రమణ మహర్షి..భగవాన్ స్మృతులు - *5
🪷
అధికారులు, బిచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, రూపవంతులైన స్త్రీలు ఎవ్వరూ ఆయన దృష్టిని తీసుకోలేక పోయేవారు. కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి, అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికే వారు కారు, ఒకర్ని పిలిచి పలకరించి, ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా, తనని పలకరించగానే కసిరి కొట్టేవారు. కొందర్ని గట్టిగా తిట్టేవారు హాస్యం పట్టించి, వెక్కిరించి, అందరూ నవ్వేటట్లు చేసేవారు.
సీసపద్యం
కసిరి కొట్టి కనులు కథలుగా తిప్పియు
నవ్వించి నవ్వుతూ నటన జూప
కలలోన కనిపించ కలవరించి పిలవ
కొందర్ని చూడక కోప భావ
భక్తుని యాకృతి బంధము నో ర్పుగా
భావభవపలుకు భయము తొలగ
వచ్చి వేచిన కోప వాక్కులు తీరుగు
నమ్మిన వారికి నమ్మ పలుకు
గీత
విషము కన్న మూర్ఖ చెలిమి విషము యగుట
తెలిసి నడవ గలుగు తీరు తెలప గోరు
సూరి జనుల సుస్నేహము సూత్ర మగుట
అమృత తుల్యమౌను పలుకు నవిని లోన
🌼 సీస పద్యం – సరళ భావం
**
కొంతమంది చిన్న చిన్న మాటలతో, కనులతో సంకేతాలతో
నవ్వులు రేపుతూ, నటిస్తూ ప్రవర్తిస్తారు.
కొందరు మనసులో, కలల్లో కనిపించి
మనలను కలవరపరిచే వారు ఉంటారు;
కొందరిని మాత్రం చూడాలని అనిపించదు—పరిచయం కోపమే తెస్తుంది.
భక్తుడు ఈ బంధాలన్నిటినీ సహనంతో భరిస్తాడు;
భగవద్భావం అతని హృదయంలో నిలిచితే
అన్నిటి భయాలు తొలగిపోతాయి.
ఎవరైనా కోపంతో వస్తే,
భక్తుని సమక్షంలో ఆ కోప పెల్లుబికిన మాటలు కూడా తగ్గిపోతాయి.
సత్యంగా నమ్మిన వారికి మాత్రమే
అతను నిజమైన మాట చెప్పుతాడు.
🌼 గీత – సరళ భావం
మూర్ఖుడితో స్నేహం —
విషం కంటే ప్రమాదం.
జీవితంలో ఎవరి వెంట నడవాలో,
ఎవరి నుండి దూరంగా ఉండాలో తెలుసుకొని ఉండాలి —
కొందరికి అది నేర్పాలి.
పండితులు, జ్ఞానులు, మంచివారి స్నేహం
ప్రాణాధారం లాంటి గొప్ప సూత్రం.
వారి మాటలు —
అమృతంలా మనసులో తేలికగా, శాంతిగా ప్రవహిస్తాయి.
కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తరువాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా, ఆ భక్తుడికే యెంతో నిలువ లేని ఆతృత కలుగుతుంది, భగవాన్ని యెప్పుడు చూస్తానా అని, దూరాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఏదీ లక్ష్యం చేయక యెప్పుడు యెప్పుడు అంటూ వస్తాడు ఆశ్రమానికి. అతను వచ్చేప్పటికి భగవాన్ తల రెండో వైపు తిరిగి ఉంటుంది, అటు చూడరు, పలకరించరు. చిరునవ్వు నవ్వరు కొన్ని రోజులు. ఈలోపల యెందర్ని పలుకరిస్తారో ప్రేమగా పిలచి, మాట్లాడి, కుశల ప్రశ్నలు వేస్తారో!
కొందరు వుండేవారు. వారికి అందరి ముందూ భగవాన్ తో మాట్లాడడం గొప్ప. అందరి వంకా చూస్తూ, ఏవో కాయితాలో పుస్తకమో పట్టుకుని, ఏదో సందేహాన్ని కల్పించుకుని వెళ్ళి భగవాన్ని పలకరించి మాట్లాడతారు- మధ్య మధ్య చుట్టూ వున్న వారి వంక గర్వంగా చూస్తూ అంత స్వల్పమైన విషయాన్ని యెంతోసేపు మాట్లాడతారు, వాళ్ళతో భగవాన్, దూరం నుంచి వచ్చి; త్వరలో వెళ్ళవలసిన ఇంకోరు తమ సందేహాలతో రోజులకి రోజులు వుండిపోవలసిందే. యెవ్వరికేది అవసరమో, ఏది వారిని తనకి కట్టి వేస్తుందో, ఏది వారి అహాన్ని అణుస్తుందో ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా.
సశేషం..
*006
ఆశ్రమంలో తనకి ఇష్టంలేని పని కాని, తను వద్దన్న పని కాని జరుగుతూ వుంటే, పిలిచి చీవాట్లు వేసేవారు. కాని, అప్పటికి వినకపోతే మాట్లాడకుండా వూరుకొనే వారు. చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలూ అజ్ఞలూ పెట్టేవారు ఆశ్రమాధికార్లు.
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా భగవాన్ని ఎవరూ చూడకూడదని టైమ్ నిర్ణయించి, భగవాన్ని అడగకుండానే హాలు తలుపులు వేయించి వేశారు.
భగవాన్ “ఇదేమిటి?" అని అడిగితే, "మీ ఆరోగ్యము కోసం” అన్నారు. తలుపులు ముయ్యడానికి వీల్లేదనీ, 24 గంటలూ తలుపులు తెరిచి వుండాలనీ భగవాన్ అన్నా కూడా వినిపించుకోలేదు అధికార్లు. అందుకని ఆయనే హాల్లోంచి బైటికి వచ్చి కూర్చున్నారు. కాని, అప్పటికీ ఆశ్రమం వారు ఆయన మాట వినలేదు. ఒకటే బతిమాలారు, చివరికి అట్లాగే కానీ అని హాల్లోనే వుండిపోయినారు భగవాన్.
*****
ఏదో జరుగుతోంది ప్రపంచమంతా
కారుమేఘాలుకమ్మి మూసుకు పోతోంది! లోకం తీరు ఇదేనా?
సముద్రాలు పొంగి మంచుకొండలు కరిగి అగ్నిపర్వతాలు పగిలి ఏదో విలయం! కనవస్తున్నది ఇందుకు కారణమేమి?
కల్లోల స్వప్నాలు వికృత రూపాలు భూత నృత్యాలు ఏమిటిదంతా? నాకేనా లేదా అందరికా..?
ఇది యుగాంతమా? కొత్త యుగానికి ప్రారంభమా?
