Thursday, 3 July 2025

 


*నిత్యానందం*
🤥

రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి

*నిత్యానందం గారి వివాహం - 1*

"వొళ్ళు రవరవ మండిపోతోంది. కోపం ఆగడంలేదు. 'ఏదో ఆఘాయిత్యం చేసేస్తాను. సందేహంలేదు. 'వీడు కోపధారి వెధవ, ఎప్పుడో ఏదో అఘాయిత్యం చేసేస్తా'డని మా నాయనమ్మ అంటూనే వుండేది.

ఎందుకింత కోపం, ఏం ముంచుకు పోయిందా? ముంచుకుపోయిందా, ముంచుకుపోయిందిన్నరా? ముంచుకు పోయిందిన్నర అంటే ఏమిటా ? నీబొంద! అసలే కోపంగావుంటే కవ్వించకు, నన్ను రెచ్చగొట్టకు. అగ్గిమీద గుగ్గిలం, కోపమొస్తే వొళ్ళూపై తెలీదు నాకు. మా నాయనమ్మ అంటూవుండేది కోపమొస్తే వీడికి వొళ్లూపై తెలీదని ! కొపమొస్తే నేను నిప్పులుతొక్కిన కోతిని! కాలు గాలిన పిల్లిని! రేగిన తేనెటీగని! బెదరిన మదపుటేనుగుని!! నాకు కోపమొస్తే ఎంత ఉపద్రవమో నాయనమ్మకి తెలుసు."

"ఇంతకీ సంగతేమిటో చెప్పమంటావు? పానకంలో పుడకలా మాట మాటకీ అడ్డు తగులుతూ, నేనేదో జాప్యం చేసినట్టు, నీ యిదేమిటి? కుక్కిన పేనులా నోరువిప్పక, చెవులు అప్పగించి విను కుక్కిన పేనుకి నోరుంటుందా అంటావు, నీకుందిగా దానిలా నోరు. దయచేసి దానికి తాళమే సెయ్యి. అదిగది. రెండు చేతులతోటి నోరు మూసుకో, చొప్పదంటు ప్రశ్నలెయ్యకు. భేష్!"

"రామాయణంలో ఈ పిడకలవేటతో ధోరణి తెగిపోయింది. ఎంతదాకా చెప్పనబ్బా ! ఆఁ జ్ఞాపక మొచ్చింది. వొళ్ళు రవ రవ మండి పోతోంది. అఘాయిత్యం చేసేస్తానంటున్నా ను. ఏమిట్రా, ఆ వెధవ సంజ్ఞలు ? నోరు లేదూ ? మూగాడివా? అవునవును విప్ప కూడదు. చేతులూ కాళ్ళూ కూడా కట్టేసుకు విను.

ఈ పెళ్ళి నాకిష్టం లేదు. ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రం కట్టేశాననుకో. నే కట్టనని చెబుదామనుకుంటే, మాట విని పించకుండా వెనకాల ఢమఢమ డోలు వాయించేశారు. జబ్బ ఊడిపోయేలా నా చెయ్యి లాగేసి, ముడేయించేశాడు ఆ పురోహితుడు. ఆ మటకొస్తే, వాడే వేసేశాడు. 'మమ' అనికూడా అనుకోలేదు. అయినా ఆ అమ్మాయి నా పెళ్ళామేనట ! ఆ అమ్మాయి నా కిష్టంలేదు."

"నిజమేరా, పెళ్ళికి ముందు వాళ్ళింటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసిన తరవాతే పెళ్ళి ముహూర్తం పెట్టారు. కాని దాన్ని పెళ్ళి చేసుకుందామని నేనెప్పుడూ అనుకోలేదు. ఒప్పుకోలేదా అంటే, నోటితో ఎప్పుడూ ఒప్పుకోలేదు. పిల్లని చూడ్డానికి నాకు తోడుగా నక్షత్రకుణ్ణి పంపించారుగా ! నక్షత్రకుడిని ఎరగవూ? మా వెంకట్రా మయ్య ! వాడికేదైనా అప్పజెప్పితే జలగ లా పట్టుకుంటాడు. జీడిలా అంటుకుంటా డు. బంకలా తగులుకుంటాడు. ఇంకేముంది! బయలుదేరినదగ్గిర నించి కురుపు సలిపినట్టు ఒకటే సలపడం..

'అబ్బాయ్, బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరాదు. యాభై ఏళ్ళకి శక్తి అంతా వుడిగిపోయిన తరవాత పెళ్ళి చేసుకుని లాభమేమిటి? మీ నాయనమ్మ నీ పెళ్ళి చూడాలని తహ తహలాడి చచ్చిపోయిందా? మీ నాన్న కూడా పెద్దవాడైపోయాడు, ఆయనా పోవచ్చు, దాంతో బెంగపెట్టుకుని మీ అమ్మా పోతుంది. ఇహ, నేను వచ్చే ఏళ్ళే గాని, పోయే ఏళ్ళు కావు గదా! పెళ్ళి కూతుళ్ళని చూడ్డానికి నేనూ నీతో రాలేను, నువ్వు ఒక్కడివీ ఏమీ చూసుకోలేవు. నీకేమీ తెలియదుగదా! వెంటనే పెళ్ళికి ఒప్పేసుకోవాలి. నువ్వు పెళ్ళికి మాత్రం ఒప్పేసుకోవాలి! ఊపిరి సలపనివ్వడు, ఆలోచనా తెమలనివ్వడు. పాడిందే పాట: చెవులు హోరెత్తిపోయాయి. విసుగెత్తి పోయి 'సరే నయ్యా' అన్నాను.

"అమ్మయ్య. పెళ్ళికి ఒప్పేసుకున్నావుగదా, ఇంక పెళ్ళికూతురే కుదరాలన్నమాట. అదెంతసేపు! చూడబోతున్నాంగా ఇప్పుడో పిల్లని, ఈ పిల్ల కాకపోతే మరోటి.. రంభ కాకపోతే ఊర్వశి. అదీ నచ్చకపోతే తిలోత్తమ. కొండమీద కోతి కావాలంటే దాన్నే తీసుకొస్తాం."

పెళ్ళి కూతురిగారింటికి చేరుకునే దాకా నోరు మూతపడలేదు. నా తల దిమ్మెత్తి పోయింది. పెళ్ళికూతురిగారింట్లో ఫలహారం సిద్ధంగా వుంది. జీడిపప్పు పాకం, చేగోడీలు. రెండూ నాకిష్టమే· మా వెర్రినాగమ్మకి చాలా ఇష్టమని కోమటి కోటిలింగాలు మిఠాయి దుకాణంనించి రహస్యంగా తెప్పించిపెడుతూ వుండేది నాయనమ్మ. కోటిలింగాలు దుకాణంలోనే అసలు నేతిసరుకు దొరికేది. ఆ ఫలహారం చూసిన తరవాత కాస్త ప్రాణం స్తిమిత పడింది. మా నాయనమ్మ జ్ఞాపకమొచ్చి కళ్ళ నీళ్ళు తిరిగాయి. నోట్లో నీళ్ళు ఊరించింది ఫల హారం.

"అబ్బాయ్, కతికితే అతకదు. నువ్వు తినకూడదు." అని బాంబు విసిరాడు నక్షత్రకుడు, ఈ రోజుల్లో ఆ పట్టింపులు పనిచెయ్యవని పిల్ల తండ్రి చెప్పినా వినిపించుకోడు. నాకు లేకుండా తిండి ప్రారంభించాడు.

"జీడిపప్పు పాకం చాలా బాగుందే! బెల్లప్పాకం! పంచదారకంటే బెల్లప్పాకమే మంచిది సుమండీ మ్యమ్ మ్యమ్... ఇప్పుడన్నీ సుతారం తిళ్ళు. తెల్లగా వుంటుందని పంచదార తింటే నులి పురుగులు పుట్టుకొస్తాయి...మ్యమ్ మ్యమ్... బెల్లానికి ఆ బాధ లేదు. ఈ ఊళ్ళో తప్ప మంచిబెల్లం దొరకదండి... మ్యమ్ మ్యమ్!!

'ఒకటే' దవడ ఆడింపు. నక్షత్రకుడి ప్లేటు ఖాళీ. నాకోసం తెచ్చిన ప్లేటులోనివి కూడా వాడి ప్లేటులోకి దొర్లిపోయాయి.

"అనుకున్నా, బజారు సరుకు ఇంత ఎలా బాగుందా అని. అమ్మాయి స్వయంగా చేసిందా ? అసలు పిండివంటల దాకా కాకపోయినా మాములు వంట వచ్చునన్న మాట. ఇంకేం. పిండివంటలు కూడా నేర్పెయ్యండి. మావాడికి పిల్ల బాగా నచ్చి పోయిందన్న మాటే...హిహిహి మావాడు భోజన ప్రియుడులెండి.. నిత్యానందం, నువ్వు తినకూడదు గానీ, ఈ తిండి చాలా బాగుందోయ్! చేగోడీలు కూడానూ... కమ్మగా కరకరలాడుతూ వున్నాయి."

నా వొంతు కూడా వాడే తినేశాడు.. నరికి పారెయ్యాలన్నంత కోపమొచ్చింది. గుడ్లెర్ర చేశాను. పళ్లు పటపట కొరికాను. అసలు నక్షత్రకుడికి అది అర్థమై ఏడిస్తేగా ! ఓ గ్లాసు మంచినీళ్ళు, రెండుగ్లాసుల కాఫీ తాగి, బ్రేవ్ మని త్రేన్చాడు.

"దుర్ముహుర్తం రాకుండా పిల్లని రప్పించండి!"

వచ్చింది ఆ అమ్మాయి. గజగమనం, మందగమనంతో కాదు, తారాజువ్వలా రివ్వున వచ్చింది. కుర్చీలో ధీమాగా కూర్చుంది. సిగ్గుపడలేదు. తల వొంచుకోలేదు.
🤠
*సశేషం*

*నిత్యానందం*

*నిత్యానందం గారి వివాహం - 2*

'బాగానే వుంది కదూ' నక్షత్రకుడు నా చెవులో గుసగుస. ఆడవాళ్ళంటే నాకసలే సిగ్గు, అందులో ఆ అమ్మాయి నాకేసి అలా ధాటీగా చూసేస్తూవుంటే...! 'పిల్లని తిన్నగా చూసుకోవోయ్,' అంటూ నక్షత్రకుడు !

"అమ్మాయ్, కొంచెం వెలుగుపడేలా కూర్చో అమ్మా! వెనకటికి ఓ పెళ్ళికొడుకు పిల్లని పసందుచేసి తరవాత క్రీనీడలో తిన్నగా కనిపించలేదు కనక ఒప్పుకున్నానని పేచీ పెట్టాడుట. ఆం.. అది, ఇప్పుడు చూసుకో వోయ్"

ఏం చూడను. ఓ అమ్మాయి, అందులో పెళ్ళికున్నది, సిగ్గూ, శరం లేకుండా చూస్తూ వుంటే, ఆ అమ్మాయి చూడకుండా, నే చూద్దామంటే, ఎప్పుడు ఆ అమ్మాయి నాకేసి చూడబోయినా, ఆ అమ్మాయి నాకేసి చూస్తూనే వుంటుంది. ఆడదాని చూపులు మన్మధుడి బాణాలంటారు. అమ్మాయి చూపులు నాకు ముళ్ళలా గుచ్చుకున్నాయి. "చూశావా, చూశావా అని చెవి కొరుకుతాడు నక్షత్రకుడు. చూశాను ! నెత్తిమీద పువ్వుల గోలెంతప్ప మరేమీ కనిపించలేదు.

"పిల్ల బాగానే వుందికదూ! ఏం? ప్రశ్నలేమన్నా వేస్తావా"

ఎవరిని? అమ్మాయినేట? ఇంతమందిలో చూడ్డానికే సిగ్గుగా వుంటే ఇక నే ప్రశ్నలేం వెయ్యగలను ? బొంచాయిలాటి వూళ్ళలో అమ్మాయినీ, అబ్బాయినీ, ఏ సినిమాకో, బీచీకో తోడు లేకుండా పంపిస్తారుట! అలా వదిలిపెడితే చూపిద్దును నా మజా? అంతేగాని పదిమందిలో కూచోపెట్టి, మాట్లాడమంటే, జంకుగా వుండదూ!

"పోనీ, నేనే పలకరిస్తానులే" అన్నాడు.

"నీ పేరేమిటమ్మా ?"

"సుబ్బమ్మ !"

"బాగుంది, సాంప్రదాయకమైన పేరు." ఆ అమ్మాయి పేరు దిబ్బమ్మ అయితే మరీ సంతోషంగా వుంటుందన్నట్టు మాట్లాడాడు నక్షత్రకుడు..

"చదువుకుంటున్నావా అమ్మా ?"

“ఆ... "

"ఎన్నో క్లాసు ?"

"ఆరో క్లాసు"

"ఆరో క్లాసే? రాసుల పేర్లు తెలుసా ?"

మేగజైన్లలో నక్షత్రకుడు వారఫలాలు తప్ప ఏమీ చూడడు.

" తెలుసండి!"

"చెప్పమ్మా!"

"అశ్వని, భరణీ... వృశ్చికం" అంటోంది ఆ అమ్మాయి నాకు మా చిరాకెత్తుకొచ్చింది. 'అనవసరంగా చంపకోయ్' నీ అవకతవక జవాబుల్తో, మమ్మల్ని చంపొద్దని ఆ అమ్మాయిననాలని నా ఉద్దేశం. 'అనవసరంగా చంపకోయ్  అ మ్మా యి ని' అని నోరు జారిపోయింది.

"మావాడు చాలా మంచివాడులెండి. భార్యని పువ్వుల్లో పెట్టి పూజించుకుంటా డు. ఏమంటావు ?" తొడమీద ఫేడేల్ మని కొట్టాడు.

"ఇంగ్లీషు చదువులు చూడండి. తెలుగు పేర్లన్నా తిన్నగా చెప్పరు. మా అమ్మాయికి హిస్టరీ జాగర్ఫీలు బాగా వచ్చునండీ!" ముక్కుమాటలతో అంది ఆ పిల్ల తల్లి.

"అమ్మా ! అశోకచక్రవర్తి ఏంచేశాడు ?"

"అశోకచక్రవర్తి గొప్ప చక్రవర్తి. ఆయన రోడ్లను త్రవ్వించెను, జంతువులకు.... జంతువులకు, మరమ్మత్తులను చేయించెను. అహా..., ఆసుపత్రులను వేయించెను. చెట్లను కట్టించెను. "

"శభాష్ ! చాలమ్మాచాలు. మెతుకు పట్టుకు చూస్తే చాలదూ! హిస్టరీ చాలా ధాటిగా వచ్చిందండి?" అని నక్షత్రకుడి మెప్పు !

"జాగర్భి కూడానండీ ! భూమధ్య రేఖ ఎక్కడుంది తల్లీ :"

"భూమధ్య రేఖ భూమధ్యంలో ఉందండీ ?"

