తెనాలి రామకృష్ణ కథలు.. 45
ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?' దాని వివరణ? అన్న మహారాజు వాక్కులకు
శ్రీ రామకృష్ణుని ఒకసారి అడిగితే దానికి ఇలా జవాబు చెప్పారు:
" నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. "
నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతి ప్రియమైన వాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.
ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. 'నా బాబువి కదూ, నా తల్లివి కదూ' అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది. కాని, ఆమెకు తెలుసు- ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.
తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.
అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.
బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది. సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపvట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది. ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.
పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి. లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు. అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో... ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు. దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.
పాల నుంచి వెన్న దొరకదు. ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి. తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది. చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది. ప్రపంచం నీళ్ల లాంటిది. మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.
అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.
సమస్త లోకాః సుఖినోభవంతు అంటూ ముగించాడు
*****
తెనాలి రామకృష్ణ కథలు..(44)
రామకృష్ణ లక్ష్యానికి మూలం వివరిస్తావా?
అందరి పట్ల సమభావంతో ఉండు
ముక్తిభవన్ లో చేరిన ప్రతీ ఒక్కరినీ ఒకే విధంగా కాకుండా వారి కులమూ , మతమూ , డబ్బూ , సాంఘిక , ఆర్థికస్థితిగతులను బట్టి చూడడం మొదలు పెడితే వారికీ నాకూ కూడా శాంతి ఉండేది కాదు .
ఎదుటి వ్యక్తులను సమభావంతో నీవు చూసిన నాడు నీకు ప్రశాంతత ఉంటుంది . నీ పని నీవు చక్కగా చెయ్యగలుగుతావు .
నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తించు . సాధించే ప్రయత్నం చెయ్యి .
.
నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది గుర్తించడం చాలా గొప్ప విషయం, కానీ దానిని నువ్వు సాధించే ప్రయంతం చెయ్యని నాడు అది నిష్పలం .
.
చాలా మంది ఏమి చెయ్యాలో తెల్సు కానీ ఏమీ ప్రయత్నం చెయ్యకుండానే జరిగిపోవాలి అనుకుంటారు . ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కన్నా అసలు లక్ష్యమే లేకపోవడం ఉత్తమం . లక్ష్యం అంటూ ఉంటే నీకున్న సమయమూ , నువ్వు చెయ్యవలసినదీ ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటావు . నీ ఆలోచన దాని మీదనే ఉంటే నీవు తప్పించుకోలేవు .
నీ మంచి అలవాట్లు విలువలుగా మారతాయి
* నీవొక మేకులా ఉండాలి.
అన్ని నీకు తగులుకుని ఉండాలే గాని., దేనికి నీవు తగులుకుని ఉండకూడదు.
ఇదే అవధూత లక్షణం.
* జరుగుతున్న వాటికి కర్తృత్వాన్ని నీ నెత్తిన వేసుకున్నప్పుడు వాడే పదం - ప్రారబ్ధం.
* దేవుని మీద వేసినప్పుడు వాడే పదం - భగవదిచ్ఛ.
* ఏది అర్థం కాక ఉన్నప్పుడు వాడే పదం - విధి.
ఈ మూడింటి అర్థం 'నీ చేతిలో ఏమి లేదు' అనే.
.
మంచి అలవాట్లను చేసుకో ! అది నీకు మంచి విలువలను నేర్పుతుంది .
మంచి అలవాట్లను అభ్యాసం చేతనే నేర్చుకోవాలి . అదేమీ సులువైన విషయం కాదు . ప్రతీసారీ నువ్వు ప్రయత్నపూర్వకంగానే సాధించాలి . సత్యమూ , దయా , సానుభూతీ ,నిజాయతీ ఇవేవీ నీ
ప్రయత్నం లేకుండా వాటంతట అవి రావు .
.******
తెనాలి రామకృష్ణ కథలు.. (43)
జ్ఞానం కోసం ప్రతిఒక్కరూ ఏమిచెయ్యాలి? వృద్దాప్యంలో ఏంచెయ్యాలి?
నీవేమి నేర్చుకోవాలో నీవే నిర్ణయించుకో !
ఈ ప్రపంచం లో ఎంతో జ్ఞానం ఉంది . అందులో నీవు ఏది కావాలి అనుకుంటున్నావో దాన్ని ఎంచుకో . ప్రతీ ఒక్కరూ వారి అభిరుచులను, సిద్ధాంతాలనూ , అనేక విషయాలనూ నీ మీద రుద్దుతారు . అయితే నీకు ఏది ఇష్టమో అది ఎంచుకో ! వారి సూచనలు పరిగణనలోకి తీసుకో . నీ మనసు హృదయం చెప్పినట్టు నువ్వు ఎంచుకో !
.
ఇక్కడకి వచ్చిన వారు ఆఖరు దశలో ఉంటారు . నడవలేరు .... మాట్లాడలేరు ..... అపుడు వారిలోకి వారు వెళ్ళడం మొదలు పెడతారు . వారి అనుభవాలలోనే వారు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు . నేర్చుకున్నదానిని నెమరు వేసుకుంటూ ఉంటారు .
నీవు ప్రజలతో సంబంధాలు తెంచుకోకపోతే ; వారు రగిలించిన ఆలోచనలతో సంబంధం తెంచుకో
.
నీవు ప్రేమించిన వ్యక్తులు , నీకు ఆప్తులు అయిన వ్యక్తులు నీతో అన్నివిషయాలలోనూ ఏకీభవించకపోవచ్చు . వారి భావాలు నీ భావాలకు వ్యతిరేకం కావడం వలన వారి భావాలతో విభేదించలేక వారికీ దూరం జరుగుతున్నావు తప్ప వారికి నీవు దూరం కావు . మీ మధ్య భేదాభిప్రాయం ఆలోచనలలోనే తప్ప వ్యక్తులతో కాదు . నీవు నేర్చుకోవలసినది వారిపై ప్రతీకారభావం కాదు . వారి పట్ల కఠిన హృదయం కాదు .
నీ సంపాదనలో పది శాతం దానం కోసం కేటాయించుకో !
.
ధర్మం అంటే మతసంబధం కాదు . మంచిని చెయ్యడం . ఒక పది శాతం సంపాదన ఇందుకు కేటాయించుకో !
*తడవకపోతే 'గుప్పెడు' - తడిస్తే 'మోపెడు'.
*పుట్టుకతో మనం తెచ్చుకునే కర్మలు ఎప్పుడు 'గుప్పెడే' ఉంటాయి! అయితే జీవనగమనంలో మనమే వాటిని తడుపుకుని తడుపుకుని అంటే అజ్ఞానంతో బరువు పెంచుకుని పెంచుకుని మరి వాటిని 'మోపెడు' చేసుకుని బెంబేలెత్తిపోతూ ఉంటాం!
*అల సముద్రం కోసం వెతికినట్లు
కుండ మట్టి కోసం వెతికినట్లు
* జీవుడు దేవుని కోసం వెతకడం కూడా.
చాలామంది జీవిత అంత్య కాలంలో దానధర్మాలు చేస్తూ ఉంటారు . వృద్ధాప్యం వలన వారికి కలుగుతున్న అసౌకర్యాలు ఇతరులకూ కలుగుతున్నాయని తెలుసుకుని అవి తొలగాలని కొంత సహాయ పడుతూ ఉంటారు . ఎవరైతే ఆప్యాయతను పొందుతూ ఉంటారో , అపరిచితుల ప్రేమను పొందుతారో , వారు ప్రశాంతంగా ప్రాణం విడువగలుగుతారు . నీవు సంపాదించినదంతా నీవే అనుభవించాలి అనుకోకు . కొంత ఇతరులకు మిగుల్చు .
ఇలా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో? అంటూ ముగించాడు.
*****
తెనాలి రామకృష్ణ కథలు (42)
మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు? రామకృష్ణ వివరిస్తావా యీ నిండు సభలో
* మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.!!
కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .!!
* అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.!!
వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని
" అణుకువ " నటిస్తారు.
అంతవరకే.!!!
* పదవి , పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు వాడుకుందామని
పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే
ఒక్కడూ ఉండడు.
ఇది నిజం
రాజు గారి మారువేషాన్ని గుర్తుపట్టని భటుడు రాజును చెరసాలలో బంధించినట్టు;
'జగత్తు' అనే మారువేషాన్ని ధరించిన భగవంతుడు ప్రకృతి చేతిలో బంధితుడు అవుతాడు.
నామరూపాలే బంధం., అవి లేకుంటే మోక్షం. అదే విలువ.
మెల్లకన్ను ఉన్నవాడు---
➡ రెండు కళ్ళు ఉన్న వారితో పోల్చుకుంటే - నరకం.
➡ గుడ్డివాని తో పోల్చుకుంటే - స్వర్గం.
పోల్చుకోవడం వలనే స్వర్గ నరకాలు ఏర్పడతాయి. అర్ధం చేసుకుంటే విలువ పెరుగుతుంది
* కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత
గొప్పగా చెబుతారు.!
కాసేపు కబుర్లు " ఎంజాయ్ " చేస్తారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!!
* మనిషి " విలువ " పొందాలంటే ఉండవలసినవి
1 కరుణ,
2 దయ,
3 ప్రేమ ,
4 జాలి ,
5 సేవాభావం ,
6 సాయపడాలనే తపన ,
7 మంచి మనసు ,
8 తెగింపు ,
9 విశాలహృదయం ,
ఉండాలి.!!!
పై లక్షణాలు మనకు ఉంటె
" విలువ "
మనం పిలవకుండానే
మన దగ్గరకు వస్తుంది.!!!.అని తెలియ పరిచాడు.
******
తెనాలి రామకృష్ణ కథలు... 41
రామకృష్ణ తెలుగు భాష క్షిణించడానికి కారణాలు ఏమిటి?
విద్యా భోధన తెలుగులో లేక పోవడం, సంస్కృతాన్ని తెలుగులో బోధించకపోవడం, ప్రభుత్వాలు భాష పై నిర్లక్ష్యం, ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడం, ప్రెవేట్ పాఠశాలలో తెలుగు లేకపోవడం, తెలుగులో కంప్యూటర్ వృద్ధికి రాకపోవడం, సంపాదనకోసం మంత్రులు ఉండటం. జనులు ఉద్యోగం వచ్చె చదువని అంధుని చదువుని చదవడం నేడు కోట్లలో చేరింది, తెలుగుతల్లి ఆవేదన పెరిగిపోయింది.
నేను చెప్పేది మాతృ భాష రక్షణ ఉద్యమం రావాలి, అన్నిటా తెలుగు భాష వాడాలి అదే నా ఆశయం. ప్రజలు, ప్రభుత్వాలు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను
అందుకే ప్రతిఒక్కరు యీ వాక్యాలు అర్ధం చేసుకోగలరు
◆మందలో ఉండకు.. వందలో ఉండటానికి ప్రయత్నించు.
◆ప్రయత్నం చేసి ఓడిపో. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.
◆కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.
◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
◆ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.
◆ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
◆కళింకిత హృదయులకు ఆధ్యాత్మిక వికాసం ఉండదు.
◆తెలివైన వారి తమ పని తామే సాధించుకోవాలి.
◆దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.
◆దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నీకెవరూ అపకారం చేయలేరు.
◆పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను.
◆పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది
ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.
◆ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.
◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.
◆మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.
◆మీ కంటే ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.
◆విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.
◆వేదకాలానికి తరలిపోండి.
◆సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.
◆సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.
◆విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.
◆తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కానీ వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు.
◆విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం.
◆ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.
◆జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవద్దు.
◆జీవితం పోరాటాల,భ్రమల పరంపర. జీవిత అంతరార్థం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది.
◆విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.
◆టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది.
డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.
◆చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.
◆విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.
◆విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం.
◆మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.
◆అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.
◆స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.
◆సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.
◆నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది.
◆భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.
◆మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.
◆మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది.
◆సహాయం అందుతుందనీ భావించేవారు మాత్రమే పని చేయ గలరు, ప్రత్యక్షంగా వారు కార్యరంగంలో ఉన్నారు గనుక.
◆దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు.
◆ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవిం లేడు.
◆పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి.
◆నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది.
◆పాశ్చాత్య ప్రపంచం ధన పిశాచాల నిరంకుశత్వానికి గురియై మూలుగుతుంది. ప్రాచ్య ప్రపంచం పురోహితుల నిరంకుశత్వంతో ఆర్తనాదం చేస్తుంది.
◆ప్రతి వ్యక్తీ దేశము మహత్వం పొందగలిగితే మూడు విషయాలు ఆవస్యకములై ఉన్నాయి.
1. సజ్జనత్వపు శక్తి గురించిన ధృడ విశ్వాసం
2. అసూయ, అనుమానాల రాహిత్యం
3. సజ్జనులుగా మెలగాలనీ, మంచి చేయాలని ప్రయత్నించే యావన్మందికి సహాయపడడం.
◆మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం.
◆ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.
◆అపజయాలను లక్ష్య పెట్టకండి,అవి వాటిల్లడం సహజం, అవి జీవితానికి అందం చేకూరుస్తాయి.
◆అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.
◆బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు. బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న బలాన్ని గూర్చి వారికి బోధించండి.
◆ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.
◆మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విస్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.
◆ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు.
◆సంకల్పనశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే. నిర్మలం, బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి.
◆ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది.
◆స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.
◆ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం.
◆అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు. కానీ అనేక సంవత్సరాలు కొట్టూమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.
◆జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చేయి.
◆ఏది స్వార్ధపరమో అదే అవినీతి, స్వార్ధరహితమైనదేదో అదే నీతి.
◆పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలుచేడమే పూజలన్నింటి సారం.
దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే,అది వచ్చే తీరుతుంది.
◆ఈ జీవితం క్షణికమైనది,లోకంలోని ఆడంబరాలు క్షణ భంగురాలు.కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు.
◆నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు. నేడో, రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది. ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.
◆నా సోదరులారా! మనం పేదలం,అనామకులం. కానీ అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి.
◆అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది,మంచితనం కూడా అంతే.
◆ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల. మన మిచ్చటికి రావడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే.
సర్వే జనా సుఖినో భవంతు.
అంటూ ముగించాడు రామకృష్ణ
****
తెనాలి రామకృష్ణ కథలు.. (40)
రామకృష్ణ తిధులు, ఆది దేవతల ఫలాలు, వివరించగలవా
అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు
చిత్తం అంటూ
పాడ్యమి: అధిదేవత – అగ్ని.
వ్రత ఫలం – సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత – అశ్విని దేవతలు.
వ్రత ఫలం – ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత – గౌరీ దేవి.
వ్రత ఫలం – సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత – వినాయకుడు.
వ్రత ఫలం – కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత – నాగ దేవత.
వ్రత ఫలం – వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత – సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం – పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత – సూర్య భగవానుడు.
వ్రత ఫలం – ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత – అష్టమాత్రుకలు.
వ్రత ఫలం – దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత – దుర్గాదేవి.
వ్రత ఫలం – సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత – ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం – పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత – కుబేరుడు.
వ్రత ఫలం – ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత – విష్ణువు.
వ్రత ఫలం – పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత – ధర్ముడు.
వ్రత ఫలం – మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత – రుద్ర.
వ్రత ఫలం – మృత్యుంజయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు – పితృదేవతలు.
వ్రత ఫలం – సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత – చంద్రుడు.
వ్రత ఫలం – ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.
*****
తెనాలి రామకృష్ణ కథలు.. (39)
రామకృష్ణ శివాభిషేకం గురించి, అభిషేక ద్రవ్యాల గురించి, వాటి ఫలితాల గురించి మన ప్రజలందరికీ తెలియపర్చు. వారి కర్మానుసారము మోక్షం పొందగలుగుతారు.
*శివలింగాభిషేకం వివిధ ఫలితాలు*
1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.
శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంలాగా రాస్తారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
18 మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలవ్యాదులు నయమగును.
19 కస్తురి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును.
20 పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళ ప్రదమగును శుభకార్యాలు జరుగును.
ఎవరు పెట్టింది వారు శివ పూజ చేయడం, జాగారం ఉండటం, ఉపవాసం ఉండటం, శివాలయం దర్శించి నమశ్శివాయ పారాయణం చేయడం ప్రతి ఒక్కరికి కర్తవ్యం గా భావించే రోజే శివరాత్రి.
అని తెలియపరుస్తూ రామకృష్ణ ముగించాడు.
శ్రీకృష్ణదేవరాయలు ప్రజలందరికీ పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వాలని తెలియపరిచాడు.
******
తెనాలి రామకృష్ణ కథలు.. (38)
రామకృష్ణ శివతత్వం గురించి వివరించగలవా
నేను ఆ పరమాత్ముని గూర్చి తెలిపే శక్తి నాకు యేది అయినా ఆ అమ్మ కృపతో నా ద్వారా పలికించే పలుకులు వినగలరు అంతా దైవమాయలు వాటిని బివరించడం ఎవ్వరివలనకాదు
అయినా
శివ తత్వం:-
అందరూ తనవారే అనుకున్న, ఎవరు తన వారు కాదు అనుకున్నా మనస్సు తటస్థమైపోతుంది. అనగా బంధం పోతుంది., బంధం పోవడమే మోక్షం. అదే శివతత్వం.
మీకు నాకు జ్ఞానం కలిగింది అనడానికి గుర్తు ఏమంటే - మీరు ఉండరు, నేను ఉండను .
జ్ఞానికి ఈ శరీరం 'ఓ వాహనం' ఈ జగత్తులో విహరించడానికి. శివతత్వ ప్రభోదానికి మాత్రమే తెలుకున్నవారు మోక్షం చెందుతారు.
ఆభరణాల (దేహాల) పరంగా చూస్తే వైవిధ్యం.
బంగారం (ఆత్మ) పరంగా చూస్తే ఏకత్వం.
సహజ స్థితి అనేది ఒక ప్రక్రియ కాదు.,
నీ స్థితే అది.
____
దేవుడంటే సమిష్టి., జీవుడంటే వ్యష్టి.
శివం - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
త్రినేత్రం - ధ్యానం.
ఢమరుకం - సంగీతం.
తాండవాభినయం - నృత్యం.
శివుని చేతిలోని అగ్ని - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
భిక్ష పాత్ర - ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
కపాలం - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
కోరుకునేది - చితా భస్మం కాదు. చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)
సుషుప్తిలో తాను 'ఏకంగా' ఉంటాడు.
స్వప్న, జాగ్రత్తుల్లో తాను 'అనేకంగా' ఉంటాడు.
నా గురువు---
వర్తమానంలో జీవించు అని - భూత, భవిష్యత్తు కాలాలను మాయం చేశారు.
ఇది ఒక కల అనుకోమని - ప్రపంచాన్ని మాయం చేశారు.
దేహం ఉన్నంతవరకు సందేహం తీరదని - సందేహాలన్నీ మాయం చేశారు.
_____
మనసును నిగ్రహం చేయడం అంటే - దాని చేష్టలను సాక్షిగా చూస్తూ ఉండడమే.
సిద్ధులేవీ తనను తాను తెలుసుకోవడానికి ఉపయోగపడవు. దుఃఖాన్ని పొగొట్టగలిగేదే నిజమైన సిద్ధి. అదే జ్ఞాన సిద్ధి.
సుషుప్తిలో ఉన్న తనకు 'దేవుడు' అని పేరు.
స్వప్న, జాగ్రత్తుల్లో ఉన్న తనకు 'జీవుడు' అని పేరు.
నేనెవడను అని విచారణ చేసేది ఆత్మే.
మన ఎదురుగానే ఉన్నా చూడడం చేతకాక భగవంతుణ్ణి ప్రపంచంగా భ్రమ పడుతున్నాం.
ప్రతి ఒకరు ఏడు రకాల తత్వాల ప్రార్థనలు:-
1. మూలాధార తత్వం:-
వీరు భౌతిక శరీరం గురించి మాత్రమే ప్రార్థనలు చేస్తారు. (నాకు కొడుకు పుట్టాలి, నేను ఇల్లు కట్టాలి etc)
2. స్వాధిష్టాన తత్వం:-
వీరు భౌతిక పదవుల గురించి ప్రార్థన చేస్తారు.
3. మణిపూరక తత్వం:-
వీరు విద్యల కోసం ప్రార్థన చేస్తారు.
పై మూడు పూర్తిగా లౌకికం మరియు ప్రాపంచిక ప్రార్థనలు మాత్రమే.
4. అనాహత తత్వం:-
వీరు పూర్తిగా లౌకికము కాదు, పూర్తిగా ఆధ్యాత్మికము కాదు. నాకు లౌకికంగా ఏదీ వద్దు; మనశ్శాంతి కావాలని ప్రార్థన చేస్తారు.