అంతమే ఆరంభమా? ఎం చెప్పలేను శివా?***
అనేకమంది భగవాన్ కి ఫలహారాలు తెచ్చి పెట్టేవారు, వేళగాని వేళల కూడా ఆయనకి అవి జీర్ణమవుతాయా, లేదా అనే ఆలోచన కూడా లేకుండా. చాలాసార్లు అవి తిని బాధపడేవారు భగవాన్. ఒకరు యెంత తెచ్చిపెట్టినా తినేవారు. ఇంకోరు యెంతో భక్తితో విలువైన ఫలహారాలు తెచ్చిపెట్టి తినమంటే అటు తల త్రిప్పి కూడా చూసే వారుకారు. కొందరు ఆయన ముందు ఫలహారం పెట్టి, ఆయన పలక్కపోతే, అట్టానే చేతులు కట్టుకుని నించుని నించుని, ఇంక గతిలేక వెళ్లిపోయేవారు. ఒకరి చేతినుంచి ఇవాళ తిని ఇంకోసారి వాళ్లు తెస్తే, వాళ్ల వంక చూడనే చూడరు.
సశేషమ్.. చలం.. సాహిత్యం మల్లాప్రhగడ
[23/11, 06:58] Mallapragada Ramakrishna: 007
భగవాన్ ప్రవర్తన ఎప్పటికప్పుడు మారేది. ఆయన ఏ అనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు, ఆయన ధ్యానముద్రలో కూచున్న సాక్షాత్ దక్షిణా మూర్తి అనిపించేవారు. పోజు లేని ఆ శాంభవీ ముద్ర ఎంతో ఆర్టిస్టిక్ గా వుండేది! ఆ అందంనించి కళ్లు తిప్పుకోలేకపోయే వాళ్లం, కదలని మారని సూర్యోదయాన్ని చూసినట్లుండేది. ఆయన ' ముఖంకాని, ఆయన దేహంకాని, మామూలుగా అందాలు అలవాటైన నా కళ్ళకి, అందంగా కనపడేవి కావు. కాని, ఆయన నిశ్చలంగా, గంభీరంగా కూచున్నారా-(ఆయన దేహం అట్లాగే వుండేది,) కాని, మరి ఏమిటో యింత అందం, ఇంత లావణ్యం! అవేంకాదు; ఏదో మనకు అలవాటైన సౌందర్యాలకి art కూడా అందుకోలేని దేదో ఆయన్ని వెలిగిస్తున్నట్టుండేది. ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన, చక్రవర్తి దుకూలాలు కట్టుకుని, రాజలాంఛనాలతో, నవరత్న సింహాసనంపై కూచున్నట్లుగా వుండి దిగ్భ్రాము చెందేవాళ్లం, ఆ స్థితిలో నైనాసరే, ఎవరన్నా "భగవాన్!" అన్నాడూ -ఎక్కడనించి దిగివచ్చేదో ఆయనకి ఈ లోకస్మృతి. కాని సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగిరావడమేముంది!
*****
జరిగే యుద్ధాలు
భీకర దాడులు
ఉల్కా పాతాలు
ఒక ప్రళయం! అని యెంచ లేకున్నాను ఎందుకు?
ఆకాశవాణి పలుకులు
భయపడకండి!
అంతమే ఆరంభం!
ఇది కొనసాగింపు! కొత్త పోకడలు ఏల?
అసత్యం వీడి సత్యానికి
చీకటితొలగివెలుగులోకి వచ్చునా
మృత్యు కోరల నుండి
అమృతమయజీవనానికి మార్గమా
ప్రతి యుగాంతము
మరోయుగ ఆరంభం! మూలమా
బానిసయుగంనుండి
భూస్వామ్య యుగానికి! తప్పదా
భూస్వామ్యం నుండి
పెట్టుబడి దారీకి వత్తాసే
అంతాప్రజాచైతన్యం
సమతా యుగానికి! మార్పులే
ఇన్నాళ్లు పీక్కతిన్న
నరరూప రక్కసులు మారరా
రక్త దాహం తీరక
చేస్తున్న వైకృతం! ఇంకా పోదా
సానుకూల మౌతుంది
ఇది అంతమూకాదు
ఆరంభమూకాదు
పాతనీరు పోతోంది! అంతే అనుకోనా
కొత్తనీటి జల కళ
ఇది ఆనంద హేల
కొత్తప్రపంచం లోకి
ఒకఅంతం!ఒకఆరంభం! నావంతు కృషి ఎంతవరకు****
భగవాన్ని పలకరించడమంటేనే యెంతో భయం. ఏ అధికారమూ, పరివారమూ లేని, బలంలేని స్వరూపం ముందు, గొప్ప పదవుల్లో, అధికారాలలో వుండేవారు, అతి గర్విష్టులు, సైన్యాధికారులు నమస్కరించడానికి వణికిపోయినారు.
మల్లాప్రగడ
***
008.భగవాన్ స్మృతులు
రోజుకి మూడు నాలుగుసార్లు, ఆశ్రమం నించి కొండ మీదికి వెళ్ళేవారు భగవాన్. ఆయన ముందు నడుస్తూ, వెనక కమండలం పట్టుకుని శిష్యుడూ, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వుండేవారు.
అప్పుడప్పుడు కొండని ఇటూ అటూ చూసి, వెనక్కి తిరిగి శిష్యుడితో చల్లగా మాట్లాడుతూ వుండేవారు.కింద నుంచున్న నాబోటివారు తదేక దృష్టితో ఆయనవంకే చూస్తూ నుంచునేవారు, వారు కనుమరు గయిందాకా. ఏమనిపించేదంటే- అట్లా ఒక్కొక్క మెట్టే యెక్కుతూ కొండ చివరికి వెళ్లి, అక్కడనించి అట్లా ఆకాశంలోకి మాయమై ఇంక తిరిగి రారేమోననిపించేది ప్రతిసారీ.
***అందరం బిజీ బిజీ!
కులమతాలతో
తన్నుకు చావటానికి
టైం లేనంత బిజీ శివా అనలేని బిజీ.
మీరు ఏ'రంగం'లో
నిష్ణాతులో-అందులో
బిజీ గా ఉండండి!
కులమతాలొద్దుమనకు! అన్నా కులం, మతం అంటూ తిరగటం దేనికి విగ్రహం శక్తి ఇచ్చే విధానం తెలుసుకోక
అందరం కష్టపడదాం!
అందరం అనుభవిద్దాం!
అదీ వ్యవస్థ అంటే
వాళ్లు మనుషులంటే! తెలుసుకోలేని మూఢ జనాన్ని ఎలా మార్చాలి
మనకష్టాన్నంతా
రిజర్వుబ్యాంకులో
కుప్పపోద్దాం-కావాల్సింది
తీసుకు తిందాం! అది చాలదా
మధ్యలోరాజ్యంఎందుకు
దళారీ గాళ్లెందుకు?