"రైట్ ! జాగర్భీ క్షుణ్ణంగా వచ్చునండీ మా అమ్మాయికి. ఇంకా ఏమన్నా ప్రశ్న వేస్తే వెయ్యండి?"

నక్షత్రకుడికి అసలు జాగర్భీ అంటే ఏమిటో తెలిస్తేగా ప్రశ్న వెయ్యడానికి.

"తెలుస్తూనే వుందిలెండి - అనవసరంగా అందులో ప్రశ్నలెందుకు ? అమ్మాయికి వంటవచ్చునని ముందరే తేలిపోయింది. ఇంకేం కావాలీ...ఆఁ... సంగీతం ఏమైనా చెప్పించారా ?"

"నోటి పాటేనా, వాయిద్యం కూడానా?"

“నోటి పాటేనండి. వాయిద్యం చాలాయేళ్లు సాధకం చెయ్యాలి. అత్తారింటికెళితే అక్కడ కుదరదు. నోటి పాటైతే ఖర్చు పూర్తిగా వృధాపోదు పేరంటాల్లో మంగళ హారతో, పిల్లలుపుడితే జోలపాటో పాడుకోడానికైనా పనికొస్తుంది."

"అవునవును. సంసారుల సంగీతం అంతేలెండి. కృతులు నేర్పించారా ఏమిటి? బాగుంది. శాస్త్రీయ సంగీతం తప్పకుండా నేర్పంచాలండీ ! త్యాగయ్య మనవాడా అరవలు చూడండి. ఆయన్ని ఖూనీ చేసి పారేస్తున్నారు. మనం నేర్చుకోవాలి. ఏదీ ఒక్క కృతి పాడమ్మా?"

"శ్రుతి లేందే నే పాడలేనండీ నాన్నారూ?"

"శృతి కేమమ్మా ! సా.పా, సా" అన్నాడు నక్షత్రకుడు.. వాడి కోతిచేష్టలు చూస్తూ వుంటే నాకు చిరాకెత్తుకొస్తోంది. 'నీ పాటెవరికి కావాలోయ్, నోరుమూసుకో!' అందామనుకున్నాను గాని వాళ్ళం దరిముందూ గదమాయిస్తే ఏడిచిపోతాడు గదా అని వూరుకున్నాను.

వాళ్ళ నాన్న, అమ్మ, అన్నలు, తమ్ముళ్లు అందరూ బతిమాలగా పాట మొదలెట్టింది.

"నను పాలింపగ నడచి వొచ్చితివో, నా ప్రాణనాధ" అంటూ!

''ఆ హా హా ? యుక్తమైన పాట పాడావు. నడిచిరాలేదు. రైలే ఎక్కి వచ్చాడనుకో, హి హి హి..." తన తెలివికి తనే సంతోషించ ప్రారంభించాడు నక్షత్రకుడు.

"మా అమ్మాయికి సినిమా పాటలు చాలా బాగా వచ్చునండీ! తెలుగే కాదు, హిందీ కూడాను "

"అలాగా, ఏదమ్మా! ఓ సినిమా సాంగు విసురు."

''పందిట్లో పెళ్ళవుతున్నదీ... బలె విందౌతున్నది..."

"ఎందులోదోయ్ ఈ పాట నిత్యానందం ? మా వాడికి సినిమాపిచ్చిలెండి. ఊళ్లో వచ్చిన ప్రతి సినిమా చూస్తాడు, దాన్లో స్టార్లూ, పాటలూ అన్నీ మావాడికి కంఠతా. అవునా, నిత్యానందం?'' తొడమీద మళ్ళీ ఫెడేల్ మని కొట్టాడు. వీడికిదో రోగం. 'అవునా, ఏమంటావు' అని పక్కవాడి తొడమీద చరుస్తాడు. చాచి పుచ్చుకు లెంపకాయ కొడదామన్నంత కోపమొ చ్చింది. పరాయి వాళ్ల ముందర, అవమానం చెయ్యడమెందుకు,అఘోరించి పోతాడని వూరుకున్నాగాని ! 'రైలుకి టైమైనట్టుంది పద' అని వెంటనే బయటి
కొచ్చేశాను. నక్షత్రకుడు పిల్లతండ్రితో పావుగంట గుసగుసలాడాడు. జీడిపప్పు పాకం పొట్లం తెచ్చుకున్నాడు. ఇంకేముందీ! ఆయనకి దాసుడైపోయాడు. భట్రాజులా వాళ్ళని పొగిడాడు.

"ఆడ కూతుళ్ళని కన్నవాళ్ళు ఆశతో వేగిపోతూ వుంటారు. సంధిగ్ధంలో వుంచ కూడదు. పిల్ల సంగతి నువ్వే తేల్చు, కట్నం, కానుక సంగతి నే తేలుస్తాను." మళ్ళీ కురుపు నలుపు !

"ఆ అమ్మాయి పాటేం బాగాలేదు" అన్నాను.

"వరసలు బాగానే వచ్చాయి. పడగ్గదిలో నీకు వినిపించడానికి అది చాలు, కచేరీలు చేయించవుగా ?"

"పిల్ల అందంగా లేదు"

"అందం కొరుక్కుతింటామా?"

"అందం లేకపోతే మానె, ఆ అమ్మాయి ముక్కు వంకరగా ఉన్నట్టుంది."

"నీ ముక్కంత మెలికలు తిరగలేదు."

"మెల్లకన్నులా వుంది,"

''పెళ్ళానికి మెల్లయితే మొగుడికి అదృష్టం."

"బుద్ధున్నవాడు అనవలసిన మాటే అది? వొళ్ళు మండిపోయింది. ఛీ ఛీ! నీతో మాట్లాడకూడదనుకున్నాను. మోసం."

"అబ్బాయి ! నే చెదుతున్నాను విను. ఈ పిల్ల అన్నివిధాలా నీకు తగింది. ఆ మాటకొస్తే పిల్లముందు నువ్వే తీసికట్టని అనిపించావు. నువ్వు నోరు విప్పి పలకరించలేకపోయావు. నీకేమీ రాదేమో నని వాళ్ళకి అనుమానం పుడితే,... 'లేదండీ, మా వాడికి కొంచెం సిగ్గు? మొహమాటం, చనువయిన తరువాత చూడండి, మా వాడి తడాఖా అని నచ్చ చెప్పేసరికి నా తాతలు దిగొచ్చారు. నువ్వు అసమర్థుడవని నీ సంబంధం వాళ్ళకి నచ్చకపోతే. అది దేశమంతా పాకిపోయి, నీకు అసలు పెళ్ళి యోగం లేకుండా పోతుంది. నీ మేలుకోరి చెబుతున్నా ఒప్పేసుకో ... కానింటి రంభ కంటె అయినింటి కోతిని చేసుకోమన్నారు. ఈ సంబంధం కుదిరితే నువ్వు చాలా అదృష్టవంతుడివే ! "

అర్థం పర్థం లేని ఒకటే వాగుడు. ఎంత వాగినా నే జవాబు చెప్పలేదు. పో పో ! వాక్కుని వాక్కుని నీ నోరే నొప్పెట్టి పోతుంది అనుకున్నాను. అంతే భీష్మించు కు మౌనంగా ఉండిపోయాను. నువ్వేచెప్పు నాకిష్టం లేదని తేల్చేసినట్టేనా? కాని, ఇంటి కొచ్చేసింతరవాత పిల్ల నాకు నచ్చిందని నక్షత్రకుడు అందరితోటీ చెప్పేశాడు. నాన్నా, నక్షత్రకుడూ కలసి కట్నాలూ, కానుకలూ అన్నీ నిర్ణయం చేశారు. నన్ను దేనికీ సంప్రతించరు. ఏమీ అడగరు. నాకు ఒళ్లుమండిపోతోంది. ఎప్పటికప్పుడే 'నాకక్కర్లేదు, పెళ్ళి పనులు చేయించకండ ర్రా' అని చెబుదామనుకునేవాణ్ణి. మా నాయనమ్మ ఉంటే పైకి చెప్పకపోయినా మొహాన్ని బట్టే కనిపెట్టేసేది. ఏమిట్రా నాయనా ! ఆముదం తాగిన వాడిలా మొహం పెట్టావు?' అని అడిగి వుండేది.

"నాయనమ్మా! నాకీ పెళ్ళి ఇష్టంలేదే!" అనేవాణ్ణి.

"ఎందుకురా" అనేది.

"ఆ పిల్ల నాకు నచ్చలేదే!"

"ఎందుకు నచ్చలేదురా ?"

"ఆ పిల్లకి మెల్ల.. ముక్కు వంకర. కీచు గొంతుక. పాట రాదు"

'అలాట్రా వెర్రికుంకా! నీకు నచ్చనిపిల్లనిచ్చి పెళ్ళెందుకు చేస్తామురా. వద్దని ఉత్తరం రాయించేస్తానులే" అనేది.

"థాంక్యూ, నాయనమ్మా !"

దాంతో పెళ్ళి బంద్. 'పదిమంది పిల్లల్ని చూసి, అందులో ముగ్గుర్ని ఏరి, వాళ్ళని మళ్ళీ చూసి, ఆ ముగ్గుర్లో ఒకర్తిని ఎన్నుకో వాలని నా ఆశయం. చూసిన మొదటి పిల్లనే నాకు అంటగట్టేస్తే ఎలా భరించగల ను 'నువ్వు చచ్చిపోయి ఎంత సంకటం తెచ్చిపెట్టావు నాయనమ్మా ! నా పెళ్ళి చూడకుండా చావననేదానివి ఎంతపని చేశావు నాయనమ్మా! నా మొహంచూసి భావం కనిపెట్టే మనిషి లేదుకదా ! ఇంట్లో అన్నీ నేనే మాటల్లో చెప్పాలి. కోపమొస్తే నాకు మాటలు త్వరత్వరగా రావని నీకు తెలుసుగా' రంపం లాటి వాడిగల మాటల కోసం వెతుకుతాను, అవి దొరక్కపోతే నాలిక తడబడుతుంది. నాలిక తడబడితే నాన్న కరుస్తాడు అంచేత ధాటీగా పెద్ద ఉపన్యాసం తయారుచేసుకుని వెడదామ నుకుంటూ ఉంటే ముహూర్తం వచ్చేసింది. పీటలమీంచి లేచిపోదామనుకున్నప్పుడ ల్లా, పురోహితుడు నొక్కేసి, కూర్చోబెట్టేసే వాడు. పుస్తెకట్టించేశాడు. నేనొప్పుకోను. ఈ పెళ్ళి నాకొద్దు... ఏదో అఘాయిత్యం చేసేస్తాను.

"ఇక్కడే ఉన్నానండీ నాన్నగారూ!"

"గదిలో కెళ్ళడానికి టైమయిందిట్రా...''

“వస్తున్నానండీ నాన్నగారూ! వస్తున్నానండీ !"

"ఇంకేం అఘాయిత్యామా... ఏం? జవాబు చెప్పక ఇకిలిస్తావేమిటిరా? పోకిరీ పెద్దమ్మా?''
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*సశేషం*


*నిత్యానందం - 3*

*నిత్యానందం గారి సాంసారిక విజయాలు -1*

“ఇంత పొద్దెక్కినా తలపు తీసి ఊడిపడరేం? అమ్మాయ్ సుబ్బమ్మా, వాడికి లేకపోతే మానె, నీకైనా బుద్ధిలేదే? ఎంతసేపు గడియ బిడాయించుకు పడుకుంటారు" అని అమ్మ సాధింపు ప్రారంభించింది.

అమ్మకి నాలుగున్నర నించీ నిద్దురపట్టదు. నాయనమ్మ లాగ గజేంద్రమోక్షంలో పద్యాలూ, భజగోవింద శ్లోకాలూ చదువుకుంటూ మంచం మీదే నడుంవాల్చి వుండిపోదు. లేచి ఇల్లంతా సవరిస్తుంది. ఒంట్లో బాగాలేకపోయినా, చచ్చేదాకా వెట్టి చాకిరీ తప్పదని గొణుక్కుంటుంది. విసుక్కుంటుంది.

"లేవరా నిత్యానందం, ఎండెక్కిపోయింది రా..."

కళ్లు నులుముకుంటూ లేవబోయాను.

"ఇంకా బద్ధకం తీరలేదు. పడుకోండి" అంది మా ఆవిడ.

"ఎండెక్కి పోయిందట" అన్నాను.

"మరేం ఫరవాలేదు. ఇంకా ఆరున్నర కాలేదు. ఈ వెధవ్వూళ్ళో తెల్లారకుండానే ఎండొస్తుంది. మీ నాన్న ఆఫీసుకి టైముని బట్టి వెళతారా, ఎండనిబట్టా? పడుకోండి, పడుకోండి"

"నే లేస్తాను. నువ్వు పడుకో"

"మీరు మాత్రం లేచి వెలగబెట్టే రాచకార్యా లేమున్నాయి. మొగుడు లేచినా ఇంకా పడుకుందని నన్ను ఆడిపోసుకోడానికా, మీరూ పడుకోండి" అని దబాయించేసింది.

"లేవరా"

“పడుకోండీ”

"నిన్నేరా"

"మిమ్మల్నేనండీ"

"లెమ్మంటే"

“పడుకోమంటే"

అవతల తల్లి, గదిలో భార్య. ఎవరు గెలిచారా? ఏమిట్రా. చొప్పదంటు ప్రశ్న ? ఇలాటి విషయాల్లో ఎవరు గెలుస్తార్రా?

"వొరేయ్. ఎంతసేపురా మొద్దు నిద్దర ? లే" అని మా నాన్న అందుకున్నాడు. వెంటనే ఉలిక్కిపడి లేచి కూచున్నాను. నాన్న అందుకుంటే రండోలు వాయించినట్టే. ఇహ లాభం లేదు. లేచి బయటికి పోతేనే మంచిది.

"అనవసరమయిన విషయాల్లో జోక్యం కలుగజేసుకుంటున్నారు మీ నాన్న" అంది మా ఆవిడ, తనేదో మహాసత్యం మొట్ట మొదటి మాటగా కనిపెట్టినట్టు. నాకెప్పుడో తెలుసునయ్యె ఆ సంగతి. లేకపోతే ఈ పెళ్ళి మాత్రం జరిగుండేదీ! మొదట ఇష్టం లేదన్నానే. ఆ అమ్మాయే. ఇప్పుడిష్టమే. ఎలా మారిపొయానా? ఒరే, పిచ్చి ప్రశ్న వెయ్యకు. పెళ్ళామంటే అందరికీ ఎలా ప్రేమ పుట్టుకొస్తుందో, నాకూ అలానే. వొరేయ్ కాస్సేపు నీ కుళ్ళంకలు కట్టేసి, విను, ఏం చెబుతున్నానూ? మా నాన్న అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటు న్నాడని మా ఆవిడ అంది కదూ.

"అవును. ఆ సంగతి నా కెప్పుడో తెలుసు" అన్నాను.

"అనవసర జోక్యం కలగజేసుకోవద్దని చెప్పండి" అంది.

"నేనే? మా నాన్నతోటే ? కరుస్తాడు."

