Wednesday, 1 June 2016



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక ప్రభ 
సర్వేజనా సుఖినోభవంతు 

1.ప్రతిమలో నినుగాంచి బండరాయంటినీ 
. మ్రొక్కుచుండెడి వాడు మూఢుడంటి 
నీ శక్తి నెరుగక నిన్ను దూషించితి 
. నరునికంటెను గొప్ప నాస్తి యంటి 
భ్రాంతిలో మునిగితి నింతకాలము నేను 
. కమలాక్షీ నీశక్తి గాంచనైతి 
వయసు శాశ్వతమంచు బాపముల్ సల్పితిన్ 
. బరమ పాపిని నేను పాహి పాహి 

మూఢమతులను బ్రోచుచున్ ముక్తినిచ్చి 
జ్ఞాన సంపద నివ్వవే జ్ఞానదాయి 
శరణు శరణంటి పదమంటి శారదాంబ 
వాసరాపుర వాసిత వాసరాంబ


2.నల్లనివాడు! పద్మనయనంబులవాడు! మహాశుగంబులన్ 
విల్లును దాల్చువాడు! గడు విప్పగు వక్షమువాడు! మేలు పై 
జల్లెడువాడు! నిక్కిన భుజంబులవాడు! యశంబు దిక్కులం 
జల్లెడువాడు! నైన రఘుసత్తముడీవుత మా కభీష్టముల్

3.అదిదేవుడైన యారామచంద్రుని 
కబ్ధి గట్టుటెంత? యసురకోటి 
జంపుటెంత? కపుల సహయ్య మదియెంత 
సురుల కొరకు క్రీడ జూపె గాక!!

4.విషధర రిపు గమనునికిని 
విషగళ సఖునికిని, విమల విషశయునునికిన్ 
విషభవభవజనకునికిని 
విషకుచ చను విషముఁగొనుట విషమే తలపన్ 

విషధర=సర్పాలకు, రిపు=శత్రువైన గరుడుని గమనునికి=వాహనముగా గలవనికి, విషగళ=శంకరుని, సఖుడు=శ్రీవిష్ణువు, విషశయనునికిన్=విష మనగ నీరు, అనగా పాల సముద్రమున పవ్వళించును కదా, విషభవ=నీటిలో పుట్టిన, భవ=బ్రహ్మయొక్క, జనకునికి=తండ్రికి, విషకుచయగు పూతన విషము తీసుకొనుటపెద్ద విషమగునా. యేమంత విషయము కాదనుట.

5.కేరింతల్ కడుసల్పు పాప డపుడే కేల్గాలు లాడించుచున్ 
సారిoచున్ తన దివ్య లోకనములన్ సర్వ ప్రపంచమ్ముపై 
పారించెంతయు బోసి నవ్వు నదులన్ భాసించు గంధర్వుడై 
కేరంచేడ్చును దిక్కులన్ మధుర సంగీతంబు నిండించుచున్ 

పాపడి మర్మార్థ వాక్యాలకును వ్యాక 
రణము వ్రాసెడి సుదీమణియె లేడు 

పాపడి లొల్లాయి పాటల సంగతుల్ 
పసిగట్టు సంగీత పరుడు లేడు 

పాపడి అభినయ ప్రజ్ఞ జూసియు దర్శ 
కత్వము గావించు ఘనుడు లేడు 

పాపడు క్రీడించ పటిమ శిక్షణ నిచ్చి 
ఆడించు మేలు కిలాడి లేడు 

లక్షణoబులకును మున్న లక్ష్య మనగ 
మాతృ మూర్త్యంకమే సభా మంటప మన 
సహజ సత్కళా వైభవ స్థాపకుండు 
వన్నె చిన్నెల చిన్నారి పాపడుండు

6.ఏ వేల్పులకు లేని యీశ్వర శబ్దంబుఁ దాల్చు నెవ్వఁడు సుధా ధాముతోడ 
నవని ప్రధానంబు లైన యంగంబుల సవరించు నెవ్వాఁడు సకల జగము 
నేకతంబున వసియించి యెవ్వనిఁ గంద్రు యోగీశ్వ రేశ్వరుల్ యోగదృష్టి 
నెవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పున రావృత్తి శూన్యక మండ్రు తెలిసి 

యతఁడు శంభుండు విశ్వ లోకైకసాక్షి 
యడుగఁ బుత్తెంచినాఁడు నీ యనుఁగుఁ గూఁతు 
నిమ్ము పెండిలి పెద్దల పెద్దల మేము మీకుఁ 
దిహిన గిరి రాజ! భాగ్యవంతుండ వైతి 

హిమవంతునితో శివునకు కన్యాదానము చేయుమని పెండ్లి పెద్దగా వచ్చిన బృహస్పతి చెప్పిన మాటలు. 
శ్రీనాధ మహాకవి "హరవిలాసము" నుండి

7.పట్టాభియోగ సౌభాగ్యము ల్దిలకించి నందుండు సంతతానందమొందఁ 
ద్రోటుపల్కులు ముద్దుదొలఁకు నవ్వులు గాంచి మురిసి యశోద సమ్మోదమంద 
నవమోహనాంగ సౌందర్యంబు భావించి పసిగాఁపు గుబ్బెతల్ పైఁబడంగఁ 
బూఁటపూఁటకు వృద్ధిఁబొందురూపముఁజూచి జనులెల్ల నాశ్చర్యమునఁ జెలంగ 

తలిరువలె గోమునై మొగ్గవలెను సోగ 
యై యలరువలె మృదువునై కాయవలెను 
బెక్కువై పండువలె నెఱచొక్కమగుచుఁ 
దేనెవలెఁ దేటయై శౌరి తేజరిల్లె 

వెలిదిండ్ల వేంకటపతి మహాకవి విరచిత "శృంగార రాధామాధవ సంవాదము" నుండి

--((*))--

9.నారాయణునిదివ్యనామసంకీర్తనం బనిశంబుఁ జేయుమహాత్ములకును 
బద్మాక్షుశ్రీపాదపద్మంబు లత్యంత భక్తిమైఁ బూజించు ప్రాజ్ఞులకును 
విశ్వరూపునిమూర్తివిభవంబు నేకాగ్ర బుద్ధి భావించుసత్పురుషులకును 
లక్ష్మీశ్వరునిసముల్లాసహేతువులగు వ్రతములు సల్పు సద్వర్తనులకు 

భవము దీఱినతుది వచ్చి భవ్యసుఖము 
లనుభవింపగఁ దగునెల వగుటఁ జేసి 
యఖిలవస్తుసంపదలకు నాకరంబు 
గుణవిథావిభాసురము వైకుంఠపురము 

ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడ విరచిత "నృసింహపురాణము" నుండి వైకుంఠపుర మహిమ వర్ణనము.

10.భువనరక్షక! నిన్నుఁ బొగడనెరని నోరు, ప్రజ కగోచరమైన పాడుబొంద 
సురవరార్చిత! నిన్నుఁ జూడఁగోరని కనుల్, జలములోపలి నెల్లి సరపుగుండ్లు 
శ్రీరమాధిప! నీకు సేవఁజేయని మేను, కూలి కమ్ముడువోని కొలిమితిత్తి 
వేడ్కతో నీకథల్ వినని కర్ణములైనఁ, కఠినశిలాదులఁ గలుగు తొలలు 

పద్మలోచన నీమీఁది భక్తిలేని 
మానవుఁడు రెండుపాదాల మహిషమయ్య 
భూషణవికాస! శ్రీధర్మపురనివాస 
దుష్టసంహార! నరసింహ దురితదూర! 

శేషప్పకవి "నరసింహ శతకము" నుండి

11.మృదుతల్పమై నీదు మదికిఁబ్రీతినిఁ గొల్ప, భోగీంద్రుఁడనుకాను భోగిశయన 
భుజమునందిడినిన్ను భువిఁద్రిప్పి మెప్పింపఁ, బక్షిరాజునుగాను పక్షివాహ 
స్వాంతాంబుకఱగున ట్లెంతయు వేఁడంగ, దంతీశుఁడనుకాను దంతిరక్ష 
భక్తిచే నీకృపా పరఁతఁగాంచుటకుఁ బ్ర, హ్లాదుండఁగాను ప్రహ్లాదవరద 

యెటులప్రోచెదొ మదిఁదోప దించుకైన 
మానసంబున భక్తి నమస్కరింతు 
సాంద్రకరుణాలవాల విశాలశీల 
భక్తజనలోల గోపాలబాల 

పన్నాల వేంకటసుబ్బరాయశర్మ "గోపాల శతకము" నుండి

12.రాకామలజ్యోత్స్నఁ ద్రావ నిచ్చలు గన్న నాచకోరంబుల కరుచి యగునె
సహకారపల్లవచయములు దొరకిన జాతికోయిలలకుఁ జప్ప నగునె
క్షీరాబ్ధిలోపలఁ గ్రీడింపఁగల్గిన భువి రాజహంసకుఁ బుల్ల నగునె
విరిదమ్మివాసనవెల్లి ముంచినఁ గ్రోలు షట్పదముల కనాస్వాద్య మగునె

బహుళతరదయార్ద్రభావప్రభావన
మహిమఁ దనరు జంగమంబు రాఁగ
నతులభక్తిపరుల కాహ్లాదకర మగుఁ
బరిహృతాభిషంగ బసవలింగ

పాలకురికి సోమనాథమహాకవి ప్రణీత "చతుర్వేదసారము" నుండి

13.కట్టడ యైనయట్టినిజ కర్మము చుట్టుచువచ్చి యేగతిం
బెట్టునొ పెట్టిన ట్లనుభవింపక తీఱదు; కాళ్ళు మీఁదుగాఁ
గిట్టక వ్రేలుఁ డంచుఁ దల క్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేరినకర్మము గాక భాస్కరా


14.వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!

ఒక మంచిపద్యరూపప్రణయలేఖ...... 

పింగళి సూరనమాత్యుడు క్రీ.శ. 1560ప్రభావతీ ప్రద్యుమ్నమున ప్రద్యుమ్నుని యుత్తరము పద్యముగానే వ్రాసియున్నాడు.. 

సీ... ''శ్రీ మత్స్సరవతీ రాలాకృపా సంప్ర 
యుక్తోపమాతిశ యోక్తికామ 
ధేను సద్బిరుదాంక దివ్యమంజీర సం 
శోభిత పాదకు శుచిముఖికిని 
ప్రద్యుమ్ను డూర్జిత ప్రణయపూర్వకముగా 
ననిపిన యట్టిరహస్య లేఖ 
ప్రప్రభా వతి బలు తెరంగుల నీవు 
రచియింప'' నని చదువుచునె యబ్బి 

గీ..సంతసము నాపజాలక చంక వైచు 
కొనుచు నొకదాటుకుని నిన్నుగూర్చి కాంతు 
డనిపినట్టి పత్రిక యెకదమ్మ భాగ్య 
వతివి నీవని చెలిప్రభావతిని బల్కె..

15.పొడువకుండఁగ నోడుఁ బొడువంగ నోడు శి వాజ్ఞను మీఱి యహస్కరుండు 
వీవకుండఁగ నోడు వీవంగ నోడు శి వాజ్ఞను మీఱి మహానిలుండు 
కాలకుండఁగ నోడుఁ గాలంగ నోడు శి వాజ్ఞను మీఱి హుతాశనుండు 
కురియింపమికి నోడుఁ గురియింప నోడు శి వాజ్ఞకు వెఱచి వజ్రాయుధుండు 

చంపకుండఁగ నోడును జంప నోడు 
మృడునియాజ్ఞను మీఱియు మృత్యు దండ 
ధర విధాత లోడుదురట "ధావతి" యని 
పరగ శ్రుతులిట్టులను మ్రోయు బసవలింగ 

పాల్కూరికి సోమనాధుని "చతుర్వేదసారము" నుండి

16.దేవాదిదేవుని తెఱఁగిట్టిదందమా తెఱఁగులెల్లను బుట్టు తెఱఁగుదాన 
మదనమదారాతిఁ జదివెదమందమా చదువుల కెల్లను మొదలుదాన 
బ్రహ్మాదివంద్యుని బరికింతమందమా బ్రహ్మాదులకునైన బ్రహ్మదాన 
దేవతారాధ్యుని దెలిసెదమందమా తెలిసిన మీఁదటిధృతియుఁదాన 

యెంత యనఁగ నేర్తు నేమని వర్ణింతు 
నేది యాది యంత్య మేదియరయ 
సకలమునకు నతనిసంతతానందంబు 
నెఱిఁగి కొలఁదిసేయు నెట్లువచ్చు 

పరమశివుని గురించి చెప్పమని అడిగిన మునులతో వాయుదేవుడు పలికిన పలుకులు 
పోతనామాత్య "వీరభద్ర విజయము" నుండి

17.కరతల మల్లఁజూచి పులకండము నెయ్యియుఁ బిండి యుం 
డ్రముల్, పొరిఁబొరిఁగళ్ళు సేయుచును బుగ్గలఁ బెట్టుచుఁ 
బావుకొంచు నచ్చెరువుగ లీలతో నమలి చిక్కుచు 
సొక్కుచు గౌరిముందఱన్, గురువులవారు వ్రేఁగడుపుఁ 
గుఱ్ఱఁడు మాకు బ్రసన్నుఁ డయ్యెడిన్ 

పోతనామాత్య "వీరభద్రవిజయము" నుండి వినాయక స్తుతి

18.హరి దేవకికిఁ బుట్టె ననుపురాణము విండ్రు హరి పుట్టె నీశున కనుట వినరు 
హరి మ్రొక్కెఁ గొంతికి ననుపురాణము విండ్రు హరి మ్రొక్కె నీశున కనుట వినరు 
హరి బుద్ధపదవర్తి యనుపురాణము విండ్రు హరి శైవపదవర్తి యనుట వినరు 
హరి చచ్చె బోయచే ననుపురాణము విండ్రు హరి చచ్చె శరభుచే ననుట వినరు 

హరియుఁ గ న్ని చ్చె నరునకు ననుట విండ్రు 
హరియుఁ గ న్ని చ్చె నీశున కనుట వినరు 
జ్ఞానహీనులు మూర్ఖు లజ్ఞానరతులు 
పాపమతు లెట్టిదుష్టులో బసవలింగ 

పాల్కూరికి సోమనాధుని "చతుర్వేదసారము" నుండి 



21.తన్ను లోనుగఁ జుట్టుకొన్న వటచ్చాయ నిజదీప్తి మొగులునా నింగిఁ బర్వ, 
బ్రహ్మసంహననామరద్రు పల్లవశిఖా చ్చటలునాఁ గుఱుచకెంజెడలు దనర, 
నీశ్వరోహమ్మను నీరహస్యము దెల్పు మురువున సుజ్ఞానముద్ర మెఱయ 
మనము చిద్రసములో మునిఁగి మాటాడంగ నెఱుఁగఁడో యన మౌన మెసకమెసఁగ, 

నమ్మహాలింగ మధ్యంబునందునుండి 
దక్షిణామూర్తి రూపంబుఁ దాల్చి శివుఁడు 
యౌవనశ్రీసమేతుఁడై యవతరింప; 
శక్తి తండ్రియు నత్యంత భక్తి తోడ 

దూర్జటి "శ్రీకాళహస్తి మహాత్మ్యము" నుండి 

'22. ప్రాణము వోవునో తనువు భంగము నొందునొ ' నాక , తూణికా 
బాణము జిఱ్ఱునం దిగిచి భల్లముఖాగ్రము రక్తపద్మ దృ 
క్కోణముఁ జేర్చి గ్రుచ్చి, యొకగ్రుడ్డు వడిం బెకలించి శోణిత 
ద్రోణికయైన దైవతశిరోమణి కంట నమర్చె నంతటన్ 

మున్నిటి కంటికంటెఁ గడు మోహనమై తనకన్ను వచ్చినన్ 
మన్ననఁ జూచి మెచ్చక, యుమాపతి రెండవకంట శోణిత 
క్లిన్నతఁ జూపినన్, నగి పుళిందుఁడు ' నీ కృపచేతఁ గన్న మం 
దున్నది, దీనికిన్ వెఱవ, నొక్కటి నావ్రత మింక శంకరా! 