ఓటు కొనేవాళ్లెందుకు?
వీళ్ళతోవిసుగొచ్చేస్తోంది! అని నేనంటే ఎవరైనా నమ్ముతారా
ఒకరి కష్టాన్ని మరొకరు
దోచుకోవటం ఏంటి?
పాపమంతా ఇక్కడే!
పైకిమాత్రంఎన్నినీతులో! చెప్పే వారి ఎక్కువ ఆచరించే వారు తక్కువ ఏమనాలి
అంతా వంచనాశిల్పులు!
ఇలాంటి బతుకు వద్దు!
ఆలోచించండి-ఒక
ప్రత్యామ్నాయంచూద్దాం! అని అనుకున్న వారు ఎవరు అర్థం తెలుసుకోకుండా అర్థం చేట్లు తిరిగేవారే
మీకైతే ఎలా ఉందోకాని
నాకైతేమనశ్శాంతిలేదు! ఇది అంతా ఆ శివా కల్పనలే మాయలే
ఎటుచూస్తే అటు దగా
ఎన్నాళ్లీదోపిడీసమాజం? ఈ సమాజాన్ని గెలిచేది మౌనం అర్థం చేసుకున్న వాడికి గ్రహణం అదే మూల శివ తత్వం
*****
0009
భగవాన్ చివరి రోజుల్లో కురుపులేచి ఆపరేషన్లు అయి, శరీరం బలహీనమైన తరువాత ఆయన సోఫామీద నించి లేవడానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ కూచున్న వారికి ఆ బాధ తమ దేహాలలో పలుకుతున్నట్లుండేది. అట్లా బాధ పలకడా నికే ఆయన ఆ నెప్పిని పోగొట్టుకునేవారు కారేమో! ఆయన పొందిన మహోన్నత స్థితీ, అనిర్వచనీయమైన ఆనందమూ, అవేకాదు, ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా ఈ ప్రజలకోసమే గావును! కొన్ని ఏళ్ళు ఆయనకు మోకాళ్లు నెప్పులు వుండేవి. ఎవరో ఒకరు పంపిన మందు తైలాన్ని మర్ధన చేస్తూనే వున్నారు, పిసికే వారు. సోఫామీదనించి లేస్తూ భగవాన్ తన మోకాళ్లని పిసుక్కునేవారు. ఎవరన్నా పిసకబోతే "వుండవయ్యా! అంత పుణ్యమూ మీకేనా, ఈ మోకాళ్లని పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాయించుకోనీ” అనేవారు.
ధర్మోరక్షతి రక్షితః
వినటానికి బాగుంది!
వేలసంవత్సరాలుగా
వింటున్న నీతిసూత్రం!
ధర్మాన్నిఎవరురక్షించాలి?
ఎవరు రక్షించటం లేదు?
రక్షించేవాళ్ళు బాగున్నారా?
రక్షించనివాళ్ళుబాగున్నారా?
అసలు ఏది ధర్మం?
చాతుర్వర్ణ ధర్మాలు!
ఆ కాలంలో చెప్పారు!
కాలం మారిపోయింది!
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య
త్రైవర్ణ ధర్మాలు ఏవి?
సూద్ర ధర్మాలు ఏవి?
ఇవి రక్షించబడాలి!
బ్రాహ్మణ ధర్మం ఏది?
వాళ్ళు 'గుడి'నినమ్మారు!
నేటికీ'గుడి'తోనే ఉన్నారు!
ధర్మ రక్షణ జరుగుతోంది!
క్షత్రియధర్మం ఏది?
రాజ్యభారం! సుజనరక్షణ!
ఇపుడుపాలించేవాళ్లెవరు?
ధర్మమే మారిపోయింది!
వైస్యులధర్మం ఏది?
వ్యవసాయం చెయ్యటం!
అదీ ఆనాటి వాళ్ళ ధర్మం!
ఇప్పుడు ధర్మం మారింది!
సూద్ర ధర్మం ఏది?
త్రైవర్ణాలను సేవించటం!
ఇప్పుడు సాధ్యమౌతుందా?
ఇక్కడా ధర్మం మారింది!
మారుతుంది కాబట్టే
ధర్మం 'చర' అన్నారు!
చాతుర్వర్ణ ధర్మం కాదు
నేడు ప్రజాస్వామ్య ధర్మం!
ఆ పాత నీతి సూత్రం
నేడు పనికిరాదు!
ప్రజాస్వామ్య సూత్రాలతో
కొత్తగారాసిందే రాజ్యాంగం!
రాజ్యాంగ ఉల్లంఘనచేసి
మనువాద ఫాశిస్టులు
వీరంగమాడుతున్నారు!
ధర్మాన్ని చెడగొట్టారు!
కంచే చేను మేస్తోంది!
మనువాద ఫాశిస్ట్ కార్పొరేట్
అధర్మపాలననుంచి
దేశాన్నికాపాడదాం రండి!
వాళ్ళు చెప్పినధర్మాన్ని
వాళ్ళే తుంగలో తొక్కారు!
ధర్మం కాలాను గుణం!
ధర్మో రక్షతి రక్షితః! అంటూ
ఆయన లేచి నుంచుని కర్ర నానుకుని ఒక్కొక్క అడుగు వేస్తూవుంటే, భక్తుల్లో ప్రతివారి వూపిరీ యెగిరిపోతూ వుండేది ఆయన వేసే ప్రతి అడుగుకీ.
🪷
సశేషం
[26/11, 11:46] Mallapragada Ramakrishna: *భగవాన్ స్మృతులు -10
🪷
ఆశ్రమాధికార్లు కట్టించిన కొత్త హాలు రాతి గుమ్మం దాటడం అతి ప్రయాస అయ్యేది భగవాన్ కి. చూసేవారికి, చిన్న పిల్లలకి కూడా యెట్లానన్నా ఆయన్ని పట్టుకుని దాటించాలనిపించేది. కాని, తమ బుజాల్ని వూతగా ఇవ్వాలని వెళ్ళే పరిచారకుల్ని విదిలించి పంపించేవారు భగవాన్. ఒక్కొక్కసారి ఆయన పడిపోయేవారు కూడా, కాని, సహాయం మాత్రం తీసుకునే వారు కారు.
మానవోద్ధరణకై ఈశ్వరుడు ఏ రూపంలోనో భూమిపై అవతరించి, తాను అనేకమందిని శిష్యులుగా తీసుకొని, వారిని సాధనలో పెట్టి పునీతుల్ని చేస్తారు. ప్రతి గురువు పద్ధతీ, తక్కినవారి నుంచి ప్రత్యేకంగా వుంటుంది. కాని, ప్రతి గురువు కూడా తనను విశ్వసించి, తాను నియమించిన ప్రకారం ప్రశ్న లేకుండా నడవమనే ఆజ్ఞ ముఖ్యమైనది. వారు యే ప్రజలమధ్య అవతరిస్తారో వారి మతాలకీ, ఆచారాలకీ, పురాతన ధర్మాలకీ, కరుడు కట్టిన నీతులకీ కూడా చాలాసార్లు వారి బోధ విరోధంగా, విపరీతంగా వుండవచ్చును. తాము నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడచు కునే గురువుని భరించలేక చాలామంది వదిలిపోతారు. కొందరు ఆ గురువుని వదలలేక, ఆయన మాట వినలేక “ఆయన అంతేలే” అని తప్పుకు తిరుగుతూ వుంటారు.
