కాళిదాసు***--
ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి.కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషం తో వుండసాగాడు.
రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు వుంది.కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని,కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్త్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.
వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు "అయ మాందోలికా దండ స్తవ బాధతి కిం భుజే"కావాలనే తప్పుగా చదివాడు 'బాధతే' బదులుగా 'బాధతి' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు.రోజూఅదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.
ఐదవరోజు ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు వుండబట్టలేక " "నాయమాం దోలికా దండ స్తవ 'బాధ తి' బాధతి"
ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ 'బాధతి' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము విని నంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించ మని వేడి ఆపల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.
*మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది*
"కర్మను" అనుభవించాలి ..... నిందిస్తే ప్రయోజనం లేదు .
రమణ మహాశయలు వారు ప్రతిదినము స్నానం కొరకు నదికి పోతుండేవారు.
ఆయన వెంట కృష్ణా అను భక్తుడు పోయెడివాడు.
రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచింది కదా !" అని అన్నారు.
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
తులసి, ధర్భలు, బిల్వదళములు వున్న స్ధలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
దేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలు ధర్భ కొసలతోను, మానవులను తలచి యిచ్చే తర్పణాలలో ధర్భల మధ్యభాగం నుండి, పితృదేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలలో ధర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా వుంది.
వైదికకార్యాలలో "పవిత్రం" అనే పేరుతో ధర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు .ఈ వ్రేలిలో కఫనాడి వుండడం వలన యీ ఉంగర ధారణవలన కఫం శుభ్రం చేయబడుతోంది.
ధర్భగడ్డిలో పులుపు, క్షార గుణాలు వుండడం వలన రాగి విగ్రహాలను , బూడిద ధర్భలు ఉపయోగించి శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెప్తోంది. ఇందు వలన శిల్పాలలోని ఆవాహన మంత్ర శక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా వుంటాయని శాస్త్రజ్ఞులు చెపుతారు.
*****
*నేటి జీవిత సత్యాలు*
ఎవరికి ఎవరో సొంతము, ఎంతవరకీ బంధము, ఎదలో ఆలోచనలు ఎటు పోతాయో, ఏ విధంగా ఇటు మారుతాయో, ఎవరికి ఎరుక, ఏ విధంగా తెలపా, పాదయాత్ర వలన పదవి రావచ్చును, కాశీ యాత్ర వలన గతులు మారవచ్చును, సూత్రాల వలన యాత్రలు అంటే భవిష్యత్తు దగ్గరగా ఉండవచ్చును, భూమి మహావేగముగా తిరుగుతుండగా, నెమ్మదిగా కదులుతున్నదా, ఎలా చెప్పగలరు, మొక్కలు పెరుగుతూనే ఉంటాయి, కాలం కదులుతూనే ఉంటుంది, శ్రీ మాతా కన్నులు సమస్తము వీక్షించును, పర్యవేక్షించును, రక్షించును, కన్నులతో సమస్త సృష్టి గావించి, పోషించగలుగుతుంది.
ప్రతి ఒక్కరికి శత్రువులు, మిత్రులు, వెంటపడే ఉంటారు కాలంతో పాటు, కదలిక తో వారు వెన్నంటే ఉంటారు, శ్రమ, శక్తి, భక్తి, యుక్తి, నేర్పు, మార్పు, కూర్పు, బట్టి జీవితంలోకి వచ్చి పోతూ ఉంటారు. ఎవరు ఎంతవరకు ఉంటారో ఎవరు చెప్పలేరు, సూర్యోదయం వెంటనే మనిషి ఆలోచనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో ఎవరూ చెప్పలేరు.
భగవద్గీతలో 16 వ అధ్యాయంలో భగవంతుడే ఈ విధంగా తెలియపరిచాడు ఇతర శత్రువులు కూడా వధించబడుదురు. నేనే భోక్తను పూర్తి శక్తివంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని.
ప్రాణం వల్ల స్వభావాలు వ్యవహారాలు తారుమారు కావు. అన్ని యధావిధి గానే ఉంటాయి మరి మార్పు వచ్చేది అవగాహన మాత్రమే ఆలోచన మాత్రమే, ఆదర్శం మాత్రమే, ఆకర్షణ మాత్రమే,ఆరోగ్యం మాత్రమే, అనుభవం మాత్రమే, ఆత్మీయులలో వచ్చే కలహాల పర్యవసానం మాత్రమే, జీవితం నల్లేరు తీగల కదులతూ, భయభ్రాంతుల మధ్య, సుఖశాంతుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెలు మధ్య ఆదర్శాలు తక్కువగా ఉండి మనిషి మనిషి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండి, కాలు ఏ దిక్కున నడిపిస్తుందో ఎవరు ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చెప్పలేరు, అనేది తెలియకుండా మానవత్వాన్ని నిలబెట్టడానికి కారణాలు ఏమిటో, తెలియకుండా జీవితం సాగిపోవటమే, శక్తిలో అందరూ ఉన్నారు.