5. విశుద్ధ తత్వం:-
జగత్తు మొత్తం శాంతి కోసం ప్రార్థన చేస్తారు.
ఈ క్రింది రెండు తత్వాలలోను ప్రార్ధన ఉండదు. ఇక్కడ 'అడగడం' ఉండదు.
6. ఆజ్ఞా తత్వం:-
పరమాత్ముని 'ధ్యానం' మాత్రమే ఉంటుంది.
7. సహస్రార తత్వం:-
ఆదర్శ పురుషులు. తెలిసినది 'బోధించడం' మాత్రమే ఉంటుంది.
శివోహం... ఓం నమ శ్శివాయ..
అంటూ జీవితం సత్య, ధర్మ, న్యాయవిధాన సాగడమే జీవి మార్గము.
ఇలా ఇలా ఇంకా.. ఇంకా.. ఎన్నో.. ఎన్నో
ఎన్ని కథలు చెప్పిన మారదు బుద్ది కర్మల బంధమే జీవితం
*****
తెనాలి రామకృష్ణ కధలు.. 37
.ప్రతి ఒక్కరు అంతరంగాన్ని చేరడానికి మార్గాలు ఏవి రామకృష్ణ
* . మీ అంతరంగాన్ని పొందడానికి, మీరు ఇవి విడనాడాలని గుర్తుంచుకోండి: అహం, పగ, బాధ, అహంకారం, స్వాధీనత, ధిక్కారం, మీ జీవితానికి సానుకూలంగా ఏమీ దోహదపడని ఏదైనా.*
* . మీ అంతరంగాన్ని చేరుకోవడానికి, మీకు కావలసింది: వినయం, మీపై నమ్మకం, క్షమించు కోవడం మరియు క్షమించడం, కృతజ్ఞత, గౌరవం మరియు భూమిపై మరియు స్వర్గంలో సృష్టించబడిన ప్రతిదాన్ని ప్రేమించడం.*
* . మీ ఆత్మను స్వేచ్ఛగా ప్రవహించనివ్వని విశ్వాసాలు మరియు సిద్ధాంతాల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోండి, మీ ఆత్మలో ఉన్నది మీ నిజమైన మతం.*
* . మనలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. అతని కోసం వెతకండి మరియు మీరు అతన్ని కనుగొన్నప్పుడు అతను ఎల్లప్పుడూ మీ లోపల ఉన్నాడని మీరు చూస్తారు. మీ ఆత్మ యొక్క శక్తి మీ విశ్వాసమే.*
* . మీ కోసం కొంత సమయం కేటాయించండి. ఇది చాలా అవసరం. మీరు మీతో ఉండాలి, మౌనంగా ఉండాలి మరియు మీలో సంచరించే శక్తిని అనుభవించాలి. మీ స్వీయ కాంతిని చూడటం ద్వారా మీకు మీరు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చుకోండి. అన్నింటికంటే, మీ నిశ్శబ్దాన్ని వినండి, మీ శాంతిని అనుభూతి చెందండి. అద్భుతమైన ఉనికి యొక్క ప్రేమ మీ శరీరం అంతటా ప్రవహిస్తున్నట్లు మీరు కనుగొంటారు.*
******
తెనాలి రామకృష్ణ కథలు.. (36)
రామకృష్ణ జీవిత "ము " తెలుపు
అసుకవిత్వంగా.... అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు...
చెక చెక చెప్పడం మొదలుపెట్టాడు, కంఠం పట్టి వ్రాసారు కొందరు కవులు...
మూటకట్టినా నెంత ధనము, మూలుగుతున్న మనిషి తనము, ముందు జాగరూకతలేని వైనము, ముప్పు తెచ్చు మాటకారి తనము.
విడవకున్నా నెంత బంధము, విలువలేని విద్య పఠనము, వింత వెంట పడ్డ ఆడతనము, విశ్వాస వాకిట మౌనము.
అనుభవించినా నెంత సౌఖ్యము, అలుకతీర్చ లేనితనము, అసలు తెలపలేని జగడము, అణుకువలేని అనుబంధము.
పెంచుకొన్నా నెంత పాశము, పెదవి కోసం చేసే మోసము, పెనుగులాట పనితనము, పెనవేయు కౌగిలి మయము.
విర్రవీగినా నెంత మదము, విశ్వాసములేని అక్కర ధనము, విజయమివ్వని ఆశపాశము, విస్మయా బతుకే మౌనము.
తపనపడినా నెంత స్వార్ధము, త పింప లేనిమనసు ధర్మము, తరుణం సుఖము లేని జీవము, తడబడే దేహతాపము.
మురియుచున్నా నెంత అందము, మునిగి పోవుమనిషి వైనము, ముడుపులు కోసము మోహము, మువ్వల చప్పుడు ముందర దాహము.
నిలుపుకొన్నా నెంత స్నేహము, నిలుపుకోలేని ప్రేమ ధర్మము, నిజము తెలపలేని జీవము, నియమము తప్పి ప్రయాణము.
కలవరిస్తున్నా నెంత మమకారము, కథలుగా కదిలే యపకారము, కనులలో జూపే యహంకారము, కలువతప్పదని చేయు ఉపకారము.
పొగరుబడినా నెంత అహంకారము, పొరుగు వారితో స్నేహభావము, పొనుగు పిల్లిలా అయ్యోమయము, పొసగు జీవ తంత్రమయము.
పంచుకొన్నా నెంత అనుబంధము, పంతముతో పక్కా కాపురము, పందెము తోపరువాల పంపకము, పంఖము లా తిరిగే జీవితము.
ముచ్చటపడినా నెంత దేహము, ముళ్ళుగుచ్చగా మారు రూపము, ముక్కెర మెర్పుతో మోహము, ముక్కోటి ని జపించే జీవము
మాయలోనున్న మనిషి, మార్గాన్ని అన్వేషంచుకోలేని స్థితి, మానన్ని అర్పించుకొనే గణ స్థితి, మాటలతో బ్రతికే మనిషి మర్మము
స్థిరమనియన్నీ భ్రమసేటి మనిషి, స్థిమితము లేని మనసు స్థితి, సత్యము తెలుసుకో... మిగిలేది కర్మల విజయము.
కాష్ఠములో గుప్పెడు బూడిదే కడకు ధర్మము
రామకృష్ణ నీకు నీవేసాటి అన్నారు కవులు మింగలేక, కక్కలేక, చెప్పలేక గొప్పతనము.
తెనాలి రామకృష్ణ కథలు.. 35
అప్పాజీ గారు తాగుణిoతం వివరిస్తారా
చిత్తం, చిత్తం
నా గాత్రము కొంత నీరసంగా వుంది మన తెనాలి రామకృష్ణ తెలియపరచాలని ఉస్చాహంగా ఉన్నారు అన్నాడు
తప్పదు రామకృష్ణ మీరే వివరించాలి బతిమాలే చూపులతో అప్పాజీ గారు
మహాప్రభువు వందనాలు, పండితులందరికి, ప్రతిఒక్కరికి నమస్కారాలు అంటూ....
"త" గుణింతం తో మొదలుపెట్టాను...అంతా బానే సాగుతోంది అనుకునే లోపు..."తౄ" ఇంకా "తః." దగ్గరకొచ్చేసరికి...హుష్
అడుగుతోంది...!!!
"త"న మన గమనము నిత్యమూ తపము
గణ గుణ గమ్యము మోక్షమూ గళము
"తా"నుగా తత్త్వమై తోడుగా త్యాగ
గాన గంధర్వ మై కాలము గాగ
"తి"రిగెను పిచ్చి యాశలతోను తీర్ధ
గిరిజా రమణ లీల విధిగాను గీత
"తీ"రని కోర్కెల వెంటనే తీవ్ర
గీతలక్ష్యముగాను జీవము గీత
"తు"నకవ్వని గుణము చిత్తము తూగు
గుణ గణ కథలన్ని వినసొంపు గుర్తు
"తూ"నీగ బ్రతుకగు నిత్యమూ తూగు
తిప్పక...నునుపు తేలినమది తీగ
"తృ"ణపంచు వంటి పరిచయపు పదును తాకిడికి
"తె"ప్పరిల్లిన మనసుకు...మతినే
"తే"రుగా చేసి వడిగా సాగుతూ...
"తై"తక్కలెరుగని వలపుటేరులో...
"తొ"ణక్క బెణక్క ఎక్కుపెట్టిన విల్లులెక్క
"తో"డునీడైన తొలి తలపుకు...జ
"తౌ"తావుగా జన్మజన్మలకని...జోడు
"తం"త్రుల సాక్షిగా...అడుగుతోంది...!!!
ఒకటై'పోదామా అంటూ...!!!
ముగించాడు.
****
రామకృష్ణ కథలు.. (34)
రామకృష్ణ స్త్రీ పుట్టుకలో ఏమి యాసిస్తుంది?
జాగృతి అభిప్రాయం వివరించాడు రామకృష్ణ
ఎవరా జాగృతి?
ఒక స్త్రీగా నాకు స్వేశ్చ కావాలి, నాకు నామాటకు విలువ ఇచ్చే సంసారం కావాలి అందుకే నా ఆలోచనలు యీ విధంగా ఉంటాయి మీరు వినండి అంటూ చెప్పటం మొదలపెట్టింది జాగృతి అది నాపేరండి
రెండక్షరాల్లో ఉన్న మత్తు తీర్చాలని
పేరుతో నాకు ముడిబడ్డ గమ్మత్తు మార్చాలని
తలచిన అణువణువు అల్లుకోవాలని
అలవి కాని మక్కువ ఆద రించాలని
నా వైపు అడిగేసిన క్షణాన్ని సర్ది చెప్పాలని
ఒడిసి పట్టుకొని తూకం వేయాలని
ఈవేళ హద్దులన్నీ చేర్పేయాలని
తరాజు లెక్కలు సరిచేయ్యాలని
సమాన బ్రతకుగా పండిపొ వ్వాలి.
వెన్నెల, కవిత్వం, శృంగారం కలిస్తే అమోఘo
పెళ్లి కొంతమందికి తీయని గేయం అయితే కొంతమందికి మానని గాయం. వన శృంగారం కథానాయికి పెళ్లి గాయాలతో సమాజ భయంతో బతుకుతూ ఉండే స్త్రీ. ఆమె అందాన్ని కాక మనసుని ప్రేమించే హృదయం ఉన్న వాడు ఆమెకు దొరుకుతాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ప్రేమించడం మానవ నైజం.
.
కళ్ళతోనే ప్రేమించుకునే వారు అప్పుడప్పుడూ వారు కలుసుకుంటారు. వెన్నెలలో వనాలలో విహరిస్తుంటారు. ఆ వెన్నెల విహార వర్ణన, ఆ విహారంలో పెళ్లి గాయాల నుంచి ఉపశమనం పొందిన ఆమె మనసు పాడే ప్రేమ గేయాలే వన శృంగారం.
.
రాధా కృష్ణులని పూజించి తమని
రాధా కృష్ణులలా భావించుకునే ఒక జంట కథ. రహస్య ప్రేమికుల అనుభవానికి కవితా రూపం, చాలా విచిత్ర పరిస్థితులలో వారి ప్రేమ ఫలిస్తుంది.
జీవితంలో అవసరాన్ని తీర్చాలని కష్టాల్లో తోడు గా బ్రతకాలని జీవితంలో నటించేవార్ని నమ్మరాదని జీవితాంతం తోడు నిల్చి పోవాలని కష్టపడకుండా వచ్చిన డబ్బు తనది కాదని అవసరానికి మించిన ఆస్తి నిరు పయోగమని సత్యాన్ని ఆకట్టుకున్నా అ సత్యాన్ని తరిమెయ్యాలని చేయలేనిది చేయగల్గినది తెలుసుకోవాలని అవినీతిని తరిమి నిజాయితీని నిలపాలని జీవితం విలువైనదని తెలుసుకోవాలి.కంటికి ఎంతాశో కనుపాపగా నిలవాలని చెవలకెంతాశో మంచి వినాలని చేతులకెంతాశో పాద పూజ చేయాలని నీడకీ ఎంతాశో కలకాలం నిలవాలని వెలుగుకు ఎంతాశో తెలివిని తెలపాలని చేతికి ఎంతాశో చేయి చేయి కలపాలని మనసు కీ ఎంతాశో కలకాలం నిలవాలని నవ్వుకు ఎంతాశో నిజాన్ని నిలపాలని తనూలత కెంతాశో ఒకరికొకరవ్వా లి మీ అందరి ఆశీస్సులు పొందాలి
యింకా ఉంది
*****
తెనాలి రమకృష్ణ కథలు..(33)
రామకృష్ణ పూజలు అందరూ చేస్తారు ఈ పూజ ల పరమార్థం ఏమిటి..?????
పూజ, అర్చన, జపం.స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం.తర్పణం. గంధం. అక్షంతలు. పుష్పం.ధూపం. దీపం. నైవేద్యం. ప్రసాదం ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన....వీటినే పూజ-పరమార్థాలు:
పూజ -- పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.
అర్చన--అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
జపం-- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
స్తోత్రం-- నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం-- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.
దీక్ష-- దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేక:-- అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.
మంత్రం-- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.
ఆసనం-- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
తర్పణం-- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
గంధం-- అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.
అక్షతలు-- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
పుష్పం-- పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
ధూపం-- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.
దీపం-- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
నైవేద్యం-- ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.
ప్రసాదం-- ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
ఆచమనీయం-- లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .
ఆవాహనం-- పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
స్వాగతం-- దేవతను కుశలప్రశ్నవేయుట.
పాద్యం-- చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
మధుపర్కం-- తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
స్నానం-- గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.....
వందనం-- అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం)......
ఉద్వాసన-- దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు...
రామకృష్ణా పూజా విధానాలు చక్కగా వివరించావు అన్నారు శ్రీ కృష్ణదేవరాయలు సభలో
****
తెనాలి రామకృష్ణ కథలు.... 32.
విజయనగరానికి దేశ దేశాలు తిరిగి న పండితుడు కొన్ని ప్రశ్నలు రాజ సభలో ప్రెవేశ పెట్టి సమాధానాలు కోరాడు.
వీటికి ఎవ్వరూ చెప్పలేక నాకు బహుమతులిచ్చి పంపారు మీ పండితులు చెప్పలేక పోతే మీరు బహుమతులివ్వాలి అన్నాడు వచ్చిన పండితుడు.
ముందు ప్రశ్నలు తెలపండి సమయం వ్యర్థం చేయకండి అన్నాడు రామకృష్ణ.
అప్పాజీగారు ఈవిగోనండి ప్రశ్నల కాగితము అందించాడు, పండితులు రామకృష్ణ తెలియపరచమని కాగితం అందించారు, చదువుతున్నప్పుడే శ్రీ కృష్ణ దేవరాయలు పలుకుతూ మీరు సావదానముగా కూర్చోండి కొద్ది నిముషాల్లో రామకృష్ణ కవి తెలియ పరుస్తారు అన్నాడు.
ప్ర:- షడూర్ములనగానేమి? ఏవి?
జ :- షడూర్ములు
ఆకలి, దప్పి - ప్రాణ ధర్మాలు,
శోకము, మోహము - మనో ధర్మాలు
జన్మము, మరణము - దేహ ధర్మాలు
ప్ర:- షడ్భావములనగానేమి?
జ:- షడ్భావములు,
అస్తి - గర్భమందుండుట, జాయతే - పుట్టుట, వర్ధతే - పెరుగుట, పరిణతే - వృద్ధి పొందుట, పక్షియ్యతే - కృషించుట, వినశ్యతే - నశించుట.
ప్ర:- దేహము యొక్క అవస్థలు తెలుపండి?
జ:- దేహత్రయములు: దేహత్రయము: స్థూల సూక్ష్మ కారణం.
స్థానత్రయం: నేత్రం, కంఠం, హృదయం, గుణత్రయం: రాజస, సాత్విక, తామస.
ఆత్మత్రయం: జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ.
దేవత్రయం: బ్రహ్మ, విష్ణు, రుద్రుడు.
అవస్థాత్రయం: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి.
అభిమానత్రయం: విశ్వుడు, తైజస, ప్రాజ్ఞ.
వర్ణత్రయం: రక్త వర్ణం, శ్వేతవర్ణం, నీలవర్ణం.
మాతృశాత్రయం: అకారము, ఉకారము, మకారము.
ఓంకారత్రయం: అకారం: బ్రహ్మ, పీతవర్ణం, నాదం.
ఉకారం: విష్ణువు, స్వేతవర్ణం, బిందు మకారం: శివుడు, నీల వర్ణం, కళ.
ఆత్మత్రయం: జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ.
వర్ణత్రయం: శ్వేత, నీల, రక్త.
వాసన త్రయం: దేహ, శాస్త్ర, లోక.
-పంచీకరణ విచారణతో దేహ వాసన పోవును.
- పరోక్ష జ్ఞానంచే, శాస్త్ర వాసన, అపరోక్షంచే లోకవాసనలు పోవును.
ప్ర:- అరిషట్వర్గములు అనగానేమి?
జ:- కామ, క్రోధ, లోబ, మోహ, మద, మత్సర్యములు.
ప్ర:- అష్టమదములు అనగానేమి?
జ:- కుల, ధన, యవ్వన, రాజ్య, చల, రూప, విద్య, తపోమదములు.
ప్ర:- తాపత్రయములు అనగానేమి?
జ:- ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆదిదైవిక.
ప్ర:- అంతఃకరణ చతుష్టయము అనగానేమి?
జ:- మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం.
ప్ర:- సప్తదాతువులు అనగానేమి?
జ:- రక్త, రుదిర, మాంస, మేదస్సు, అస్తి, మజ్జ, శుక్లం.
ప్ర:- యోగత్రయములనగానేమి?
జ:- సాంఖ్య, తారక, అమనస్క యోగములు.
ప్ర:- దశ విధనాదములు అనగానేమి?
జ:- జలది, భేరి, క్షిణి, మృదంగ, ఘంటా, కాహళ, కింకిణి, వేణు భ్రమర, ప్రణవనాదాలు. యోగికి సాధనలో 10 రకాల నాదాలు వినపడును. చివరికి గంటానాదం స్థిరంగా ఉండును.
ప్ర:- చిత్కలలు అనగానేమి?
జ:- దీప, మెరుపు, నక్షత్ర, చంద్ర, సూర్యకళలు, కళాతీతం, పరబ్రహ్మ.
ప్ర:- అష్టాంగ యోగం అనగానేమి?
జ:- యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహర, ధారణ, ధ్యాన, సమాధి.
ప్ర:- సప్తజ్ఞాన భూమికలు అనగానేమి?
జ:- శుబేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థ భావన, తురీయము, తుర్యాతీతం, పరబ్రహ్మం.
ప్ర:- సాధన చతుష్టయము అనగానేమి?
జ :- నిత్యా నిత్యవస్తు వివేకం ఇహ ముత్రార్థ పలభోగ విరాగం శమాది షట్క సంపత్తి శమదమ ఉపరతి తీతిక్ష శ్రద్ధ, సమాధానం, ముముక్షత్వం.
ప్ర:- పంచముద్రలు అనగానేమి?
జ:- పంచముద్రలు: కేచరి, భూచరి, శన్ముకి, శాంభవి, వక్రోలి.
ప్ర:- బందత్రయం అనగానేమి?
జ:-- మూల, ఉండ్యాన, జాలందర, మహాబంధనం.
ప్ర:- షట్ క్రియలు అనగానేమి?
జ:- జలనేతి, సూత్రనేతి, త్రాటకం, నౌళి, వస్తి, దౌతి.
ప్ర:- ప్రాణాయామాలు ఏవి?
జ:- భస్త్రిక, కపాలభాతి, బాహ్య, ఉజ్జాయిని, అనులోమ విలోమ, బ్రామరి, ఉద్గీత, ప్రణవ.
ఔషధానికి రోగి అర్హుడు. వేదాంత విచారణ సాధన వైరాగ్యపరులకే సాధన ఫలానిచ్చును.
జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అంటే --
ఆభరణంగా మిథ్య., బంగారంగా సత్యం., అని.
ప్రతికూల పరిస్థితుల నుండి కలిగేది వైరాగ్యం కాదు.,
అనుకూల పరిస్థితుల నడుమ కలిగేదే నిజమైన వైరాగ్యం.
కర్తృత్వ బుద్ధి ఉన్నంతకాలం ఆత్మానుభవం కలగడం అసంభవం.
సమాధానాలు విని నాకు శెలవు ఇస్తే మీ నగరం నుండి వెళ్ళిపోతాను, నన్ను క్షమించండి.