*****
మార్చేవాళ్లెవరు? అంతా శివ ప్రక్రియలే
సామాన్యులు కష్ట జీవులు కూలినాలి జనం పుత్తు పూసలేని వాళ్లు ఏది చెపితే
అదినమ్మేవాళ్ళు మూఢ విశ్వాసాలతో నిండినవాళ్లు
దేవుని విలువ తెలియని వాళ్లు వెయ్యి రూకలకు
అమ్ముకునేవాళ్ళు తమకష్టాన్ని
ముడుపులు కట్టి హుండీల్లో వేసేవాళ్ళు ప్రతి కొండకెళ్లి
గుండుకొట్టించే వాళ్ళు మహిమలనినమ్మేవాళ్ళు
బ్రమ్మోత్సవాలు రథ యాత్రలు
పుష్కరాలు కుంభమేళాలు
తెలియనివాళ్ళు
వీళ్లంతా తరతరాల వంచితులు పీడితులు! వీళ్ళను మార్చాలి!
వీళ్ళ అజ్ఞానం మీద
బ్రతికేవాళ్లంతా వంచకులు పీడకులు దోపిడీ సమాజం!
మార్చేవాళ్లెవరు? అంతా ఆశివుడే చేస్తాడు, శివుడే మారుస్తాడు, జీవుడు నిమిత్తమాతృడు. స్వార్ధ, మురికి కూపంలో చిక్కి నలిగే ఈగలబతుకే యగు తీరుగాను
****
భగవాన్ ఏ ఆచారాలూ పాటించేవారు కారు. తన దగ్గర చేరిన ఆచారవంతుల్ని, ఆ ఆచార బంధనాల నుంచి తప్పించాలని చాలా ప్రయత్నించారు. అంతటి గురువుని యెదురుగా పెట్టుకొని; ఆయన్ని సాక్షాత్ ఈశ్వరావతారమని స్తుతిస్తూ గర్వపడు తూనే వారి దేవతార్చనలు, వ్రతాలు, మొక్కుబళ్ళు, తీర్థయాత్రలు - సమస్తమూ చేస్తూనే వుండేవారు భక్తులు. భగవాన్ని అడిగితే, "ఏదీ వద్దు, నిశ్చలంగా కూచో, అది ఉత్తమమైన యాత్ర... కాశీకిపోతావా? ఇది కాశీకాదా? అరుణాచలం కన్నా గొప్ప పుణ్యక్షేత్రం యెక్కడ వుంది? ఇదే హిమాచలం. ఇదే కైలాసం" అంటూన్నా సరే పోతూనే వుండేవారు.
📖
[27/11, 07:01] Mallapragada Ramakrishna: 0011.భగవాన్ స్మృతులు
ఆయనకి గొప్ప భక్తురాలు, ఎచ్చెమ్మ. ఒక సారి లక్ష తులసీ పత్రి వ్రతం చేసి, అలా చేశానని భగవాన్ తో గొప్పగా చెప్పుకుంది. "ఆ చెట్టుని అన్నిసార్లు గిల్లడంకన్న, నువ్వే లక్షసార్లు నిన్ను నువ్వు గిల్లుకోకపోయి నావా!?” అన్నారట.
చిన చేపను పెదచేప పెదచేపను తిమింగలం మింగటమేమన కాల రీతిగా ను మాత్రమే
దోపిడీ కాలము లో, ప్రేమకాలములో
సృజన శక్తులు కూడా
నశించిపోతాయి, కారణం వెతుకుంటే అంతా నిశ్శబ్దం
ఎక్కువతక్కువలతో
మనో వికారాలు పెరిగి
అంతా అంధకారమే అది ఎవరి వసరమో తెలియదు కదా
భౌతికమూ లేదు, ఆధ్యాత్మికమూ లేదు,
నిర్వీర్యము నిస్తేజమే, మనసు అర్భాటాలకు ఆజ్యం లాగ మారుట ఎంతవరకు సమంజసం
ఉపన్యాసాలు ప్రవచనాలు
కన్నీటితుడుపులు, కాలయాపన అనుకున్నా తప్పే, మనసు శాంతికి మరో మార్గం యది కాదా
నీ వల్ల ఎవ్వరికీ హాని జరగకూడదు అదే సత్యం
అదీ నిత్యం
'ఆనాడే'మానవులంతా
ద్విగుణీకృత శక్తులై
సమాజం సుసంపన్నం జేసే కార్యకర్తలుగా, శివగాణాలుగా తయారవుతారు మనలో కావాల్సినది ధైర్యం స్థాయి యనేది ఏదీ లేదు, ఓర్పు, ఓపిక మనుగడ కూ ప్రశాంతి కదా అని భావామృతం తెలియపర్చారు.
****
ఏది ఏమైనా, ఏది ఎటుపోయినా పట్టించుకోని భగవాన్, హాల్లో అద్దాల బీరువాకి ఆనుకునే పిల్లవాడితో అతి ఆత్రతగా "అద్దం, అద్దం పగులుతుంది” అని హెచ్చరించేవారు, తల్లి చచ్చిపోయిన ఉడత పిల్లని పెంచి; క్రిందపడి బీటలుపడ్డ పిచిక గుడ్డును తాను స్వయంగా జాగ్రత్త చేసి, పిల్ల ఐతే అందరికి చూపి ఆనందించే వారు భగవాన్, కాని, ఆయనకి చాలా ఆత్మీయులని అందరూ అనుకునేవారు చచ్చిపోతే “అట్లాగా!” అని వూరుకునే వారు. పుస్తకాలు బైన్డు చేస్తూ వుంటే, అలమారు చేస్తూ వుంటే, ఆ చేసేవారిని విసిగించి బలవంతం చేసి, పావు అంగుళం లో పదోవంతు కొలతలను కూడా సరి చేయించేవారు. వంటలూ అంతే, ఎట్లా వుండాలో, ఎన్నో వివరాలు చెప్పి చేయించి సరిగా చేస్తున్నారో లేదో లేచి వెళ్లి చూస్తూ వుండేవారు. మళ్ళీ యెంత విలువైనవి కనపడలేదన్నా, పాడైనా సరే ఆయన వినుపించుకోనన్నా వినుపించుకోరు.