కాబట్టి అందరిలోనూ శక్తి ఉన్నది నేను అనే పరమాత్మ అందరిలో ఉన్నారు కాబట్టి అందరిలోనూ జీవాత్మ జీవమై ఉన్నది జగతి రూపంగా ఉన్నది దేవుడైన గ్రహించు ఈ ప్రపంచాన్ని ఎంత మేలు చేయగలవు చెయ్యి, అదంతా భగత్సేవేనని భావించు.
పక్షులకు ఆకాశమే బలము, చాపలకు జలమేయ బలము, అడుగు వర్గం వారికి రాజే బలము, పసిపాపలకు ఏడుపే బలము, బ్రాహ్మణులకు సంధ్యావందనము బలము మరియు ఐశ్వర్యము.
మనిషి తన మనుగడని మర్చిపోతున్నాడు అతి తెలివి గర్వము పొగరు నాకేంటి అనే అహంకారంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ మృగాలని తలపిస్తున్నాడు.
అందుకే నేమో రోజురోజుకీ పతనం అయిపోతుంది సమాజంలో మానవ వ్యవస్థ.
ఎవడి ఇల్లు వాడికి దిద్దుకోవడం చేతకాదు పక్కింట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి కావాలి,
ఈర్ష ద్వేషాలతో నిండిపోయి జీవితాన్ని అతలంకుతలం చేసుకుంటూ, పక్కవాడిని కూడా ప్రశాంతంగా బతకకుండా చేస్తున్నారు.
పశువుల కూడా ఒక నీతి ఉంటుంది, ఒకదానికి కష్టం వస్తే పోలో మంట్ అవి వచ్చి జేరతాయి,
ఈ మనుషులేంటి,ఇంతలా దిగజారిపోతున్నారు స్వార్థంతో కూలిపోతున్నారు. మనం ఎలా ఆలోచిస్తే మనకు అలాగే జరుగుతుంది.
ఈరోజు సమాజంలో రేపు మీ ఇంట్లో ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు ఒకసారి ఊహించి చూడు.
ప్రకృతి ప్రళయాలు ఏ క్షణంలో ఎలా ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అయినా ఆశ దురాశ నేనింతే అనుకున్నప్పుడు మరొకరిని వేలెత్తి చూయించకు.
మళ్లీ చెప్తున్నాను నువ్వు ఏదైతే ఇస్తావు అదే తిరిగి నీకు వస్తుంది. ఇంతై అంతయి అనంతమై.
యవ్వనంలో మొటిమలు సహజం, ముసలి తనలో ముడతలు సహజం, యవ్వనంలో " స్త్రీ " చేయి పట్టుకోవాలని ఆశపడతాం, ముసలితలను ఎవరి చేయి పట్టుకుంటారో అని ఎదురు చూస్తాం, యవ్వనంలో ఒంటరిగా వదిలేస్తే బాగుంటుందనుకుంటాం, వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారే అని బాధపడతాం, యవ్వనంలో సలహాలు ఇస్తే చికాకు, వృద్ధాప్యంలో సలహాలు పాటించలేని పరిస్థితిగా వాక్కు, యవ్వనంలో అందాన్ని ఆస్వాదిస్తాము, వృద్ధాప్యంలో అందాన్ని దైవంలో చూసుకుంటూ బ్రతకాలని ప్రయత్నిస్తాము. యవ్వనంలో ప్రతిక్షణం పండుగగా భావిస్తాము, వృద్ధాప్యంలో తీపి జ్ఞాపకాలు నెమరు వేస్తూ జీవితాన్ని సాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. జీవితమనేది ఆటుపోట్ల సంగ్రామం, ధైర్యంగా శక్తిగా యుక్తిగా జీవిత లక్ష్యంగా జీవనాన్ని గడిపిన వాడికి జీవితంలో కష్టం అనేది తెలియక సుఖంగా జీవించగలుగు తాడనేది సర్వ ప్రకృతి అనుకూలిస్తుందని, నిజమైన జీవితా అనుభవం తెలియపరుస్తుంది.
యవ్వనంలోనైనా ముసలితనంలోనైనా ఉన్న సత్యాన్ని గ్రహించే జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుందనేది అందరి యొక్క నమ్మకం అదే నిజం అదే నిజం అదే నిజం.
ఇంకా వుంది.
******
2వ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు.ఆమెకూడాఅతని సమస్యను తీర్చి పంపేది.
*మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు. ఆమెను అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి*
అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద, ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.
నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను.నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్. మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అని అన్నాడు. 4వ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది.
ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా
*మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను.మీరేమీ బాధపడకండి"*
నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????
*రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు ఉంది. కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని, కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.*
*వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు*
*"అయ మాందోలికా దండ స్తవ బాధతి కిం భుజే"*
*కావాలనే తప్పుగా చదివాడు ''బాధతే'' బదులుగా ''బాధతి'' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు. రోజూ అదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.*
*ఐదవరోజు ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు ఉండబట్టలేక "*
*"నాయమాం దోలికా దండస్తవ ''బాధ తి'' బాధతి"*
*ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ ''బాధతి'' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము వినినంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించమని వేడి ఆ పల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.*
*సంస్కృతంలో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.*
*అందుకే పెద్దవాళ్ళు ''లలితా సహస్ర నామము,విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునేటప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామం చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదుఅని. అలా చదవడం వల్ల పొందాల్సిన ప్రయోజనం పొందలేకపోతాం!*
*🌹🌹🌹*
అది కుాడా ముక్కలైపోతే అన్నాడు బుద్దుడు.!
ఆ ముక్కలన్నింటిని మట్టితో పిసికి బొమ్మలు చేస్తాను.ఆ బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బు తో మరో కొత్త దుప్పటి కొనుక్కుంటాను" అన్నాడు నవ్వుతూ ఆ యువకుడు.
ఈ మాటలకు బుద్దుడు సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదేమరి అని తన శిష్యులకు చెప్పాడు..!!
మహాత్మాగాంధీ కుాడా సద్వినియోగం చేసుకోవడం సబర్మతి ఆశ్రమంలో వుండే తన సహచరులకు ఎప్పుడుా చెపుతుండేవారట.
ఒకనాడు చిటికెన వేలంత పెన్సిల్ కనపడలేదు..పుస్తకాలకింద అలసిపోయెాదాక వెదుకుతూ వున్నారంట..అప్పుడు ఒక శిష్యురాలు వచ్చి " బాపు ఇదిగో కొత్త పెన్సిల్ తీసుకోండి..అంది…"నేను కొత్త పెన్సిల్ కావాలని అడగలేదే?!
నా పెన్సిల్ కోసం వెదుకుతున్నాను..అన్నారట మహాత్ముడు .
బాపు చిన్న కాగితం కుాడా వ్యర్దం చేసే వారు కాదట.తనకు వచ్చిన ఉత్తరాల వెనకాల వున్న ఖాళీ ప్రదేశంలో ఏదో ఒకటి రాసే వారట.
బాపు కాగితాలు చాలా వున్నాయి వాడుకోండి అంటే " వద్దు..పేపర్ కోసం వాడే వెదురు చెట్లు బౌవిషిత్ తరాలకు అయిపోవచ్చు..అందుకని కాగితాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి.
అనవసరమనిపిస్తే ఉప్పు కుాడా ఎక్కువగా వడ్ధీంచుకోవద్దు…అని ఆశ్రమం గోడ మీద రాసి వుంచే వారంట.
వస్తువుల్ని సద్వినియోగం చేయడం చాలా మంచి అలవాటు …ఎందుకంటే భౌవిషిత్ తరాలకి అన్ని అందక పోవచ్చు తరిగిపోవచ్చు…ఆ లక్ష్యం మనసులో వుంటే ఆహారం నీరు వ్యర్థం చేయము.
ప్రతి వస్తువు అయిపోయాక ఏదో ఒక పనికి ఉపయెాగపడుతుంది…కొనడం మాసిపోయిందనీ పాత ది అయిందనీ పారేయడం వలన వాతావరణం ప్రకృతి కాలుష్యం అవుతుంది …బుద్దుడి కధ లో లాగా అది చివరికి మట్టిలో కలిసే వరకు ఉపయెాగించడం వలన ఎంతో ఉపయెాగముంటుంది.
మహాదేవుడు శివుడు కుాడా ఒక సంధర్భంలో అడవుల్ని కొట్టి వేసి జంతువుల్ని చంపివేసేవారికి తాను కఠిన శిక్ష వేస్తాన నీ చెప్పారు. ఈ జగత్తును పాలించే శివుడు కుాడా జనులకు ఐశ్వర్యము ప్రసాదించే వారైనప్పటికి….పట్టుపీతాంబరాలు ధరించక….
పులి లేదా ఏనుగు మరణించిన తరువాత లభింే వాటి చర్మం ధరిస్తాన నీ చెప్పారు…బ్రతికిన దాన్ని చంపి దాని చర్మం నేను ధరించను…అని వారే స్వయంగా రుషులకు జ్ఞాన త త్సంగంలో చెప్పెవారు…
విచ్చలవిడిగా వస్తువుల్ని నీటిని ఆహారాన్ని ప్రకృతి ని వ్యర్దం చేయడం తనకు ఆగ్రహం తెప్పిస్తుందనీ చెప్పెవారు..!!