మహారాజా ఈ యన గొప్ప పండితుడు మంచి బహుమతి యిచ్చు పంపగలరు అన్న రామకృష్ణ మాటలకు మహారాజు బహుమతి అందించారు
******
తెనాలి రామకృష్ణ కథలు..( 31/3)
బ్రతుకు జీవుడా అని నేను చెట్టు దిగి ఇంటి ముఖం పట్టాను. ఇది ప్రభూ! నాకు జరిగిన అడవి జంతువులతో వింతైన అనుభవం" అని చెప్పి ముగించాడు రామలింగడు.
చెవులు రిక్కించి విన్న కవులు తెరలు తెరలుగా నవ్వారు. ఒకరిద్దరూ... పడిపడి నవ్వారు. రాయలు మాత్రం రామలింగడు ఏమనుకుంటాడోనని కనిపించకుండా నవ్వాడు. ఎలాగు తొలుత బయటపడ్డ అయ్యలరాజు రామభద్రుడు మళ్లీ తానే గొంతెత్తి "రామలింగా, అడవి జంతువుల భాష ఏ గురువు నుంచి నేర్చుకున్నావు. మాకు చెప్పరాదూ నీ వద్ద నక్కల భాష క్షుణ్ణంగా అభ్యసిస్తాం. లేదా నీ గురువు వద్ద నేర్చుకుంటాం. ఆయనెవరో చెప్పు. " అని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు మరోసారి అందరూ గొల్లున నవ్వారు. ఈసారి శ్రీకృష్ణదేవరాయలు కూడా బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వుల హోరయ్యాక "అయ్యల రాజ రామభధ్రా ! నక్కల భాష ని జంగా నేర్చుకుంటావా ? నీవేనా లేక ఇక్కడ కడివెడు నవ్వులు పాలుపంచుకున్న మన కవితిలకాలూ కూడానా "అని అడిగాడు రామలింగడు.
కవులందరూ రామలింగడిని మరింత ఇరుకున పెట్టాలి అని ఏక కంఠంతో "నేర్చుకుంటాం” అన్నారు. రాయలూ అనేవాడేమో కానీ రామలింగడు ఈసరికే ఒంటరి అయిపోయాడు. అని మౌనం వహించాడు.
"మిత్రులారా! నేను గురువుగా పనికిరాను. కారణం నన్ను గేలి చేస్తున్న శిష్యులు మీరు. నా వద్ద విద్య మీకు అబ్బదు. గురువు అంటే భయం, భక్తి, గౌరవం ఉండాలి. శిష్యులుగా శుంఠలు పనికిరారు. ఈ జంతు విద్య నేర్చుకోవాలన్న ఆశ మీకు బలంగా ఉంటే అదిగో మన ధర్మప్రభువులు రాయలువారి వద్ద చేతులు కట్టుకుని అభ్యసించండి. ఆయనకు ఎలుగుబంటి భాష వచ్చు, కనుకనే జాంబవంతునిలో పరకాయప్రవేశం చేసి మరోవైపు ఎలుగు భాషను తెలుసుకున్నందున రచించారు జాంబవతీకళ్యాణం. కనుక ఆయన వద్ద నేర్చుకున్నాక, అప్పటికి ఓపిక, మరిన్ని జంతుభాషలు నేర్చుకునే కోరిక బలీయంగా ఉంటే మీలో ఇప్పుడున్న శుంఠతనంపోతే నా వద్ద నక్క, సింహం భాషలు తప్పక నేర్పగలను" అని నిశ్శబ్దంగా మారిపోయిన ఆ మందిరంలో కంచుగంట లాంటి గొంతుతో వ్యంగ్యంగా ఏ మాత్రం సంకోచించకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు రామలింగకవి.
ఒక్కసారి అందరి ముఖాలు వివర్ణమయ్యా యి. ఎవరికి వారే ఏమిటింత సాహసం, రాయలవారినే తప్పుపట్టే ప్రయత్నం చేసేది, ఈ వెర్రి మొర్రి బాపడా ? కొంపదీసి ఈతడు అమావాశ్యకు పిచ్చిపట్టే రకం కాదుకదా! అని పరిపరి విధాలుగా ఆలోచించారు. భయంతో చూసారంతా.
అప్పటికే అక్కడికి విచ్చేసిన తాతా
చార్యులు వారు నొచ్చుకుని “ఏయ్ రామ లింగా నీకేమైనా మతిచాందసం ఉందా ? రాయల వార్ని చిన్నబుచ్చుతావా ? ఇక్కడ కొలువు తీరిన ప్రభువుకి, మిగిలిన కవులందరికి, క్షమాపణలు కోరుకుని తక్షణం ఈ నగరం విడిచి పో ! " అని ఉగ్రుడైపోయాడు.
“మన్నించండి తాతాచార్యులుగారూ ! నేనే అపరాధం చేయలేదే.. ఎలుగులభాష తనకు వచ్చని మన ప్రభువులవారే
సెలవిచ్చారు. అందుకు ఇక్కడ కవులు అందరూ చెక్కభజన చేసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఎంతటి వారికైనా పొగడ్త ఎనలేని సంతోషాన్నిస్తుంది. మన ఏలిక ఆ దిశలో ఆనందపడ్తున్నారు. నేను రాయలవారి శ్రేయస్సు కోరేవాడిని తప్ప ఇచ్చకాల వాడిని కాను. కనుకనే యదార్థవాదాన్ని వినిపించాను. యధారాజా! తదా ప్రజా !! కాకూడదు. అని కోరుకునేవాడిని." అని తను చెప్పాల్సింది చెప్పి లేచి నిలబడి..
"ప్రభూ నా మాటలు బాధించినట్లయితే నన్ను మన్నించండి.” అని చేతులు జోడించాడు.
రాయలు తీక్షణంగా రామలింగని వైపు చూసాడు. అంతా ఇక రామలింగడి పని అయిపోయినట్లే ! ఈ పిల్లకవి బతకడం కష్టం అని ఎవరికివారే అనుకున్నారు, కానీ దూర్జటి మాత్రం లోలోపల ఆనందించాడు. భలేగా రాయలకు గడ్డిపెట్టాడు. చక్రవర్తి నన్న అహంతో తనకు ఎలుగు భాష వచ్చని పేలడం అందుకు తామంతా దిక్కులు పిక్కటిల్లేలా వంతపాడడం. బయటపడలేక తల అమ్ముకునే బతుకు అనుభవిస్తున్నాం. ధైర్యం అంటే ఈ రామలింగడిదేనని కవులందరూ రాయల వైపే చూసారు. ఎలాంటి శిక్ష వేస్తాడోనని ఊపిరిబిగబట్టారు. బహుశా ఇక మరణదండన అని అనుకున్నారు.
రాయలు లేచి రామలింగని వద్దకు వెళ్లి...
“నీవు ధైర్యంగా నన్ను వేలెత్తి చూపావు. నిజమే ఈరోజు నేను శృతిమించాను. ఆ కావ్యం రాసానన్న ఆనందంలో ఏమేమో అనేస్తూ నోరు జారాను. చక్రవర్తి తప్పును దిద్దే సాహసం ఎవరూ చేయసాహసించ లేరు. అది నీవు అవలీలగా చేసావు. భయపడకుండా నీ వాదన వినిపించావు. జంతు భాషను నా వద్ద నేర్చుకోవాలా? గురుభక్తి లేనివారా వీరంతా ? పైగా శుంఠలా? ములుకుల్లాంటి నీ చమత్కార పలుకులు నా మనస్సున తొలుత కోపాన్ని పెంచినా తర్వాత ఆనందాన్ని నింపాయి" అని అభినందించాడు.
అంతా నిండుగా నవ్వుకున్నారు. అలసాని పెద్దన “రామలింగా, ఎక్కడ రాజాగ్రహానికి గురవుతావోనని భయపడ్డాను.” అని గాఢంగా కౌగిలించుకున్నాడు.
“క్షమించండి రామలింగకవి, నేను తొలుత బాధ కలిగించేట్టు ఏమెమో అనేసాను " అని అయ్యలరాజు రామభద్రుడు చేతులు పట్టుకున్నాడు. రామలింగడు నవ్వుతూ అందరికీ నమస్కారం చేసి సభ నుండి ఇంటికి బయలుదేరాడు.
*సశేషం*
*******
తెనాలి రామకృష్ణ కథలు.. (31/2)
మిత్రమా రామభద్రా! నీవు తప్పక వినాల్సిందే. మిగిలినవారు కూడా. నేను ఇరవైఏండ్ల ప్రాయమప్పుడు ఏదో పనిపడి, ఓ అడవి మార్గం లోంచి వెళ్తుండగా తోవలో నిద్రపోతున్న నక్కను చూసుకోకుండా దాని తోక మట్టేసాను. అది కుయ్యో మొర్రో అని అరిచి పక్క పొదలో దూరింది. అక్కడ ఓ పెద్ద ఎలుగుబంటి ఉంది, దాన్ని చూడగానే నా ప్రాణాలు విలవిలలాడాయి. అంతలో దొంగలగుంపు వచ్చి నన్ను ఎగాదిగా చూసి "ఓయి బాపడా, నీకు మంత్రాలు వచ్చు కదా. పదా మా నాయకుడికి పెళ్లి
చేయాలి.” అని నన్ను ఈడ్చుకువెళ్లారు. భయంతో వెళ్లాను. దొంగల పెళ్లిలానే జరిపించాను. వాళ్లు దోచుకువచ్చిన వాటిల్లో నాకూ దండిగా ధనకనక వస్తువులు ఇచ్చారు. తిరిగి నన్ను ఎక్కడ్నించి తీసుకువెళ్లారో అక్కడే వదిలేసారు.
పొద వద్ద ఆ నక్క ఎలుగుబంటి ఉన్నాయి. అవి నన్ను గుర్రుగా చూస్తున్నాయి. అప్పుడు నక్క అంది "ఏయ్ బాపడా.. నువ్వు నా తోక మట్టి చాలా ధనం మూటకట్టుకు వచ్చావు. చూసావా నా తోక మహిమ." అని అపురూపంగా తోకను ముద్దులాడుకుంది.
నక్క మాటలు విన్న ఎలుగుబంటి "రేయ్ నక్క అల్లుడూ, ఒకసారి నేను నీ అదృష్టాల తోకను మడతానురా కాదనకురా, ఎప్పట్నించో ఈ అడవికి రాజును కావాలని ఆశ పడ్తున్నాను.” అని ప్రాధేయపడింది. ఇదేదో చూడాల్సిందేనని నక్క సరేనంది. ఎలుగుబంటి నక్కతోక బలంగా మట్టేసింది. అంతే దిక్కులు పిక్కటిల్లేలా అరిచిందా నక్క. అపుడే అడవి అదిరేలా మృగరాజు సింహం గర్జన వినిపించింది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. పక్కనున్న చెట్టు ఎక్కాను, నక్క పొదల్లో దూరింది. ఎలుగుబంటి మాత్రం బిక్కచచ్చి పోయి చేష్టలుడిగిపోయినిలబడిపోయింది.
రానే వచ్చింది సింహం. "నన్ను రక్షించుము లేని ఆశలకుపోయితిని. ఈ అడవిని ఏలుదామని కోరికతో స్వామి ద్రోహినయి తిని. మన్నించు. నక్క తోక మాత్రమే మట్టితిని తప్ప ఇతరత్రా ఎలాంటి కుట్రను చేయలేదు."అని ప్రాధేయపడిందా ఎలుగుబంటి.
"ఎలుగుబంటి మాఁవా, నేను వచ్చింది నీ సాయం కోరడానికి, నీవన్నట్టు నీవు మట్టిన నక్క తోక మహిమో ఏమో నాకు తెలియదు. ఈ క్షణం నుండి నీవు ఈ కాకులు దూరని కారడవికి కొన్నాళ్లు రాజువు. నేను నా సుపుత్రుని పెళ్లి పని మీద పొరుగు అడవికి వెళ్తున్నాను." అని కిరీటం ఎలుగుబంటి నెత్తి పై పెట్టి వెళ్లిపో యింది. ఎలుగుబంటి చిరకాల కోరిక తీరినందుకు మహా ఆనందించింది. పొదలో నక్కి దాక్కున్న నక్క బయటికి వచ్చి “ఏమిటీ విడ్డూరం.. నా తోక తొక్కిన ఆ వెర్రి బాపడికి ధనం. రేపోమాపో కాటికి పోయే ఎలుగుబంటికి కిరీటం దక్కాయి. నాకేటి లేదా ?నాతోక పచ్చి పుండు కావడమేనా ? ఇంక ఎవరికి నా తోక దొరకనీయను.” అని ఓ పెద్ద ఎలుక బొరియలోకి తోక పెట్టుకుని శోకాలు తీయసాగింది.
పాపం నక్క దురదృష్టం ఆ బొరియలో ఆకలి గొన్న పందికొక్కు అందమైన నక్క తోకను మొదల్లో పుటుక్కున కొరికేసి ఆరగించేసింది. “చచ్చాను దేవుడోయ్.. పాడు పందికొక్కు నా తోకను తినేసింది " అంటూ నేలపై గింగరాలు కొట్టి ఏడ్చింది నక్క.
అడవికి కొత్తరాజు ఎలుగుబంటి నవ్వి “చచ్చిన పీనుగులను తిని బతికే నీలాంటి వాడికి ఆ దేవుడు అదృష్టమైన తోక ఇచ్చాడు. పరోపకారం లేశమైనా లేని నీకు తగిన శాస్త్రి జరిగింది. నాకు ఈ అడవిలో మరి కనిపించ కు, నా మాట ధిక్కరించావో నీ ప్రాణాలు తీయంది వదలను. ఇది రాజాజ్ఞ" అని హెచ్చరించి పొమ్మంది ఎలుగుబంటి. నక్క బిక్కచచ్చిపోయింది. వేదాంతిలా నవ్వుకుంది.
"ఎలుగుబంటి మావా, నా తోక దయా లబ్దంతో రాజువయి తొలిసారిగా నాకే శిక్ష విధించావా, కలియుగం కదా యుగధర్మం " అని తోకలేని నడుంతో భారంగా నడుచుకుంటూ వెళ్లిపోగా, మరోవైపు ఎలుగుబంటి రాజదర్పంతో కాకు లు దూరని కారడివిలోకి వెళ్లిపోయింది.
ఈ కధ ఇంకా వుంది
******
*తెనాలి రామకృష్ణ -కథలు ( 31/1)
*నక్క తోక మహిమ
ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు చాలా ఉల్లాసంగా ఉన్నవేళ కవులందరిని పిలిపించుకుని భువనవిజయం మందిరంలో సరదాగా గడపసాగాడు. తాను ఇటీవల రచించిన జాంబవతీ కళ్యాణం కావ్యం గురించి ప్రస్తావించాడు. ఈ కావ్యంలో తను జాంబవంతునిలో పరకాయ ప్రవేశం చేసి మరీ రచించాను అని ఒకవిధంగా గొప్పలకుపోయాడు. కవులందరూ ఉల్లాసభరితంగా వింటూ తెగ ఆనందపడిపోసాగారు. వారిని చూసి మరింతగా రాయలువారు ఎక్కువ మోతాదులో చెప్పుకుపోతుంటే... రామ లింగకవి చిరునవ్వు మోముతో వినసాగాడు. ఆ కావ్యం గురించి కవుల నుంచి పొగడ్తలు శృతిమించాయి. ఒక విధంగా ఆకాసానికి ఎత్తేసారు.
“నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆ కావ్యం. జాంబవంతుడు అడవిలో సంచరించే ఓ ఎలుగుబంటి. మానవభాష నేర్చుకున్న మహాజ్ఞాని, రామభక్తుడు. అతడికి మానుష్య రూపంలో గల ఓ అందాల అపరంజి బొమ్మ లాంటి కూతురు జాంబవతి. ఆమెకు ద్వారకాపురివాసి శ్రీకృష్ణుడుతో వివాహం జరిపించి ధన్యుడవుతాడు జాంబవంతుడు. ఈ కధనంలో జాంబవంతుడు మానవభాష నేర్చుకున్నట్టు నేను ఎలుగుభాషను తెలుసుకుని మరీ రాసాను.” అని రాయలు సంతృప్తిగా నవ్వుతూ చెప్పి కొత్తగా వచ్చిన రామలింగని వైపు చూసాడు. అతడు ఎలాంటి భావాలను వ్యక్తం చేయకుండా, తన ముఖంలో కనిపించనీయకుండా
మౌనముద్రతో వింటుంటే చూసి ఆశ్చర్యపోయాడు.
"రామలింగా, ఏమిటా పరధ్యానం ? నా కావ్యం పట్ల మీకేమైనా విముఖత ఉందా ? మరి, అందరిలా విని ఆనందించలేదు. కనీసం తప్పేమి చూపలేదు. సరికదా ఇక్కడ ఉన్నట్టు లేరు, పరధ్యానంగా ఉన్నారు.” అన్నాడు.
"ప్రభూ ! మీ జాంబవతీ కళ్యాణం గురించి చెప్తుంటే జిత్తులమారి నక్కతో సంభాషణ గుర్తుకువచ్చింది. ఆ కధ తమరు తప్పక వినాల్సిందే"నన్నాడు.
కవులు అదోలా చూసారు. అలసాని పెద్దన, దూర్జటి, నంది తిమ్మన, రామరా జభూషణుడు ఆ మాటలకు పెదాలు విరిచారు. అయ్యల రాజు రామభద్రుడు మాత్రం “ఇదేమి వైపరీత్యం రామలింగా, మమ్మల్ని ఏ విధంగా నువు పశువుల కొట్టంలో ఒకేరాటకు కట్టివేస్తున్నావు. లేకుంటే నక్కలతో నీవు సంభాషించావా ? చాలు చాలు ఆపవయ్యా” అని పెద్ద గొంతుతో అడ్డుపడ్డాడు.
“ ప్రభూ నేను చెప్పేది వినాలని ప్రార్ధిస్తున్నా ను. తొలిసారి ఈ పవిత్రమైన భువన విజయం లోకి అడుగుపెట్టిన నాకు మాట్లాడేందుకు, నా గురించి మీకు చెప్పుకోవడానికి ఇది తొలి అవకాశం" అని ప్రాధేయపడ్డాడు.
“సరే చెప్పు రామలింగా, మాకు కుతూహలంగా ఉంది. నీవు నక్కలతో సంభాషించావా ? నమ్మశక్యంగానిదిగా ఉందే. అందుకే మన అయ్యలరాజు రామ భద్రుడు వినడానికే ససేమిరా అని బయట పడ్డాడు. మిగిలినవారు చూస్తున్నావుగా పెదాలు విరిచారు." అసహనంగా నవ్వుతూ రాయలు రామలింగానికి చెప్పేందుకు అవకాశం ఇచ్చాడు. రామలింగడు లేచి నిలుచుని వినమ్రంగా నమస్కరించా డు.
ఈ కధ ఇంకా వుంది
*****
తెనాలి రామకృష్ణ కథలు.. (30)
కష్ట సుఖములు దినమునకు ఉండే రాత్రింబవళ్లు వంటివి. చీకటి పోతేనే వెలుగు చూడగలం. వెలుగు పోయాక మళ్ళీ చీకటి వస్తుంది. అలానే కష్ట సుఖములు వస్తుంటాయి, పోతుంటాయి. రెండింటిలో ఏ ఒక్కటీ అలా ఉండిపోవు! బుద్ధిమంతుడు అయినవాడు వీటిని పట్టించుకోకూడదు. ' కష్టమో, సుఖమో , లాభమో, నష్టమో అంతా భగవంతుడు దయ ' అంటూ భారమును భగవంతునిపై పడవేసి తన పని తను చేసుకుపోవాలి. తుఫాన్ వచ్చే ముందు అల్లకల్లోలంగా ఉంటుందని బాధ పడకూడదు. తుఫాన్ తగ్గినాక అందమైన ఇంద్రధనుస్సు కనిపిస్తుందని సంతోషించాలి. కష్టంలో సుఖమును, నష్టములో లాభమును, బాధలో ఉపశమనమును వెతుక్కున్ననాడు మనల్ని ఏ కష్ట నష్టములు ఏమి చేయలేవు.
"డబ్బుతో కొనే వస్తువు కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వాటిని పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు."
"నాలుకను అదుపులో పెట్టుకుంటే సర్వం అదుపులో ఉంటుంది.మాట తీరు భద్రం లేకపోతే బతుకు ఛిద్రం మౌతుంది.
గతించినదానిని స్మరించ కుండుట, రాబోవుదానిని గూర్చి ఆలోచించక పోవుట, ప్రాప్తమైన దానియందు ఉదాసీనత అనునవి జీవన్ముక్తుని లక్షణములు*."
"అవకాశం ఆకాశం నుండి రాదు అరచేతి గీతల్లో ఉండదు.
అలసిపోని గుండెలో ఉంటుంది. అంతులేని పట్టుదలలో ఉంటుంది."