ఆయన ముందే హాల్లో స్త్రీలను గడకర్రలు పెట్టి నెట్టేవారు సేవకులు; స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు; భోజనం దగ్గర కూచున్న కొత్తవాళ్లని బైటికి గెంటేవారు. అయినా అట్లా చూస్తూ వుండేవారు భగవాన్. కాని, ఒక పిట్టకు, ఒక చెట్టుకు ఏ హాని కలిగినా జాగ్రత్తగా నయం చేసేవారు; హాని చేసేవారిని చూసి ఉగ్రులయ్యేవారు.
📖
[27/11, 18:19] Mallapragada Ramakrishna: 012..భగవాన్ స్మృతులు
ఆశ్రమానికి డబ్బు కూడిన మొదటి రోజుల్లో, ముందు 'వాకిట్లో ' కాచుకొని వున్న బీదలకి, ఆవులకి, తక్కిన ప్రాణులకి భోజనం పెడితేనేకాని భగవాన్ భోజనానికి లేచేవారు కారు, ఆశ్రమంవారు బీదలకి వేరే పల్చని సాంబారు వండితే, వారితోపోట్లాడి తను ఆ పల్చని సాంబారు వేసుకొని, వారికి మంచి సాంబారు పోయించేవారు. తను తినే యిడ్లీలు ఆవులకు పెట్టించేవారు ఆశ్రమం వారికి ఆ పనులు చాల కష్టంగా వుండి, ఎట్లాగన్నా ఆయన కన్ను కప్పాలని చూసేవారు. విసుగుపుట్టి ఆయన ఆ విషయమై కల్పించుకోవడం మానేసారు. తన భక్తులకి భిన్నంగా తనకేమి అధికంగా పెట్టినా ఉగ్రులయ్యేవారు. తనకి జబ్బుగా వున్నా తన కోసం తెచ్చిన పళ్ళు పాలు అందరికీ పంచాల్సిందే. ఆ విధంగా తనకు ప్రత్యేకత చూపినందుకు కోపించి - కాఫీ, పాలు మానేశారు భగవాన్, చాలకాలం.
రమణ మహర్షి ఆవేదనతో భాధతెలపకుండా నాకు ఏమీ భాదలేదు అంటూ
మీ ఆరోగ్యం మీ చేతిలో, మీ నడకలో, మీ పడకలో, మీ నిద్రలో, మీతిండి లో
మీ ఆరోగ్యం మీ ఉప్పులో, మీ నూనె లో, మీ నీటి లో, మీ ధ్యానంలో, మీ ఆసనాల్లో
మీ ఆరోగ్యం ఎండపొడ లో
మీ ఆరోగ్యం విటమిన్స్ లో, ప్రోటీన్స్ లో, పండ్ల లో, ఆకు కూరల్లో, కోడిగుడ్లలో తెల్ల సొనలో,ఇప్పుడు పచ్చసొన లో,మీ ఆరోగ్యం మీ నవ్వులో
అ హ హ హ ఆహా హా హా
నవ్వండి నవ్వండి నవ్వండి
లోపలఏడుస్తూనేఉంటారు
సమస్యలెక్కడికి పోతాయి!
ఎందరో మహానుభావులు
వారిచ్చిన 'ఉవాచ'లు
మనకు శిరోధార్యాలు!
నా'ఉవాచ'కూడా వినండి
మీ ఆరోగ్యం మీ 'బుద్ధి' లో!
బుద్దులు మంచివి కాకపోతే
మీ సుద్దులు మారిపోతాయి
మీ చేతలు మారిపోతాయి!
బుద్ధి అన్నిటికి మూలం!
దాన్ని సరిజేసు కోండి -మీకు
నూరేళ్లు ఆరోగ్యం ఖాయం!!
మన బుద్ధులనిండా కులాలు
మతాలు ఎక్కువతక్కువలు
ప్రక్క వాళ్ళమీద ఈర్ష్య లు
అరిషడ్వర్గాలతో నిండిపోతే
నువ్వెన్నిచేసినా ఏమీలేదు!
ప్రేమ కరుణ దయ సహకారం
సమభావం సౌభ్రాత్రంవీటితో
నీ హృదయం నిండి పోవాలి
రోగాన్ని రమ్మను చూద్దాం!
రాదు!మీరంటే దానికి భయం
ఇవన్నీ కుళ్లబెట్టుకుంటే
మీరు ఏం చేసినా ఆరోగ్యం
శ్రీమతేరామానుజాయన్నమః
మీ చేతిలో మాత్రం ఉందా?
ఏంజరిగినా 'దైవేచ్ఛ'కదూ!
అని అందరితో చెప్పేవారు
భగవాన్ కి ఎప్పుడూ ఏదో జబ్బు చేస్తునే వుండేది. మందు లిప్పించ చూసేవారు. ఎప్పుడూ భగవాన్ మందులు వద్దనేవారు. కాని, వత్తిడిచేస్తే మీ ఇష్టం కానిమ్మనేవారు. తరువాత ఏ మందులు యెంత కాలం పోసినా మింగేవారు. చివరదశలో ఆయన దేహాన్ని అంతంచేసిన కురుపు లేచినపుడు ఏ మందూ, ఏ కోతా వద్దన్నారు. ఎట్లా వచ్చిందో అట్లానే పోతుందన్నారు. కాని, రెండు మూడేళ్లు దానికోసం పోసిన మందల్లా తాగారు, కొ'సిన కొతల్లా కోయించుకున్నారు.
ఏది ఏమైనా ఈ జ్ఞానులందరూ ప్రేమమయులు, వారు ఏది చేసినా – యెట్లా చేసినా అది వారి నాశ్రయించిన వారి పురోభివృద్ధికే జరిగేది.
*___చలం*
🪷
సశేషం
[29/11, 21:07] Mallapragada Ramakrishna: *భగవాన్ రమణ మహర్షి స్మృతులు - 4*/13
🪷
*సాధుని శాంతమ్మ అనుభవాలు -1*
నా అన్న అల్లుడికి రామనాధపురం నుంచి దగ్గర వున్న పల్లెటూరికి బదిలీ అయింది. భార్య పుట్టింట్లో ఉండడంవల్ల అతను వొక్కడే వెళ్లి వంట చేసుకోలేక, నాకు కబురంపాడు. నాకప్పుడు నలభై యేళ్లు. సామాన్లన్నీ వెంటతీసుకుని వెళ్లాను. బియ్యం పొయ్యిమీద పెట్టి కూర్చున్నానో లేదో, ఏ కారణం లేకుండానే నాలోంచి పెద్ద ప్రశ్న బయలుదేరింది.