"కరవడానికి కుక్కా ఏమిటండీ, మనిషేగా?"
"నీకేం నువ్వేమైనా చెబుతావు, ఎదట పడేది నువ్వా నేనా?"

"ఏమిట్రా గదిలో గుసగుసలు, లేచి రమ్మంటేను" గుండెలు అదిరిపోయే లాగ నాన్న కేక. ఎదిగి, పెళ్లాంతో కాపురం చేస్తున్న కొడుకుని అనవలసిన మాటే ? 'నాన్నగారూ, ఇలా నాతో మాట్లాడ్డానికి వీల్లేదు. మా ఆవిడ వింటూంటే నామీద అధారిటీ చెలాయించడానికి వీల్లేదు' అని లేచి చెప్పేద్దామనుకున్నాను. కాని నేను ఊరికే లేచిపోతున్నాననుకుంది కాబోలు మా ఆవిడ, నే లేవకుండా అదిమిపెట్టి "ఆయనకి తల నొప్పిగా ఉందండీ, లేవ లేకుండా వున్నారు" అని జవాబు చెప్పింది.

"అజీర్తి తిళ్ళు తింటే తల నొప్పి రాకేంజేస్తుంది !"

"నిన్న రాత్రి తిన్నగా భోం చెయ్యనే లేదు."

"సాయంకాలం టిఫిను మస్తుగా తింటే రాత్రి భోజన మెందుకు !"

"ఏ తల నొప్పయినా, లేచి వొళ్ళువొంచి పని చేస్తే అదే పోతుంది"

"అది పోతేగాని లేవడానికి ఓపికరాదు. లేస్తే తల తిరుగుతుంది"

మా నాన్న వెనక్కి తగ్గాడు.

"తల తిరుగుతోందీ? జ్వర మొచ్చిందేమో చూడనీ" అని మా అమ్మ కేకెట్టింది.

"జ్వరం లేదులెండి"

"అన్నీ తెలిసినట్టు మాట్లాడతావేమిటి ? వొళ్ళు చూడనీ"

"నే చూసే చెబుతున్నాను. చల్లగానే వుంది”

"మా అబ్బాయి సంగతి నీకు తెలీదు. పైకి చల్లగా వున్నా ఒక్కొక్కప్పుడు ఉష్ణం వుంటుంది.”

"దానికి ముసుగెట్టుకు పడుకోడమే మందు"

"శొంఠి కొమ్ము అరగదీసి పెడితే రెండు నిమిషాల్లో తలనొప్పి పోతుంది".

"ఆ నాటు వైద్యపు రోజులు పోయాయి, ఇప్పుడు అంజనాలకి, ఆస్పిరిన్లకీ గాని లొంగడం లేదు ఈ తలనొప్పులు."

మాటకి మాట జవాబు చెబుతూ పావుగంట దాకా మా ఆవిడ తను గదిలో నుండి కదల్లేదు, నన్ను కదలనివ్వలేదు. కొంత అయిన తరువాత "బద్ధకం బలిస్తే, తలనొప్పేగాదు, ఒళ్ళంతా నొప్పులు పుట్టుకొస్తాయి. లేచి మందన్నా మింగమను" అని నసుక్కుంటూ నాన్న జారుకున్నాడు.

"అన్నిటికీ అదే జవాబు చెబుతుంది కాని వీడి నోరు పెగలదే ?" అని గొణుక్కుంటూ చివరికి అమ్మ జారుకుంది. అలా మరో పావుగంట విశ్రాంతి తీసుకునిగాని మేం బయటపడలేదు తరువాత ఒకటి రెండు మార్లు మళ్ళీ మమ్మల్ని పెందరాళే లేపడానికి ప్రయత్నం చేశారు కాని, మనం కొరకబడలేదు. ఏమిటనుకున్నావురా, నిత్యానంద మంటే? మనకి కొంత మాట సాయం, వెనక దమ్ము వుండాలి గాని నే లేస్తే మనిషినిగాను. మా నాయనమ్మ బతికి వున్న రోజుల్లో, నీకు జ్ఞాపకం లేదూ, అప్పడాల పిండి మాష్టారుక్కూడా నేనంటే హడలు పుట్టింది. అప్పడాల పిండి మాష్టార్నెరగవురా, గవర్రాజుగారి బడిలో రెండో మాష్టారు. చిన్నప్పుడెప్పుడో వాళ్ళమ్మ అప్పడాల పిండి కలిపి పెట్టుకుంటే, దబ్బకాయంత ముద్ద ఎవరూ చూడకుండా ఎత్తుకు పోయి, స్వయంగా అంతా భక్షించేశాడుట. దాంతో నాలుగు రోజులు విరోచనాలు పట్టుకున్నాయట.
కలరా వచ్చిందేమోనని రెండు రోజులు మందులిప్పించిం తరవాత ఈ సంగతి బయటపెట్టాడుట. అంచేత వాళ్ళింట్లో వాళ్ళే అప్పడాల పిండి అని ఓ ముద్దు పేరెట్టుకున్నారుట. వాళ్ళ వాళ్లు పెట్టుకున్న పేరే గదా సంతోషంతో స్వీకరించగూడదూ ! ఆ మాట ఏ రూపంలో వినిపించినా వుడుక్కునేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు. పేంబెత్తంతో కాదురా, రూళ్ళ కర్రతో కొట్టేవాడు. ఎక్కాలు వల్లించమనడం తప్ప క్లాసులో చెప్పే పాఠం లేదు. దానికి తోడు వాడికి నత్తి కూడాను. బకాసురుడు అదేదో ఊరి మీదపడి అందర్నీ పీడించుకుతిన్నట్టు స్కూల్లో పిల్లల్నందర్నీ పీడించుకుతినే వాడు. కాని బకాసురుని ప్రాణానికి భీముడు తటస్థపడ్డాడు. అప్పడాల పిండి మాస్టారుకి ఏకు మేకై గుచ్చుకున్నాడు నిత్యానందం. ఎలా గంటావా? ఓనాడు మా నాయనమ్మంది "వొరే నిత్యానందం. అప్పడాలు ఎండబెట్టాను. కాకులు రాకుండా కాయరా అంది.

"కాకుల్నయితే కాస్తానుగాని, పిచ్చికల్ని పిలుస్తాను నాయనమ్మా" అన్నాను.

"వీపు చిట్లగొడితే బావురుమని ఏడుస్తావు కూడాను'' అన్నాడు మా నాన్న, మా నాన్నకి 'జోకులు' తెలిసేవి గావు. మా నాయనమ్మ మాత్రం 'నిత్తిగాడికి కవిత్వం చెప్పడ మొస్తుంది.' అని సంతోషించింది. ఉష్ ఉష్ అని కాకుల్ని కాసి అలిసిపోయి, ఆలశ్యంగా స్కూలుకెళితే మాస్టారు పట్టుకున్నాడు.
రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి
*సశేషం*


*నిత్యానందం - 4*

రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి

*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 2*

*ఎ.. ఎందుకింత ఆలశ్యమయింది"

"మాస్టారండీ మరేమోనండీ..."

"ని.. ని.. నీళ్ళు న.. న.. నమలకు"

"మా నాయనమ్మండి అప్పడాలు ఎండబెట్టి కాకుల్ని కాయమందండి. అంచేత ఆలశ్యమయి పోయిందండి."

"భ.. భ.. భడవా బె.. బ్బెంచెక్కు"

"నేనేం చెయ్యలేదండి మాస్టారూ. మా నాయనమ్మే అప్పడాలు ఎండబెట్టి కాపలా వుండమందండి. మా ఇంట్లో కాకులు చాలా ఎక్కువ. కాపలా కాయకపోతే అప్పడాలు బతకనివ్వవు."

"పు.. పుండాకోర్ గొ.. గ్గోడ కుర్చీ వెయ్యి."

"తప్పంతా కాకుల్దండి. నాది కాదండి"

"వీపు చి.. చీరేస్తాను ఒ.. ఒళ్లు ఉతికేస్తా ను". అసలు మాట వినిపించుకోడు. ఒకటే ధుమధుమ.

"చె.. చెయ్యిపట్టు" అరిచెయ్యి వెనక్కి తిప్పి రూళ్ళకర్రతో ముడికలమీద వాయించాడు.

"మా నాయనమ్మతో చెబుతానుండండి'' అని ఏడుచుకుంటూనే స్కూల్లోంచి పారిపోయాను. నాయనమ్మ రెట్టింపు పటిక బెల్లం పెడితేగాని, ఏడుపు మానలేక పోయాను..

"నే నింక ఆ స్కూల్లో చదువుకోను నాయనమ్మా. మరో స్కూల్లో చేర్చేసెయ్యి !"

"వెర్రి నాన్నా, అద్దాంతరంగా ఇంకో స్కూల్లో ఎలా చేర్చుకుంటార్రా..."

"నువ్వు చెబితే చేర్చుకుంటారు"

"ఏడాది మధ్యలో నే చెప్పినా చేర్చుకోరురా"

"అయితే ఈ ఏడు చదువు మానేస్తాను. అప్పడాల పిండిగాడు నన్ను కొట్టి చంపుతున్నాడు. వాడిదగ్గర నే చదువుకోను"

"కొట్టొద్దని నే చెబుతానులే”

"వాడూరికే వుడుక్కుంటాడు. అనవసరం గా దంచుతాడు. చెప్పే పాఠాలు తక్కువ. కొట్టే దెబ్బ లెక్కువ.”

''నీ జోలికి రావొద్దని నే చెబుతాగా”

“మెల్లిగా చెబితే లాభం లేదు.”

"గట్టిగానే చెబుతాలే, వెళ్ళు"

"నువ్వొచ్చి దిగబెడితేనేగాని వెళ్ళను”

పది నిమిషాలు బేరమాడిన తరువాత, మళ్ళీ కసింత పటికబెల్లం పెట్టి నాయనమ్మ కర్ర పొడుచుకుంటూ నాతో స్కూలు కొచ్చింది. నాయనమ్మ ఇంట్లో నడవడానికి కర్రసాయం అక్కర్లేదుగాని, రోడ్డు మీద నడవాలంటే కర్ర చేతిలో వుండాలి. కుక్కల్నీ పందుల్నీ ఝడిపించడానికి. తిన్నగా క్లాసులోకే వెళ్ళిపోయాం.

"నాలుగు మూళ్ పన్నెండు. నాలుగు నాళ్ పదహారు" అని క్లాసంతా అరుస్తున్నారు. అప్పడాల పిండి వెంకన్నబుగ్గలు నులుము తున్నాడు. నన్నూ, మా నాయనమ్మనీ చూడగానే క్లాసంతా నిశ్శబ్దమైపోయింది. అప్పడాల పిండి నాకేసి పెద్దగా గుడ్లురిమి చూశాడు. నాయనమ్మ వెనకాలుంటే నాకేం లెక్క! పో పో, చూసుకో అనుకున్నా.

"ఏమయ్యా, ఎందుకయ్యా పిల్లల్ని అలా కొట్టి చంపుతావు" అంది నాయనమ్మ. రూళ్ళకర్రతో వేళ్ళ మీద కొట్టావట, మా వెర్రి నాగమ్మని!"

"అల్లరి చె..చేస్తే పనిష్ మెంట్ ఇ.. ఇవ్వద్దా"

"పిర్రమీద దెబ్బకి ఫిర్యాదు లేదుగాని, వేళ్ళ మీద కొడితే వూరుకుంటారుటయ్యా. అయినా మా వాడిప్పుడు ఏం అల్లరి చేశాడని కొట్టినట్టు"

దానికి జవాబు చెప్పగలిగితేనా. గుడ్లు మిటకరించి చూశాడు మాష్టరు.

"నాయనమ్మా, నువ్వు అప్పడా లెండబెట్టి నన్ను కాకుల్ని కాయమన్నావా. ఎందుకాలిశ్యంగా వచ్చావని అడిగితే మాస్టారూ, 'మా నాయనమ్మ అప్పడాలు ఎండబెట్టి కాకులెత్తుకుపోకుండా కాయ మంది" అన్నాను, అంతే. అప్పడాలు అనగానే ఆయనకి కోపమొచ్చింది. నువ్వే చెప్పు అప్పడాలు అన్నాను గాని అప్పడాల పిండి అన్లేదుగా, ఇందులో నా తప్పేమన్నా వుందా?'' అన్నాను.

"అయ్యో, అప్పడాల పిండీ. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా ఉడుక్కుంటూనే ఉన్నావుటయ్యా''

"ఏమండోయ్ బామ్మగారూ, పెద్దవారని మర్యాదగా ఊరుకుంటే” అప్పడాల పిండి గుడ్లెర్రజేశాడు. నాయనమ్మ ఝడుస్తుందా!

"ఉడుకుడుకు బోలే" అంది. క్లాసంతా గొల్లుమన్నారు. ఏం జేస్తాడు? ఆయన చేతిలో రూళ్ళకర్రయితే, మా నాయనమ్మ చేతిలో పెద్ద కర్ర. మా నాయనమ్మతో చాల్లేడుగా.

"మావాడి జోలికి ఇంకెప్పుడూ రాకు. వాడి వల్లెమన్నా తప్పు వుంటే నాతో చెప్పు. నే కేకలేస్తాను" అని కట్టడిచేసివెళ్ళిపోయింది. ఆ తరవాత, మాస్టారుకి నాయనమ్మ, మనమంటే హడల్.

ఇప్పుడు మా ఆవిడ వల్ల మన అథారిటీ మళ్ళీ లేచిపోయింది. మొదటి విజయం నిత్యానందంగారు ఇష్టమొచ్చినంతసేపూ విశ్రాంతి తీసుకోవచ్చును. వారిని లెమ్మని వొత్తిడి చెయ్యడానికి ఎవరికీ అధికారం లేదు. ఎవరైనా ఆ విషయం గుర్తించక ఒత్తిడి చేసినా, నిత్యానందం గారు ఖాతరు చెయ్యరు. హాయిగా నిద్రపోతారు. నిద్ర పట్టకపోతే కళ్ళు తెరిచే నడుం వాలుస్తారు. లేదా, పక్కమీద పడుకుని, అటూ ఇటూ దొర్లుతారు. కాని, లేవరు. అదే విధంగా నక్షత్రకుడి బాధా వదిలిపోయింది. మా పెళ్ళయిం తరువాత వాడిపోరు భరించడం మరీ దుర్భరమయింది. నాకే కాదు, మా ఆవిడకి కూడా సలహాలివ్వడం ప్రారంభించాడు. - బోడి సలహాలు. మా పెళ్ళి తన వల్లే జరిగిందిట. వెయ్యి అబద్ధా లాడి ఇల్లు నిలబెట్టాలన్న సామెత పట్టుకుని ఎంతో కష్టపడి, ఈ సంబంధం కుదిర్చాడుట. అంచేత మా సంసారం దిద్దడానికి తనేవో బోలెడు హక్కులు దాచి పెట్టుకున్నట్టు అన్ని విషయాల్లోనూ
లుడుంగున జొరబడి చెప్పొచ్చేవాడు.