"వీచే పరిమళాన్ని బట్టి మనకు పూలపై ఇష్టం ఏర్పడినట్లు
మాట్లాడే మాటల బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది.
ఎగసిన కెరటం తిరిగి సముద్రంలో అణగినట్లు-- నిద్రలో, మరణంలో "నేను" (ఆత్మ) దైవములో (పరమాత్మలో) అణగుతుంది.
అంతేగాని "నేను" (ఆత్మ) లేకపోవడం అంటూ ఏమీ లేదు.
___
జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని దైవ ప్రసాదంగా స్వీకరించు.
******
తెనాలి రామకృష్ణ కథలు.. 29
రామకృష్ణ చింతించే అలవాటుమానుకోవాలంటే ఏంచేయాలి?
*నమ్మ కముచెంత నానుడి నటన యేల
చెమ్మ కార్చు మాటలు యేల చెలిమినందు
సమ్మతి కళలు చాలుగా సహనముంచు
నెమ్మదిమనసుయేకము నీడలగును
జీవితంలో బలమ్ముగా జీవ యాత్ర
సాగ చింతన వదలాలి సానుకూల
మైన దృష్టిని పెట్టిపురోగతి గను
దిశలలో ప్రవహించుట దివ్య మౌను
*జీవితంలో ఆధ్యాత్మిక బలం పెరగాలంటే, చింతించే అలవాటును వదులు కోవాలి. ఇది మనల్ని ఉద్విగ్నంగా మరియు దయనీయంగా భావించడం తప్ప వేరే ప్రయోజనాన్ని అందించదు. మన నియంత్రణకు మించిన విషయాల గురించి చింతించడం మానేసి, ఆశావాద మరియు దయ గల ఆలోచనలను రూపొందించడంపై దృష్టి పెట్టినప్పుడు, మన జీవితం మరింత సానుకూల దిశలలో ప్రవహించడం ప్రారంభమవుతుంది. జీవితం పట్ల అలాంటి తేలికైన మరియు సులభమైన విధానం, ప్రతిదాన్ని మన పురోగతిలో సహాయపడేలా చేస్తుంది.*
పనులు చేయకుండ ప్రారబ్ద మనుకుంటు,
జాతకమును నమ్మి జపము చేయ
జేబు నిండదు, మరి జీవంబు గడువగ
చేయవలెను పనులు చెలిమి తోను,
కాలమన్న గతియు గమ్య మార్గముగాను,
కళలు కల్ల లవక కాల మందు,
చేయు దాన ధర్మ చింత మాపియు శాంతి,
కలుగ గలుగు నిత్య కాంతి నిలుచు
వలదు వలదు నన్న వలపుకు చిక్కుటే
కళలు జూప మనసు కాల గతిగ
చెలిమి నీడ చేర చేరువ కథలుగా
బలిమి కలిమి బలుపు బంధ తీరు
*ఆనందమనెడి జలముతో నిండిన,పరమేశ్వర చరణకమలములనెడి పాదునుండి బయలువెడలి భక్తియనెడి తీగ,స్థైర్యమనెడి పట్టుకొమ్మకెగబాకి శాఖోపశాఖలుగా ప్రసరించి నా మనస్సనెడి ఎత్తైన పందిరినెక్కి నలుదిశల నాక్రమించినది. సత్కార్మానుష్ఠానములనెడి ఉర్వరకము(ఎరువు)ల ప్రభావమున దట్టముగా నిష్కల్మషముగావర్ధిల్లిన ఆ లత నాకు ప్రీతికరమైన శాశ్వతఫలము నొసగుగాక.*
******
రామకృష్ణ కథలు.. (28)
రామకృష్ణ అమ్మవారికి పూజచేస్తావు, ఆమె కృపాకటాక్షలతో జీవిస్తావు, నవదుర్గలు గురించి వివరించు ఇక్కడఉన్న భక్తులకు
అటులనే
నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-
1. శైలపుత్రి:- ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే ''శైలపుత్రి''.
2. బ్రహ్మచారిణి:- నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో), మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.
3. చంద్రఘంట:- ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి 'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే "చంద్రఘంట".
4. కూష్మాండ:- విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే "కూష్మాండ".
5. స్కంద మాత:- సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత".
6. కాత్యాయని:- తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో గుణాలకు) అతీతంగా సాధన చేయాలి అని తెలియజేసేదే "కాత్యాయని".
7. కాళరాత్రి:- ప్రతి అంతం... ఒక నవ ఆరంభానికి సంకేతం అని తెలియజేసేదే "కాళరాత్రి".
8. మహాగౌరీ:- మన ఆత్మ సాధన (ధ్యానం) మహా పాపాలను కూడా హరిస్తుంది అని తెలియజేసేదే "మహాగౌరీ".
9. సిద్దిధాత్రి:- ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగచేయును అని తెలియజేసే తత్వమే "సిద్ధిధాత్రి".
******
తెనాలి రామకృష్ణ కథలు (27)
*రామకృష్ణ జీవితంలో అమృత ఫలాలు యేవి, వాటి గురించి వివరించగలవు అన్న శ్రీ కృష్ణ దేవరాయల అజ్ఞమేరకు తనకు తెలిసిన విషయాలు తెలియారిచాడు రామకృష్ణ*
*అమృత ఫలాలు*
*జీవితమనే వృక్షానికి రెండే అమృత ఫలాలు. అవి- మంచి వ్యక్తులతో సహవాసం, మేలిమి గ్రంథాలు చదవడం. జ్ఞానంతో పాటు చక్కటి గుణాలు, మంచి మనసు కలిగినవారిని సజ్జనులు అంటారు. వారు చెడ్డవారి మధ్య ఉన్నా తమ సొంత గుణాన్ని వదులుకోరు. వారి సాన్నిహిత్యంలో భయానికి చోటుండదు. స్వార్థంతో కూడిన ఆలోచనలు దూరమవుతాయి. మనసులోని ఉద్రేకాలు తగ్గి ప్రశాంతత నెలకొంటుంది. వారి సహవాసం బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది. మనసులోని చెడు ఆలోచనలను తొలగిస్తుంది. సత్యం గొప్పదనం తెలిసివస్తుంది. గంగానది పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం పేదరికాన్ని పోగొడతాయని పెద్దలు చెబుతారు. మంచి వ్యక్తుల ఆశ్రయం, వారి దర్శనం కూడా ఆ మూడింటినీ లభింపజేస్తాయి.*
*మంచి మనుషుల సహవాసం మనసు నిశ్చలంగా ఉండేలా చేస్తుంది. దానివల్ల అనవసర ఆరాటాలు దూరమవుతాయి. అంతిమంగా అది ముక్తిపథానికి కారణమవుతుందన్నారు ఆదిశంకరులు. అందుకే మంచి వ్యక్తుల సాంగత్యాన్ని మోక్షద్వారాల్లో ఒకటిగా అభివర్ణిస్తారు*.
*బుద్ధిమంతులు మంచి పుస్తకాలు చదువుతూ, విజ్ఞులతో చర్చిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మూర్ఖులు వ్యసనాలు, అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేసుకుంటారు అంటుంది సుభాషితం*
*జీవితంలో ఉన్నతస్థితికి చేరడానికి తోడ్పడేవారిని ఆశ్రయించాలి. అలాంటివారిని అనుసరించాలి. ఏ శాస్త్రాలు బుద్ధిని వికసింపజేస్తాయో వాటిని మరీ మరీ చదవాలి. వాటిలోని జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించాలి. ఈ రెండింటినీ సరిగ్గా వినియోగించుకున్నవారు జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడంతో పాటు బతుకును అర్థవంతం చేసుకోగలుగుతారు.*
*అదే.. అదే అన్నారు అందరు*.
*****
తెనాలి రామకృష్ణ కథలు (26)
మహా రాజా పురోహితుని అవమానించకండి, మంచి చెడులు గమనించి నిజమైన ద్రోహి అయితే శిక్షించండి
పురోహితుడు అంటే ఎవరనుకున్నారు అంటూ తెనాలి రామకృష్ణ తెలియపరిచాడు
***
శ్లో:జన్మనా బ్రాహ్మణోజ్ఞ్యేయః
సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹
విద్యయా యాతి విప్రత్వం
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹
పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు, విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును...
*ముందుగా హితము పలికెడివాడు
*ధర్మార్థ కామమోక్షములకు సోపానము
పూజనీయుడు
*సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు
*నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
*ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
:*హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
*సాదారణమైన పేరు వశిష్ఠుడు
*మానసిక వ్యాధిని ఛేదించె శాస్త్రజ్నుడు
*ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె ధర్మదాత, ధైర్యావంతుడు వాక్ చతుర్యముతో రాజ్యాలను నడిపించినవాడు,
*సందేహ నివృత్తికి ఒక నిఘంటువు,
*తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక,
*భగవంతునికి భక్తునికి మద్య పూజ్యనీయుడు
*భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక,
*శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి,
*నిత్య కాల గణన చేయు గణిత వేత్త
*గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
పురోహితుడు :పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి
(జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించుమని ప్రోత్సహించువాడు)
:ధర్మ శాస్త్ర ప్రియుడు..
పురోహితము
పు ,అనగా పురజనులందరికి
రో ,అనగా రోజురోజుకి
హి ,అనగా హితముచెప్పుచు
త ,అనగా తరింపజేసి
ము ,అనగా ముదముగూర్చునదనుడు
అప్పుడే ఒక సైనికుడు ఇద్దరిని ప్రవేశపెట్టాడు
అసలు నేరస్తులు వీరు, దేవాలయసొమ్మును దొంగలించి పురోహితునిపై అపవాదు మోపారు మీరే విచారించాలి అన్నారు.
నేరం మీరుచేశారా అని అడిగారు మహారాజుగారు
చేసామని ఒప్పుకున్నారు
ఓ పురోహిత నీవు నిరావురాధివి. రామకృష్ణ వీరికి ఏశిక్ష వెయ్యాలో తమరే చెప్పండి
మీలో క్షమించే గుణముంది కనుక వారు తస్కరించిన సొమ్ము కట్టించుకొని మొదటి తప్పుగా వదిలేయండి అన్నాడు
అందరూ మెచ్చుకున్నారు రామకృష్ణ మాటలు
*****
రామకృష్ణ కథలు... (25)
సభలో చర్చ జరుగు తున్నది
ఒకరు ప్రశ్నలు వేస్తుంటే మరొకరు సమాదానాలి చెప్పాలి
రామకృష్ణ కు ప్రపంచంలో సుఖం ఎరుగనివారు ఎవరైనా ఉన్నారా?*ఉంటే వారెవరు?
రామకృష్ణ పలుకుతూ అంటే ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు"అంటారు వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*
*1. ఈర్ష్యాళువు*
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.
*2. జుగుప్సావంతుడు*
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది.
*3. నిస్సంతోషి*
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖమెక్కడ
*4. క్రోధనుడు*
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ
*5. నిత్యశంకితుడు*
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది సుఖం.
*6. పరభాగ్యోపజీవి*
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పుడు ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా.
ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.
అప్పుడే శ్రీ కృష్ణ దేవరాయలు చక్కగా వివరించావు అంటూ బహుమతి అందించారు.
*****
తెనాలి రామకృష్ణ కథలు.. (24)
రామకృష్ణ నగరంలో వివాహ_హంతకులు గా మారటాని జనుల భావాలు అందరికీ తెలియపరచగలవు
సోమరితనం, అనుమానం, నమ్మకం లేకపోవడం, పరస్పర గౌరవం లేకపోవడం,క్షమించకపోవడం, ద్వేషం, ద్వేషం మరియు కోపం వివాహాన్ని చంపుతాయి.
అనవసరమైన వాదనలు పెరగడం, జీవిత భాగస్వామి నుండి రహస్యాలు దాచడం,
అవిశ్వాసం (ఆర్థిక, భావోద్వేగ, మానసిక, భౌతిక, మొదలైనవి) వివాహాన్ని చంపుతుంది.
పేలవమైన సంభాషణ,అబద్ధాలు,
ప్రతి అంశంలోనూ మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా లేకపోవడం .
మీ జీవిత భాగస్వామి కంటే తల్లిదండ్రులు/కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వివాహాన్ని చంపుతుంది.
ఆనందించలేని సాన్నిహిత్యం లేకపోవడం, వేధించడం, అతిగా మాట్లాడటం మరియు అజాగ్రత్తగా మాట్లాడటం
మీ జీవిత భాగస్వామితో తక్కువ సమయం గడపడం వివాహాన్ని చంపుతుంది
చాలా స్వతంత్రంగా ఉండటం,
పార్టీలు, డబ్బు, హఠాత్తుగా కొనడం మరియు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ప్రేమ పట్ల ఆకర్షణ లేకపోవడం,
మీ జీవిత భాగస్వామి యొక్క లోపాలను మీ తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు బహిర్గతం చేయడం
ఆధ్యాత్మిక పద్ధతులను నిర్లక్ష్యం చేయడం మరియు కలిసి ప్రార్థన చేయకపోవడం వివాహాన్ని మాత్రమే కాకుండా మీ జీవితాన్ని కూడా చంపుతుంది.
దిద్దుబాటు మరియు మందలింపును తిరస్కరించడం,
ఎల్లప్పుడూ విచారకరమైన ముఖం ధరించడం మరియు మూడీగా ఉండటం, తీవ్రమైన స్త్రీవాద వాదనవ్వడం, పురుషాధిక్యత చూపడం
అదుపులేని కోపం మరియు కోపం వివాహాన్ని చంపుతాయి.
దేవుడు స్థాపించిన వివాహంలో మీ పాత్ర మరియు బాధ్యతను అర్థం చేసుకోకపోవడం,
మీ జీవిత భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక, భావోద్వేగ మరియు శారీరక అవసరాలను, సంపదలను విస్మరించడం, నపున్శకత్వం, భయము
జీవిత భాగస్వామి భద్రతకు ముప్పు వాటిల్లడం వివాహంపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
దేవుని వాక్యం గురించి జ్ఞానం లేకపోవడం మరియు దానికి విధేయత లేకపోవడం వివాహాన్ని చంపుతుంది.
ఇలా ఇలా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ఉడటం వల్ల వివాహం చేసుకోరు.
*****
రామకృష్ణ కధలు (23 )
రామకృష్ణ అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారో తెలియపరుచు అన్నాడు శ్రీ కృష్ణ దేవరాయలు
‘అన్నాద్భవంతి భూతాని’ అంటుంది భగవద్గీత. సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం. ఇదే విషయాన్ని ‘ఆత్మనః ఆకాశః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఔషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః’ అంటుంది తైత్తరీయోపనిషత్తు. అన్నిటికీ మూలమైన ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి పృథివీ, నేల నుంచి ఔషధాలు, వాటినుంచి అన్నం, దాన్నుంచి ప్రాణులు- ఇదీ క్రమం. ఈ గొలుసును (శృంఖల) పట్టుకుని వెనక్కి వెళ్తే దానికి మూలమైన ఆత్మ, ఆత్మకు మూలమైన పరమాత్మ కనిపిస్తాయి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. శరీరంలోని ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన రూపాల్లో ఉండే పంచప్రాణాలకు పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరమాత్మ తత్వమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ధర్మసాధనకు అత్యవసరమైంది శరీరం. దేహమే కాదు ఈ సృష్టి అంతా ధర్మసాధన నిమిత్తమే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశ సమన్వితమైన శరీరంలో అన్నమయకోశానికి మొదటి స్థానం ఇవ్వటం ఆహార ప్రాధాన్యతనే తెలియజేస్తుంది. అన్నపూర్ణ ఆత్మసఖుణ్ణి ఆదిభిక్షువుగాచేసి అన్నాన్ని అందించడం వెనుక ఆంతర్యమూ ఇదే. మనుగడకు మూలాధారమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని విడదీసి చూడలేం.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
అంటూ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుంది భగవద్గీత. శక్తిని ప్రసాదించే ఈ ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తూ, ప్రశాంత వాతావరణంలో, శుచిగా, మౌనంగా, ఆకులో లేదా బంగారు, వెండి లాంటి ఉత్తమ లోహ పాత్రల్లో తీసుకున్నప్పుడు అది ప్రసాదమౌతుంది. భోజనానికి ముందు శాస్త్రం తెలిసినవారు మంత్రయుక్తంగా ఆచమనం చేసి, ఆ పరిజ్ఞానం లేనివారు భగవంతుని స్మరిస్తూ కొన్ని నీళ్లు తాగి, అప్పుడు తినడం మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
అన్నమంటే ఔషధమే. మనిషి రుతు చర్యను పాటించాలి. అంటే ఆయా రుతువుల్లో, ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని, శరీరతత్వాల అనుకూలతను బట్టి తినాలి. ఆహార, జల, విహారాదుల్ని పాటించని ప్రాణిలో వాతపిత్తకఫాలనే త్రిదోషాలు విజృంభించి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లాంటి అవయవాలు దెబ్బతిని ప్రాణం దేహాన్ని వదిలి వెళ్లిపోతుంది.
*****
తెనాలి రామకృష్ణ కథలు.. (24)
రామకృష్ణ నగరంలో వివాహ_హంతకులు గా మారటాని జనుల భావాలు అందరికీ తెలియపరచగలవు
సోమరితనం, అనుమానం, నమ్మకం లేకపోవడం, పరస్పర గౌరవం లేకపోవడం,క్షమించకపోవడం, ద్వేషం, ద్వేషం మరియు కోపం వివాహాన్ని చంపుతాయి.
అనవసరమైన వాదనలు పెరగడం, జీవిత భాగస్వామి నుండి రహస్యాలు దాచడం,
అవిశ్వాసం (ఆర్థిక, భావోద్వేగ, మానసిక, భౌతిక, మొదలైనవి) వివాహాన్ని చంపుతుంది.
పేలవమైన సంభాషణ,అబద్ధాలు,
ప్రతి అంశంలోనూ మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా లేకపోవడం .
మీ జీవిత భాగస్వామి కంటే తల్లిదండ్రులు/కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వివాహాన్ని చంపుతుంది.
ఆనందించలేని సాన్నిహిత్యం లేకపోవడం, వేధించడం, అతిగా మాట్లాడటం మరియు అజాగ్రత్తగా మాట్లాడటం
మీ జీవిత భాగస్వామితో తక్కువ సమయం గడపడం వివాహాన్ని చంపుతుంది
చాలా స్వతంత్రంగా ఉండటం,
పార్టీలు, డబ్బు, హఠాత్తుగా కొనడం మరియు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ప్రేమ పట్ల ఆకర్షణ లేకపోవడం,
మీ జీవిత భాగస్వామి యొక్క లోపాలను మీ తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు బహిర్గతం చేయడం
ఆధ్యాత్మిక పద్ధతులను నిర్లక్ష్యం చేయడం మరియు కలిసి ప్రార్థన చేయకపోవడం వివాహాన్ని మాత్రమే కాకుండా మీ జీవితాన్ని కూడా చంపుతుంది.
దిద్దుబాటు మరియు మందలింపును తిరస్కరించడం,
ఎల్లప్పుడూ విచారకరమైన ముఖం ధరించడం మరియు మూడీగా ఉండటం, తీవ్రమైన స్త్రీవాద వాదనవ్వడం, పురుషాధిక్యత చూపడం
అదుపులేని కోపం మరియు కోపం వివాహాన్ని చంపుతాయి.
దేవుడు స్థాపించిన వివాహంలో మీ పాత్ర మరియు బాధ్యతను అర్థం చేసుకోకపోవడం,
మీ జీవిత భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక, భావోద్వేగ మరియు శారీరక అవసరాలను, సంపదలను విస్మరించడం, నపున్శకత్వం, భయము
జీవిత భాగస్వామి భద్రతకు ముప్పు వాటిల్లడం వివాహంపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
దేవుని వాక్యం గురించి జ్ఞానం లేకపోవడం మరియు దానికి విధేయత లేకపోవడం వివాహాన్ని చంపుతుంది.
ఇలా ఇలా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ఉడటం వల్ల వివాహం చేసుకోరు.
-*****
తెనాలి రామకృష్ణ కథలు (21)
రామకృష్ణ * పార్వతీ పరమేశ్వరుల*
*దశావతారాలు !!*గురించి వివరించు
కానీ పార్వతీపరమేశ్వరుల దశావతారాల గురించి చాలా మంది వినివుండరు .
*అవతారం అనగా
దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు.
దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.
ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం.
ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం.
ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం.
ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం.
ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.
అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు.
దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.
🌹ప్రధమావతారము :🌹
🌿మహాకాళుడు, ఈయన అర్ధాంగి "మహాకాళి"
వీరిరువురూ భక్తులకు ముక్తినిచ్చే దైవాలు.