లలాట లోచనంబునఁ 
గీలాలము దొరఁగె నేని, కేవలభక్తిన్ 
గీలించి, మనోదృష్టికి 
మూలంబగు నాదు ప్రాణముల్ నీ కిత్తున్ ' 

అని చెప్పుఁగాల నిటలా 
క్షుని కన్గొనఁ దన్నిపట్టి, సునిశిత బాణం 
బునఁ దన రెండవ కను గ్రు 
డ్డును బెకలింపంగఁ బూనుడును సదయుండై 

దూర్జటి మహాకవి "శ్రీకాళహస్తి మహాత్మ్యము" నుండి 

23.మువ్వన్నె పులి తోలు మొలదిండుగాఁ గట్టి కర్కోట కాహి పాగ బిగించి 
చిలువ పోఁగులను వ్రేల్చెవులఁ గీలన చేసి వలరాచ నీఱు మైఁ గలయ నలఁది 
చిన్నారి పొన్నారి శిశిరాంశుఁ దలఁదాల్చి కొన గోటి జత లేటి కొదమఁ బూని 
పచ్చి యేనిక తోలు పచ్చడంబు ధరించి గిలుకు మువ్వల కోలఁ గేలఁ బట్టి 

పసిఁడి జలపోసనముతోడ నెసఁక మెసఁగు 
బిసరు హాసను పుఱియ కప్పెర ధరించి 
పెద్ద నడివీథి నిలుచుండి భిక్ష యడుగు 
నాశ్రమంబునయందు ఖట్వాంగపాణి 

శ్రీనాధ మహాకవి "హరవిలాసము" నుండి 

24.పరఁగ నేదేవుండు ప్రళయకాలంబున నెందఱుబ్రహ్మల యేపు మాపె 
వెలయ నేదేవుండు విలయావసరమున నెందఱువిష్ణుల యేపు మాపె 
జడియకే దేవుండు సంహారవేళల నెందఱనింద్రుల యేపు మాపె 
నరయంగ నేదేవుఁ డంత్యకాలములోన నెందఱురుద్రుల యేపు మాపె 

నట్టిదేవదేవు నభవు నవ్యయు నీశుఁ 
గమలజాండనాథు గౌరీనాథు 
నిఖిలలోకనాథు నిందింపఁగారాదు 
పాతకంబు దక్ష పాపచక్ష 

పోతనామాత్య "వీరభద్ర విజయము" నుండి


25.శివ శివ శివ భో 
రాగం: నాదనామక్రియా 
తాళం: మిశ్ర ఝంప 
జయచామరాజ వొడెయార్ కృతి 

పల్లవి: 

శివ శివ శివ భో మహాదేవ శంభో శివా రమణ మమాపరాధం క్ష్యమస్వ 
(శివ) 

అనుపల్లవి: 

సర్వ సర్వానందకర అఖిలాండ ప్రభో భవ సాగర తారక అక్షయలింగ విభో 
(శివ) 

చరణం 

నమస్తే స్థాణో ప్రళయ కాల జగద్భక్షక నమక చమక ప్రకటిత రుద్ర సూక్త తోషక 
కామారే త్రిపురారే కుంభొద్భవ నుతిపాత్ర కామేశ్వరి వల్లభ కుబేర మిత్ర 

మధ్యమ కాలం: 

కపాలి కాలభైరవీ త్రివిఖ్యాత శ్రీ విద్యా వినుత నాదనామక్రియ తోషిత 
(శివ)



కమనీయవిమలశృంగారాంబుసంభూత, కమలమో యన ముఖకమల మమర 
బ్రహ్మాండగేహదీపంబు లనం గ్రాలు , తాటంకమణిరుచుల్ తాండవింప 
సంగీతసాహిత్య సరసిజాతము లైన, కోరకంబు లనంగఁ గుచము లలర 
సంపూర్ణపూర్ణిమా చంద్రిక యనుభాతి, ధవళాంబరము ధగద్ధగల నీన 

దేవగజదంతతుల్యమై దేహకాంతి 
చంద్రకాంతపీఠంబున సంగమింప 
వివిధకవిపుంగవుల మనోవీథి మెలఁగు 
వాణి నివసించుఁ గాక మత్స్వాంతమునను 

భాగవతుల నృసింహశర్మ గారి "శృంగారసంధ్య" (కాళికాపురాణాంతర్గతము)నుండి

26.ప్రాలేయాచలకన్యకా వదనశుంభత్పద్మ సౌరభ్యమున్ 
గ్రోలంగల్గియు దుష్టిలేక మునిహృత్ర్కోడాబ్జసౌగంధ్యలీ 
లాలాలిత్యముఁ గొరు నొక్క సితరోలంబంబు నైజాకృతిన్ 
డాలొదించుఁ బరాసులన్ భ్రమరకీటకన్యాయరీతిన్ బురిన్ 

అర్ధం: ప్రాలేయాచల ... సౌరభ్యమున్ = మంచుకొండపుత్రికయగు పార్వతియొక్క ముఖమను వికసించుచున్న పద్మముయొక్క పరిమళమును; క్రోలంగల్గియున్=అనుభవింపఁజాలియు; తుష్టిలేక=తనివితీరక; ముని ... లాలిత్యమున్=మునుల హృదయములలోపలి పద్మముయొక్క పరిమళవిలాసపు మనోజ్ఞతను (మనోజ్ఞమైన మునుల హృదయకమల పరిమళముననుట) సితరోలంబంబు=తెల్లతుమ్మెద=తెల్లతుమ్మెద (శివుడని భావము) నైజాక్ర్తిన్=తనయాకారముతో; డాలొందించున్=ప్రకాశింపజేయును. 
భ్రమరకీటకన్యాయము=తుమ్మెద యొక కీటకమును దెచ్చి తనగూటీలో నుంచి రొద చేయును. ఆ గూటి చుట్టును తిరుగుచుండును. కొంతకాలమునకా కీటకము కూడా భ్రమర మగునట; అట్లే ముని హృత్కమలములఁ జరించు శివుడు వారికందరికిని సారూప్యసిద్ధిని కలిగించునని భావము. 


28.అఖిలాండేశ్వరి 
ద్వీజావంతి - ఆది 

అఖిలాండేశ్వరి రక్షమాం శ్రీ 
ఆగమ సంప్రదాయ నిపుణే 

నిఖిలలోక నిత్యాత్మికే విమలే 
నిర్మలే శ్యామలే సకలకళే 

లంబోదరగురుగుహ పూజితే లంబాలకోధ్బాసితే హసితే 
వాగ్దేవతారాధితే వరదే వరశైలరాజనుతే శారదే 
జంబారిసంభావితే జనార్ధననుతే జుజావంతిరాగనుతే 
ఝల్లిమద్దెలఝర్ఝరవాద్య నాదముదితే జ్ఞానప్రదే


--((*))--

29.భసితాంగరాగాయ భక్తానురాగాయ సాలేక్షణాయ తుభ్యం నమోస్తు 
భర్మాద్రిచాపాయ భద్రేంద్రవాహాయ భయవిదూరాయ తుభ్యం నమోస్తు 
భండనోద్దండాయ భానుప్రతాపాయ భవ్యరుపాయ తుభ్యం నమోస్తు 
భరతప్రవీణాయ భవనాయితనగాయ భద్రప్రదాయ తుభ్యం నమోస్తు 

భావభవసంహరాయ తుభ్యం నమోస్తు 
భవసరన్నావికాయ తుభ్యం నమోస్తు 
భద్రచర్మాంబరాయ తుభ్యం నమోస్తు 
భారతీశార్చితాయ తుభ్యం నమోస్తు 

జయజయ కైలాసశైలనికేతన జయజయ దేవతాసార్వభౌమ 
జయజయ గిరితనూజామనోంబుజభృంగ జయజయ దైవవేశ్యాభుజంగ 
జయజయ నిగమాంతసముదయసంవేద్య జయజయ భువనరక్షాధురీణ 
జయజయ జలజాతసంభవాండపిచండ జయజయ శాశ్వతైశ్వర్యధుర్య 

జయపురందరహరివిరించనముఖాఖి 
లామరస్తోమముకుటాంచలాంచితాబ్జ 
రాగమణిక్యరోచిర్విరాజమాన 
చరణపంకేరుహాద్ధేశ జయమహేశ 

నారదుని శివస్తోత్రం 
కూచిమంచి తిమ్మకవి "శివలీలా విలాసము" నుండి

--((*))--

30.నవపుష్పకోమలి! నారీశిరోమణి! గిరిరాజనందన! కీరవాణి! 
గగనసన్నిభమధ్య! గంధేభమదయాన! యరవిందలోచన! హంసగమన! 
కనకజ్జగన్నాథచంద్రబింబానన! సరసిజాసన వినుతచరణయుగళ! 
భ్రమరసుందరవేణి! భక్తచింతామణి! భూరిగుణశ్రేణి! పుష్పవేణి! 

గౌరి! కల్యాణి! శాంభవీ పద్మపాణి! 
యంబ జగదంబ భ్రమరాంబ! నాత్మదలఁతు 
సర్వగుణధామ! శ్రీశైలసార్వభౌమ! 
చెన్నమల్లేశ! శివలింగ! శరణుశరణు! 

గంగాధర కవి "చెన్నమల్లేశ శతకము" నుండి

31.ఆసనంబిచ్చెద ననుకొన్న బ్రహ్మాండ, మెల్లనిండిన నీకు నేమియిత్తు 
పాద్యమిత్తునటన్నఁ బాదమ్మునన్గంగ, ప్రభవించె నింకేమి పాద్యమిత్తు 
న్నానార్థ ముదకమొ సంగుదునన నబ్ధి, శయనుండవౌట నే చందమిత్తు 
భువి పాదపూజ సల్పుదుననఁ బదపద్మ, ములమించు సుమములే వలను దెత్తు 

ప్రీతి నైవేద్యమును సమర్పింతమనిన, దేవతలకీవె సుధనీయ దేనినిత్తు 
సాంద్రకరుణాలవాల విశాలశీల, భక్తజనజాలలోల గోపాలబాల 

పన్నాల వేంకటసుబ్బరాయశర్మ " గోపాల శతకము" నుండి

32.కులగోత్రములు రూపు గుణము మానము లేని వానికి న న్నియ్యవచ్చునఁటరె 
నీటుగఁ బాముపై నిద్రించుమాయల వానికి న న్నియ్యవచ్చునఁటరె 
యెల్లజోగుల మనం బిల్లుగాఁ దిరిగెడు వానికి న న్నియ్యవచ్చునఁటరె 
వావివర్తన బంధువర్గంబు లేనట్టి వానికి న న్నియ్యవచ్చునఁటరె 

ఇట్టివానికి మావార లిచ్చినపుడె వడ్లతోఁ దట్ట యెండఁగా వలసివచ్చె 
చెలియ నీ వేఁగి కలువాయి చిన్ని కృష్ణుఁ దోడుకొని వేగ రాఁగదే తోయజాక్షి! 

"కలువాయి శతకము" నుండి

--((*))--

33.ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై పుట్టించు రక్షించుఁ బొలియఁజేయు 
నెవ్వని చేష్టల నెఱుఁగరు బ్రహ్మాదు లెవ్వనిమాయ మోహించు భువన 
మేడేండ్లబాలుఁడై యేవిభుఁడొకచేత గోరక్షణమునకై కొండనెత్తె 
నెవ్వఁడు కూటస్థుఁ డీశ్వరుఁ డద్భుత కర్ముఁ డనంతుడు గర్మసాక్షి 

యట్టి ఘనునకు శౌరికి ననవరతము మ్రొక్కెదముగాక విద్వేషమునకునేము 
వెఱతుమొల్లము నీపొందు వేగఁబొమ్ము చాలుఁ బదివేలువచ్చె నీ సఖ్యమునను. 

శతద్వనుడు అక్రూరుని హరిపై పగ సాధించుటకు కోరిన అక్రూరుడు పలికిన పలుకులు. 
పోతనామాత్య భాగవతము దశమస్కంధము నుండి

--((*))--

34.వనితరొ వెండికొండ నెలవంకలు పెక్కు వహించెఁ జూచితే 
యని సరసోక్తిఁ దా ననిన నచ్చపుగందపుఁబూతగుబ్బ జా 
ఱిన నునుఁబైఁటకొంగు సవరించుచు నవ్వినగౌరిఁ గౌఁగిటం 
దనిపెడు చంద్రశేఖరుఁ డుదారకృపన్ మముఁ బ్రోచుఁ గావుతన్ 

ఊరక చుట్టుకొన్నఁ గమలోత్పలపంక్తులు వాడు నంచునో 
యేఱును గూర్చి చుట్టితివ యెంతటిజాణవు మేలు మేలు నీ 
నేరుపు మెచ్చవచ్చు నని నిచ్చలు మచ్చిక శంభుఁ గేరునీ 
హారగిరీంద్రకన్యక దయామతిఁ గోర్కులు మా కొసంగుతన్ 

కంకంటి పాపరాజు ప్రణీత "శ్రీమదుత్తరరామాయణము" నుండి

--((*))-- 

35.అతిసమర్థునకు సేయఁగ రానిపని లేదు విద్యాధికున కెందు వింతలేదు 
పరుషోక్తునకు నోటఁ బలుకరానిది లేదు సత్యసంధునకుఁ బక్షంబు లేదు 
హననకారికి నితడాతఁ డన్నది లేదు దురితాత్మునకు వావి వరుస లేదు 
భాగ్యశాలికి లభింపని శోభనము లేదు చెడ్డవానికి రాని చేటు లేదు 

నేర్చిదిరిగినవానికి నిందలేదు కష్టమోర్వకయున్న సౌఖ్యంబు లేదు 
జ్ఞాననిథిగాకయున్న మోక్షంబులేదు రామలింగేశ రామచంద్రపురవాస 

అడిదము సూరకవి "రామలింగేశ శతకము" నుండి 

--((*))--


స్తాపకాయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే   
అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ:

భగవంతుడు కేవలం మంచిని నిల బెట్టడానికే మనిషిగా మనమద్యకు వస్తాడు, మన అడుగులో అడుగు వేసి నర్తించినట్లు నటించి మన తప్పటడుగుల్ని సరిదిద్దుతాడు 
అందరికీ శుభాకాంక్షలు  

36.రాకేందునీకాశరమ్యగాత్రమువాని రమణీయఫణిభూషణములవానిఁ 
గందర్పశతకోటిసుందరాకృతివాని డమరుత్రిశూలఖడ్గములవాని 
సదమలదరహాససరసాననమువాని భసితాంగరాగవిభ్రమమువాని 
సింధూరాజినసమంచితనిచోళము వానిఁ గరుణాకటాక్షవీక్షణమువానిఁ 

బ్రధితభువనోద్భుతోరువైభవమువాని 
ఘనతరానందహృదయపంకజమువాని 
సకలలోకాధిపతి యైన సాంబశివునిఁ 
గనియె మునిమౌళి కన్నులకఱవుదీఱ 

నారదమునికి దర్శనమిచ్చిన శివుని స్వరూప వర్ణన 
కూచిమంచి తిమ్మకవి విరచిత "శివలీలా విలాసము" నుండి

37.అమరకోశము శబ్దాది వర్గము

శబ్దే నినాద నినద ధ్వని ధ్వాన రవ స్వనాః

స్వాన నిర్ఘోష నిర్ర్హాద నాద నిస్వాన నిస్వనాః

ఆర వారావ సంరావ విరావాః

నినాదః, నినదః = మ్రోయునది నినాదము

ధ్వనిః, ద్వానః = ధ్వనించునది

రవః, స్వనః = రవము చేయునది

నిర్ఘోషః, నిర్ర్హాదః = అవ్యక్త శబ్దములు

నాదః = నదించునది

నిస్వాదః, నిస్వనాః = స్వన శబ్దము

రవః, ఆరావః, సంరావః, విరావః = రవమగు శబ్దములు

ఇవి పదిహేడున్ను మ్రోతకు పేర్లు

అథః మర్మరః

మర్మరః = మరమరమను శబ్దము కలుగును

కోకలు, ఆకులు మొదలగు వాని మ్రోత పేరు

భూషణానాం తు శిఞ్జితమ్

శిఞ్జితం = అస్ఫుతముగా మ్రోయునది

ఇది భూషణముల ధ్వనికి పేరు

నిక్వాణో నిక్వణః క్వాణః క్వణః క్వణన మిత్యపి

నిక్వాణః, నిక్వణః, క్వాణః, క్వణః, క్వణః =లెస్సగా పలుకునది

ఇవి ఐదున్ను వీణాది సకల వాద్యముల ధ్వనులకు పేర్లు

వీణాయాః క్వణితే ప్రాదేః ప్రక్వాణ ప్రక్వణాదయః

ప్రక్వాణః, ప్రక్వణః = మిక్కిలి మ్రోయునది

ఇవి రెండున్ను వీణాది ధ్వని పేర్లు

కోలాహలః కలకలః

కోలాహలః = కోలములు, వరాహములు వీటిని భయపరచునది

కలకలః = అవ్యక్తముగా పలుమారులు పలుకబడునవి

ఇవి రెండున్ను గుంపున పుట్టిన గొప్ప ధ్వనికి పేర్లు

తిరశ్చాం వాశితం రుతం

వాశితం = పలుకబడునది

రుతం = పలుకబడునది

ఇవి రెండున్ను మృగ పక్ష్యాదుల ధ్వనికి పేర్లు

స్త్రీ ప్రతిశ్రు త్ప్రతిద్వానే

ప్రతిశ్రుతిః = ఎదురుగా వినబడునది

ప్రతిద్వానః = ఎదురుగా పలుకుట

ఇవి రెండున్ను ప్రతిధ్వని పేర్లు

గీతం గాన మిమే సమే

గీతం , గానం = పాడబడునది

ఇవి రెండు పాట పేర్లు

ఇవి రెండునూ సమానార్ధకములు

శబ్దాది వర్గము సమాప్తము తరువాత నాట్య వర్గము

38.విరించి విరచిత వాసరాంబ శతకము 

పాపకర్ముల మంచు పాపుల మేమంచు 
. నిందించు టేలనో నీరజాక్షి 
పద్మగర్భుడు నీదు భవుడు వ్రాసిన వ్రాత 
. నాచరించెడు వారమవని యందు 
మర్కట సమమైన మానసమ్మేయిచ్చి 
. రాగబంధాలనే రసము నిచ్చి 
కీలుబొమ్మగమమ్ము క్రీడింప జేతురే 
. పరమాత్మ క్రీడలో పాచికలము 

ధాత గీతను మాకింక దాటవశమె 
పాప మందున మాకెట్టి బాధ్య తగును 
శరణు శరణంటి పదమంటి శారదాంబ 
వాసరా పుర వాసిత వాసరాంబ

--((*))-- 


39.క్షీరోదకన్యకు శ్రీమహాలక్ష్మికిఁ గమలాయతాక్షికిఁ గంబుకంఠి
కఖిలలోకేశ్వరి కామ్నాయవినుతకుఁ గనకకైతకపుష్పగర్భగౌరి
కరుణాధరోష్ఠికి నమరకోటికిరీట కోటివిటంకసంఘాటఘటిత
రత్నాంకురప్రభారాజి నీరాజిత శ్రీపాదపద్మపీఠోపకంఠ

కంబురుహనాథుదేవికి నాదిశక్తి
కిందిరకు లోకమాతకు నిగురుఁబోఁడి
కలరువిల్కానితల్లికి నాశ్రితార్థ
కల్పవల్లికి మ్రొక్కఁగఁ గంటిమంటి

