. చీవాట్లేకాక ఆశ్రమాధికారి వీపుమీద మూడు కర్రలు విరిగాయని భగవాన్ అన్నట్లుగా చెప్పుకునేవారు. ఆశ్రమాధికారి మాత్రం భగవాన్ కంట పడకుండా, నిరంతరం నేరస్థుడి వలె ఇటూ అటూ తప్పుకు తిరిగేవాడు.

సశేషం

*రమణ మహర్షి...భగవాన్ స్మృతులు -4*

భగవాన్ని దర్శించవచ్చినవారు ఆశ్రమంలో జరిగే అనేక ఘోరాలు, అన్యాయాలు, పక్షపాతాలు, డబ్బు గుంజడాలు… ఇవి భగవాన్ తో చెప్పితే, "మీరు ఎందుకు వచ్చారు? ఈ ఆశ్రమంలో జరిగే లోపాల్ని యెంచి సంస్కరించేందుకా అంతదూరం నుంచి వచ్చారు? మీ దేశంలో ఏమీ లేదా సంస్కరించేందుకు? మీరు వచ్చిన పని ఏదో అది చూసుకొని వెళ్ళరాదా?” అనేవారట.

ఆశ్రమ ధనం దుర్వినియోగమవుతోందనీ, ధనార్జనే ముఖ్యంగా వుందనీ భగవాన్ తో అంటే, “వాళ్లు ధనం కోసం చేరారు. నీకూ ఆ ఆశ ఉంటే వాళ్ళలో చేరి చూడు, భాగం పెడతారేమో!” అన్నారట.

తన పేర నెల నెలా వసూలవుతున్న ధనం యెట్లా వినియోగమౌతోందో భగవాన్ పట్టించుకోలేదు. తన పేర యాచించడం భగవాన్ కి యెన్నడూ ఇష్టంలేదు. లక్షలు ఖర్చుపెట్టి కట్టించిన ఆశ్రమాలయానికై యాచించపోతే, గట్టిగా నిషేధించారు భగవాన్. కాని, విన్నదెవరు?

అయినా, తన ఆజ్ఞను మీరి చందాలు పోగు చేసి కట్టిస్తున్న ఆలయాన్ని, అర్ధరాత్రులు భగవాన్ టార్చి వేసుకొని రాళ్ళన్నీ పరీక్షించేవారట. అంతాతయారైన తరువాత ఓరాత్రి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన శ్రీచక్రంపైన చెయ్యి వుంచి పదినిమిషాలు నుంచున్నారట. కుంభాభిషేకం మొదలైన పూజలన్నింటికి అభ్యర్థనపై మౌనాధ్యక్షత వహించారు.

డబ్బు సేకరణలు వద్దు డప్పు కొట్టు రాసిన పద్యానికి అనుగుణంగా, రమణ మహర్షి దినచర్య – సరళ భావం ఇక్కడ అందిస్తున్నాను.
ప్రతి పాదం అర్థం స్పష్టంగా, సులభంగా ఉండేలా వివరించాను.*
*చున్న కార్యకర్తలు చేష్ట చూపు లన్ని*
*వ్యర్థ మేయగు విధమున వ్యక్తి యగుట*
*రమణ కిష్టమన్నది లేదు రకము తీరు*

*ఒకనొక విధముగా నుండి నోర్పు జూపి*
*తగువిధాన సేవలుజేసి తప్పు నొప్పు*
*తెలియ వని పలుకేనమ్మి తిరుగు జనులు*
*పూల దండలు వద్దని పుడమి పూజ*
🌼 సరళ భావం
రమణ మహర్షి మాటలో –
డబ్బు సేకరించడానికి, పేరుప్రచారం కోసం డప్పు కొట్టడానికి ఆయన ఒప్పుకోరు.
ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలు చేసే చూపరికాలు, ఆచార ప్రదర్శనలు కూడా
ఆయనకు ఇష్టం కాదు.
అనవసరమైన హోదాలు, పదవులు, పేరుప్రతిష్టలతో వ్యక్తిగా ఎదగడం
అతనికి అసలు ఇష్టం కాదు.
ఈ రకమైన ప్రవర్తన రమణ మహర్షి ధర్మానికి అనుగుణం కాదు.
మనిషి తన విధిని నిశ్శబ్దంగా, సహనంతో చేయాలని ఆయన బోధ.
సేవ చేయాలి—కానీ చూపు కోసమో, ఫలితం కోసమో కాదు.
తప్పు చేసినపుడూ అహంకారం లేకుండా దాన్ని అంగీకరించాలి.