🌹ద్వితీయావతారము :🌹
🌸తారకావతారము, "తారకాదేవి" ఈయన అర్ధాంగి .
సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు.
🌹తృతీయావతారము :🌹
🌿బాలభువనేశ్వరావతారము -
సహచరి "బాలభువనేశ్వరీ దేవి"
సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు.
🌹చతుర్ధావతారము :🌹
🌸షోడశ విశ్వేశ్వరుడు -
"షోడశ విద్యేశ్వరి" ఈయన భార్య.
భక్తులకు సర్వసుఖాలు ఇస్తారు.
🌹పంచమ అవతారము :🌹
🌿భైరవ అవతారము -
భార్య "భైరవి"
ఉపాసనాపరులకు కోరికలన్ని ఇచ్చే దైవము భైరవుడు.
🌹ఆరవ అవతారము :🌹
🌸భిన్నమస్త -- "భిన్నమస్తకి" ఈయన పత్నీ.
🌹ఏడవ అవతారము :🌹
🌿ధూమవంతుడు
"ధూమవతి" ఈయన శ్రీమతి.
🌹ఎనిమిదవ అవతారము :🌹
🌸బగళాముఖుడు --
"బగళాముఖి" ఈయన భార్య.
ఈమెకు మరో పేరు బహానంద.
🌹తొమ్మిదవ అవతారము :🌹
🌿మాతంగుడు --
"మాతంగి" ఈయన భార్య.
🌹దశావతారము :🌹
🌸కమలుడు --
"కమల" ఇతని అర్ధాంగి..
******-
తెనాలి రామకృష్ణ కథలు (20)
*నమస్కారాలు*అంటూ గుమ్మడి కాయ ను తలకు పెట్టుకొని వచ్చెనొకడు.
ఏమిటి యీ అవతారం ముందు తలపై నది తొలగించు అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. మహారాజా నా తల చూస్తే మీరు ఉరితీయిస్తారు ఏమిటి రామకృష్ణ నిన్ను ఎప్పుడో క్షమించాను నా తొందరపాటు గుర్తించాను.
రామకృష్ణ నమస్కారాలు ఎన్నిరకాలు, అవియేవి?
ఏలిన వారికి నమస్కారాలు అంటూ
*నమస్కారాలు నాలుగు రకాలు*
1. సాష్టాంగ నమస్కారం, 2. దండ ప్రణామం, 3. పంచాంగ నమస్కారం, 4. అంజలి నమస్కారం.
1. సాష్టాంగ నమస్కారం: మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. మస్తిష్కం, సంపుటం, ప్రహ్వాంగం అను మూడు రకాల నమస్కారం - ఈ సాష్టాంగ నమస్కారంలో కలిసి ఉంటుంది.
భూమిమీద సాగిలపడి లేచి తన రెండు చేతులను తల మీద ఉంచి అంజలి చేయుట మస్తిష్కం.
మస్తిష్కం చేసిన తరువాత రెండు చేతులను జోడించి హృదయాన్ని చేర్చుట సంపుటం.
సంపుటం చేసిన తరువాత తలను శరీరాన్ని కొంచెం వంచి నిలబడుట ప్రహ్వాంగం.
ఇలా మస్తిష్క సంపుటి ప్రహ్వాంగములతో కూడిన చేసే నమస్కారమే సంపూర్ణమైన నమస్కారమని పెద్దలు చెబుతారు.
2. దండప్రణామం : కర్రలా తన దేహాన్ని నిలువుగా భూమిపై వాల్చి పరుండి కాళ్లను
చేతులను చాపి నమస్కరించుట దండ ప్రణామం.
3. పంచాంగ నమస్కారం : రెండు పాదాల వేళ్లను, రెండు మోకాళ్లను, తలను మాత్రం
భూమిపై నుంచి రెండు చేతులను తల వద్ద చేర్చి నమస్కరించుట పంచాంగ నమస్కారం. ఇది స్త్రీలకు నిర్దేశింపబడింది.
4. అంజలి నమస్కారం : రెండు చేతులను కలిపి నమస్కరించుట అంజలి నమస్కారం.
కుడిచేతిలో గురువు యొక్క కుడిపాదము, ఎడమచేతిలో వారి ఎడమ పాదమును
స్పృశించి నమస్కరిస్తారు. చదువు చెప్పిన గురువులకు ఈ నమస్కారం చేయాలి.
ముగించాడు రామకృష్ణ
**-**
తెనాలి రామకృష్ణ కథలు.. (19)
తెనాలి రామకృష్ణ హారతి దైవానికి ఇస్తున్నాడు అక్కడ అందరూ నుంచొని ఉన్నారు. హారతి హద్దుకున్నారు.
అప్పాజీ గారు హరతులు గురించి వివరించండి అని అడిగారు శ్రీ కృష్ణ దేవరాయలు అప్పుడే రామకృష్ణ మొఖం వాపు చూసాడు, అర్ధం చేసుకున్న రామకృష్ణ చెప్పడం మొదలు పెట్టాడు.
*హారతులు 16 రకాలు* శక్తి కొద్ది చేయవచ్చు అంటూ
సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా సశాసీత్రయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు. పలురకాలు
1 ఏక హారతిప్రతిదీ ఒకేవిధంగా ఉండడానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏక హారతి. ఇది నదుల్లోని ఔషధగుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుంది.
2 నేత్రహారతిదివ్యస్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్రహారతి. దీనివల్ల సమస్త దృష్టిలోపాలు తొలగిపోతాయి.
3 బిల్వహారతిబ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనమిది. మనం చేపట్టిన ప్రతి పనినీ త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాల్ని సాధించే శక్తినిస్తుంది.
4 పంచహారతిఇది పంచభూతాలకు ఇచ్చే హారతి. ప్రత్యేకించి పంచభూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళి కాపాడబడాలని ఇచ్చే హారతి.
5 సింహ హారతిఇది ప్రతి ఒక్కరూ విజయ శిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండడానికి ఇచ్చే హారతి.
6 రుద్ర హారతిరుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది.
7చక్రహారతిచక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు.
*8 నవగ్రహ హారతిమన జీవితాల్ని నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవగ్రహాల దోషాలను తొలగించేందుకు ఈ హారతి పడతారు.
*9 కుంభహారతి:* ప్రతి మంచి పనికీ స్వాగతం పలకడానికి, నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ హారతి పడతారు.
10 నృత్యహారతిపరమేశ్వర స్వరూపమైన సమస్త కళలూ దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి. నృత్యం జీవచైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్య హారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతాయి.
11 రథహారతిద్వైమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథహారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రథహారతి.
12 వృక్షహారతిసమస్త వృక్షసంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి.
13 నాగహారతిసంతాన లోపాలు, కాలసర్పదోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి.
14 ధూపహారతిభూలోకంలో ఉండే సమస్త కాలుష్యాల్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమిమీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూపహారతి.
15 అఖండ కర్పూర హారతిసమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర హారతి.
16 నక్షత్ర హారతి:ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి.
సర్వేజనాసుఖినోభవంతు! అంటూ ముగించాడు
*****
తెనాలి రామకృష్ణ కథలు (19)
శ్రీకృష్ణదేవరాయల సభలో గురు శబ్దం గురించి చర్చ వచ్చింది . ఎవరు గొప్ప శిష్యుడు గొప్ప, గురువు గొప్ప, భవిష్యత్తులో స్పష్టత వల్ల జీవమై తెలియపరచే వాడే గొప్ప, దత్తాత్ న్యాయం దక్కినప్పుడు జీవితకాలం అంతా కూడా అందించే వాడే చీకటి తరిమి వెలుగు లందిమ్చే వాడేగొప్ప ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు
కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ మౌనాన్ని గమనించి నీ అభిప్రాయం తెలుపగలరు అన్నారు.
వర్షం వస్తే పలకరించే పృథ్విలా
పంట చేను మొక్కుతున్న రైతన్నలా
పుత్రికోత్సాహంతో పొంగిపోయే తండ్రిలా
తృప్తి ఆత్మనందంతో బోధించే కవివర్యులు లా
సమ్మోహనాత్ర పారవస్యంతో ప్రభోదించే వ్యక్తిలా
ఆరోగ్యకరంగా హర్షనీయంగా ఆధ్యాత్మికంగా విద్యలా
కాలాన్ని అనుసరించి స్వేచ్చనిచ్చి బోధ చేసే గురువులా
సృజన శైలి ప్రతిభా పాటవాలను పంచే చోదక శక్తి లా
నిస్వార్థంతో ధర్మదీక్షతో విద్యార్థులకు బోధ చేసే ఉపాధ్యాయులులా
లోపల, బయట నిండి ఉన్న అనంత చైతన్యాన్ని తన 'లోపల' మాత్రమే అనుభవించాలనే కోరికే - గురువు నేర్పినవిద్య ఇన్ని సాధనలకు కారణం అయింది.
ఇప్పుడు నీవు ఉన్న స్థితిని స్వయంగా నీవు కోరిన ప్రకారము చేసుకున్నదే ధైవసంకల్పం నీవు గురువు నిమిత్తమాత్రమే . జరిగేదాన్ని చూస్తూ ఉండడం తప్ప మార్చడం వీలు కాదు. అదే నీలో నున్న విద్య దానిని పంచితే నలుగురిలో ఒకడవుతావు, కాలాన్ని, ప్రకృతిని తల్లితండ్రులను గురువులను గౌరవిస్తూ ఉంటే ఆ పరమాత్ముడు నీలోనే ఉంటాడు, నీమనసు నీవాక్కు సర్వం దైవమయం అయ్యే విధముగా నుంటుంది.
గురువు పాదాలు పట్టుకుని ఉండడం శిష్యుడికి ఇష్టం.
శిష్యుని పదాలు పట్టుకుని విద్య నేర్పడం గురువుకి ఇష్టం.
మన శరీరంపై మనం పట్టు కలిగి ఉండడం 'దమము'
మన మనస్సుపై అదుపు కలిగి ఉండడం 'శమము'
పై రెండింటిపై పట్టు కలిగి ఉండడమే "యోగము".
గురు సంకల్పమే జీవనం
ఆత్మ, దేవుడు అంటూ దానినీ ఒక విధంగా చూడకు., అది నీవే. నిన్ను నీవు నమ్ముకో శాంతి సౌభాగ్యం నీ అదృష్టం నీ ఋణం తీర్చుకొనే అవకాశం పొందటం నిన్ను కట్టుకున్న భార్య, పిల్లల చూపే అవకాశం
అంటూ ముగించాడు రామకృష్ణ ఉపన్యాసం.
***
తెనాలి రామకృష్ణ కథలు..(18)
శ్రీకృష్ణ దేవరాయలు సభ ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు చీటిలో వ్రాసి అనగా కవుల్లందరికి ఇవ్వడం జరిగింది, కొందరు తమకిచ్చిన ప్రశ్నలకు సమాధానము చెప్పారు చివరకు రామకృష్ణ వంతు వచ్చింది.
ప్రశ్న జూడగా
**ఈ సృష్టిలో ధన్యులెవరు* ...?
ఒక్క నిముషం అలోచించి
*ఇష్టం లేని చోట ఇంద్ర భవనం కూడా ఇరుకుకే, అసంతృప్తి యున్నచోట పంచభక్ష పరవాన్నాలుకూడా చేదే,.
కళ్ళున్నా చూడలేని స్థితి అదృష్టం వెంబడించినా
కాలంకాని కాలంలో అంతా అగమ్య గోచారం
*మనసు పడిన చోట మట్టిళ్లు కూడా బంగారం గానే
మనసు లేని చోట తాడు కూడా సర్పము గానే అదేలోకం తీరు
*సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం….
అందుబాటులో నున్న సుఖాన్ని వదలి పరిగెటతం అనర్ధం....
పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిదుర పోయే మనిషి జీవితం ధన్యం ..
మాటపొల్లు పోకుండా జీవిత నావ నడపడానికి ఏది నిన్యాసం.
*ఈ సృష్టిలో ఎవరు ధన్యులు అంటే* ...
మంచం మీద పడుకోగానే కంటినిండా ప్రశాంతమైన నిద్ర పోగలిగే ..
కడుపునిండా ఏభయము లేకుండా హాయిగా తినగలిగే....
అరమరికలు లేకుండా ఆనందంగా నవ్వగలిగే...
పది మందితో తన కష్టసుఖాలని పాలు పంచుకోగలిగినవాడే ధన్యుడు.
అన్నదమ్ములతో అన్యోన్యంగా జీవించగలిగే....
తల్లిదండ్రుల కష్టాలలో పాలు పంచుకోగలిగే...
అతి ముఖ్యంగా జీవిత భాగస్వామి కంట కన్నీరు చిందించని వాడే ధన్యుడు.
*వీడు కదా ధన్యుడు,*
*వీడిది కదా జీవితం అంటే....*
*మరి మనలో ఇందులో ఏ ఒక్కటైనా సంపూర్ణంగా పొందిన వారు ఎందరున్నారు....?*
*ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకుందామా....
అలాంటివారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా....
అన్నాడు రామకృష్ణ
మనందరం అలాంటి లక్షణాలతో కూడిన జీవితాన్ని ఆహ్వానిద్దాం...
మనందరి జీవితాలు అలాంటి రోజులు రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
" సుషుప్తిలో తాను 'ఏకంగా' ఉంటాడు. అతడే దేవుడు
స్వప్న, జాగ్రత్తుల్లో తాను 'అనేకంగా' ఉంటాడు. అతడే జీవుడు
నేనెవడను అని విచారణ చేసేది ఆత్మే.
మన ఎదురుగానే ఉన్నా చూడడం చేతకాక భగవంతుణ్ణి ప్రపంచంగా భ్రమ పడుతున్నాం.అదియే లోకాత్మే.
"అంతా మిథ్య" అన్నా సుఖదుఃఖాలు ఉండవు.
"అంతా సత్యం" అన్నా సుఖదుఃఖాలు ఉండవు.
కొంత మిథ్య, కొంత సత్యం అంటేనే, సుఖదుఃఖాలు ఉండేది.
నువ్వేమి చేసినా సరే భగవంతుడు దొరకడు.,
నీవు అతడిని అన్యంగా చూస్తున్నావు కాబట్టి.
దేవుడే జీవుని వేషం వేయడం.
వేషం వేసిన సంగతి మరచి దేవుడిని వెతకడం.
గురువు ద్వారా ఆ గుట్టు తెలుసుకోవడం.
అనాదిగా సాగుతున్న ఆట ఇదే.
"ప్రయత్నం చేయవలసిందే" అన్నవాళ్ళు కర్మయోగులు.
"మన చేతుల్లో ఏమీ లేదు" అన్నవాళ్ళు భక్తియోగులు.
ఈ రెంటిని వదిలి "సాక్షిగా" ఉన్నవాళ్లు జ్ఞానయోగులు.
ధన్యులెవరనగా స్త్రీ మనసెరిగినవారే నా అభిప్రాయం అని ముగించాడు ఉపన్యాసం
ఇంకా ఉన్నాయి (19)
*****
తెనాలి రామకృష్ణ కథలు (17)
నవ్వులతో ఎంతసేపటికి తేరుకోని సభనుద్దేశించి “మన్నించండి ఏలికా! నాకు చీడపీడల పై ఎలాంటి నమ్మకంలేదు. ఈ లింగిశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను. ఈతడు తమకు బాల్య స్నేహితుడు అనే ముసుగులో ఉంటూ ఈతడు మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు. ఆ ఇంటికి నేలమాళిగ సొరంగం ఉంది. అందులో పెద్ద ఎత్తున మారణా యుధాలున్నాయి. ఇవేవి ఒక వర్తకునికి అవసరమైనవి కావు. కనుక ఈతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే” అని లింగిశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు.
ఒక్కసారి సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెలరేగింది. రాయలు అర్ధంకాక తిమ్మరుసు వైపు చూసాడు.
లింగిశెట్టి అవమానంతో తలదించుకున్నా డు. రాయలు కన్నెర్రతో లింగిశెట్టి నిజం ఒప్పేసుకున్నాడు. తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు. ఆ సొరంగ మార్గంలోంచి రాకపోకలు సాగేవి. ఒకసారి సొరంగంలో గజపతుల వేగులవారికి
దయ్యాలు ఎదురైనవని అందులోంచి రావడానికి భయపడ్డారు. తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్లాక అన్నివిధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి. నేను చేస్తున్నది తప్పని తెలుసుకుని, ఇటీవల వారితో తెగతెంపులు చేసుకున్నాను. అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయనివాడికి అమ్మేసి బుద్ధిగా నా బతుకు బతకాలను కున్నాను. తీరా ఈ కవి చాలా తెలివైన వాడు కనుక, ఇలా నా గుట్టు తెలుసుకో గలిగాడు. వేరెవ్వరూ పసిగట్టలేనిది నా దేశద్రోహం. మన్నించండి చక్రవర్తీ !".
"ఏమయ్యా ! నీవు నాకు బాల్యమిత్రుడవు. నేను నీ యెడల చాలా ప్రేమగానే ఉంటున్నానే మరి నాపై నీకెందులకు ఈ ద్రోహచింత. దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను. కనుక నీవు శిక్షార్హుడవే ” రాయలు కోపంగా లింగిశెట్టి వైపు చూస్తూ ఉరిమాడు.
"ఏలినవారికి నాదో విన్నపం. ఈతడు కులపరంగా వైశ్యుడు. కుట్రలతో సాధించే శారీరక బలుడు కానేకాడు. ఏదో ధనాశకు మన శత్రువులకు తనింటి సొరంగ మార్గం ఇచ్చి ఉండవచ్చు. వారిచ్చు ధనం కంటే ఈతనికి జరిగిన నష్టమే ఎక్కువ. గజపతుల వేగులు ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగ మార్గంలో దయ్యాలు ఉన్నట్లు బొంకి వెళ్లిపోయారు. దయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో
వెచ్చించి నిర్మించిన భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు. దయ్యాలే నిజమైతే ఈసరికి నాకు కన్పించాలి. కానీ ఇంత వరకు నేను చూడనైనా చూడలేదు. ఒక విధంగా చేసిన తప్పుకు ఇతడు తగిన శిక్ష ఆర్ధికంగా అనుభవించాడు. ఏది ఏమైనా ఈతడు చేసినది తప్పే.... అందుకు శిక్ష ఏలినవారు దేశద్రోహులకు విధించే
మరణదండన, కనుగుడ్లు పెరికివేయించు ట వంటివి విధించవద్దని నా మనవి. దేశ బహిష్కారమే మరణదండనతో సమానం.”
రామలింగడు సభ మధ్యలో వందలాది జనాలు గుడ్లప్పగించి పరికిస్తుంటే వినమ్రుడై చెప్పాడు.
రాయలు గట్టిగా కళ్ళుమూసుకున్నాడు.
“నిజమే రామలింగడు చెప్పినట్లు దేశ బహి ష్కారంతో సరిపుచ్చాలి, లింగిశెట్టి తనకు బాల్యస్నేహితుడు. చేతులారా చిత్రహింస లు పెట్టే శిక్ష తను అమలు చేయలేడు. ఒక విధంగా రామలింగడు అడ్డుపడకుండా ఉంటే తను తప్పని పరిస్థితిలో శిక్ష విధించేవాడు అని మనస్సులో అనుకుని చివరికి లింగిశెట్టికి దేశ బహిష్కార శిక్ష విధించాడు.
ఆ తరువాత రాయలు సింహాసనం దిగి వచ్చి రామలింగ కవిని గాఢాలింగనం చేసుకున్నాడు.
" కవి చరిత్ర మరువదు మీ చతురత, స్వామి భక్తి పరాయణత, సదా నిలుచును మీ ఎడల మా కృతజ్ఞుత. ఈరోజు నా హృదయం తేలి పోవుచున్నది. ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకొనుచున్నాను. ఆ దయ్యాల భవంతిని వదిలేయండి. నేను వేరే భవంతిని ఏర్పాటు చేయగలను కాదనకండి." అన్నాడు రాయలు.
ఇతరత్రా కూడా పదేపదే మెచ్చుకుని ధనకనక వస్తువాహనాలతో సత్కరించాడు.
"ప్రభూ ఆ భవంతి ఎంతో గొప్పది. నాకు అన్ని విధాల నచ్చినది. అందులోకి వెళ్లగానే నాకు కవిగా కాకుండా నా మాతృ భూమికి నా చక్రవర్తికి నా సహచర ప్రజలకు సేవలందించాలని తెలియజేసింది. చక్కని అవకాశం లభించింది. ఆ భవంతిలో నేను నా భార్య పిల్లలతో జీవించగలను. అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆశిస్తూ జీవించగలను. నన్ను కాదనకండి. తమ మాటకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు” అన్నాడు.
తిమ్మరుసు రామలింగని వద్దకు వచ్చి..