అగస్త్యముని చేసిన కొల్లాపురి శ్రీమహాలక్ష్మీ స్తోత్రం
శ్రీనాధ కవి విరచిత "కాశీఖండము" నుండి 

--((*))-- 

40.ఆడమోడి గలదే 
రాగం: చారుకేశి 
తాళం: ఆది 
త్యాగరాజ స్వామి కృతి 

ఫల్లవి 

ఆడమోడి గలదే రామయ్య! మాట 
(లాడమోడి) 

ఆనుపల్లవి 

తోడు నీడ నీవె అనుచును భక్తి గూడి నీ పాదము బట్టిన నాతొ మాట 
(లాడమోడి) 

ఛరణం 

చదువులన్ని దెలిసి శంకరాంశుతుడై సదయు-దాసుగ- సంభవుడు మ్రొక్క 
కదలు తమ్ముని బల్క జేసితివి గాకను త్యాగరాజే పాటి మాట 
(లాడమోడి)

41.శా. భూషామౌక్తికకాంతి దేహరుచితోఁ బోరాటమాడన్ మరు 
ద్యోషారత్నకిరీటఝూటసుషమా యోయుజ్యమానాంఘ్రి ని 
శ్శేషశ్రీ విరిదమ్మిగద్దియ సమాశ్లేషింపఁ గొల్వుండు నా 
భాషాదేవిఁ దలంచెదన్ రసలసద్భాషావిశేషార్థినై 

(ఆభరణములయందలి ముత్యములకాంతి శరీరచ్ఛాయతో సాటిరాఁదలఁచుచుండఁగాను, దేవతాస్ర్తీలయొక్క మకుటములయందుఁ గూర్పబడిన వివిధమణులయొక్క కాంతులతోఁ గూడినదై పాదములసంపద పుండరీకాసనమునఁ గలియఁగాను, గొలువుదీరియున్న వాగ్దేవతను నవరసపూరితములై మనోహరములగు వాక్కుల నొసంగుటకు ప్రణుతించెదను) 

ఉ. చెక్కిటఁ బత్త్రవల్లరి సృజింపఁగఁబూని మనోజకేళి నా 
యక్కఱ దీర్పవేయనుచు నక్షరపంక్తి లిఖింపఁగాఁ దద 
న్యక్కృతకైతవంబు హృదయంబున నారసి ప్రాణనాథుతో 
నొక్క పిసాళినవ్వు ననలొత్తఁగనవ్వెడువాణిఁ గొల్చెదన్ 

బ్రహ్మ తనచెక్కిలియందు మకరికపత్త్రముల వ్రాయుచు రతికేళియందు నాకోరిక దీర్పుమను నక్షరములను వ్రాయగా నది కనుగొని యందులకు సమ్మతించినభవముతో నేదియో యొక నెపమున దన చెక్కిటగల మకరికాపత్రములు ముడుచుకొనునట్టు నవ్వుచున్న సరస్వతీదేవిని సేవించెదను. 

కందుకూరి రుద్రకవి "నిరంకుశోపాఖ్యానము" నుండి

--((*))--

43.తలవాఁకిటను మెలంగెడు

పొలఁతుక పలుకుల వెలఁది పొత్తముముత్తో

నలువపడఁతి కలుములపై

దలికోడ లనంగఁ బరఁగు (ధర) వాణి (శివా)

తలవాఁకిటను మెలంగెడు పొలఁతుక=శిరస్సునకు ద్వారమైన నోటియందు సంచరించెడు స్త్రీ, పలుకుల వెలంది= వాక్కుల కధిదేవత యగు పడుచు, పొత్తము ముత్తో= పుస్తకములయందు వెలయునట్టి ముత్తైదువ, నలునపడఁతి= బ్రహ్మదేవుని భార్య,  కలుములపైదలి కోడలు= సంపద కధిదేవత యగు లక్ష్మీదేవికి కోడలు, (లక్ష్మీ పుత్రుడు బ్రహ్మ కు భార్య యగుటచే లక్ష్మీకి కోడలు) అనునవి సరస్వతీ దేవికి పేర్లు.

పైడిపాటి లక్ష్మణకవి "ఆంధ్రనామ సంగ్రహము" నుండి

45.తెలియలేరు రామ భక్తి మార్గమును 
రాగం: ధేనుక 
త్యాగరాజ స్వామి కృతి 

ప) తెలియలేరు రామ భక్తి మార్గమును || తెలియలేరు 

అ) ఇలనంతట తిరుగుచూ మరి (తిరుగుచును) కలువరించెరే గానీ || తెలియలేరు 

చ) వేగ లేచి నీట మునిగి భూతి (బూది) పూసి (పూచి), 
వ్రేళ్ళనెంచి (వేళనెంచి) వెలికి శ్లాఘనీయులై (వేషధారులై), 
బాగా పైకమార్జన లోలులైరే గాని - త్యాగరాజ వినుత! | తెలియలేరు 
(బాపు గారి బొమ్మ)

46.బంటురీతి కొలువియ్యవయ్య రామా 
రాగం: హంసనాదం 
తాళం: ఆది 
త్యాగరాజ కృతి 

పల్లవి: 
బంటు రీతి కొలువీయ వయ్య రామ 

అనుపల్లవి: 
తుంట వింటి వాని మొదలైన 
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ 

చరణం: 
రోమాంచమనే, ఘన కంచుకము 
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు 
రామ నామమనే, వర ఖఢ్గమి 
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే


--((*))-- 

47.చంద్రఖండ కలాపుఁ జారువామనరూపుఁ గలితచంచలకర్ణుఁ గమలవర్ణు

మోదకోజ్జ్వలబాహు మూషకోత్తమవాహు భధ్రేభవదను సద్భక్త సదను

సన్మునిస్తుతిపాత్రు శైలసంభవపుత్రు ననుదినామోదు విద్యాప్రసాదుఁ

బరమదయాభ్యాసుఁ బాశాంకుశోల్లాసు నురుతరఖ్యాతు నాగోపవీతు

లోకవందితగుణవంతు నేకదంతు

నతులహేరంబు సత్కరుణావలంబు

విమలరవికోటితేజు శ్రీవిఘ్నరాజుఁ

బ్రథితవాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు

ఆతుకూరి మొల్ల విరచిత "మొల్ల రామాయణము" నుండి గణేశ ప్రార్ధన

48.శ్రీగణనాథ పరాత్పర

వాగీశ సురేశవంద్య వరగుణసాంద్ర

వేగమె నినుగొల్చెద నను

బాగుగ బాలింపవయ్య పార్వతితనయ

శ్రీ త్యాగరాజ విరచిత "నౌకా చరిత్రము" నుండి గణపతి వందన


49..ఏక ఏవ పరో బన్ధు ర్విషమే సముపస్ధితే | 
గురు స్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః || 
భావము :-విషమ పరిస్ధితులు ప్రాప్తించు నపుడు బంధువులందరికంటే 
అధికుడయిన బంధువు సద్గురుడే ,శిష్యుడు ఆచరింప వలసిన ధర్మరూపుడా గురువే 
కనుక ఆయన నెల్లప్పుడు ధ్యానించుటయే ,శరణు పొందుటయే ,సకల ధర్మములను ఆచరించుట , 
గీతలో "సర్వ ధర్మాన్ ,పరిత్యజ్య 'అన్న శ్లోకం వివరిస్తున్నది

  
50.నండూరి వారి .“నమిలి మింగిన నా యెంకి” 
ఎంకి నాయుడుబావల ప్రణయానికి, ప్రేమకు పరాకాష్ఠ 
సాటేలా? నీకు మాటేలా? 
సిన్నతనమేలా? సిగ్గేలా? 
ఆ సీమ యీ సీమ 
అందచందాలు 
తిన్నంగ నిను సూసె 
దిద్దుకుంటారు 
…………….. 
యెంకొక్క దేవతై 
యెలిసెనంటారు – 
యింటింట పెడతారు 
యెంకి నీ పేరు 
.......యెంకితో తీర్తానికెళ్ళాలి 
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటే 
……………… 
కోనేటిలో తానమాడాలి! 
గుడిసుట్టు ముమ్మారు తిరగాలి! 
కోపాలు తాపాలు మానాలి! 
యిద్దరము పిల్లోణ్ణి యీశుడికి సూపాలి!


--((*))--

హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు బహుృచమత్కార భాసురంగా  యీశైలిలో మహేశ్వర వర్ణనం నిర్వహించారు . ఆపద్యాన్ని పరిశీలించండి! 

" ఉ: " హెడ్జున మూను , స్కిన్నుపయి నెంతయు డెస్టును , ఫైరు నేత్రమున్ , 
సైడున గ్రేటు బుల్లు , బహు చక్కని గాంజెసు హైరు లోపలన్ , 
బాడికి హాఫెయౌచు నల పార్వతి , మౌంటెను డాటరుండ , ఐ 
షుడ్డు డివోటు , దండములు సోకగ ,,ప్రేయరు సేతు నెప్పుడున్ " 


భావము; తలపై నెలవంక, శరీరమున భస్మము , అగ్గి కన్ను(మూడవకన్ను) ప్రక్కనే వాహనమైన నంది , సిగలోగంగ, అర్ధనారియై పార్వతి , హిమగిరి కుమారి యుండగా వేరెవ్వరికి మ్రొక్కను? తప్పక శివునే భక్తితో కొలిచెదను.శిరమున చేతులుంచి నమస్కరించుచు పరమశివుని యెల్లపుడు ప్రా్ర్ధన సేతును. 

బాగుంది కదండీ! రేపు మరో పద్యం పరశీలిద్దాం! స్వస్తి ! 

51.జన్యంబున దనుజుల దౌ 
ర్జన్యము లుడుపంగఁ గోరి చనుదెంచిన సౌ 
జన్యవతిఁ జూచి యదురా 
జన్యశ్రేష్ఠుండు సరస సల్లాపములన్ 

లేమా! దనుజులఁ గెలువఁగ 
లేమా నీ వేల గణఁగి లేచితి విటు రా 
లే మాను మాన వేనిన్ 
లేమా విల్లందుకొనుము లీలం గేలన్ 

హరిణాక్షికి హరి యొసఁగెను 
సురనిక రోల్లాసనమును శూర కఠోరా 
సుర సైన్య త్రాసనమును 
బరగర్వ నిరాసనమును బాణాసనమున్ 

నారి మొరయించె రిపు సే 
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్ 
నారీమణి బలసంప 
న్నారీభాదికము మూర్ఛ నంద నరేంద్రా! 

కొమ్మా! దానవనాధుని 
కొ మ్మాహవనమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై 
కొమ్మా మెచ్చితి నిచ్చెదఁ 
గొ మ్మాభరణములు నీవు గోరిన వెల్లన్ 

పోతనామాత్య భాగవతం దశమస్కంధం లోని నరకాసురవధ ఘట్టం నుండి కొన్ని అందమైన కందాలు.

పద్మ  లోచన కృష్ణ1  భక్త భయప్రద

వినుము సంసరాగ్ని వేగుచున్న

జనుల సంసారంబు సంహరింపగా నీవు

దక్క నన్యులు  లేరు తలచి చూడ

సాక్షాత్కరించిన సర్వేశ్వరుడవు

ప్రకృతికి నవ్వలి ప్రభుడ వాద్య

పురు షుండవగు నీవు బోధముచే మాయ

నడతువు నిశ్శ్రేయసాత్మ యందు 

మాయ చేత మునిగి మనువరాలకు కృప

చేసి ధర్మముఖ్య చిహ్నమైన

శుభము సేయు నీవు సుజనుల నవనిలో

గాన పుట్టుడువు జన్నివాస 


" సంసారజ్వాలల్లో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్ట్టడం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు.  నివు సాక్షాత్తూ సర్వే శ్వరుడవు   ఈ ముల్లోకాలకూ అవలివాడవు. ఆది పురుషుడవైన ప్రభువు నీవు ముముక్షువులకుజ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన  వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాసా శిష్టరక్షణ కోసమే నీవు ఈ  జగత్తులో జన్మిస్తావని ప్రస్తుతిస్థూ ఫల్గుణుడు వేడుకున్నాడు

Tuesday, 31 May 2016

ప్రాంజలి ప్రభ - నేటి స్థితి


ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం
 ప్రాంజలి ప్రభ - నేటి స్థితి 
image not displayed 

 

తళుకుంబంగరమేను వజ్రమయమౌ దంతంబు హస్తంబునం
దళుకున్ముత్తెపుమోదకంబు దగ శృంగారంబుగాఁ జేసి ని
చ్చలుఁ బుాజి...


శుభప్రదం
03-06-2016
image not displayed 




image not displayed
image not displayed

Saturday, 28 May 2016

శృంగార సాహిత్యం

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   పోమ్ శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - శృంగార సాహిత్యం 
 తరుణామృతం

సర్వేజనా సుఖినోభవంతు

మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం - సాహిత్య వచన శృంగార  కావ్యం
(రచయత: మల్లాప్రగడ రామకృష్ణ) 
 ------
  పచ్చటి తోటయందు పసిడి రంగుతోడ, ఓరచూపు ఇంపుతోడ, అడుగులు దడా  దడా అనుచుండ, జారేడు కుచకుంభాలు కదులుచుండ, కాల్నడక పోవు చుండ, వదనాంచల మందున చిన్కుల చెమట, మడుగులా మారుచుండగా, వయ్యారంగా మల్లిక కన్పించే. 

పసిదానిమ్మ పండు  చాయ, కొసరు ఆ కుసుమ గంధి కోమలపు తోడల్ (లేలేత తామర స్వేత తూడులా లేక పాల లాంటి అరటి ఊచలా ) 
 జారు చెమ్మ, నేలరారు ముత్యాల వరుస, సహజ సౌందర్యముతో వెలసిల్లు చుండా, పదహారో వసంతంలో అడుగుపెట్టి, వయసు వన్నెలతో, మాయని మెరుపు కాన వస్తున్నది, బాల్యము వెడలి, నవ యవ్వనపు మొలకులతో లేత సిగ్గుల దొంతరలతో, మధుర మంద హాసంగా ఉండి, నడుస్తుంటే, పురజనులు " ఆ ఆ " అని నోరు తెరచి, సొంగ కార్చు చుండే, ముందుకు నడుస్తున్నప్పుడు, ముందు వెనుక ఎవరున్నారు అనే జ్యాస అనేది లేదు, మరయు అమె కళ్ళకు ఎమీ కనిపించలేదు, కాని ఏదో తెలియని వయసు పొంగే మెరుపు ఆవహించినదని  మాత్రం అర్ధం అవుతున్నది, ఆమె ఏ శృంగార దేవత, కారణము ఏమగునో అని పలువురు ముచ్చట్లు చెప్పుకొనసాగిరి, సౌందర్యదేవత నడచి వెళ్ళినట్లు తన్మయులై ఉన్నారు ఆసమయాన?(1) 
   
   యవ్వన నడకతో నడుస్తుంటే  ఇసుక లో కాళ్ళు ఇరుక్కొని,  ఈడ్చు కుంటూ, తన్మయత్వపు  నడకతో, మేనుపై  వేడి కిరణాల సెగ ఆవహించిన నిట్టూర్పులతో, ఉన్న నడకను చూసిన వారికి కన్నులు  చెదిరినవి, వారి ఊహలు గాలిలో ఎలిపోతున్నవి. 


తామర మొగ్గచందమున మెత్తని మేను
జలజగంధము రతిజలముఁదనరు
మాలూరఫలముల మఱపించు పాలిండ్లు
కొలికుల కింపైన కలికి చూపులు 

తిలపుష్పముల వన్నె దిలకించు నాసిక
గురువిపూజనాపర సునియమ
చంపకకువలయ ఛాయయుగల మేను
నబ్జపత్రము బోలు నతనుగృహము

హంసగమనంబు కడుసన్నమైన నడుము
మంజుభాషిణి, శుచి, లఘుమధురభోజి
వెల్లచీరల యందున వేడ్క లెస్స
మానవతి పద్మినీభామ మధురసీమ

తామరపువ్వువలె మెత్తని శరీరంను,
తామరపువ్వువాసనగల రతిజలమును,
మారేడు పండ్లవంటి కుచములును,
సొగసగు చూపును, నువ్వుపువ్వువంటి ముక్కును,

గురు బ్రాహ్మణ పూజయందు ఆసక్తియు,
సంపంగి వంటియు కలువ పువ్వులవంటి
దేహఛాయ గలదియు, హంసగమనమును,
సన్నని నడుమును, మంచి మాటలును,

శుచియై కొద్దిపాటి భోజనమును, తెల్ల చీరల
యందు ప్రీతియును గల స్త్రీ పద్మిని జాతి

--((**))--

పడచు జింక పిల్ల నడిచినట్లు మల్లిక నడుస్తుండగా, కాలి పాదాల చెమ్మ, అద్భుత మెరుపుగా కనిపించే., ఆవిధముగా  పొతూ ఉంటే  అక్కడ కొంత దూరములో మామిడి తోపులు కానవచ్చే, మామిడి పూవు నవ యవ్వన సౌందర్యానికి పరవశించి, కొమ్మలపై రేమ్మలపై నిలువలేక, జల జల రాలి పాదాల ముందు చేరే, ఆమె పాదాలు స్పర్శకు పూలు  నలిగినా చెప్పుకోలేని సంతోషముతో ఉండగా, జిలుగు పూల కళంకారి చీర జాఱ, కాలి కడియాలు మలుపు కొనుచు, తనువంతా వంచి సరిదిద్దు కొనుచు, సందెడు చీర కుచ్చెళ్లు చెదరనీక గట్టిగా అదుము కొనుచు, పిల్ల గాలి సవ్వడికే ఎగసిపడుతున్న చీరను పట్టుకొనుచు ఉండగా, ఆ వనమంతయు చూసి పరవసంతో పూల వర్షం కురుపించే.        
అప్పుడే పవనుడు (నిత్య  సంచారి) ఈవిధముగా పాడుచున్నాడు
Photo
ఓ బాల బాల నిన్నే కోరి
 నీచెంతకు చేరి
నవ్వులు కురిపిస్తా రాదరి
సొగసుతో అలుగకు నారి

ఓ పరువంలో ఉన్న తుంటరి
ఓ మనసును తపిస్తున్న చకోరి
ఓ వయసులో చేయద్దు చాకిరి
ఓ ఎందుకు ఉంటావు ఒంటరి

ఒంటరిగా తిరుగకు మయూరి
వస్తాడు పరువాన్ని దోచే పోకిరి
నేను వెంట పడ్డా సరి సరి
నీ ఆశ తీర్చనా ఈ సారి

కళ్ళలో భావం చూపే గడసరి
నేను సరిజోడు కానా మరి
తోడూ నీడవుతాడు ఈ బాటసారి
నీ చూపుకే నాకు వచ్చు శిరి

అంటూ తన్మయత్వంతో నారి మణి చూపుల  తప్పుకోలేక, ఒప్పించలేక మదన తాపముతో కదిలాడు ఆకాశ సంచార పవనుడు .
 ఆ మాటలకు కణతలు త్రిప్పి అనగా విచ్చుకున్న పువ్వులా చూసి కొంగ్రొత్త శోభతో చిరునవ్వు విసిరి, వెన్నెల చెండ్లు పట్టి చేతిలో ఉంచి నెమ్మదిగా ఊదే  కనులు నేలచూపులు చూస్తు, పాదాలు అలవోకగా కదిలిస్తూ చూసి చూడనట్లుగా ఓర చూపు చూస్తూ, చేతితో చీర కొసలు పైకి  ఎగదోస్తూ,  వన మద్య నిలిచే మల్లిక.
  