తెలిసినట్లు నటిస్తూ తిరిగే మనుషులు చాలా మంది.
పూల దండలు, అలంకారాలు, ఆడంబరాల పూజలు ఆయన వద్దు అన్నారు.
ప్రపంచం ఇచ్చే బాహ్య పూజలకన్నా
మనసులోని మౌన పూజనే ఆయన ప్రాముఖ్యమిచ్చారు.

పూజలూ, ఊరేగింపులూ, ఉత్సవాలు - ఏవీ లక్ష్యం లేవు భగవాన్ కి, ముఖ్యంగా తనమీద పువ్వులు వెయ్యడం, తన ముందు కొబ్బరికాయలు కొట్టడం, హారతు లివ్వడం మొదలైనవి ఇష్టంలేదు. పుట్టిన జయంతి చేసినా, చేస్తున్నారు గనుక చూస్తూ కూచునేవారు, కుచోమంటే. ఆయనా దేవతా విగ్రహాల కిచ్చిన హారతి తెచ్చి ఇస్తే అందరికి మల్లేనే కళ్ళ కద్దుకుని, విభూతి పెట్టుకునేవారు.

ఆయన జబ్బుగా వున్నప్పుడు ఆయన ఆయుస్సు కోసం గ్రహశాంతి, హోమాలు చేశారు. దాంట్లో వుండే Anomaly ఏమీ తోచలేదు, ఆయన ఆయుస్సు కోరేవారికి. ఆ హోమాల, హారతులు తీర్థం తీసుకున్నా రాయన.

తనకు జబ్బు చేస్తే, మందు అవసరం లేదంటారు భగవాన్. కాని, భక్తులు దిగాలు పడ్డా, మందు తీసుకోమని బతిమాలినా, "సరే, తెండి" అని, ఏ మందిచ్చినా అట్లా మింగుతూనే వుండేవారు.

వచ్చిన ప్రజలు సాష్టాంగపడి నమస్కరించే వారు. కాని, భగవాన్ తల తిప్పి కూడా చూసేవారు కారు. కాని, ఎందుకో ఎప్పుడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్న వారు కాస్తా, చప్పున తనకి నమస్కరించే వారి వంక చూసేవారు. ఒక్కొక్కరిని పలకరించే వారు కూడా. నవ్వేవారు. ఎన్నో కుశల ప్రశ్నలు వేసేవారు, దూరదేశాల నించి వచ్చిన వారిని, పసి పిల్లలని, నడవలేని వృద్ధుల్ని ప్రత్యేకంగా చూసేవారు.
🪷
సశేషం

*

*గౌరవలీయులైన వెంకటాచలం  గారు కి కృతజ్ఞతలతో లోగడ రచించిన భగవాన్ స్మృతులను, ప్రాంజలి ప్రభ సభ్యులకు సేకరించిన కథను అందచేయాలని సంకల్పం ఆ అరుణాచలేశ్వరాయ నమః పరమేశ్వరుని కృపా కటాక్షాలు అందరికీ అందాలని 

ఓం నమఃశివాయ.. అరుణాచలేశ్వరాయ నమః

నమోనమః సర్వేజనాసుఖినోభవంతు*


Thursday, 6 November 2025

 


1)అక్షయపాత్ర:

     పాండవులు అరణ్యవాసమునకు వెళ్ళు

నపుడు వారితో పెక్కుమంది బ్రాహ్మణులు

కూడ వెళ్ళిరి.వారకి భోజనము సమకూర్చు

టకై ధర్మరాజు పురోహితుడగు ధౌమ్యుని సలహాపై సూర్యుని భక్తితో ప్రార్థించెను.

    సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు అక్షయ

పాత్రనొసంగెను.అందు ఏ కొంచెమువండినా

అది అక్షయమగు చతుర్విధాహారములు

అనగా భక్ష్య,భోజ్య,చోష్య,లేహ్య పదార్థము

లగునని తెలిపెను.ద్రౌపది ఆపాత్ర మహిమ

చేతనే అరణ్యవాసకాలమున ఎల్లరకూ భోజ

నమును సమకూర్చగలిగెను.

  అక్షయమనగా తఱుగనిది.తఱుగని స్థితి

గల ప్రదేశము లేక వస్తువును "అక్షయపాత్ర"

అందురు.                      

  శిష్టాచారకుటుంబములలో గృహిణి.తాను ఆన్నము వండబోవు పాత్రలో  "అక్షయం, అక్షయం" అంటూ ముందు బియ్యపుగింజ

లను వేసే ఆచారము నేటికిని కలదు.


  నిత్యవ్యవహారభాషలో  ఉదాహరణ:

  "ఆంధ్ర కోస్తాతీరము వరిపంటకు అక్షయ

    పాత్రయే"


సూక్తి---2               

                        .       

"ఏకం సత్ విప్రాః బహుధా వదంతి"

   *************************

  మంత్రం:                 

   ఇంద్రం మిత్రం అగ్నిం వరుణం ఆహుః

   అథో దివ్యః ససుపర్ణో గరుత్మాన్

   "ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి"

   అగ్నిం యమం మాతరిశ్వానం ఆహుః ౹౹

  

   భావము : పరబ్రహ్మమును   ఇంద్రుడు,   సూర్యుడు,వరుణుడు,అగ్ని,గరుత్మంతుడు,యముడు,వాయువు అని చెప్పుచున్నారు.

వివేకవంతులు పలు విధములుగ తెలియ

జేసీనను సత్యమొక్కటే , పరమాత్ముడు

 ఒక్కడే.

  ఇది ఋగ్వేదమంత్రము,ఎవరు ఏపేరుతో

పూజించినా, భగవానుడు ఒక్కడే అని

తెలుపుటకు ఈసూక్తిని ఉట్టంకిస్తారు.

   శ్రీకృష్ణపరమాత్మ గీతోపదేశజ్ఞానయోగ మున ఇదే విషయమును వెల్లడించుట విశే

షము.

    యే యథా మాం ప్రపద్యన్తే

    తాంస్త ధైవ భజామ్యహమ్ ౹

    మమ వర్త్మాను వర్తన్తే

    మనుష్యాః పార్థ సర్వశః ౹౹

నన్ను ఆశ్రయించిన వారెల్లరకూ,వారాశ్ర

యించెడి పద్ధతి ప్రకారము ఫలములను

ప్రసాదింతును.ప్రతివాడు అన్ని విధముల

నా మార్గమునే అనుసరించును.

  సనాతన భారతీయధర్మము  "ఎవరు ఏ రూపమున ఏవిధముగా పూజించినను అది

పరమాత్మునికే చెందును" అని తెలియజే

స్తుంది.ఇది ఏ కుల,మతములకు చెందినది

కాదు.సకలప్రాణికోటి ఆచరించుటకు దేవాది దేవునిచే నియమితమైన శాశ్వతధర్మమిది

  ఎవరు ఏ పేరుతో ఏ రూపమును పూజిం 

చినా అది పరమాత్మునికే చెందునని అంత

రార్థము.

    " దేవుడు ఒక్కడే" అను భావన భారతీయ

సనాతనధర్మవిశిష్టత.నేడు విశ్వవ్యాప్తమైన

అన్ని మతాల కంటె కొన్నివేల సంవత్సరాల

ముందే భారతీయసంస్కృతి,సనాతనధర్మా

చరణ ఏర్పడుట గమనార్హము.