" నాయనా నీవు గొప్ప విషయాన్ని బయటపెట్టావు. నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదాన్ని ఇస్తుంది. అట్టిదాన్ని నీవు కుండబద్దలు కొట్టినట్టు చేసావు. తక్షణం ఆ సొరంగ మార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం. నీవు ఈరోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఓ పూట గడపాల్సిందిగా నిన్న కోరుతున్నాను.” అన్నాడు ప్రేమగా..
రామలింగడు చేతులు కట్టుకుని తృప్తిగా తన సమ్మతిని తెలిపాడు.
*సశేషం*(18)
*****
తెనాలి రామకృష్ణ కథలు =16)
విశ్వసించుటయా! ఎంతటి ప్రారబ్దం ఈ క్షణ మనుభవించుచున్నాను. హతవిధీ! సత్య నిరూపణ కావలె. ఇక విషయం తమకు తెలియపరుచుకొందును.. అయ్యా నా ఇంటి వాకిట కూర్చుని ఉండగా ఓ టముకు విని ఆరా తీసిన నేరానికి ఈ వణిజ ప్రముఖుడు లింగిశెట్టి తన అనుయాయులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి
ప్రోత్సహించిరి. అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభపెట్టిరి. పెద్ద ఎత్తున ధనం ఖర్చుచేసి ఇంత స్వల్ప ధరకు ఎందుకు అమ్ముచున్నారని అడిగితిని. పొంతనలేని మాటలు వల్లెవేసారు. ఇందు ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని నేరుగా కలిసితిని. ఈ గృహమందు దయ్యాలు, పిశాచాలున్నాయి. వాటితో నువు వేగలేవని, చెప్తునే షరతుల పై నాకు అమ్మాడు.” అని రామలింగడు చెప్పాడు.
సభా మధ్యమున నిలుచుండి కంచు గంట మ్రోగినట్లు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు. అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు.
“నీవు చెప్పునది సరే. ముందు షరతుల
ప్రకారం నీవు ఈసరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. మరెందుకుఇవ్వకుండా మొండికెత్తితివి. రాయలవారికిచెప్పుకున్నా నీకు ఒక్క రూక రాదని పదేపదే అన్నావని ప్రధానంగా నీ పై అభియోగం. ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా? రామలింగకవి, నీపై ఎంతో గౌరవభావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా కృంగదీశావు. ఇట్టి తప్పిదాన్ని చేసినవారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిన్ను ఏ విధంగా కఠినశిక్షకు గురిచేయాలి. నీవు నాకెందుకు ఈ విషమపరిస్థితికల్పించితివి. నీ తప్పు చాలా స్పష్టంగా కన్పించుచున్నది. నిన్ను ఏ విధంగా శిక్షించాలో నీవే చెప్పు.” అన్నాడు రాయలు అసహనంగా నొసలు నొక్కుకుంటూ.
సభలోని వారంతా హీనంగా రామలింగని వైపు చూసారు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే రాయలు ఈరోజు ఇంతటి వేదనకు గురికావడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోయారు.
" మహామంత్రీ నేనే అపరాధం చేయలేదు. నా చేత రాయించిన పత్రం ఒకసారి తమరే చదవండి నిజం తెలియగలదు. ఈ రామలింగని నిర్దోషిత్వం తమకు స్పష్టంగా తెలియగలదు” అన్నాడు రామలింగడు.
పత్రం చదివాక తిమ్మరుసు పెదవి విరవడం రాయలు మరింత నొచ్చుకున్నాడు. రామలింగ కవి ఏదో విధంగా నిర్దోషిగా నిరూపితుడవుతాడని కొండంత ఆశ పడ్డాడు. కానీ ఈతడు పెద్ద తప్పు చేసాడు. ఈ కవిలో ఇంత లక్షణాలున్నాయా ? అని అనుకున్నాడు.
"రామలింగా, ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్టు మాత్రమే ఉంది." తిమ్మరుసు గొంతు ఖంగుమంది.
“మహామంత్రీ తమరు తప్పులో కాలు వేసారు. తమవంటివారు ఇలా చదివితే ఎలా ? లింగిశెట్టి అమ్మునది నా ఒక్కడికే కదా! ఆ పత్రంలో నా ఒక్కని పేరుందా? లేదే వేరే వారి పేర్లున్నాయి. దయ చేసి చదవండి.”
“ఒక్కనిదే ఉంది. వేరెవ్వరి పేరు లేదే. ఎన్ని కళ్లతో చదవినా మారిపోదుకదా ! నీకు ఛాదస్తం మరీ ఎక్కువలా ఉంది.”
శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠగా రామలింగని వైపే చూసాడు.
"ఆ పత్రంలో అక్షరాల ఇరువురి పేర్లు
ఉన్నాయి. రామలింగకవితో బాటు దయ్యాలు, పిశాచాలు ఉన్నాయి. వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా అందుకు ఎలాంటి పూచీ తనకు లేదని కూడా రాసాడు ఈ పెద్దమనిషి. ఒక ఇల్లు ఒక్కరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు. మరి నాతో బాటుగా దయ్యాలు, పిశాచాలున్నాయి. అని అతనే లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు. అవి చెల్లించవా ? ఇదేం న్యాయం మహామంత్రీ. అందుకే ఈ పెద్దమనిషితో పదేపదే అన్నాను. ఏలినవారికి చెప్పినా ఒక్క రూక రాలదని, ఇప్పుడూ చెప్తున్నాను. లింగి శెట్టికి నేను నా వాటా చెల్లించితిని. ఇక ఏ భూత మాంత్రికుడినో, పిశాచ వైద్యుడినో పట్టుకుని ఆ ఇంట్లో అక్రమంగా తిష్టవేసిన దయ్యాలు పిశాచాల వద్ద మిగిలిన వాటా వసూలు చేసుకోమనండి. మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వేయగలరు"
సభికులు గొల్లుమని నవ్వుతుండగా సభలో రామలింగడు ఎలాంటి జంకుగొంకు లేకుండా మరీ చెప్పాడు.
రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ
తిమ్మరుసు వైపు చూసాడు. ఆయన కూడా తెరలు తెరలుగా నవ్వసాగాడు. సభ మొత్తం నవ్వులమయం అయ్యింది. లింగిశెట్టి ఆముదం తాగినట్టు జేవురించిన ముఖంతో మిగిలాడు.
సశేషం (17)
*****
తెనాలి రామకృష్ణ కథలు..(15a)
శ్రీకృష్ణ దేవరాయలు సభ ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు చీటిలో వ్రాసి అనగా కవుల్లందరికి ఇవ్వడం జరిగింది, కొందరు తమకిచ్చిన ప్రశ్నలకు సమాధానము చెప్పారు చివరకు రామకృష్ణ వంతు వచ్చింది.
ప్రశ్న జూడగా
**ఈ సృష్టిలో ధన్యులెవరు* ...?
ఒక్క నిముషం అలోచించి
*ఇష్టం లేని చోట ఇంద్ర భవనం కూడా ఇరుకుకే, అసంతృప్తి యున్నచోట పంచభక్ష పరవాన్నాలుకూడా చేదే,.
కళ్ళున్నా చూడలేని స్థితి అదృష్టం వెంబడించినా
కాలంకాని కాలంలో అంతా అగమ్య గోచారం
*మనసు పడిన చోట మట్టిళ్లు కూడా బంగారం గానే
మనసు లేని చోట తాడు కూడా సర్పము గానే అదేలోకం తీరు
*సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం….
అందుబాటులో నున్న సుఖాన్ని వదలి పరిగెటతం అనర్ధం....
పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిదుర పోయే మనిషి జీవితం ధన్యం ..
మాటపొల్లు పోకుండా జీవిత నావ నడపడానికి ఏది నిన్యాసం.
*ఈ సృష్టిలో ఎవరు ధన్యులు అంటే* ...
మంచం మీద పడుకోగానే కంటినిండా ప్రశాంతమైన నిద్ర పోగలిగే ..
కడుపునిండా ఏభయము లేకుండా హాయిగా తినగలిగే....
అరమరికలు లేకుండా ఆనందంగా నవ్వగలిగే...
పది మందితో తన కష్టసుఖాలని పాలు పంచుకోగలిగినవాడే ధన్యుడు.
అన్నదమ్ములతో అన్యోన్యంగా జీవించగలిగే....
తల్లిదండ్రుల కష్టాలలో పాలు పంచుకోగలిగే...
అతి ముఖ్యంగా జీవిత భాగస్వామి కంట కన్నీరు చిందించని వాడే ధన్యుడు.
*వీడు కదా ధన్యుడు,*
*వీడిది కదా జీవితం అంటే....*
*మరి మనలో ఇందులో ఏ ఒక్కటైనా సంపూర్ణంగా పొందిన వారు ఎందరున్నారు....?*
*ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకుందామా....
అలాంటివారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా....
అన్నాడు రామకృష్ణ
మనందరం అలాంటి లక్షణాలతో కూడిన జీవితాన్ని ఆహ్వానిద్దాం...
మనందరి జీవితాలు అలాంటి రోజులు రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
" సుషుప్తిలో తాను 'ఏకంగా' ఉంటాడు. అతడే దేవుడు
స్వప్న, జాగ్రత్తుల్లో తాను 'అనేకంగా' ఉంటాడు. అతడే జీవుడు
నేనెవడను అని విచారణ చేసేది ఆత్మే.
మన ఎదురుగానే ఉన్నా చూడడం చేతకాక భగవంతుణ్ణి ప్రపంచంగా భ్రమ పడుతున్నాం.అదియే లోకాత్మే.
"అంతా మిథ్య" అన్నా సుఖదుఃఖాలు ఉండవు.
"అంతా సత్యం" అన్నా సుఖదుఃఖాలు ఉండవు.
కొంత మిథ్య, కొంత సత్యం అంటేనే, సుఖదుఃఖాలు ఉండేది.
నువ్వేమి చేసినా సరే భగవంతుడు దొరకడు.,
నీవు అతడిని అన్యంగా చూస్తున్నావు కాబట్టి.
దేవుడే జీవుని వేషం వేయడం.
వేషం వేసిన సంగతి మరచి దేవుడిని వెతకడం.
గురువు ద్వారా ఆ గుట్టు తెలుసుకోవడం.
అనాదిగా సాగుతున్న ఆట ఇదే.
"ప్రయత్నం చేయవలసిందే" అన్నవాళ్ళు కర్మయోగులు.
"మన చేతుల్లో ఏమీ లేదు" అన్నవాళ్ళు భక్తియోగులు.
ఈ రెంటిని వదిలి "సాక్షిగా" ఉన్నవాళ్లు జ్ఞానయోగులు.
ధన్యులెవరనగా స్త్రీ మనసెరిగినవారే నా అభిప్రాయం అని ముగించాడు ఉపన్యాసం
ఇంకా ఉన్నాయి)
రామకృష్ణ కథలు... (25)
సభలో చర్చ జరుగు తున్నది
ఒకరు ప్రశ్నలు వేస్తుంటే మరొకరు సమాదానాలి చెప్పాలి
రామకృష్ణ కు ప్రపంచంలో సుఖం ఎరుగనివారు ఎవరైనా ఉన్నారా?*ఉంటే వారెవరు?
రామకృష్ణ పలుకుతూ అంటే ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు"అంటారు వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*
*1. ఈర్ష్యాళువు*
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.
*2. జుగుప్సావంతుడు*
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది.
*3. నిస్సంతోషి*
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖమెక్కడ
*4. క్రోధనుడు*
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ
*5. నిత్యశంకితుడు*
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది సుఖం.
*6. పరభాగ్యోపజీవి*
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పుడు ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా.
ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.
అప్పుడే శ్రీ కృష్ణ దేవరాయలు చక్కగా వివరించావు అంటూ బహుమతి అందించారు.
*****
తెనాలి రామకృష్ణ కథలు.. (24)
రామకృష్ణ నగరంలో వివాహ_హంతకులు గా మారటాని జనుల భావాలు అందరికీ తెలియపరచగలవు
సోమరితనం, అనుమానం, నమ్మకం లేకపోవడం, పరస్పర గౌరవం లేకపోవడం,క్షమించకపోవడం, ద్వేషం, ద్వేషం మరియు కోపం వివాహాన్ని చంపుతాయి.
అనవసరమైన వాదనలు పెరగడం, జీవిత భాగస్వామి నుండి రహస్యాలు దాచడం,
అవిశ్వాసం (ఆర్థిక, భావోద్వేగ, మానసిక, భౌతిక, మొదలైనవి) వివాహాన్ని చంపుతుంది.
పేలవమైన సంభాషణ,అబద్ధాలు,
ప్రతి అంశంలోనూ మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా లేకపోవడం .
మీ జీవిత భాగస్వామి కంటే తల్లిదండ్రులు/కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వివాహాన్ని చంపుతుంది.
ఆనందించలేని సాన్నిహిత్యం లేకపోవడం, వేధించడం, అతిగా మాట్లాడటం మరియు అజాగ్రత్తగా మాట్లాడటం
మీ జీవిత భాగస్వామితో తక్కువ సమయం గడపడం వివాహాన్ని చంపుతుంది
చాలా స్వతంత్రంగా ఉండటం,
పార్టీలు, డబ్బు, హఠాత్తుగా కొనడం మరియు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ప్రేమ పట్ల ఆకర్షణ లేకపోవడం,
మీ జీవిత భాగస్వామి యొక్క లోపాలను మీ తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు బహిర్గతం చేయడం
ఆధ్యాత్మిక పద్ధతులను నిర్లక్ష్యం చేయడం మరియు కలిసి ప్రార్థన చేయకపోవడం వివాహాన్ని మాత్రమే కాకుండా మీ జీవితాన్ని కూడా చంపుతుంది.
దిద్దుబాటు మరియు మందలింపును తిరస్కరించడం,
ఎల్లప్పుడూ విచారకరమైన ముఖం ధరించడం మరియు మూడీగా ఉండటం, తీవ్రమైన స్త్రీవాద వాదనవ్వడం, పురుషాధిక్యత చూపడం
అదుపులేని కోపం మరియు కోపం వివాహాన్ని చంపుతాయి.
దేవుడు స్థాపించిన వివాహంలో మీ పాత్ర మరియు బాధ్యతను అర్థం చేసుకోకపోవడం,
మీ జీవిత భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక, భావోద్వేగ మరియు శారీరక అవసరాలను, సంపదలను విస్మరించడం, నపున్శకత్వం, భయము
జీవిత భాగస్వామి భద్రతకు ముప్పు వాటిల్లడం వివాహంపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
దేవుని వాక్యం గురించి జ్ఞానం లేకపోవడం మరియు దానికి విధేయత లేకపోవడం వివాహాన్ని చంపుతుంది.
ఇలా ఇలా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ఉడటం వల్ల వివాహం చేసుకోరు.
*****
రామకృష్ణ కధలు (23 )
రామకృష్ణ అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారో తెలియపరుచు అన్నాడు శ్రీ కృష్ణ దేవరాయలు
‘అన్నాద్భవంతి భూతాని’ అంటుంది భగవద్గీత. సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం. ఇదే విషయాన్ని ‘ఆత్మనః ఆకాశః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఔషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః’ అంటుంది తైత్తరీయోపనిషత్తు. అన్నిటికీ మూలమైన ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి పృథివీ, నేల నుంచి ఔషధాలు, వాటినుంచి అన్నం, దాన్నుంచి ప్రాణులు- ఇదీ క్రమం. ఈ గొలుసును (శృంఖల) పట్టుకుని వెనక్కి వెళ్తే దానికి మూలమైన ఆత్మ, ఆత్మకు మూలమైన పరమాత్మ కనిపిస్తాయి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. శరీరంలోని ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన రూపాల్లో ఉండే పంచప్రాణాలకు పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరమాత్మ తత్వమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ధర్మసాధనకు అత్యవసరమైంది శరీరం. దేహమే కాదు ఈ సృష్టి అంతా ధర్మసాధన నిమిత్తమే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశ సమన్వితమైన శరీరంలో అన్నమయకోశానికి మొదటి స్థానం ఇవ్వటం ఆహార ప్రాధాన్యతనే తెలియజేస్తుంది. అన్నపూర్ణ ఆత్మసఖుణ్ణి ఆదిభిక్షువుగాచేసి అన్నాన్ని అందించడం వెనుక ఆంతర్యమూ ఇదే. మనుగడకు మూలాధారమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని విడదీసి చూడలేం.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
అంటూ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుంది భగవద్గీత. శక్తిని ప్రసాదించే ఈ ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తూ, ప్రశాంత వాతావరణంలో, శుచిగా, మౌనంగా, ఆకులో లేదా బంగారు, వెండి లాంటి ఉత్తమ లోహ పాత్రల్లో తీసుకున్నప్పుడు అది ప్రసాదమౌతుంది. భోజనానికి ముందు శాస్త్రం తెలిసినవారు మంత్రయుక్తంగా ఆచమనం చేసి, ఆ పరిజ్ఞానం లేనివారు భగవంతుని స్మరిస్తూ కొన్ని నీళ్లు తాగి, అప్పుడు తినడం మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
అన్నమంటే ఔషధమే. మనిషి రుతు చర్యను పాటించాలి. అంటే ఆయా రుతువుల్లో, ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని, శరీరతత్వాల అనుకూలతను బట్టి తినాలి. ఆహార, జల, విహారాదుల్ని పాటించని ప్రాణిలో వాతపిత్తకఫాలనే త్రిదోషాలు విజృంభించి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లాంటి అవయవాలు దెబ్బతిని ప్రాణం దేహాన్ని వదిలి వెళ్లిపోతుంది.
*****
తెనాలి రామకృష్ణ కధలు (22)
రామకృష్ణ వేసవికాలంలో కోరేది ఏది? దానిగురించి వివరిస్తావా
మహారాజా మీ ఉదేశ్యం అర్ధం అయ్యింది ..మామిడి పండు మాయాసారం*గురించి వివరించమంటున్నారు కదా
రామకృష్ణ మీ మేధస్సు ను గ్రహించటం చాలా కష్టం ఎప్పుడు ఎలావుంటావో అర్ధం కావు, కాసేపు నవ్విస్తావు, సమస్యలను పరిష్కరిస్తావు అంటూ మెచ్చుకున్నాడు శ్రీ కృష్ణ దేవరాయలు
అప్పాజీ గారు మామిడిపండు తెప్పిస్తారా అన్నాడు రామకృష్ణ ,
రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే *"వ్యామోహం"* అని అంటారని అన్నాడు.
మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే *"వాత్సల్యం"* అని విశదీకరించాడు.
చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే *"ఆప్యాయత"* అని చాటి చెప్పాడు.
పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే *"లోభం"* అని అన్నాడు.
మన పండంతా తిని ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే *"అసూయ"* అని వివరించాడు .
మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, *"క్రోధం"* అని వివరంగా తెలిపాడు.
మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే *"అహంకారం"* అని చాటాడు.
మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే *"మమకారం"* అని తెలిపాడు.
అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా *"ఆత్రం"* అని విశదీకరించాడు.
*ఒక పండు ఆరగింపు ముద్దు,* *రెండు కద్దు* *మూడు అసలే వద్దు,* *ఉండాలి దేనికయినా సరిహద్దు.* దీనినే *స్వీయ నియంత్రణ* అని విపులీకరించాడు.
సభలో నున్న సభ్యులందరు చప్పట్లు చరిచారు
*****
తెనాలి రామకృష్ణ కథలు (21)
రామకృష్ణ * పార్వతీ పరమేశ్వరుల*
*దశావతారాలు !!*గురించి వివరించు
కానీ పార్వతీపరమేశ్వరుల దశావతారాల గురించి చాలా మంది వినివుండరు .
*అవతారం అనగా
దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు.
దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.
ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం.
ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం.
ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం.
ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం.
ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.
అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు.
దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.
🌹ప్రధమావతారము :🌹
🌿మహాకాళుడు, ఈయన అర్ధాంగి "మహాకాళి"
వీరిరువురూ భక్తులకు ముక్తినిచ్చే దైవాలు.
🌹ద్వితీయావతారము :🌹
🌸తారకావతారము, "తారకాదేవి" ఈయన అర్ధాంగి .
సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు.
🌹తృతీయావతారము :🌹
🌿బాలభువనేశ్వరావతారము -
సహచరి "బాలభువనేశ్వరీ దేవి"
సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు.
🌹చతుర్ధావతారము :🌹
🌸షోడశ విశ్వేశ్వరుడు -
"షోడశ విద్యేశ్వరి" ఈయన భార్య.
భక్తులకు సర్వసుఖాలు ఇస్తారు.