స్వాగత పక్షి కుహు కుహు అని పిలుస్తున్నట్లు, హ్రదయము బరువెక్కగా, ఎద పొంగులు కాన రాకుండా చీర చుట్టు కొనగా,
 మోహనుడు కంచెను దాటి వచ్చినట్లుగా ఊహించె మోహనాంగి.
మిస మిస లాడు జవ్వనం, మేలిమి మైన పుత్తడి తనువును చేరి, ఓరగా సొగసు నంతా నలిపి నట్లుగా, మనసును పులకరింప చేసి నట్లుగా,  అతని చూపుల యందు ఆర్తి, హృదయాంతరము నందు తరింపక వేదన గురిచేసి వేళ్ళకు మోహనా, తొలకరి వానకు తడిసిన ముగ్ద మోహన లతాంగిని, నాలో ప్రవేశించి నన్ను ఇబ్బంది పెట్టకు ఓ చల్ల గాలి .
 అందెల రవళితో, జల జల పారే నదిలా సాగుతున్న లతాంగిని హరిణ పుత్రి చూసి, తొడగని చల్లని చెమటలూరు హస్తంబున దువ్వుచూ చల్లని పలుకులతో  నెమ్మదిగా ముచ్చట్లు చేసే, కళ్ళ వెలుగులు నవరత్నాల వెలుగుల కన్నా మిన్నగా ఉన్నాయి, ఈ మెరిసే ప్రాలు మాలికలకు కారణం ఏదైనా ఉన్నదా ? ........

ఈ వనము నందు వచ్చుటకు కారణం చిన్న తనపు చేష్ట అను కొందునా, అని పలుకుతూ కళ్ళ యందు వాత్సల్య మును కురిపించే, ఆ మోహన హరినంబును ముద్దాడి, తృణ పరిమళమును ఆస్వాదించి     అనువంతా తపించే.

నడచి వచ్చిన ఆయాసము పోలేదు
చీర చెఱగుల తడి యైన ఆరలేదు
తృణమును ముద్దాడిన మక్కువ తీర లేదు
ఆ హా హా ఏనాటి ప్రేమార్ధమో తెలియుట లేదు 

వాలు చూపులతో ఉన్న సొగసుకు మరి కాస్త వన్నె తెచ్చేందుకు, లలిత సుకుమార కుసుమాలు, కురులకు చేరి పరిమళాలతో పరవశిస్తూ  తుమ్మెదలను పిలుస్తున్నట్లుగా, శిరో మండలమునందు ఉండి, ఈ చెట్టు నీడను చేరు ఓ కోమలాంగి అని అన్నాయి. 

 
కొమ్మలతో రెమ్మలతో కిక్కిరిసి ఉన్న వన పందిరి క్రింద మల్లిక చేరే, అక్కడే  ఉన్న ఒక వృద్ధ వృక్షంబొకడు (రాం తాత), ఆ తరువు యందు సంత సించి సొన కార్చుచూ, చెమ్మతో చల్లదనము కల్పించుతూ ఇట్లు పలికే, ఎండ కన్నెరుగక, వాన నీడ  గిలక, వన సౌరభాన్ని చూడు, ఆనంద పారవస్యంలో మునిగి తరించు కుసుమమా .....అని పలికే . 

ఇంకా ఓ కుసుమమా మన్మధుడు మంచి వాడు తన పని తను చేసుకు పోతూ ఉంటాడు,  వానిని ఎదిరించి ఎవ్వరూ జీవనము గడపలేరు, ఆ త్రిమూర్తులకే చేతకాలేదు అది గమనించు. 

సుడిగాలి వస్తున్నా, అగ్ని గోళాలు విరజిమ్ము తున్నా, ఎండిన ఆకులు రాలుతున్నా, పిట్టలు చల్లదనం కోసం పరుగెడుతున్నా,  మేఘాలు ఘర్జిమ్చుతున్నా, అకాశ మంతా నల్లని రూపం దాల్చిఉన్నా, ఎడారి జీవులుగా మారుస్తున్నా, ఎవ్వరియందు చైతన్యము లేకున్నా, శృంగార తత్వం, మన్మధుని లీలలు మారవు అది మాత్రం గమనించు మల్లిక . ................
మనసుకు శృంగారము ఆవహించితే అది తొలగించుట ఎవ్వరికైనా కష్టమే, అందుకే అన్నారు ఒక మహాను భావుడు. 
 
మాటపై విశ్వాసము చూపుట కష్టమే
సత్యం పలికి జీవించటం కష్టమే
ధర్మాన్ని అనుకరించి బ్రతకటం కష్టమే 
న్యాయాన్ని నమ్మి నడుచు కోవడం కష్టమే 

వేడికి మంచు కరుగాకుండా ఉండుట కష్టమే 
నదులు సముద్రాన్ని కలవకుండా ఆపుట కష్టమే 
పుట్టిన జీవి పృధ్విలో కలువ కుండుట కష్టమే 
వయసు మార్పులు ఆపుట ఎవ్వరికైనా కష్టమే

నీడను బట్టి వయసును గుర్తించటం కష్టమే
మాటను బట్టి గుణాన్ని గుర్తించటం కష్టమే 
పురుషులందరూ మంచివారే ననుట కష్టమే
  యవ్వనవతు లందరూ పతివ్రతలనుట కష్టమే

మనువాడిన మనస్సు అర్ధం చేసుకోవడం కష్టమే 
వయస్సులో వచ్చే మర్మాన్ని గుర్తించడం కష్టమే 
కాల చక్రాన్ని, కాలాన్ని ఎదిరించి ఉండుట కష్టమే 
గురువులను, పెద్దలను, పిల్లను విడిచి ఉండుట కష్టమే 

ఆరిపోని వెలుగు, ఆగిపోని పరుగు లేదనుట కష్టమే
పిల్లలు కనుట తేలికే, బుద్ధులుమర్చటం కష్టమే 
తాపము వయస్సును వెంబడించిన చెప్పుట  కష్టమే  
ఎవ్వరినైన మన్మధుడు ప్రవేశిస్తే నిద్రపోవటం కష్టమే  

అని కొన్ని విషయాలు " రాం తాత ", కన్న కూతురికి చెప్పినట్లు మల్లికతో హిత వచనములు పలికే 

ఓ మదనికా వయస్సులో వచ్చే మార్పులు చెప్పేవి కావు, చెప్పరానివి కావు, చెపితే ఒక తంటా, చెప్పకుంటే మరో తంటా, వయస్సులో వచ్చే మార్పుల ఉరవడికి, ఆంక్షలు విధించిన, తప్పుత్రోవ పడతావని హెచ్చరించిన, వయసు పరుగులకు ఎటువంటి ఆన కట్టలు ఎవ్వరు వేయలేరు, కాని అదుపులో ఉంచు కోమని సలహా మాత్రము ఇవ్వగలరు. తప్ప త్రాగిన మొహం, ప్రేమలో పడ్డ మొహం, యిట్టె గమనించగలరు,వారి మాట, నడవడిక, ఎప్పటిమాదిరిగా ఉండదు, ఏదో తప్పు చేసాము అని భావనతో ఉంటారు. 

నీకొక చిన్న కధ  చెపుతాను విను కోమలాంగి అంటూ చెప్పటం మొదలు పెట్టాడు. ఒక కుటుంబములో తండ్రి , కొడుకు (12సంవస్చరములు ) కలసి ఒక ఉద్యాన వనమునకు పోయారు, అక్కడ మనుష్యులు చూసి కొడుకు ఈ విదముగా అడిగాడు తండ్రితో, అక్కడ యువతి యువకుడు చేయి చేయి పట్టుకొని తిరుగుట చూసి అట్లు తిరుగుట తప్పుకాదా అని కొడుకుఅడిగెను, వాల్లెవరో, అట్లా తిరుగుత ఏందుకో అర్ధం గాక అడుగుతున్నా నాన్న, వాళ్ళ గురించి చెప్పు నాన్న అని ప్రశ్నించెను?, తండ్రి కొడుకు మాటలకు ఏమి చెప్పాలో తోచక వారిరివురు ప్రేమలో పడ్డ వారు, ఒకరి కొకరు వివాహము చేసుకోవాలని నిర్ణ ఇంచుకొన్నవారు అని చెప్పెను. 

 ఇంకాదూరం వెళ్ళాక  కొడుకు నాన్న  నాన్న ఇక్కడేంటి, ఒక అబ్బాయి చుట్టూ ఇద్దరు అమ్మాయిలు తిరుగుతున్నారు వాళ్ళెవరు అని అడిగాడు కొడుకు.    ఒకరు ఇల్లాలు, మరొకరు ప్రియురాలు అనిచెప్పాడు నాకేమి అర్ధం కావటం లేదు నాన్న, నీకు అప్పుడే అర్ధం కాదు బుద్దిగా నాడు ముందుకు అన్నాడు తండ్రి. ఇద్దరు కలసి  ముందుకు పోతున్నారు. కొడుకు చూసాడు   అక్కడ ఒక మనిషి చుట్టూ అనేక మంది ఆడవారు నడుస్తున్నారు వారెవరు నాన్న అని అడిగాడు, వాడు ధనమున్న నాయకుడు, ఆడవారు అదుపులో అతను లేడు, అతని అదుపులో వాళ్ళు వున్నారు, వాళ్ళు డబ్బు కోసం సర్వం అర్పించేవారు. తండ్రి మాటలు ఎమీ కొడుకుకు అర్ధం కాక, అతనికి తేడా తెలియక అమాయకంగా నోరెల్ల బెట్టాడు.అంత మంది స్త్రీలను అదుపు చేసే శక్తి ఒక్క ధనానికి,  పురుషునికే ఉందని కొడుకుకు  తెలియదు! 


 అట్లాగే మనలో ఉన్న చైతన్య శక్తిని అర్ధం చేసు కోలేక, దేహేంద్రియాల మధ్య భందీలమై ఉన్నామనే బ్రమలో ఉన్నాం. ఈ సమస్త విశ్వము ఒక చైతన్యం నిండి ఉండి. మనలోను ఈ చేట్లులోను, ఈ నేలలోను చైతన్యం ఉంది. మనం ఏదో ఒక అను భూతికి చిక్కి ఉన్నాం. మనలో ఉన్న చైతన్యం గుర్తించు కోగల శక్తి మనకు లేదు, మనలో ఉన్న శక్తిని వేరొకరు చెపితేనే అర్ధం చేసుకోగలము. అట్లాగే నీలో యవ్వనం ఆవహించింది, నీవు కూడా ఆ బాలుడి లాంటి దానివి, లోకం చాలా పెద్దది,  నీకు సరి అయిన జోడును పొందే శక్తి నీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి కధ ముగించాడు "రాం రామ్ తాత" .   
 రాం తాత తో మమతల వల్లి, మాణిక్యాల మల్లి, మనసెరిగిన మల్లిక  పలకరించి ఈ విధముగా పలకరించే
   
ప్రియనేస్తమా!!
మరువలేకున్న నేస్తం -
మదిలోని చెడు జ్ఞాపకాలను తరుముటకు 

కాంతివై రావా నేస్తం -
హృదయంలో ఉన్న అజ్ఞానందకారం తొలగించుటకు

స్వప్నంలోకి రావా నేస్తం -
నిదురెరగని నయనాలకు విశ్రాంతి కల్గించుటకు
 
రవళివై రావా నేస్తం -
మూగ పోయిన గొంతులో సరాగాలు నింపుటకు

తుంటరివై రావా నేస్తం -
ఒంటరి నైన బతుకుకు ధర్మాన్ని తెలుపుటకు

జ్ఞాపకానివై రావా నేస్తం -
మరచి పోయిన మానవత్వాన్ని గుర్తు చేయుటకు
 
భందువై రావా నేస్తం -
ప్రేమను రాగాలు పంచి బ్రతికిన్చుటకు

గంధానివై  రావానేస్తం -
దుర్ఘంధపు దురాలోచనలు తొలగించుటకు

కుసుమానివై రావా నేస్తం -
దేవునిపూజకు, మనస్సు పరిమళించుటకు  
...

చాలా చక్కగా చెప్పావు పరిమళ మల్లి,      
ఎవరో నిన్ను వెంబడిస్తున్నారు, వారు చెప్పే మాటలు విను అందులో ఉన్న సత్యాన్ని గ్రహించు, తరువాత నీవు చెప్పాలనుకున్నది ఆలోచించి చెప్పు అదే నేను నీకు చెప్పేది. వసంతుడు ఈ విధముగా చెపుతున్నాడు
"ఓ ప్రియ మల్లిక, అనురూపమైన గుణాల కలిగిన దానవు, ప్రసన్న  సీల వంతురాలవు, నవనీత వర్ణంలో వికసించిన పుష్పానివి నీవు, ప్రణయ మృదుల హృదయ రాణివి నీవు, నీ కోసం నా ప్రాణాలను అర్పించాలని అనుకుంటున్నాను.
నిన్ను నేను ఏంతో ఘాడంగా ప్రేమిస్తున్నాను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టు కున్నాను, ఆశయాలతో జీవించాలను కున్నను, అందుకు గురుతుగా నా హ్రుదయ్ముమీద, నా రక్తం తో, నీ బొమ్మ గీసాను చూడు అంటూ ముందుకు వంగి చూపించాడు. ఇప్పుడు నా బ్రతుకు గ్రహణం పట్టిన చంద్రునిలా ఉన్నది,  అక్కడ చంద్రుడు గ్రహణం నుండి బయటకు వస్తాడెమో కాని, ప్రేమ గ్రహణంలో ఉన్నాను, ఈ గ్రహణం వీడి  ప్రేమ ఎప్పుడు ఫలిస్తుందో నాకే అర్ధం కావటం లేదు. నా పరిస్తితి కొన్ని నాళ్ళు మనస్సు భిన్న మదోవికారముగా మారిపోయింది, వలలో చిక్కిన పక్షిలాగా గిల గిల నీ కోసం కొట్టుకుంటూ తప్పించుకొని తిరుగు తున్నాను, ఈ ప్రాయము ఆకర్షణ తగ్గక ముందే నా ప్రేమను వప్పు కుంటావని నేను ఆసిస్తున్నాను.
 నీ ఓర చూపు మహాత్యముతో, నేను నీకు వశ మయ్యాను, నీమాటల తేటలకు చిక్కినాను, నిను పొందలేక, నిన్నుకలువలేక, నా మనసులో ఉన్న కోరిక చేప్పలేక, కాలానికి చిక్కి మదన తాపముతో, విరహ వేదనతో తిరుగుతున్నాను సఖీ. 

పువ్వు వికసించి వాడి పోయిందని చెప్పుకోలేక, భగ్న ప్రేమికుడుగా మారలేక, సముద్రములో నది కలసినట్లుగా నీవెప్పటికైనా నాతో  కలుస్తావని, నేను నీకోసం వేచి ఉండుట శ్రేయస్కరమని భావింఛి ఉన్నాను. 
లలితా లావణ్య పూర్ణ బింబ రూపమైన నీ రూపు, నేను ఎప్పుడు మరవలేకున్నను, కనులుమూసిన తెరిచినా నీవే నన్ను వెంబడిస్తున్నట్లు, నా ప్రేమును పొందు నేను నీ దాసుడను  అని పలు విధములుగా ప్రాధేయ పడినట్లు నాకు కలలోకి వచ్చి మరీ చెపుతున్నావు, ఇప్పుడు నా ప్రేమను తిరస్కరిస్తున్నావు ఎందుకు ?
మకరందాన్ని పొందుటకు తుమ్మెద ఎంతో కష్టపడుతుంది, మకరందాన్ని గ్రోలిన తర్వాత తన ఇష్టాను సారంగా తిరుగు తుంది.దానిలాగా నేను ప్రవర్తించను, నీ ప్రేమను పొందుటకు కాలమైన వేచి యుంటాను,     అని చెప్పి వచ్చిన దారిన వెళ్లి పోయాడు వసంతుడు" మనసును ఎవ్వరో తట్టి లేపినట్లు ఉన్నది

రాం తాత


రాం తాత  అంతా విన్న తరువాత ప్రేమ అనేది చాల గొప్పది, అది ప్రేవేసించిన తర్వాత ఎవ్వరిని నిల్వ నీయదు, ప్రత్యక్షముగా కాని, పరోక్షముగా కాని అది మనిషి జీవితానికి మంచి మర్గాన నడిపిస్తుంది అదిమాత్రం నాకు తెలుసు అసలు ఆడజన్మ గొప్పదనం గురించి ఒక కవి (సిరివెన్నెల గారు) చెప్పిన సినమా గీతం వినిపిస్తాను విను మల్లిక 
నాకు నీవు చెప్పే మాటలు వినాలి ఉన్నది చప్పు అన్నది  మల్లిక. 