******


2)అగస్త్యభ్రాత: అగస్త్యమహర్షి సోదరుడు

తల్లిగర్భమునదే జ్ఞానమును పొందిన గొప్ప

వాడు..అరణ్యవాసమున సీతారామలక్ష్శ

ణులు ఆయన ఆశ్రమమును దర్శించి,వారి

ఆశీస్సులను పొందిరి.కాని రామాయణమున

ఎక్కడా ఆయన పేరు కనిపించదు.కేవలము

అగస్త్యభ్రాతగ ఆయన ప్రసిద్ధుడు.

   ప్రతిభావంతుడైయుండియు,స్వయముగ

గుర్తింపులేక గొప్పవారితో గల బంధుత్వము

లేక సంబంధముతో చలామణి అగు వానిని

"అగస్త్యభ్రాత" అంటారు.పాండురంగమహా

త్మ్యకావ్యములోని నిగమశర్మ అక్కపాత్ర

కూడ అలాంటిదే.డాక్టరుగారి భర్త,చైర్మన్

గారి సోదరుడు వంటి గుర్తింపులు ఇట్టివే.

   నేడు పెక్కుమంది రాజకీయనాయకుల

బంధువులు అగస్త్యభ్రాతలే.


  సూక్తి---3

  "జగతః పితరౌ వందే పార్వతీపరమశ్వరౌ"

     ******************************


        శ్లో : వాగర్థావివ సంపృక్తౌ

                వాగర్థ ప్రతిపత్తయే ౹

               " జగతః పితరౌ వందే

                పార్వతీపరమేశ్వరౌ ౹౹ "

    భావము : వాక్కు,అర్థములవలె కలసి

యున్న ఆదిదంపతులు పార్వతీపరమేశ్వ

రులకు నమస్కారము.వాక్కులు,అర్థముల

పరిజ్ఞానమును పొందుటకై వారిని ప్రార్థిస్తు న్నాను.                                              

     మహాకవి కాళిదాసు రచించిన రఘువంశ

కావ్యప్రారంభదేవతాస్తుతి యిది.వాక్కు,అర్థ ముల అవినాభావసంబంధమును మహాకవి

జగత్పితరులైన పార్వతీపరమేశ్వరుల అర్ధ

నారీశ్వరరూపంతో పోల్చుట ఎంతో మహో న్నతభావన.

    శబ్దార్థాల పొందిక పార్వతీపరమేశ్వరుల

ఏకత్వం వలె రమణీయంగ,మహిమాన్విత

ముగ ఉండాలనే కాళిదాసు సందేశము రచ

యితలెల్లరకూ శిరోధార్యము.

  ఎఱ్ఱనగారు "హరివంశ" ఉత్థరభాగసప్తమా శ్వాసమున ఉషానిరుద్ధుల పరస్పరానురాగ 

మును వివరిస్తూ సందర్భోచితంగ ఊషాదేవి చూచిన ఆదిదంపతుల అర్ధనారీశ్వరస్వరూ పమును వర్ణించినతీరు చిరస్మరణీయము.

 సీ౹౹కంఠకాళిమ తన కంఠంబునకు నూత్న

                                  కస్తూరికాదీప్తి విస్తరింప

      నౌదలఁ జందురు డమృత బిందులఁ దన

              యలకలఁ జిన్ని పువ్వులను దొడుగ

      నవతంస నిశ్వాస  మల్లనఁ దనఁ యవ

               తంసోత్పలమునకుత్కంపమొసగ

       నంగద మణిదీప్తులలమి యొప్పగు తన

                    భుజముల కాంతికిఁ బ్రోది సేయ

     తే౹౹గడక పరమేశ్వరుడు దన్ను కౌగలింప

          నతని దోర్మధ్యసరసి నోలాడుచున్న

          ఘనతర స్తనచక్రవాకముల నలరు

          నంబనసురేంద్ర కూతురింపారఁ గనియె

   కాళిదాసుమహాకవి వాగర్థములను ఉప మింపజేసిన శివపార్వతులర్థనారీశ్వరులు. వారి నిత్యసర్వాంగీణసంయోగశృంగారము

ఎఱ్ఱనగారి వర్ణనలో వాచ్యంగాలేదు,ధ్వనిస్తు

న్నది,ఎక్కడా అనౌచిత్యము లేదు.