"ఏమిటోయ్ నిత్యానందం. మీ అమ్మగారు గోలెట్టి పోతున్నారు. ఆవిడొచ్చిందగ్గిర్నించీ అమ్మగారి మాట అసలే వినడంలేదుట. మీఅమ్మ నీమీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎప్పుడు కోడలొస్తుందా, ఎప్పుడు సుఖ పెడుతుందా అని ఎదురు చూసింది. కాని చిన్న మెత్తు సాయం చెయ్యదుట నీ పెళ్ళాం. ఎక్కడ కందిపోతుందో అని అన్ని టికి వెనకేసుకొస్తావుట. మా అందరికీ పెళ్ళిళ్ళవలేదా? పెళ్ళాలు కాపరానికి రాలేదా? తప్పు సుమా. పెళ్ళాన్ని అదుపులో ఉంచుకోవాలి. అతి చనువిచ్చి ముద్దుచేస్తే ముక్కట్టుకుంటారు. 'తల్లి విష మాయె, పెళ్ళాము బెల్లమాయే' అవకూడదు"

మనవాడి ఉపన్యాసాలు వినే రోజులు పోయాయి. 'ఈ గోడలకీ ఆ స్తంభాలకి చెప్పుకో' అని వాడు ప్రారంభించగానే చల్లగా జారిపోయేవాడిని.

"చూడు సుబ్బమ్మా" అని మా ఆవిడ దగ్గిర ప్రవేశించేవాడు. "నీ పెళ్ళి చేయించిన వాడిని కనక, నీ మంచి కోరినవాడిని కనక, చెబుతున్నాను" అని ప్రతి మాటూ ఉపోద్ఘాతం. ''మా పెళ్ళి చేయించింది పురోహితుడయ్యా, నువ్వు కాదు" అందామనుకునే వాడిని. అత్తగారికి అణుకువగా వుండాలి. గుట్టుగా సంసారం దిద్దుకోవాలి.”

"అవునండి అబద్దాలాడ కూడదు. దైవభక్తి కలిగి వుండాలి. పెద్దల మాట ధిక్కరించ రాదు. ఇంకా చాలా నీతులు స్కూల్లోనే నేర్చుకున్నానండి." అని మా ఆవిడ జవాబు. ఏ మాత్రం బుద్ధున్న వాడయినా దాంతో వెనక్కి తగ్గవలసిందేనా... కాని వాడికి సున్నితంగా చెబితే అర్థంకాదుగా. అలా నీతులు చెబుతూనే ఉన్నాడు-సల హాలు ఇస్తూనే ఉన్నాడు...
🤠
*సశేషం*

꧁☆•┉┅

*నిత్యానందం -5*

*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 3*

"నీకే ఓ కొడుకున్నాడనుకో. వాడు పెద్ద వాడయినాక పెళ్ళి చేశావనుకో. కోడలు ఇంటికి కాపరానికొచ్చి నువ్వు చెప్పినమాట సుతరామూ వినలేదనుకో. అప్పుడు నీకెలా ఉంటుంది. ఆలోచించుకో''

మా ఆవిడ కింకా నెలలన్నా తప్పలేదు. వాడు అనుకోమన్నవన్నీ ఆలోచించుకుంటే బుర్ర గిరగిర తిరిగిపోదూ. మా ఆవిడ విసిగిపోయిందంటే తప్పా, విని విని చివరికి ఓనాడు మా ఆవిడంది...

"నక్షత్రకుడుగారూ, నాదో చిన్న కోరిక''

ఆ పేరు వినగానే వాడు బిక్కచచ్చి పోయాడనుకో. ఇన్ని రోజుల్నించీ వాడికి పేరంటే పెట్టాముగాని, ఎదటబడి ఆ పేరెట్టి ఎప్పుడూ వాణ్ణి పిలవలేదు.

"నక్షత్రకుడుగారూ, మా ఇంటి నుంచి
వీసెడు జీడిపప్పుపాకం తెప్పించి పెడతాను గాని, మాకు సలహాలివ్వడం మానుకుంటారూ?" దాంతో వాడి పై ప్రాణం పైన పోయింది. మొహం పాలిపోయింది. నిజమే, నలుపు మనిషి కనక ఎంత పాలి పోయినా, మొహంలో కనిపించదనుకో. కాని వాడి వాలకం చూస్తే పాలిపోయినట్టు తెలిసిపోయింది. వుండరా! చొప్పదంటు ప్రశ్నవేసి చంపొద్దని చెబితే వినిపించుకోవే మిట్రా? మా ఆవిడ ఇంత గట్టిదని తెలిసుం టే ఈ పెళ్ళి రికమెండు చేసే వుండనని, అమ్మతోటో, ఇంకా ఎవరితోటో చెప్పుకు ఏడ్చాడుట.

"ఏడవకు ఏడవకు వెర్రి నాగమ్మ, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారు" అని ఓదారుద్దామను కున్నాగాని, మన వేళాకోళం అర్థంగాక, తిరిగి తగులుకుంటాడేమోనని కిక్కురు మనకుండా వూరుకున్నా. పర్యవసానం, మా జోలికి రావడం మానుకున్నాడు.

నక్షత్రకుడి నోరు మూయిస్తే బాగానే వుంది గాని, నా స్నేహితుల్ని కూడా ఝడిపించి నే వాళ్ళని కలుసుకోనివ్వకుండా చేస్తోందిరా ! ముఖ్యంగా బండరాముణ్ణి. బండరాముడు నీకు తెలుసుగా. ఒకటో క్లాసు నించి నేనూ వాడూ స్నేహితులం. నేను స్కూలుకెళ్ళనని మారాము పెడుతూ వుంటే వాణ్ణి మచ్చిక చేసి, సాయమిచ్చి స్కూలుకి పంపించింది నాయనమ్మ. నేనంటే వాడికి తగని ఇష్టం. నామీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు నే చేసిన అల్లరికి, వాడు కిక్కురు మనకుండా దెబ్బలు తిన్నాడు కూడాను. బండ వెధవైనా, బుద్ధిమంతుడ ని నాయనమ్మే సర్టిఫికెట్ ఇచ్చింది. మాట మోటు అనుకో, మా ఆవిడ దగ్గర జాగర్తగా వుండాలని వాడికి తెలియొద్దూ.

ఓనాడేం చేశాడంటే, రోడ్డు మీద నించుని, “ఒరే నిత్యానందం పెళ్ళయిందగ్గిర్నించి నీ దర్శనమే మాకు కరువయిపోయింది. పడక గది వదలడమే లేదు. ఈ పద్ధతిని పీనుగయిపోతావు జాగర్త. సరసాలు చాలించి, బయటకిరా' అని ఇంటి కప్పెగిరి పోయేలా అరిచాడు.

''ఎవరండోయ్ ఈ స్నేహితుడు ?" అంది.

"వాడా-బండ రాముడు !"

"పోకిరీ రాముడులా వున్నాడు"

"శుభమ్ ఆ టైటిల్ తో మరో సినిమా తీసి పారెయ్యొచ్చు. మాటలు నువ్వూ, పాటలు నేనూ రాసేద్దాం" అన్నాను. మా ఆవిడ మెత్తబడబోయింది కాని ఇంతలోనే “ఓరేయ్ బయటి కొస్తావా, ఇంట్లో చొరబడి ఈడ్చుకు రమ్మంటావా'' అని వాడు మళ్ళీ అరిచాడు. వాడికి ఆవేశమొస్తే వొళ్లూ పై తెలీదు. అన్నంత పనీ చేసేస్తాడు. ఎవడో సవాలు చేశాడని ఈత రాకుండనే కాలవ లోకి ఉరికాడు. వుషారిస్తే, తాటిచెట్టు మీదకి పాకిపోయాడు. చచ్చినంత పని అయేదనుకో! అందుకే బండరాముడని బిరుదొచ్చింది. వాణ్ణి కవ్వించడం కొరివితో తల గోక్కోడం.

"క్యా బాత్ హై. ఆడంగులంటే మనకేం భయం లేదురోయ్. రమ్మంటావా లోపలికి,” అన్నాడు.

“వొద్దు నేనే వస్తున్నారా. నువ్వు లోపలికి జొరబడకు'' అని ఆపేశాను.

“ఇలాటి వెధవల్తో మీకు స్నేహ మేమిటండీ" అంది మా ఆవిడ. మా స్నేహం యొక్క హిస్టరీ, జాగర్ఫీలు చెప్పాను. చివరికి ఈ మాటుకి మాత్రం వెళ్ళనిస్తున్నాని వదిలి పెట్టింది.

"పోకిరీ వెధవల్తో స్నేహం కూడదు చెడిపో తారంటుంది. ఇదివరకు రోజూ కలుసుకునే వాళ్ళం. ఇన్నాళ్లూ చెడిపోనిది, ఇహ ముందు మాత్రం ఎందుకు చెడిపోతాను అంటే వినదు. ఇప్పటికే చెడిపోలేదని గ్యారంటీ ఏమిటంటుంది! ఒక్కొక్కప్పుడు మహ మూర్ఖపు పట్టుబడుతుంది. ఆడవాళ్ళంతా, ముఖ్యంగా పెళ్ళాలంతా అంతేనా. అలాటప్పుడేం చెయ్యాలిరా. దంచాలా ? ఏడిశావులే. పిచ్చి సలహాలు చెప్పకు. మా ఆవిడంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టంరా ! ఆవిడొచ్చిన తరవాత మనకింట్లో చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. అంచేత అప్పుడప్పుడు నాకు వళ్లు రవరవ మండిపోయి డొక్క నాలికలు చీరేద్దామ న్నంత కోపమొచ్చినా కొట్టడానికి చేతులు లేవవు. మనకే ఎదురు తగులుతాయేమో నన్న భయమేమోనంటావా. పోరా. అలాటప్పుడు ఏం చెయ్యమంటావురా... అయితే బతిమాలుకోమంటావా! వొరేయ్ నే అదే చేస్తున్నారా! ఎలాగో అలాగ నా మాట నెగ్గుకొస్తూనే వుంది, భయాన సాధించినా, నయాన సాధించినా విజయం విజయమే కదురా! ఎందుకురా ఆ నవ్వు? పో, నీ పారపళ్లే బయట పడతాయి, నాకేం!
📖

*నిత్యానందంగారి విజ్ఞాన యాత్ర -1*
😎

కనిపించిన శుంఠల్లా, ఏమండోయ్ నిత్యానందంగారూ, ఎంతవర కొచ్చింది. మీ విజ్ఞానయాత్ర అని అడిగేవాళ్ళే, దిష్టి తగలక ఏం చేస్తుంది. పురిట్లోనే సంధి కొట్టింది. అదేమిటంటా? మొదట్నించీ చెబుతాను విను.

ఓనాడు నేమా, రంగాచారీ, మస్తాన్, సుభాష్ చంద్రబోసూ, చంద్రరావూ మా ఇంటి అరుగుమీద కూర్చుని బాతాఖానీ కొడుతున్నాము. అసలు ఎప్పుడూ వొంతెన గట్టుమీద కూచుని బాతాఖానీ వేసేవాళ్ళం. మా ఆవిడ తగాదా పెడితే, మా ఇంటి అరుగుమీదికి మార్చాము, ఇదీ మానుకోమని మా ఆవిడ పేచీ పెడుతోంద నుకోండి. అయినా ఎలాగో సముదాయించి వారానికోమాటైనా కలుసుకుంటున్నాము. మాటల సందర్భంలో నేనన్నాను. 'వొరేయ్ మనం మరీ వేసిన గొంగళీల్లా అయిపోతు న్నాం రా. దేశాటనం చేస్తే జ్ఞానం వృద్ధి అవుతుందంటారు. మనం ఓమాటు దేశ సంచారానికి బయటదేరాలిరా.'

“నాకూ అదే అనిపిస్తోందిరా" అన్నాడు చంద్రరావు.

"ఏడిశావు. నాకు అనిపించినప్పుడే నీకూ అనిపించిందేం"

“నిజం. ఇవాళే ఓ ప్రకటన చదువుతూ వుంటే అనిపించింది."

"ఏమిట్రా ఆ ప్రకటన ?''

"ఇదిగో వినండి...''మంచిసమయము, మించిన దొరకదు. త్వరపడుడు, త్వరపడుడు. కన్యాకుమారి నించి బదరీ నాథము వరకూ పుణ్యక్షేత్రముల దర్శించి తరించండి. చవక, అతిచనక కన్నుల పండువైన సుందరదృశ్యాలు. పుష్టికరమైన భోజనాలు, రాఘవరావుగారి సంపూర్ణ యాత్రా స్పెషల్. కడుపులో చల్ల కదలకుండా ప్రయాణం చెయ్యండి. పుణ్య మార్జించుకోండి. చవక, అతి చవక. మడిగా ప్రయాణం చెయ్యదలచిన వారికి ప్రత్యేక సౌకర్యాలు. త్వరపడుడు. రాఘవరావుగారి సంపూర్ణ యాత్రాస్పెషల్. కొద్ది టిక్కట్లే మిగిలాయి."

ఇది చదివినప్పుడే నాకూ ఆ బుద్ధిపుట్టింది. మనం కూడా బయలుదేరితే సరి." అన్నాడు చంద్రరావు.

*సశేషం*
꧁☆•

*నిత్యానందం -6*



రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి


*నిత్యానందం గారి సాంసారిక విజయాలు - 4*


ఇది చదివినప్పుడే నాకూ ఆ బుద్ధి పుట్టింది. మనం కూడా బయలుదేరితే సరి." అన్నాడు చంద్రరావు.


"ప్రకటల్ని చూసి మోసపోకూడదు" అన్నాడు సుభాష్ చంద్రబోసు. ఓ సంవత్సరం క్రితం పదిరూపాయలు పెట్టి వాడో రిస్టు వాచీ కొన్నాడు, కొండ మీద నించి ఎత్తేసినా, సముద్రంలో ముంచేసినా అది పాడవదనీ, ఆగదనీ పేపర్లో గ్యారంటీ చూసి! బ్రహ్మాండ మైన వాచీ చవగ్గా వచ్చేస్తోందని మురిసిపోయి కొనేశాడు, వద్దని మేం హెచ్చరిస్తున్నా వినకుండా కొనేశాడు. అది పన్నెండు గంటలన్నా తిరక్కుండా ఆగిపోయింది. కొండమీద నించి ఎత్తేసినప్పుడు ఆగిపోతేనే మేము బాగుచేస్తాం కాని ఇంట్లో కూర్చుని చేతికి పెట్టుకున్నప్పుడు తిరగడం మానేస్తే బాగుచేస్తామన్న గ్యారంటీ లేదంటుంది 

కంపెనీ, వీడింకా కంపెనీకి ఉత్తరాలు వ్రాస్తూనే వున్నాడు - వాళ్లు జవాబులు వ్రాయడం మానుకున్నా !


"భయపడకురా. అందరూ నీలాగే పప్పులో కాలేస్తామనుకున్నావురా! వివరాలన్నీ తెలుసుకునే డిసైడ్ చేస్తాం. ఏమయినా

గోల్డెన్ ఆపర్చునిటీలా వుంది. వదులుకో కూడదు.'' అన్నాడు చంద్రరావు.