     కార్యేషు దాసి కరణేషు మంత్రి
 

భోజ్యేషు మాత శయనేషు రంభ

 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
 

జీవితం అంకితం చేయగా...
 


అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

 

పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై
 

బ్రతుకుతుంది పడతి పతే లొకమై
 

మగని మంచి కొసం పడే ఆర్తిలో
 

సతిని మించగలరా మరే ఆప్తులు
 

ఏ పూజ చెసినా ఏ నోము నోచినా
 

ఏ స్వార్థము లేని త్యాగం
 

భార్యగ రూపమే పొందగా...

 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా

 

కలిమిలేములన్నీ ఒకే తీరుగా
 

కలిసి పంచుకోగా సదా తొడుగా
 

కలిసి రాని కాలం వెలి వేసినా
 

విడిచిపోని బంధం తనై ఉండగా
 

సహధర్మచారిణి సరిలేని వరమని
 

సత్యాన్ని కనలేని నాడు
 

మోడుగా మిగలడా పురుషుడు...

 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

అపురూపమైనదమ్మ ఆడజన్మ
 

ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
 

మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా
 

జీవితం అంకితం చేయగా...

 

కార్యేషు దాసి కరణేషు మంత్రి
 

భోజ్యేషు మాత శయనేషు రంభ


తాత పాత చాలా బాగున్నది 



రాం తాత  చెప్పిన  మాటలు విన్నది,  మల్లికఎవరి మాటలు వినాలో ఏది చేయాలో నిర్దారించు కోలేని వయసులో ఉన్నది, పెద్దలు మాటలు వినమని ఒకరు చెపుతారు, మరొకరు ప్రేమించిన వాణి మాటలు వినమని చెపుతారు, అది నిర్ధారించు కోవటం ఈ వయసులో నాకు ప్రశ్నగా మారుతున్నది, ఏది ఏమైనా ఆబ్రహ్మా ఆడించి నట్లు ఆడుటే   కదా మానవుల లక్షణం, మనోధైర్యముతో మనసును నిగ్రహించుకొని నిర్ధారణగా అందరి మాటలు విని దానిలో ఉన్న మంచిని గ్రహించటయే  ఇప్పుడు నాకు తక్షణ కర్తవ్యం అని తలంచినదే మల్లిక. 

మల్లికా అనాలోచితముగా ఆలోచించు సమయాన చిరు మంద హాసము చేస్తు చెంగ్  చెంగ్ మంటూ ఎగురుకుంటూ వడిలో చేరింది ఒక జింక పిల్ల,  అమితానందంతో చేతితో నిమురుతూ ఆనంద పారవశ్యంలో మునిగి  పోయింది. అప్పుడే తప్పించు కొని నన్ను పట్టుకో పట్టుకో  అని కవ్వించి పరుగులు తీసినది, దానిని పట్టు కొనుటకు మల్లిక పరుగులు తీసింది, ఆ ఆటను చూసి అక్కడ ఉన్న మొక్కలన్నీ ఓక్క సారి వికసించాయి, నారికేళ తరులు వాలి ఊగుతున్నాయి, నారి కేళాలు పూబంతుల్లా  కదులు తున్నాయి, వనసమూహాన్ని మైమరిపించి ప్రతి పువ్వు వికసించి పరిమళాలు వేదజల్లుతున్నవి, ఏపుగా ఎదిగి ఉన్న కదలాడుతూ కనబడు తున్న ఎదురు బొంగుల పొదలు, అక్కడున్న
 గంధపుచెట్లు, సంపెంగ చెట్లు సువాసనలు వెదజల్లు తున్నాయి. చల్ల చల్లని పవనాలు వీచుటవల్ల మల్లిక మనస్సు తేలిక పడింది. అక్కడ ఉన్న వృద్ధుడైన తాతను కలసి ఏదైనా కధ చెప్పు మని మల్లిక కోరింది చెప్పలేని ఆనందంతో. అవును నీకు క్లుప్తముగా శకుంతల  కధ  చెపుతా విను అంటూ కధ మొదలు పెట్టాడు రామ్ తాత .

శకుంతలను ఏంతో గారాబంగా పెంచ సాగాడు కణ్వమహర్షి, యుక్త వయస్సు వచ్చింది శకుంతలకు, ఏ మహారాజునకైన ఇచ్చి వివాహముచేద్దామని తలంచాడు కన్వ మహర్షి. ఒకరోజు కణ్వమహర్షి లేని సమయాన వన విహారమునకు వచ్చిన దుష్యంతుడు శకుంతలను చూచుట జరిగింది, ఆసమయాన్నే ప్రీమలో పడిపోయాడు 
తాత ప్రేమ అంటే ఆకర్షణ, మనోతాపమా ఏమిటో చెప్పవా " ప్రేమ అనేది  ఎలా పుడుతుందో, అది పుట్టి ఎలా నడి పిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు, కాని ప్రతివక్కరి మనసులోకి ప్రేమ మాత్రం ప్రవేశిస్తుంది దానివల్ల కొందరు మంచిగా ప్రవర్తిస్తారు, కొందరు మూర్ఖులుగా మారుతారు (అతి ప్రేమ మూలముగా) ప్రేమ గూర్చి ఒక చిన్న కవిత చెపుతా విను

"నీ పొందుకోసం, నీ చుట్టూ పరిబ్రమనం చేస్తున్నా, గమనించావా 
నీ చూపల కటాక్షం కోసం, నా కళ్ళ వెంట ఉన్న, నీరు చూసావా  
నీజ్ఞాపకాల మరకలను, నా ప్రేమనిజాన్ని  గుర్తుకు తెచ్చు కోవా      
   గుండెలోని భాధ నీకు వ్యక్త పరుస్తున్నాను మందు వేసి పోవా

మదిలోని అలజడలను నా రెప్పలపై చూపుచున్నను చూడ వా
మసక చీకటిలో నీ వెలుగు రూపాన్ని చూపి నన్ను తరించి పోవా
మౌనం వీడి కడలి పొంగి, ఉప్పెనలా వచ్చి నన్ను చుట్టు  కోవా
తపనలకు చిక్కన హృదయం ఎంత విలపిస్తుందో గమనించావా

కాంతి కిరణాలు కళ్ళను ఆవహించి అంధుడుగా మారకముందే రావా
మనస్సుకు చేరిన మమతల ఘోష అర్ధం చేసుకొని బ్రతికించవా 
నీ మువ్వలశబ్ధాలు నాగుండెను తాకి ఆడు కుంటున్నాయిచూడవా
నిన్ను చూసిన క్షణమే నన్ను నేను మరిచాను గుర్తు చేయవా

నీ జ్ఞాపకాలే నన్ను మన్మద బాణాల్ల గుచ్చి వెళ్లి పోయావా 
కవిత్వమే ఆధారంగా నాప్రేమను వ్యక్తపరుస్తున్నాను తెలుసుకోవా 
చల్లని నీ స్పర్సకోసం కోటి జన్మలైన వేచి ఉంటాను నాప్రేమను 
గుర్తించావా,
 తపనలు తగ్గించి తరించి తన్మయం చెందవా",


అంటూ ప్రేమ పిపాసిగా మారినవాడు ఆనాడు శాకుంతలనుచూసి దుష్యంతుడు. గాంధర్వ వివాహ పద్దతిలో భార్యగా పొందాడు, చేతికి అంగులీకము తొడిగి వశ పరుచుకున్నాడు, సర్వ సుఖాలు ప్రకృతిలో అనుభవించాడు. కమ్మిన మొహావేశాలు తగ్గినాయి, రాజధానికి వెల్లాలనిపించింది, వెంటనే శకుంతలను చేరి తన పరివారాన్ని పంపి రాజధానికి నిన్ను సగౌరవంగా రప్పించుకుంటానని  పలికి దుష్యంతుడు రాజభవణానికి చెరుకున్నాడు . ఆ తర్వాత రాజ్య పరిపాలనలో నిమగ్నుడైనాడు, శకుంతల విషయం  మరిచాడు  
     
కన్వ మహర్షి  శకుంతల  చేసుకున్న గాంధర్వ వివాహం గ్రహించాడు, తనకూతురు శకుంతల  గర్భవతి అని తెలుసుకున్నాడు , కూతురిని తనవద్దే ఉంచుకొని సుఖ ప్రసవం ఆయన త్రర్వాత దుష్యంతుని వద్దకు పంపవచ్చు నని తలంచెను. పండంటి మొగ బిడ్డ కన్నది శకుంతల. వానికి కన్వమహర్షి సర్వదమనుడు అని నామకరణం చేసినాడు. మెట్టి నింటికి సర్వ లాంచనాలతో పంపించాడు. కాని దుష్యంతుడు భార్యగా గుర్తించలేక నేను నిన్ను వివాహము చేసుకున్నట్లు గుర్తుకు రావట ములేదు ఏదైనా ఆధారము చూపుము అప్పుడు నేను నీభర్తగా అంగీకరిస్తాను అని తెలియపరిచెను.
  
శకుంతల దుష్యంతుని రాజ సభకు చేరింది. ఓ రాజా మన ఇద్దరి వివాహాన్ని ద్రువపరిచే సాక్షులు లేరని, నీ భార్యగా నీవు నన్ను అంగీకరించుటేలేదు.  కానీ అందరి హృదయాలలో అంతర్యామిగా ఉండే శ్రీ హరికి ఈ విషయం తెలుసును. అట్లే అంతరింద్రియమైన నీ మనసుకు కూడా తెలుసును. ఇదిగో నీవు ఆనాడు ఇచ్చిన ఉంగరము అని చేతి వే లును చూపింది కాని ఉంగరము వేలుకు లేనట్లుగా గ్రహించి ఏమిచేయలేక ఊరుకున్నది. ఎదీ ఆధారము అని అడుగగా మీరు నాకు తొడిగిన అంగులీకము ఎక్కడో జారినది, నాకు తోడుగా అంత సాక్షులు ఉన్నారు, వారే నాకు సహాయకులు.వారె సూర్య చంద్రులు తేజస్సు, వాయువు , భూమి, ఆకాశం, యముడు, వరాణుడు, పగలు, రాత్రి, ఉదయకాల, సాయంకాల, సధ్యాసమయములు ధర్మం, అనేవి కూడా ఉన్నాయి 

"ఆదిత్య శ్చంద్రా వినలానలౌ చ
ద్యౌ ర్భూ మిరాపో హృదయం యమశ్చ
అహశ్చ రాత్రిశ్చ ఉభెచ సంధ్యే
ధర్మశ్చ జానాతి నరస్య  వృత్తిం "
 అని శకుంతల దుష్యన్తునికి నిండు సభలో ప్రభోదించినది. నీకు నేను భార్యను అనే విషయం తెలిసికూడ నిన్ను నీవు మొసగించు కుంటూ  ఆత్మద్రోహానికి పాల్పడుతున్నావు. ఈ స్థితిలో  ఉన్న నీకు దేవతలుకూడా శ్రేయస్సును కలిగించరు
నా అంతటా నేను వచ్చానని, పెద్దల ప్రమేయం లేకుండానే నీతో  వివాహానికి అంగీకరించానని  నన్ను చులక చేసి చూడకు, నీవు ధర్మ విరుద్దంగా ప్రవర్తిస్తే మన వివాహానికి సాక్షులుగా ఉన్నవారందరూ నిన్ను శిక్షిస్తారు అని, శకుంతల  దుష్యంతునికి చేసిన  హెచ్చరికలు అన్ని ప్రాంతాలకు అన్నికులాలకు చెందిన వారందరికి  కనువిప్పు కలలిగించేవే
" రాం తాత శకుంతల భర్త వద్దకు చేరలేదా
ఎందుకు చేరలేదు నేను చెప్పేదేమిటంటే స్వతంత్రించి పెళ్లి చేసుకుంటే కష్టాలు వస్తాయని, మొగవాడు ప్రేమించాననగానే తనువూ అర్పించటం తప్పు అని, సీల పరిక్ష చేసే మగవాన్ని నమ్మకూడదని, పెద్దల ఆసీర్వాదముతో చేసుకొనే వివాహము మంచిది, అది మనసాంప్రదాయం కూడా అని, చెపుతూ కధ ఆపాడు.
 ....
"రామ్ తాతా " నేను అడిగిన దానికి ఇంకా చెప్పలేదు, కాస్త విశ్రాంతి తీసుకొని, నేనుకధచేప్పలన్న నాకుఒపిక రావాలికదా, కాస్త ఓపిక పట్టు, ఆ శకునాల తొందర నీలొ కనిపిస్తున్నది, అంట మంచిది కాదు అన్నాడు తాత 
 ఆప్పుడే రాజ సభలోకి జాలరుడు వచ్చి ఈవిధముగా చెప్పాడు  నేను సముద్రముపైకి వేటకు వెళ్ళినప్పుడు, ఎప్పటిలాగా వల వేసినాను, ఆ వలలో నాకు అద్భుతమైన చాప పడింది, అది నా  అదృష్టమని భావించి ఇంటికి తీసుకెల్లి కూర వండ మనగా, ఆ చేప పొట్టల ఈ విలువైన ఉంగరము ఉన్నది మహారాజ, ఇది రాజులకు చెందినది అని భావించి, మీ వద్దకు తెచ్చాను స్వీకరించండి అని, రాజు  దగ్గర ఉంచి వినయముగా ప్రక్కకు తోలి గాడు జాలరుడు. ఆ ఉంగరము చూసిన వెంటనే గతస్మ్రుతులు వెంబడించి నిండు సభలో తన తప్పును అందరిముందు వప్పుకొని శకుంతలను భార్యగా  స్వీకరించాడు. 

ఇదేనమ్మ క్లుప్తముగా కధ నీకు చెప్పాను ఈకధలొ ముఖ్యంగా నేరాలు చేసిన వారికి శిక్షలు విదించే  అధికారం న్యాయస్థానానికే ఉంటుంది. అయితే అపరాదులు ఎవరు, నిరపరాదులు ఎవరు  అని తగిన విచారణ చేసిన తర్వాతనే న్యాయమూర్తి శిక్షను ఖరారుచేస్తారు. నేర నిర్ధారణకు సాక్షుల వాంగ్మూలం చాలా ముఖ్యం.  వ్యక్తులు చూడనప్పుడు తప్పు చేసినవారు, సాక్ష్యం చెప్పేవారు, ఎవరూ లేరు, కాబట్టి నాకు శిక్ష పడద నీ అనుకుంటారు.  కానీ చేసే పుణ్య-పాపకర్మలకు అంతస్సాక్షులు ఉంటారని తెలుసుకోవాలి,  తప్పు అనేది ఎప్పటికి చేయకూడదు అని  నేను నీకు చెప్పు తున్నది. 
 రాం  తాత ఈరోజు సూర్యుడు అస్తమించే సమయము అవుతున్నది, చీకటిని పిలుస్తున్నది, నేను త్వరగా ఇంటికి పోవాలి, రేపు మల్లా కలుసుకొని  చక్కని మంచి మాటలు చెప్పుకొని సంతోష జ్ఞానాన్ని పొందుతాను 
  మంచిది నేను కాస్త విశ్రాంతి తీసుకొంటాను. ఆమాటలు విని తిరుగు మొఖం పట్టింది మమతల వల్లి మల్లిక .     
అలా ఇంటికి చేరింది మమత, తల్లి సరస్వతి  చాలా కోపముగా నీవు ఎక్కడకు పోయావు, ఇంతసేపు ఎం చేసావు అని అడిగింది, అమ్మ నేను వనమునకు పోయాను "రామ్ తాత" కలిసాను కధలు చెపుతుంటే విని తిరిగి వచ్చాను, చూడు  నీ మొఖముఎలా మారిపోయిందో,  తెల్లని బుగ్గలపై నల్లని కాటుక జారింది, కేశములు విడి పోయి అలంకారం తగ్గింది, కళ్ళ అందం తగ్గి, కమ్మే కేశాలతో నిండిఉన్నది. ముందు నీవు మొఖం కాళ్ళు చేతులు కడుక్కొని లోపలకు వచ్చి ముందు అల్పాహారము తిను, ఆ తర్వాత నీకు ఇష్టమైన పని చేసుకో అన్నది.