"ఏమిటి? నువ్వు చేస్తున్న పని! ముగ్గురు కొడుకులూ పోయినారు, భర్త పోయినాడు. కుతురికి పెండ్లిచేసి, ఆ కుతుర్నీ అల్లుణ్ని అమితంగా ప్రేమించి నీకున్నదంతా వాళ్ళ కోసం ఖర్చు చేశావు. ప్రసవించి పిల్లతో సహా కూతురు చచ్చింది. కూతురు పోయి ఆరు మాసాలయిందో లేదో, ఈ లోపలనే అన్న కూతుర్నీ అల్లుణ్నీ తెచ్చుకొని రామనాధపురం రాజుగారిని యాచించి, అతనికి ఉదోగ్యం ఇప్పించి, నేడు మిగిలిన దేదో వాళ్లిద్దరికీ ఖర్చు చేస్తూ వాళ్ళకి వండి పెడుతున్నావు. ఇందుకేనా నువ్వు పుట్టింది? ఎవరిమీదో ఒకరిమీద మమ కారం తగిలించుకోకుండా నిలవలేవా? ఇతనెవరు? నువ్వెవరు? ఈ చాకిరీకి, ఈ ఖర్చుకి అర్థమేమిటి? ఇట్లాగే నీ కాలం
గడిస్తే, చివరికి నీ గతేం కాబోతుంది?" అని అడిగారు నాలోని ఎవరో...
ఒక్కసారిగా నా కళ్లు వాస్తవానికి గట్టిగా తెరుచుకున్నాయి.
నేను వెంటనే నా అన్న అల్లుడి దగ్గరకు వెళ్లి “నేను రామేశ్వరం బయలుదేరు తున్నాను” అన్నాను.
"ఎప్పుడు?”
“ఇప్పుడే.”
"అదేమిటి?”
"అది అంతే, నేను వెడుతున్నాను.”
అతను ఆశ్చర్యంతో, అయిష్టంతో "నాకు తిండి ఎట్లా?" అని సణుగుతున్నాడు.
"అదంతా నాకు తెలీదు, నేను రామేశ్వరం వెళుతున్నాను. పొయ్యిమీద అన్నం వుంది, చూసుకో” అని ఖచ్చితముగా చెప్పి, రైలెక్కాను.
ఆ ముందు రోజు అతను, అతని భార్య నా లోకం. వాళ్ళు తిన్నారా, లేదా? వాళ్లకి యిష్టమయ్యేట్టు వంట చేశానా? ఇంకా ఏం పెట్టను వాళ్లకి? ఇదే నా బతుకు. అసలు అలోచించితే వాళ్లెవరో, నే నెవరో!
📖
రామేశ్వరం వెళ్లాను. ఒకటే వేదన, నాకు మోక్షమార్గం యెవరు చూపుతారు?
అక్కడ పురాణం చదివే ఒకామె వుంటే ఆమెకి సేవచేస్తూ వారింట్లో వున్నాను 'మొదట్లో. ఆమెనడిగాను. పరమార్థం అర్థం కావాలంటే ఏం చదవమంటావని,
'కైవల్యం' అనే పుస్తకం చదవమంది ఆమె. అది ఎక్కడ దొరుకుతుందంటే నాగస్వామి గారని ఒక స్వామి వున్నారు, ఆయన్నడగ మంది. నాగస్వామిగారిని చిన్నతనంనుండి యెరుగుదును, వెళ్లి ఆయన్ని అడిగాను.
"ఎందుకు 'కైవల్యం' నీకు?”
"అది చదివితే మోక్షమార్గం స్పష్టమౌతుందన్నారు.”
"పుస్తకం చదివినంత మాత్రాన నీకు మోక్షమార్గం తెలుస్తుందా?”
"అంతకన్న ఏం చెయ్యను స్వామి?”
“నీకా మార్గం తెలుసుకోవాలని గట్టికోర్కె వుందా?"
“అవును.”
"మోక్షం తప్ప ఇంక దేనిపైనా ఆశలేదా? అది సత్యమేనా?”
"అవును.”
ఆయన నన్ను పరీక్షిస్తూ చూచారు.
“సరే. రేపు పౌర్ణమినాడు రా” అన్నారు.
పౌర్ణమినాడు నాకు మహామంత్రం ఉపదేశం చేశారు. ఉపదేశం పొందుతూ వుంటేనే, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడి లా కన్పించారు. ఆ మంత్రం ఉచ్చరించటం తోనే ఒళ్లు తెలీక, తన్మయురాలనై, యెంతో సేపు అట్లానే కూర్చుండిపోయినాను. నాకు యింత సులభంగా సద్గురువు దొరికారే అని చాలా సంతోషమయింది. ఆనాటి నుంచి ఒక సంవత్సరం కైవల్యం చదవడ మయ్యేవరకు ఆ దంపతుల్ని సేవించుకుని వుండిపోయినాను
తరవాత రామనాధపురానికి వెళ్ళి లోక వ్యవహార సంబంధాలు వదిలి నేను తెలుసుకున్న వేదాంత గ్రంథాలు చదివి వినేవారికి చెబుతూ ఆ మంత్రం జపించు కుంటూ కాలం గడుపుతున్నాను.
ఇంకా వుంది
📖
*
[02/12, 06:34] Mallapragada Ramakrishna: భగవాన్ రమణ మహర్షి స్మృతులు - 4*/14
అట్లా తొమ్మిది సంవత్సరాలు గడిచాయి.
నాకు యాభై ఏండ్లు నిండాయి. రామనాధ పురవాసులైన మురుగనార్ (భగవాన్ శిష్యుడు) నా పఠన కాలక్షేపానికి వస్తూ వుండేవారు. వారి దగ్గర భగవాన్ శ్రీ రమణ
మహర్షుల వారి చిత్ర పఠాన్ని ఒకనాడు చూచాను.
అప్పటి నుంచి ఎలాగైనా భగవాన్ దర్శనం చేసుకోవాలని గట్టి కోర్కె కలిగింది. మురుగ నార్ అప్పటికే అన్నీ వదలి భగవాన్ పాదాల్ని ఆశ్రయించుకొని అరుణాచలంలో ఉంటున్నారు, నేను ఎప్పుడూ బాగా బీద దాన్ని కావడంవల్ల అనుకున్న వెంటనే దూరప్రయాణం చెయ్యగల సామర్థ్యం నాకులేదు. కొంత డబ్బు సమకూర్చుకోడా నికి సంవత్సరంపట్టింది. నేను మురుగనార్ గారి అక్క, మరి ఇంకా ముగ్గురు స్త్రీలు కలిసి అరుణాచలానికి బయలుదేరాము గంపెడాశతో...
📖
అది 1927 కార్తీక మాసం.
అప్పటికే భగవాన్ కొండ దిగి వచ్చి పాలి తీర్థం ప్రక్కన తల్లి సమాధిపైన వేసిన ఒక పాకలో ఉంటున్నాడు. అక్కడ ఆ పాక తప్ప ఇంకేమీ లేదు. చుట్టూ అడవి. మేము ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అందులో స్థిరపడ్డాము.