"పధ్నాలుగు కారట్ల గోల్డెన్ అపర్చూనిటీ" అన్నాడు రంగాచారి.


"కారక్టర్లు కాదురా, కారట్లు" అన్నాను.


“ఏడిశావు. మహ తెలిసినవాడిలా మాట్టాడకు. కారట్ అంటే ఇంగ్లీషు కూర. పచ్చిది కూడా తినచ్చు. అదెందుకు ఉంటుంది" అన్నాడు రంగాచారి. వాడికి వాదించడమంటే చాలా ఇష్టం. ప్రతిదానికీ ఎడ్డెమంటే తెడ్డెమంటాడు. పెడర్థాలు తీస్తాడు.


కారట్లు బంగారంలో కాదు. పులుసులో వుండొచ్చును" అన్నాడు.


“కారక్టర్ మనుష్యులకుంటుందిగాని, బంగారానికి కారక్టరేమిటి ?"


"కల్తీ బంగారానికి కారక్టర్ తక్కువన్న మాట"


"నాన్సెన్సు బంగారానికి వుండేది కారటే"


"గోన్ సంచి. బంగారానికి వుండేది కారక్టరే''


"కాదు"


"అవును"


"కా... దు"


"అ...వు... ను!"


"ఛాలెంజి. మా ఆవిడని అడుగుదామా”


"మీ ఆవిడ అధారిటీ నీమీద గాని నాకేమిట్రా, ఛాలెంజి పిలు చూద్దాం'' అన్నాడు రంగాచారి.


"వొద్దు బాబో వొద్దు. ఆవిడతో వాదించి గెలవడానికి నీ ముత్తాతలు దిగి రావాలి. అసలు ఆడంగులకి ఇందులో ప్రమేయం లేదు.'' అన్నాడు సుభాష్ చంద్రబోసు.


"నేతాజీ పేరెట్టుకునిగూడా ఆడంగులంటే డంగెత్తిపోతాడేం వీడు" అన్నాడు రంగాచారి.


''సుబ్బాయమ్మగారి కొంగు పట్టుకుని వాదనలోదిగే నిత్యానందం శిఖండిని ముందెట్టుకు కదనరంగంలో ఉరికిన భీష్మాచార్యుడు! వాడిని జయించడం ఎవరికి తరంగాదు. వెనక్కితగ్గు" అన్నాడు చంద్రరావు.


"శిఖండిని ముందెట్టుకున్నది భీష్మాచార్యులురా ! ఆయన్ని చంపడానికి అర్జునుడు శిఖండిని ముందెట్టుకున్నాడు'' అన్నాడు. మస్తాన్ సాయిబు.


"అందుకే కలికాలం. సాయిబుకి తెలిసిన పాటి పురాణాలు మనకి తెలియకుండా పోయాయి" అన్నాడు సుభాష్ చంద్రబోసు.


"నీ పురాణజ్ఞానం ఏడిసినట్టుంటే. నీ ఉపమానం అఘోరించినట్టుంది. సుబ్బాయమ్మగారిని శిఖండితో పోల్చిన వైనం అవిడగారి చెవినిబడితే మనకి ఉద్వాసనం" అన్నాడు మస్తాన్. 


సాయిబైనా, ఫస్టు మార్కులు తెలుగులో ఎప్పుడూ వాడివే!


“నోరుమూసుకోండిరా. మా ఆవిడ సంగతెత్తకండి" అన్నాను.


"అదే నేనూ ఇస్తున్న సలహా" అన్నాడు మస్తాన్.


"సాయిబు సలహాలు బోడిసలహాలు. మరోలా వుండడానికి వీలులేదు" అన్నాడు రంగాచారి.


"పంగనామం పెట్టే సలహాలు ఆచార్లవి" అన్నాడు మస్తాన్.


"గుండులేని సాయిబువి నువ్వూ, నామం లేని ఆచార్లు వాడూ ఇద్దరూ కూడా ట్రేడ్ మార్కు లేని మనుష్యులు. ఆ మార్కు లేని వస్తువులకి విలువలేదు. మీ సలహాలకీ విలువలేదు!" అన్నాడు చంద్రరావు.


"పంచపాండవులంటే నేనెరగనా. మంచం కోళ్ళలా ముగ్గురే కాదా అనేవాడివి నీకు వేరే ట్రేడుమార్కు అక్కర్లేదు. మైలు దూరం కంపుకొట్టే కల్తీ నెయ్యిలాటిది నీ సలహా! దానికి దూరం నించే నమస్కారబాణం విసిరెయ్యాలి" అన్నాడు రంగాచారి.


"అదే విధంగా సుబ్బాయమ్మగారికీ దూరం నించే ఒక నమస్కారం చేసి ఊరుకుంటేనే బతికిపోతాం" అన్నాడు సుభాష్.


"విశ్వాసఘాతకుల్లారా ! తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే మనుష్యుల్లారా, మా ఇంటి అరుగుమీద కూర్చునే మా ఆవిడని మాటలంటుంటారురా" అన్నాను. కోపమొచ్చిందేమో, కొంచెం గట్టిగా అరిచినట్టున్నాను.


"ఏమండి. ఓ మాటిలారండి" అని లోపల నించి మా ఆవిడ కేక వినిపించింది.


"శ్రీమద్రమారమణ గోవిందో హరి" అన్నాడు ఆచారి.


తినవలసిన చీవాట్లేమిటో కిక్కురుమన కుండా త్వరగా తినేసి వచ్చెయ్యి" అని సలహా ఇచ్చాడు సుభాష్.


"అవునవును. మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు" అన్నారు. జవాబు చెబితే మొహం మరికొంచెం వాస్తుంది. ఈ చెవి లోంచి విని, ఆ చెవిలోంచి వదిలేసి త్వరగా వచ్చెయ్యి" అన్నాడు చంద్రరావు.


"ఆరునెల్లయి కాపరం చేస్తున్నాడు. వాడికన్నీ తెలుసులెండిరా వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా" అన్నాడు మస్తాన్.


"గప్ చిప్. అందరూ షటప్" అన్నాను.


"అర్జెంటుగా రండి" అని మళ్ళీ మా ఆవిడ లోపలి నుండి కేక.


భయంలేదని ఎంత ధైర్యం చెప్పుకున్నా గుండెలు గుభీ గుభీ మని కొట్టుకోడం ప్రారంభించాయి. మా మాటలు విని పిలిస్తే సముదాయించడం కష్టమే. అల్లరిమూకను ఇంట్లో చేర్చొద్దని ఎప్పుడూ నాకు బుద్ధి చెబుతూనే వుంటుంది. నోరు దగ్గిర పెట్టుకుని మాట్లాడండిరా అంటే వాళ్ళకి బుద్దిలేదు. మధ్య నాకు ప్రాణసంకటం. పెద్దపులిలా బయలుదేర్దామనుకున్నాను, కాని పిల్లి పిల్లలా అడుగులు పడ్డాయి...

😆

*సశేషం*

꧁☆•┉

*నిత్యానందం -7*

🤥


రచన: సోమంచి యజ్ఞన్నశాస్త్రి


*నిత్యానందంగారి విజ్ఞాన యాత్ర -2*


“పాతాళించిన శనగలున్నాయి తినండి” అంది మా ఆవిడ.


“శనగలు తినడానికా పిలిచావు”.


“ఏం ? మీకిష్టమేగా”


అమ్మయ్య ! ప్రాణం కుదటబడింది.


“ఇష్టమే, వాళ్ళందరూ వుండగా...”


“మరేం పరవాలేదు. తినేసి నీళ్ళు తాగెయ్యండి”


మా వాళ్ళందరూ డింకీ తినేశారు. మా ఆవిడ చీవాట్లు పెడుతుందనుకున్నారు, పాతాళించిన శనగలు పెట్టింది. శ్రావణ మంగళవారంనాడు పేరంటానికెళ్ళి తీసుకొచ్చిన శనగలు. చాలా రుచిగా వున్నాయి. గబగబ బొక్కెయ్యడం ప్రారంభించాను. "శనగలు నమలకుండా మింగెయ్యకండి. రాత్రంతా కడుపునెప్పితో బాధపడాలి. అవతల ముంచుకొచ్చిన పనేంలేదు. సావకాశంగా కూర్చొని నమిలితినండి." అంది.


కసిరినట్టు మాట్లాడుతుందిగాని మా ఆవిడకి నేనంటే చాలా ఇష్టమే నాకు కడుపునెప్పి రాకుండా చాలా సలహాలిస్తూ వుంటుంది.

📖


“వాళ్ళందరూ...”


“ఉంటే వున్నారు... అందరూ కలిసి చేసే పని గుడ్డిగుర్రానికి పళ్ళు తోమటమేగా."


"నో' నో... పనిలేని మంగలి చేస్తాం."


"క్షవరం ప్రారంభించారా పిల్లిని వెతికి పట్టుకోడంలోనే వున్నారా ఇంకా."


మా ఆవిడకి ఏదైనా చెబితే ఇట్టే అర్థమై పోతుంది. సరదాగా వున్నప్పుడు జోకుచేస్తే జవాబుతో జోకూ చేస్తుంది. మాటలు పెట్టుకు కూర్చుంటే అవతల మా వాళ్ళు తిట్టుకుంటారని జవాబు చెప్పకుండా త్వరత్వరగా తినేసి, మంచినీళ్ళు తాగి త్రేన్చేశాను.


"బాతాఖానీ త్వరగా తెమిల్చేసి ఇంట్లో పడండి" అంది మా ఆవిడ.


"మాది బాతాఖానీ కాదు. పూర్ణయాత్రా స్పెషల్లో దేశ సంచారానికి బైలుదేరుదా మని ప్లానులు వేస్తున్నాం."


"ఆ అల్లరిమూకతోటా?"


"తూముకట్టు మీద కూర్చుని బాతాఖానీ కొట్టినప్పుడు అల్లరి మూకగాని యాత్రా స్పెషల్లో ప్రయాణం చేసేటప్పుడు గొప్ప భక్తులుగా మారిపోతాం."


"మీరు వాళ్ళతో ఒక్కరూ వెళ్ళడానికి వీల్లేదు. నేనూ వస్తాను."


"నువ్వు కూడానా?"


"అవును"


"నువ్వెందుకు ?"


"మీరెందుకు ?"


"మొగాళ్ళందరమూ!"


"ఆ రైల్లో ఆడవాళ్ళుండరా ఏమిటి?"


"మా అల్లరిమూకతో.."


"అల్లరిమూకగాదు, గొప్ప భక్తులని మీరే అన్నారుగా.."


అన్నా, నామాట మీదే పట్టేసుకుందే. ఇహ వాదించి లాభంలేదు.


"అలాగేలే. మేం వెళ్ళితే నువ్యూ వద్దువు గాని" అని స్నేహితుల్ని చేరుకున్నాను.


"వొరేయ్, తల తడవనీ- ఎన్ని బొప్పెలు కట్టాయో" అన్నాడు రంగాచారి.


"ఆవిడింకా చెయ్యిచేసుకోడం దాకా రాలేదురా. కేకలేస్తుంది. బాగా చీవాట్లు తినిపిస్తుంది. మొహం ఎంత వాచిందో చూద్దాం" అన్నాడు మస్తాన్.


"నోరు ముయ్యండిరా. మనం తీర్థయాత్రల కి వెళితే తను కూడా వస్తానని చెప్పడానికి పిలిచింది. అంతే" అన్నాను. బాగుండదని పాతాళించిన శనగల సంగతి చెప్పలేదు.


"ఆడవాళ్ళతో ప్రయాణం పడదు" అన్నాడు సుభాష్.


పూర్ణయాత్రా స్పెషల్ నూటికి డెభ్బయి పైగా ఆడవాళ్ళుంటారు. అదీ ఒక ఎట్రాక్షన్" అన్నాడు చంద్రరావు.


"దాంట్లో ముప్పాతికమంది విధవలై వుంటారు. మడిగా భోజనాలున్నాయన్నా వు. బోడీ ఎట్రాక్షన్ జోరుగా వుంటుందన్న మాట. పుణ్యంలో మరో పుణ్యం. లేవగానే గుళ్ళ దర్శనం. శ్రీ మద్రమా రమణగోవిందో హరి!” అన్నాడు రంగాచారి.


"మా ఇంట్లో అరుగుమీద కూర్చున్నప్పుడు పోకీరీ మాటలు మాట్లాడకండి" అని కసిరాను.


"తీర్థయాత్ర ప్లాను నాకేం నచ్చలేదు. మనమేం పాపాలు చేశామా?” అన్నాడు సుభాష్.


“పాపాలు చేసిన తరవాతనే పుణ్యమార్జిం చాలని లేదురా. బ్యాంక్ లో డబ్బు నిలవ చేసుకున్నట్టు ముందుగానే పుణ్యమార్జిం చుకుని చిత్రగుప్తుడి దగ్గిర దాచుకోవచ్చు ను" అన్నాడు రంగాచారి. 


"పుణ్యం మాట దేవుడెరుగును. దేశం తిరుగుతే జ్ఞానం పెరుగుతుంది" అన్నాను.


"అయితే తిన్నగా విజ్ఞానయాత్రకే బయలు దేరక డొంకతిరుగుడుగా తీర్థయాత్రల కెందుకు ?" అన్నాడు సుభాష్.


"ఒక్క రాయితో రెండు పిట్టల్ని కొట్టడానికి."


"రంగాచారి తీర్థయాత్రా స్పెషల్లో పిట్టల వేటంటే, ఆ రాయి తిరిగొచ్చి మనకే తగిలి, పళ్ళూడవచ్చు" అన్నాడు సుభాష్.


"ఈ మాటలు మా ఆవిడ వింటే ఇప్పుడే ఊడతాయి మీకు పళ్ళు"


"యాత్రలంటే నేను రాలేను" అన్నాడు మస్తాన్.


"నిజమేరోయ్. పూర్ణయాత్రా స్పెషల్ సాయిబుల్ని రానిస్తారో లేదో" అన్నాను.


“మస్తాన్ గాడు సాయబేమిటి? బొట్టు పెడితే బ్రాహ్మడే!" అన్నాడు చంద్రరావు.


"అవునవును."


"బొట్టు కట్టు గూర్చి పట్టింపు లెక్కువై

శైవ వైష్ణవులకు సమరమైయ్యే

ఒకడు సున్నియయ్యె 

నొకడు షియాయయ్యె

విశ్వదాభిరామ వినుర వేమ !


అన్నారు కృష్ణ శాస్త్రిగారు.వీడు అలా సాయిబయిన బ్రాహ్మడే !" అన్నాడు రంగాచారి.


"వాడికి పులిహారంటే చాలా ఇష్టం. వైష్ణవం లోంచి జారినవాడే అనుకుంటాను" అన్నాడు సుభాష్.


"సందేహంలేదు. అడియేన్ దాసోహం. మస్తానాచార్లుగారు'' అన్నాడు చంద్రరావు.