మన వంతు బాధ్యత గా ప్రకృతి ని కాపాడుకోవాలి…మితంగా జీవిస్తుా పరిమితంగా వస్తువుల్ని వినియెగించుకోవాలి.ఎందుకంటే… రాబోయే తరాల కోసం…
అలాగే కాలాన్ని కుాడా సద్వినియోగం చేసుకోవాలి…కాలాన్ని సద్వినియోగం చేయకుండా సోమరితనం నిద్ర తో వ్యర్దపు మాటలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారికి కాలసర్పదోషం తగులుతుందనీ జ్యోతిషులు అంటారు..అదే కాలసర్ప దోషమంటే…!
*మాతృప్రేమ*
*మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు..!*
*శివాజీ రాయగఢ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది.*
*ప్రొద్దున ఆఱింటికి తెఱిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిదిగంటలకు మూయబడుతాయి.*
*ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోనినుండి బైటికి వెలుపల నుండీ లోనికి రాకూడదు.*
*ఇది ఛత్రపతి శివాజీ ఆజ్ఞ!*
*రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు.*
*ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెఱవబడదు.*
*’హీరాకానీ’ అనే గ్రామవాసి రోజూ కోటలో ఉన్న అధికారులకు, సైనికులకు పాలుపోయటానికి వచ్చేది.*
*అందఱికీ తనకు చేతనైన సహాయం చేసేది.*
*ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకానీ. ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది. పురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది. ఇంటికి వెళదామని సమయంచూస్తే తొమ్మిది దాటిపోయింది.*
*పరుగులుతీసి కోటగుమ్మం చేరింది హీరాకానీ.*
*కావలి వాళ్ళు హీరాకానీ చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు.*
*“అయ్యో! ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలివేస్తుంది. వాడికి పాలివ్వాలి” అని ప్రాధేయపడింది.*
*హీరాకానీ మీద జాలి పడిన కావలి వాళ్ళు “తల్లీ రాజాజ్ఞ మేము మీఱలేము. ఈ ఒక్క పూటకి ఈ సైనికుని ఇంట్లోనే పడుకో. ఉదయం అవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము” అని ఊఱడించినారు.*
*మఱునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని వెదకసాగారు. ఎక్కడైనా ఆదమఱచి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు.*
*అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగు కుండ కనిపించింది.*
*పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోటమీద రాయికి వ్రేలాడుతూ కనిపించింది.*
*ఆశ్చర్యపోయిన కావలివాళ్ళు శివాజీకి ఈ విషయం విన్నవించారు.*
*ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా? అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు శివాజీ.*
*ఇంతలో ‘హీరాకానీ’ రానేవచ్చింది. వణుకుతూ శివాజీ ముందు నిలబడి “అయ్యా! రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డడు గుర్తుకు వచ్చాడు. ఇక ఏ దారీ తోచలేదు. కోటగోడలెలా దాటానో నాకే తెలియదు. కొండలూ గుట్టలూ తుప్పలూ ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు. నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు. నా తప్పు క్షమించండి ప్రభూ!” అని ప్రార్థించింది హీరాకానీ.*
*శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి. ‘హీరాకానీ’కి అందఱూ చూస్తుండగా సాష్టాంగ వందనం చేశాడు! “అమ్మా! మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తీ నిలువలేదు. ఇక ఈ కోటగోడలెంత? ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను” అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన శివాజీ.*
ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది.
ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.
ఆ మాటా విన్న ఇంద్రాణి పరుగుం పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి, "మీరేం చేస్తారో నాకు తెలియదు. నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చని*పో*తాను" అని కన్నీరుపెట్టుకుంది..!
దానికి ఇంద్రుడు... “దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మా? కదా.! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను. నువ్వేం దిగులు పడకు… అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.
ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ.! "నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు.! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం "పద.." అంటూ బయలుదేరారు.
వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.
"నిజమే ప్రా*ణాలు కాపాడేవాణ్ణి నేనే…! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది.! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం.! మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి... " అన్నారు.
అందరూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.
ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రా*ణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను.. మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! అంటూ అందరూ బయలుదేరారు.
ఇంద్రుడు, బ్రహ్మ విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.
"అయ్యో.. అదేమి పెద్ద పనికాదు. మాములుగా చా*వుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను, వారు ఎలా చని*పోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చని*పోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..!" అని అన్నాడు.
యముడు, అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో. చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆకుపై చిలుక మర ణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!