  కంఠాలు రెండూ కలసినవి.శివకంఠకాళిమ

శివాకంఠకస్తూరిని విస్తరిస్తున్నది.చంద్రరేఖ

ద్రవించే అమృతబిందువులు చిన్నిపువ్వు

లుగ అలంకారాలను గూర్చుతున్నాయి.

ఆవతంసనిశ్వాసము బహుశా సపత్నీభావ

ములో గంగ నిట్టూర్పుపార్శ్వ కర్ణోత్పలాన్ని

కంపింపజేస్తున్నదీ.శివుని భుజాంగదకాంతి

దేవి భుజకాంతిని ప్రోదిచేస్తున్నది.

  ఇందలి రెండు, నాలుగు పాదాలలో భర్త అలంకారములే పార్వతి అలంకారములు.

శివుని భుజాంతరమన్న సరస్సులో ఘనతర

స్తనచక్రవాకములలో అంబ ఉన్నది.సరస్సు,

చక్రవాకముల  నిత్యసహజసంబంధముపై

పార్వతీపరమేశ్వరుల శృంగారము ఆరోపి

తమగుట అత్యంత ఔచిత్యశోభితము.

  అట్టి అర్ధనారీశ్వరస్వరూపముతో ఉపమా నము ఎంతటి ఔచిత్యవంతమో!.

     విశ్వసాహిత్యములోని ఏ ఇతర భాష లోను ఇంతచక్కని సామ్యముగల ఉపమా నము మఱొకటి లేదేమో!అందుకే " ఉపమా కాళిదాసస్య"  అని ప్రస్తుతి.

****†

   అక్షతలు : శ్రేష్ఠమైన బియ్యము,పసుపు,

కుంకుమలను నేతితో కలిపి అక్షతలను

తయారు చేస్తారు..అక్షతలు ఆనగా క్షతము

కానివి,అంటే నాశనము లేనివి,శుభంకర

మైనవి.వివాహసమయములో వధూవరులు

ఒకరి తలపైనొకరు దోసిళ్ళతో  పోసుకొనే

అక్షతలను తలంబ్రాలు అంటారు.అనగా

తలపై జల్లెడి ప్రాలు  (బియ్యము) అని 

అర్థము.అన్ని శుభకార్యాలలో పెద్దలు

చిన్నవారిపై అక్షతలను చల్లి దీవిస్తారు.

వాడుకలోనివి అక్షింతలుగ మారినవి.ఈ

"అక్షింతలు" పదము నిందార్థమున వాడ

బడుచున్నది.అద సరికాదు.                    

*****

           పరమాత్మే జీవాత్మ 

                సూక్తి---4   

     ఏకః పరాత్శా బహుదేహవర్తీ

     ** ***

శ్లో : మృత్పిండ మేకం బహుభాండ రూపం

       సువర్ణ మేకం బహు భూషణాని

       గోక్షీర మేకం బహుధేను జాతం

       ఏకః పరాత్మా బహుదేహ వర్తీ ౹౹


  భావము: వివిధ పాత్రలుగా రూపొందునట్టి

మట్టి ఒక్కటే . పెక్కు ఆభరణలుగా భాసిల్లు

బంగారమొక్కటే.ఎన్నో వర్ణముల గోవుల నుండి తీయబడిన పాల రంగు ఓక్కటే.

    అన్ని జీవుల దేహములలో భాసిల్లు "పరం

 జ్యోతి" ఒక్కటే.