"తీర్థయాత్రకంటే నేను రాను."


"మక్కా మదీనా, నీతో మేమూ వస్తాంరా. పులి వేషాల వెంట పీర్ల పంజాలకి మేమూ వొచ్చేవాళ్ళంగా"


“విజ్ఞానయాత్రకయితే నేనొస్తాగాని, తీర్థ యాత్రకయితే నేను రాను. "


"మాకూ యాత్రలక్కర్లేదు. విజ్ఞాన యాత్రకే బయలుదేరుదాం. టిక్కట్లేమున్నాయో కనుక్కుందాము."

😎

*సశేషం*

Thursday, 17 April 2025

April మూ డవ వారం కథలు

*


ఇది పాత తరం స్నేహితులకు అంకితం.............. 


జారే అరుగుల ధ్యాసే లేదు

పిర్ర పై చిరుగుల ఊసేలేదు

అమ్మ చేతి మురుకులు లేవు

అలసట లేని పరుగులు లేవు

ఎత్తరుగులు మొత్తం పోయే

రచ్చబండలూ మచ్చుకు లేవు

 వీధిలో పిల్లల అల్లరి లేదు

 తాతలు ఇచ్చే చిల్లర లేదు

 ఏడు పెంకులు ఏమైపోయే

 ఎద్దు రంకెలు యాడకి పోయె

ఎక్కడా వెదురు తడికెలు లేవు

ఏ తడికకీ భోగి పిడకలు లేవు

కూరలమ్మే సంతలు లేవు 

పెరుగులమ్మే ముంతలు లేవు

బువ్వా లాటల విందే లేదు

గవ్వలాటలు ముందే లేదు

కుప్పిగంతులు లేనే లేవు 

కళ్ళ గంతలు కానే రావు

డ్రింకు మూతల గోలే లేదు 

బచ్చాలాడే ఇచ్చా లేదు

కోతి కొమ్మచ్చి ఏమైపోయే

అవ్వా అప్పచ్చి ముందే పాయె

గూటీ బిళ్ళా గూటికి పోయే

తొక్కుడు బిళ్ళకు రెక్కలు వచ్చె

గచ్చకాయలు మచ్చుకు లేవు

చింత పిక్కలు లెక్కకూ లేవు

ధారగా కారే ముక్కులు లేవు 

జోరుగా జారే లాగులు లేవు

కొబ్బరి పుచ్చు కొరుకుడు లేదు

కొండముచ్చుని కెలుకుడు లేదు

బట్టన మురికి అంటక పోయె

మనసుకి మురికి జంటగ చేరె

కాకి ఎంగిలి కరువై పోయే

భుజాన చేతులు బరువై పోయె

అన్ని రంగులూ ఏడకో పోయె

ఉన్న రంగులూ మాసికలాయె

దానికితోడు కరోనా వచ్చె

బళ్ళూ, గుళ్ళూ మూసుక పోయె

బడిగంటల ఊసే లేదు

బడికి పోయే ధ్యాసే లేదు

మూతులన్నీ మాస్కుల పాలు

చేతులన్నీ సబ్బుల పాలు

ఆన్ లైన్ లో పాఠాలాయె

అర్థం కాని చదువులాయె

ప్రశ్నలకు జవాబులుండవు

కొన్నాళ్ళకు ప్రశ్నలే ఉండవు

ప్రస్తుత బాల్యం వెలవెల పోయె

దానికి మూల్యం ప్రస్తుత మాయే

రేపటి సంగతి దేవుడి కెరుక

నేటి బాలలకు తప్పని చురక

బాలానందం లేని జీవితం

మానవాళికే మాయని మరక.

మన బాల్యం పై ఒక మిత్రుడు పంపిన కవిత..

🙏🙏🙏🙏🙏🙏

మేమే అదృష్టవంతులమ్*!           

1960-80 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. 

ఆంగ్ల  మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము. 

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత 

గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. 

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

*పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.* 

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.* 

దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!  

ఆ రోజుల్లో  చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.  

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. *మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో.* అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట

రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.   

*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?*

*ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!

[10/10, 21:01] BCB: ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం  శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు !!! కాబట్టి 504 గంటలను 24 గంటలు విభజించినచో, సమాధానం 21.00 21 రోజులు. నేను ఆశ్చర్యపోయాను. దీనిని ధృవీకరించడానికి, నేను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌లో శోధించాను. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ మరియు నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని. నేను షాక్ అయ్యాను !!!! ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పూర్తిగా నమ్మదగినది. సంప్రదాయం ప్రకారం, త్రేతాయుగం నుండి మనము దసరా మరియు దీపావళిని జరుపుకుంటాము.

మీరు నన్ను నమ్మకపోతే, గూగుల్ సెర్చ్ చేయండి మరియు ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎంతో ఖచ్చితత్వంతో రాశాడు.  మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది. హిందూ సంస్కృతిలో జన్మించినందుకు గర్వపడండి!

జై శ్రీ రామ్ 🙏🙏🙏

****

           మౌనంగానే ఎదగాలి

వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.

అయిదు శాంతులలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు. ‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.

మౌనం మూడు రకాలు. ఒకటి, వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం. మూడోది కాష్ఠమౌనం. దీనినే మానసిక మౌనం అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.

మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగమవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు. మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వంటి వారెందరో ఉన్నారు.

ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.

ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే ‘మౌనం’.

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది. భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!


*****

కృష్ణ’ శబ్దం మనోహరం.!!

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరో రూపమే శ్రీకృష్ణ భగవానుడు. ద్వాపర యుగంలో పుట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు. కారుణ్యశీలుడు. ఆదర్శ పురుషుడు. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి.

భగవద్గీత ద్వారా అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు. యుగ ధర్మాలను, సాంఘిక న్యాయాలను, అనంతమైన విశ్వతత్త్వాన్ని తెలియచెప్పిన మహనీయుడు. అలాంటి….  శ్రీకృష్ణ మంత్రం బాహ్యశత్రువులను, అంతఃశత్రువులను హరించే శక్తి కలది.

సకల వేదాంతాలందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది. సమస్త సంసార చింతనలను, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునకు భక్తి పూర్వకముగా ఒక్కసారి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణుని త్రికరణశుద్ధిగా భక్తిశ్రద్ధలతో నమస్కరించిన మాత్రానే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే సదానందము లేక సచ్చిదానందమని అర్థం.

కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో అలాంటివారు సాక్షాత్తు శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. ఓంకారం మొదలు వేదాల వరకూ ‘కృష్ణ’ అనే రెండక్షరాలు సమస్త విఘ్నాలను హరించి మనోభిష్టాలను నెరవేరుస్తున్నాయి. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు కారణజన్ముడు.

మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే దుష్టశిక్షణ. కంసుని దురాగతాలను అంతమొందించడానికి, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికి అవతరించినవాడు.

గోకులంలో పెరిగాడు కాబట్టి గోపాలకృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో కాళీయమర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే తన నోటిలో అండపిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం. సాక్షాత్తు శ్రీహరి అంశ అయిన కృష్ణునికి లెక్కలేనన్ని పేర్లు...                   ఆ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు.

రామ శబ్దానికి, కృష్ణ శబ్దానికి భేదం లేదు. ఈ రెండు అవతారాలు సాక్షాత్తు శ్రీహరి అవతారాలే కావడంవల్లే ఆ స్వాముల నామస్మరణ సాక్షాత్తు శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే ‘హరేరామ హరేరామ హరే కృష్ణ హరేకృష్ణ’ అంటారు.

ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.

నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి కటాక్షిస్తాడు. కుచేలుడు, సుధాముడు లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని కల్గించిన అపురూప దైవం శ్రీకృష్ణ భగవానుడు.

కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులు, సిద్ధులు యోగాభ్యాస సమయాన శ్రీకృష్ణుని సహస్రారమందు ధ్యానిస్తూ ప్రాణాయామం నిలిపి మోక్షాన్ని పొందారు.

వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకొనిపోయే సహజశక్తి ‘కృష్ణ’ శబ్దానికి కలదు. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు ఆయా అక్షరాలకు స్థానాలగు దౌడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువు, శబ్దమూలమున శిరస్సునగల సహస్రార చక్రం వరకూ సహజసిద్ధంగా చేరుకొంటుంది.

అపుడు ‘వాయువు’ను అంటి చలించే స్వభావంగల వనస్సును, యోగప్రక్రియచే వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలువ వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ. మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది.

ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా మహాభారతంలో శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది.✍️

 .        

*****

ఐకమత్యమే బలం! 


ఐకమత్యం లోపించడం అనేది ప్రస్తుతం భారతీయుల్లో కనిపిస్తున్న 'ప్రధాన సమస్య. ఐకమత్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఐకమత్యం కంటే ప్రధానమైన విషయాలు పాత్ర వహిస్తాయి? అనేది కాస్త విచక్షణతో ఆలోచించాల్సిన విషయం. అందుకే పూర్వం కుటుంబంలో ఐకమత్యం బాగా నేర్పేవారు. 'వాడు నీ తమ్ముడురా! వాడిని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటావా! జాగ్రత్త చూసుకోవాలి కదా!' అని తల్లి అనేది. అప్పుడు అ కుర్రాడికి అర్థమయ్యేది. 'అన్నదమ్ములం, ఆక్కాచెల్లెళ్లం ఒక కుటుంబం. అందరం ఐకమత్యంగా ఉండాలి' అని ఈ కుటుంబపరమైన ఐకమత్యం. తరువాత వెంటనే దేశాన్ని చూపించారు. ఐకమత్యం ఉండాల్సింది. కులాల్లోనూ, మతాల్లోనూ, ప్రాంతాల్లోనూ కాదు. ముందు కుటుంబంలో, తరువాత దేశంలో! కుటుంబంలో ఐకమత్యం ఎలా ఉండాలో ధర్మరాజు మాటల ద్వారా నేర్చుకోవచ్చు.


పాండవులు అరణ్యవాసం చేస్తూ, అడవిలో ఆకులు, అలములు తిని జీవిస్తుంటే, అది కూడా వాళ్లకు దొరకడం నచ్చక దుర్యోధనుడు దండయాత్రలాంటి పనిచేశాడు. దానికి 'ఘోషయాత్ర' అని పేరు 'ఘోష' అంటే గొల్లపల్లె. చరిత్రలో దుర్యోదనుడిని మించిన ప్రతినాయకుడు ఉండడు. ధర్మరాజు ఏ నదీ తీరంలోనైతే యజ్ఞం చేస్తున్నాడో, ఆ నదీ తీరానికి అవతలి గట్టున తన మందీమార్బలం, సైన్యంతో మకాం పెట్టాడు దుర్యోధనుడు. జలక్రీడలు, విందులు, చిందుల్లో భాగంగా అక్కడున్న గంధర్వుల సరస్సులో స్నానానికి కౌరవులు దిగారు. అక్కడ కాపలావాళ్లు అభ్యంతరం చెప్పారు. దాంతో యుద్ధం జరిగింది. గందర్వుల సైనికులే కాదు, చిత్రసేనుడనే గంధర్వుడు కూడా వచ్చాడు. గంధర్వుల చేతిలో దుర్యోధనుడి సైన్యం ఓడిపోయింది. దుర్యోధనుణ్ణి రథ స్తంభానికి కట్టేసి లాక్కెళ్లారు. అప్పుడు కౌరవ సైనికులు వచ్చి దుర్యోదనుణ్ణి కాపాడమని పాండవుల కాళ్లు పట్టుకున్నారు. వెంటనే భీమార్జునులను ధర్మరాజు పిలిచి, "మన సోదరుడు దుర్యోధనుడికి ఆపద వచ్చింది. మీరు వెళ్లి కాపాడాలి" అని అన్నాడు. అప్పుడు భీముడు 'కాగల కార్యం గంధర్వులు తీర్చారు' అని అన్నాడు. ఈ సామెత అక్కడి నుంచి వచ్చిందే. మనను ఎన్ని కష్టనష్టాలకు గురిచేశాడు. అటువంటి వాడిపైన దయ ఏందుకు? మేం వెళ్లి రక్షించం' అని భీమార్జునులు అన్నారు. అప్పుడు భీముడిని ఉద్దేశించి ధర్మరాజు ఐకమత్యం అంటే ఏమిటో చెబుతాడు.


పరైః పరిభవేత్ ప్రాప్తే వయం పంచోత్తరం శతం |

పరస్పర విరోధేతు వయం పంచ శతం చ తే ||


ఒక తాత్వికమైన అవగాహన ఉన్న వారు జీవితాన్ని నిష్కల్మషంగా గడుపుతారు. అందుకే ధర్మరాజుని 'యుధిష్ఠిరుడు' అన్నారు. 'మనందరిదీ ఒకటే వంశం. 'పరస్పర విరోధేత్ మనలో మనకే గనక విరోధం వస్తే 'వయం పంచ"... మనం ఐదుగురం. శతంచతే... వాళ్లు వందమంది. అలా కాకుండా బయటి వాడు మనమీదకొస్తే 'పంచోత్తరం శతం' అంటే వాళ్లు వంద మంది, మనం ఐదుగురం. మొత్తం నూటా ఐదుగురం ఉన్నాం. కలిసి ఎదుర్కోవాలి' అని ధర్మరాజు అన్నాడు.


దీన్ని గనుక మనం కుటుంబాలకు అన్వయించుకుంటే కుటుంబపరమైన ఐకమత్యం బాగుంటుంది. తరువాత అన్వయించాల్సింది దేశానికి మనదేశంలో తమిళ, కన్నడ, తెలుగు సోదరులకు ఏమైనా భేదాలొస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. =కత్తులు దూసుకోకూడదు. (అదే పాకిస్తాన్ వాడో, చైనా?వాడో మన మీద దాడిచేస్తే అందరం ఐకమత్యంగా వాడి మీదకు వెళ్లాల్సిందే. మనదేశంలో ఏవైనా లోపాలుంటే మనం మాట్లాడుకోవాలి. మనమే పరిష్కరించుకోవాలి. విదేశాలకు వెళ్లినపుడు వాటి గురించి మాట్లాడకూడదు. కుటుంబమైనా అంతే. దేశమైనా అంతే! ఒక సమర్థుడైన వ్యక్తి ఒక మంచి సంస్థలో ఉంటే అతని వల్ల సంస్థకు ప్రయోజనం. సంస్థ వల్ల అతనికి ప్రయోజనం, సమర్థులైన వారు స్వదేశంలోనే ఉండాలి. అది దేశానికి గౌరవం, వారికి గౌరవం. ఎలా అంటే... శ్రీకృష్ణుడు 'సంజయ రాయబార సందర్భంలో "పాండవులు, కౌరవులు కలిసి ఉండటం అవసరం. వాళ్లకు చెప్పవయ్యా" అంటాడు. 'ఆ అవసరం ఏముంది?' అని సంజయుడు ప్రశ్నించినప్పుడు...'ధృతరా ష్ట్రుడున్ పుత్రులున్ వనముల్... దృతరాష్ట్రుడు ఆయన పుత్రులు మహారణ్యంలాంటివారు 'కుంతీ నందనుల్ సింహముల్... పాండవులు ఐదుగురు సింహాల్లాంటివారు. అయితే సింహంలేని అరణ్యాన్ని జనాలందరూ వచ్చి నాశనం చేస్తారు. అరణ్యంలో సింహం ఉంటే ఒక్కడూ అడుగుపెట్టడు. అరణ్యంలో ఉండకపోతే సింహాలకు కూడా రక్షణ ఉండదు. అలాగే పాండవులు కౌరవులతో కలిసి ఉంటే మంచి సామ్రాజ్యంతో ఉంటారు. కౌరవులు కూడా పాండవులతో కలిసి ఉంటే బలంగా ఉంటారు. ఇద్దరూ బాగుంటారు' అని చెబుతాడు శ్రీకృష్ణుడు. 'ఐకమత్యం మహాబలం' అనడానికి ఇది మంచి ఉదాహరణ.