అసలు అల నీవు  పిరికి దానిలా ఉండకు, పోకిరికుర్రవాళ్ళు ఉంటారు ప్రేమించామని వెంబడిస్తారు, వారి మాటలు నమ్మి మమ్ము అన్యాయము చేయకు, మా జీవితాలు, నీ మీదె ఉన్నాయి, త్వరలో నిన్ను ఒక ఇంటి దాన్ని చేసి, మా భాద్యత కొంత తగ్గించుకో గలము అని అన్నది తల్లి . 
అమ్మ నీకో విషయం చెప్పాలనుకున్నాను, చెప్పమ్మా, నీవు  మనసులోని విషయాన్ని నీవు చెపితే కోపం వస్తుం దేమోనని అనుమానమగా ఉన్నదమ్మా , అనమానం లేకుండా నిర్భయంగా చెప్పు , నన్ను ఒకడు వెంబడి చ్చాడమ్మ, చెప్పుతీసుకొని బుద్ది చెప్ప పోయావా, అట్లా చేయ లేదమ్మా, మరి ఎంచేసావే, వాడ్ని వదిలించుకొని ఎలా వచ్చావే, ఆవిషయం నన్ను చెప్పనిస్తెగా నీవు., బి పి పెంచు కోకమ్మ ఎమీ కాలేదు, మరి ఎం చేసావే చెప్పవే, నా మనసులో మనసులోలేదు అన్నది తల్లి. అందకనే నమ్మ నీకు ఏ విషయ చెప్పదలుచు కోలేదు, ఆ చెప్పు చెప్పు , అమ్మ నేను రాం తాతను కలిసానమ్మ అది పాత విషయమే కదా, ఎప్పుడు పోతూనే ఉంటావు కదా, చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని పెంచాడే ఆయన, ఆయనకు మనం ఋణపడి ఉన్నాము, మన ఇంటికి రమ్మనమని చెప్ప బోయావా, ఆయన్ని చూసి, చాలా రోజులు అయింది, పిలుస్తాలేమ్మ, నీలో గాబరా లేదుగా, ప్రశాంతముగానే ఉన్నావుగా, ఆ ఉన్నానే చెప్పవే నన్ను వెంబడించాడని చెప్పానుగా అంతే, ఎమన్నా నిన్ను ఇబ్బంది పెట్టాడే, లేదమ్మా, మరి ఎం చేసాడే ఏవో కవితలు చపుతూ నా వెనక పడ్డాడే ఎం కవితలే బాబు ఉండు స్థిరం గా ముందు కూర్చో, ఈ మంచి నీళ్ళు త్రాగు అంటూ కూర్చొని ఇక చెప్పు అన్నది, కూతురు చెప్పటం మొదలు పెట్టింది. కవిత 


your Profile Photo
ప్రక్రుతి దృశ్యాలు చూడనెంచి కాళ్ళు కదిపే 
చినుకులు రాలగ జలదరించి వళ్ళు  తడిసే
జలాశయమున కమలము మనసు కుదిపే
కమలాన్ని  అందు కోవాలని ఆరాటం పెరిగే
నాలో
కడు  విశాల   నేత్రములు  కలిగి  నట్టి    
కను విందు  చెస్తూ కదులు తున్నట్టి
జలక మాడుతున్న జలకన్య  కాబట్టి
కన్య సౌందర్యం చూసి నామతి చెడింది
ఇప్పుడు
కన్య  సౌందర్యం  వర్ణింప  నా   తరమా
సుందర  ప్రభ వలే  ఉన్న చెందమామా
బరువైన పిరుదులపై ఉన్న కేశజాలమా  
బరువుతో కదులుతున్న వక్షో జాలమా 
అని వర్ణిం చాడే
కవ్వించే హృదయం గాలిలో  తేలగా
బంగారు వర్ణం  మదిలో    నిలువగా
ఆకర్షించే నేత్రములు త్రిప్పు చుండగా
బ్రహ్మకైన భామను చూస్తె తిక్కరేగదా
అన్నాడే
ఒడ్డున చేరిన జవరాలు వంగి వంగి చీర కట్టి
పాలిండ్లపై   పావడాను  ఊపి ఊపి  ఆర బెట్టి
వయ్యారంగా నడుంపెట్టి ముఖంపై బొట్టు పెట్టి
జలములో ముఖం చూసుకొని నవ్వు కుంటుంటే 
 

అందం ఇంతని చెప్పలేనన్నాడే 

చెట్టు చాటున  అంతా  చూసి  ఉండ  పట్ట   లేక
వంపుసొంపు నడకచూసి తపనకు తట్టుకోలేక
భువి  నుండి  దివికి   వచ్చిన నవరత్న మాలిక
దరిచేరి   ఆమెను   పలకరించే మనసు నిలవక  
       
హే   లావాన్య  ఎవరి బిడ్డవు ఎచ్చట  ఉందువు
నా  కంటికి నీవు సుకమార   సుందర వనితవు
ఇది స్వప్నము కాదు ప్రత్యక్ష శృంగార దేవతవు  
యవ్వనంలో ఉన్న బ్రాహ్మణ పుత్రిక ఐ ఉందువు 

తాపసి   గారాల   ముద్దు   బిడ్డవను   కున్నాను
దేహకాంతి చూసి ఆగలేక నీముందుకు వచ్చాను
మనసులో ఉన్న కోరికను తెలియపరుస్తున్నాను
చిరునవ్వుతో   మాట్లాడితే   ముత్యాలు   రాలునా
అని పలరించ బోయాడే
మందహాసపు మాటలు వినాలని ఉంది
విశ్వమంత విశాల హ్రుదయము ఉంది
కోకిల గానంతో వరుస కలపాలని ఉంది
చిలుక పలుకుల చిన్నారి మాటలు రావా

సుధలు   చిందు   నధరాలు కదలాడ
బిడియ   మేళ    విన్న   వించు  జాడ
మదిని శాంత పరుచు చెప్పు ఉండే వాడ
మాటలాడక నా హృదయంలో పెంచకు దడ

దడ తో వేగంగా నదుస్తూ వస్తునాను అమ్మా

మౌనమేల వహింతువు మనసు చెప్పు మాలినీ
వచ్చి నాను నీవెంట  పలకవు అందాల భామినీ
నన్ను గానక వేగంగానడుస్తున్నావు సునయనీ
వేడుకొందును మనసు తెలుపవా కామిని

నా మీద నీకు  జాలి   కలుగుట లేదా
అలుకమానుటకు నీకు ఏమి చెప్పేదా
నా మదిలో మెదిలిన   కోరిక తెలిపెదా
ప్రేమ వున్నచో నీతోడు నేనే ఉండాలి సదా

అన్నాడమ్మా 

పుడమి   పై   ఇంద్ర  భవనము    నిర్మించేదను
వజ్ర   వైఢూర్యముల  తో   నగలు  చేయించెదను
సుందర ప్రాంతములు నిత్యమూ చూపించెదను
లలనా కష్ట పెట్టకుండా నిన్ను  సుఖ పెట్టగలను

అని ఆశలు రేపాడమ్మా
 

నీ మదిలో మెదిలిన  కాంక్షను  తీర్చెదను
నీ   అడుగు  జాడలలో నడుచు కొందును
నీ హృదయమును సంతసింప చేయుదును      
నీవు నామనసు అర్ధం చేసుకొని పలుకుము 


అని జాలితో ప్రేమనువ్యక్త పరిచాడమ్మా 

అంటూ మన ఇంటి దాకా వచ్చాడమ్మ ఎం చేయ లేక, అంతే కదా వాడెవడో ప్రేమ పిచ్చోడు, వాడు ఈసారి కనబడితే 
నేరుగా యింటికి తీసుకురా వాడెవడో, వాడి కులమేదో, గోత్రమేదో  కనుక్కొని నీ ముక్కుకు తాడేసి కట్టేస్తా, అమ్మ వాడొక బైరాగి లా ఉన్నాడు, గడ్డాలు పెంచి ఉన్నాడు, కొందరు పిచ్చి పిచ్చిగా కవితలు వ్రాసి పాడుకుంటారు అవి ఏమి పట్టించుకోకు, అన్నం పెడతా హాయిగా నిద్రపో  అన్నది తల్లి . తల్లికి మొట్ట మొదటి సారిగా అబద్ధం చెప్పింది, ఎందుకంటే ఆ కుర్రోడు, మన ఇంటి ప్రక్కన అబ్బాయి అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఎందుకంటే ఆ యింటికి మా యింటికి తర తరాలనుండి విభేదాలు ఉన్నాయి, అవి ఎప్పుడు తీరుతాయో, నాప్రేమకు బలం ఎప్పుడు వస్తుందో అనుకుంటూ అన్నం తిని పడుకుంది.
               
కలలో చేరాడు మోహన స్వరూపుడు, మిస మిస లాడే వయస్సులో, నవ యవ్వనంలో నన్ను దోచు కోవాలని ఆరాట పడుతూ ఉండగా నేను సహజంగా ఉండే స్త్రీలో సిగ్గు వలనో, కవ్వింపు నటనలు చేసినాను, కళ్ళల్లో ప్రవేశించి నా నీలిముంగురులు కదిలిస్తూ, ఏదో తెలియని శ్వాస నన్ను ఆవహించి, చూపుల యందు ఆర్తిగా అమాంతం, అన్యూన్య అనురాగాలు పంచుకుంటూ నా బ్రమలు తోలగించుటకు బ్రమరం వలే నాచుట్టు తిరుగుతూ స్వప్నంలో ఆలాపనలు చేయుట ఎందుకు?

నీవు నాకలలోకి వచ్చి చేసిన ఆగడానికి క్షణంలో అధరమ్ముల తడి అవరైంది ఎనలేని రుచి చూసే. నాకలలో నన్ను వెంబడించే సంశయ పడకు ఇందు ఎవ్వరూ లేరు, నీవు నేను తప్ప, మనం ఇరువురం కలసి ఒకరి నొకరు ఆస్వాదించు కోవటం తప్పు కాదు, ఇది ప్రకృతి సృష్టికి ప్రధమ మార్గం, నయనమ్ములు చూడు, నా ఆత్రం నీకు కనిపిస్తుంది, నా ప్రేమ నీకు దొరుకుతుంది, చనువుతో చెప్పుతున్నాను, వదనమ్ములు వ్యర్ధం చేయకు, కాలాన్ని వ్యర్ధం చేయకు, చిరు సమ్మేళనములోనే రక్తి ఉన్నది, శరీర భాగాల స్పర్సతో, శరీర భాగాల తాపము ఎందుకు అను కుంటావు, పడచుల జత కూడు  జన్మ సాహిత్యము, సంసార సంబోగ అంతరార్ధం, అర్ధ చేసుకోక పోవుట వలన నీ కలలోకి వచ్చి వేదించటం  కూడా  నాదే తప్పు ఆన్నాడు మోహన రూపుడు. ఆనాడు

 శృంగారమునకు చెందిన ఒక  పద్య విశేషము గుర్తు చెప్తాను విను అని చెప్పటం కలలో మొదలు పెట్టాడు.   




రాయల నాటి అజ్ఙాత కవిశేఖరులు ! వ్రాసినది

కాలం విచిత్రమైనది . కాలంకన్నా వ్యక్తుల జీవితాలు విచిత్రమైనవి. ఎంత గొప్పవాడైనా సరే అదృష్టదేవత అవుగ్రహం ఉంటే అందలాలెక్కుతాడు. ఆమెకరుణింపకుంటే యెన్ని తెలివి తేటలున్నా యెంతటి గొప్పకవియైనా వాని ఊరుపేరు లుండవు. వీటిగురించి తెలిసికోవాలంటే ముందుకొన్ని విషయాలు వినాలి.

రాయలు ఒకనాడు అంతఃపురంలో కాలక్షేపంకోసం తనకుమార్తె "మోహనాంగితో" చదరంగం ఆడుతున్నాడు.రాయలు పావులు కదుపుతూ ఉండగా ,మంత్రికీ ఏనుగుకీ ,మధ్యలో మోహనాంగి బంటు ఒకటి చిక్కుబడి పోయింది. దాన్నెలా తప్పించాలో ఆమెకు తెలియలేదు. అపుడామె కూనిరాగములతో " ఉధ్ధతుల మధ్య పేదల కుండఁ దరమె?"- అనేపద్యపాదం చదివింది. రాయలు విస్తుపోయాడు." ఏదితల్లీ! మళ్ళీచదువు? అనిప్రశ్నించాడు. అపుడామె తాను విపణిలో నొక కవికి 400 వరహాలిచ్చి కొన్న ఒకపద్యము లిఖింపబడిన తాటియాకును దెచ్చి రాయల కిచ్చినది. అందు-
" ఒత్తుకొనివచ్చు కటి ,కుచోద్యృత్తిఁ జూచి ,
సుదతి! తనుమధ్య మెచటికో ఁ దొలగిపోయె;
ఉండె నేనియు కనబడకున్నె- యహహ!
ఉధ్ధతుల మధ్య పేదల కుండఁ దరమె?"

కవికర్ణరసాయనము - సంకుసాల నృసింహకవి;
అనివ్రాసియున్నది. దీనిభావమును పరిశీలింతము.
కవి ఒక సుందరాంగిని వర్ణించుచున్నాడు. ఆమె తను మధ్యమును వర్ణించు సందర్భము.
కటికుచోద్యృత్తి యనగా వక్షోజములు , జఘనములయొక్క పొంగు (పెరుగుదల)
తనుమధ్యమంటే నడుము; యౌవ్వన విస్తృతివలన వక్షోజములయొక్కయు ,పిరుదులయొక్కయు
వుధ్ధృతిని తట్టుకొనలేక నడుము సన్నబడి, సన్నబడి , చివరకు మాయమైపోయినదట! ఉంది కానీ ప్రస్తుతం
ఎక్కడుందో తెలియటంలేదు.అంటున్నాడుకవి. ఉంటే కనబడకుండా ఉంటుందా? అనేప్రశ్నకు ఒక అర్ధాంతర న్యా సంతో సమాధాన మిస్తునాడు. " ఇద్దరు గర్విష్ఠులైన బలవంతుల నడుమ నొక బలహీనుఁ డుండ లేడుగదా? అందుచేత ఆమెనడుము అజ్ఙాతములోనున్నది. అనిదాని సమాధానము. ఇంతకీ నడుము సన్నముగా నున్నదనుట! యేమిచమత్కారము!!

7va


 

అంతలోనే మేలుకు వచ్చింది మల్లికకు ఏమిటి ఇది అంతా కలా కృష్ణదేవరాయలు కలలోవచ్చినట్లు తెలిసింది.మదన తాపముతో ఉన్నట్లు ఎవ్వరికి తెలియ కుండా జాగర్త పడాలని అనుకున్నది మల్లిక, ఎన్నివిన్న ఏమి చేయలేనట్లు, పెదవి విప్పక, చూపులలో తమకము కనబడ నీయక, నిశ్చెష్టురాలై తన్ను ఆవహించిన మేఘపు కొండలను అదుపు చేసుకొనుచు,ఆవహించిన మోహపు ఆలోచనలను తరిమి, మనస్సును తేలిక పరుచుకొని, కడుపునిండా నీరు త్రాగి, చల్లటి నీరుతొ మోఖముకడుక్కొని, నెమ్మదిగా నిద్రకు చేరింది. అప్పడే తల్లి అడుగు పెడుతూ, ఏమిటి ఇంకా నిద్ర పోలేద, ఏమోనమ్మ నాకు పిచ్చి కలలు వస్తున్నాయి, నాకు నిద్ర రావటము లేదు. అసలు ప్రేమ అంటే ఏమిటమ్మ నాకు చెప్పవా. చేపుతానమ్మ ప్రేమగురించి కధలు కధలుగా నాకు తెలిసివి చెపుతాను ఈరొజుకొన్ని మరొకరోజు మరిన్ని చెపుతానులే, నిద్రసరి పోకపోతే కళ్ళు వాచి పోతాయి, ముఖ వర్చస్సు తగ్గుతుంది అది మాత్రం తెలుసుకో సరే చేపుతానువిను అంటూ మొదలు పెట్టింది తల్లి           
మల్లికా నా పెళ్లికి  ముందు ఒక ప్రేమ లేఖ వచ్చింది, అది ఇప్పటికి బద్రంగా దాచుకున్నాను, కొన్ని సంవస్చరాలు దాటినా మరవలేకున్నాను, వ్రాసిన వారెవరో నాకు ఇంతకూ తెలియలేదు, అది తీసుకొచ్చి చూపిస్తాను, ఆ ఉత్తరములో ప్రేమ అంత  కుమ్మరించి అద్బుతముగా సాహిత్యాన్ని వలక పోసాడు.
" ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి దేవుని కందిన పువ్వులా ఉన్నావు, ఎప్పుడో కలలో పురుడు పోసుకొని వికసించిన చిత్రంలా ఉన్నావు, కనుచూపు ఆవల నీడ, నీలో ఉన్న నీడతో ఏకమై, నీడలా ఉన్నావు, ఏనాడో గాలి శృతి చేసి గంధర్వగానంలా, నీ కంట స్వరముతో మధురమైన గానంతో పిలుస్తున్నావు, చెందమామ కధలో దేవతా స్త్రీ లా ఆకాశములో ఎగేరే గుఱ్ఱము మీద రాజకుమారిలాగా విహరిస్తూ నన్ను కలవటానికి ప్రయత్నిమ్చావు. వెంటాడుతూ, వెంబడిన్తూ, నీ చుట్టూ ప్రదక్షణం చెస్తూ, నీకు కన బడ కుండా వలపు తలపులు తెనీయలను అందించాలని ఆశ తో ఉన్న ఒక ప్రేమికుడ్ని నేను".          
నాలో జవ జీవాలు నింపి, శాస్త్ర విజ్ఞానాన్ని పెంచి, ఆణువణువూ నీకోసం ప్రేమను నింపి, నా బాహు బంధాలలో నీకు సుఖము అందించాలని  నా మనసు నంతా రంగరించి ఒక ప్రేమికుడిగా నీకు తెలియపరుస్తున్నాను.
చిమ్మ చీకటిలో అజ్ఞానముతో నిండిన నామనసుకు వెలుగును పంచే కాంతి రేఖవు నీవు, కమ్ము కున్న మేఘాలను చిలికి నాపై జిరుజల్లు కురిపించుటకు వచ్చే గాలివై నామనసును చల్లగా తడిపే జల్లువు నీవు, నిరంతరమూ అంతరంగాలను అర్ధం చేసుకుంటూ, సుఖదు:ఖాలను సమానముగా చూస్తూ కదిలే తరంగిణివి నీవు, అలుపెరగని, అంతరాత్మలను అర్ధం చేసుకొని క్షోభ పెట్టకుండా, ఆనంద పారవశ్యంతో, సంసారానికి చుక్కానిగా, పరిమళాలను అందించి, నాకు జతగా  ఉంటావని నేను నిన్ను ప్రెమిస్తూ వ్రాస్తున్న ప్రేమ లేఖ.