   భారతీయసనాతనధర్మం పునర్జన్మసిద్ధాం

తమును ప్రతిపాదించినది.ఎందఱో చిన్నా

రులు తమ పూర్వజ్ఞానముతో తెలియజేసీన

గతజన్మవిశేషములు వాస్తవములుగ నిరూ

పించబడుట తెలిసినదేకదా!  భగవద్గీతా సందేశము కూడ ఇదే.

  " జాతస్యహి ధ్రువో మృత్యుః

    ధ్రువం జన్మ మృతస్య చ "


       పుట్టినవానికి మృత్యువు తప్పదు,మర

ణించినవానికి పునర్జన్మ తప్పదు.అన్ని జీవు లలో వెలిగే పరంజ్యోతి ఒక్కటే కావున పున

ర్జన్మ వ్యక్తి పాప,పుణ్యకర్మలను బట్టి ఏ జీవి రూపమైనా కావచ్చును.ఇట్టి కథలెన్నో పురా

ణేతి హాసములలో కనుపించును.

  సనాతన సంస్కృతి మానవునకు సత్ప్రవ ర్తన పునర్జన్మదృష్ట్యా ఎంత ముఖ్యమో తెలి యజేసినది.

        అర్థా గృహే నివర్తంతే

        శ్మశానే మిత్ర బాంధవాః~\°

        "సుకృతం దుష్కృతం చైవ

        గచ్ఛంత మను గచ్ఛతి"౹౹


  వ్యక్తి మరణం తరువాత అతని సంపదలు ఇంటిలోనే ఉండిపోతాయి.బంధు,మిత్రులు శ్మశానము వరకు మాత్రమే వచ్చి. వెళ్తారు.   

     " మరణించిన వ్యక్తీ పాపపుణ్యములు

మాత్రమే  జన్మాంతరమునకు  వెంటనంటి

వస్తాయి."

  ఈ విశ్వాసమే వేలాది సంవత్సరములు

మన సమాజధర్మవర్తనకు పునాది యైనది.

4) అగ్రతాంబూలము

    **************

    ఒక సభలో శుభకార్యసందర్భమున తాంబూలములను పంచునపుడు మొదటి

తాంబూలాన్ని అచటనున్న వారిలో ప్రముఖ

 వ్యక్తికి గౌరవసూచకముగా సమర్పించే సంప్ర

దాయమున్నది.ఇట్టి తొలి తాంబూలమునకు

అగ్రతాంబూలమని పేరు.

  ధర్మరాజు యొక్క రాజసూయయాగసభలో

ఆగ్రతాంబూలానికి శ్రీకృష్ణుడు తగినవాడని

భీష్ముడు సూచించగా,శిశుపాలుడు అతనిని

యాదవుడంటూ అధిక్షేపించి నిందించుటచే, 

శ్రీకృష్ణుడు అతనిని సంహరించాడు.

   భాస్కరరామాయణకర్త "హుళక్కి"భాస్కరు

నకు రాజసభలో అన్నిశుభకార్యాలలో అగ్ర

తాంబూలము లభించేదట.తాంబూలానికి

"హళిక" పర్యాయపదము.అగ్రతాంబూల కారణంగ ఆయన పేరు"హళకి భాస్కరుడై" వ్యవహారభాషలో "హుళక్కి భాస్కరునిగ" మార్పుచెందినది.హుళక్కి అంటే శూన్యము.

     సభలో అగ్రతాంబూలము పొందటము

మర్యాదకు,గౌరవమునకు,శుభానికి సంకే

తము.


    5 )       ధ్యానమే ప్రధానము

******

   సూక్తి--5 , "కోటిం త్యక్త్వా హరిం భజేత్"

 **************

శ్లో :  శతం విహాయ భోక్తవ్యం

         సహస్రం స్నాన మాచరేత్

         లక్షం విహాయ దాతవ్యం

         కోటిం త్యక్త్వా హరిం భజేత్ ౹౹

  భావము : వంద పనులున్నా మానుకొని

వేళకు భోజనం చేయాలి.వేయి పనులున్నా

విడచి స్మానం చేయాలి.లక్షపనులున్నా పరి

త్యజించి దానం చేయాలి.కోటి పనులున్నా

యవదలిపెట్టి భగవంతుని ధ్యానించాలి.