****

 గురుభక్తి

ఉపనిషత్‌ వాక్యం

గురురేవ పరో ధర్మో గురురేవ పరా గతిః

యస్య దేవే పరాభక్తి ర్యథా దేవే తథా గురౌ,

సబ్రహ్మవి త్పరం ప్రేయా దితి వేదానుశాసనమ్‌ (శాట్యాయనీయోపనిషత్‌)


'గురువే పరమ ధర్మం. గురువే పరాగతి… ఎవరికి దేవుడిపై, గురువుపై సమానమైన భక్తి ఉంటుందో అతను పరబ్రహ్మను పొందగలడు' అని పై శ్లోక భావం. దీనిని బలపరిచే కథ ఇది. ధ్వజదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను దారిద్య్రంతో బాధపడుతూ నైమిశారణ్యంలోని పుష్కర మహాముని దగ్గరికి వెళ్లి సాష్టాంగపడ్డాడు. ఆ బ్రాహ్మణుడికి ముని హనుమత్‌ మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్వజదత్తుడు రాత్రింబవళ్లు ఆ మంత్రజపం చేశాడు. గురువుపై విశ్వాసం లేక మంత్రసిద్ధి కాలేదు. కొన్నాళ్లకు వ్యాధిపీడితుడైన గాలుడనే వేటగాడు ధ్వజదత్తుడిని కలుసుకున్నాడు. తన బాధలు ఆయనతో చెప్పుకొన్నాడు. అప్పుడు ధ్వజదత్తుడు 'దైవం లేదు. మంత్రం లేదు. పుష్కరుడి నుంచి మాత్రం మంత్రం స్వీకరించకు' అన్నాడు. గాలుడు ఉత్సుకతతో పుష్కర మహర్షి దగ్గరికి వెళ్లి పరిచర్య చేశాడు. అతనిపై సందేహంతో మహర్షి ధ్యానించగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. 'గురుభక్తి ఉంటే సరి. ఉపదేశించవచ్చు' అని ఆజ్ఞ ఇచ్చాడు ఆంజనేయుడు.

మంత్రోపదేశానికి ముందు గాలుడిని పుణ్యతీర్థంలో స్నానం చేసి రమ్మన్నాడు పుష్కర ముని. అప్పుడు గాలుడు 'మీ పాద జలమే పుణ్యతీర్థం' అన్నాడు. గురువు హనుమంతుడిని ధ్యానించి తన పాదజలాన్ని అతనిపై చల్లి ద్వాదశాక్షర మంత్రోపదేశం చేశాడు. గురు సమీపంలోనే గాలుడు 108 సార్లు జపం చేయగానే సిద్ధి లభించింది. భూత భవిష్యత్తులను దర్శించగలిగాడు. గాలుడు ఇంటికి వెళుతూ ధ్వజదత్తుడిని చూశాడు. కానీ, అతను గురునింద చేస్తాడన్న భయంతో మరోదారి ఎంచుకున్నాడు. అది గమనించిన ధ్వజదత్తుడు గాలుడికి అడ్డువచ్చి, అతనిలో అపూర్వ తేజస్సు చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పుష్కరుడి దగ్గరికి వెళ్లి 'గాలుడికి ఎలా సిద్ధి కలిగింది? నాకు ఎందుకు కాలేదు?' అని నిలదీశాడు. అప్పుడు పుష్కరుడు 'నీకు దైవంపైనే గాని గురువుపట్ల నమ్మకం లేనందుకు' అన్నాడు. ధ్వజదత్తుడు పశ్చాత్తాపంతో పుణ్య నదీ తీరానికి వెళ్లి గురువు, దైవంపై సమాన విశ్వాసాన్ని దృఢతరం చేసి 108 సార్లు జపం చేయగానే అతనికి సిద్ధి కలిగింది. ఆంజనేయుడు ఉష్ట్ర వాహనారూఢుడై సువర్చలా సమేతంగా దర్శనమిచ్చాడు. ధ్వజదత్తుడికి అపార సంపదలతోపాటు మోక్షాన్ని కూడా ప్రసాదించాడు.

Wednesday, 2 April 2025

April రెండవ వారం కథలు

  


ఒక చిన్న కథ
అది ద్వాపరయుగం. ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు.
మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు.
ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు.
భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.
మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు. అన్నాడు అర్జనుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జున. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు.
ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు.
దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు.
అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుకున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై “దొరికింది...దొరికింది. నా చేతికి చిక్కింది”అని గావుకేకలు పెట్టాడు.
అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన *ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేలా సంచి దొంగలించాను,* నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు.
ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది. తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు.
అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, ఈతిబాధలు, కష్టసుఖాలు గురించి ఆలోచించాడు.
నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను. ఇది అతని ధర్మ ఫలం అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

కాళిదాసు***--

ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి.కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషం తో వుండసాగాడు.

రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు వుంది.కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని,కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్త్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.

వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి  పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు  "అయ  మాందోలికా దండ స్తవ బాధతి  కిం భుజే"కావాలనే తప్పుగా చదివాడు 'బాధతే' బదులుగా 'బాధతి' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు.రోజూఅదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.

ఐదవరోజు    ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు వుండబట్టలేక " "నాయమాం దోలికా దండ స్తవ 'బాధ తి' బాధతి"

ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ 'బాధతి' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము విని నంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించ మని వేడి  ఆపల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.

సంస్కృతం లో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.
అందుకే పెద్దవాళ్ళు 'లలితా సహస్ర నామము"విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునే టప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామము చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదు.అని. అలా చదవడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ అని చెప్తారు.
*****
               *కర్మ సిద్థాంతం*

*ఇది చాలా కఠినమైనది ఎవ్వరికీ అర్థంకాదు*

*మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది*

"కర్మను"  అనుభవించాలి ..... నిందిస్తే ప్రయోజనం లేదు .

రమణ మహాశయలు వారు ప్రతిదినము  స్నానం కొరకు  నదికి పోతుండేవారు.

ఆయన వెంట కృష్ణా  అను భక్తుడు పోయెడివాడు.

ఒకనాడు రమణ మహాశయులు నదికి పోతుంటే ఉన్నట్టుండి , తన వెనుకనున్న కృష్ణా  తో  "కృష్ణా ! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు". అని అన్నారు. కృష్ణా కు అర్ధం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలివేలు మీద పడినది . కాలి వేలు చితికింది . రక్తం కారుతోంది  . ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు, ష్ణా అప్పుడు గ్రహించాడు, వెంటనే రమణ మహాశయుల పంచెను చింపి, కట్టు కట్టాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన గుర్తించి , రమణ మహాశయులతో "మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా !   మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు ?"  అని ప్రశ్నించాడు.

అప్పుడు రమణమహాశయులు కృష్ణా తో … "ఆలా జరగదు కృష్ణా పక్కకితప్పుకొంటే , ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే!

రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచింది కదా !" అని అన్నారు.

కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించ వలసిందే.✍️
                       🌷🙏🌷


*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

ధర్భల మహిమ.....*

తులసి, ధర్భలు, బిల్వదళములు వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

ఒక విధమైన  గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు శ్రీ రాముని  స్పర్శ చేత  పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది.
ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ.   జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు గుణం కలది. గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి  ఉప్పు కలిపిన పదార్థాలలో ధర్భలు వేసి వుంచడం గమనించవచ్చును.

ధర్భలని సంస్కృతం లో 'అగ్ని గర్భం' అంటారు. కుంభాభిషేకాలలోను యాగశాలలో ని కలశాలలోను‌ ,బంగారు, వెండి తీగలతో పాటుగా
ధర్భలను కూడా  తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు.

ధర్భలలో కూడా స్త్రీ , పురుష  , నపుంసక జాతి ధర్భలని మూడు రకాలు వున్నాయి. పురుష జాతి దర్భలు అడుగు నుండి చివరికొసదాకా సమానంగా వుంటాయి. పై భాగంలో  దళసరిగా వుంటే అది స్త్రీ ధర్భ గా గుర్తిస్తారు. అడుగున దళసరిగా వున్న ధర్భను నపుంసక ధర్భ గా తెలుసుకోవచ్చును.
ధర్భల దిగువ భాగంలో   బ్రహ్మకు ,  మధ్యస్థానంలో  మహావిష్ణువుకు , శిఖరాన  పరమశివునికి   నివాసంగా భావిస్తారు.

దేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలు ధర్భ కొసలతోను,  మానవులను  తలచి యిచ్చే తర్పణాలలో ధర్భల మధ్యభాగం నుండి, పితృదేవతలను  తలచుకొని యిచ్చే తర్పణాలలో ధర్భను మడిచి కొసలతోనూ  తర్పణాలు సమర్పించడం విధాయకంగా వుంది.

వైదికకార్యాలలో "పవిత్రం" అనే పేరుతో ధర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి  ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు .ఈ వ్రేలిలో కఫనాడి వుండడం వలన యీ ఉంగర ధారణవలన  కఫం శుభ్రం  చేయబడుతోంది.

ప్రేత కార్యాలలో  ఒక ధర్భతోను, శుభ కార్యాలలో  రెండు ధర్భలతోను, పితృ కార్యాలలో మూడు ధర్భలతోను , దేవ కార్యాలలో నాలుగు ధర్భలతోను‌,  ఆ ధర్భ ఉంగరాన్ని  ముడి వేస్తారు.
దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం  వంటి కార్యాలలో ధర్భతో చేసిన  'పవిత్రం'అనే యీ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.

ధర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు వుండడం వలన రాగి విగ్రహాలను , బూడిద  ధర్భలు ఉపయోగించి  శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెప్తోంది. ఇందు వలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి  తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా వుంటాయని శాస్త్రజ్ఞులు చెపుతారు.

ఆదివారమునాడు కోసిన ధర్భలను ఒక వారముపాటు ఉపయోగించవచ్చును. అమావాస్యనాడు కోసి తీసుకుని వస్తే
ఒక మాసం వరకు ఉపయోగించవచ్చును.
పౌర్ణమినాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించ వచ్చును.

శ్రావణమాసం లో కోసిన ధర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించ వచ్చును.  భాద్రపద మాసంలో తీసుకుని వస్తే ఆరు మాసాలు ఉపయోగించ వచ్చును. శ్రాధ్ధ కార్యాలకోసం తెచ్చిన ధర్భలను ఏ రోజు కా రోజే  ఉపయోగించాలి. తిరునల్లారు శైవక్షేత్రంలో  ధర్భలే స్ధల వృక్షం. ఈ క్షేత్రంలో నెలవైయున్న ఈశ్వరుని పేరు ధర్భారణ్యేశ్వర🙏🙏🏻

*****
*నేటి జీవిత సత్యాలు*

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ

ఎవరికి ఎవరో సొంతము, ఎంతవరకీ బంధము, ఎదలో ఆలోచనలు ఎటు పోతాయో, ఏ విధంగా ఇటు మారుతాయో, ఎవరికి ఎరుక, ఏ విధంగా తెలపా, పాదయాత్ర వలన పదవి రావచ్చును, కాశీ యాత్ర వలన గతులు మారవచ్చును, సూత్రాల వలన యాత్రలు అంటే భవిష్యత్తు దగ్గరగా ఉండవచ్చును, భూమి మహావేగముగా తిరుగుతుండగా, నెమ్మదిగా కదులుతున్నదా,   ఎలా చెప్పగలరు, మొక్కలు పెరుగుతూనే ఉంటాయి, కాలం కదులుతూనే ఉంటుంది, శ్రీ మాతా కన్నులు సమస్తము వీక్షించును, పర్యవేక్షించును, రక్షించును, కన్నులతో సమస్త సృష్టి గావించి, పోషించగలుగుతుంది.

ప్రతి ఒక్కరికి శత్రువులు, మిత్రులు, వెంటపడే ఉంటారు కాలంతో పాటు, కదలిక తో వారు వెన్నంటే ఉంటారు, శ్రమ, శక్తి, భక్తి, యుక్తి, నేర్పు, మార్పు, కూర్పు, బట్టి జీవితంలోకి వచ్చి పోతూ ఉంటారు. ఎవరు ఎంతవరకు ఉంటారో ఎవరు చెప్పలేరు, సూర్యోదయం వెంటనే మనిషి ఆలోచనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో ఎవరూ చెప్పలేరు.

భగవద్గీతలో 16 వ అధ్యాయంలో భగవంతుడే ఈ విధంగా తెలియపరిచాడు ఇతర శత్రువులు కూడా వధించబడుదురు. నేనే భోక్తను పూర్తి శక్తివంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని.

ప్రాణం వల్ల స్వభావాలు వ్యవహారాలు తారుమారు కావు. అన్ని యధావిధి గానే ఉంటాయి మరి మార్పు వచ్చేది అవగాహన మాత్రమే ఆలోచన మాత్రమే, ఆదర్శం మాత్రమే, ఆకర్షణ మాత్రమే,ఆరోగ్యం మాత్రమే, అనుభవం మాత్రమే, ఆత్మీయులలో వచ్చే కలహాల పర్యవసానం మాత్రమే, జీవితం నల్లేరు తీగల కదులతూ, భయభ్రాంతుల మధ్య, సుఖశాంతుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెలు మధ్య ఆదర్శాలు తక్కువగా ఉండి మనిషి మనిషి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండి, కాలు ఏ దిక్కున నడిపిస్తుందో ఎవరు ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చెప్పలేరు, అనేది తెలియకుండా మానవత్వాన్ని నిలబెట్టడానికి కారణాలు ఏమిటో, తెలియకుండా జీవితం సాగిపోవటమే, శక్తిలో అందరూ ఉన్నారు.

కాబట్టి అందరిలోనూ శక్తి ఉన్నది నేను అనే పరమాత్మ అందరిలో ఉన్నారు కాబట్టి అందరిలోనూ జీవాత్మ జీవమై ఉన్నది జగతి రూపంగా ఉన్నది దేవుడైన గ్రహించు ఈ ప్రపంచాన్ని ఎంత మేలు చేయగలవు చెయ్యి, అదంతా భగత్సేవేనని భావించు.