వెన్నెల చీర కట్టి, వర్ణాలన్నీ కలగలిపి మనసకు నచ్చే రంగును చూపిస్తా, ఆకర్నాంతం ఆకర్షించే విధముగా, మనసు ఉల్లాస పరిచే విధముగా, మెరుపుల తలపుల్ని చల్లారు పరుస్తా.
రివ్వు రివ్వున ఎగిరి కురులను చూపి, పెదాల పరిమాళాలిని అందిస్తా, నీలో ఊరే జలాలను ఊరించి, నగవులతో నాట్యమాడించి, అధరామృతమును అందించి, ఆకలి తగ్గిస్తా.
ప్రకృతిలో ప్రకృతినై, మనసులో మనసునై, కలలో నాయికనై, ఆకృతినై  ఆకాశాన్నిసంతృప్తి పరుస్తా, సుకృతినై సురసౌఖ్యాలు  అందిస్తా, శుక్ర నీతుల భోధనలతో సుఖాలు అందిస్తా .
సీతాకోక చిలుకల్లో చిలకనై, నెమల్లలో నెమలినై, పువ్వులలో పువ్వునై, ఆకాశంలో విహరించే క్రౌంచ పక్షినై, యేతత్ భావాలను అనుకరించి, అనుభవాన్ని రంగరించి ఆనంద పరుస్తా, నా భావనలో రామాయణంలో సీతలా ఉండాలని ఉన్నది
                                                                                                                   
సీత అంత దు:ఖములో కూడా నామనసు రాముని వద్ద ఉన్నది, ఈ రాక్షసులు ఏమిచేసినా నన్ను మార్చ లేరు, అట్లే రాముడు కూడా పూలను, కన్నె పిల్లలను చూడ కుండా నీ ధ్యానంతో ఉన్నట్లు రామాయణము తెలుపుతున్నది. అదే నాకు ఆదర్శం ఆ సీతవు నీవని తలుస్తూ నీ ప్రేమ నాకే దక్కాలని ఆసిస్తూ వ్రాసుకున్న ప్రేమ ఉత్తరము,......................

......................... ఇట్లు నీ ప్రేమ పిపాసి x
8va bhaagamu
                            అమ్మా ఆ ఉత్తరం చూసి మీ ఇంట్లో వారు ఏమన్నారా, నాన్నకు తెలుసా , మీ నాన్నకు ఇప్పటికి చూపలేదు, ఉండ బట్ట లేక ఈ ఉత్తరము బయట పెట్టాను అని అన్న మాటలకు మల్లిక సంతోషించి మల్లికా ఉత్తరం మరొక్క సారి చదివింది.
అమ్మ నీ పెళ్లి విషయాలు చెప్పలేదు, ఇప్పు డెందుకే అప్పటి విషయాలు, మరి ఆ ఉత్తరము వ్రాసిన మహాను భావుడు ఎవరో కనుక్కోవటానికి ప్రయత్నం చేయలేదా, చేయలేదు ఎందుకంటే మా పెళ్లి అనుకోని విధముగా చరిగింది. 
అమ్మ నీ పెళ్లి విషయాల గురించి చెప్పవా ఎందుకు చెప్పనే ముందు చెడిపొయిన మెసెజ్ పెళ్లి గురించి విను తరువాత మా పెళ్లి గురించి చెప్పుతా, మా అమ్మ ఏంతో మంచిది అంటూ కుర్చీలాక్కొని కూర్చున్నది . కాఫితేనా, వద్దమ్మా కాఫిలాంటి కధ చేపుతానన్నావు చెప్పు, నేనే 2నిముషాల్లో కాఫీ కలుపుకొనివస్తా అని లోపలి వెళ్ళింది మల్లికా, అప్పుడే వేడి వేడి కాఫి తెచ్చి అమ్మకు కప్పులో ఇచ్చి, తను వేరొక కప్పుతో త్రాగుతూ కూర్చున్నది, ఇక చెప్పమ్మా, కాఫీ ఇచ్చావుగా త్రాగి చెపుతానులే., ఎందుకో ఈ కాలం పిల్లలకు తొందరా అంటూ కధ మొదలు పెట్టింది సరస్వతి. 

image not displayed
    
  బ్రహ్మా నందం అని అన్నందుకు నీకు కోపం వచ్చి ఉండవచ్చు , ఎందుకంటే మీ నాన్నను పేరు పెట్టి  పిలుస్తున్నాను కదా, ఎందు కంటే మా పెళ్లి చాలా విచిత్రముగా, అనుకోకుండా జరిగింది, దానికి మూలకారణం, అప్పుడే వస్తున్నా సెల్ ఫోన్ మహత్యం, మీ నాన్న గారు మాష్టర్ డిగ్రి తర్వాత పి. హెచ్. డి. పొందిన మనిపూస,  యాడాదిగా తెలుగు టీచర్ గా పని చేస్తున్నాడు, మీ నాన్న గారి తల్లి తండ్రులు చిన్నప్పుడు  దత్తత ఇచ్చి వేసారు, అప్పటి నుంచి పెంచు కున్న వారి ఇంటిలో పెరిగాడు, పెళ్లి వయసు ఉన్నందు, స్వయాన తండ్రి తగ్గర ఉండి పెళ్లి చేయ నిశ్చఇంచారు. అనేక పెళ్లి సంభందాలు చూసారు, ఏ పిల్ల నచ్చ లేదు, కారణం కొందరు అబ్బాయి నచ్చ లేదని, మరి కొందరు టీచర్ అని తక్కువగా మాట్లాడారు, ఇరువురు తల్లి తండ్రులు ఏంతో పట్టుదలతో పెళ్లి సంభంధాలు చూస్తున్నరు.
 

మావయ్యగారు (మీ నాన్న గారినాన్న) నా ఫోటో తీసుకొచ్చి చూపిస్తూ, ముక్తి సరిగా  అమ్మాయి బాగుండటంవల్ల నీకు సరిజోడని భావించా, నా మాట కాదనవని అమ్మాయ ఫోటో ఇందు  ఉంచా, మీ అమ్మకు నచ్చిందని వివాహము నిశ్చఇంచా, నా మాట కాదన వని పెళ్లి లగ్నం కూడా  పెట్టించా, అని మీనాన్నకు ఫోటో ఇచ్చి చెప్పాడు,  అమ్మాయి ఫోటో చూసి మెసేజ్ ద్వారా అభిప్రాయాలు, తెలుసుకోవాలని ఉంటే తెలుసుకో, పెళ్ళంటే నూరెళ్ళ పంట,  అని గట్టిగా చెప్పారు.

మీనాన్నగారు ఉండ బట్ట లేక చేక చేక మేసేజే చేసారు,               
నీవు నిర్మోహమాటమగా నేను నచ్చకపోతే చెప్పవచ్చు, పెద్దలు నిర్ణ యించారని నీవు తలవంచ నక్కరలేదు, నీ అభిప్రాయము నిర్భయముగా చెప్పవచ్చు, నా భిప్రాయమును కూడా ఇందు పొందు పరుస్తున్నాను, ఏమిటంటే 


ఫోటోను చూసి పెల్లిచూపులు లేకుండా వప్పుకున్నావా, పెద్దలు అన్నారని మనసు చంపుకొని   తల వంచావా, నా రంగు కాకి కన్నా నలుపు నీకు తెలిసి వప్పుకున్నావా, నీ ఇష్టానికి వ్యతరేకంగా వత్తిడి చేయను వద్దంటే పెళ్లి ఆపుతా అని అభిప్రాయము తెలియపరిచారు మోదటగా  .... 


 దానికి సమాధానముగా నేను నా అభిప్రాయము మెసేజ్ ద్వారా తెలిపాను 

ఏమని తెలిపావమ్మ అని అడిగింది మల్లికా

మీ వ్యక్తిత్వం,నిజాయితీ మెచ్చి నాను, నేను మిమ్మల్ని నమ్మి, నేను  మిమ్ము మోస గించకుండా నా అలవాట్లను ముందుగా చెపుతున్నాను, తరువాత మన సంసారములో కలతలు రాకూడదు.  నా రంగు కూడ నలుపే, (దొండ పండు రంగు అని ఆశ పడి ఉంటారు) రంగులు దిద్దిన ఫోటోను మా ఇంట్లోవారు మీకు పంపారన్న విషయం నాకు తెలిసింది.        నాఛాయ నలుపు, కాకులు రెండుకలిసిన నల్ల కాకి పుట్టి నట్లు, మనం కలువుట అంత మంచిది కాదు, మీకు ఎన్నో ఇష్టాలు, అభిప్రాయాలు ఉండవచ్చు, అవి త్యాగం చేయ నవసరము లేదు, ఇంట్లో వాళ్ళు వత్తిడి బాగా చేసారు, మీకు ఉద్యోగం ఉందని నేను తలవంచాను, నా విషయాలు చెప్పాను,  ఒక్క సారి ఆలోచించడి నలుపు నలుపు ఎరుపుగా మారదు అది గమనించండి,     మీకు ఇష్టం లేకపోతె వద్దని చెప్పండి
అని మెసేజ్ చేశాను మల్లికా

నా మెసేజ్ చూసి అందమైన భార్యను  పొందాలనుకున్నా, కాని అది తెలివి తక్కువ పని అని ఇప్పుడు గ్రహించా, అందం కన్నా గుణం ఉంటె బాగుండునని అనుకున్నా, నలుపు అనేది కాదు,  భర్త ప్రతిష్టను పెంచేదిగాను,భర్త మనసు తృప్తి పరిచి సుఖపడేదిగా ఉంటే  చాలునని ఊహించాను, అందులో ఎక్కువ మంది నల్లటి వారే కలసి మెలసి బ్రతుకట లేదా నాకు ఎటువంటి అనుమానము లేదు, నలుపు గురించి ఇక నీవు మర్చి పోవచ్చు, కాని నేను ముఖ్యముగా వ్రాయునది,

 నేను అధికముగా దూమపానము చేస్తాను, నీకు ముద్దు ఇవ్వవచ్చా, వాసనను భరిమ్చలేక, నన్ను మానమంటే మానలేను, ఈ దుర్వాసన మొగుడు అనికోపంలో కూడా అనికోవద్దు ముందుగా చెపుతున్నా నీకు,  పెళ్లి వద్దని చెప్పొచ్చు నాలో ఉన్న చెడ్డ గుణాలను  చెప్పుచున్నాను,నా ఊహల పల్లకిని ఇందు పొందు పరుస్తున్నాను 
నీ చిత్రాన్నిచూసి నా శృంగార భావాలను ఇందు పొందు పరుస్తున్నాను
చదివాక ఇంత ప్రేమ పిచ్చోడని మాత్రము అనుకోవద్దు ఇది నా ఉహా భావాలుమాత్రమే
 అని మీ నాన్న గారి నుండి మెసేజ్ వచ్చిందమ్మా.
ఏమిటమ్మ ఆ ఊహలు తొందరెందుకు నువ్వే చూడు 
 అని మీ నాన్న గారి నుండి మెసేజ్ వచ్చిందమ్మా.


9వ  భాగము
మ. మ . త  (పెద్దలకు మాత్రమే )
మనసు మనసు తరుణామృతం   - శృంగార సాహిత్య వచన కావ్యం

నీలో నేనూ..నాలో నువ్వూ.. కలయకతో 
మనసుల్ని పెనవేసే మమతల లతలతో
ఒకరి కొకరం స్వప్నించిన మధుర క్షణాలతో ..
నా మనసులో రేపే నిశ్శబ్ధ ఏకాంతాలు 

నిండుపున్నమి పండువెన్నెలతో
జాలువారు జల తుంపరులతో
గాలికి జారు పారి జాత పూలతో
నా మనుసు లో రేపే గిలిగింతలు

పూలకదలిక మధుర పరిమళాలతో
కోయిల మధుర గాన ఆలాపనలతో
విలాసంగా వీచే చల్లని పిల్లగాలుతో
నా మనసులో రేపే నవసోయగాలు

ప్రకృతి మైమరిపించే ఊహలతో
తనువు తపిమ్పచేసే కోర్కలతో
సరస సంభాషణ పలుకులతో
నామనసులో రేపే సింగారాలు 

మాయను కమ్మిన ప్రేమలతో 
మత్తుకు చిక్కిన నయనములతో 
వలపుకు చిక్కిన చక్కదనములతో
నామనసులో రేపే చుంబన తాపాలు
   
అదుపు తప్పకుండా యద కోరికలతో
పదము తప్పక మధుర మాటలతో
చిరునవ్వుల చిద్వి లాసము లతో
నామనసులో రేపే విరహ తాపాలు
ఆణువణువూ ప్రేమాగ్ని సెగలతో
స్వప్న సౌధాల పుత్తడి వెన్నెలతో
ఎర్రగులాబీలు వెదజల్లే పరిమళాలతో
నామనసు నీకోసం ఖాలిగా ఉంచాను    

   అని కవితను వ్రాసి  పంపాడు దానిని చూసి నేను కూడా నా అభిప్రాయముతో పాటు ఒక చిన్న కవితను వ్రాసాను

సిగరెట్టు త్రాగినా  ఏమను కోను, పొగాకు వాసనకు అలవాటు పడ్డ దాణ్ని, ఎందుకంటే మా యింట్లో అన్నలు త్రాగుతారు, అది పెద్ద తప్పు అని నేను అనుకోను, అది మీ బలహీనత అనుకుంటాను, నాకు చేతనైతే మార్చుకోవటానికి ప్రయత్నిస్తా, లేదంటే నోరుమూసుకొని మీకు సేవచేస్తా, కాని నేను చెప్పే విషయాలుమీరు గమనించాలి, ఆధునిక పరికరాలు ఏమివచ్చినా, కొత్త చీరలు ఏమి వచ్చినా నేను కొనే అలవాటు  ఉన్నది, అవి కొనే స్తోమత మీకు ఉన్నదా, ఇల్లంతా  వస్తువలని, ఇన్ని చీరలు ఎందుకని కోపంలో కూడా అనరుకదా,
 డబ్బులు లేవని పిసినారిగా మారుతారా, లేక ఇంత  ఖర్చు అని వేదిస్తారా, ముందుగా మీకు మెసేజ్ ద్వారా తెలుపు తున్నాను మీ అభిప్రాయము చెప్పండి. 
నా ప్రేమ గీతానికి నీ అభిప్రాయము కూడా చెప్పండి



(సుఖం )

వలపు తలుపుల వయసుంది 
మల్లెల అల్లికల చిక్కుంది
కళల మాలికల మత్తుంది
నరాల నడకలు మార్చావా

వణికే వలపుల చలి ఉంది
కులుకు కలువల కసి ఉంది
పలుకు పెదవుల రుచి ఉంది
వరాల తపనలు తీర్చవా

ఆకలి ఆరాటాల ఆశ ఉంది
రోకలి పోరాటాల మత్తు ఉంది
వెకిలి చేష్టల గమ్మతు ఉంది
గారాల హృదయం మార్చవా 

కురుల కదలిక పిలుపు ఉంది
ఫలాలు చెదరక వత్తిడి ఉంది
పెదాలు తడవక తపన ఉంది
స్వరాల రాగాలు గుర్తించావా

చెరకు తినీయల తీపి ఉంది
పడచు పరువాల పక్క ఉంది
వయసు మురిపాల సిరి ఉంది
కలల కోరికలు స్వయంగా తీర్చవా
--((*))--


నీ కవిత నా మనసు తపింప చేసింది నా భిప్రయముతో పాటు ఒక కవిత వ్రాస్తాను
వెంటనే మెసేజ్ వచ్చింది,  ఖర్చులకు వెను కాడను, ఆధునిక అభిప్రాయాలున్న స్త్రీని గౌరవించే వాడ్ని, నీ ఇష్టాలకు నేను ఎప్పుడు అడ్డు చెప్పను, నీ అభిప్రాయాన్ని నేను ఎకీభవిస్తున్నాను, ఎందు కంటే నీవు చేసే ఖర్చు అంతా నాకోసమే కదా, నీకోసం కాదు కదా, నీ ఉద్దేశ్యము చెప్పినందుకు సంతోషం, నేను  కుడా నీకు ఒక విషయం చెప్పాలనుకున్నా, నీవు ఏమి అనుకోవని నీకు తెలుపు తున్నాను. 
నా  మనసులో ఉన్న కోర్కలను కవితా రూపంలో శృంగార వర్ణను కొంత కలిపి వ్రాసి పంపుతున్నాను అంటూ ముగించాడు మీ నాన్న గారు . 