మర్నాడు భగవాన్ దర్శనానికివెళ్లినప్పుడు వారు ఆ పాకలో ఓ నులక మంచం పైన కూర్చుండి ఉన్నారు. ప్రక్కన మురుగనార్. వారిని చూడగనే తెలిసింది, వారు గురు రూపంలో ఉన్న ఈశ్వరుడని. నేను తెచ్చిన పళ్లు వారి ముందుపెట్టి నమస్కరించి, "ఎన్నాళ్ళ నుంచో తమ దర్శనం చేసుకోవా లనే నాకోర్కె ఈనాటికి తీరింది. ధన్యురాల నైనాను” అని చెప్పి, "స్వామి, నాకు ఈ మనసు అనేది లేకుండా చేసి నన్ను కటాక్షించండి" అని అడిగినాను.
దానికి స్వామి మురుగనార్ తో "ఆమెను కనుక్కోండి మనసు అనేది ఒకటుందంటే, ఆ మనసు ఆకారమెటువంటిదో, ఆ మనసుగారికి మీసాలూ, గడ్డాలూ వున్నా యేమో చూడమనండి” అన్నారు.
ఆ మాటకి ఏమి సమాధానం చెప్పాలో తెలీలేదు నాకు. మురుగనార్ నన్ను చూచి “నీకు దీక్ష అయింది" అన్నారు.
రమణ స్తుతి పంచకం నుంచి నేను ఒక పద్యం చదివాను అరవంలో. “నీవు స్వర్ణజోతి స్వరూపం. నీవు సర్వ పరి పూర్ణుడవు. నీవు పొందిన ఆత్మానుభూతి పరిమళమై సర్వజగత్తును ఆవరించింది. రసాన్ని ఆస్వాదించి అందరూ నీ దగ్గిరకే పరుగెత్తుకొని వస్తున్నారు. నేను ఆ పరిమళాన్ని రుచి చూచి నిలువలేక 'ఎక్కడ? నువ్వెక్కడ?' అని వెతుక్కుంటూ వచ్చాను” అనే అర్ధంతో పాడాను.
అది విని "ఈ పద్యం ఈ అమ్మకి యెట్లా తెలిసింది?” అని అడిగారు భగవాన్.
దానికి మురుగనార్ నన్ను రామనాధ్ లో తాను యెరుగుదునని, రమణ స్తుతి పంచకం కాపీ నాకు తాను ఇచ్చిన సంగతీ చెప్పారు.
ఆ విధముగా మేము ఐదుగురము నలభై రోజులు వున్నాము అరుణాచలంలో. ఊళ్ళో వండుకొని భోజనం చేసి మాలో మేము చందాలు వేసుకుని మధ్యాహ్నం పన్నెండింటికి రోజూ ఏదో ఫలహారం తయారు చేసుకొని ఆశ్రమానికి చేరుకొనే వాళ్లము. మూడు గంటలకు స్వామికీ, అక్కడ ఉన్న భక్తులకీ మేము తెచ్చిన ఫలహారాన్ని పంచి పెట్టేవాళ్లము. అందరికి ఎంత ఇస్తామో అంతమాత్రమే స్వామివారి కీ ఇవ్వాలి. అంతకన్న యెక్కున తీసుకోరు. కనుక అందరికి సరిపోయేట్టు తయారు చేసేవాళ్లం. ఆ రోజుల్లో ఆశ్రమంలో చిన్న స్వామే వంట. గోపాలరావు అనే భక్తుడు ఊళ్ళో దొరికిన బియ్యం-అవీ ఆశ్రమానికి పంపేవారు. భక్తురాలు ఎచ్చమ్మ కూడా ఏదో ఒకటి పంపేవారు. ఆ వచ్చినవాటిని వంటచేసేవారు చిన్నస్వామి. నెయ్యిగాని, కూరలుగాని సరిగా ఉండేవి కావు. స్వామి వారికి చారు అన్నమే చాలారోజుల పాటు వడ్డించారు. చారు కూడా లేకుండా ఉత్త ఊరగాయ ముక్కతో తిన్న రోజులు కూడా చాలా వున్నాయి.
🪷
*సశేషం*
*భగవాన్ రమణ మహర్షి స్మృతులు-5*/15
*సాధుని శాంతమ్మ అనుభవాలు -2*
ఇంతలో కార్తీకదీప ఉత్సవం దగ్గరకు వచ్చింది. ఆ రోజుల్లో కూడా దీపానికి వచ్చిన ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేవారు, భగవానుని చూడడానికి. అందుకని తెల్లవారగట్ట మూడింటికే ఫలహారం తీసుకుని కూర్చునేవారు.
తెల్లవారిందా —లేవడానికీ, కదలడానికీ వీలు వుండేది కాదు భగవాన్ కి. ఆయన చుట్టూ కర్రలు కట్టేవారు, గుంపు తోసుకుని మీదపడకుండా. దాంట్లో స్వామి, మురుగ నార్, తక్కిన భక్తులు కూర్చునేవారు. అందుకని స్వామి నాతో "ఈ దీపం పది రోజులు నువ్వేమీ ఫలహారం చేసి తీసుకొని రావద్దు, గుంపువల్ల ప్రయోజనం ఉండదు" అన్నారు. నేను ఏ పళ్ళో తెచ్చి గుంపులో చొరబడి కర్రల సందు నుంచి స్వామివైపు ఆ పళ్లుపెట్టి వెళ్లిపోయేదాన్ని.
కార్తీకదీప ఉత్సవం ఐనాక నాతో వచ్చిన వారు చిదంబరం వెళ్ళాలనుకుంటున్నారు. నాకేమో భగవాన్' జయంతి (పుట్టినరోజు) వరకు అరుణాచలంలోనే ఉండాలనిఉంది. కాని వాళ్లు వెళ్ళిపోతున్నారు కదా, నేను వెళ్ళాలని సెలవు తీసుకుందామని భగవాన్ దగ్గరకు వెళ్లాను. ఆయన నన్ను ఇంకొ రోజు ఆగమన్నారు. భగవాన్ రచించిన 'ఉపదేశ సారం' అనే పుస్తకాలు అచ్చై మర్నాడు వస్తాయనీ, నన్ను ఓ కాపీ తీసుకొని వెళ్ళమని అన్నారు. మర్నాడు శలవు తీసుకోడానికి వెళ్ళినపుడు 'ఉపదేశ సారం' కాపీ ఇచ్చి శలవిచ్చారు భగవాన్.
నేను ఆయనను వదిలి కదలలేక ఏడ్చాను, భగవాన్ చాలా దయగా, నాతోపాటు ఆయనా దిగులు పడుతున్నట్లుగా "నువ్వు రామనాధ్ వెళ్ళడంలేదు. ఎక్కడికీ వెళ్ళడం లేదు. అరుణాచలం వెళుచున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తిరిగి వెళ్ళడం అంటే కష్టంగానే ఉంటుంది. దిగులుపడకు వెళ్ళిరా” అన్నారు. ఆ మాటలతో నాకు ఓదార్పు కలిగింది. ఆ రోజే చిదంబరం వెళ్లి, అక్కన్నించి రామనాధపురం చేరుకున్నా.