కధ కంచికి మనం ఇంటికి
అనేది ఒక ఆలోచన కాదు, కంచి అనగా భూలింగం, "కథ కంచికి అనగా " మరణించిన మన భౌతిక దేహాన్ని ఈ భూలోకంలోని వదిలేస్తామని గ్రహించాలి. మనం ఇంటికి అనగా" ఆత్మ పదార్థం తన స్వస్వరూపమైన మహా మూల చైతన్యానికి చేరుతుందని అంతరార్థం తెలుసుకోలేనటువంటి మానవ జన్మ అవటం వలన తెలపలేకపోతున్నాము.

పక్షులకు ఆకాశమే బలము, చాపలకు జలమేయ బలము, అడుగు వర్గం వారికి రాజే బలము, పసిపాపలకు ఏడుపే బలము, బ్రాహ్మణులకు సంధ్యావందనము బలము మరియు ఐశ్వర్యము.

మనిషి తన మనుగడని మర్చిపోతున్నాడు అతి తెలివి గర్వము పొగరు నాకేంటి అనే అహంకారంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ మృగాలని తలపిస్తున్నాడు.

అందుకే నేమో రోజురోజుకీ పతనం అయిపోతుంది సమాజంలో మానవ వ్యవస్థ.

ఎవడి ఇల్లు వాడికి దిద్దుకోవడం చేతకాదు పక్కింట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి కావాలి,

ఈర్ష ద్వేషాలతో నిండిపోయి జీవితాన్ని అతలంకుతలం చేసుకుంటూ, పక్కవాడిని కూడా ప్రశాంతంగా బతకకుండా చేస్తున్నారు.

పశువుల కూడా ఒక నీతి ఉంటుంది, ఒకదానికి కష్టం వస్తే పోలో మంట్ అవి వచ్చి జేరతాయి,

ఈ మనుషులేంటి,ఇంతలా దిగజారిపోతున్నారు స్వార్థంతో కూలిపోతున్నారు. మనం ఎలా ఆలోచిస్తే మనకు అలాగే జరుగుతుంది.

ఈరోజు సమాజంలో రేపు మీ ఇంట్లో ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు ఒకసారి ఊహించి చూడు.

ప్రకృతి ప్రళయాలు ఏ క్షణంలో ఎలా ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అయినా ఆశ దురాశ నేనింతే అనుకున్నప్పుడు మరొకరిని వేలెత్తి చూయించకు.

మళ్లీ చెప్తున్నాను నువ్వు ఏదైతే ఇస్తావు అదే తిరిగి నీకు వస్తుంది. ఇంతై అంతయి అనంతమై.

యవ్వనంలో మొటిమలు సహజం, ముసలి తనలో ముడతలు సహజం, యవ్వనంలో " స్త్రీ " చేయి పట్టుకోవాలని ఆశపడతాం, ముసలితలను ఎవరి చేయి పట్టుకుంటారో అని ఎదురు చూస్తాం, యవ్వనంలో ఒంటరిగా వదిలేస్తే బాగుంటుందనుకుంటాం, వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారే అని బాధపడతాం, యవ్వనంలో సలహాలు ఇస్తే చికాకు, వృద్ధాప్యంలో సలహాలు పాటించలేని పరిస్థితిగా వాక్కు, యవ్వనంలో అందాన్ని ఆస్వాదిస్తాము, వృద్ధాప్యంలో అందాన్ని దైవంలో చూసుకుంటూ బ్రతకాలని ప్రయత్నిస్తాము. యవ్వనంలో ప్రతిక్షణం పండుగగా భావిస్తాము, వృద్ధాప్యంలో తీపి జ్ఞాపకాలు నెమరు వేస్తూ జీవితాన్ని సాగించాలని  ప్రయత్నం చేస్తూ ఉంటాము. జీవితమనేది ఆటుపోట్ల సంగ్రామం, ధైర్యంగా శక్తిగా యుక్తిగా జీవిత లక్ష్యంగా జీవనాన్ని గడిపిన వాడికి జీవితంలో కష్టం అనేది తెలియక సుఖంగా జీవించగలుగు తాడనేది సర్వ ప్రకృతి అనుకూలిస్తుందని, నిజమైన జీవితా అనుభవం తెలియపరుస్తుంది.

యవ్వనంలోనైనా ముసలితనంలోనైనా ఉన్న సత్యాన్ని గ్రహించే జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుందనేది అందరి యొక్క నమ్మకం అదే నిజం అదే నిజం అదే నిజం.

   ఇంకా వుంది.

******

ఒక వ్యక్తికి 4 భార్యలు 4వ భార్య అంటే చాలా ప్రేమ అతనికి, ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు.అపురూపంగా చూసుకునేవాడు.
మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర చెప్పేవాడు కాదు. తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో..

2వ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు.ఆమెకూడాఅతని సమస్యను తీర్చి పంపేది.

*మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు. ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి*

అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద, ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.

నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను.నిన్ను చాలా ప్రేమగా  చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్. మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అని అన్నాడు. 4వ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది.

ఆశ్చర్య చకితుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు.3వ భార్య ఇలా అంది. ఇన్ని రోజులు నీతోనే,నీ దగ్గరే ఉన్నాను.నీ అవసరాలన్నీ తోర్చాను
ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:"

బాధతో ఏడుస్తూ తన 2వ భార్యను ఇలాగే అడిగాడు. నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను
తరువాత నేను వెళ్ళిపో్తాను.నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను.అంది.

ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా

*మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను.మీరేమీ బాధపడకండి"*

అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.కాబట్టి మనిషి దేన్నీ, ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ
తెలియదు.పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.

నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????

*4వ భార్య, మన శరీరం*
*3వ భార్య, సంపద, ఆస్థిపాస్తులు*
*2వ భార్య నేస్తాలు, బంధువులు*
*మొదటి భార్య, మన ఆత్మ*

నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి. పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి.సరేనా!
****
            *ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి. కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషంతో ఉండసాగాడు.*

             *రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు ఉంది. కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని, కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.*

              *వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి  పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు*

      *"అయ  మాందోలికా దండ స్తవ బాధతి  కిం భుజే"*

          *కావాలనే తప్పుగా చదివాడు ''బాధతే'' బదులుగా ''బాధతి'' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు. రోజూ అదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.*

              *ఐదవరోజు ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు ఉండబట్టలేక "*

*"నాయమాం దోలికా దండస్తవ ''బాధ తి'' బాధతి"*

           *ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ ''బాధతి'' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము వినినంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించమని వేడి  ఆ పల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.*

         *సంస్కృతంలో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.*

          *అందుకే పెద్దవాళ్ళు ''లలితా సహస్ర నామము,విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునేటప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామం చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదుఅని. అలా చదవడం వల్ల పొందాల్సిన ప్రయోజనం పొందలేకపోతాం!*

*🌹🌹🌹*

సద్వినియోగం
ఒకరోజు బుద్దుడికి ఒక దుప్పటి కనుగోలు చేస్తున్న ఒక యువకుడు కనిపించాడు. ఈ "దుప్పటి కొన్నాళ్ళకు చినిగిపోతుంది కదా!అప్పుడు దాన్నేం చేస్తావన్నాడు" బుద్దుడు." దీన్ని రెండు ముక్కలుగా చింపి అంగవస్త్రంగా వాడుకుంటాను."అన్నాడు ఆ యువకుడు.మరి అవి కుాడా చినిగిపోతే అన్నాడు బుద్దుడు." ముక్కలుగా చేసి ఇల్లు తుడవడానికి వాడుకుంటాను.అన్నాడు.

అది కుాడా ముక్కలైపోతే అన్నాడు బుద్దుడు.!

ఆ ముక్కలన్నింటిని మట్టితో పిసికి బొమ్మలు చేస్తాను.ఆ బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బు తో మరో కొత్త దుప్పటి కొనుక్కుంటాను" అన్నాడు నవ్వుతూ ఆ యువకుడు.

ఈ మాటలకు బుద్దుడు సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదేమరి అని తన శిష్యులకు చెప్పాడు..!!

మహాత్మాగాంధీ కుాడా సద్వినియోగం చేసుకోవడం సబర్మతి ఆశ్రమంలో వుండే తన సహచరులకు ఎప్పుడుా చెపుతుండేవారట.

ఒకనాడు చిటికెన వేలంత పెన్సిల్ కనపడలేదు..పుస్తకాలకింద అలసిపోయెాదాక వెదుకుతూ వున్నారంట..అప్పుడు ఒక శిష్యురాలు వచ్చి " బాపు ఇదిగో కొత్త పెన్సిల్ తీసుకోండి..అంది…"నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే?!

నా పెన్సిల్ కోసం వెదుకుతున్నాను..అన్నారట మహాత్ముడు .

బాపు చిన్న కాగితం కుాడా వ్యర్దం చేసే వారు కాదట.తనకు వచ్చిన ఉత్తరాల వెనకాల వున్న ఖాళీ ప్రదేశంలో ఏదో ఒకటి రాసే వారట.

బాపు కాగితాలు చాలా వున్నాయి వాడుకోండి అంటే " వద్దు..పేపర్ కోసం వాడే వెదురు చెట్లు బౌవిషిత్ తరాలకు అయిపోవచ్చు..అందుకని కాగితాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి.

అనవసరమనిపిస్తే ఉప్పు కుాడా ఎక్కువగా వడ్ధీంచుకోవద్దు…అని ఆశ్రమం గోడ మీద రాసి వుంచే వారంట.

వస్తువుల్ని సద్వినియోగం చేయడం చాలా మంచి అలవాటు …ఎందుకంటే భౌవిషిత్ తరాలకి అన్ని అందక పోవచ్చు తరిగిపోవచ్చు…ఆ లక్ష్యం మనసులో వుంటే ఆహారం నీరు వ్యర్థం చేయము.

ప్రతి వస్తువు అయిపోయాక ఏదో ఒక పనికి ఉపయెాగపడుతుంది…కొనడం మాసిపోయిందనీ పాత ది అయిందనీ పారేయడం వలన వాతావరణం ప్రకృతి కాలుష్యం అవుతుంది …బుద్దుడి కధ లో లాగా అది చివరికి మట్టిలో కలిసే వరకు ఉపయెాగించడం వలన ఎంతో ఉపయెాగముంటుంది.

మహాదేవుడు శివుడు కుాడా ఒక సంధర్భంలో అడవుల్ని కొట్టి వేసి జంతువుల్ని చంపివేసేవారికి తాను కఠిన శిక్ష వేస్తాన నీ చెప్పారు. ఈ జగత్తును పాలించే శివుడు కుాడా జనులకు ఐశ్వర్యము ప్రసాదించే వారైనప్పటికి….పట్టుపీతాంబరాలు ధరించక….

పులి లేదా ఏనుగు మరణించిన తరువాత లభింే వాటి చర్మం ధరిస్తాన నీ చెప్పారు…బ్రతికిన దాన్ని చంపి దాని చర్మం నేను ధరించను…అని వారే స్వయంగా రుషులకు జ్ఞాన త త్సంగంలో చెప్పెవారు…

విచ్చలవిడిగా వస్తువుల్ని నీటిని ఆహారాన్ని ప్రకృతి ని వ్యర్దం చేయడం తనకు ఆగ్రహం తెప్పిస్తుందనీ చెప్పెవారు..!!

మన వంతు బాధ్యత గా ప్రకృతి ని కాపాడుకోవాలి…మితంగా జీవిస్తుా పరిమితంగా వస్తువుల్ని వినియెగించుకోవాలి.ఎందుకంటే… రాబోయే తరాల కోసం…

అలాగే కాలాన్ని కుాడా సద్వినియోగం చేసుకోవాలి…కాలాన్ని సద్వినియోగం చేయకుండా సోమరితనం నిద్ర తో వ్యర్దపు మాటలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారికి కాలసర్పదోషం తగులుతుందనీ జ్యోతిషులు అంటారు..అదే కాలసర్ప దోషమంటే…!

కాలసర్ప దోషానికి పరిహారం కేవలం కాలాన్ని దుర్వినియోగం చేయకుండా మంచి పనులు మంచి మాటలు , వారి వారి బాధ్యతల్ని ధర్మం గా నిర్వహించడమే…భగవంతుని ధ్యానం , జపం పుాజ యెాగ సాధన , ఆధ్యాత్మిక సాధన చేయడం…పరోపకారం పరమ ధర్మంగా భావించడమే ..కాలాన్ని సద్వినియోగం చేయడం…!
*******

*మాతృప్రేమ*

               ➖➖➖

*మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు..!*

*శివాజీ  రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది.*

*ప్రొద్దున ఆఱింటికి తెఱిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి.*

*ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు.*

*ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ!*

*రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు.*

*ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడదు.*

*’హీరాకానీ’ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలుపోయటానికి వచ్చేది.*

*అందఱికీ తనకు చేతనైన సహాయం చేసేది.*

*ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ.   ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది.*

*పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.*

*కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు.*

*“అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది.*

*హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్ఞ మేము మీఱలేము. ఈ ఒక్క పూటకి  ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం అవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊఱడించినారు.*

*మఱునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు.*

*అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది.*

*పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది.*

*ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు.*

*ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.*

*ఇంతలో ‘హీరాకానీ’ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్రార్థించింది హీరాకానీ.*

*శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. ‘హీరాకానీ’కి అందఱూ చూస్తుండగా         సాష్టాంగ వందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ.*

*ఇప్పటికీ ఈ బురుజు ‘హీరాకానీబురుజు’ అనే పిలవబడుతోంది.*🙏
*****విధి... చక్కని సందేశం...

ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది.

ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.

ఆ మాటా విన్న ఇంద్రాణి పరుగుం పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి, "మీరేం చేస్తారో నాకు తెలియదు. నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చని*పో*తాను" అని కన్నీరుపెట్టుకుంది..!

దానికి ఇంద్రుడు... “దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మా? కదా.! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను. నువ్వేం దిగులు పడకు… అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.

ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ.! "నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు.! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం "పద.." అంటూ బయలుదేరారు.

వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.

"నిజమే ప్రా*ణాలు కాపాడేవాణ్ణి నేనే…! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది.! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం.! మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి... " అన్నారు.

అందరూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.

ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రా*ణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను.. మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! అంటూ అందరూ బయలుదేరారు.

ఇంద్రుడు, బ్రహ్మ విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.

"అయ్యో.. అదేమి పెద్ద పనికాదు. మాములుగా చా*వుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను, వారు ఎలా చని*పోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చని*పోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..!" అని అన్నాడు.

యముడు, అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో. చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆకుపై చిలుక మర ణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!

ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక
మర ణిస్తుంది. అని వ్రాసి ఉంది.

ఇదే విధి…! విధిని ఎవ్వరూ మార్చలేరు!!
******