  "శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్" సకల

ధర్మాల సాధనకు శరీరారోగ్యమే మూలము.  వేళకు భోజనము చేయుట దేహారోగ్యము

నకు అవసరము.

 స్నానము శారీరక ఆరోగ్యమునకు,మాన

సిక శుచిత్వమునకు తోడ్పడును.కనుక

స్నానము భోజనముకంటె ముఖ్యము.

  దాతృత్వము పుణ్యదాయకము.జీవుల

జన్మపరంపరలో దాతృత్వపుణ్యము వెంట

వచ్చి మేలును చేకూర్చును పూర్వకాలమున

కొందఱు నైష్టికులు అతిథి లేకుండ భోజనం

చేసెడివారు కారు.

  పైనపేర్కొన్న అన్నింటి కన్నా భగవధ్యానం అతి ముఖ్యమైనది.భగవధ్యానమనకు దేవాలయప్రవేశము,విగ్రహపూజలే అవసరం

కాదు."జ్ఞానినాం సర్వతో హరిః, ,"ఎందెందు

వెదకి చూచిన అందందే కలడు చక్రీ" అను

ప్రహ్లాదుని భక్తిభావము గమనార్హము.

  "ఆర్యధర్మగ్రంథము"లోని ఈ సూక్తి భగవ ద్భక్తి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.


5)అజగరోపవాసము

   ****************

   అజగరమంటే కొండచిలువ.అది ఎప్పుడూ

 ఉపవాసముండదు. ఏదైనా జంతువును

మ్రింగిన తరువాత,తన జీర్ణాశయములో ఆ జంతువు శరీరము పూర్తిగ జీర్ణమగు వరకు నింపాదిగా చుట్టుకొని కదలికలు లేకుండా చూచుటకు ఉపవాస దీక్షలో ఉండినటుల భ్రమింపజేస్తుంది.

    "అజగరోపవాసము" అంటే మోసపుదీక్ష.

 "బక ధ్యానము"  కూడ ఇట్టి భావాన్విత

                                          పదబంధమే.

6) అజాగళస్తనము :

       మేక గొంతునుండి వ్రేలాడే చన్నుకు అజా

గళస్తనమనిపేరు.ఇది అలంకారప్రాయము,

నిరుపయోగము,వ్యర్థమైన ఈ మేకచన్నును

సృష్టించటం చేతనే బ్రహ్మదేవునికి భూలోక

మున పూజలు జరుగుట లేదని ఒక కవి వ్యంగ్యంగ అధిక్షేపించటం విశేషము.ఒక వస్తువు లేక విషయము నిరుపయోగము అనుటకు ఈ జాతీయమును వాడుతారు.

                 సూక్తి--7

                 *******

              మాతృదేవోభవ

      ॐॐॐॐॐॐॐॐॐॐ

  శ్లోకము : మాతృ దేవోభవ

                  పితృ దేవోభన

                  ఆచార్య దేవోభవ

                  అతిథి దేవోభవ

                                         .

భావము;"తల్లియే దైవముగా పూజింపుము"

                తండ్రియే దైవముగ పూజింపుము.

                గురువే దైవముగ పూజింపుము.

                అతిథిని దైవముగ పూజింపుము

      కృష్ణయజుర్వేద తైత్తరీయోపనిషత్ లోని మంత్రమది.ఇందలి నాలుగు చరణములును

నాల్గు ప్రసిద్ధసూక్తులే.

   "జన్మనిచ్చిన తల్లి ప్రత్యక్షదైవము.తల్లిని

మించిన దైవము లేదు" అని తెలుపు వెరొక

సూక్తి ప్రసిద్ధము.

         " న మాతుః పరదైవతమ్ "



    శ్లో : నా౽ న్నోదక సమం దానం

           న ద్వాదశ్యాః పరం వ్రతం

           న గాయత్ర్యాః పరం మంత్రం

          " న మాతుః పరదైవతమ్"