ఇంకా వుంది
****
*భగవాన్ రమణ మహర్షి స్మృతులు-5*/16
*సర్వేశ్వరుడి కృప*
నేను రామనాధ పురంలో తిరిగి అమ్మవారి పూజలు చేసుకుంటూ గ్రంధపఠనం చేస్తూ వున్నాను. ఏడాది గడిచింది. తిరిగి భగవాన్ జయంతి వస్తోంది. 'పోయిన జయంతికి వుండలేకపోతినే. ఈ జయంతి కైనా వెళ్లగలనా' అనే చింతలో వున్నాను. బీదదాన్ని, రైలుచార్జి కూడా లేదు నా దగ్గర. ఎక్కడన్నా అప్పుచేసి ఐనాసరే శనివారం బయలుదేరి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. శుక్రువారంనాడు టపాలో నాకు జయంతికి ఆహ్వానం వచ్చింది, భగవాన్ ఫోటోతో సహా. నాకెంతో ఆనందమయింది. కరుణామయులు, ఈ క్షుద్రురాలిని జ్ఞాపకముంచుకొని ఆహ్వానం పంపించారు. అరుణాచలం వెళ్ళింతర్వాత తెల్సింది భగవాన్ స్వయంగా గోపాలరావు తో "శాంతమ్మకి ఒక ఆహ్వానపత్రిక పంపు” అని చెప్పి పంపించారని.
నేను సద్గ్రంథాలు చదివి వినిపిస్తున్న సంగతి విని రామనాథపురం రాజావారి అంతఃపుర స్త్రీలు నాకు కబురంపి, వేదాంత గ్రంధాలు చదివించుకునేవారు. ఆ నాడు నేను నా కందిన ఆహ్వానం తీసుకొని ఆ రాణులకు చూపాను. భగవాన్ ఫొటో చూచి అందరూ ఆనందించారు. నాకు జయంతికి వెళ్లాలని ఉందని చెప్పాను. వాళ్ళలో వాళ్లు చందాలు వేసికొని 30 రూపాయలు ఇచ్చారు. భగవాన్ నన్ను రప్పించుకోడానికి సమయానికి డబ్బు కూడా సమకూర్చారు. అనుకున్న నాటికి బయలుదేరి అరుణాచలం చేరుకోగలిగాను.
*ఆశ్రమంలో స్థిరపడడం*
నేను ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి ఒక హాలు కట్టారు. దాంట్లో భగవాన్ మామూలు మంచం ఓ మూల వేశారు. దానిపైన దిళ్లు వేసుకొని భగవాన్ కూర్చుని వున్నారు. దండపాణి స్వామి "ఉల్లత్ నార్పత్"
(భగవాన్ వ్రాసిన నలభై శ్లోకాలు) చదువుతూ ఉంటే భగవాన్ వాటికి వ్యాఖ్యానం చేసి చెబుతున్నారు.
భగవాన్ నన్ను చూడగానే "ఉల్లత్ నార్పల్ (పుస్తకం) నీకు రాలేదా! మురుగ నారును నీకు పంపమన్నానే” అన్నారు. జయంతికి ఆహ్వానం కూడా స్వామి నా పేరు చెప్పి పంపమని జ్ఞాపకం చేశారట. సర్వేశ్వరుడే నాపైన అంత శ్రద్ధవహించి నాకు సందేశాలు పంపుతే వారిని విడవడం ఎట్లా సాధ్యమౌ తుంది? నే నెంత? ఆడదాన్ని, అంత కృప నాపై కలగడానికి నేను చేసిందేమున్నది?
అట్లాగే ఆశ్రమములో భగవాన్ తో భోజనం చేసి ఆశ్రమంలో ఉండిపోయాను, నా స్వంత ఇల్లులాగ, రాత్రులు మాత్రం ఊళ్ళో కి పోయి భగవాన్ భక్తులు మొదలియార్ గారి ఇంట్లోనో, ఎచ్చమ్మపాటి ఇంట్లోనో నిద్రపోయేదాన్ని, కార్తీక ఉత్సవమూ, జయంతీ గడిచాయి. "ఇంక ఎంతకాల ముండగలను వీరిమీద భారమై? వెళ్లాలి గదా!?” అని దిగులుపడుతూ ఓరోజు భగవాన్ సమక్షాన నిలిచి "ఇక్కడ ఉన్నంత కాలమూ శాంతంగా, తృప్తిగా, ఇంకేమీ ఆక్కర్లేకుండా ఉంటుంది. ఇంటికి వెళ్లానా, శాంతి ఉండదు. నేనేం చెయ్యను? భగవాన్ ని వదిలి కదలలేకుండా ఉన్నాను" అన్నాను.
"నీ మనస్సు స్థిరపడ్డదాకా ఇక్కడ వుండు. తరువాత నువ్వు ఎక్కడికి వెళ్లినా శాంతి నీతోనే ఉంటుంది" అన్నారు. కానీ, ఎక్కడ ఉండను? బైట ఉందామంటే బీదదాన్ని. జయంతి కాగానే ఆశ్రమానికి వచ్చిన అతిధులు వెళ్ళిపోతున్నారు. నేనూ వెళ్లాలి కదా? ఐనా, ఆశ్రమం వారికే తిండి పుష్కలముగా 'లేదే! నేను భారము కదా వీరికి? ఏమైనా నేను కదలలేను. ఏవిధంగా నో నేను ఆశ్రమములో ఉండగలిగితే?అనుకుంటూ భోజనానికి వెళ్లాను.
వంటింట్లో చిన్నస్వామి, రామకృష్ణస్వామి మాట్లాడుకుంటున్నారు. చిన్నస్వామికి ఒళ్లు బాగాలేదు. వైద్యానికి మద్రాసు వెళ్ళుచున్నారు, ఓ రెండు నెలలపాటు. ఈ లోపల శాంతమ్మ వంటచేస్తూ ఆశ్రమంలో ఉంటుందా అని ఆలోచించుకుంటున్నారు. నన్ను చూడగానే అడిగారు, నాకంతకన్నా ఏం కావాలి? కరుణామూర్తి, నా కోర్కెని ఎంత సులభంగా వెంటనే తీర్చారో స్వామి! అంతే, అప్పటి నుంచి ఆశ్రమంలో స్థిరపడి పోయినాను. నేనట్లా ఉండటం భగవానుని ఆజ్ఞగా, ఆయన ఇచ్చగా, ఆయన వరంగా భావించాను.
🪷
*సశేషం*
****