🌹పంచమ అవతారము :🌹
🌿భైరవ అవతారము -
భార్య "భైరవి"
ఉపాసనాపరులకు కోరికలన్ని ఇచ్చే దైవము భైరవుడు.
🌹ఆరవ అవతారము :🌹
🌸భిన్నమస్త -- "భిన్నమస్తకి" ఈయన పత్నీ.
🌹ఏడవ అవతారము :🌹
🌿ధూమవంతుడు
"ధూమవతి" ఈయన శ్రీమతి.
🌹ఎనిమిదవ అవతారము :🌹
🌸బగళాముఖుడు --
"బగళాముఖి" ఈయన భార్య.
ఈమెకు మరో పేరు బహానంద.
🌹తొమ్మిదవ అవతారము :🌹
🌿మాతంగుడు --
"మాతంగి" ఈయన భార్య.
🌹దశావతారము :🌹
🌸కమలుడు --
"కమల" ఇతని అర్ధాంగి..
*******
తెనాలి రామకృష్ణ కథలు (15)
"నేను కాళీ ఉపాసకుడను. నాకు చీడ పీడల బాధలేదు. ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మజూపినా ఎవరూ రాలేదని తెలిసివచ్చాను. నేను ఇష్టపడుతున్నాను. అమ్ముకో! " అని భుజం తట్టాడు.
లింగిశెట్టి తీవ్రంగా ఆలోచించి సరేనన్నాడు. చివరికి వెయ్యి వరహాలు పుచ్చుకుని ఓ పత్రం రాయించుకున్నాడు. ఒక నెల గడువు మాత్రమే ఇచ్చాడు. "ఎట్టి పరిస్థితి లో నెలలోపు మిగిలిన చెల్లింపులు చేయాలి. లేకుంటే రాయలవారి బాల్య స్నేహితుడను. కనుక రాజతీర్పు పొందగలను. కొత్తగా వచ్చినవాడవు నీపై రాయలకు చులకన భావం ఏర్పడి అసలకే మోసం రాగలదు. బతుకు చెడి వీధిన పడతావు” అని సుతిమెత్తగా
హెచ్చరించాడు.
రామలింగడు మరోసారి నవ్వుకున్నాడు. అన్ని నియమ నిబంధనలకు సై అన్నాడు. తొలి చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు.
రామలింగడు రాయలిచ్చిన గృహాన్ని వదిలి కొత్తగా కొనుకున్న భవనానికి వెంటనే మారా డు. ఈ విషయం వేగుల ద్వారా విన్న రాయలు ముందు ఒకింత ఆశ్చర్యపడినా, తనకు మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఇంత తొందరగా స్వంత నిర్ణయాలు తీసుకోవడమా? తనకు చెప్పి ఉంటే కొనిపెట్టేవాడ్ని కదా అని పరిపరి విధాలుగా అలోచించాడు. ఆ తరువాత ఏ రోజూ చెప్పనే లేదు. మూడు నెలలు గడిచా యి.... ఒక విధంగా రాయలు బయటికి కనపడకుండా లోలోపల నొచ్చుకున్నాడు.
రాయలవారు నిండుకొలువులో ఊపిరి సలపనంత పని ఒత్తిడిలో ఉండగా లింగి శెట్టి వచ్చి ఫిర్యాదు చేసాడు. ఒక్కసారి సభంతా నిశ్శబ్దం అయిపోయింది. జనులంతా ఖిన్నులై విన్నారు.
"సాహితీ సమరాంగన సార్వభౌమా! మీ
బాల్యమిత్రుడు ఈరోజు మీముంగిట తీర్పుకై చేతులు కట్టుకుని నిలుచున్నాడు. నేను విధి వశాత్తు ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాను. అది వెలకట్టలేనిది. కానీ, అందు నివసించలేనిదిగా కొరకరాని కొయ్యిగా నాపాలిటి మిగిలింది. అతి తక్కువ వెలకు కొత్తగా తమ కొలువుకు విచ్చేసిన రామలింగకవిగారికి ఆ ఇల్లు అమ్మివేసితిని. ఆయన నమ్మబలికి తొలుత అతి తక్కువ ధనమిచ్చి, నెల గడువులోపు మిగిలినది తప్పక జమ చేయుదును అని చెప్పి ఇప్పుడు మూడు నెలలు అయిన పిదప ఇక తాను ఏమీ ఇవ్వవలిసినదిలేదు అని చెప్పుచున్నాడు. తమరు నాకు తగు న్యాయం ఇప్పించ గోర్తున్నాను" అని మొత్తం వివరించాడు లింగిశెట్టి.
రాయలు లోలోపల చాలా బాధపడ్డాడు. ఇదేమీ ఈ కొత్త కవి వింతపోకడలు. వినుటకే చాలా కష్టంగా ఉంది. సరే పిలిపించి విచారించిన తెలియగలదు అని వెంటనే రామలింగడిని పిలిపించాడు.
ఆ రోజు ఆ సభలో దిగ్గజాల వంటి కవులు ఆశీనులై ఉన్నారు. సభకు విచ్చేసిన రామలింగకవి సభకు, రాయలవారికి, ప్రముఖులకు నమస్కరించి...
"ఏలినవారు నన్ను సభకు తక్షణం పిలిపించడానికి కారణం నాకు తెలియ కుండా నేనేమైనా తప్పు చేసి ఉన్నానా, తెలుసుకోగోరుతున్నాను" అని మిక్కిలి వినమ్రతతో అడిగాడు.
రాయలకు ఎందుకో ఆ క్షణంలో తట్టుకో లేనంత కోపం వచ్చింది. అది గ్రహించిన మహామంత్రి తిమ్మరుసు రాయలకు కనుసైగ చేసి ఓపిక పట్టమనెను. రాయలు మనస్సును కుదుటపరుచుకుని..
"కొత్తగా మా కొలువుకు విచ్చేసిన ఓ కవి రాజశేఖరా, మీ పై ఈ నగల వర్తకుడు పెద్ద అభియోగం చేసారు. మీరీతన్ని మోసం చేసారని, అయితే పూర్వపరాలు చూడగా మీరు పెద్ద తప్పు చేసారనిపిస్తోంది. దీని పై మీరిచ్చు సమాధానం? ఏదీ దాచకుండా సభకు తెలియపరచండి. నిజాలే ఇక్కడ వింటాం. అబద్ధానికి తావులేదు. తప్పు జరిగినట్టు రుజువైనచో తీవ్రదండన తప్పదు" అన్నాడు కొంచెం ఆగ్రహంతో.
"రాజాధిరాజులైన మీ నీడన బతుకీడ్చు ఈ బాపడా తప్పు చేయునది. అది తమరు
సశేషం... (16)
తెనాలి రామకృష్ణ కథలు =16)
విశ్వసించుటయా! ఎంతటి ప్రారబ్దం ఈ క్షణ మనుభవించుచున్నాను. హతవిధీ! సత్య నిరూపణ కావలె. ఇక విషయం తమకు తెలియపరుచుకొందును.. అయ్యా నా ఇంటి వాకిట కూర్చుని ఉండగా ఓ టముకు విని ఆరా తీసిన నేరానికి ఈ వణిజ ప్రముఖుడు లింగిశెట్టి తన అనుయాయులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి
ప్రోత్సహించిరి. అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభపెట్టిరి. పెద్ద ఎత్తున ధనం ఖర్చుచేసి ఇంత స్వల్ప ధరకు ఎందుకు అమ్ముచున్నారని అడిగితిని. పొంతనలేని మాటలు వల్లెవేసారు. ఇందు ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని నేరుగా కలిసితిని. ఈ గృహమందు దయ్యాలు, పిశాచాలున్నాయి. వాటితో నువు వేగలేవని, చెప్తునే షరతుల పై నాకు అమ్మాడు.” అని రామలింగడు చెప్పాడు.
సభా మధ్యమున నిలుచుండి కంచు గంట మ్రోగినట్లు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు. అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు.
“నీవు చెప్పునది సరే. ముందు షరతుల
ప్రకారం నీవు ఈసరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. మరెందుకుఇవ్వకుండా మొండికెత్తితివి. రాయలవారికిచెప్పుకున్నా నీకు ఒక్క రూక రాదని పదేపదే అన్నావని ప్రధానంగా నీ పై అభియోగం. ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా? రామలింగకవి, నీపై ఎంతో గౌరవభావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా కృంగదీశావు. ఇట్టి తప్పిదాన్ని చేసినవారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిన్ను ఏ విధంగా కఠినశిక్షకు గురిచేయాలి. నీవు నాకెందుకు ఈ విషమపరిస్థితికల్పించితివి. నీ తప్పు చాలా స్పష్టంగా కన్పించుచున్నది. నిన్ను ఏ విధంగా శిక్షించాలో నీవే చెప్పు.” అన్నాడు రాయలు అసహనంగా నొసలు నొక్కుకుంటూ.
సభలోని వారంతా హీనంగా రామలింగని వైపు చూసారు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే రాయలు ఈరోజు ఇంతటి వేదనకు గురికావడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోయారు.
" మహామంత్రీ నేనే అపరాధం చేయలేదు. నా చేత రాయించిన పత్రం ఒకసారి తమరే చదవండి నిజం తెలియగలదు. ఈ రామలింగని నిర్దోషిత్వం తమకు స్పష్టంగా తెలియగలదు” అన్నాడు రామలింగడు.
పత్రం చదివాక తిమ్మరుసు పెదవి విరవడం రాయలు మరింత నొచ్చుకున్నాడు. రామలింగ కవి ఏదో విధంగా నిర్దోషిగా నిరూపితుడవుతాడని కొండంత ఆశ పడ్డాడు. కానీ ఈతడు పెద్ద తప్పు చేసాడు. ఈ కవిలో ఇంత లక్షణాలున్నాయా ? అని అనుకున్నాడు.
"రామలింగా, ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్టు మాత్రమే ఉంది." తిమ్మరుసు గొంతు ఖంగుమంది.
“మహామంత్రీ తమరు తప్పులో కాలు వేసారు. తమవంటివారు ఇలా చదివితే ఎలా ? లింగిశెట్టి అమ్మునది నా ఒక్కడికే కదా! ఆ పత్రంలో నా ఒక్కని పేరుందా? లేదే వేరే వారి పేర్లున్నాయి. దయ చేసి చదవండి.”
“ఒక్కనిదే ఉంది. వేరెవ్వరి పేరు లేదే. ఎన్ని కళ్లతో చదవినా మారిపోదుకదా ! నీకు ఛాదస్తం మరీ ఎక్కువలా ఉంది.”
శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠగా రామలింగని వైపే చూసాడు.
"ఆ పత్రంలో అక్షరాల ఇరువురి పేర్లు
ఉన్నాయి. రామలింగకవితో బాటు దయ్యాలు, పిశాచాలు ఉన్నాయి. వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా అందుకు ఎలాంటి పూచీ తనకు లేదని కూడా రాసాడు ఈ పెద్దమనిషి. ఒక ఇల్లు ఒక్కరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు. మరి నాతో బాటుగా దయ్యాలు, పిశాచాలున్నాయి. అని అతనే లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు. అవి చెల్లించవా ? ఇదేం న్యాయం మహామంత్రీ. అందుకే ఈ పెద్దమనిషితో పదేపదే అన్నాను. ఏలినవారికి చెప్పినా ఒక్క రూక రాలదని, ఇప్పుడూ చెప్తున్నాను. లింగి శెట్టికి నేను నా వాటా చెల్లించితిని. ఇక ఏ భూత మాంత్రికుడినో, పిశాచ వైద్యుడినో పట్టుకుని ఆ ఇంట్లో అక్రమంగా తిష్టవేసిన దయ్యాలు పిశాచాల వద్ద మిగిలిన వాటా వసూలు చేసుకోమనండి. మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వేయగలరు"
సభికులు గొల్లుమని నవ్వుతుండగా సభలో రామలింగడు ఎలాంటి జంకుగొంకు లేకుండా మరీ చెప్పాడు.
రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ
తిమ్మరుసు వైపు చూసాడు. ఆయన కూడా తెరలు తెరలుగా నవ్వసాగాడు. సభ మొత్తం నవ్వులమయం అయ్యింది. లింగిశెట్టి ఆముదం తాగినట్టు జేవురించిన ముఖంతో మిగిలాడు.
సశేషం (17)
తెనాలి రామకృష్ణ కథలు (17)
నవ్వులతో ఎంతసేపటికి తేరుకోని సభనుద్దేశించి “మన్నించండి ఏలికా! నాకు చీడపీడల పై ఎలాంటి నమ్మకంలేదు. ఈ లింగిశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను. ఈతడు తమకు బాల్య స్నేహితుడు అనే ముసుగులో ఉంటూ ఈతడు మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు. ఆ ఇంటికి నేలమాళిగ సొరంగం ఉంది. అందులో పెద్ద ఎత్తున మారణా యుధాలున్నాయి. ఇవేవి ఒక వర్తకునికి అవసరమైనవి కావు. కనుక ఈతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే” అని లింగిశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు.
ఒక్కసారి సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెలరేగింది. రాయలు అర్ధంకాక తిమ్మరుసు వైపు చూసాడు.
లింగిశెట్టి అవమానంతో తలదించుకున్నా డు. రాయలు కన్నెర్రతో లింగిశెట్టి నిజం ఒప్పేసుకున్నాడు. తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు. ఆ సొరంగ మార్గంలోంచి రాకపోకలు సాగేవి. ఒకసారి సొరంగంలో గజపతుల వేగులవారికి
దయ్యాలు ఎదురైనవని అందులోంచి రావడానికి భయపడ్డారు. తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్లాక అన్నివిధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి. నేను చేస్తున్నది తప్పని తెలుసుకుని, ఇటీవల వారితో తెగతెంపులు చేసుకున్నాను. అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయనివాడికి అమ్మేసి బుద్ధిగా నా బతుకు బతకాలను కున్నాను. తీరా ఈ కవి చాలా తెలివైన వాడు కనుక, ఇలా నా గుట్టు తెలుసుకో గలిగాడు. వేరెవ్వరూ పసిగట్టలేనిది నా దేశద్రోహం. మన్నించండి చక్రవర్తీ !".
"ఏమయ్యా ! నీవు నాకు బాల్యమిత్రుడవు. నేను నీ యెడల చాలా ప్రేమగానే ఉంటున్నానే మరి నాపై నీకెందులకు ఈ ద్రోహచింత. దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను. కనుక నీవు శిక్షార్హుడవే ” రాయలు కోపంగా లింగిశెట్టి వైపు చూస్తూ ఉరిమాడు.
"ఏలినవారికి నాదో విన్నపం. ఈతడు కులపరంగా వైశ్యుడు. కుట్రలతో సాధించే శారీరక బలుడు కానేకాడు. ఏదో ధనాశకు మన శత్రువులకు తనింటి సొరంగ మార్గం ఇచ్చి ఉండవచ్చు. వారిచ్చు ధనం కంటే ఈతనికి జరిగిన నష్టమే ఎక్కువ. గజపతుల వేగులు ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగ మార్గంలో దయ్యాలు ఉన్నట్లు బొంకి వెళ్లిపోయారు. దయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో
వెచ్చించి నిర్మించిన భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు. దయ్యాలే నిజమైతే ఈసరికి నాకు కన్పించాలి. కానీ ఇంత వరకు నేను చూడనైనా చూడలేదు. ఒక విధంగా చేసిన తప్పుకు ఇతడు తగిన శిక్ష ఆర్ధికంగా అనుభవించాడు. ఏది ఏమైనా ఈతడు చేసినది తప్పే.... అందుకు శిక్ష ఏలినవారు దేశద్రోహులకు విధించే
మరణదండన, కనుగుడ్లు పెరికివేయించు ట వంటివి విధించవద్దని నా మనవి. దేశ బహిష్కారమే మరణదండనతో సమానం.”
రామలింగడు సభ మధ్యలో వందలాది జనాలు గుడ్లప్పగించి పరికిస్తుంటే వినమ్రుడై చెప్పాడు.
రాయలు గట్టిగా కళ్ళుమూసుకున్నాడు.
“నిజమే రామలింగడు చెప్పినట్లు దేశ బహి ష్కారంతో సరిపుచ్చాలి, లింగిశెట్టి తనకు బాల్యస్నేహితుడు. చేతులారా చిత్రహింస లు పెట్టే శిక్ష తను అమలు చేయలేడు. ఒక విధంగా రామలింగడు అడ్డుపడకుండా ఉంటే తను తప్పని పరిస్థితిలో శిక్ష విధించేవాడు అని మనస్సులో అనుకుని చివరికి లింగిశెట్టికి దేశ బహిష్కార శిక్ష విధించాడు.
ఆ తరువాత రాయలు సింహాసనం దిగి వచ్చి రామలింగ కవిని గాఢాలింగనం చేసుకున్నాడు.
" కవి చరిత్ర మరువదు మీ చతురత, స్వామి భక్తి పరాయణత, సదా నిలుచును మీ ఎడల మా కృతజ్ఞుత. ఈరోజు నా హృదయం తేలి పోవుచున్నది. ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకొనుచున్నాను. ఆ దయ్యాల భవంతిని వదిలేయండి. నేను వేరే భవంతిని ఏర్పాటు చేయగలను కాదనకండి." అన్నాడు రాయలు.
ఇతరత్రా కూడా పదేపదే మెచ్చుకుని ధనకనక వస్తువాహనాలతో సత్కరించాడు.
"ప్రభూ ఆ భవంతి ఎంతో గొప్పది. నాకు అన్ని విధాల నచ్చినది. అందులోకి వెళ్లగానే నాకు కవిగా కాకుండా నా మాతృ భూమికి నా చక్రవర్తికి నా సహచర ప్రజలకు సేవలందించాలని తెలియజేసింది. చక్కని అవకాశం లభించింది. ఆ భవంతిలో నేను నా భార్య పిల్లలతో జీవించగలను. అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆశిస్తూ జీవించగలను. నన్ను కాదనకండి. తమ మాటకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు” అన్నాడు.
తిమ్మరుసు రామలింగని వద్దకు వచ్చి..
" నాయనా నీవు గొప్ప విషయాన్ని బయటపెట్టావు. నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదాన్ని ఇస్తుంది. అట్టిదాన్ని నీవు కుండబద్దలు కొట్టినట్టు చేసావు. తక్షణం ఆ సొరంగ మార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం. నీవు ఈరోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఓ పూట గడపాల్సిందిగా నిన్న కోరుతున్నాను.” అన్నాడు ప్రేమగా..
రామలింగడు చేతులు కట్టుకుని తృప్తిగా తన సమ్మతిని తెలిపాడు.
*సశేషం*(18)
తెనాలి రామకృష్ణ కథలు (18)
శ్రీకృష్ణదేవరాయల సభలో గురు శబ్దం గురించి చర్చ వచ్చింది . ఎవరు గొప్ప శిష్యుడు గొప్ప, గురువు గొప్ప, భవిష్యత్తులో స్పష్టత వల్ల జీవమై తెలియపరచే వాడే గొప్ప, దత్తాత్ న్యాయం దక్కినప్పుడు జీవితకాలం అంతా కూడా అందించే వాడే చీకటి తరిమి వెలుగు లందిమ్చే వాడేగొప్ప ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు
కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ మౌనాన్ని గమనించి నీ అభిప్రాయం తెలుపగలరు అన్నారు.
వర్షం వస్తే పలకరించే పృథ్విలా
పంట చేను మొక్కుతున్న రైతన్నలా
పుత్రికోత్సాహంతో పొంగిపోయే తండ్రిలా
తృప్తి ఆత్మనందంతో బోధించే కవివర్యులు లా
సమ్మోహనాత్ర పారవస్యంతో ప్రభోదించే వ్యక్తిలా
ఆరోగ్యకరంగా హర్షనీయంగా ఆధ్యాత్మికంగా విద్యలా
కాలాన్ని అనుసరించి స్వేచ్చనిచ్చి బోధ చేసే గురువులా
సృజన శైలి ప్రతిభా పాటవాలను పంచే చోదక శక్తి లా
నిస్వార్థంతో ధర్మదీక్షతో విద్యార్థులకు బోధ చేసే ఉపాధ్యాయులులా
లోపల, బయట నిండి ఉన్న అనంత చైతన్యాన్ని తన 'లోపల' మాత్రమే అనుభవించాలనే కోరికే - గురువు నేర్పినవిద్య ఇన్ని సాధనలకు కారణం అయింది.
ఇప్పుడు నీవు ఉన్న స్థితిని స్వయంగా నీవు కోరిన ప్రకారము చేసుకున్నదే ధైవసంకల్పం నీవు గురువు నిమిత్తమాత్రమే . జరిగేదాన్ని చూస్తూ ఉండడం తప్ప మార్చడం వీలు కాదు. అదే నీలో నున్న విద్య దానిని పంచితే నలుగురిలో ఒకడవుతావు, కాలాన్ని, ప్రకృతిని తల్లితండ్రులను గురువులను గౌరవిస్తూ ఉంటే ఆ పరమాత్ముడు నీలోనే ఉంటాడు, నీమనసు నీవాక్కు సర్వం దైవమయం అయ్యే విధముగా నుంటుంది.