వెంటనే మీ నాన్న గారు కూడా ఒక కవిత వ్రాసి పంపారు అది చదువుకొని నవ్వటమే తప్ప ఏమి చేయ లేక పోయాను
(సుఖం )
గమత్తు కోరిక తీర్చుకోవాలిని ఉన్నది
నిన్ను ఎత్తుకొని హాత్తు కోవాలని ఉన్నది
హత్తు కొని వళ్ళంతా చిత్తు చేయాలని ఉంది
నాకు పైకముంది, నిన్ను పోషించే శక్తి ఉంది

ఎత్తుకొని వత్తు కుంటే జిల్ గా ఉంటుంది 
మనసు మెప్పించి హత్తు కుంటే జిల్ జిల్ గా ఉంటుంది 
నిస్సత్తు వదిలించి, శక్తి నింపితే మజాగా ఉంటుంది 
కొత్త కొత్త ఆశలను తీరుస్తే, తనువూ పులకిస్తుంది 

వలపందించి వయసు మలుపులు చూపిస్తా
మనసిచ్చి మనసు కోరికలు తీరుస్తా
సహాయ సహాకారంతో నిన్ను మెప్పిస్తా
జతకూడిన తర్వాత భావాలు ఇంకా చెప్తా

ఇంతటితో ముగిస్తున్నాను,

 నా పాత ప్రేమికురాలగురించి చెపుతున్నాను   
ఇంకా ఉన్నది

10 వ  భాగము

image not displayed 
 నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమె నన్ను ఎంతో ప్రేమించింది, నేను లేనిదే తను జీవించ లేనని నా వెంట తిరిగింది, నన్ను పెళ్లి చేసుకోమని వత్తిడి చేసింది, అది నిజమైన ప్రేమనుకున్నాను, అందులో కపట ప్రేమ దాగుందని నేను అనుకోలేదు, నా ప్రేమను తిరస్కరించి వెళ్లి పోయింది, ఆ అమ్మాయిని మరవని  ప్రేమికున్ని,  నిద్రపట్టక క్లబ్బులవెంట తిరుగుతున్నాను,  నీకు ఇష్టం లేకపోతె పెళ్లి వద్దని చెప్పు అని వ్రాసారు అమ్మ  మీ నాన్న గారు. 

మీ నాన్న గారి మీద నాకు ప్రేమ ఇంకా పెరిగింది, నిజాయితిగా తన విషయాలు చెప్పారు, నా విషయాలు కూడా నేను తెలిపాను. 
 

మీరు క్లబ్బుల వెంట తిరిగిన మీశీలమ్ చేడదని నాకు తెలుసు, కాని నేనోకర్ని ప్రేమించా డబ్బు, హోదా ఉన్న అందగాడు వినయ్ నాచుట్టు తిరిగి పెళ్లి అంటే ఆలోచించా, పార్కుల వెంట, సినామాలకు వద్దన్నా ఇంట్లో వారికి తెలియకుండా సంచారించా, ఆ వయసులో ఏమి చేసానో నాకు తెలియలేదు, వినయ్ పెద్దలకు భయపడి పెళ్లి ఇప్పుడొద్దు, అన్నారు తల్లి తండ్రులను అనుమతితో పెళ్లి చేసు కుంటాను అని చెప్పాడు, ఇంత వరకూ రాలేదు కారణం ఉద్యోగరీత్యా అమెరికాకు పోవటమే మా మద్య సంభాషణలు తగ్గాయి, తగ్గటం కాదు ఇప్పుడు అసలు లేవు, ఎప్పుడొస్తాడో మరి నాకు తెలియదు ఆ విషయాన్ని ముందుగా మీ నాన్న గారికి చెప్పాను, మీకు ఇష్టము లేకపోతే, నా  సీలము పదిలంగా యున్నది అది మాత్రము నిజం,  ప్రేమలో పడ్డాను  తప్ప ఏమీ తప్పు చేయలేదు, నందం అని ఏకవచనముగా మాట్లాడినందుకు కోపంతెచ్చుకోకు, నా పరిస్థితి అర్ధం చేసుకోగలవు, నేను నిన్ను చేసుకోలేను, ఎందు కనగా
వినయ్ వచ్చి లేచి పోదామని చెప్పగా వప్పు కున్నాను
మన పెళ్లి కి ముందుగా మా పెళ్లి నిర్ణ ఇంచు కున్నాము, నన్నుక్షమించు నీకు ఎన్నో అవకాసులు ఇచ్చాను, నన్ను మరచి   అయిన నన్ను          
నా మెసేజ్ ల ద్వారా మిమ్ము ఇబ్బంది పెట్టితే క్షమించుము
అని మెసేజ్ చేసాను .
  మీ సంభందం  నాకు ఇష్టం లేదని అమ్మాయి తిరుగుడు నాకు నచ్చ లేదని చెప్పి పెళ్లి వద్దని చెప్పుగలరు అని మెసేజ్ పంపినాను.


అమ్మా అది నిజమా మీ ప్రేమ అంత దాకా వచ్చిందా, నీకు  అంత  ధైర్యము ఉన్నదా, ఇప్పుడు ఎప్పుడు భయము వ్యక్తం చేస్తావు, ప్రేమ అంటే అసలు తెలియని దానిలా ఉంటావు, ప్రేమించుకొనే వారిని చూస్తె మండి  పడతావు, ఇది తప్పు కదా అమ్మా, అవునే అప్పుడు నన్ను అజమాయిషి  చేసేవారు లేరు, నామీద ప్రేమ అంత ఎక్కువ మా తల్లి తండ్రులకు ఆ వయసులో అలా ప్రవర్తించా నేను చేసినది తప్పని ఎవ్వరు చెప్పలేదు, మా అమ్మ ఒక్కటే చెప్పింది "అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు వచ్చి అరిటాకు పడ్డ అరిటాకుకే బొక్క పడు తుంది " అది అర్ధం చేసుకొని నీ ప్రవర్తన మార్చుకో అన్నది. మా నాన్న గారైతే " మగవారు అందరూ మూర్ఖులు అనుకోకు వారిలో కొందరు పుణ్య మూర్త్లులు  ఉంటారు,  నీ అదృష్టం కొద్ది నిన్ను ప్రేమించేవాడు మంచివాడో చెడ్డవాడో ముందు గమనించు, వాడి తల్లి తండ్రుల వివరాలు, స్నేహితుల వివరాలు సేకరించి అవి సమంజసము అనుకుంటే అప్పుడు నీ ప్రేమ మొదలు పెట్టు అంత కన్నా ఒక్క అడుగు ముందుకు వేసిన అందరూ అడదానినే అంటారు అది గమనించి నీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది, ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో నాతకమాదుట కష్టం, ఈ అబ్బాయిని చేసుకుంటానని చెపుతున్నావు, ఆ అబ్బాయిని పెళ్ళికి  రమ్మన మన్టున్నావు, నీ ధైర్యము ఏమిటో నాకు అర్ధం కావటం లేదు,  నా శక్తి కొద్ది, నాకు నచ్చిన వాడ్ని, నీకూ నచ్చినవాడ్ని మాత్రమే నీకు వివాహము చేస్తాను, మమ్ము తప్పు పట్టకు ప్రేమ  ప్రవర్తన మార్చుకోకపోతే కష్టపడేది నీవే  అది మాత్రం కుర్తించుకో, ఇంతకన్నా నేను చెప్పేది ఎమీలేదు, అయినా మగవాళ్ళ లక్షణాలు నీకు వినిపిస్తా విను వారి లక్షణాలు తెలియపరుస్తా అని చెప్పటం మొదలు పెట్టాడే మానాన్న. 
 ----------------------
11వ  భాగము

1.పతి, భర్త , మొగుడు, : తల్లి తండ్రుల అనుమతితో, పెద్దల ఆసీర్వాద బలముతో, బ్రాహ్మ నోత్తముడు లగ్నం నిర్ణ యించి, భాజా భజంత్రిల మద్య, చుట్టాలు, ఇరుగు పొరుగు వారు దీవెనలతో, వివాహ మహోస్చవము, కళ్యాణ మండపములో దేవతల దీవెనలతో, అమ్మ లక్కల అసీర్వాద పోట్లాటల సర్దుబాటల మద్య అంగరంగ వైభవముగా, వధువు మెడలో మంగళసూత్రం కట్టి తనదానిగా చేసుకొనేవాడు. ఆ మండపములో విరబోసిన కురులతో, విరజాజుల వంటి కన్నెపిల్లలు చంగు చంగుణ ఎగురుతూ జింక పిల్లల్లాగా తిరుగుతూ, పెద్ద పెద్ద హారములు ధరించి, పట్టు చీరలు ధరించిన నారీమణులు, (వధూవరుల మద్య తలంబ్రాల సంఘటన చెప్పుకోతగ్గది, ఇది నువ్వా నేనా అనేవిధముగా ఉంటుంది.    కాల క్షేపం కధలు చెప్పుతూ ముసలివారు, అది లేడి ఇది లేదు అని అరిచేవారి మధ్య భార్యా భర్తలుగా మారారు.               

2. అనుకూలుడు : వివాహము అయిన తరవాత తల ఎత్తి పరస్త్రీ ని చూడడు పెళ్ళాం చెప్పినట్లు నడుచుకొనేవాడు. మనకున్న సామెతే ఒకటి (పట్టు చీర కొనిపెట్టి పీట పట్టుకు తిరిగేవాడు), పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగేవాడు. పెళ్ళాం కూర్చోమంటే కూర్చొనేవాడు, పడుకోమంటే పడుకోనేవాడు, బట్టలుతక మంటే ఉతికేవాడు, గిన్నెలు తోమి, ఇళ్ళు ఊడ్చి, పక్కసర్ది, వంట చేసి, పెళ్ళాం కు పెట్టి తను తినేవాడు. వీడిని ఆడంగి అంటారు, సంసారం మాత్రము చేస్తాడు .

3. దక్షినుడు : యితడు వివాహము చేసుకుంటాడు, పెళ్ళాన్ని ప్రేమగా చూస్తాడు కాని స్త్రీల అందరిని మంచిగా పలకరిస్తాడు, కొత్త అందాలకోసం స్త్రీల వెంబడ పడు తుంటాడు. నాయికులందరిని, సమానంగా, స్వాభావికంగా, అందరిని ప్రేమించే నేర్పు కలవాడు. ఇది ఒకరకంగా కట్టుకున్న స్త్రీకి ఈర్శ్య పుట్టుట సహజం, మొగునిపై అనుమానం పెరగటం సూటి  పోటి మాటాలు రావాటం, కాపురంలో కలహాలు పెరగడం సంసారం మాత్రము చేస్తాడు. పరస్త్రీలను చూసి ఇంటికి తగాదాలు తెస్తాడు ఇటువంటి వాని యందు ఉండే భార్య చాలా ఓపిక కలిగి ఉండాలి, అనుమానించక బర్తను గౌరవించుతూ  ఉంటె, గౌరవం పెరుగు తుంది.

4..దృష్టుడు : మాటి మాటికి అపరాధం చేసి, నాయకి చేత ధిక్కరించబడి, వినయం అభినయించు వాడు.  దీనినే నక్క బుద్ది అంటారు, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మర గుడిసెలు అంటారు.  వద్దన్నా పని ఎక్కువ చేస్తాడు, చేసి బతిమాలుతాడు, ఇంకెప్పుడు చేయనని వినయంగా మాట్లాడుతాడు. భుద్దిమంతుడిలా, చెవిలో పూలు పెట్టుకొని, దేవుని చుట్టూ ప్రదక్షణలు, చేసి ఒట్టు పెత్తుఇకొని మరీ చెపుతాడు. మరునాడు యధావిధి ఉంటాడు మారాడు. తనకవసరము వచ్చినప్పుడు కాళ్ళు పట్టు కుంటాడు.

5. సటుడు: స్త్రీల విషయంలో కపటం చేసేవాడు, ముక్కు పచ్చలారని, ప్రేమ అంటే ఎమీ తెలియని వారికి ప్రేమ ముచ్చట్లు తెలిపి లేని పోనీ ఆశలు చూపి, శృంగార విషయాలు తెలిపి, నమ్మించి సమస్తము దోచి, నట్టేతులో ముంచే వాడు
ఉప పతి : సదాచారానికి భంగ కరంగా ప్రవర్తించేవాడు, సదాచారంగా చేసేది శివ పూజలు, ప్రవృత్తి పరంగా చేసేది హత్యలు దోపిడీలు  , మానభంగాలు ఇటు వంటి వాడు భర్తగా ఉన్నా నిత్యాగ్నిహోత్రున్ని ప్రక్కన పెట్టుకున్నట్లే, త్రాచుపామును పక్కనున్చుకున్నట్లే, అటువంటి స్త్రీకి నిత్యమూ నరకము, ధనాన్ని చూసి సుఖాన్ని వదులుకోవటం తప్ప ఎమీ చేయలేదు.
వైశికుడు: వేశ్యా సంభోగములకు ఎక్కువ ఆసక్తి చూపువాడు, నిత్యమూ కొత్త దానం కోసం ఆరాట పడేవాడు, ధనమంతా పోయి దరిద్రుడుగా మారిన తన అలవాట్లు మార్చుకోలేనివాడు, పెళ్ళాం నగలు కూడా తీసికేల్లివేస్యకిచ్చేవాడు, చివరిన ఆదరించేవారు లేక, రోగాలతో మునిగేవాడు, పెళ్ళాం విసికి వేసారి వదిలేసి పోయినా బుద్ది రానివాడు.
మాని : నాయికపై ఆగ్రహిచు వాడు, ఏమాట అన్న తప్పు పట్టేవాడు, ఏమాట అనకపోయినా తప్పు పట్టేవాడు,ముక్కోపి,  కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించేవాడు అడ్డు చెప్పిన కోపంతో అరిచేవాడు, లోకజ్ఞానం మీకేం తెలుసు అంటూ పెళ్ళాం నోరు ఎత్తకుండా అరిచి తనపని చేయించుకొని బ్రతికేవాడు.

6. వాక్చాతురుడు : సంభోగాభిలాషను మాటలలో చూపువాడు                     

7. చేస్టా చతురుడు : వాంఛను చేష్టలలో సూచించే వాడు. యితడు చేతులు త్రిప్పుతూ కళ్ళల్లో కైపును చూపిస్తాడు.
మర్మావయాలు స్పర్సతో ఉడికిస్తాడు. మదన తాపాన్ని రెచ్చ గోడతాడు. ఆనంద పర్వసంలో ముంచి సర్వం దోచుకొని తృప్తి పరచి సంతృప్తి చెందేవాడు.

8. ప్రోషిత పతి : నాయికను వదలి దేశాంతరము తిరుగు వాడు. యితడు మొదటి నుండి శృంగారం అంటే భయం ఆవహించి ఉన్నవాడు, స్త్రీని త్రుప్తిఒ పరచలేక, తను సంసారము చేయలేక భయముతో పెళ్ళాన్నే వదలి వెళ్ళేవాడు, ఇటువంటి వారు పెళ్లి చేసుకొని వేరొకరిని భాదపెట్టుట అవసరమా, సృష్టి కి పనికి రానివాడు జీవించుట వ్యర్ధము కాదు పెళ్లి చేసుకొనుట వ్యర్ధం

9. నాయికా భాసుడు : నాయిక యొక్క భావము గ్రహించని వాడు. ఇటువంటివారు దేశంలో చాలా మంది ఉన్నారు, వీరు స్త్రీని గౌరవించకుండా చీటికీ మాటికి స్త్రీని అనుమానిస్తూ, అవమానిస్తూ  ఉంటారు. స్త్రీ చెప్పే మాటలు అసలు పట్టించుకోరు, నేను మొగవాడ్ని అని అహం ఎక్కువగా ఉంటుది వీరిలో, భార్యమాటేను వినక తనమాటే నెగ్గాలని భావించేవాడు యితడు.

10. పీటమర్ధుడు: యితడు నాయకుని మిత్రుడు. అలిగిన నాయిక అలుక తీర్చువాడు. నాయకుడు నాయకని ఎప్పుడు భాదపెడు తున్నప్పుడు మిత్రుడుగా తనవంతు సహాయము చేయువాడు, సంసారానికి సహకారము అందించువాడు, నాయకని లొంగదీసుకొని తృప్తి పరచి గుప్తముగా వ్యవహారము జరుపువాడు.

11. విటుడు : నాయకుని స్నేహితుడు, కామశాస్త్రము భోధించు వాడు. జిహ్వ చాపల్యంతో తను గ్రహ్రించక, గ్రంధ వేశేష ములను మిత్రునికి చెప్పి మనిషిని చెడు మార్గములో తిప్పు వాడు, దానం కోసం ఆడవారిని అంగాంగ వర్ణణ  చేసి ఆనందించేవాడు, ఇటువంటి వాడు స్నేహితుడైతే మాత్రము తక్షణం అతన్ని వదిలించుకొనే మార్గాన్ని ఎన్నుకోవాలి, అతని మాటలకు లొంగారంటే జిఇవిటాలే నాశనము అవుతాయి.

12. చేటుడు : నాయకా, నాయకి సంధాన కర్త, భార్య భార్తల మద్య ఉన్నవి లేనివి చెప్పి మనస్పర్ధలు కల్పించి సంతోషించేవాడు, అనుమానాలు పెట్టుకొని విడిపోయిన వారిని ధనం కోసం కలిపేవాడు.

13. విధూషకుడు : అవయవాది వికారాలతో ప్రసంగాలతో నవ్వించేవాడు. కష్టాల్లో ఉన్నవారిని, దిగులుగా ఉన్నవారిని, భయముతో ఉన్నవారిని, చిన్న పిల్లాల్ను నవ్వించేవాడు, తన విచారాన్ని బయట పెట్టకుండా ఎప్పుదూ నవ్వుతూ ఉంటాడు.
 మగవాడి లక్షణాలు ఇంకా ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు చెపుతా ను ఇంతటితో ముగిస్తున్నాను .  
                    ఇంకా ఉన్నది







అమ్మా నీ ప్రేమ కధ వింటుంటే నాకు నీ వెనుక ఇంత పెద్ద కధ ఉన్నదా అమ్మా ఇంకా చెప్పు, నీవు ప్రేమించిన పవన్ విషయాలు చెప్పలేదు, నాన్న బ్రహ్మానందం ఎప్పుడు నిన్ను పెళ్లి చుసుకున్నాడో మరి చెప్పలేదు, మీ న్నా గారిని అమ్మగారిని బాధ పెట్టకుండా పెళ్లి చేసుకున్నవా అన్నివివరాలు తెలుపమ్మా అని అడిగింది మల్లిక. 
అంట తొంద రెందుకే నీకు, ఆప్పటి విషయాలుఇప్పుడు ఎందుకు, అయినా తెలుసుకో నేను తెలియపరుస్తా. 
మల్లిక అప్పడు