గురువు పాదాలు పట్టుకుని ఉండడం శిష్యుడికి ఇష్టం.
శిష్యుని పదాలు పట్టుకుని విద్య నేర్పడం గురువుకి ఇష్టం.
మన శరీరంపై మనం పట్టు కలిగి ఉండడం 'దమము'
మన మనస్సుపై అదుపు కలిగి ఉండడం 'శమము'
పై రెండింటిపై పట్టు కలిగి ఉండడమే "యోగము".
గురు సంకల్పమే జీవనం
ఆత్మ, దేవుడు అంటూ దానినీ ఒక విధంగా చూడకు., అది నీవే. నిన్ను నీవు నమ్ముకో శాంతి సౌభాగ్యం నీ అదృష్టం నీ ఋణం తీర్చుకొనే అవకాశం పొందటం నిన్ను కట్టుకున్న భార్య, పిల్లల చూపే అవకాశం
అంటూ ముగించాడు రామకృష్ణ ఉపన్యాసం.
***
తెనాలి రామకృష్ణ కథలు (20)
*నమస్కారాలు*అంటూ గుమ్మడి కాయ ను తలకు పెట్టుకొని వచ్చెనొకడు.
ఏమిటి యీ అవతారం ముందు తలపై నది తొలగించు అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. మహారాజా నా తల చూస్తే మీరు ఉరితీయిస్తారు ఏమిటి రామకృష్ణ నిన్ను ఎప్పుడో క్షమించాను నా తొందరపాటు గుర్తించాను.
రామకృష్ణ నమస్కారాలు ఎన్నిరకాలు, అవియేవి?
ఏలిన వారికి నమస్కారాలు అంటూ
*నమస్కారాలు నాలుగు రకాలు*
1. సాష్టాంగ నమస్కారం, 2. దండ ప్రణామం, 3. పంచాంగ నమస్కారం, 4. అంజలి నమస్కారం.
1. సాష్టాంగ నమస్కారం: మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. మస్తిష్కం, సంపుటం, ప్రహ్వాంగం అను మూడు రకాల నమస్కారం - ఈ సాష్టాంగ నమస్కారంలో కలిసి ఉంటుంది.
భూమిమీద సాగిలపడి లేచి తన రెండు చేతులను తల మీద ఉంచి అంజలి చేయుట మస్తిష్కం.
మస్తిష్కం చేసిన తరువాత రెండు చేతులను జోడించి హృదయాన్ని చేర్చుట సంపుటం.
సంపుటం చేసిన తరువాత తలను శరీరాన్ని కొంచెం వంచి నిలబడుట ప్రహ్వాంగం.
ఇలా మస్తిష్క సంపుటి ప్రహ్వాంగములతో కూడిన చేసే నమస్కారమే సంపూర్ణమైన నమస్కారమని పెద్దలు చెబుతారు.
2. దండప్రణామం : కర్రలా తన దేహాన్ని నిలువుగా భూమిపై వాల్చి పరుండి కాళ్లను
చేతులను చాపి నమస్కరించుట దండ ప్రణామం.
3. పంచాంగ నమస్కారం : రెండు పాదాల వేళ్లను, రెండు మోకాళ్లను, తలను మాత్రం
భూమిపై నుంచి రెండు చేతులను తల వద్ద చేర్చి నమస్కరించుట పంచాంగ నమస్కారం. ఇది స్త్రీలకు నిర్దేశింపబడింది.
4. అంజలి నమస్కారం : రెండు చేతులను కలిపి నమస్కరించుట అంజలి నమస్కారం.
కుడిచేతిలో గురువు యొక్క కుడిపాదము, ఎడమచేతిలో వారి ఎడమ పాదమును
స్పృశించి నమస్కరిస్తారు. చదువు చెప్పిన గురువులకు ఈ నమస్కారం చేయాలి.
ముగించాడు రామకృష్ణ
**-**
తెనాలి రామకృష్ణ కథలు (21)
రామకృష్ణ * పార్వతీ పరమేశ్వరుల*
*దశావతారాలు !!*గురించి వివరించు
కానీ పార్వతీపరమేశ్వరుల దశావతారాల గురించి చాలా మంది వినివుండరు .
*అవతారం అనగా
దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు.
దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.
ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశుపక్షిమనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం.
ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం.
ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం.
ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం.
ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.
అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు.
దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.
🌹ప్రధమావతారము :🌹
🌿మహాకాళుడు, ఈయన అర్ధాంగి "మహాకాళి"
వీరిరువురూ భక్తులకు ముక్తినిచ్చే దైవాలు.
🌹ద్వితీయావతారము :🌹
🌸తారకావతారము, "తారకాదేవి" ఈయన అర్ధాంగి .
సకల శుభాలను భక్తులకు ప్రసాదిస్తారు.
🌹తృతీయావతారము :🌹
🌿బాలభువనేశ్వరావతారము -
సహచరి "బాలభువనేశ్వరీ దేవి"
సత్పురుషులకు సుఖాలను ప్రసాదిస్తారు.
🌹చతుర్ధావతారము :🌹
🌸షోడశ విశ్వేశ్వరుడు -
"షోడశ విద్యేశ్వరి" ఈయన భార్య.
భక్తులకు సర్వసుఖాలు ఇస్తారు.
🌹పంచమ అవతారము :🌹
🌿భైరవ అవతారము -
భార్య "భైరవి"
ఉపాసనాపరులకు కోరికలన్ని ఇచ్చే దైవము భైరవుడు.
🌹ఆరవ అవతారము :🌹
🌸భిన్నమస్త -- "భిన్నమస్తకి" ఈయన పత్నీ.
🌹ఏడవ అవతారము :🌹
🌿ధూమవంతుడు
"ధూమవతి" ఈయన శ్రీమతి.
🌹ఎనిమిదవ అవతారము :🌹
🌸బగళాముఖుడు --
"బగళాముఖి" ఈయన భార్య.
ఈమెకు మరో పేరు బహానంద.
🌹తొమ్మిదవ అవతారము :🌹
🌿మాతంగుడు --
"మాతంగి" ఈయన భార్య.
🌹దశావతారము :🌹
🌸కమలుడు --
"కమల" ఇతని అర్ధాంగి..
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
తెనాలి రామకృష్ణ కధలు (22)
రామకృష్ణ వేసవికాలంలో కోరేది ఏది? దానిగురించి వివరిస్తావా
మహారాజా మీ ఉదేశ్యం అర్ధం అయ్యింది ..మామిడి పండు మాయాసారం*గురించి వివరించమంటున్నారు కదా
రామకృష్ణ మీ మేధస్సు ను గ్రహించటం చాలా కష్టం ఎప్పుడు ఎలావుంటావో అర్ధం కావు, కాసేపు నవ్విస్తావు, సమస్యలను పరిష్కరిస్తావు అంటూ మెచ్చుకున్నాడు శ్రీ కృష్ణ దేవరాయలు
అప్పాజీ గారు మామిడిపండు తెప్పిస్తారా అన్నాడు రామకృష్ణ ,
రెండు చేతులలో మామిడి పండును తేరి పారా చూస్తూ పట్టుకుంటామే ,దీనినే *"వ్యామోహం"* అని అంటారని అన్నాడు.
మగ్గిన పండును చూసి పరవశించి , పండంతా గుడ్లప్పగించి తడిమి చూచుకుంటామే, దీనినే *"వాత్సల్యం"* అని విశదీకరించాడు.
చేతికందిన పండును చూచి భుజాలు గజాలు అవ్వగా , చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతుంటామో, దీనినే *"ఆప్యాయత"* అని చాటి చెప్పాడు.
పండంతా ఆబగా తినిన తరువాయి కూడా , టెంకను చీకుతూ మైమరుస్తుంటామే అదిగో దానినే *"లోభం"* అని అన్నాడు.
మన పండంతా తిని ఆస్వాదించాక, టెంక విసిరేసి , చేతులు నాక్కుంటూ, పక్క వాడు తింటున్న మామిడిపండు ఇంకా అవ్వటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే దానినే *"అసూయ"* అని వివరించాడు .
మామిడిపండు చేతికి చిక్కాక , ఆబగా చివర్లలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో , గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచీ జారి పడిపోయి నప్పుడు , మనం వేసే చిందులతో కూడిన తాండవమునే, *"క్రోధం"* అని వివరంగా తెలిపాడు.
మామిడి పండు తిని తొక్కను ఆవులకు, మేకలకు విసిరి, పండంతా పెట్టినట్టు దీర్ఘ శ్వాస వదలి బిగుసుకు పోతామే, ఇదిగో దీనినే *"అహంకారం"* అని చాటాడు.
మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలికతో అందుకుంటూ, టెంకను మురిపెంగా చూచుకుని , దానిని శుభ్రంగా కడిగి, మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే, దానినే *"మమకారం"* అని తెలిపాడు.
అతిగా మామిడి పళ్ళు తిని , జడివానలా వచ్చే వమనములుకై చెరువు గట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీనినే ముఖ్యంగా *"ఆత్రం"* అని విశదీకరించాడు.
*ఒక పండు ఆరగింపు ముద్దు,* *రెండు కద్దు* *మూడు అసలే వద్దు,* *ఉండాలి దేనికయినా సరిహద్దు.* దీనినే *స్వీయ నియంత్రణ* అని విపులీకరించాడు.
సభలో నున్న సభ్యులందరు చప్పట్లు చరిచారు
*****
రామకృష్ణ కధలు (23 )
రామకృష్ణ అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారో తెలియపరుచు అన్నాడు శ్రీ కృష్ణ దేవరాయలు
‘అన్నాద్భవంతి భూతాని’ అంటుంది భగవద్గీత. సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం. ఇదే విషయాన్ని ‘ఆత్మనః ఆకాశః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఔషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః’ అంటుంది తైత్తరీయోపనిషత్తు. అన్నిటికీ మూలమైన ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి పృథివీ, నేల నుంచి ఔషధాలు, వాటినుంచి అన్నం, దాన్నుంచి ప్రాణులు- ఇదీ క్రమం. ఈ గొలుసును (శృంఖల) పట్టుకుని వెనక్కి వెళ్తే దానికి మూలమైన ఆత్మ, ఆత్మకు మూలమైన పరమాత్మ కనిపిస్తాయి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. శరీరంలోని ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన రూపాల్లో ఉండే పంచప్రాణాలకు పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరమాత్మ తత్వమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ధర్మసాధనకు అత్యవసరమైంది శరీరం. దేహమే కాదు ఈ సృష్టి అంతా ధర్మసాధన నిమిత్తమే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశ సమన్వితమైన శరీరంలో అన్నమయకోశానికి మొదటి స్థానం ఇవ్వటం ఆహార ప్రాధాన్యతనే తెలియజేస్తుంది. అన్నపూర్ణ ఆత్మసఖుణ్ణి ఆదిభిక్షువుగాచేసి అన్నాన్ని అందించడం వెనుక ఆంతర్యమూ ఇదే. మనుగడకు మూలాధారమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని విడదీసి చూడలేం.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
అంటూ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుంది భగవద్గీత. శక్తిని ప్రసాదించే ఈ ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తూ, ప్రశాంత వాతావరణంలో, శుచిగా, మౌనంగా, ఆకులో లేదా బంగారు, వెండి లాంటి ఉత్తమ లోహ పాత్రల్లో తీసుకున్నప్పుడు అది ప్రసాదమౌతుంది. భోజనానికి ముందు శాస్త్రం తెలిసినవారు మంత్రయుక్తంగా ఆచమనం చేసి, ఆ పరిజ్ఞానం లేనివారు భగవంతుని స్మరిస్తూ కొన్ని నీళ్లు తాగి, అప్పుడు తినడం మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
అన్నమంటే ఔషధమే. మనిషి రుతు చర్యను పాటించాలి. అంటే ఆయా రుతువుల్లో, ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని, శరీరతత్వాల అనుకూలతను బట్టి తినాలి. ఆహార, జల, విహారాదుల్ని పాటించని ప్రాణిలో వాతపిత్తకఫాలనే త్రిదోషాలు విజృంభించి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లాంటి అవయవాలు దెబ్బతిని ప్రాణం దేహాన్ని వదిలి వెళ్లిపోతుంది.
తెనాలి రామకృష్ణ కథలు.. (24)
రామకృష్ణ నగరంలో వివాహ_హంతకులు గా మారటాని జనుల భావాలు అందరికీ తెలియపరచగలవు
సోమరితనం, అనుమానం, నమ్మకం లేకపోవడం, పరస్పర గౌరవం లేకపోవడం,క్షమించకపోవడం, ద్వేషం, ద్వేషం మరియు కోపం వివాహాన్ని చంపుతాయి.
అనవసరమైన వాదనలు పెరగడం, జీవిత భాగస్వామి నుండి రహస్యాలు దాచడం,
అవిశ్వాసం (ఆర్థిక, భావోద్వేగ, మానసిక, భౌతిక, మొదలైనవి) వివాహాన్ని చంపుతుంది.
పేలవమైన సంభాషణ,అబద్ధాలు,
ప్రతి అంశంలోనూ మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా లేకపోవడం .
మీ జీవిత భాగస్వామి కంటే తల్లిదండ్రులు/కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం వివాహాన్ని చంపుతుంది.
ఆనందించలేని సాన్నిహిత్యం లేకపోవడం, వేధించడం, అతిగా మాట్లాడటం మరియు అజాగ్రత్తగా మాట్లాడటం
మీ జీవిత భాగస్వామితో తక్కువ సమయం గడపడం వివాహాన్ని చంపుతుంది
చాలా స్వతంత్రంగా ఉండటం,
పార్టీలు, డబ్బు, హఠాత్తుగా కొనడం మరియు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ప్రేమ పట్ల ఆకర్షణ లేకపోవడం,
మీ జీవిత భాగస్వామి యొక్క లోపాలను మీ తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు బహిర్గతం చేయడం
ఆధ్యాత్మిక పద్ధతులను నిర్లక్ష్యం చేయడం మరియు కలిసి ప్రార్థన చేయకపోవడం వివాహాన్ని మాత్రమే కాకుండా మీ జీవితాన్ని కూడా చంపుతుంది.
దిద్దుబాటు మరియు మందలింపును తిరస్కరించడం,
ఎల్లప్పుడూ విచారకరమైన ముఖం ధరించడం మరియు మూడీగా ఉండటం, తీవ్రమైన స్త్రీవాద వాదనవ్వడం, పురుషాధిక్యత చూపడం
అదుపులేని కోపం మరియు కోపం వివాహాన్ని చంపుతాయి.
దేవుడు స్థాపించిన వివాహంలో మీ పాత్ర మరియు బాధ్యతను అర్థం చేసుకోకపోవడం,
మీ జీవిత భాగస్వామి యొక్క ఆధ్యాత్మిక, భావోద్వేగ మరియు శారీరక అవసరాలను, సంపదలను విస్మరించడం, నపున్శకత్వం, భయము
జీవిత భాగస్వామి భద్రతకు ముప్పు వాటిల్లడం వివాహంపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
దేవుని వాక్యం గురించి జ్ఞానం లేకపోవడం మరియు దానికి విధేయత లేకపోవడం వివాహాన్ని చంపుతుంది.
ఇలా ఇలా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ఉడటం వల్ల వివాహం చేసుకోరు.
రామకృష్ణ కథలు... (25)
సభలో చర్చ జరుగు తున్నది
ఒకరు ప్రశ్నలు వేస్తుంటే మరొకరు సమాదానాలి చెప్పాలి
రామకృష్ణ కు ప్రపంచంలో సుఖం ఎరుగనివారు ఎవరైనా ఉన్నారా?*ఉంటే వారెవరు?
రామకృష్ణ పలుకుతూ అంటే ఉన్నారంటున్నాయి శాస్త్రాలు
వారిని "దుఖఃభాగులు"అంటారు వారి వివరాల్లో కెళితే వారు *ఆరు రకాలు*
*1. ఈర్ష్యాళువు*
వీళ్లు ఎవరి వృద్ధిని లేక ఎదుగుదలను చూడలేరు
అలాంటివారిని ఈర్ష్యాళువు అంటారు.
*2. జుగుప్సావంతుడు*
వీళ్లు దేన్ని చూచినా అసహ్యించుకుంటారు
వారివానికి సుఖం ఎక్కడుంటుంది.
*3. నిస్సంతోషి*
వీడొక విచిత్రమైన వాడు వీడికి సంతోషమనేది ఉండదు
దాంతో వీనికి సుఖమెక్కడ
*4. క్రోధనుడు*
వీడు ప్రతివిషయానికి చిటపటలాడుతూ ఎప్పుడూ
కోపంతో ఉండే కోపిష్ఠి వీడికి సంతోషమెక్కడ
*5. నిత్యశంకితుడు*
అన్నిచోట్లా, అందరినీ శంకించేవాడు వీడు
అంటే ప్రతిదీ అనుమానమే ఇంకేముంది సుఖం.
*6. పరభాగ్యోపజీవి*
ఎప్పుడూ ఇతరుల సొమ్ముపై ఆధారపడి బ్రతికేవాడు
వీడికి ఎప్పుడు ఎవరోఒకరు ఇస్తూవుంటేనే లేదంటే
దుఖఃమే ఇది సాధ్యమా కాదుకదా అందుకే వీనికీ
సుఖం సున్నా.
ఈ ఆరుగురురూ ఎప్పుడూ సుఖాన్నీ,
ఆనందాన్ని, లేకుండా బాధతో అసంతృప్తితో
జీవిస్తుంటారు కాబట్టి వీరిని *దుఖఃభాగులు* అంటున్నాయి.
అప్పుడే శ్రీ కృష్ణ దేవరాయలు చక్కగా వివరించావు అంటూ బహుమతి అందించారు.
తెనాలి రామకృష్ణ కథలు (26)
మహా రాజా పురోహితుని అవమానించకండి, మంచి చెడులు గమనించి నిజమైన ద్రోహి అయితే శిక్షించండి
పురోహితుడు అంటే ఎవరనుకున్నారు అంటూ తెనాలి రామకృష్ణ తెలియపరిచాడు
***
శ్లో:జన్మనా బ్రాహ్మణోజ్ఞ్యేయః
సంస్కారద్వ్దిజ ఉచ్యతే౹
విద్యయా యాతి విప్రత్వం
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే౹౹
పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు, విద్యాభ్యాసంలో విప్రుడు, ఈ మూడింటితో అతడు శ్రోత్రియుడు అగును...
*ముందుగా హితము పలికెడివాడు
*ధర్మార్థ కామమోక్షములకు సోపానము
పూజనీయుడు
*సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు
*నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
*ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
:*హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
*సాదారణమైన పేరు వశిష్ఠుడు
*మానసిక వ్యాధిని ఛేదించె శాస్త్రజ్నుడు
*ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె ధర్మదాత, ధైర్యావంతుడు వాక్ చతుర్యముతో రాజ్యాలను నడిపించినవాడు,
*సందేహ నివృత్తికి ఒక నిఘంటువు,
*తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక,
*భగవంతునికి భక్తునికి మద్య పూజ్యనీయుడు
*భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక,
*శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి,
*నిత్య కాల గణన చేయు గణిత వేత్త
*గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
పురోహితుడు :పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి
(జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించుమని ప్రోత్సహించువాడు)
:ధర్మ శాస్త్ర ప్రియుడు..
పురోహితము
పు ,అనగా పురజనులందరికి
రో ,అనగా రోజురోజుకి
హి ,అనగా హితముచెప్పుచు
త ,అనగా తరింపజేసి
ము ,అనగా ముదముగూర్చునదనుడు
అప్పుడే ఒక సైనికుడు ఇద్దరిని ప్రవేశపెట్టాడు
అసలు నేరస్తులు వీరు, దేవాలయసొమ్మును దొంగలించి పురోహితునిపై అపవాదు మోపారు మీరే విచారించాలి అన్నారు.
నేరం మీరుచేశారా అని అడిగారు మహారాజుగారు
చేసామని ఒప్పుకున్నారు
ఓ పురోహిత నీవు నిరావురాధివి. రామకృష్ణ వీరికి ఏశిక్ష వెయ్యాలో తమరే చెప్పండి
మీలో క్షమించే గుణముంది కనుక వారు తస్కరించిన సొమ్ము కట్టించుకొని మొదటి తప్పుగా వదిలేయండి అన్నాడు
అందరూ మెచ్చుకున్నారు రామకృష్ణ మాటలు